వీక్షకులు
- 1,130,871 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
- శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
- శ్రీక౦ఠ స్పూర్తికథలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి. 3 వ భాగం.25.3.26.
- శ్రీరామ కర్ణామృతం.9 వ భాగం.25.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.153 వ భాగం.25.3.26.
- శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,868)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
దశాశ ల దసరా పై నీళ్ళు చల్లిన వేళ
దశాశ ల దసరా పై నీళ్ళు చల్లిన వేళ
మా బామ్మర్ది బ్రాహ్మి దిగాలుగా మొగం వేలాడేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు .’’ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్ –పొద్దున్న చంద్రబాబిచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే మొహం తో వచ్చినవాడివి ,ఇప్పుడు నిరాహార దీక్షలతో సెల్ఫ్ గోల్ చేసు కొంటున్న ‘’ఫానాయన ‘’లాగా మొహం చాటేసుకొని వచ్చినట్లు వచ్చావ్ “’అన్నాన్నేను .’’అవును బావా !దసరా రోజున ఉద్దందపాలెం లో అమరావతి శంకు స్థాపనకు మోడీ గారు వచ్చి ,యేవో కోటాను కోట్లు రాలుస్తాడనుకొన్నా.తీరా స్థాపన మాత్రం అయిందికాని వరాల జల్లు కురవ లేదు దశాశల దసరా రోజున చొప్ప దంటు ఉపన్యాసం తో నీళ్ళు గార్చి వెళ్ళిపోయాడు .అందుకే జీర్ణించుకోలేక జగన్ ఫెసేసుకొనొచ్చా.’’అన్నాడు .నాకు విపరీతంగా నవ్వు వచ్చి నవ్వేశాను .వాడికి ‘’ఎక్కడో ‘’కాలింది .’’ఇక్కడ కొంపలంటుకు పోతుంటే నీ నవ్వ్వేమిటి’’ బా ‘’.అన్నాడు ఏడవ లేక నవ్వుతూ .’’ఒరే బామ్మర్దీ ! అసలు అంతటి ఆశలెందుకు ?అవి తీరలేదను కోవటమెందుకు ?’’అన్నాను .’’గొప్ప రాజ దాని అమరావతి నిర్మిస్తున్నాం .ప్రపంచ దేశాల వారంతా వస్తున్నారు .ఆరు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నశుభ ముహూర్తం సమయం లో సాక్షాత్తు ప్రధాని స్వయం గా పాల్గొని ఒక్క మాట అంటే ఒక్కమాట స్వయం ప్రతిపత్తి విషయం కాని హోదా విషయం కాని ,ప్రత్యెక పాకేజీ కాని ఏదీ ప్రకటించ కుండా’’ మూటల సంచీ’’ కాకుండా ‘’మాటల సంచీ దులిపేసి ’’వెళ్ళిపోయాడు .కడుపు మండి పోతోంది . ‘’అన్నాడు ఆవేశం గా .’’అరే బాబా ! ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి .సభలో కే సి ఆర్ ఉన్నాడు .మొదటి ది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ,రెండోది ప్రక్క రాష్ట్ర సి ఏం కూడా ‘’నాకేంటి ?’’అని మొహం పెడితే మోడీ పరిస్తితి ఇబ్బందికరం .ఈ మాత్రం తెలియక పొతే ఎలా ?’’అన్నా .’’బీహార్ కు రెండు లక్షల కోట్ల సంచీ దులిపినోడు మనకు సగమైనా రాల్చక పోతాడా ?నాతొ సహా అను కొన్నారందరూ . ‘’అన్నాడు కన్నీళ్లు ఒక్కటే తక్కువ వాడికి .ఎందుకైనా మంచిదని కర్చీఫ్ మొహానికి అడ్డం పెట్టు కొన్నాడు పాపం .
‘’ఏదో ఉద్ధరిద్దామని ఉద్దండ పాలెం వెళ్లావు కదా .! దాని గోప్పతనమేమిట్రా?శంకుస్థాపన అక్కడే ఎందుకు ?’’అడిగా .’’నాకేం తెలుసు’’ బా ‘’.’’ గుంపులో గోవింద’’ లా వెళ్ళా. అందరి తో పాటూ నేనూ ఆనందిద్దామని .ఇంతకీ దాని విశేషమేమిటి ‘’బా ‘’.అని అడిగాడు .’’ఏదైనా తెలుసుకొని వెడితే మంచిది .తెలియ కుండా వెడితే ఇలానే ఉంటుంది .అయినా అడిగావు కనక చెప్పాలను కొంటున్నాను .నీకు ఎన్ని దుర్గుణాలున్నా ,తెలుసుకోవాలన్న నీ తపన నాకు నచ్చింది ‘’అన్నాను .’’సరే బావా !చెప్పు .విని సంతోషిస్తా .’’అన్నాడు అరవిరిసిన మోము తో బ్రాహ్మి బామ్మర్ది .
‘’ఆంద్ర కర్నాటక రాజ్య సార్వ భౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ జైత్ర యాత్రలో ఉద్దండ పాలెం లో బస చేయాల్సి వచ్చింది .ఆయన సేనాని’’ ఉద్దండ రాయడు ‘’ఆ గ్రామం లో ఉండటం వలన దానికి’’ఉద్దండ రాయ పాలెం ‘’అని పేరొచ్చింది .ఇక్కడే కృష్ణానది రెండుపాయలైంది .ఈ రెండిటి మధ్య రాజధాని అమరావతి వెలుస్తోంది .వాస్తు రీత్యా చాలా అనువైన స్థలం . ఉద్దండ మహోద్దండం గా అమరావతి ‘’అమృత నగరి’’ గా వెలిగి పోతుంది .’’అన్నాను ‘.
‘’మరి తుళ్ళూరు సంగతేమిటి ?’’ప్రశ్న సంధించాడు బ్రహ్మి .’’తుళ్ళూరు పూర్వం పేరు ‘’శివ తాండవ పురి ‘’అంటే శివుడు సంధ్యా నృత్యమైన ఆనంద తాండవ నృత్యం చేసిన చోటు .తుళ్ళూరు పేరు రావటానికీ,రాయల వారి కధకూ సంబంధం ఉంది .రాయలు కొండవీడు ,విను కొండ దుర్గాలను స్వాధీనం చేసుకొని ,కొండపల్లి ని పట్టుకోవటానికి వెడుతూ కొంతకాలం ఈ ‘’శివ తాండవ పురి’’లో మకాం పెట్టాడు .రాయలు ‘’తుళువ ‘’వంశం వాడు కదా .జనం నోళ్ళలో తుళువ పేరు నాని నాని ‘’తుళ్ళూరు’’గా మారిపోయింది ‘’అని చెప్పాను .మా వాడి ముఖం సహస్ర దళ పద్మం లా పూర్తి వికాసం పొందింది..దిగులు స్థానం లో జ్ఞాన జ్యోతి కనిపించింది .’’తుళ్ళూరు లో పరశురాముడు ప్రతిష్టించిన ‘’శ్రీ రామ లింగేశ్వర దేవాలయం ‘’కూడా ఉండటం తో’’ యాడెడ్ అట్రాక్షన్ ‘’అయింది అన్నా .
‘’పేపర్లలో ,మీడియా లో ‘’రాయ పూడి ‘’పేరు వినిపిస్తోంది .అ కధా ‘’కమా మీషూ ‘’ఏమిటి బా!’’అడిగాడు బామ్మర్ది .’’దీనికీ రాయలవారికీ సంబంధం ఉంది .తుళ్ళూరు నుండి కృష్ణానది దాటి కొండపల్లి కోటను ఆక్రమించుకోవాలి అన్న ఆలోచనలో రాయలవారున్న సమయం లో కృష్ణానదికి’’ పూటు ‘’గా వరదలొచ్చాయి .వరద ఉద్రుతిలో నదిని దాటటం క్షేమం కాదని నిపుణులు సలహా ఇవ్వటం తో ,ఇప్పుడు రాయపూడి అనే పేరుతొ పిలుస్తున్న గ్రామం లో మకాం వేసి వరద తగ్గే దాకా నిరీక్షించాడు .రాయలున్న ఈ గ్రామం ఆయన పేరుతొ ‘’రాయ పూడి ‘’అయింది .అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు రాయ పూడిలో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ నిర్మాణం చేశాడు .ఈయనే అమరావతిలో అమరలింగేశ్వర దేవాలయం కట్టించాడని మనకు తెలుసు కదా ‘’అన్నాను .
‘’ అమరలి౦గేశ్వరాలయం’’విశేషాలింకా ఏమైనా ఉన్నాయా ?’’అని అడిగాడు బ్రాహ్మి .’’అవున్రా ఉన్నాయి .ఇక్కడ పౌరాణిక ,చారిత్రిక విషయాలు రెండూ కలగలిసి ఉన్నాయి .మొదట్లో అమర లింగేశ్వర స్వామి విగ్రహం ‘’మల్కపురం ‘’అనే గ్రామం లో ‘’శివాలయం ‘’లో పడి ఉండేది .ఒక రోజు రాత్రి దొంగలు ఈ విగ్రహాన్ని దొంగిలించి పారి పోతుంటే నందీశ్వరుడు వెంబడించాడు .దొంగలు భయ పడి పారి పోతూ అమరేశ్వర లింగాన్ని కృష్ణా నదీ తీరం లో వదిలేసి పారిపోయారు. ఈ లింగాన్నేఅమరావతి లో వాసి రెడ్డినాయుడు ప్రతిస్టించాడు..అసలీ విగ్రహాన్ని ప్రతిష్టించిన వాడు సాక్షాత్తు ఇంద్రుడే అని మనకు తెలుసు .ఇంద్ర ప్రతిష్ట కనుక అమరలి౦గేశ్వరుడైనాడు .’’చెప్పా .
‘’బాగుంది బావా !మరిన్ని విశేషాలు చెప్పి నా షేక్స్ పియర్ మొహం లో నవ్వులు పూయించు ‘’అన్నాడు .’’సరే విను .ఈ ప్రాంతం లో శాతవాహన ,కాకతీయ ,చాళుక్య రాజుల పరిపాలనా ప్రభావమూ ఉంది .రాణి రుద్రమ దేవి తండ్రి కాకతి గణపతి దేవ చక్ర వర్తి ఎన్నో దాన ధర్మాలు చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి .పైన చెప్పిన మల్క పురం గ్రామం లో అలాంటి ఒక శాసనం కనిపిస్తుంది .దీనిలో కాకతీయ వైభవాన్ని ,రుద్రమ దేవి శౌర్య పరాక్రమాలను తెలుసు కోవచ్చు .రుద్రమ దేవి మంత్రి శివ దేవయ్య ‘’మండడం ‘’గ్రామం లో శివ లింగం ప్రతిస్టించాడు .’’అన్నాను .
‘’ అమరావతి అంటే బౌద్ధం వికసించిన చోటు ‘’అంటారు కదా బావా ?’’అన్నాడు .’’అవున్రా !క్రీ .పూ. 563-483 ప్రాంతం లో గౌతమ బుద్ధుడు బౌద్ధ మత ప్రచారం చేస్తూ ఈప్రాంతానికి వచ్చాడు .బీజాక్షరాలను ఇక్కడ నిక్షిప్తం చేయటం వలన ఇది ‘’ధరణి కటకం ‘’అయింది .అదే వాడుకలో ధాన్య కటకం అయింది .చివరికి ‘’ధరణి కోట ‘’అయింది .రాజులకు కోట ముఖ్యం .కోట ఉన్న చోట రాజధాని ఉండటం సాధారణం .కనుక నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో నిర్మించటం అన్ని రకాలా సర్వోత్త్తమంగా అందరూ భావిస్తున్నారు .ఇంద్ర ,పరశురామాది పురాణ పురుషులు ,రాయలు , గణపతిదేవుడు మొదలైన చక్ర వర్తులు ,అహింసా మూర్తి గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్ర స్థలం .కనుక సర్వ విధాలా శ్రేష్టమైన నగరం అమరావతి .’’అన్నాను ఆయాసపడుతూ .
‘’మొదట్లో తిట్టినా ,చివరికి ఏదో తాయిలం నోట్లో పెట్టి నోరు మూయిస్తావు .ఎన్నో సంగతులు తెలియ జెప్పావు బావా .ఇక బాబు ఇచ్చిన ఎల్ సి డి బల్బ్ లాగా వెలిగే ఫేస్ తో వెళ్లి పోతా.ఇన్ని విషయాలు ఎలా తెలిశాయి బావా ?’’అని బోల్డు ఆశ్చర్య పడ్డాడు .’’బ్రాహ్మీ! వీటిని పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబరావు గారు సేకరించి రాస్తే బుధవారం ఆంద్ర జ్యోతి లో ప్రచురిస్తే చదివి తెలుసుకొన్నాను .నీకు చెప్పాను .నీకు చెప్పటమేకాదు ,ఆ రోజే దాన్ని సాహితీ బంధు లకు నెట్ లో పంపాను కూడా . ‘’అన్నాను .ఒక్క క్షణం ఆగకుండా మా వాడు దౌడు తీశాడు ఇంటికి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూరు
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11
126’’మాతా తాతస్సా సమయా మహేశః –సర్వ స్వాస్య ప్రాక్ప్రభూతా వ భూతాం
కామేశ స్సత్వంచ కామేశ్వరీతి –స్వేచ్చా పర్యాయేణ శబ్దేన చోహే ‘’
తా-సర్వ ప్రపంచాని కంటేముందేపుట్ట్టిన మాయ- తల్లి ,మహేశుడు తండ్రి .ఆయన కామేశ్వరుడు అయితే నువ్వు కామేశ్వరివి .కామం అంటే ఇచ్చ అని లోక వ్యవహారం .
127-‘’మాయేశౌ భూత్వా ప్రపంచం ప్రసూతౌ –కామేశా భూత్వా వివోడుం ప్రవ్రుత్తౌ
రుద్రో భూత్వా ప్రాక్స దాక్షాయణీ౦ త్వాం-పశ్చాత్తాం త్వాంపార్వతీం చోపయేమే’’
తా-ఇచ్చా రూప మాయ ,శుద్ధ మాయా ప్రతి బింబ భూతుడైన ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించారు .కామేశ్వరావతారం లో పెళ్లి చేసుకోవాలను కున్నారు .కామేశ్వరుడే రుద్ర రూపం లో దక్షుని కుమార్తె వైన నిన్ను పెళ్ళాడాడు .ఆ దాక్షాయణి తర్వాత పర్వ త రాజ పుత్రిక పార్వతి అయి ఆయన్ను వివాహం చేసుకొంది.
128-‘’ఆత్మానం స్వేశాన మీషద్వి వర్జ్య –పాద క్షేపం మాతరోం మాకరోషి
పాతి వ్రత్యం వర్ణ నీయం తవైవ –సూతాస్మాం స్తే నైవ సంభూయ భూమ్నా ‘’
తా-సత్యాత్మ స్వరూపుడు అయిన ఈశానుడి ని విడిచి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు .అందుకే పాతివ్రత్యానికి నిన్నే ముందు చెబుతారు .’’భూమ ‘’ఆకారం అయిన ఈశ్వరునితో నిత్యం ఉంటూ ,అప్పుడూ ,ఇప్పుడూ కూడా మమ్మల్ని కని పెట్టుకొనే ఉంటున్నావు .
129-‘’బి౦బాదారా శుద్ధమాయా పితామ –హ్యాస్మాకం మాతాహి సత్వ ప్రధానా
రాజస్యాం తస్యా మజో భూత్స్వయం భూః-ఈశ స్యైవా భూద్వి రాట్చక్తి భాగః ‘’
తా-‘’ఈశుని ప్రతి బింబా నికి ఆధార మైన గుణ వ్యవస్థ లోకానికి’’ నాయనమ్మ ‘’అయింది .ఈశ్వరునితోకలిసి సత్వ ప్రధాన మాయవైన నువ్వు మా అందరికి’’ తల్లి’’ వైనావు .రజో గుణ ప్రధాన మైన నీలో స్వయంగా’’ విరించి ‘’ పుట్టి బ్రహ్మ మొదలైన పేర్ల తో సృష్టి కర్త అయ్యాడు .ఆ ఈశ్వరుని శక్తి భాగం విరాట్టు అంటే విష్ణువు అయినాడు .
130-‘’సృ ష్ట్యా మస్యాం సాస్త్ర్యు మేశః పుమాని –త్వన్వేత్వేవ శ్రోత శీర్ష ప్రసంగః
ఆదౌ సూక్ష్మా స్థూల రూపా తతస్సా-సృష్టి ర్జ్నేయాసర్వ మూలం త్వమేవ ‘’
తా-ఈసృష్టి క్రమం లో ఆడవాళ్ళందరూ ఉమా స్వరూపులు .మగవారు ఈశ్వర స్వరూపులు .’’ఉమా మహేశ్వర ఉపనిషత్ ‘’చెప్పింది కూడా దీనితో సరిపోతోంది .మొదట ఈశ్వరుని చేత ఇచ్చా శక్తితో ఏర్పడింది అక్రమ సృష్టి –సూక్ష్మ సృష్టి .తర్వాత క్రమంగా స్థూల సృష్టి అయింది అది .ఈ సర్వానికీ కారకు రాలవు నువ్వేకదా తల్లీ !
131-‘’మాయాం విజ్ఞాయ ప్రకారాకృతిం త్వాం-తద్వంతం తం చేశ మద్దా విచిం త్య
త్వద్వంద్వ స్యేదం సమిద్ధం ప్రతీకై –ర్విశ్వం వేదః ప్రాహసో న్వేతి చాత్ర’’
తా-ప్రక్రుతి రూపిని వైన నిన్ను మాయగా తెలుసుకొని ,ఆ మాయనే కలుపుకొని వ్యవహరిస్తున్న ఈశ్వరుని సత్యం గా భావించి ,మీ ఇద్దరి అవయవాలతో ఈ విశ్వం ప్రకాశిస్తోంది అని వేదం చెప్పింది .ఇక్కడకూడా వేద భావన సమన్వయము అయింది .
132-‘’తస్మాద్వక్తి త్వజ్జగంమాత్రు కాత్వం –లోక శ్శాస్త్రం సర్వ మూలం హి వేదః
సూక్ష్మే సర్గే నాస్తి మేళో న తాళః-దృష్టాశ్రోతా నాస్తి కోవా వివాహః ‘’
తా-నువ్వే జగాలకు మాతవు అని లోకం, శాస్త్రం, అన్నిటికీ మూలమైన వేదం ఘోషిస్తున్నాయి .అప్పటి సూక్షం సృష్టి లో ‘’మేళ,తాళాలు’’లేవు .వినేవాడు ,చూచే వాడు కూదాలేరు .భాజా భజంత్రీలు ,పురోహితుడు ,మంత్రం తంత్రాలు సాక్షులు ఎవ్వరూ లేరు కనుక ఆ వివాహం ‘’ఉత్తుత్తి బాంక్ లాగా ఉత్తుత్తి పెళ్లి ‘’అని అనుకోవాలి .
133-‘’క్షంతవ్యా మే మాతర జ్ఞాన వాణీ-భండం సంహర్తుం హియా వాతరస్త్వం
తస్మిన్కాలే దేవతా ప్రార్ధనేన –త్వద్ధ్యానేనా విర్భవ న్నూఢవాం స్త్వాం ‘’
తా-అమ్మా ! నా అధిక అజ్ఞాన ప్రసంగాన్ని క్షమించు .భండాసుర సంహార సమయం లో దేవతల కోరిక పై నువ్వు శివుని ధ్యానించగా నీ నాధుడే వచ్చి నిన్ను ‘’మళ్ళీ పెళ్లి ‘’చేసుకున్నాడు .
134-‘’నిత్యం వేదే షూచ్య మాన స్సయజ్ఞ –ఉద్వా హాభ్యోయ౦ తదాది ప్రసిద్ధః
కల్పాం శ్చక్రుః కల్ప కారా అనూచ్య –వేదాన్లోకం కౌతుకం చాను సృత్య ‘’
తా-నిత్యం వేదం చెబుతూనే ఉన్నా ,నీ పెళ్లినాటి నుండి వివాహం అనేది ఒక యజ్ఞం గా లోకం లో సుప్రసిద్ధమైంది .వేదాన్ని అనుసరించీ ,లోకా చారాన్ని బట్టి కల్ప కారులైన ఆపస్తంభుడు మొదలైన వారు వివాహ విధానాన్ని శాస్తోక్తం గా రచించారు .
135-‘’గౌరీ కల్యాణం చ సీతా వివాహ –మాప్యన్నేషాం దేవతానాం మహా౦శ్చ
ప్రత్యబ్దం కుర్వంతి భక్తా స్వాభక్త్యా –తేనేదం విశ్వం స కళ్యాణ మాసీత్ ‘’
తా-గౌరీకళ్యాణం అని సీతా కళ్యాణం ఇతర దేవతలకూ కళ్యాణాలు భక్తులు భక్తీ శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాలు అప్పటి నుంచీ చేస్తున్నారు .స్త్రీ పురుష వివాహాలు కల్ప సిద్ధాలు .ఇదే ఇప్పుడు దేశమంతా అనుసరించి భాజా భజంత్రీలతో హోరేక్కిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూరు
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10
111-‘’ఈశో విష్ణు సశ్రీ రుమావా ణ్యు మా జో –పీశ శ్శక్ర శ్చేశ ఈశా శచీద్యా
స్త్రీ సర్వోమా పూరుష స్సర్వ ఈశః –ఇత్యూచే కోపి శ్రుతేర్మౌళి భాగః
తా –విష్ణువు ,ఈశ్వరుడు ,లక్ష్మి ,పార్వతి ,వాణి,పార్వతి ,బ్రహ్మ ,ఈశ్వరుడు ,ఇంద్రుడు ,ఈశ్వరుడు శచీదేవి ,పార్వతి మొదలైన స్త్రీలందరూ పార్వతి ,పురుషులంతా ఈశ్వరులే .అని ‘’ఉమామహేశ్వర ఉపనిషత్ ‘’చెప్పింది .అమ్మా !వింటున్నావా ?
112-‘’ఏత త్పక్షే,జంతు జాలేషు సర్వే-ష్వంబాస్త్రీ వ్యక్తిః పుమాం స్తత ఏవ
ఏతాభ్యాం యత్సూయ మానం జగత్తత్ –సర్వే వాదా నిర్వివాదా స్థదా చేత్’’
తా-ఈ ఉపనిషన్మార్గం లో నడిచేవారికి జీవరాసులలో ఆడ రూపం లో ఉన్నవారంతా తల్లి ,మగ రూపం లోని వారంతా వారిని కనే తండ్రి ,వారి సంతానమే ఈ సర్వ జగత్తు అని తెలుసుకొంటారు .ఇలా అయితే వాదాలూ గీదాలు జాన్తానై అయి పోతాయి కదా !
113-తత్పక్షే వ్యుక్తా వుమేశౌ ప్రసిద్ధౌ –తా ద్రూప్యేణా రోప్యతేవిశ్వ మేతత్
సిద్ధం స్త్రీ పుం సస్య మాతా పిత్రుభ్యం –ప్రాదాన్యే నై తత్వయీశే తధాపి’’
తా-ఆ పక్షం గా ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులని నిర్దేశించి ,ఆ ధర్మాన్ని స్త్రీ పురుషులకందరికీ ఆపాదించటం వలన ప్రజలకు తల్లి ఆడది, తండ్రి మగాడు అవుతుంది .కాని ప్రాధాన్యాన్ని బట్టి జగన్మాతవు నువ్వు తల్లివి ,జగత్పిత శివుడు కాక తప్పదు .ఇలా డొంకంతా తిరిగినా నా ప్రశ్న ప్రశ్న గానే ఉండిపోయింది .ఉమా మహేశ్వరుల వివాహ కాలానికి ఈ ప్రపంచం ఉండనే ఉందికదా .మరి దాన్ని ఎప్పుడు కన్నావు తల్లీ ! హద్దు మీరితే క్షమించు .
114-‘’సామాన్యోక్తాం కాళిదాసస్య వాచం –వైశిస్ట్యో క్త్యాశంకరార్యో న సేహే
అస్త్వం బాత్వం తాత పత్నీ శతానాం –సూతే యైకాసాప్రసూ స్స్యాత్ప్రజానాం’’
తా-కాళిదాసు చెప్పిన లోక సామాన్యాన్ని ,శాక్త మతాన్ని బట్టి విశేషం చెప్పి శ్రీ శంకరులు సహింప లేదు .తండ్రికి భార్యలు వందమంది ఉన్నా ,పిల్లలను కన్నదే తల్లి .
115-శాక్తా శ్రుత్యా జామితి స్పష్ట ముక్తాం-అన్యోక్తిభ్యో రూపణీ యాం నిరూప్య
యోగే నాన్యే నాధ్వనోపాస తేహి –ప్రత్యక్షం కేతన్మతం నాద్రి యంతే’’
తా-శాక్తేయులు ‘’అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం సురూపాం ‘’అనే శ్రుతి వాక్యాన్ని బట్టీ ,మాటలతో నిరూపింప లేని స్వరూపాన్ని నిరూపించి యోగ, జప తపాదులు మొదలైన వాటి చేత నిన్ను ఉపాసిస్తున్నారు .
116-‘’దృష్టా స్రస్టా మూల భూతౌ శివౌద్వా –వభ్యస్య న్స్త్రీపుంస వర్గం వితేనే
ఇత్యూచే గంగా కవిత్వ ప్రసిద్ధా –సిద్ధం యుష్మ త్సర్వ మాతా పితృత్వం ‘’
తా-‘’అన్నిటికీ మూలమైన పార్వతీ పరమేశ్వరులను చూసి స్త్రీ ,పురుషులుగా భావించి బ్రహ్మ అన్ని జాతుల జంతువుల్ని సృష్టించాడు’’ అని ‘’ప్రౌఢ కవయిత్రి గంగా దేవి ‘’చెప్పింది .ఎవరే రకంగా చెప్పినా మీ ఇద్దరు లోకాలకు మొదటి తలిదండ్రులు అనటం లో సందేహమే లేదు .
117-‘’ఏతత్సృత్యాం ప్రశ్న ఉత్పాదితో న్యః-స్వీ యోద్వా హి పార్వతీ చేశ్వర శ్చ
విఘ్నేశానాం పూజయా మాస తుర్హీ –త్యుత్పత్తేః ప్రాగ్యు జ్యతేర్చా కధం వా ‘’
తా-ఈ మార్గం లో వినేవారికి మరో సందేహం కలుగుతుంది .పార్వతీ పరమేశ్వరులు తమ వివాహ సమయం లో విఘ్నేశు ని పూజించారట .న్యాయంగా అప్పటికి గణ నాయకుడు పుట్టనే లేదు కదా !పుట్టని వాడికి పూజేమిటి నాన్సెన్స్!ఎలా సాధ్యమమ్మా ?
118-‘’ప్రశ్నో న్యోవాగ్బ్రహ్మ పత్నీ ప్రసిద్ధా –శ్రీ హర్ష స్తాం విష్ణు పత్నీం బ్రవీతి
శంభోః పత్నీ శాంభవీ త్యాగమేస్తి-సర్వేషాం వాయస్య కస్యా పి వేయం ‘’
తా-అమ్మా మరో డౌటు –సరస్వతి బ్రహ్మ భార్య అని ప్రసిద్ధం .విష్ణు పత్ని సరస్వతి అని శ్రీ హర్షుడు నైషధం లో రాశాడే .శంభుని పత్ని శాంభవీ అని ఆగమాలు ఆగమాగామ౦ గా ఎలు గెత్తి చాటు తున్నాయి కదా .మరైతే నువ్వేమను కోనంటే ‘’ఈ సరస్వతి అందరికీ పెళ్ళామా “”?లేక ఒకరికే భార్య యా ?(నీతో మాట్లాడుతున్నకొద్దీ సందేహాలు పుట్ట్టలో తేళ్ళులాగా బయటికోస్తున్నాయి ).
119-‘’పౌరాణ్యాం వాణ్యా మితి ప్రస్పురంతి-హ్యజ్ఞాతానా మక్ష రేచాక్షరేచ
ఆద్యే ప్రశ్నే సోత్తరే సోత్త రాస్యుః-సర్వే తస్తం ప్రస్తుతం ప్రార్ధ యామః ‘’
తా-పురాణాలలో ,చరిత్రలలో అన్వయ సరణి తెలియని వాళ్లకు పొట్ట నిండా సందేహాలే .ఈ చిక్కు ముడి విప్పుదాం .ముందు నా మొదటి ప్రశ్నకు అంటే ‘’నీ జగన్మాత్రుత్వం ‘’కు సమాధానం దొరికితే మిగిలినవి అవే విప్పుకొంటాయి .
120-‘’బ్రహ్మశ్రీ వేద స్వరూపాయ వందే –వేద వ్యాసాయర్షయే శక్తి ధామ్నే
శక్తిం నౌమి ప్రాంజలి ప్రహ్వ దేహః –పాద క్ష్మా౦తే న్యస్య మూర్ధాన మర్దీ’’
తా-బ్రహ్మ వేదాల ప్రత్యక్ష శరీరం కలవాడు .శక్తి కూటం లో నిత్య నివాసి అయిన వేద వ్యాసునికి నమస్కరించి నాకు శక్తి కలగ జేయమని అర్ధిస్తున్నాను .
121-‘’వర్తేధాం మామాభి ముఖ్యేన దేవి –త్వం చాయం మౌనీ న నారాయణా౦శః
యుష్మద్వాత్సల్యా న్మయా త్రోచ్య మానాం-శ్రుత్వా బ్రూతంసాధువా సాదు వేతి’’
తా-అమ్మా ! నువ్వూ, నారాయణాంశ అయిన ఈ వ్యాసమహర్షి నాకు ఎదురెదురుగా ఉండండి .నేనడిగిన ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను .అవునో కాదో మాత్రం చెప్పండి .
122-‘’ఏకం బ్రహ్మా స్త్యక్రియం నిర్వికారం –మాయా బీజే౦కూర శక్తిర్వ తత్ర
వాహనా వౌష్ణ్యం వాపి బింబన్నముష్యాం –శుద్దాయా మీశ స్సఐచ్చ ద్బహుత్వం ‘’
తా-సజాతీ విజాతీ స్వగత భేదం లేని నిష్క్రియ గల మార్పు లేని వస్తువు ఒకటి ఉంది .దానికి బాధ లేదు .అదే బృహత్వం లో బ్రహ్మ౦ అని మనం పెట్టుకొన్న పేర్లు .ఆ బ్రహ్మం లో అగ్నిలోని వేడిలాగా ,విత్తనం లో మొలిపించే శక్తిలాగా మాయ అనే ‘’రూపం లేని శక్తి’’ కనిపించకుండా ఉంది .ఆ మాయ శుద్ధ మైంది .దానిలో ప్రతి ఫలించిన బ్రహ్మం యొక్క ప్రతి బింబమే ఈశ్వరుడు .ఈ ఈశ్వరుడు సత్వ గుణంఉన్న మాయ తో కలిసి అనేక రూపాలు పొందాలని భావించాడు .
123-‘’మాయాం చేమాం శంకరః ప్రాహ విద్వాన్ –సచ్చా సచ్చా భూదిదంసర్వ మస్యాః
సత్సాన్నిధ్యే భాసతే స త్త ధైవ-లోకే సర్వేషాంస ఏష స్స్స్వభావః’’
తా-సర్వజ్ఞుడైన శ౦కరుడు ఈ శక్తినే మాయ అన్నాడు .సద సద్రూపంగా ఉన్న ప్రపంచం అంతా ఈ మాయ వలననే ఏర్పడుతుంది .సద్వస్తువు దగ్గరగా ఉంటె అసత్తు సత్తు లాగా భాసిస్తుంది .ఈ భాసనం దీపం దగ్గర ఇతర పదార్ధాలు కాంతితో కనిపించి నట్లుగా ఉంటుంది .
124-‘’మాయా బింబోష్యేష సర్వజన ఈశ-స్సత్వో ద్రేకా దిచ్చయోపేత ఐచ్చత్
నానా భావం సక్రమేణా క్రమేణ-భేజే హిత్యాహ శ్రుతి ర్ద్విప్రకారాత్ ‘’
తా-శుద్ధుడు, సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు ,మాయలోని సత్వ గుణ ఉద్రేకం వలన ఇచ్చా శక్తి తో కలిసి నానాత్వం కోరాడు .వెంటనే ఈశ్వరుడు విశ్వ రూపాన్ని దాల్చాడు .మదహంకార ,సూక్ష్మ ,స్థూల భూతాలను ఒక క్రమం లో సృష్టించాడని రెండు పద్ధతులలోశ్రుతి చెప్పింది .కనుక ఒకప్పుడు క్రమ సృష్టి ,మరొక్కప్పుడు సర్వ సృష్టి జరిగిందని భావించాలి .
125-‘’శుద్ధ మాయా బ్రహ్మ రూపా నిరూపా –తామాచార్యో బ్రహ్మ పత్నీం బ్రవీతి
బింబీ భూత స్తత్ర దేవః ప్రసూతే –సత్వన్నత్యా భిన్న రూపేచ్చ యేదం’’
తా-శుద్ధ మాయ- రూప రహితమైన నామం రూపం లేని పర బ్రహ్మానికి ‘’మహిషి ‘’అని శ్రీ శంకర భాగవత్పాదు లవారు వర్ణించారు .దానిలో ప్రతి బింబిం చిన దేవుడు సత్వ ప్రధానం కలిగి ఉండటం వలన వేరే రూపం లో ఉన్న మాయ లో ఉన్న గుణాలను తన వశం చేసుకొని తాను గుణ రహితుడైనా గుణమయమై కనిపించి మనతో ఒకాట ఆడుకొంటున్నాడు .అంటే సృష్టి చేస్తున్నాడు అని భావం .
సశేషం
ne image 1
విజయ దశమి ,అమరావతి శంకుస్థాపన శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-15-ఉయ్యూరు
అమరావతి పాట
|
|||
|
|
|||
|
|
|||
మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు
—
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -9
101-‘’తంబా తీత్య ప్రస్తితాస్తన్యసేనా-సంరంబోత్దా ఆసురీర్నిర్ద దాహా
కల్పాన్తేష్వీశ్వః పశూనాం జగంతి-భస్మీకుర్యాద్యేన శస్స్త్రేణతేనః ‘’
తా-కల్పాంతం లోపశుపతి అయిన శివుడు లోకాలను సమూలంగా దహించినట్లు ఈశ్వరి భండాసుర సైన్యాన్ని సమస్తాన్నీ పాశుపతాస్త్రం తో దహించే సింది .
102-‘’సర్వాత్మీయానాం ప్రనాశం సమీక్ష్య-దేవీ మేవాభ్యద్రవ చ్చూన్య కేన
సాప్యేనంకామేశ్వరేణా భి జఘ్నే-భండం శూన్యాసుం సశూన్యం దదాహ ‘’
తా-అంతా కోల్పోయినవాడు కామకం అనే తన పట్టణం తో సహా దేవిపైకి వచ్చాడు .భవానీ దేవి వాడిని కామేశ్వరమనే అస్త్రం తో కొత్తగా వాడినీ వాడి పట్టణాన్ని కాల్చి బూడిద చేసింది .
అస్త్రాలలో కామేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం కంటే శక్తి వంతమైనది .అమ్మవారి నామాలలో ‘’కామేశ్వరాస్త్ర ‘’అని ఉంది .భండుడు మొహానికి, శూన్యనగరం శూన్య వాదానికి ప్రతీకలు అని గ్రహించాలి .దేవుడిని చూపించి శూన్యవాదాన్ని చిత్తు చేసింది అనీ భావం .
103-‘’బ్రహ్మోపేంద్రాదయ స్స్మస్తువంతి-విస్మేరాస్యా విక్రమ ప్రక్రమర్ధిం
దేవా స్స్వస్థాస్సుస్తితాశ్చాన్యలోకాః –సోయం కామేశాన పత్నీ,ప్రసాదః ‘’
తా-త్రిమూర్తులు మున్నగు దేవతలు దేవి పరాక్రమాన్ని కొనియాడారు .లోకాలన్నీ స్వస్థత చెందాయి .శూన్యవాదం నశించి మనో బుద్ధీ మొదలైన ఇంద్రియాలు సువ్యవస్తితమై సాధకులు నిర్వృతి పొందారని అంతరార్ధం .
104-‘’గాదా సేయం వర్నితా విస్తరేణ-స్వీయే గ్రందే వ్యాస భట్టార కేన
లోకోద్దారార్ధం హి నారాయణేన –సంగృహ్యేయం ప్రస్తుతార్ధం మయోక్తా ‘’
తా-వ్యాసమహర్షిగా జన్మించిన నారాయణుడు బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో చాలా విస్తారంగా దీన్ని రాశాడు .నేను సంగ్రహం గా చెప్పాను అంతే.అన్నారు శాస్త్రీజీ .
105-‘’అంతర్యామీ వ్యాస నారాయణో సౌ –సర్వ త్రాస్తేసనాస్తే మయ్యహో కిం సనాస్తే
మాతస్త్వంమే జాగ్రతి స్వప్న సుప్త్యోః-ప్రత్యా సన్నా లక్ష్యసే భాగ్య మేతత్ ‘’
తా-వ్యాస నారాయణుడు సర్వాంతర్యామి .అలాంటి వాడు నా యడల ఉండడా?అమ్మా !నువ్వు నాకు మెలకువలోను ,కలలోను ,నిద్రలో కూడా సన్నిహితంగా ఉంటున్నావు .ఇదే నా భాగ్యం .
106-‘’నామం నామం త్వాం చ బ్రవీమి –స్థాతవ్యం వామాభి ముఖ్యేన మేం బ
ఉద్వాహే తే లోక మాతృత్వ కార్యే (కీర్తౌ )-పౌర్వా పర్యం తద్వి మ్రుస్టవ్య మత్ర’’
తా-నీకూ వ్యాసునికి పదే పదే నమస్కరిస్తూ మళ్ళీ అడుగుతున్నాను .నీ వివాహం ,లోకాలను కనటం లలో ఏది ముందు ?వివాహం నాటికే దేవాసురులతో ఉన్న ప్రపంచం ఉందికదా .మరి ఆ ప్రపంచాన్ని ఈ అమ్మ ఎలా కన్నది ?అని సందేహం .
107-‘’ఈశ స్స్రస్టా లోక జాలస్య తాతః –పత్నీ తాత స్యా౦బి కైవ ప్రజానాం
ఇత్ధం గౌర్యా లోక మాతృత్వ మూచే –సర్వజ్ఞో సౌ కాళిదాసః కవీశః ‘’
తా-అన్నిలోకాల్ని సృష్టించిన ఈశ్వరుడు వాటికి తండ్రి అవుతాడు కదా .తండ్రి పెళ్ళాం ప్రజలకు తల్లి అవుతుందికదా .అని మహా కవి కాళిదాసు పార్వతీ దేవి యొక్క లోక మాతృత్వాన్ని సమర్ధించాడు .
108-‘’శక్త్యా యుక్త శ్శక్తఏతత్ క్రియాసు –నో చే దీశ స్స్పందితుం చాప్య శక్తః
ఇత్యాచార్యా స్శంకరశ్శన్కరోయం-వ్యాచ స్టేద్ధా డిండిమం వాద యన్నోన్’’
తా-శక్తితో కూడిన శివుడు సృష్టి స్తితి లయ కారకు డౌతాడు .శక్తి లేకపోతె ఆయన వలన ఏ పనీ జరుగదు అని సాక్షాత్తు శంకరావ తారమే అయిన శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు కనుక తిరుగు లేదు .
109-‘’వేదో మూలం వ్యాస వాచాం న చేత్స-మంత్రం ద్రస్టానో వదేత్కించ నాపి
వేద వ్యాసోక్త ప్రభావ ప్రపంచే –హ్యూహా పోహే సాధయే త్సత్కవీశః ‘’
తా-మంత్ర ద్రష్ట వ్యాసుడు చెప్పిన ప్రతిదానికి వేదమే మూలం .వారి వాక్కుల ప్రభావం తో ఊహా పోహాలను మేళవించి సత్కవి కావ్య రూపం లో ప్రపంచానికి తెలియ బరుస్తాడు .
110-‘’వేదస్త్వమే దృశ్యసే భాగ్య యోగాత్ –వ్యాసో మౌనీశశ్చ సర్వత్ర గోస్తి
యుష్మ స్సాన్నిధ్యం ప్రకల్ప్య ప్రాసాదాత్-ప్రశ్నంతస్యా వ్యుత్తరం వర్ణ యామి ‘’
తా-అసలు వేద వాణివి నువ్వేకదా తల్లీ !నా అదృష్ట వశాన కలలోను , నిజంగాను కన్పిస్తున్నావు .ముని ముఖ్యుడు వ్యాసుడు ఈశ భావం తో సన్నిహితుడయ్యే ఉన్నాడు .మీ ఇద్దరి సమక్షం లో నేను సంధించిన ప్రశ్నాస్త్రానికి నేనే ఉపసంహారం చేసి వివరిస్తాను. దయ చేసి వినండి మీ రిద్దరూ ‘’అన్నారు శాస్త్రిగారు .
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-15-ఉయ్యూరు
దసరా శుభా కాంక్షలు
సాహితీ బంధువులకు ఈ రోజు 21-10-15 బుధవారం మహర్నవమి ,రేపు 22-10-15 గురువారం విజయదశమి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్
‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8
‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8
91-‘’నో సంరబ్దానై వభీతాన భూతా –భర్తుర్వామామ్కేనిశాణ్ణా యదా వత్
దేవ్యా దిస్టైశక్తి సైన్యై ర్వితున్నో –భండ శ్చిత్రంవిఘ్న యంత్రం తతానః ‘’
తా-అంతటి భండుడితో యుద్ధం అని భయం కాని కంపం కాని లేని దేవి భర్త వామాంకం పై కూర్చునే ఉండి సైన్యం తో భీకర యుద్ధం చేయించింది .వాడు చిత్రమైన విఘ్న యంత్రాన్ని పెట్టించాడు .
92-‘’యంత్రస్యాన్య ప్రాభావాత్సం బభూవు –శక్త్యాస్థానం సర్వ కార్యేషు విఘ్నాః
తాభిర్విజ్న స్తావిభో రైక్షతాస్యం –కామేశీ సా తక్షణే భూద్గణేశః’’
తా-ఆ యంత్రం దేవి కార్యాలకు విఘ్నాలు కలిగిస్తోంది .పాలుపోక అమ్మవారు అయ్య వారి ముఖం వైపు సాభిప్రాయంగా చూడగానే గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు .
93-ప్రుస్టాకార్యం కిం మయే త్యేతకేన -భంజా రాతే ర్విఘ్న యంత్రం దురంతం
ఇత్యాదిస్టః ప్రేక్ష జఘ్నే వదేన –తేనా భూత్తద్విశ్లధం తన్మనశ్చ’’
తా-‘’నాతొ ఏమిపని ‘’? అని అడుగగా అమ్మ ‘’విఘ్న యంత్రాన్ని విచ్చిన్నం చేయమన్న’’ది .కాలితో ఒక్కతన్ను తన్నగా అది ముక్కలై పొడి పొడి అయింది .రాక్షసుని మనసూ విరిగిపోయింది .
94-‘’సన్నదాన్వా ఆగతా న్భండ పుత్రా –న్సంఖ్యాతీతానాహనత్తీ ప్రసంఖ్యే
బాలా బాలా యౌవ రాజ్యే పదస్థా-మాతా నందత్తాంకృతిం సంస్తు వంతీ’’
తా-యువరాజ పదవిలో ఉన్న ప్రౌఢ అయిన బాలలేక్కలేని భండుని కొడుకుల్ని సంహరించింది ఈపనికి జగన్మాత బాలను భేష్ అని మెచ్చింది .
95-‘’దుర్ధర్షం భందాను జాతం విషంగం –మంత్రిన్యంబా శామలాఖ్యా వదీత్సా
తద్దుస్టం తస్యాను జాతం విశుక్రం –వారాహ్యాభ్యా భండ నాదా హనద్ధిః’’
తా-భండుని తమ్ముడు విషండుని మంత్రిని శ్యామలాంబ చంపింది .వాడికంటే దుర్మార్గుడైన తమ్ముడు విశుక్రాసురుడిని దండనాద అయిన వారాహి మట్టు పెట్టింది .
96-‘’కర్మభ్యా౦ ద్వాభ్యాంతయోస్సంతు తోష –సమ్రాజ్నీ తేహ్యభ్యనందన ద్ద్రుశోక్త్యా
భండే నైవోత్పాదితౌ స్వేచ్చయా మూ –స్రష్టా౦ సాభ్యాం స్వాను జన్మ త్వ బుద్ధ్యా ‘’
తా-ఈ రెండు పనులకు రాజ రాజేశ్వరి సంతోషించింది .స్వయంగా రాక్షసులని సృష్టించే సామర్ధ్యం ఉన్న భండుని చేత తోడబుట్టిన వారు అనే భావం తో మళ్ళీ పుట్టించటం లేదు .
97-‘’మాయావీస్రస్టాసృజత్తత్క్షణేన –రక్షో నాదో రాక్షసాన్సోను కాదీన్
భూతాన్ భవ్యాన్ సర్వ నారాయణారీన్ –తేనాజ్ఞప్తా ఏకదాతే భిజగ్ముః
తా-మాయ సృష్టికర్త అయిన వాడు పూర్వపు రాక్షసులైన సోమక హిరణ్యాక్ష హిరణ్య కశిపుడుమొదలైన వారెందరినో సృష్టించాడు .వాడి ఆజ్ఞతో వాళ్ళంతా శక్తి సైన్యంపై విరుచుకు పడ్డారు .
98-‘’లోకానాం మాతా హసంతీహిదృష్ట్వా తాన్ హస్త ద్వంద్వ్వా౦ గు ళీనాం నఖేభ్యః
సౌ సృష్ట్వా నారాయణ స్యా వతారాన్ –తేభ్యః ప్రాదోద్యోద్దుమద్దా పినద్ధాన్ ‘’
తా-ఆ రాక్ష బలాన్ని చూసి నవ్వుతూ లోకమాత లలితా త్రిపురసుందరి రెండు చేతులలోని పది వ్రేళ్ళ గోళ్ళను విదిల్చి నారాయణుని పది అవతారాలను సృష్టించి ,వారందర్నీ యుద్ధం చేయమని ఆజ్ఞా పించింది .
99-‘’రక్షాం స్మేతాన్యాసు జీవేశ వ్రుత్తి –ప్రాయైః ప్రాయో హన్యమానాని వేశుః
జాతా విష్ణోర్మూర్తి భేదా స్తదైవ-దేవ్యా దృష్టా నిర్ర్వ్యాణి స్శ్రమా శ్చ’’
తా-భండ సృష్టిని నారాయణ దశాక్రుతి సృష్టి పూర్తిగా నశింప జేసింది .విష్ణు అవతారాల పరాక్రమాన్ని దేవి అభినందన పూర్వకం గా ప్రసన్న దృష్టితో చూసింది .దీనితో వారికి గాయాల బాధ లేకుండా పోయింది .
100-‘’ఆత్మీయానాం నాశ మార్తిమ్చ వీక్ష్య –భండః కోపాదస్త్ర శస్త్రై ర్వవర్ష
దేవీ మేవ స్వాత్మనా ఖ్యేత్య సాపి –ప్రత్య స్త్రైస్తం వారయామాన త౦చ’’
తా-తనవారు చచ్చి దేవి సైన్యం హెచ్చుతుంటే వాడికి మండి స్వయంగా యుద్ధానికి దిగి అస్త్రశస్త్రవర్షం కురిపించాడు .
సశేషం
శ్రీ దుర్గాష్టమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-15
\తా
Sahithi Mandali 308 151018 Photos,Audio.
This gallery contains 19 photos.
మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు -7
మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు -7
81-”కిం కుర్వం త్యుత్సాహ హీనా నివ్రుత్తా -స్తేనో భూత్త త్రైవ ద్రుశ్యో ప్యద్య శ్యా
వాణీ కాచి ద్దివ్య భీకా చ చక్షే -శ్రుణ్వత్స్వే తేష్వప్యానద్రుతే ”
తా-పాపం భటులు వాళ్ళెం చేయగలరు?నిరుత్సాహం తో వెళ్ళిపోయారు .ఇన్తలొ ఒక అ శరీరవాణి విని నిపించింది .
82-”భో మోహాత్మన్ భందచండ ప్రచండా-ప్రత్యక్ష బ్రహ్మాత్మ విద్యాననవద్యా
సన్నద్దా సీమంత సీమాంత దేశే -స్వధ్యా సీనాశాసితుం త్వాం దురంతం ”
తా-మొహాన్దకారా !చండ శాసన భండా ప్రత్యక్ష బ్రహ్మ విద్యాత్మిక లలితా దేవి ప్రత్యక్షంగా యుద్ధం చేయటానికి సిద్ధం గా ఉంది ,
83-”పాపాచారం గర్వ మేత త్సమస్తం -త్యక్త్వా జీవన్ జీవ తుల్యంశ వేన
యుద్ధా దేవ్యా దివ్య శక్తి ప్రతానై -ర్మ్రుత్వా రూప స్టిస్ట తుల్యంశివేన ”
తా-సర్వ గర్వాన్నిఒదిలెసి నిర్జీవిగాఉన్దు లేకపోతెదేవిదివ్యశక్తులతో పోరాడి రూప రహితంగా శివుడిలా ఉండు .
84-”వైధవ్యంకిం సాధయామ్య త్ర వృత్యా-ప్రగ్విష్ణౌ వ శక్తి సేనాను లీయే
యిత్యా భాష్య ప్రస్తితా విష్ణు మాయా -ద్రుశ్యానా భూత్క్వాపి కాపి ద్విరూపా ”
తా-ఇక్కడ విధవను అవటమో ,లేక నీ ముందే దేహం వదిలి విష్ణు వులోకాని,శక్తిసేనల్లోకానిలీనమైపోతాను .”అని పలికిరెండు రూపాలలో ఉన్న విష్ణుమాయ అదృశ్యమైంది .
85-”స్మ్రుత్వాదేవంతం శివంవాచికం తత్ -మాయా దేవ్యాస్తాం ప్రవ్రుత్తిం చ దృష్ట్వా
శ్రుత్వా కాశే వాచ మర్ధ్యాం స భండ -స్సన్నద్దో భూత్సర్వ సైన్యై ర్వదాయ ”
తా-ఇన్నివిధాలుగ చెప్పినా వినని, వినిపించుకోని బండుడుయుద్ధానికే సిద్ధమయ్యాడు
86-”భేరీ భంకారై ర్మ్రుగేంద్ర ప్రణాదై -ర్మత్తే భాశ్వా రావనై రట్ట హాసైహ్
సంరబ్దాం స్వాం సైన్య రాజిం గృహీత్వా -దైత్యో దేవ్యా శ్శక్తి సేనా సమభ్యైత్ ”
తా-భేరీల భం భం నినాదాలుదిక్కులు పిక్కటిల్లేట్లు సర్వసైన్యంతోదేవీ సైన్యాన్నిఎదిరించాడు .
87-”దేవీ స్థానం శక్తిసేనా సమాజం -యద్యద్రక్ష్య0తత్త దన్య త్పరీయ
జ్వాలా మాలిన్యా వ్రణోతిస్మ వహ్ని -ప్రాకారేణ స్వ ప్రభా భాసు రేణ ”
తా-సర్వ శక్త్యాత్మకంగా జ్వాలామాలిని చూడ రాని కాంతితో అగ్ని దేవతలా వచ్చింది .
88-”మాతం గౌఘై రాస సంపత్కరీయా-యాశ్వా రూడ్హా కోటి కోట్యశ్వ కోట్యా
ప్రాపు స్సర్వా ఆయుదీయా అమోఘా -శ్శక్తి వ్రాతా శ్చక్ర రాజారదేన ”
తా-సంపత్కరీదేవి ఏనుగుసేనతో, అశ్వా రూఢ శక్తిగుర్రపు దళం తో చక్ర రాజ రధాన్నిఅధిరొహించి సర్వాయుధ శక్తి సంపన్నంగా వచ్చింది.
89 -మంత్రిన్యంబా గేయ చక్రాది రూడ్హా -కోలై శ్చ క్రైహ్ స్యన్దనే దండ నాధా
ఆయాతా స్త్వైర్వాహనై రాయుధైశ్చ-బ్రహ్మాండేయా శ్శక్త యస్తా స్సమస్తాః
తా-గేయచక్ర రాదాన్నిఎక్కి మంత్రిణీ దేవి ,వారాహ చక్ర రధం పై దండనా శక్తి ,అలాగేమిగిలిన శక్తులన్నీ వారివారి ప్రత్యెక రదాలెక్కివచ్చారు .
గేయచక్రం ఏడ0 తస్తులతో ,కిరి చక్రం అయిదు అంతస్తులతో ఉంటాయి మంత్రిణి అంటే శ్యామలాదేవి .కిరి చక్రం పై వారాహిదేవి ఉంటుంది యుద్ధంలో ఈ మూడు రధాలు ఒక దాని వెంట ఒకటి ఉంటాయి ..
90-”సంతు స్తంబా భండ సైన్యాది సర్వా-ణ్యాని ఘ్నంతీ0శక్తి విక్రాంతి మైక్ష
నిత్యా వీర్యా టోప మాలోక యంతీ –సౌత్సు క్యాతా అస్తు అద్భావ భంగ్యా”
తాశక్తి సైన్యం భండాసుర సర్వసైన్యాన్ని హతంచేస్తుంటే శ్రీ మాతసిద్విలాసంగా నవ్వుతూ ,వారి పరాక్రమాన్ని మెచ్చుతోంది .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-15- కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్
జనగీతం అవుతున్న విద్వాన్ విశ్వం ”పెన్నేటి పాట ”,వేల అమూల్యం విలువ చిరకాలం
జనగీతం అవుతున్న విద్వాన్ విశ్వం ”పెన్నేటి పాట ”,వేల అమూల్యం విలువ చిరకాలం


—
కళల నాదరించిన గజపతులు ,శ్రీకృష్ణ శతానందం -కంచె పై క్రిష్
కళల నాదరించిన గజపతులు ,శ్రీకృష్ణ శతానందం -కంచె పై క్రిష్


—


గబ్బిట దుర్గా ప్రసాద్
అమరావతికి శ్రీ చక్రం ,సరస్వతీ నమస్తుభ్యం ,వేంకటాద్రి నాయుడు –



గబ్బిట దుర్గా ప్రసాద్
మోడీపై గంపెడాస లు,విశ్వనాధ అందరి వాడే బీహార్ భవిష్యత్తు
మోడీపై గంపెడాస లు,విశ్వనాధ అందరి వాడే బీహార్ భవిష్యత్తు

—

గబ్బిట దుర్గా ప్రసాద్
మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6
మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6
71-భక్త్యా వందేమాతరం భోః ప్రసీద -యద్వా వచ్మ్యే వాహ మ౦గీ కురుష్వ
విద్యా పారోక్ష్యా పరోక్షత్వ యోర్వా -బాలత్వా బాలత్వ సంకేత ఈద్రుక్ ”
తా-”తల్లీ !భక్తీ నమస్కరించి అడుగుతున్నాం నువ్వు చెప్పక పొతే ,నాకుతోచింది చెబుతా అనుగ్రహించు .బాల అంటే పరోక్ష బ్రహ్మ విద్య .నీ పంచదశి ప్రత్యక్ష బ్రహ్మ విద్య .ఈ బాలత్వ ,అబాలత్వాలు ఒకటితక్కువ ,మరోటి ఎక్కువ అనే అర్ధాన్ని ఇవ్వటం లేదా ?
72-”మంత్రస్తే కూట త్రయాత్మా తటస్త -త్సార భ్రాజత్ర్యక్షరో స్యామనుశ్చ
తత్తా వచ్చిన్నో జయ మంగ ప్రబేదః -యద్వా హేతు స్తద్వి భూతో ర్విభాగః ”
తా-మూడు కూటాల నీ మంత్రం 15 అక్షరాలూ కలది .ఈ మూడు కూటాల సారమే మూడక్షరాల బాల మంత్రం .ఈ భేదం దీని నుంచి వచ్చిందా ?ఏక పాద్విభూత్య ధిస్టాత్రి బాల ,త్రిపాది విభూత్యధిస్టా త్రి బాల అనే విభూతులను బట్టి వచ్చిందా ?
73-”అస్మాదావిర్భావతః పూర్వ సిద్దే -రూపే వావాం మాత్రు పుత్రీ త్వ సిద్ధిం
ఊకారే నైవోత్తమా౦ గ౦ విచాల్య- దేహ్యాజ్ఞానం త్వం ప్రస్తుతో పక్రమాయ ”
తా-ఇక్కడ అవతరించటానికి ముందు సిద్ధమైన మీ రూపాలలో తల్లీ కూతురు గా ఉండి ,అదే ఇక్కడ కొన సాగుతోందా ?నువ్వేం కస్టపడద్దు .”ఊ ”కొట్టు చాలు .లేదా తల ఊపు అంతే.ఏదో రకంగా నువ్వు ఔనను .ఇక కధలోకి వెడ దా౦.
74-”ప్రాక్సర్వేశానో తర రాజాది రాజః -రాజ్ఞీ తస్యే హాస్తి కామేశ్వరీయం
బాలా బాలాయు వ రాజ్యేభి శిక్తా -పర్యావ వ్రుశ్శక్తి సేనా న్సమంతాత్ ”
తా-పూర్వం సర్వేశ్వరుడైన కామేశ్వరుడు జగజ్జనకుడు .రాజాది రాజు .ఆయనభార్య కామేశ్వరి ,ఇక్కడ రాణి ఉన్నది .ప్రౌఢ అయిన బాల యౌవ రాజ్యానికి అభిషేకింప బడింది .శక్తి సేన అంతటా విస్తరించింది .
75–”బాహ్యాన్తర్ద్రుష్టి శ్శివో దూత భూతః -మన్త్రిన్యంబా మంత్ర యత్యర్ధ జాతం
శ్రీపూశ్చక్రం దుర్గమం దుర్ని రూపం -తత్రత్యానాం భీర్న సిద్ధామ్రుతాత్తి”
తా -బహిరంతర్ముఖుడైన శివ దేవుడు రాచకార్యాలలో దూతగా పని చేస్తాడు .మంత్రిణీ శక్తి మంత్రాలోచన చేస్తుంది .చక్ర రూపం లో ఉన్న శ్రీ పురం నిరూపించ టానికి వీలుకాట్టిది .ఇతరులు అక్కడికి చేరుకోలేరు .అక్కడి వారికి భయం లేదు .అమ్రుతానుభవం సిద్దించేది .
-”సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే -మణి ద్వీపే నీపోప వన వతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం -భజన్తిత్వాం ధన్యాః కతి చన చిదానంద లహరీ ”
తా-అమృత సముద్ర మధ్య లో కడిమి తోటలో చింతామణి గృహం లో బ్రహ్మ రుద్ర ,ఈశాన,రూపాలలో ఉన్న మంచం పై సదాశివుని పర్యంకం పై నివశించి ఉన్న జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను ఓ పర దేవీ అదృష్ట వంతులైన కొందరు మాత్రమె సేవించగలరు .(శ్రీ శంకరుల సౌందర్య లహరి )
76 -సంనద్దే త్ధం ప్రాహి ణోత్తం శివేశం -దౌత్యం కర్తుం దైత్య నాదాయ సద్యః
దౌష్ట్యం త్యక్త్వా దేవ భావే వనద్వం -నో చేద్ధన్యా౦ మూల కాషం కషిత్వా ”
తా-సర్వ సనద్దురలైన దేవి శివుడిని భండాసురుని వద్దకు దూతగా పంపిది ”.రాక్షస భావం వదలి దేవభావం తో లోకాలను బాధించకుండా ఉండు .లేక పొతే మొదటికే మోసం వస్తుంది ”అని చెప్పమని పంపిది
77 -”సోయం గత్వా భండ రక్ష స్సభాంతం -నిర్భీ రూచే వాచికం తద్యదోక్తం
క్రుద్ధ స్సంరద్దో ట్ట హాసం ప్రకుర్వన్ -జల్పన్నాల్పం హ్యాది దేశ స్వభ్రుత్యాన్ ”
తా-వాడి సభకు వెళ్లి దేవి చెప్పినట్లు శివుడు దూత వాక్యం పలికాడు .మండిన భండుడు భటులకు ఆజ్న ఇచ్చాడు .
78-”ఆభీలో హో కాల ఉచ్చా వచో సౌ -రామా మామాకార యతీ హి యుద్ధే
కర్తవ్యమ్ యత్త త్కరిష్యా మహేశ్వో -దూతం బధ్వా తాడయద్వం సమేతా ”
తా-ఏమి కాల వైపరీత్యం !ఒక ఆడది నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుందా ?వెంటనే ఈ దూతను బంధించండి ”అన్నాడు .
79-‘భర్త్రా జ్ఞాప్తా స్తేన సమీయు స్సమంతాత్-దండైః కాస్టై రశ్మ భిస్తాడ యంతః –
నాచే కిన్చిత్స స్మితాస్య శ్శి వోయం -స్థాణుస్సంరంభం తదీయ౦ హిసే హె”
తా-రాక్షస భటులు ప్రభు అజ్ఞ ప్రకారం కర్రలతో రాళ్ళతో , ఆయుధాలతో శివుడి చుట్టూ చేరారు .స్థాణు వైన పరమేశ్వరుడు చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నాడు .వారి సంరంభాన్నంతటిని పురారి సహి౦చాడు .
80” ఆఘతాస్తా న్ఘాతు కానేవ జఘ్నుః-భిన్నా భిన్నా రక్త సిక్తాశ్చ పేతుః
చిత్రం చిత్రం చిత్ర మిత్యుచ్చ రంతం -నో చిత్రం సహ్యాంత రాత్మా జనానాం ”
తా-వాళ్ళు శివుడిని కొట్టే దెబ్బలు వాళ్ళనే బాధిస్తున్నాయి .ఒళ్ళు తిరిగి బ్రద్దలై ,రక్తం కారుతూ ”చిత్రం భళారే విచిత్రం ”అంటూ భరిస్తున్నారు .ఆయన అందరికి అంత రాత్మ యే కదా ”
రేపు మూలా నక్షత్రం -శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-15-కాంప్ -బాచుపల్లి -హైదరా బాద్
—
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-4
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-4
హాముల కమ్మ్యూనికేషన్ విధానం ఎలా ఉంటుంది ?
హామ్స్ కు కమ్మ్యూనికేషన్ విధానం లో గొప్ప విభిన్నత ఉంది ..ఎక్కువగా ‘’వాయిస్ ‘’ద్వారా కమ్మ్యూని కేషన్ చేస్తారు .కొందరు ఇంటర్నెట్,డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు .మరి కొందరు ఎమేచ్యూర్ టెలివిజన్ ద్వారా కూడామాట్లాడుకొంటారు .అంటే ఇందులో వాయిస్+టెక్స్ట్ +వీడియో కలిసి ఉంటాయన్నమాట .
కాల్ సైన్ అంటే ?
ప్రభుత్వ సంస్థలైన పోలీస్, మిలిటరీ,ఏవియేషన్ ,మరియు స్పేస్ వ్యవస్థలతో పాటు హామ్స్ కు కూడా తాము ఉపయోగించే రేడియో స్టేషన్ లను గుర్తించి కాల్ సైన్ ఇస్తుంది .ఇది లేకపోతె ఎవర్నీ గుర్తించటం కుదరదు .విమానం నడిపే పైలట్ కు కూడా ప్రభుత్వం కాల్ సైన్ వాడటానికి అర్హత పరీక్ష పెడుతుంది .
హాం క్లబ్ అంటే ?
యువత ప్రజోపకారం కోసం అనేక స్థానిక సమూహాలను పెట్టుకుంటారు వీటినే హాం క్లబ్ లంటారు .క్లబ్ లైసెన్స్ కు కూడా ఇరవై ఏళ్ళకు వెయ్యి రూపాయల ఫీజు మాత్రమె ఉంటుంది .ప్రతి స్కూలు కాలేజి ,లేక ఏ సంస్థ అయినా క్లబ్ లైసెన్స్ ను పొందచ్చు .హామ్స్ ,హాం క్లబ్స్ అంతర్జాతీయ సంబంధాలను (గుడ్విల్)విస్తరించటానికి ఉపయోగిస్తారు .ప్రసార నైపుణ్యం పెంపొందించుకొనే వారికి ఇదొక గొప్ప వరం .సామాజిక ఆర్ధికాభి వృద్ధికి హాం తోడ్పడుతుంది .ఎందరో హాం ప్రయోగాలవలన ఆర్ధికపుష్టి పొందారు .చాలామంది స్వంత ఇండస్ట్రి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు . మోర్స్ కోడ్ ఉపయోగమేమిటి ?
మోర్స్ కోడ్ తో హాం రేడియో లో మాట్లాడుకొనటమేకాక ప్రయోగాలు చేస్తారు .ఇప్పుడు దాని అవసరం లేకుండానే వాయిస్ ద్వారా మాట్లాడుకోవటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది .ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ,విమానాల్లో వారికి నౌకల్లోని వారికి మోర్స్ కోడ్ ద్వారా సంకేతాలు పంపుతారు .
N .I .R.అంటే ?
ఇదొక జాతీయ సంస్థ .’’నేషనల్ ఇన్ ష్టి ట్యూషన్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో “’. శ్రీ సూరి శ్రీరామ మూర్తి హైదరాబాద్ లో స్థాపించారు .ప్రపంచం లోని అన్ని దేశాల వారూ దీన్ని గుర్తించారు .ఆహ్వానించి అవార్డులూ ,రివార్డులు అందజేశారు .చా;లా మంది సభ్యత్వం పొందారు .ఇండియాలో రేడియో ఔత్సాహికులకు ఇది ఒక పెద్ద ఆదర్శ సంస్థ .ప్రపంచం లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ గుర్తించి ప్రభుత్వానికి ,ప్రజలకు ,విద్యా సంస్థలకు అందజేస్తుంది .N I r సభ్యులకు పుస్తకాలు సమాచారం ప్రత్యెక ఆపరేటింగ్ ఈవెంట్స్ అందిస్తుంది .నిరంతర విద్యా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది .హామ్స్ భారీగా ప్రయోజనం పొందే కార్యక్రమాకు రూపకల్పన చేసి అమలు చేస్తుంది .రాష్ట్ర ప్రభుత్వాలు ,సంస్థలు కొన్ని ప్రోగ్రాములకోసం యెన్ ఐ ఆర్ ను ఉపయోగిస్తారు .హామ్స్ లో’’ ముదుళ్ళు’’అంటే సీనియర్స్ ను ‘’ఎల్మేర్ (Elmer)అంటారు .మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘’www.niar .org ‘’నుంచి పొందచ్చు .
హాం గోల ఏమిటి ?
మొదట్లో వైర్లెస్ ఆపరేటర్లు సముద్రం లో ప్రయాణం చేసే నౌకలు ,లేక కోస్తా స్టేషన్ల కార్యాలయాలకోసం దీన్ని ఉపయోగించేవారు .ఆ తొలి నాళ్లలో ప్రతి స్టేషన్ ,దాని విస్తృత స్పార్క్ సిగ్నల్ లోమొత్తం స్పెక్ట్రం ఆక్రమించింది . ప్రభుత్వాలు నౌకలు ,తీర స్టేషన్లు ఔత్సాహిక ఆపరేటర్లు ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు .ఔత్సాహిక కేంద్రాలు చాలా శక్తి వంతంగా ఉండేవి. ఔత్సాహికులు వారి పనితీరుతో వాణిజ్య ఆపరేటర్లకు చెమటలు పట్టించి నిరుత్సాహం కలిగించేవారు . .ఉడుకు మొట్టు తనం తో వాళ్ళు వీళ్ళని ‘’హామ్స్ ‘’అని ఎద్దేవాగా పిలవటం మొదలెట్టారు .ఆ తర్వాత ఫ్రీ క్వెన్సి ని కనుక్కున హెర్ట్జ్ ,కరెంట్ తో ప్రయోగాలు చేసిన ఆర్మ్ స్ట్రాంగ్ ,మొదటి వైర్లెస్ స్టేషన్ వార్తలు పంపిన మార్కొని శాస్త్రజ్ఞుల పేర్ల లోని మొదటి అక్షరాలను కలిపి ‘’H A M ‘’అన్నారు అంటే ‘’ఔత్సాహిక రేడియో ఆపరేటర్లు ‘’అని పిలిచారు .మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ‘’రేడియో తరంగాల ను ఉపయోగించి ఔత్సాహికం గా పయోగాలు చేసే వారందరినీ ‘’హామ్స్ ‘’అనవచ్చు .ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇదే అర్ధాన్ని నమోదు చేసింది .
Hertz
Armstrong
Marconi
Suri Srirama Murthy
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు
’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5
’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5
61-‘’నేముం పద్భు వ్య స్తువం శ్చక్రుకర్చా –ప్రౌదక్షిణ్య ప్రక్రమేణ ప్రతేయుః
ప్రాంజల్య ద్ధా బంధ సంబద్ధ హస్తాః-సర్వేతాం విజ్ఞాపయామాసు రర్ధ్యం ‘’
తా-అందరూ ఆ దేవికి ప్రణామం చేశారు. పూజించి కొనియాడారు, ప్రదక్షిణ చేశారు .దోసిలొగ్గి ప్రార్ధనగా విన్న వించు కొన్నారు .
62-‘’స్త్రీ స్వాతంత్ర్యం నైవ శాస్త్రం సహేత-విద్యే దేవ్యం బోద్వ హస్వా నురూపం
పాల్యా ఏతే భండ మోహ ప్రముగ్దా –దేవా యేతత్కార్యమోంనిర్వహస్వ ‘’
తా-‘’వివాహం కాని స్త్రీకి స్వాతంత్ర్యం లేదు .నీకిష్టమైన వాడిని వివాహ మాడు .భండుని చేత భంగపడ్డ దేవతలకు నువ్వ్వు ఏలిక కావాలి .దేవకార్యం నువ్వే చేయాలి ‘’అన్నారు .
63-‘’ఏకీ కృత్య శ్వే ద్రుశౌ సోదపశ్యత్ –సద్యో జాతో జః పురాణస్స ఏకః
ఇచ్చా ప్రాప్త స్సోపి కామేశ్వరో భూత్-ఉద్వా హ్యైనం సా ప కామేశ్వరీత్వం ‘’
తా-ఆ దేవి రెండుకళ్ళు ఊర్ధ్వ ముఖం చేసి ‘’పుట్టుక లేనివాడు ,ఏకమేవాద్వితీయం ఐనవాడు అయిన నల దేవుడు సద్యో జాతడైనాడు .ఇచ్చ తో లభిస్తాడు .శరీర సంబంధ ఇచ్చ ఉన్నవాడు .అలాంటి సద్యోజాతుడు కామేశ్వరుడనే పేరుతొ పిలువ బడుతున్నాడు .పూర్వం కామేశ్వరీదేవి ఆయనను పెళ్ళాడి కామేశ్వరి అయింది .’’అన్నది .
64-‘’తాధ్యా మాజ్ఞప్తో సృజ స్చ్రీ పురంత –త్త్వస్టాధ్యానాత్మన్మయీ భూయ భూయః
తన్మధ్యస్త స్వాసనస్ధ స్సభర్తు –ర్వామా౦కే సా సన్ని షణ్ణా వ్యరాజత్ ‘’
తా-కామేశ్వరీ కామేశ్వరుల చేత ఆజ్ఞాపి౦పబడిన ‘’త్వష్ట ‘’శ్రీ పురాన్ని నిర్మించాడు .అక్కడ భవనం లో బ్రహ్మాసనం లో కూర్చున్న భర్త కామేశ్వరుని వామాంకం పై కామేశ్వరి కూర్చుని ప్రకాశించింది .
65-‘’ప్రాక్సర్వేశానాపి భూయోభి షిక్తా –దేవీ దేవై ర్విశ్వ విశ్వాది రాజ్యే
శ్రీ శ్రీమత్సి౦హాసనేశ్వర్యభూత్సా –పంచ బ్రహ్మా జిహ్మ మంచాది రూఢా’’
తా-పూర్వం సర్వేశ్వరి ఉన్నా కూడా ఇప్పుడు నేడు మళ్ళీ సమస్త విశ్వ సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిగా అభిషేకింప బడింది .స్వాదిస్టాన ,మణిపూరక ,అనాహత ,ఆజ్ఞా ,సహస్రార,అనే చక్రాలకు అధిదేవతలైన బ్రహ్మ విష్ణు ,రుద్రా ,ఈశాన సదాశివులు అనే మంచాన్ని అధిష్టించింది .
66-‘’శ్రీ మాతా రాజ్ఞీ మహాత్యంబికేతి-వాగ్దేవ్యస్తాం నామభి స్తుస్టు వుర్హి
కోటీ భి ర్లక్షై స్సహస్త్రై శ్శతైర్వా-శాక్తేయానాం సంవదంతీ పురాణీ’’
తా-అప్పుడు వాగ్దేవతలు ‘’శ్రీమాతా ,మహామతి ,రాజ్ఞి ,అంబిక ,అనే కోటానుకోట్ల నామాలతో కొనియాడారు .
67-‘’గాదా విజ్ఞానార్ధ మేతల్లి ఖామి –చిత్రీ కర్తుం నో కవిత్వా త్తగర్వాత్
తస్మిన్కార్యే లేఖినీ పత్ర మష్యా-దిప్రాప్తవ్యం సాధనం చాస్మి వ్రుద్ధిః’’
తా –కధకోసమే రాశాను .కవిననే గర్వం తోకాదు .అలాంటివాటికి కాగితా’’
లు సిరాలుకావాలి .ఒక వేళ వాటిని నాకు అందించినా నేను ముసలి వాడినైపోయాను .వర్ణించటానికి అలవికాని దేవికి నమస్కృతి .
68-‘’మీ మాంసా యామాత్ర కి౦చి ద్వదామి-రాజ్ఞః కామేశో మహాత్యేవ రాజ్ఞీ
ప్రస్టుం దూరే పాణిని ర్యౌవ రాజ్యే –బాలా మ౦బాం కిం పదే నాహ్వ యామః
తా-కొంచెం సందేహం వచ్చి అడుగుతున్నా .కామేశ్వరుడు రాజుకనుక ఆమె రాజ్ఞి అయింది .మహా మతి అయిన రాజ్ఞి ని మహా రాజ్ఞి అనీ పిలవవచ్చు .మరి యువతి గా అభిషిక్తమైన్దికనుక బాలాంబ ను యేమని పిలవాలి ?అవివాహిత .రాజు లేడుకనుక రాజ్ఞి కూడా కాదు .స్త్రీ కనుక రాజా అనరాదు .ఈసందేహాన్ని తీర్చమని పాణిని ని అడుగుదామంటే ఎక్కడో దూరం లో ఉన్నాడు .నేను ముసలాదడిని కనుక నేర్చి౦ది అంతా మర్చే పోయాను .పెద్దలు నన్ను క్షమించాలి .
69-‘’సందేహో త్రాష్యేష మాత శ్రుణోషి-ప్రాక్సంభూతా సాకధం స్యాత్తు బాలా
పాశ్చా జ్జాతా త్వం కదంస్యాస్త దంబా-విజ్ఞా వ్యాసొక్తిః కదం వాన్వయం తి’’
తల్లీ ! త్రిపుర సుందరీదేవీ !ఇంకో సందేహం .బహిర్యాగ కుండం లో ముందే పుడితే బాల ఎలా అవుతుంది ?అంతర్యాగ కుండం లో తర్వాత పుట్టిన నువ్వు ఆమె తల్లి ఎలా అయ్యావు ?యెంత గొప్ప పండితుడైనా వ్యాసమహర్షి ఈ చెప్పిన ఈ మాటలను ఎలా సమర్ధిస్తాడు ?
7౦-‘’తేషాం నామాన్యేవ తానీతి వాద-శ్చే ద్రాజ్య .వ్యత్యా సవాదో ర్ద వాన్కిం
ఇత్ధం మా వాదీ స్స్సకుప్యేత కృష్ణో –మైవం బ్రూయా వ్యాస హూతిస్తదర్దా ‘’
తా-బాలమ్మ ,లలితమ్మ ,అ౦బమ్మ అనే ఆమె పేర్లు సంజ్ఞా పదానికి అర్ధం ఎందుకు అనే వాదం మున్డుపుట్టింది యువరాజు మహా రాజవటం తో దీన్ని ముడి పెట్టద్దు .గీతాచార్యుడు కృష్ణుడికి కోపమొస్తుంది అనద్దు .అందుకే నమ్మా నేను ముందే చెప్పాను నీకు .వ్యాసుడిని పిలి పించు తల్లీ అని . వి న్నావు కాదు .ఆ మహర్షి పద్దెనిమిది పురాణాలు రాసి విసుక్కోకుండా అడిగిన వారందరికీ విస్తరించి చెప్పి తృప్తి పరుస్తున్నాడు .గీతా చార్యుడు 18వ అధ్యాయం లో సంగ్రహం గా చెప్పి దులిపేసుకున్నాడు .మళ్ళీ అడిగితె ఆర్జునుడిని దులిపి నట్లు నన్నూ దులిపెస్తాడేమోననే భయం వేస్తోంది ‘.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు
స్వదాదేవి ,స్వాహాదేవి ,అమ్మవారి అస్త్ర రహస్యం ,స్కందమాత -ప్రభ –
గబ్బిట దుర్గా ప్రసాద్
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4
41-‘’వక్రోక్తిభ్యో నాదరా ద్వి ప్రవృత్తే –ర్మాత్సర్యాత్సా నిర్భయా సంస సార
మిష్టం క్షారం సౌనకం వా తదాసీ –తస్యా పీష్ణ౦ విష్ణుమాయా విలాసః ‘’
తా –ఎత్తి పోడుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా విపరీత వింత ప్రవర్తనతో ఆమె వాడితో ప్రవర్తిం చింది .తీపి ,కారం ఉన్న పానకం లావిష్ణుమాయ చేత ఈ పద్ధతీ వాడికి నచ్చింది
42-‘’విజ్ఞాయాసౌ కార్య కాలం చరంతీ –తంచి క్షే పాంధౌ యదోద్దేశమేవ
శాస్త్రం శాస్త్రం నోపకుర్యా త్ప్రసక్తే –ప్రారబ్దే నీశస్య ధాతా విధాతా ‘’
తా-కావాలనే కన్య వాడిని కామపు రొంపిలో దింపి లేవ కుండా చేసింది .ప్రారబ్ధం వాడిని అసమర్దుడిని ,శస్త్ర విహీనుడిని చేసి౦ది .విధాత రాతకు తిరుగులేదు కదా.
43-‘’ఇత్ధం వృత్వా సంవ్యతీతా శ్శతాబ్ద్యః –పౌనః పున్యాత్పంచషాఆప్య విత్తాః
దేవోద్దిస్ట స్సక్రతుః ప్రాప పూర్తిం –పూర్ణానంద స్తద్గణోగ్నింపరీతః ‘’
తా-విష్ణుమాయావిలాసం తో భండుడుయుద్ధానికి వస్తూ తిరిగి ఇంటికిపోతూ ఐదారు శతాబ్దాలు గడిపేశాడు దేవతల యజ్ఞం ఈ లోపు పూర్తయింది .ఆనంద సంతోషాలతో దేవతలు ఆ పవిత్ర యాగాగ్ని ని చూస్తూ ఉన్నారు .
44-‘’అగ్నౌ తేజ స్తేజసి భ్రాజమానం –స్వారుణ్యం తస్మి న్ప్రభా భాసమానా
వ్యక్తి ర్బాలా బాలబాలా సమేతా –విశ్వా రాధ్యా సాధ్వనీ రావి రాసీత్ ‘’
తా-హోమాగ్ని కుండం లో కొత్త వెలుగు కనిపించింది .అందులో యెర్రని ఎరుపుదనం తో బాటు ఒక బాలిక ప్రౌఢ లైన కన్యల పరివారం తో ఆవిర్భవించి౦ది .అర్వణం లేకుండానే ఉపాసించ దగిన పరోక్ష బ్రహ్మ విద్య ఆమెయే .
45-‘’ప్రాదక్షణ్య ప్రక్రమేణాభిజగ్ముః-ఉచ్చైర్నాదం స౦వదంతో జయోక్తీః
భక్త్యా భువ్యస్టాంగ యోగం ప్రణేము-ర్బుద్దో ర్దిస్టాన్ స్తోత్ర పాఠాన్ప్ర పేఠుః’’
తా-దేవతలు అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ ఆదేవికి ప్రదక్షిణ చేస్తూ జయజయ ధ్వానాలు చేశారు .అందరూ భక్తితో సాష్టాంగ ప్రణామ౦ చేశారు . స్తోత్రపాఠాలు పఠించారు.
46-‘’మాతః కాసిత్వం కుతోత్ర ప్రయాతా –కార్యం కిం తే నార్య మార్యంత్వమేభిః
అస్మాం స్త్రాతుం విష్ణు నోద్దిస్ట యాగా –దావిర్భూతా చేజ్జయో జస్ర మస్తు ‘’
తా-‘’అమ్మా !నువ్వెవరు ?ఎక్కడినుండి ఇక్కడికొచ్చావు ?మాతో నీకేమైనా పని ఉందా ?మాకోసం శ్రీ మహా విష్ణువుచే పంపబడిన దేవతవా ?నీకు జయం ‘’అన్నారు .
47-‘’విద్యా మూలే హేపరోక్షా జ విద్యే –మాలా గ్రంధాభీష్ట నిర్భీతి హస్తే
సర్వా రుణ్యేఫుల్ల కల్హార సంస్థే-మాతః పాహి ప్రాణి లోకం ప్రసన్నం ‘’
తా-విద్యా మూలమైన పరోక్ష బ్రహ్మ విద్యా స్వరూపిణీ !పుస్తకం జపమాల ,వరదహస్తం ,అభయ హస్తాలతో కనిపిస్తున్న దేవీ! ఎర్రకలువ పువ్వు లో కూర్చున్న బాలా౦బా ,ఆపన్నులమైన మా ప్రాణికోటిని కాపాడు .
‘’48-‘’బాలే బాల ప్రాభవే బాధ్యమానా –నస్మాన్భండే నాను రేణారి ణాత్వం
త్రాహి త్రాహి హ్యాపదబ్దేః పరం త్వాం-పారం ప్రాప్తో విశ్వ సిత్యంత రాత్మా ‘’
తా-లోక కంటకుడైనా భండుని నుండి మమ్మల్ని కాపాడు .నిన్ను చూస్తె మమ్మల్ని తరింపజేసే నౌకలాగా ఉండివిశ్వాసం కలిగించావు .
49-‘’ఏవం రూపా దేవతా ఆహ మాతా –విష్ణుద్దిస్ట స్యాధ్వర స్యాస్మి సిద్ధిః
నాలం సాహం భండ మోహం నిహంతుం-మన్మాతా స్తే త్రాహరిష్యా మ్యహంతాం’’
తా-యాగ బాల ‘’విష్ణు సంకల్ప యజ్ఞానికి నేను సిద్ధి రూపం .అంతమాత్రాన భండుని అజ్ఞానాన్ని పూర్తిగా నశింప జేయలేని దానిని .దానికి మా అమ్మ సమర్ధురాలు .ఆమెను పిలుస్తాను ‘’అన్నది .
50-‘’ఏతత్గ్రంధం సార్ధ మద్దా పఠిత్వా-జప్త వ్యోమే మాలయా మంత్రం రాజః
అంతర్యాగం సాధయిష్యామ్యహం వ –స్తేనాశేషారిస్ట మూల ప్రహాణిః’’
తా-నా చేతిలో ఉన్న గ్రంధాన్ని అర్ధం తో కూడా బాగా చదివి జపమాలతో ఆ మంత్రాన్ని జపించాలి .దానితో అంతర్యాగ సాధన జరుగుతుంది .అప్పుడు మీకున్న సర్వ అరిస్టాలు తొలగిపోతాయి భయం లేదు నేను వరమిస్తాను .
51-‘’నోచేదంగం కర్మ కాండ కార్యాగ్ని తప్తం –యోవాకోవా నాల ముచ్చై రూపాస్తేః
త్యక్త్వో పాస్తిం సాధకో నైతి గమ్యం –తత్సర్వం వస్సాద యామ్యస్మి దేవాః’’
తా-ఈ స్తూల శరీరం కర్మకా౦డలలోని నిప్పుతో కాలకుండా ,ఆ పొగలో ఉక్కిరి బిక్కిరికాకుండా ,ఆ అగ్నిని రాజేయ కుండా ఎవరైనా ఎంతటివాడైనా జప తప ఉపాసనలకు అర్హుడు కాదు .ఉపసనే గమ్య స్థానానికి చేరుస్తుంది .ఇదంతా మీకు సాధించి పెట్ట టానికే నేనొచ్చా .
52-‘’ఇత్యుక్త్వా తాస్వాహ్ని కుండే తిశీతే –సంశుద్దాంగా న్సాధకా న్సా గృహీత్వా
ఉత్త స్థౌసా వ్యోమ్ని భూతాది చక్రం –భిత్వా౦తర్ధామా భయే నోజ్జగామ ‘’
తా-ఈ విధంగా పలికి బాల పుణ్య విశేషం తో పరిశుద్ధయై చల్లగా ఉన్న అగ్ని గుండం నుంచి ,సాధకులను దేవతలను వెంట బెట్టుకొని ఆకాశానికి యెగిరి చక్రాలన్నీ చేదించుకొని అండ పిండ బ్రహ్మాండాలు దాటి వెళ్లి పోయింది .
53-‘’బ్రహ్మా౦ డేస్మిన్ చక్ర సోపాన పంక్త్యా –తీర్త్వా మార్గం దివ్య దేశే నిషన్ణా
ధ్యాయ౦తీసోపాహ్వయ ద్దేవ మంత-స్సంస్థం సొపి ప్రాదు రాసీత్తదైవ ‘’
తా-బ్రహ్మాండాలు దాటి దివ్య ప్రదేశం లో దేవి ధ్యాన ముద్ర లో అంతర్గతుడైన దేవుని ధ్యానిస్తోంది .అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు .
54-‘’అంతర్యామీ కార్య మాహేత్య ప్రుచ్చత్ –నత్వా స్తుత్వా ప్రాదిశ త్సాపి బాలా
ఏతే దేవాః కర్మ కాండేగ్ని శుద్ధాః-కుర్వీ శైతాంశ్చిచ్చుచిం ప్రాపితవ్యాన్ ‘’
తా-ఎందుకు పిలిచావని బాలను ఆయన ఆడిగితే వినమ్రంగా స్తుతి చేసి ‘స్వామీ దేవతలంతా కర్మకా౦డాగ్ని చేత శుచులై వచ్చారు వీరికి చిదగ్నిని పొందేట్లు చేయండి ‘’
55-‘’అంతర్యాగం త్వం కురుష్వేతి నున్నః –కర్తవ్య త్వేనాన్య నిశ్చిత్య ధీరః
దీక్షా దక్ష శ్చిత్త మాజ్యం జుహావ –చిత్యా చిత్యగ్నౌ సృచా సర్వ గోసౌ ‘’
తా-బాల కోరిక తీర్చటానికి ఆయన స్వయంగా యజ్న దీక్ష పొంది చిత్త వ్రుత్తిఅనే స్రుక్కు తో ,చిత్తం అనే నెయ్యిని గ్రహించి జ్ఞానాగ్నిలో హవనం చేశాడు .ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు కనుక అది అందరి యజ్ఞం అయింది .
56-‘’చిత్యో పాత్తం చిత్తా మాజ్యం చిదగగ్నిః-స్వీ చక్రే తో యోగ ఏషో మనస్కః
నాన్య చ్చ్రవ్యం దృశ్య మన్య న్నగమ్యం-నాస్త్యే వైక శ్చిద్ఘనో చిన్నిమిత్తం ‘’
తా-చిత్తిచేత గ్రహింప బడిన చిత్తం అనే నేతిని అగ్ని గ్రహించి,తన రూపం తో కమ్మేసి ‘’అనమస్క యోగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆ స్తితిలో ఇక వినటానికి వేరొకటి లేనే లేదు .నిరంతర చిత్పదార్ధం ఒక్కటే మిగిలింది .
57-‘’చిత్యగ్నౌ మగ్నం మనో నాస్తి వాస్తీ –త్యేతత్ప్రుచ్చే త్కంక ఏతద్బ్రవీతి
ఆశ్వత్దామ్నో హాని మద్దాయ ఊచే -సప్రస్టవ్యో భారతే ధర్మ రాజః ‘’
తా-చిదగ్నిలో మగ్నం అయిన చిత్తం ఉందా పోయిందా ?దీనికి సమాధానం చెప్పాలి అంటే భారత కధలోకి వెళ్ళాలి .అశ్వత్ధామ హతః ‘’అన్నాడు ధర్మ రాజు ద్రోనణుడిని అర్జునుడు ఓడించటం కోసం .ఇందులో సత్యం ఏమిటో ధర్మ రాజునే అడగాలి .ఇక్కడ శ్వత్దామా అంటే గుర్రం లాగా పరిగెత్తే మనసు .గురువు ద్రోణుడు అడగ్గా శిష్యుడు ‘’అశ్వత్దామ అహతం కున్జరరూపమైన వ్రుత్తి హతం అయింది అని లౌక్యంగా సమాధానం .ఇది ప్రశ్నోత్తరలలాగా నడిచిన విషయం ఆని శ్రీ రాఘవ నారాయణుల మహా భాష్యం .
58-‘’యడ్దృశ్యం తత్కల్పితం వేదం ఊచు –తత్సాక్షిత్వంతత్ర సంలీన మేవ
అస్త్యే వైకః శూన్య తాయా విపక్షీ –యత్కధ్యే తా త్రాస్తి తచ్చిద్విలాసః ‘’
తా –కనిపించేదంతా కల్పితమే అంటుంది వేదం .బ్రహ్మ సాక్షిత్వం కూడా అందులోనే కలిసిపోయింది .శూన్యత్వానికి ప్రతి పక్షం గా ఒకటి ఉండనే ఉంది .ఆ దీపం దగ్గర సర్వాభావం భాసిస్తుంది ఇదే చిద్విలాసం ,సత్యం .
59-‘’తూష్ణీ కామాస్తే యదానీం సురౌఘో –దేశం కాలం భూత తత్కార్య జాతం
విస్మ్రుత్యాసీ త్సంభవంతీ చిదగ్నౌ-దృష్టా శక్తిః-కావ్య రూపా తిరూపా ‘’
తా-అలాంటి సమయం లో అన్నీ మరచి దేవతలు ఉండగా రూపం లేనిది కనుక ఒక అద్భుత శక్తి అతి లోక సుందరిగా చిదగ్ని నుండి ఆవిర్భావిస్తూ వారికి దర్శన మిచ్చింది .
60-‘’సర్వేశానా పాత యంతీ చిదగ్నౌ-దేవాంస్తానా ధ్మాత మాలిన్యచిత్తాన్
చిద్భానేనా భాతతత్వ ప్రకాశాన్ –సద్య శ్చక్రే జ్ఞాన వీర్య క్రియా ద్యాన్(dhyaan ) ‘’
తా-శక్తి స్వరూపిణి అయిన ఆసర్వేశ్వరి దేవతల్ని చిదగ్నిలో పడేసి మనోమాలిన్యాలను వదిలించి జ్ఞాన బల సంపన్నులను చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-15-ఉయ్యూరు
దోమాత్మ
దోమాత్మ
ఏదో ‘’కంపు కొట్టు ‘’కు౦టు౦డగా చటుక్కున దోమ కుట్టింది. అంతే స్పీడ్ గా చేత్తో లాగిపెట్టికోట్టా .చచ్చూరుకోకుండా ‘’దోమాత్మ ‘’ప్రత్యక్షమైంది .ఏదో కరుణశ్రీ గారి ‘’పూలబాల’’లాగా గోడు వెళ్ళ బోసు కొంటుం దనుకుంటే సతాయించటం మొదలెట్టింది .’’ఏ మయ్యా ! నీకేమైనా బుద్ధి ఉందా ? మోడీ భక్తుడి నంటావు .మాకింత అవమానం జరుగుతుంటే నీ బ్లాగ్ లో దులిపెయ్యకుండా వత్తాసు పలుకుతావా ?అని దబాయించింది .’’నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటం లేదు .ఏమిటి నీ బాధ ?’’అన్నాను .’’మాదోమల బాదే నా బాధ’’అన్నది లోకం బాధ తనబాద అన్న శ్రీ శ్రీ లాగా. ‘’నీకు మీ సంఘానికి వచ్చిన ప్రమాదం ఏమిటి ?’’ప్రశ్నించా .’’మీ మోడీ తనపనేదో తానూ చేసుకోకుండా ‘’స్వచ్చ భారత్ ‘’అనటం దానికి దేశమంతా తానా అంటే తందానా అనటం మాకేమీ నచ్చలేదు ‘’అంది .ఇదెక్కడి గొడవరా బాబూ అనుకొన్నా .’’ఇన్నేళ్ళుగా హాయిగా ఏ పోరూ పోచ్చం లేకుండా వీధుల్లో చెత్తకుప్పలమీద, మురిక్కాలవపైనా బతుకున్న మా పొట్టలు కొట్టేస్తున్నాడు .మాకు ఇక ఆవాసం ఎక్కడ ?మా తిండి సంగతేమిటి ?ఇలా అయితే మేం బతికి బట్ట కట్టే దేట్ట్టా ?’’దబాయించింది .’’మా వీధులు మేము బాగు చేసుకోవటం ,పరిసరాలు పరి శుభ్రం చేసుకోవటం తప్పా ?’’నేనూ దబాయించాను .’’తప్పు అంటా వేం .తప్పున్నర .మొనగాడిలా వచ్చి ఇన్నేళ్ళు కాంగ్రెసోళ్ళు చేయలేనిపని చేసి మాకన్యాయం చేయటం నేరంకాదా””?విరుచుకుపడింది దోమాత్మ .
‘’ఇప్పటిదాకా తేరగా కుళ్ళు ,గిళ్ళు మెక్కి తెగ బలిసి బిలియన్ బిలియన్లు గా సంతతి పెంచుకొని దేశం లో లేని జబ్బులన్నీ మాకు అంటించి ఇన్నాళ్ళు ఏడిపించారు మీ సంతానం .ఇప్పటిదాకా ‘’మమ్మేలిన వారు ‘’గుడ్డి దర్బార్ సాగించి మీకు న్యాయం ,మాకన్యాయం చేశారు .ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తాలోచనలతోముందుకెళ్ళి మీపనిపట్టి మాకు న్యాయం చేస్తోంది .మా సుఖం మేము చూసుకో వద్దా ?’’అన్నాను నేనుకూడా స్వరం పెంచి . ‘’రోడ్డు మీద ఏదో ఏడుస్తున్నారనుకొంటే’’ ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ‘’అని మరో ప్లాన్ వేసి మాకు నిలవ నీడ లేకుండా చేస్తున్నాడు మీ మోడీ .పోనీ గంగ మీద వాలి బతుకుదామంటే ‘’గంగ ప్రక్షాళన ‘’అంటున్నాడు .ఇకమాకు ఒకటే మార్గం మిగిలింది ‘’అన్నది ‘’ఏమిటో అది ‘’అన్నా .’’మీరంతా సంఘీభావం తో సమ్మె చేస్తారు ,ప్రదర్శనలు చేస్తారు కదా !మేము ‘’దోమల ధిల్లీ మార్చ్ ‘’చేసి మీ నాయకుడి మీద దాడి చేస్తాం .అక్కడే ధర్నా చేస్తాం .ప్లేకార్డ్స్ చేతుల్లో పట్టుకొని నిరసన తెలియ జేస్తాం ‘’అంది ఆత్మ విశ్వాసం తో .’’ఎందుకైనా మంచిది మీ బలమెంతో చూసుకో నీ వెనక ఎన్ని దోమలోస్తాయో ఆలోచించుకో ‘’అన్నాను .’’ఎంటయ్యో మరీ దబాయిస్తున్నావ్ –మెత్తని వాళ్ళం కదా అని పేట్రేగిపోకు ‘ఒకప్పుడు’’ దోమలగూడా ‘’ఏలిన వాళ్ళం .ఈలేస్తే కోట్లకుకోట్లు వాలిపడతారు మా దోమ దొరలు .’అంది .’’అయినా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో “’అన్నా .తిరిగి చూసుకొని మరి మాట్లాడలేదు .వెనక సైన్యంకాదు కదా దాని మొగుడో పెళ్ళామో కూడా కనిపించలా .అవాక్కైన దోమాత్మ ‘’ఇంకెక్కడి సంఘం నాయనా ! అందర్నీ మట్టుపెట్టేశారు –పూర్వం మేము కలరా మసూచికం మొదలైన వాటితో మిమ్మల్ని నంజుకు తిన్నట్లు.మీరిప్పుడు మమ్మల్ని నాకేశారు .మా రోజులు అయిపోయాయి ఇక మీవే రోజులు .ఇంతకీ నాకు స్వర్గమా నరక ప్రాప్తా ?’’అడిగింది ‘’నా చేతిలో చచ్చావ్ కనక స్వర్గమే ఫో ‘’అన్నా .అంతే స్వార్ధం చూసుకొని దోమాత్మ స్వర్గ ద్వారం దగ్గర వెయిట్ చేయటానికి వెళ్లి నట్లుంది .నాకు కనిపించలేదు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-3
హాం రేడియో ఆకర్షణ ఏమిటి?
ఏమిటి అంటే లైసెన్స్ పొందిన ఆపరేటర్లు అన్ని స్థాయిల ,అన్నిమతాల అన్నిజాతుల ,అన్ని దేశాల వాళ్ళూ ఉన్నారు .ఆడామగా భేదం లేదు .మోర్స్ కోడ్ ద్వారాలేక ఒక చేతిలో ఇమిడే మైక్రోఫోన్ కు తగిలించి HF, V H F ,UH f కమ్యూనికేషన్ పరికరం ద్వారా ఈ హామ్స్ ప్రపంచం లో ఏ మారు మూల ప్రాంతాల వారితోనైనా ఈ వైర్లెస్ రేడియో ద్వారా మాట్లాడుకొంటారు ,సందేశాలు పంపుకొంటారు .కొంతమంది ఔత్సాహికులు విద్యార్ధి దశలోనే స్వంతంగా తయారు చేసుకొన్న transponders ,transceivers ను కూడా ఉపగ్రహాలు ప్రయోగించే ISRUl లాంటి సంస్థలు స్పేస్ లోకి కూడా పంపుకొంటారు .సైన్సు ,టెక్నాలజీ స్కిల్ ఉపయోగించి ఆర్ధికంగా లాభించే ఉద్యోగాలు సంపాదిస్తారు .ప్రజా సేవ చేసిన సంతృప్తి , ,నైపుణ్యం సాధించిన అనుభూతి కలుగుతాయి .
హుద్-హూద్ భీభత్సం లో హామ్స్ చేసిన సేవ
2014 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక నగరం విశాఖ పట్నం తో సహా రెండు జిల్లాలు హుద్ హూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగతి మనకు తెలుసు .అప్పుడు పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ తో బాటు అన్ని కమ్మ్యూనికేషన్ వ్యవస్థలు పని చేయకుండా పోయాయి .నవ్యాంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ హాం ఆపరేటర్లను అర్ధించారు సహాయం చేయమని .వెంటనే స్వచ్చందంగా స్పందించి ధన ప్రాణ నష్టాన్ని హాం ఆపరేటర్లు నివారించారు .
టాం జోస్ ప్రత్యేక సేవలు
అందులో ముఖ్యంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 16ఏళ్ళ ‘’టాం జోస్ ‘’వెంటనే హైదరాబాద్ నుండి విశాఖ చేరి అక్కడ పోలీస్ కంట్రోల్ రూము లో తన హాం పెట్టుకొని అనేక పోలీస్ స్టేషన్ లలో ఉన్న హాం ఔత్సాహికులతో ఏంతో నైపుణ్యంగా పని చేసి ప్రభుత్వాధికారుల ,ప్రజల మీడియా వారి తో సహా అభిమానం ,మెప్పూ పొందాడు .కాలేజికి 7రోజులు సెలవు పెట్టి టాంస్వచ్చంద సేవ చేసి ప్రభుత్వ మన్నన పొందాడు మన దేశాంతో సహా అమెరికా ,కూడా టాం సేవలను గుర్తించి ఘనం గా సన్మానించాయి .పత్రికలూ ,టెలివిజన్ చానళ్ళు టాం సేవను ప్రస్తుతించి ప్రత్యెక వ్యాసాలూ రాసి ఇంటర్వ్యులు జరిపి ప్రసారం చేశాయి సినీ నటుడు నాగార్జున నిర్వహించిన ‘’మేము సైతం ‘’కార్య క్రమం ద్వారా’’మాస్టర్ టాంజోస్-VU3TMO ‘’ సేవలు విశ్వ వ్యాప్తంయ్యాయి .దేశ విదేశాలలోని ఎందరో ప్రముఖులు టాం పై అభినందన వర్షం కురిపించారు .
టాం,సూరి లకు అమెరికా జర్మనీలలో లో ఘన సన్మానం
టాం ను తీర్చి దిద్దినశ్రీ సూరి శ్రీరామ మూర్తి ని ,N I A Rవ్యవస్తాపకులను 2015 మే నెలలో జరిగిన అమెరికాలోని ఒహాయు రాష్ట్రం ‘’డేటన్’’పట్టణం లో జరిగిన 55వ ‘’వార్షిక హామ్స్ సమావేశం ‘’(Annual Hams vention )వారి యూత్ ఫోరం లో ప్రసంగి౦చవలసినడదిగా ఆహ్వానించారు. టాం జోస్ , శ్రీ సూరి లను 25,౦౦౦మంది హామ్స్ పాల్గొన్న సభలో ఘనంగా సత్కరించి అభినందించారు .అక్కడి అంతరిక్ష యాత్రికుడు టాంను ప్రత్యేకంగా ఆహ్వానించి విందు ఇవ్వటం చారిత్రాత్మక విషయం .వ్యోమగామిమాస్టర్ టాంతో సంభాషించి తన అనుభవాలను వివరించాడు ఈ రెండు సంఘటనలు టాం జీవితం లో మరపు రాని ఘట్టాలు .చిరస్మరణీయాలు .స్వచ్చంద సేవకు ఎంతటి గుర్తింపు లభించిందో చూశారు కదా .
జర్మనీ దేశం లోజరిగే ’’ హాం రేడియో ఈవెంట్ ‘’ లో పాల్గొన్న 17,౦౦౦ మంది హామ్స్ సమక్షం లో సూరిని టాంజోస్ లను ను మర్చి పోలేని రీతిగా సన్మానించారు. అక్కడ టాం మాట్లాడి తన అనుభవాలను తెలియ జేశాడు .ఇంటర్ మొదటి ఏడాది విద్యార్ధి టాం జోస్ 16ఏళ్ళ వయసులో అంతర్జాతీయంగా ఇంత గొప్ప గుర్తింపు పొంది , సన్మానింప బడటం ఊహించలేని విషయం కదా .అలాగే హాం వ్యవస్థాపక నిర్వాహకులైన శ్రీమతి భారతి VU 2 R B I ,శ్రీమతి యామిని VU 2 Yam,శ్రీ రాం మోహన్ సూరి VU 2 M Y H ,కుమారి భానుమతి VU2BLవగైరా’’ హాం కుటుంబం అంటే సూరి కుటుంబం’’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది .
బహుమతి భారతి
శ్రీమతి భారతి ప్రపంచం లోని అయిదు లక్షల హామ్స్ తో ఇంట్లో ఉన్న హాం రేడియో ద్వారా అనేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నారు NI A Rనిర్వహించే కార్యక్రమాలలో భాగస్వామిని అవుతున్నారు .ఆడవారి ప్రత్యెక వింగ్ (ఫిమేల్ హామ్స్ )లో భారతి మొదటి రాంక్ లో ఉన్నారు .దీనివలన ఆమె అనేక దేశాలలోపర్యటించారు , సన్మానాలు అందుకొన్నారు .భారత రాష్ట్రపతి ,ప్రధాని తో సహా పలు సంస్థలు ఆమెని సత్కరించాయి .ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే –భారతి తెలుగుమీడియం లోనే బి ఎస్ సి డిగ్రీ ,బి ఎడ్ చదివారు . చిన్న వయసులోనే హాం లైసెన్స్ పొంది రెండు మూడేళ్ళలోనే ప్రపంచం లోని హామ్స్ తో మాట్లాడగలిగారు .ఆధునిక టెక్నాలజీ స్కిల్స్ ను ఆమె సాధించి అందరినీ ఆశ్చర్య పరచారు .డిజిటల్ టెలివిజన్ ,సాటి లైట్ టెక్నాలజీ లో కూడా అనుభం సాధించి ,ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అనేక దేశాలలో జరిగే హాం ఈవెంట్ లలో పాల్గొని మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న మహిళా మాణిక్యం శ్రీమతి భారతి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
.
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3
24-నార్యోదీరా దుర్బలా భీర వశ్చ-క్వాస్తే భోగో భీత భీతాను తాను
తస్మాద్దేయం నో భయం భీతి హేతో –ర్వాచ్య స్మాకం వర్తి తవ్యం యువాభ్యాం ‘’
తా-ధైర్యం లేని ,బలహీనులు ,భయపడే ఆడవాళ్ళ తో భోగం ఆనందం ఇవ్వదు.కనుక మా భయం పోగొట్టే ట్లు అభయ మివ్వాలి .మామాటకు కట్టుబడాలి .మేము ఒద్దన్నదాన్ని చేయరాదు ‘’
25-‘’యుష్మత్పాల్యే యుష్మ దంగే ప్రభుత్వం -దత్వా తూష్ణీం స్థేయమద్ధా భవాద్భ్యాం
ఇత్యాదిం తాభ్యాం వరౌఘం గృహీత్వా –నాగా వత్తే తద్గ్రుహేషు ప్రవిస్టే’’
తా-మీ రాజ్యాలమీద ,మీ స్త్రీల పైనా మాకు అధికారం ఇచ్చి మీరు సుఖం పొందండి .మాటతప్పరాదు ‘’అనే షరతులు పెట్టగా మూర్ఖ రాక్షసులు డూడూ బసవన్నల్లాగా తలలూపి ఒప్పుకొనగా కన్యలు వాళ్ళ ఇళ్ళకు చేరారు .
26-‘’రాజా మంత్రీ రాగ వంతౌ ప్రియాభ్యాం –సంబద్ధౌ నో పశ్యత స్స్మాం గణ౦ వా
ఉద్యోగిభ్యో దర్శనం భాషణం వా –దూరా పాంతంహంతహంతేశ మాయా ‘’
తా-ఇలా విష్ణు మాయలో పడి కన్నెల కౌగిలి చెరసాలలో బందీలై రాజు మంత్రీ అన్నిపనులూ వదిలేసి అనుక్షణం రతి కార్యం లోనే నిమగ్నులయ్యారు .
27-ఇత్ధం భూతే దైవ యోగా ద్వ్యతీతా –దుర్విజ్నేయా పంచ శత్యబ్ద కానాం
దేవా నిర్బాదా యజ౦తి స్మ యాగం –హృస్టిం పుష్టిం తుష్టి మా సాధ్య సద్యః ‘’
తా-ఈ కామకేళీ విలాసం 500ఏళ్ళు నిరంతరంగా సాగింది .దేవతలు ఈ రాక్షస బాధ లేకుండా యాగం చేస్తున్నారు .యాగ ఫలంగా సంతోషం శారీరక బలం పొందారు .
28-దంతీం ద్రాణాం వా ఘటా మ్ముక్ఛ టావా-తామిశ్రాణాం వా తతిర్వహ్ని కుండాత్
దూమాలి ర్బ్రహ్మండ మా వ్రుణ్వతీ త్వా –భండాస్యా౦తర్గేహమాప్యావవార ‘’
తా-ఏనుగు మందల్లా ,మబ్బుల గు౦పుల్లా ,చీకటి ప్రోవుల్లా హోమ ధూమ స్తోమం బయల్దేరి బ్రహ్మా౦డమంతా వ్యాపించి భండాసురుని అంతః పురం ప్రవేశించింది .
29కేయం మాయే త్యానూ రేశేన పృస్టో-భీతః కశ్చిన్మంత్రి పుత్రో బభాషే
హిమే శైలే సర్ష యో దివ్య వర్గా –ఇస్టిం కుర్వం త్యేషతద్వాహ్ని కేతుః’’
తా-ఇదేం మాయ అని భండాసురుడు అడిగితె ఒక మంత్రికొడుకు హిమాలయం లో మునులతో కలిసి దేవతలు యజ్ఞం చేస్తున్నారని ,యాగాగ్నిని సూచించే ధ్వజమె ఈ పొగ అని చెప్పాడు .
30-శ్రుణ్వన్నేవం సోట్ట హాసం చ కార –హస్తే హస్తం నిష్పి పేషా రుణాక్షః
ఆహ్వా తవ్యామంత్రిణిస్సైని కాంశ్చ-యామీ దానీం నాశ హేతో రరీణాం’’
తా-ఆ మాటలు విన్న వాడు విపరీతపు నవ్వునవ్వి చప్పట్లు కొట్టి కనులెర్రబడగా మంత్రి సైనికాదులనుసమాయత్త పరచి శత్రు నాశనం చేస్తానుఅని బీరాలు పలికాడు . .
31-సంరబ్ధంతం చేత్ద మా భాష మాణం-సర్వాంణ్యంగా న్యాస్ప్రుశం తీశమాయా
సర్వో పాయై ససాద యంతీ స్వమర్ధం –నోయా తవ్యం భీత భీతే త్ద మూచే ‘’
తా-మహా అటో పం తో యుద్ధానికి బయల్దేరిన వాడిని మాయాకన్య భయం నటిస్తూ వెళ్ళవద్దన్నది .
32-‘’నో భేతవ్యం ఘాస కల్పా న్సురేశాన్ –నిష్పిష్యా గంతాస్మి దేవి క్షణేన
నోనో జేతాస్యాంభువీ త్యూచి వా౦సం-ప్రత్యూచే సాసామయ౦ స్మార యంతీ’’
తా-భయపడద్దు . గడ్డిపరకల్లాంటి దేవతల్ని పిండి చేసి క్షణం లో వచ్చేస్తా .ఈభూమ్మీద మమ్మల్ని జయి౦ చేవాడేవ్వడూ లేడు (అజేతా అంటే మమ్మల్ని’’ జయించని వాడు ఉండడు’’-అని మరో అర్ధం ).అని ధైర్యం చెప్పాడు .ఎడబాటును సహించ నట్లునటిస్తూ ఆమె బాధతో
33-‘’ఆద్యే సంగే సంగరో యో భవన్నౌ –విస్మర్తవ్యో నైవ రాజం స్త్వయాద్య
సత్యం నిత్యం సేవితవ్యం తదర్ధం –నస్టౌ విష్ణోస్తౌ మధుః కైటభశ్చ’’
తా-మన మొదటి పొందులో చేసిన వాగ్దానం మరచిపోవద్దు .అసత్యం ఆడటం వలననే మధు కైటభులు విష్ణువు చేతిలో చచ్చారు .
34-‘’కిం కిం వేత్దం వాదినీం తామతీత్య –ప్రాణాపాయే సంగరః కస్త వేతి
సాకం షడ్భిస్సంబలై స్స ప్రతస్థే-భేరీ భాంభా మారవై ర్దిగ్వి భేదం ‘’
తా- నా ప్రాణాల మీదకొస్తే నీ సంగరం(ప్రతిజ్ఞ ) ఏమిటి అని చీత్కరించి ఆరు రకాల సైన్యాలతో యుద్ధానికి బయల్దేరాడు .
35-చాపే బాణోవా ప్రయాతో త్రయాతః –కిం వక్తవ్యం యజ్వనా మంతరాదిం
ఆవ్రుణ్వ న్యజ్నప్రదేశం నిరాశం కాంస్యోవప్రః కస్చిదావిర్బ భూవ’’
తా-బాణం లాగా రివ్వున యజ్న భూమి చేరాడు .దేవతలకు నోటమాట రాలేదు .అప్పుడు యజ్న ప్రదేశం చుట్టూ ఆకాశం దాకా ఒక కంచు కోట ఏర్పడి కాపాడుతోంది .
36-నో బద్ధం నోన్యస్త మేనం నిరీక్ష్య –ప్రాకారం ధైర్యం సమాపుస్సురే౦ద్రాః
రాక్షస్సైన్యం భీత భీతం దదర్శ –భండో భాండం వా పదా హో జఘాన.’’
తా-పెట్టకుండా కట్టకుండా అప్పటికప్పుడేర్పడిన కంచు కోటను చూసి దేవతలు మహర్షులు ఊరట చెంది సంతోషంగా ఉన్నారు .రాక్షసులు కంగారుతో కకావికలైతే ,భండుడు కాలితో కోటను ఒక తన్ను తన్నాడు .
37-తత్పాదా హత్యా విశీర్ణ స్ససాల -శ్చూర్నీ భూతో భూమి మేవ ప్రపేదే
తస్మిన్దేశే హో బతాన్యః ప్రాభూతః –ప్రాదుర్భూతః పూర్వ వత్కా౦స్య సాలః ‘
తా-వాడికాలి తన్నుతో బ్రద్దలై ముక్కలై పొడి పొడి అయిన కోట క్షణం లో అంతకంటే బలీయంగా మళ్ళీ ఏర్పడింది .
38-భగ్నస్సోపి ప్రాదురాశీ త్తదన్య –స్సోపి ధ్వస్త స్తత్పర స్సద్య ఉత్దః
ఇత్ధం భండ శ్చండ విక్రాంతి రుచ్చ్చై-ర్జాతం జాతం తచ్చతం సంబ భంజ ‘’
తా-వీడు కూల్చేయటం,దాని స్థానం లో మరో కోట మొలవటం ఇట్లా నూరు కోట్ల కోటలు కూలటం మళ్ళీ ఏర్పడటం జరిగింది .
39-‘’హీనోత్సాహో హ్రీణఉచ్చైర్విరావం –కుర్వన్నూచే ధీర వద్దైత్య వీరః
భో భో దేవా ఇష్టి మిస్త్వా సమిస్ట్యా-మా గచ్చద్వం వః కృతిం శ్వో బ్రవీమి ‘’
తా-దమ్ము తగ్గిన దానవుడు సిగ్గుపడి అయినా పౌరుషం చావక వికార చేష్టలతో ‘’మీ ఇష్టం వచ్చినట్లు యాగం ఏడవండి .,అప్పుడు నా మీదకు రండి .రేపు మీపని పడతాను ‘’అన్నాడు .
40-‘’ఇత్యాక్రోశ న్సన్నివృత్తః స్వకీయై –స్సాకం స్వంకం కంపయ న్సత్కిరీటం
ప్రాపద్గేహం కామినీ కామ కామా –క్రా౦త స్వాన్తస్చేతన శ్చాప్య నీశః’’
తా-ఆక్రోశం తో అట్టహాసం చేస్తూ సైన్యం తో మన్మధోద్రేకం తో ఇంటి దారి పట్టాడు భండాసురుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు
కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల
కపోతానికి శరణిచ్చి డేగ కు శరీరమాంసాన్ని కోసిచ్చిన శిబి కపోతేశ్వరుడైన –చేజెర్ల
శిబీ ,దధీచి మొదలైన దాన కర్ణులకు త్యాగమూర్తులకు నిలయం భారత వర్షం .వీరి త్యాగాలు అజరామరమై నిలిచాయి .అలాంటి శిబి చక్రవర్తి త్యాగ గాధ జరిగిన చోటే చేజెర్ల .గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం లో చేజెర్ల గ్రామం ఉంది .నరసరావు పేటకు పదిహేను కిలోమీటర్లు .ఇక్కడ స్వయంభు గా వెలసిన శ్రీ కపోతేశ్వర స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది .
చారిత్రిక నేపధ్యం
కపోతేశ్వర ఆలయం క్రీ శ .3,లేక 4శతాబ్దాలలో నిర్మించాబదినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి .కుబ్జ విష్ణు వర్ధనుడి పాలనలో చేజెర్ల ప్రసిద్ధ నగరంగా వర్ధిల్లింది .ఆలయం లో క్రీ శ 1140,1247సంవత్సరాలలో రాయబడిన శాసనాల నాధారంగా చేజెర్ల పేరు –చేరుం జర్ల ,చేంజర్ల , చేజెర్ల గా ఉంది .శాసనాలు పాళీ ,సంస్కృత ,తెలుగు లలో ఉన్నాయి . ఆలయ విశిష్టతలు
కపోతేశ్వరాలయం ‘’గుడిసె ఆకారం ‘’లో ఉండటం ఒక విశిష్టత .ప్రధాన దేవాలయం ‘’హస్తి పుష్టి ‘’ఆకారం లో ఉండి,ఇసుక ,సున్నం తో కట్టబడింది .గర్భాలయం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండటం మరో ప్రత్యేకత .ముఖ భాగాలపై ఉన్న శిల్పాలు అరుదైనవి .మనదేశం లో హస్తి పుష్టి ఆకారం లో ఉన్న అరుదదైన దేవాలయాలలో ఇది ఒకటి .హస్తి పుష్టి విమానం తో నిర్మించబడిన ఏకైక దేవాలయం ఇదొక్కటే. అదీ దీని మరో గొప్ప ప్రాముఖ్యత .షోలాపూర్ దగ్గర టెక్కలి లో ఉన్న త్రివిక్రమ దేవాలయం కపోతేశ్వరాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం .ఆలయ ఈశాన్య భాగం లో వేదికమీద ఆరడుడుగుల ఎత్తున వశిష్టమైన ‘దశ సహస్ర లింగా కృతి ‘’ఉండటం వింతలలో వింత .నైరుతిలో సప్త మాత్రుకల విగ్రహాలు ,,దక్షిణాన మల్లికాంబ పుష్కరిణి ,పడమర వైపు చెరువులు ఉంటాయి ..పురాతన ఆలయం లో ఏడు ప్రాకారాలు ఉండేవి .అవి శిధిలమై ప్రస్తుతం రెండే ప్రాకారాలున్నాయి .కపోతేశ్వరాలయం అంటే కోటి న్నోక్క లింగాలు ,శాసనాలు ,బౌద్ధ ఆరామ విశేషాలు ఉన్న ప్రాంతం .
కపోతేశ్వర స్వామి చరిత్ర
కాశ్మీర దేశాన్ని శిబి చక్రవర్తి పెద్ద తమ్ముడు మేఘాడంబరుడు ,రెండో తమ్ముడు జీమూత వాహనుడు తీర్ధ యాత్ర చేస్తూ చేరు౦జెర్ల వచ్చి పర్వత గుహలో తపస్సు చేస్తూ శివ సన్నిధానంఅంటే లింగాకృతిపొంది దేహ త్యాగం చేశారట .ఈ విషయం తెలుసుకొన్న శిబి చక్రవర్తి తల్లి అనుమతిపొంది చేజర్లలో ‘’శత యజ్న దీక్ష ‘’ప్రారంభించాడు . శిబి చక్రవర్తి మాంధాత మహా రాజు కుమారుడు .యయాతి మహారాజు మనవడు అని మహా భారతం చెబుతోంది .
శిబి కి సత్య లోక ప్రాప్తి కలిగించటానికి ముందు ఆయన దాన శీలతను పరీక్షించాలని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంకల్పింఛి ఇక్కడి ‘’రూపెన గుంట్ల’’లో రూపాలను మార్చుకొన్నారు .విష్ణు మూర్తి కపోతం (పావురం )గా ,బ్రహ్మ’’ డేగ’’ గా(బాణం )గా ,ఈ శ్వరుడు’’ కిరాతకుని’’గా మారారు .కిరాత శివుడు పావురం వేటలో బాణం సంధిస్తే గాయపడ్డ పావురం ‘’కుంకల గుంట’’అనే ప్రదేశం లో పడింది .దేవతలు విడిది చేసిన ప్రదేశాన్ని ‘’విప్పర్ల ‘’అంటారు .పావురం చేరిన ప్రదేశాన్ని ‘’చేజెర్ల ‘’అనిప్రసిద్ధికెక్కాయి .కుంటుకుంటూ గాయపడిన కపోతం శిబి చక్రవర్తి పాదాల చెంతకు చేరి శరణుకోరి ప్రాణభిక్ష పెట్టమని వేడింది .శిబి అభయమిచ్చాడు .పావురాన్ని తరుముకుంటూ వచ్చిన కిరాతుడు అక్కడికి చేరి పావురం తనది అని ఇచ్చేయ్యమని అడిగాడు . తాను శరణు ఇచ్చానని కావాలంటే పావురం బరువుతో సరి తూగే తన శరీరం లో మాంసం ఇస్తానన్నాడు ..కిరాత శివుడు ,సరే నన్నాడు .త్రాసు తెప్పించి పావురాన్ని అందులో పెట్టించి శిబి తన శరీరం లోని మాంసాన్ని కోసి త్రాసులో వేసి తూస్తాడు ఎంతమాంసం కోసి వేసినా పావురం బరువుకు సరిపోవటం లేదు .ఆశ్చర్య పోయాడు శిబి చక్ర వర్తి .చివరికి తన తల నరికి త్రాసులో వేయబోతుంటే త్రిమూర్తులు ప్రత్యక్షమై అతని దానశీలతను పరీక్షించటానికి ఇదంతా చేశామని తెలియ జేసి అతని త్యాగానికి మెచ్చి వరం కోరుకో మంటారు .శిబి తాను శివునిలో ఐక్యం కావాలని కోరతాడు .తదాస్తు అన్నారు ముగ్గురు మూర్తులు .అప్పటి నుండి ఈ క్షేత్రం కపోతేశ్వర స్వామి క్షేత్రమైంది .శిబి చక్ర వర్తి లింగా కారం పొంది శివునిలో ఐక్యమై తన పరివారాన్ని కూడా లింగాలుగా మార్చమని కోరాడు .అనుగ్రహించి పరమేశ్వరుడు వారందరినీ కోటి లింగాలుగా మార్చాడు .కపోతాన్ని రక్షించి శిబి చక్ర వర్తి లింగాకృతి పొందిన లింగానికి ‘’కపోతేశ్వర లింగం ‘’అనే పేరొచ్చింది .కనుక స్వయంభు కపోతేశ్వర లింగమైంది . ఈ ప్రదేశాన్ని ‘’కపోత కందర పురం ‘’అనీ పిలుస్తారు. నాలుగవ శతాబ్దం లో కుబ్జ విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని ఆంద్ర దేశాన్నిపాలించాడు .ఈ వంశ రాజు ‘కంద రాజు ‘’శిధిలా వస్తలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్రలో ఉంది .కపోత కుందరపురమే ఇప్పుడు మనం పిలుస్తున్న చేజెర్ల అయింది .డేగకు మాంసం కోసిచ్చాడనీ కొన్ని చోట్ల ఉంది .బ్రహ్మ శివుని శరం రూపం లో వచ్చాడని కూడా ఉంది డేగ రూపం లో వచ్చాడని వేరొక చోట ఉంది ..చేజెర్ల గొప్ప బౌద్ధ క్షేత్రం కూడా .అందుకే యాత్రికుల రద్దీ ఎక్కువ
కపోతేశ్వర లింగం ప్రత్యేకత
శిబి చక్రవర్తి శరీరమే లింగా కారం దాల్చిందని చెప్పుకున్నాం .శిబి శరీర మాంసాన్ని కోసిన దాఖలాలుగా లింగం అంతా పెద్ద పెద్ద గాట్లు కనిపిస్తాయి .అంటే సిబి శరీరమంస ఖండాలు కోయబడిన ప్రదేశాలన్నమాట ఇవి .శిబి తలను ఖండించుకోన్నాడని మనం చెప్పుకున్నాం .దీనికి ఆధారం గా లింగం పై భాగాల రెండు పెద్ద రంధ్రాలు లోతుగా కనిపిస్తాయి .ఒక రంధ్రం లో నుండి స్వామికి చేసిన అభిషేకజలం బయటికి ఎక్కడికో వెళ్లి పోతుంది .ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవరూ కని పెట్ట లేక పోతున్నారు .రెండవ రంధ్రం ద్వారా పచ్చిమాంసం రక్తం వాసన ఇప్పటికీ వస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది .అందువలన ఈ కపోతేశ్వర లింగం మహా మహిమాన్వితమైనదని భావిస్తారు . కపోతేశ్వరాలయం లో శివరాత్రి ని మహా వైభవంగా నిర్వహిస్తారు.తప్పక అందరూ దర్శించాల్సిన పుణ్య క్షేత్రం చేజెర్ల .అవకాశాన్ని చేజార్చుకో వద్దు .శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి తరిద్దాం .
ఆధారం –గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కాలేజిప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి తో రెండు నెలలక్రితం శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి ద్వారా పరిచయ భాగ్యం కలిగింది. అప్పటినుంచి ఫోన్ లో తరచుగా పలకరించుకొంటున్నాం .నా మూడవ గీర్వాణానికి నేనుకోరిన కవుల గ్రంధాలు ,వివరాలు అందజేశారు .వారు స్వయంగా మహా కవులు గొప్ప కవితా ధార వారిది .చంద వోలు కు చెందినబ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారలు రచించిన ‘’శ్రీ రామ కదామృతం’’గ్రంధం పై సమగ్ర పరిశోధన చేసి ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి పి.హెచ్ డి పొందారు .’’రామాయణం –సమాజ దర్పణం ‘’అనే రెండుభాగాల గ్రంధం ,శ్రీ రామ వాణి,వాల్మీకి వాణి,హనుమద్వాణి మొదలైన గ్రంధాలు రాశారు .
ఇవి కాక ముఖ్యంగా శ్రీ రాజ రాజేశ్వరీ శతకం ,శ్రీ వీరాంజనేయ శతకం ,శ్రీసత్యనారాయణ శతకం ,శ్రీ త్రికూటేశ్వర శతకం రాశారు .
చేజెర్ల వెళ్లి శ్రీ కపోతేశ్వర స్వామి ని దర్శించి ,అక్కడి రిటైర్డ్ మండల రెవిన్యు అధికారి శ్రీ దొడ్లేటి సత్యనారాయణ ,గ్రామస్తుల కోరికపై శ్రీ కపోతేశ్వర శతకం రాసి సార్ధకత తెచ్చారు .ఈ వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం అని మనవి చేస్తున్నాను. అందులో నుంచి ఒక పద్యం –
‘’కరుణాన్తః కరణుండునాన్ శిబి పరీక్షం జేయ ,నింద్రాగ్నులన్ –సురలె పావుర మౌచు ,డేగ యగుచున్ ,జూపట్టి రందాది ,మున్
శరణంచున్ దన జేర వచ్చిన ప్రదేశంబిద్ది ,చేజెర్ల యై –వరలెన్ ,రేడు ప్రతిష్ట జేసి నిను ,దేవా ! శ్రీ కపోతేశ్వరా’’
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –14-10-15-ఉయ్యూరు
.
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2
14-భ్రాస్ట్రే న్యంతం బీజ మేవా భవద్ది-భండాధీనం లోకజాలం నతాత్
సామ్నా రక్షే త్క్లేదయిత్వా య ఏత –న్నో పశ్యామ న్తం సమర్ధం త్వదన్యం ‘’
తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపోయాయి .వాడి పీడ తొలగించి లోకాలను కాపాడే వాడు నువ్వు తప్ప వేరెవరూ కనిపించలేదు’’అన్నాడు నారదుడు .
15-‘’స్వామిన్పశ్య న్యంతరా చింతయే త్వా—కర్తవ్యమ్ స్యా దత్రకిం సంవిధానం
నాహం జానే క్వాపి లోకామయ౦ ప్రా –గిత్ధం హాజీ వంశ్చ కాలం విశాలం ‘’
తా-మనసులో ఆలోచిస్తున్నావా ,కళ్ళతో ఆలోచిస్తున్నావా ?తక్షణ కర్తవ్యమ్ ఏమిటి ?నేను చిరంజీవిగా ఉన్నా ఇంతటి ఘోరం పూర్వం ఎప్పుడూ చూడలేదు .
16-‘’ఇత్ధం వాచా శోచమానం మహర్షిం –ప్రేక్ష ప్రాహ ప్రస్తుతం లోక నాదః
దుస్టస్యా స్యోన్మూలనే స్యాదుపాయో-యస్తం వక్ష్యే సాధనీయ సత్వయైషః’’
తా-లోకబాదను తన బాధగా చెప్పిన నారదుని చూసి ‘’వాడిని చంపే విధానం వివరంగా చెబుతాను .విని ఆ ప్రకారం నువ్వే కద నడిపించాలి ‘’అన్నాడు హరి .
17-‘’కల్పం దాస్యా మ్యేక మేతేన దేవైః-కార్యో యాగ స్సత్వయా యాజ్ని కేన
చత్వారింశ ద్యోజనం కుండ మేకం –ఖాత్వా సమ్యచ్చైల రాజస్య సానో ‘’
తా-‘’ఒక కల్ప గ్రంధాన్ని నీకిస్తా .నువ్వ్వు అధ్వర్యుడివి గా ఉందడి దానిలో చెప్పబడిన ప్రకారం ,దేవతల చేత హిమాలయ సానువు మీద నలభై ఆమడల కుండం నిర్మించి విధి విధానంగా ఒక యాగం చేయించు ..
18-‘’జీవానాం తూష్ణీం స్థితిం బాధ తేయ –సోఢా కస్మా త్సప్త తంతు ప్రవృత్తిం
మాశంక స్త్వైవం మయా భ్యూ హితం తత్ –మాయా మయ్యౌ ద్వే సృజామ్యద్య కన్యే ‘’
తా-వాడు ఆటంకం కలిగిస్తే దేవతలు ఏం చేయగలరనే అనుమానం వద్దు .నేను విరుగుడుగా ఇద్దరు మాయావిను లైన కన్యల్ని సృష్టిస్తాను .
19-‘’మంత్రీ రాజా ద్వౌ తయో ర్మోహ మగ్నౌ –యస్మిన్కాలే సాధ్యతే యాగ యేషః
యాగ త్రాణ ప్రాణితం యజ్వ లోకం –విఘ్నం కృత్వా బాధితుం కస్సమర్ధః ‘’
తా-భండుడు,వాడి మంత్రి మోహ పరవశం తో కామం కైపెక్కి ఒళ్ళు తెలీకుండా ప్రవర్తించే టప్పుడు ఈ యాగ విశేషం నెరవేరుతుంది .సత్సంకల్పం తో ప్రారంభమైన ఈ యాగము వల్ల కలిగే రక్షణ ఆపటానికి ఎవరి సాధ్యమూకాదు .ప్రయత్నాలన్నీ క్రమంగా ఫలిస్తాయి .
20-‘’ఇత్యుక్త్వాతం ప్రాహిణో ద్దేవ తేజ్యా –సాకల్యార్ధం సృస్టవాన్ కన్యకే ద్వే
బోద్ధవ్యం యద్బోధ యిత్వా తయోస్స-ద్విడ్వశ్యార్దే ప్రేషయామాస సద్యః ‘’
తా –దేవతలు చేసే ఈ యజ్ఞానికి ఒప్పించి నారదుడిని విష్ణువు పంపాడు .అప్పుడే ఇద్దరు కన్యల్ని సృష్టించాడు .వారెం చేయాలో వివరించి పంపేశాడు .
21-‘’ప్రారబ్ధశ్శై లస్యమూర్ధ్న్యధ్వరోహం-దేవై ర్మౌనీ౦ ద్రై ర్యదోక్తం విరాజా
తన్మాయా మయ్యౌచ గత్వా కుమార్యౌ –భండోద్యానే గాతు ముచ్చైః ప్రవృత్తే ‘’
తా-విరాట్ పురుషుడైన విష్ణు మూర్తి ఆజ్ఞప్రకారం నారద ,దేవతలు హిమాలయం పై క్రతువు ప్రారంభించారు .విష్ణు మాయతో పుట్టిన ఇద్దరు కన్యలు భండాసుర వనం లో సుమధురంగా సంగీతం పాడుతున్నారు ..
22-‘’విష్ణో ర్మాయా వాగురాం భ్రుత్య దిస్టాం-అజ్ఞాత్వా తౌమార్గ యంతౌ మృగీవత్
గత్వా తస్యాం పేత తుర్దైవ యోగాత్ –ద్వౌ ద్వౌ పాణీ అగ్రహిస్టాం వినస్టై’’
తా-రాక్షరాజు ,మంత్రి ఈ వార్తను సేవకుల వలన విని విష్ణు మాయ అని తెలీక మొహం పట్టలేక కన్య లుండే చోటుకు వెళ్లి చెరొకరు వాళ్ళ చేతుల్ని పట్టుకొన్నారు .
23-‘’మామా మేమే త్యుచ్య మానౌచ తాభ్యాం –మేమే మేమే మేషవ ద్భాష మాణౌ
స్యాతాం భూతా విష్ణవ చ్చా స్వతంత్రౌ –దత్వా దేయా న్యర్ధ మానాం స్తదిస్టాన్ ‘’
తా-వద్దు వద్దు అని కన్యలు వారిస్తున్నా ఇదినాది ఇది నాది అని పోటీ పడుతూ మేకల్లా అరుస్తూ వాళ్ళు అడిగే ఇయ్యకూడని వారాల నన్నిటి ఇచ్చేసి దెయ్యం పట్ట్టిన వాళ్ళు లాగా బలవంతులైనా అస్వతంత్రులైపోయారు వారి చేతుల బందీలలో .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )-2
హామ్స్ గా మారటం ఎలా ?
ఔత్సాహిక రేడియో ఆపరేటర్లుగా అంటే హామ్స్ గా అన్నిరంగాల వారు ఉన్నారు .సామాన్యుల దగ్గరనుండి లాయర్లు ,ఇంజనీర్లు డాక్టర్లు ,సైంటిస్ట్ లు ,పైలట్లు ,పోలిటీ షియన్లు ,ఆస్ట్రోనాట్స్,రాజులు మంత్రులు కూడా హాం సభ్యులే .వీరందరూ యువకులుగా ఉన్నప్పుడే హాం గా లైసెన్స్ పొందుతారు .ముందే చెప్పినట్లు 12 ఏళ్ళు దాటినవారెవరైనా టెలికం డిపార్ట్ మెంట్ వారి ప్రభుత్వసాధారణ ‘’ అమెచ్యూర్ స్టేషన్ ఆపరేటర్ పరీక్ష’’ రాసిఆపరేటర్ లైసెన్స్ పొందవచ్చు .అమెరికా ,జపాన్ మొదలైన కొన్ని దేశాలలో 12 ఏళ్ళ లోపు వారికీ హామ్స్ లైసెన్స్ పొందే అవకాశం కల్పిస్తున్నారు .అమెరికా వెళ్ళాలనుకొనే యువకులకు ఇండియాలోనే ఈ పరీక్ష నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు .
హామ్స్ చేసేపనేమిటి ?
హామ్స్ ఏదో కాలక్షేపం కోసం అవతలి వారితో హాం చేస్తూ అంటే’’ సుత్తి కొట్టు’’ కుంటూకూర్చోరు .ప్రజా ప్రయోజనాలకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలను కనిపెట్టి ఉపయోగం లోకి తెస్తారు .రిసీవర్లు ,యా౦ టేన్నాలలో కొన్ని టెస్ట్ పరికరాలు ,ఆపరేటింగ్ సూత్రాలు కనుక్కొంటారు .సాధారణ ప్రాధమిక జ్ఞానం పె౦పొంది౦చు కొంటారు .ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నిక్ కోసం ప్రయత్నాలు చేస్తారు. తమ అనుభవాలను ఇతరులతో పంచుకొంటారు .దీనితో విప్లవాత్మమైన మార్పులకు అవకాశాలు కల్పిస్తారు .సాఫ్ట్ వేర్ ,హార్డ్ వేర్ లలో ప్రయోగాలు చేసి అభి వృద్ధికి బాటలు వేస్తారు .అంటే ఒక సైంటిస్ట్ చేసే పనులన్నీ చేస్తాడు .అలా తన గౌరవాన్ని పెంచుకొంటాడు
హామ్స్ కున్న గుర్తి౦పేమిటి ?ఖర్చు మాటేమిటి ?ఫ్రీక్వెంసి ఎవరిస్తారు ?
గుంపులో గోవింద లాగా హామ్స్ ఉండరు .వారికొక ప్రత్యెక గుర్తింపు అంటే ఐడెంటిటి ఉంటుంది .ఆపరేటర్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత ప్రభుత్వంనుండి లైసెన్స్ తో బాటు ఒక గుర్తింపు సంఖ్య(కాల్ సైన్ )పొందుతారు .ఉదాహరణకు ‘’vu2My ‘’.అనేదానిలో’’ vu ‘’ అనేది మన ఇండియాకు గుర్తింపు .’’2’’అనేది ఏ గ్రేడ్ లో లైసెన్స్ పొందారో లేక దేశం లోని ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియ జేస్తుంది .’’My’’అనేది పేరు ను తెలియ జేస్తుంది ఇక్కడ సూరి శ్రీరామ మూర్తి పేరును తెలియ జేస్తోంది అన్నమాట .దీన్ని బట్టి హాం ఏదేశం వాడో ఏ గ్రేడ్ వాడోలేక ఆదేశం లో ఏ ప్రాంతం వాడో ,అతని పేరేమిటో తెల్సిపోతుంది అవతలి హాం మిత్రుడికి .ఇదీ హాం గుర్తింపు కోడ్.
ప్రపంచం లోని 30లక్షలమంది హామ్స్ లో సరాసరి ఇంట్లో ను౦చి కాని, హాం క్లబ్ ను౦డి కాని ,హాయిగా కారులో ప్రయాణం చేస్తూకాని మాట్లాడుకోవచ్చు .దీనికోసం టాక్ టైం అంటూ ఉండదు .పైసా కూడా ఎవరికీ డబ్బు చేల్లి౦చక్కర లేదు .ఒక సారి పరికరాన్ని తయారు చేసుకున్నా ,కొనుక్కుని పెట్టుకున్నాఆ పైన ఖర్చేమీ ఉండదు .లైసెన్స్ ఫీజు కూడా గవర్నమెంట్ 20ఏళ్ళకు 1,000-అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమె .అంటే ఏడాదికి యాభై రూపాయలే .లైసెన్స్ (asol)ను పరీక్ష పాసైన వారికే ఇస్తారు .పరీక్ష పాసవటం మహా తేలిక .కొద్దిగా టెక్నికల్ పరిజ్ఞానం ఉంటె పాసై పోయినట్లే పెద్దగా కస్టపడనక్కర లేదు .
హం లైసెన్స్ తో బాటు ఆపరేటర్ల కోసం ప్రభుత్వం రిజర్వ్ చేయబడిన ఫ్రీక్వెంసి (పౌనః పున్యం)ని ఉపయోగించటానికి ఉచితంగా కేటా ఇస్తారు .దీన్ని వాడుకొని ఉపయోగించుకోవటమే .చూశారా యెంత తేలికగా ఉందో విధానమంతా ? హాయ్ గా జాయ్ గా హాం కావాలని అని పిస్తోందా?అని పిస్తుంది అంతటి ఎట్రాక్షన్ ఉంది దీనికి .మిగిలిన వివరాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )
ఎమెచ్యూర్ రేడియో (హాం రేడియో )
చాలామందికి చాలా రకాల హాబీలుంటాయి .స్టాంప్ కలెక్షన్ ,నాణాలసేకరణ ఫోటోగ్రఫీ వగైరా .కాని వీటికి మించినదేమైనా ఉందా అనే ఆలోచన కొద్ది మందికే వస్తుంది .మన హాబీ సరదాకోసమే అయినా దాని వలన పరమ ప్రయోజనం కూడా ఉంటె అది చరితార్ధమవుతుంది .అప్పుడు కాలక్షేపమే కాదు ఆపదలో ఉన్న వారికి సహాయపడగలం అనే ధైర్య స్తైర్యాలు కలిగి సేవ చేశామనే సంతృప్తి వచ్చి మనసు ఆనందమయం అవుతుంది .ఏడాదిక్రితం విశాఖను అల్లల్లాడించిన హుద్ హూద్ తుఫాను భీభత్సం లో రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు మొదట్లో ఏమి చేయాలో పాలుకాక ఒక వాలంటరీ సంస్థను అర్ధిస్తే ఆ బృందం వెంటనే వెళ్లి పని ప్రారంభించి ఏంతో సేవ చేసింది .సేవ ఆటే శవాల్ని చేరవేయటమో అన్నం పొట్లాలు అందజేయటం వంటివి కావు. తుఫాను ఉద్ధృతి ,ఏవైపుకు వెడుతోంది ఎవరు ఎలా జాగ్రత్తపడాలి అనేవిషయాలను ప్రభుత్వానికి సలహాలిచ్చి మరింతమానవ హననం జరుగకుండా కాపాడింది .దీనినే ‘’హాం రేడియో సర్వీస్ ‘’లేక ఎమచ్యూర్ రేడియో ‘’అంటారు .ఇలాంటి విపత్కర పరిస్తితులలోనేకాదు హాయిగా ఇంట్లోకూచుని ప్రపంచ దేశాలలోని ఎందరెందరో ప్రధానులను రాస్త్రపతులను ,సైంటిస్ట్ లను సినీ స్టార్లను వారికి మనకు ఉన్న తీరిక వేళల్లో పలకరించ వచ్చు .వారి తో మన అభిప్రాయాలని పంచుకో వచ్చు .పూర్వం వచ్చిన దివిసీమ ఉప్పెనలో అంటార్కిటికా ఎక్స్ పెడిషన్ ,కేదార్ నాద్ వద్ద జరిగిన జలప్రళయం లో హాం రేడియో చేసిన కృషి అనితర సాధ్యమైంది. ప్రభుత్వాల మన్ననలు పొందింది .పని చేసిన హాం లకు ఎన్నో విలువైన బహుమతుల౦దు కొన్నారు .ఇదొక ‘’హాబీక్లబ్’’ .ఇందులో చేరటానికి అర్హత మన వయసు 12సంవత్సరాలు దాటటం మాత్రమె .విద్యార్హతా ఎంతున్నా ఏ ఉద్యోగం లో ఉన్నా ఉద్యోగం లేక పోయినా ఏహోదాలో పని చేస్తున్నా అందరూ దీనిలో సభ్యులు కావచ్చు .ఇది విశ్వవ్యాప్తమైన వాలంటరీ సంస్థ .
మనదేశం లో దీన్ని మొట్ట మొదట ప్రారంభించిన వాడు మా ఉయ్యూరు వాడు శ్రీ సూరి శ్రీరామ మూర్తి .మాతో బాటు హైస్కూల్ లో చదివిన మా జూనియర్ ,మా తమ్ముడి క్లాస్మేట్ .రెండు మార్కులు లెక్కల్లో తగ్గి ఎస్ ఎస్ సి తప్పినవాడు .తర్వాత పాసై డిఫెన్స్ లో చేరి మెట్ సెక్షన్ లో పని చేసి రిటైర్ అయి హాం రేడియో స్థాపించాడు .దీనితో అతనికిమాజీప్రధానులు ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గార్లతో అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .వారి ప్రోత్సాహం తో హైదరాబాద్ లో హాం రేడియో వ్యవస్తను స్థాపించి అప్పటి నుంచి కృషి చేస్తున్నాడు .అతనిభార్య కొడుకు ,మరదలు అందరూ అందులో పని చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత మైనారు .సూరి శ్రీరామ మూర్తి అనే పేరు పోయి ‘’హాం సూరి ‘’అయ్యాడు .అబ్దుల్ కలాం తో జోర్డాన్ రాజుతో ,అమెరికా ప్రెసిడెంట్ లతో హాం ద్వారా దగ్గరయ్యాడు .ఎందరో ఔత్సాహికులకు శిక్షణ నిచ్చి తీర్చి దిద్దాడు .ప్రతి ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ వ్యాప్త హాం ల సమావేశం లో పాల్గొంటాడు ఈ ఏడాది మే నెలలో కాలిఫోర్నియా లో జరిగిన సమావేశం లో సూరిని ఆసియా దేశ ప్రతిన్దిగా ఘనం గా సన్మానించారు .అతనిభార్యకూ అనేక సన్మానాలు జరిగాయి ఇద్దరూ ప్రపంచం లో ఎన్నో దేశాలు సందర్శించి హాం వ్యాప్తికి తోడ్పడ్డారు .మొన్న ఆది ,సోమవారాల్లోసూరి మా ఇంటికి వచ్చి చాలా సేపు ఈ విషయాలన్నీ చెప్పాడు .హాం ను ప్రతి స్కూల్, కాలేజిలో విద్యార్ధులకు నేర్పాలనే ఆశయ౦ అతనిది .అందుకని దాని కి సంబంధించిన పూర్తీ వివరాలు నాకు అందించాడు .నేను మీకు సరసభారతి ద్వారా ఈ రోజు నుండి ధారావాహిక గా అందజేస్తున్నాను .మన ఆకాశ వాణి ‘’బహుజన హితాయ –బహు జన సుఖాయ ‘’అనే ఆశయం తో పని చేస్తుంది .హాం ఆశయమూ అదే.
ఎమేచ్యూర్ రేడియో అంటే ?
ఎమచ్యూర్ అంటే ఔత్సాహికులు అన్నమాట .దీనికి కావలసింది ఉత్సాహం .ఉత్సాహం ఉన్న వారంతా ఔత్చాహికులే .ఈఎమచ్యూర్ రేడియోలను ఉపయోగించే వారిని అంటే ఆపరేటర్ లను’’హాంలు ‘’అంటారు .హాం అంటే సుత్తి అని సుత్తి వీరభద్ర రావు జంధ్యాల గుర్తుకు రానక్కరలేదు వీళ్ళు అందులో వీరభద్రరావు లాగా ‘’హామ్మర్ ‘’లు కాదు. కనుక కంగారక్కర్లేదు .హాం ను ఆపరేట్ చేసేవారిని హాం లు అంటారు అంటే హామ్మర్ అని అనరాదు .హామ్స్ అందరూ వైర్లెస్ తో పని చేస్తారు మరి దీనికి పంపే సాధనం ‘’వైర్లెస్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిటర్ ‘’,గ్రహించే సాధనం అంటే రిసీవర్ ఉంటాయి కదా .ఆ రెండిటితో హాం లు పని చేస్తారు .ట్రాన్స్ మిటర్ను ఎవరికి వారు స్వంతంగా తయారు చేసుకోవచ్చు .మన రేడియోనే రిసీవర్ గా వాడుకో వచ్చు చూశారా యెంత సింపుల్ గా ఉందొ వ్యవస్థ ?ఇదికాదనుకొంటే ‘’ట్రాన్స్మిటర్+రిసీవర్ గా ఉండేదాన్ని (ట్రాన్సీవర్)ను బజార్లో కొనుక్కో వచ్చు .ఇలా స్వంత రేడియో,త్రాన్స్మిటర్ వ్యవస్థను ఇంట్లోనే ఏర్పాటు చేసు కొని వాటితో మన దేశం లోను ,ఇతర దేశాలలోను ఉన్న 30 లక్షల మంది హాం లతో తీరుబడి ఉన్న సమయాలలో మాట్లాడుకోవటం ఒక హాబీ .హాం రేడియో వాడుకోవటానికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందాలి .చాలామందికి ఇది అత్యవసర సమయాలలో సేవ చేయటానికి (సర్వీస్ )ఒక సాధనమౌతుంది .హాం లకు ఉత్సాహమే ఊపిరి .తీరిక వేళల్లో ఒక గొప్ప హాబీ .ఈ అందమైన అభిరుచి కోసం కొంచెం ఖర్చు పెట్టాలి అంతే.హాం రేడియో ఏర్పరచుకొని హాం క్లబ్ లో సభ్యులైతే ఎందరందరో ప్రముఖులతో మాట్లాడుకోవచ్చు .సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ,కలాం వీరందరూ హాములే . (హామ్స్ ) .మిగిలిన విషయాలు ఈ సారి .
సశేషం
నవరాత్రి శుభా కాంక్షలతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు







