వీక్షకులు
- 1,159,074 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ బేతబోలు రామబ్రహ్మం గారి “దేవీ భాగవతం బేతవోలు వారి సృజనాత్మక చాతుర్యం” పై శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం ఈరోజు(10-6-26) ఉదయం 7:20 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైనది. శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ బాబాయ్ గారికి శుభాకాంక్షలు, వందనాలు . ధన్యవాదములుతో…పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
- అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్ ,ఉడ్రోవిల్సన్ ఫెలోషిప్ ఆవార్డ్ గ్రహీత –శ్రీమతి గీతా గోపీనాథ్-(మహిళామణులు ) -గబ్బిట దుర్గాప్రసాద్
- హెచ్. డబ్ల్యూ. మాస్సింగ్హామ్(త్రివేణి)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.29 వ భాగం.8.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి. కల్పవృక్ష వా గ్వై భవం.2 వ భాగం.8.6.26.
- బద్ర్ (పూర్ణ చంద్) దిట్టమైన అచ్చతెనుగు కవితా పేటిక ‘’ నిట్ట’’
- కర్ణాటక జానపద గీతాలు(త్రివేణి)
- రావణుడు కొట్టిన శక్తి బాణం దెబ్బలకు లక్ష్మణుడు మూర్చపోతే ,రావణుడు చేతులతో లేపే ప్రయత్నం చేశాడా ?
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.28 వ భాగం.7.6.36.
- ముక్కు తిమ్మన పారిజాతాపహరణం కావ్యం.1 వ భాగం.7.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,102)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్
సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్
వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి
మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో ,పలుకుబడి ,అభ్యుదయ భావాలున్న నెహ్రూ కుటుంబ సభ్యురాలుగా పెరిగింది .ఆమె తండ్రి లాడ్లీ ప్రసాద్ జట్షి మోతీలాల్ నెహ్రూ కు మేనల్లుడు .ఆమె తల్లి ఫెమినిస్ట్ .మహిళా క్లబ్ లను నిర్వహిస్తూ దానధర్మాలలో ప్రసిద్ధి చెందింది .తల్లి లాహోర్ లోని య౦గ్ వుమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ .(వై .డబ్ల్యు .సి. ఏ.)లో సాయం తరగతులకు సైకిల్ మీద వెళ్ళేది .ఆ కాలంలో ఇండియాలో ఏ స్త్రీకూడా సైకిల్ తోక్కేదికాదు .ఈమెయే లాహోర్ లో ధైర్య సాహసాలతో సైకిల్ తొక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ .తనకూతురు సఘాల్ ను కూడా సైకిల్ తొక్కటమే కాదు, గుర్రపు స్వారీ కూడా చేయమని ప్రోత్సహించేది .తన నలుగురు కుమార్తెలను ఉన్నత విద్య నేర్వమని హితవు చెప్పింది .సఘాల్ లాహోర్ లో హిస్టరీ లో 1929లో ఏం. ఏ. పాసైంది .
మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ పిలుపు నివ్వగానే సఘాల్ బహిరంగ సభలలో మాట్లాడి జనాన్ని ఉత్తేజ పరచి ఉద్యమ భాగ స్వాములను చేసేది .తల్లి ఇద్దరుసోదరిలతో సహా 1930-32కాలం లో తీవ్రమైన ఉద్యమాలు నడిపి కాలనీ ప్రభుత్వం పై ప్రజాగ్రహాన్ని నిరూపించింది .ఆమె చేబట్టిన ఆందోళనలు ఎప్పుడూ అహింసా యుతంగానే శాంతియుతంగానే ఉండేవి .చట్ట ధిక్కారం ఉండేదికాదు .1935లో కాంగ్రెస్ కు చెందిన ఒక మహిళా విద్యాలయం ప్రిన్సిపాల్ గాబీహార్ రాష్ట్రం లో పని చేసింది .అక్కడ అనేక సంస్కరణలు అమలు పరచింది .వయసుమళ్ళినవిద్యార్ధినులకు ఫిజికల్ ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించింది .దీన్నిఆడపిల్లల కుటుంబాలు వ్యతిరేకించాయి . .
సఘాల్ 1935లో వివాహం చేసుకొని బొంబాయ్ వెళ్లి అక్కడ మహిళా కార్యక్రమాలలో పాల్గొన్నది .1947లో భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలి రోజుల్లో ఆహార కొరత తీవ్రంగా ఉండేది .అప్పుడామే అఖిలభారతమహిళా కేంద్ర ఆహార సంస్థ సభ్యురాలైంది .బియ్యం ,గోధుమలకు తీవ్ర కొరతగా ఉన్న ఆకాలం లో ఢిల్లీ లో ఒక కాంటీన్ నిర్వహించి గోధుమ బియ్యం లేకుండా మిగిలిన ఆహారపదార్ధాలతో ఆహారం అందజేసేది .భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇండియా పాకిస్తాన్ విభజన వలన పాకిస్తాన్ నుంచి వలసవచ్చిన వేలాది శరణార్ధులను ఆదుకొనే బృహత్తర కార్య క్రమం మీద వేసుకొంది.భారత ప్రభుత్వ పునరావాస శాఖలో నెలకు ఒకే ఒక్క రూపాయి జీత౦ మాత్రమే తీసుకొంటూ ఆదర్శం గా అందులో సేవలందించింది సఘాల్ .వచ్చిన మహిళలకు ,పిల్లలకు ఆశ్రయాలు నెలకొల్పి సహాయం అందించింది .
పాకిస్తాన్ నుండి ఉద్యోగాలు కోల్పోయి వచ్చిన శరణార్ధుల మనుగడకోసం వారికి అప్పులు ఇప్పించటం లోను ,వారికి ఆర్ధిక సాయం చేయటం లో చొరవ చూపింది . వారు స్టిరపడి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని జీవి౦చేదాకా సహాయం కొనసాగించింది .తర్వాత ఇండియన్ వుమెన్స్ క్రాఫ్ట్ సొసైటీ ప్రెసిడెంట్ అయింది .మంత్రివర్గం నుండి 1954లో రాజీనామా చేసి మరింతగా సంక్షేమ కార్య క్రమాలలో పాల్గొన్నది .
1952ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది .ఇక శక్తి యుక్తులన్నిటి ని కార్మిక సంఘాల వ్యవస్థీకరణ కోసమే వినియోగించింది .ఉత్తర భారత రైల్వే ఉద్యోగ సంఘానికి చైర్ పర్సన్ అయింది .మత్స కారుల సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .రక్షణ మంత్రిత్వ శాఖ లోవర్ డివిజన్ క్లార్క్స్ యూనియన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది .కార్మికులు ఉండే ప్రదేశాలలో మంచి సౌకర్యాలను కలిగించటానికి ,అక్కడ పారిశుధ్యాన్ని మెరుగు పరచటానికి శక్తి యుక్తులు ధార పోసిన ధీర సేవా మహిళ సఘాల్ .వారి కాలనీలలో రక్షిత మంచి నీటి సరఫరా చేయించింది .అధిక రుణాలతో ఇబ్బందిపడే కార్మికులకు ఉదారం గా అప్పులు మంజూరు చేయించేది .సాంఘిక సంక్షేమ పునరావాస దైరెక్ట రేట్ కు గౌరవ డైరెక్టర్ గా నియమింప బడింది .ఈ పదవులన్నీ ఆమె చేసిన సేవలకు ప్రతిఫలాలుగా వచ్చినవే పైరవీలతో పొందినవికావు .
1973లో ఢిల్లీ ‘’నేషనల్ ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ వుమెన్ ‘’ లో చేరి గృహ హి౦స లకు పాల్పడిన భార్యలను కావాలని అగ్నికి ఆహుతి చేయబడిన స్త్రీలను సంరక్షించే కార్యక్రమం లో చురుకుగా పాల్గొన్నది . భార్తలచే బహిష్కృతులైన భార్య పిల్లల పాలిటి ఆపద్బాందవి అయింది .వారు స్వయం ఉపాధి పై జీవించ టానికి సహాయ పడింది .ఆర్ధిక౦గా ఆసరా నిచ్చింది .’’ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ‘’(భారత శిశు సంక్షేమ శాఖ )లోపనిచేసి ,వారి ఉన్నతవిద్యాభ్యాసానికి అన్నివిధాలా సహకరించింది .వారిని దత్తత తీసుకొని బాధ్యతగా పెంచుకొనే వారిని గుర్తించి అ ఆపిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది .వారికోసం1950లో ‘’ఆర్య అనాధాలయం ‘స్థాపించి పోషకురాలుగా ఉంది .అందులో 600 మందికి ఆశ్రయం కలిపించిన వదాన్యురాలు .
ఢిల్లీలోని కామన్ వెల్త్ వుమెన్స్ అసోసియేషన్ లో 45ఏళ్ళు వైవిధ్యమైన సేవలను అందించింది .ఢిల్లీ కుటుంబ నియంత్రణ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా తొమ్మిదేళ్ళు ఉన్నది .’’ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ‘’ప్రెసిడెంట్ గా సఘాల్ విశేష సేవలు అందజేసింది .1990లో ఢిల్లీ లో వర్కింగ్ మెన్ హాస్టల్ నిర్మాణ పర్య వేక్షణ చేసింది .బహువిధ సేవాకార్యక్రమాలలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్న సఘాల్ 85ఏళ్ళు జీవించి 1944 లో మరణించింది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్
నిష్కపట యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట ఆయన ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన జీవితచరిత్రను లివింగ్ ఏజ్ ప్రచురించింది .అప్పటికి ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవించే ఉన్నాడు .తన చరిత్ర ‘’పోస్ట్ మార్టెం ఎస్టిమేట్ ‘’అని చెప్పుకొన్నాడు .అందులో మొదటి పేరా లో ‘’నిన్నమధ్యాహ్నమే గుండె జబ్బుతో97వ ఏట చనిపోయిన హెచ్ జి వెల్స్ పేరు ,యువత తో సాన్నిహిత్యం కలిగి ఉంటుంది .మధ్య వయస్కుల జ్ఞాపకాలు ఈ శతాబ్దపు ప్రారంభాన్ని ,ఆయన రాసిన పుస్తకాలను వాటి పేర్లను గుర్తుంచుకొంటారు .అతని రచనలను మననం చేసు కొంటారు . చాలా పుస్తకాలు రాశాడు .విలువైన విమర్శ గ్రంధాలు రాశాడు .తనపై గ్రందాలెన్నో వచ్చాయి సాహిత్యాకాశం లో మిలమిల మెరిసే తార .తనను తాను రోజర్ బేకన్ తో పోల్చుకోవటం భేషజమే .అతని మూలాలు సాధారణమైనవే .తండ్రి ఒక తోటమాలి .తర్వాత చిన్న దుకాణానికి యజమాని మాత్రమేకాక క్రికెట్ ప్లేయర్ .అతని తల్లి ఒక ఇన్ కీపర్ కూతురు .పెళ్ళికాక ముందు సర్వెంట్ మెయిడ్ .వెల్స్ లు ఎప్పుడూ ఈ సాంఘిక నిమ్నతను గురించి ఆలోచి౦చలేదు .కొత్తప్రపంచం లో స్వేచ్చా పౌరుడు .అతను లిబరల్ డెమొక్రాట్ .ఆలోచించే,విమర్శించే ,చర్చించే అనంత స్వేచ్చ హక్కూ ఉన్నవాడు .సోషలిస్ట్ .వర్గ జాతీయతలఆధిపత్యానికి వ్యతిరేకి ‘’ అని రాసుకొన్నాడు వెల్స్.ఇదీ అతని ప్రత్యేకత .
ముగ్గురుసోదరులలోచిన్నవాడైన హెర్బర్ట్ జార్జి వెల్ల్స్21-11-1866లో కెంట్ లోని బ్రామ్లీ లో పుట్టాడు .తన పుట్టుక లోని నిమ్నాస్తాయిని గూర్చి ఆలోచించలేదు అంతే కాదు కింది మధ్యతరగతి జనం విషయం కూడా ఆయనకు పట్టేదికాదు.పుట్టుకతో వచ్చిన’’ కాక్నీ ఉచ్చారణ ‘’మాత్రం మర్చి పోలేదు .చనిపోయే ముందు ‘’I may be scientific aristocrat ,but I am no gentleman ‘’అని నిర్భయం గా చెప్పాడు .’’బార్టీ’’అనే ముద్దు పేరున్న వెల్స్ ప్రాధమిక విద్య పెద్దగా లేదు .అతి పేదకుటుంబం కనుక చదువుకొనే స్తోమత లేదు ఇది అతన్ని జీవితాంతం బాధించింది .తండ్రి దుకాణం లో సహాయం చేస్తూ ఉండచ్చునను కొన్నాడు .కాని విధి వశాత్తు ఎనిమిదో ఏట కాలు విరిగింది .విశ్రాంతి తీసుకొంటూ ఆరోగ్యాన్ని చక్క బరుచు కొంటూ దొరికిన పుస్తకాలన్నీఆబగా చదివాడు .డికెన్స్ ,వాషింగ్టన్ ఇర్వింగ్ ,రచనలు ఆపోసన పట్టాడు .కాని స్కాట్ నవలలు బోర్ కొట్టించాయి. అయినా ష్కాట్ నవలలు ‘’మర్మియాన్ ‘,ది లేడీ ఆఫ్ ది లేక్’’మొత్తం కంఠస్తం చేశాడు .గడగడా అప్ప చెప్పేవాడు .
చదివే అలవాటే తనకు గొప్ప రక్షణ నిచ్చిన్దన్నాడు .13వ ఏట ఒక కెమిస్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .కొంతకాలం బట్టల కొట్లో ఉన్నాడు .పనులు చేస్తూ ఖాళీ సమయాలలో క్లాసులకు వెడుతూ 15వ ఏట మిడ్ హర్స్ట్ గ్రామర్ స్కూల్ లో’’ డోర్ కీపర్;;గా చేస్తూ చదువు కొన సాగించాడు .18వ ఏట లండన్ లోని సౌత్ కేన్నిన్ టన్ లోఉన్న కాలేజ్ ఆఫ్ సైన్స్ లో చేరటానికి స్కాలర్షిప్ ఆఫర్ పొందాడు .అక్కడ ప్రపంచ ప్రసిద్ధ బయాలజిస్ట్ థామస్ హుక్స్లీ వద్ద నిద్య నేర్చాడు .ఖాళీ సమయాలలో వెనక బడిన విద్యార్ధుల అసైన్ మెంట్లు చేసి డబ్బు సంపాదించేవాడు .టీచర్ గా పని చేయటానికి సిద్ధ పడ్డాడు .21వయసులో లండన్ యూని వర్సిటి నుంచి డిగ్రీ చేతికొచ్చింది .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నంతకాలం ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు .చాలినంత తినటం అసలు ఉండేదేకాదు .గుంటకళ్ళు ,పాలిపోయిన ముఖం ఎముకల పోగుగా అప్పుడు ఉండేవాడు వెల్స్.తర్వాత మనం చూసే వెల్స్ ఫోటోలకు ఆనాటి వెల్స్ ఫోటోలకు హస్తి మశకాంతర భేదం ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
30-ఏలేశ్వరపు గోపాల
ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –
‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా కటాక్ష సరణిర్మా౦ పాతు సా సతతం ‘’
కవిని ఇతర కవులు పొగిడి ఈ కావ్యాన్ని రాయమని కోరిన శ్లోకం –
‘’మీనాక్షీ వరలబ్ద దివ్య కవితా ధారా సుధా రాశింస౦ -భూతా గణ్య మహా ప్రచండ రచనా పాండిత్య సర్వంకషం
శ్రేస్టే జైమిని భారతే సురుచిరం పర్వాశ్వ మేధం మహా –కావ్యం త్వం కురు గద్య పద్య మయమిత్సేతే ప్రహృష్టా ధియః ‘’
ఈ శ్లోకాలలో కవి బహు గ్రంధ కర్త అని ధారా శుద్ధి కలకవి అని తెలుస్తుంది .కాని యుదిష్టిర చంపు తప్ప ఏదీ లభ్యం కాలేదు కవి చేసిన హస్తినాపుర వర్ణన –
‘’ఆస్తి శ్రీ భారతాన్వవాయ జనుషాంరాజ్ఞాం జ్వలత్సేజసం –సంపజ్జాలా వినిర్జితా మరపురీ శ్రీ హస్తి నాఖ్య పురీ .
చివరలో ఉన్న శ్లోకం –
‘’మైలో రత్నమయం కిరీటమమలం పార్శ్వేనుజాతన్యదా –చిత్తే భూత దయాం కరే వితరణం బాహో ప్రతాపశ్రియం
జిహ్వాగ్రే హరి కీర్తనం విరచయన్ ధర్మాత్మ జాతో ముహుః-సా మోదేనసహాత్యుతేనశకలం గోపాయతి స్మశ్రితిం ‘’
తన వంశ చరిత్రను చివర్లో చెప్పుకోన్నాడుకవి .
‘’శ్రీమత్స్కౌశిక గోత్ర పావన మహా ఏలేశ్వరా ఖ్యాన్వయ-మ్భో జా హస్కరతేజస్య కవి సుత శ్రీ సుబ్బయాదీ౦దునా
శ్రీ మద్వేంకట శబ్దపూర్వ విలసల్లక్ష్మాంబికా గర్భాస –ద్రత్నే నేదమ కారీ చంపు కవినా గోపాల నామ్నా ముదా ‘’
గోపాలకవి పుట్టిన చోటు ,కాలం తెలియదు .ఏలేశ్వర పు వారు ప్రసిద్ధ బ్రాహ్మణులు ఏలేశ్వరం పవిత్ర క్షేత్రం కూడా .అందులో ఏలేశ్వరోపాధ్యాయులు గొప్ప సంప్రదాయ విద్యా వేత్త .సూక్తి వారధి రాసిన పెద్దిభట్ట కూడా ఇక్కడివాడే.నల్గ్గొండ జిల్లా కృష్ణానదీ తీర నివాసులు ఏలేశ్వరపు వారు .
31శ్రీ రంగ నాధ ప్రబంధ కర్త –ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య (1889-1928)
దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య2-6- 1889లో కోదండ రామ స్వామి సీతమ్మ దంపతులకు జన్మించాడు .పుట్టిన మూడవరోజు తల్లిని ,మూడవ ఏట తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతుడు .పినతండ్రి నాయనమ్మల దగ్గర కూచి పూడి గుంటూరు లలో చదివాడు..హైస్కూల్ చదువులోనే ‘’జాతీయ నాట్య మండలి ‘’స్థాపించి సగీత నాటక కార్యక్రమాలు చేసేవాడు .చదువు పై శ్రద్ధ తగ్గి మెట్రిక్ తప్పి బాపట్ల లో చేరి పాసైనాడు . రాజకీయ దురంధరుడు రామ భక్తుడు,సాహసి నిక్కచ్చిమనిషి . .హరితస గోత్రం .1906 వరకు గుంటూరులో చదివాడు .కాలేజి విద్యార్ధిగా ఉండగానే బాలగంగాధర తిలక్ అరవిందుల ప్రభావానికి లోనయ్యాడు నడింపల్లి నరసింహా రావు అనే స్నేహితుని సాయం తో .ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్ బర్గ్ లో 1911-16వరకు అయిదేళ్ళు చదివి ఏం ఏ డిగ్రీ పొందాడు .అక్కడ ఉండగానే ప్రముఖ శిల్పి వేదాంతి చిత్రకారుడు ఆనంద కుమార స్వామితో పరిచయమైంది .ఆయన శిష్యరికం లో తనను తానూ తీర్చి దిద్దుకొన్నాడు గోపాల క్రిష్నయ్య .నందికేశ్వరుడు రాసిన ‘’అభినయ దర్పణం’’ను ఆనందకుమార స్వామితో కలిసి ‘’ది మిర్రర్ ఆఫ్ గెస్చర్’’పేరుతొ ఇంగ్లీష్ లోకి అనువదించాడు .ఇది కేంబ్రిడ్జి –హార్వర్డ్ యూని వర్సిటీ ప్రచురితం .ఇండియా తిరిగి వచ్చి రాజమండ్రి ట్రెయింగ్ కాలేజి లో 1917నుండి ఒక ఏడాది లెక్చరర్ గా పని చేశాడు .తర్వాత 1918-19కాలం లో బందరు జాతీయ కళాశాలలో విద్య నేర్పాడు .ఎక్కువ కాలం ఇక్కడ ఉండకుండా చీరాల పేరాల దగ్గర ‘’ఆంద్ర విద్యా పీఠ గోష్టి’’అనే విద్యా సంస్థను స్థాపించాడు .గాంధీ మహాత్ముని పిలుపు నందుకొని స్వాతంత్ర్య ఉద్యమం లో చేరాడు .ప్రజలకు నచ్చ చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం లో భాగస్వాములను చేశాడు .భారత జాతీయోద్యమ నాయకులలో ముఖ్యుడైనాడు .ఉద్యమాలలో అరెస్ట్ అయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు .’’శ్రీ రామ దండు ‘’అనే ‘’ఆధ్యాత్మిక జాతీయ స్వచ్చంద దళాన్ని’’ తయారు చేశాడు.ఆనాటి కాంగ్రెస్ సభలకు వీరే రక్షక భటులు .జైలు నుండి విడుదలకాగానే సాంఘిక సంస్కరణ లకు శ్రీకారం చుట్టాడు .గోపాల క్రిష్నయ్య మహా వక్త .ఆంగ్లాన్ద్రాలలో అనర్గళంగా మాట్లాడే నేర్పున్నవాడు. నాగస్వరానికి పాములు పరవశమైనట్లు గోపాల క్రిష్నయ్య గారి ఉపన్యాసానికి జనం ముగ్దులయ్యేవారు .వేలాది జనం పాల్గొన్న సభలలో ఆయన కంచు కంఠం తో జనాలను ఉత్తేజ పరచేవాడు కర్తవ్య బోధ చేసేవాడు .జానపద కళా రూపాలఉద్ధరణకు గ్రంధాలయోద్యమానికి విశేష కృషి చేశాడు .ఆయన ప్రోత్సహించిన జానపద కళారీతులు –తోలుబొమ్మలాటలు ,జముకుల కద ,బుర్ర కద ,వీధినాటకాలు సాము గరిడీలు ,గొల్లకలాపం బుట్టబొమ్మలు ,కీలుగుర్రాలు ,నాటకాలు ,గోసంగి గురవయ్యలు ,సరదాకద ,కిన్నెర కద కొమ్ము బూర జోడు మద్దెల ,పల్లె సుద్దులు తూర్పు భాగోతం ,చుట్టుకాముడు ,పిచ్చుక కుంటల కద ,సాధనా శూరులు ,పల్నాటి వీరులు మొదలైనవెన్నో .
ఆంగ్ల ప్రభుత్వం చీరలా పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు వ్యతిరేకించి పెద్ద ఉద్యమం నడిపాడు .ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వా దృష్టికి తెచ్చాడు.. ఆయన చేసిన చీరాల పేరాల పోరాటం చిరస్మరణీయం .
గోపాల క్రిష్నయ్య సర్వోత్క్రుస్టకవి, దేశభక్తుడు ,సంస్కర్త విమర్శకుడు . .గీర్వాణ ఆంధ్రాలలో గోపాలకృష్ణయ్య రాసిన కవిత్వం ఆయన పాండిత్యానికి మచ్చుతునకలు .’’సమకాలీనులలో మహా జీనియస్ ‘’అన్నాడు ఆయన్ను కట్టమంచి రామ చంద్రా రెడ్డి .1921లో గుంటూరు సభలో గోపాల క్రిష్ణయ్యకు ‘’ఆంద్ర రత్న ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .దురదృష్ట వశాత్తు 40ఏళ్ళ వయసులోనే 10-6-1928 నమరణించాడు
శ్రీరంగం లోని రంగ నాద స్వామి పై ‘’శ్రీ రంగ నాద ప్రబంధం ‘’సంస్కృతం లో రచించాడు గోపాల క్రిష్నయ్య .మహా కవుల శైలికి ఏ మాత్రం తగ్గకుండా అర్ధ గాంభీర్యం తో కవితా పాటవం తో వెలసిన కావ్యం ఇది .అందులోని కొన్ని శ్లోకాలు –
‘’కదా వా కావేరీ విమల సలిల ప్రాంగణా౦ ట-చ్చ్రుమ్భాద్గ తమిళ హృదయ ధ్వాంత దలనం
తనో త్యా తిధ్యం మే నిజ సదసి బందా చ్యుతి యుతో –ముహూర్ర్తేత్యా క్రోశన్నిమిష న్నివనేష్యామి దివసన్ .
‘’శ్రీ రంగేశ కృపాలో తమిళ జన సభాధ్యక్ష దీక్షాంత రంగం –స్వరాజ్యానంద నిద్రా పరవశా ద్రుతముత్తిస్ట భో రంగ నాయక
త్రేతాయాం రామ చంద్ర కృతి ద్రుత భవతా ప్రీణితై వాంధ్ర భూమి –స్త్వాన్ద్రోహం కర్త మానాం తవ భవన కధాం వక్త్రు మత్రాగతోసమి ‘’
ఇదికాక సంస్కృతం లో చాటువులు చాలా రాశాడు .గీర్వణ౦ లో ఆంగ్ల పదాలను చేర్చి జైలు నుంచి తిరిగి రాగానే మద్రాస్ లో బహిరంగ సభలలో మాట్లాడాడు –మచ్చుకి ఒకటి
‘’న యాచే’’ రిఫారం’’ నవా’’ స్టీలు ఫ్రేముం’’ న ‘’కౌన్సిల్ ‘’న తు ‘’ప్రీవీ కౌన్సిల్’’పదం వా-స్వరాజ్యార్తి హంతాంగ్లరాజ్యే నియంతా ,’’ఫరంగీ ‘’ఫిరంగీ ‘’ద్రుడన్గ౦గే కరోతు ‘’ ఇది జగన్నాధ పండిత రాయల ‘’నయాచే రాజాలిం న వా వాజి రాజిం ‘’ కవిత్వానికి అనుకరణ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-15-ఉయ్యూరు
’
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95
41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం )
కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని ప్రతీకలకు మాత్రమె పరిమితమైనాడు .’’sentimentality is deceiving one;s self ,rhetoric is deceiving other people ‘’అనేది యేట్స్ అభిప్రాయం .34వయసులో ‘’దివిండ్ అమాంగ్ ది రీద్స్ ‘’ప్రచురించాడు ఇందులోనూ ఏదో ‘’ట్రాన్స్ ‘’లో ఉండి రాసినట్లు అనిపిస్తుంది కవిత్వం .
‘’All things uncomely and broken ,all things worn out and old –the cry of a child by the road way ,the creeak of a lumbering cart –the heavy steps of the ploughman ,splashing the wintry mold –are wronging your image that blossoms a rose in the deeps of my heart ‘’
ఇంకా మానవాతీత శక్తి ప్రభావాన్నే వివరిస్తున్నాడు .తన జీవిత కధను ‘’ది సాంగ్ ఆఫ్ వాన్దరింగ్ ఏగ్నెస్ ‘’ అనే సంగీత నాటిక లో రాసుకున్నాడు .
‘’I went out to the hazel wood –because a fire was in my mind –and cut and peeled a hezel wand –and hooked a berry to a thread –and when white moths were on the wing –and moth like stars were flickering out –I dropped the berry in a stream –and caught a little silver trout ‘’
నలభైలలో ప్రచురించిన ‘’రేస్పాన్సి బిలిటీస్’’,’’ది వైల్డ్ స్వాన్ ఎట్ కూలే ‘’కవితల్లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది .ప్రభావ శీలమైన కవిత్వం జాలువారింది .విషయానికి పరిమితమై రాశాడు .ఈ మార్పును స్వయంగా ‘’లేబిరింత్ ఆఫ్ ఇమేజెస్ ‘’లో చెప్పుకొన్నాడు –
‘’I made my song a coat –coveredwith embroideries-out of old mythologies –from heel to throat ‘’అని యదార్ధం ఒప్పుకున్నాడు .మానసిక సత్యమేకాక ఆధ్యాత్మిక నమ్మకం కావాలనుకొన్నాడు .
దెయ్యాలు లేక శక్తులు లేక స్పిరిట్స్ ను ఆహ్వానించి వారినే ‘’కమ్మ్యూని కేటర్’’లుగా భావించి యేట్స్ భార్యా భర్తలు ఎన్నో రాయించారు.ఇవన్నీ కలిపి ‘’ది విజన్ ‘’పేర 52వ ఏట విడుదల చేశాడు .దీని రెండవ భాగం ప్రచురించే నాటికి యేట్స్ సమాజంలో మహా గౌరవనీయ వ్యక్తీ అయ్యాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా సేవలందించాడు .ఆయన అనుసరిస్తున్న గోప్యత(ఈసోటేరిక్) వలన రాజకీయాలకు ,కవిత్వానికి ఏ ఇబ్బందీ కలగ లేదు .పైగా బాగా కలిసొచ్చింది కూడా .1923లో సాహిత్యం లో యేట్స్ నోబెల్ బహుమతి పొందాడు .ఆయన ఒక ప్రపంచానికి మాత్రమే పౌరుడు కాదు. రెండు ప్రపంచాల పౌరుడు .అవి ఒకటి కనిపించే ప్రపంచం ఒకటి మనకు కనిపించని ఆయనే చూడగలిగే మార్మిక ప్రపంచం .యాభై- అరవై మధ్య వయసులో రాసిన కవిత్వం అత్యంత విలువైనది అవసరమైనది మార్గ దర్శకమైనది గా ఉంది .అంతకు పూర్వం లేని సాధికారత కవిత్వం పై సాధించాడిప్పుడు .కనిపించని దయ్యాలు ఫైరీ టేల్స్ ,పుక్కిటి పురాణాలు వదిలేసి ప్రజలు తక్షణ సమస్యలపై స్పందించి రాశాడు .మొదట్లో ప్రీ రాఫల్డై ట్ గా ఉన్నప్పుడు తన ముఖాన్ని అంతులేని తారాసమూహం లో దాచుకొన్నాడు .ఇప్పుడు మానవ రక్త సంబంధం తో అమితానందం పొందుతున్నాడు .ఈ స్తితిని చెప్పుకొంటూ ‘’I am content to follow to its source every event in action or in thought ‘’.
‘’ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో తన్ను తాను ఆవిష్కరించుకొన్నాడు –
‘’When such as I cast out remorse –so great a sweetness flows into the breast we must laugh and we must sing –we are blest by every thing –every thing we look uponis blest ‘’సాంస్కృతిక జాగృతిని తన మాతృదేశం ఐర్ లాండ్ కు ఇచ్చిన ఘనత యేట్స్ కవి ది .’’Romantic ireland’s dead and gone –it is with O’Leary in the grave ‘’అని చెప్పాడు .మర్యాద, మన్నన గౌరవం తన దేశం లో మంట గలిసి పోయినందుకు వ్యధ చెందాడు .కోపం ద్వేషం అసహనం అందలం ఎక్కినందుకు బాధ పడ్డాడు .అందుకే కవిత్వం లో హెచ్చరిక జారీచేశాడు –
‘’you thinkit horrible that lust and rage-should dance attendance upon my old age –they were not such a plague when I was young –what else have I to spur me into song ?అని ప్రశ్నించాడు .ఇప్పటిదాకా ఉన్న ఊహా ప్రపంచం కుప్ప కూలి పోయింది వాస్తవం బోధ పడింది .ఐర్లాండ్ కు దూరంగా రపల్లోఅనే చిన్న పట్నంఇటాలియన్ రివేరా లో ఉన్నాడు .ఇది దక్షిణ ఫ్రాన్స్ లో ఉంది .యూరప్ పర్యటన చేశాడు .అక్కడి విలువల పతనాన్ని సహించలేక పోయాడు .’’things fall apart –centre can not hold ‘’అని ఆవేదన చెందాడు .మెరుపులతో ‘’సెకండ్ కమింగ్ ‘’రాసి విభ్రాంతి కలిగించాడు .
చనిపోయే దాకా యేట్స్ రాస్తూనే ఉన్నాడు .ఆయన చివరి ముఖ్య రచన ‘’బైజా౦టి యం’’.ఇందులో కవితా ప్రతిభ అంతా ప్రదర్శించాడు .కవిత్వార౦భంఎలా ఉండాలో మచ్చుకి చూపించాడు ఇమేజెస్ ఎలా వాడాలో అత్యద్భుతంగా వాడి చూపాడు .70వ ఏట శారీరకంగా బలహీనుడయ్యాడు శ్వాసపీల్చటం కష్టమయ్యేది .బాధలు ఎక్కువయ్యాయి. తానిక బతకటం కంటే చావటమే నయం అని భార్య కు చెప్పుకొన్నాడు .1938 చివర్లో చలి ఎక్కువగా లేక పోయినా చలికి తట్టుకోలేక పోయాడు .జనవరిలోతీవ్రంగా గుండె జబ్బు వచ్చింది .కోమాలో ఉన్నాడు .చివరికి గుండె ఆగి 28-1-1939న 74వ ఏట ఈ ఐరిష్ స్వాతంత్ర యోధుడు మహాకవి సెనేటర్ మరణించాడు .
యేట్స్ మరణానంతరం ఆయన జీవిత చరిత్రలు చాలా వచ్చాయి .ఆయన సింబాలిజం పై అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి .ప్రముఖ విమర్శకుల చేత రాయించిన ఇరవైనాలుగు వ్యాసాల ను ‘’దిపెర్మనెన్స్ ఆఫ్ యేట్స్ ‘’పేరిట వెలువడింది .జాన్ కరో రామ్సన్ ‘’యేట్స్ అండ్ హిస్ సింబల్స్ ‘’పుస్తకం రాశాడు .ఆయన కవిత్వం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది .యువకవులపై యేట్స్ ప్రభావం అనంతం .సమకాలీన కవిత్వాన్ని తన స్వంత శైలి,గాఢత్వాలతో పరిపుష్టి చేశాడు .ఏది రాసినా మహోన్నత భావం తో చెప్పి మెప్పించిన కవి యేట్స్ .
నిప్పులు కురిపించే కవిత్వం రాసిన అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ కు యేట్స్ సన్నిహితుడు .రవీంద్రుని ఆంగ్ల గీతాంజలికి యేట్స్ ముందుమాట రాశాడు .ఇంగ్లాండ్ కవులు స్పెన్సర్ షెల్లీ ప్రీ రాఫెలైట్స్ ల ప్రభావం ఉన్నవాడు . పోను పోను వాస్తవానికి చాలా దగ్గరగా భౌతిక పరంగా రాశాడు .
1899లో యేట్స్ దంపతులు మిత్ర బృందం తోకలిసి ‘’ఐరిష్ లిటరరీ దియేటర్ ‘’స్థాపించారు . “We hope to find in Ireland an uncorrupted & imaginative audience trained to listen by its passion for oratory … & that freedom to experiment which is not found in the theatres of England, & without which no new movement in art or literature can succeed.”[51]
అని దీని మేనిఫెస్టో రాశాడు యేట్స్ .రెండేళ్ళ తర్వాత ఇది మూతపడింది .1909లో లండన్ లో అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ ను కలిశాడు అప్పటినుండి వారి స్నేహం చివరివరకు ఉంది .
నోబెల్ ప్రైజ్ ను స్వీకరిస్తూ యేట్స్ కవి “I consider that this honour has come to me less as an individual than as a representative of Irish literature, it is part of Europe’s welcome to the Free State.”[66] ‘’అని తన మనోభావాన్ని తెలియ జేశాడు .స్వతంత్ర ఐర్లాండ్ దేశం ఏర్పడిన తర్వాతమైనారిటి ప్రొటెస్టెంట్ లకు మెజారిటీ కేధలిక్కులకు మధ్య విద్వేషాలు పెరిగాయి. దీనికి సమాధానం గా సెనేట్ లోనూ బయటా యేట్స్ అద్భుత ప్రసంగాలు చేసి చారిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సాధించాడు ఆయన మాటలలోనే –‘’ “quixotically impressive” ambitions of the government and clergy, likening their campaign tactics to those of “medieval Spain.”[71] “Marriage is not to us a Sacrament, but, upon the other hand, the love of a man and woman, and the inseparable physical desire, are sacred. This conviction has come to us through ancient philosophy and modern literature, and it seems to us a most sacrilegious thing to persuade two people who hate each other … to live together, and it is to us no remedy to permit them to part if neither can re-marry.”[71] ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .
తన సమాధి మీద తన కిష్టమైన తన కవితా పంక్తులను చెక్కించే ఏర్పాటు చేశాడు
– Cast a cold Eye
On Life, on Death.
Horseman, pass by!.
ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ కవులలో యేట్స్ అతి ముఖ్యకవి .’’సింబలిస్ట్ పోయేట్’’గా గుర్తింప బడ్డాడు .ప్రతి పదానికి పైకి కనిపించే అర్ధం కంటే లోపలి అంతరార్దా లను ఆవిష్కరిస్తూ కవిత్వం రాయటం యేట్స్ ప్రత్యేకత .ఫ్రీ వెర్స్ తో కదను తొక్కుతూ ఆధునిక కవులు ఉంటె సాంప్రదాయ బద్ధమైన కవిత్వం తో జిగేల్ మనిపించాడు .మొదట్లో ఐరిష్ మిత్ అండ్ ఫోక్ లోర్ ప్రభావం తో రాసినా తర్వాతజనం తో మమేకమై రాశాడు .కొందరు విమర్శకుల దృష్టిలో యేట్స్ 19 వ 20వ శతాబ్దాల కవిత్వ వారధి .హిందూ దియసాఫికల్ భావాలను మంత్రాలు తంత్రాలను నమ్మినవాడు ‘’డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ .’’అంటారు ఆయనను .జార్జి మూర్ పై ప్రభావం చూపాడు .బెర్నార్డ్ షాను తన’’జాన్ బుల్ ‘’అనే నాటకానికి పని చేయించాడు .నాటక ప్రయోగాలతో మాంచెస్టర్ ప్లేయర్స్ ను ఆకర్షించాడు .అమెరికా ,యూరప్ లలో చిన్న దియేటర్ నిర్మాణానికి ప్రోత్సహించాడు. నాటక రంగానికి ఐరిష్ ఇంగ్లిష్ నటులు ప్రముఖులనే కాక ,ఆక్స్ ఫర్డ్ కేం బ్రిడ్జి , హార్వర్డ్ సోఫిస్టికేట్స్ ను కూడా వాడుకోవటం యేట్స్ ప్రత్యేకత .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94
41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్
‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్ దేశానికి సెనేటర్ గా 1922నుండి 1928వరకు సేవ చేశాడు .ఇలా షెల్లీ మాట నిజం చేశాడు .
విలియం బట్లర్ యేట్స్ ఐర్లాండ్ లో డబ్లిన్ దగ్గర సాండి మౌంట్ లో 13-6-1865లో ప్రొటెస్టెంట్ కుటుంబం లోజన్మించాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లుగా పని చేశారు .తండ్రి జాన్ ప్రముఖ ఆర్టిస్ట్ .,సోదరుడు జాక్ ప్రసిద్ధ చిత్రకారుడు .వీరిద్దరి ప్రభావం విలియం పైన ఉంది .19వ ఏట డబ్లిన్ లోని మెట్రోపాలిటన్ ఆర్ట్ స్కూల్ లో చేరాడు .చిత్రకారుడు టర్నర్ దగ్గర పని చేసి కొంత నేర్చినా ద్రుష్టి రచనమీదే ఉండేది .చివరికి తన భావ వ్యక్తీకరణకు బ్రష్ కంటే పెన్ను బాగా సహకరిస్తుందని నిశ్చయించుకొని రాతకే మొగ్గు చూపాడు .
విలియం యవ్వనం ఇంగ్లాండ్ –ఐర్లాండ్ మధ్యనే గడిచింది .పదకొండేళ్ళ వయసులో లండన్ దగ్గరున్న హామర్ స్మిత్ లోని గోడాల్ఫిన్ స్కూల్ లో చేరాడు . కాని .తన దేశం లో తనకిష్టమైన స్లిగో కు తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు .జీవితం లో ఎక్కువ భాగం స్వదేశానికి దూరం గా గడిపినప్పటికీ మాతృదేశం ఐర్లాండ్ పై ఎప్పుడూ మక్కువతో ఉండేవాడు .22వయసులో లండన్ వెళ్ళాడు .అక్కడ ఎర్నెస్ట్ రైస్ తో కలిసి ‘’రైమర్స్ క్లబ్ ‘’స్థాపించాడు .ఇది ప్రీ రాల్ఫ డైట్ ల భౌతిక భావ వ్యాప్తికి అడ్డు కట్ట వేసి ,ధార్మిక భావ వ్యాప్తికోసమే ఏర్పాటు చేయబడింది .ఈ వయసులో బక్కగా పలుచగా ఎత్తుగా ఉండేవాడు .ముఖం చిన్నదిగా ,మిరుమిట్లుగొలిపే కళ్ళతో ఉండేవాడు .
శీతాకాలం లో ఈ క్లబ్ కు వచ్చి మేధో సదస్సులలో పాల్గోటమే కాక వెచ్చదనాన్నీ పొందేవాడు విలియం .గుర్రం మీద డబ్లిన్ నుండి లండన్ కు వెళ్ళటానికి చేతిలో డబ్బులు లేక అనేక సార్లు నడిచి వెళ్ళే వాడిని అని ఆయనే చెప్పుకొన్నాడు .మధ్యాహనం ‘’టీ’’కి ఎవరో స్నేహితుల మీద ఆధార పడే వాడు .వీలయితే వారి ఆతిధ్యం పొంది భోజనం చేసేవాడు .ఇంకేవిధమైన పోషకాహారం తీసుకొనే ఆర్ధిక స్తితి లేనివాడిగా గడిపాడు .ఆస్తికతను ఒక జీవిత విధానం గా అలవరచుకొన్నాడు . యవ్వన దశలో హక్సిలీ ,తిండాల్ ల మెటీరియలిజం అంటే ఇష్టపడే వాడు కాదు .తన స్వీయ జీవిత చరిత్ర లో ‘’నేనుకవిత్వ విధానం అనే ఒక కొత్తమతాన్ని కనిపెట్టాను .అనేక తరాలుగా కవులు కళాకారులు తత్వ వేత్తలు అందించిన విజ్ఞాన రహస్యాలను చిన్న కధలుగా చెప్పాను .ఈ భావ వ్యాప్తికోసం ఒక ప్రపంచం నిర్మించాలనుకొన్నాను .’’అని రాసుకొన్నాడు .
యేట్స్ కొత్త మత అన్వేషణ లో సగం అభూతకల్పన ,సగం మాజిక్ ఉన్నాయి .అందుకని దియసాఫిస్ట్ లకు దగ్గరయ్యాడు .1887లో రష్యా దేశపు మార్మిక వేత్త మేడం బ్లావట్ స్కి కి శిష్యుడైనాడు . ఆమె చేసేదంతా అభూత కల్పనా అని రుజువైనా యేట్స్ కు ఆమె పై విశ్వాసం తగ్గలేదు .పుష్పాలలో దెయ్యాలని ఆహ్వానించటం ,తలక్రింద ప్రత్యేక దిండులను ఏర్పరచి కళలు కనమని చెప్పి వాటి అర్ధాలను వివరించేవాడు. ఈ జబ్బును తోటి క్లబ్ సభ్యులకూ అంటించాడు..పంచేంద్రియాలకు అతీతమైన దేదో ఉందని చెప్పేవాడు . మెటీరియలిజానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాడు .అద్భుతకధలన్నిటినీ నమ్మింప జేసేవాడు .చిన్ననాటి జానపద కధలనూ వండి వడ్డించేవాడు .ఇవన్నీ తన జీవితం లో కన్న కలలే అనేవాడు .
సహజంగా సిగ్గు పడే విలియం హృదయం ఆత్మ స్పర్శకు ,ఈ కల్పిత కధలకు మధ్య విలవిలలాడిందికొంతకాలం .దేనికి సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు .ఈ ద్వంద్వాలలో ఊగిసలాడాడు .తనకాలం లో పెరుగిపోతున్న మెటీరియలిజానికి బ్రేకులు వేయటమే యేట్స్ ఉద్దేశ్యం .ఈ ఊహా ప్రపంచమే లేక పొతే తానేదీ రాయగలిగి ఉండేవాడిని కానన్నాడు .’’సెల్టిక్ రివైవల్ ‘’ఉద్యమం వచ్చేసరికి విలియం లో స్పిరిటిజం తో బాటు జాతీయతా భావం కలిసి పోయాయి .ఐర్లాండ్ లో రెండు మహా ఉద్యమాలు మొలకెత్తాయి .అందులో 1893లో ఐరిష్ ప్రాచీన సాహిత్యాధ్యయనం పునరుద్ధ రించాలని ,గేలిక్ ను జాతీయ భాష గా చేయాలని ప్రారంభమైన ‘’గేలిక్ లీగ్’’ఉద్యమం , తర్వాత కొన్నేళ్ళకు మెరుగైన వ్యవసాయం ,వర్తక వాణిజ్యం ,మెరుగైన జీవితం కోసం ,మొదలైన ‘’సహకార ఉద్యమం ‘’.ఈ రెండు ఉద్యమాలు ఐరిష్ జాతీయ సంస్కృతీ వికసనం కోసమే ఏర్పడ్డాయి .
ఈ ఉద్యమాలలో ఐరిష్ కవులు ,జానపద గేయ కర్తలు కళాకారులు ,విద్యావేత్తలు ,ఆర్ధిక సామాజిక వేత్తలు ,వ్యవసాయదారులు నిపుణులు అందరూ చేయి చేయి కలిపి పని చేశారు .జార్జి రసెల్ ‘’ఏ యి ‘’అనే మారుపేరుతో కవిత్వం రాసి ప్రేరణ కలిగించాడు .ఈ మహోద్యమాలలో తానూ మమేకంయ్యాడు యేట్స్ .ఉద్యమాలు తీవ్ర రూప దాల్చి తీవ్రవాదమైంది .ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నాలూ తీవ్రంగా సాగాయి .తిరుగుబాటు ప్రతిచోటా తీవ్రమైనది.కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమం దేశమంతా ప్రాకింది .ఐరిష్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది .కవుల రక్తతర్పణం తో ‘’ఐర్’’ఏర్పడింది .గేలిక్ లీగ్ సంస్థాపకుడు ,కవి డగ్లాస్ హైడ్ ఐర్లాండ్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .
ఐరిష్ సాహిత్యం దియేటర్ లోనూ మార్పు తెచ్చింది .దీనిలో యేట్స్ ప్రవేశించి,లీనమై చలనం తెచ్చాడు .బౌద్ధిక ఉద్యమం లో చురుకుగా పని చేసిన మాడీ గానే అనే అమ్మాయిని యేట్స్ ప్రేమించాడు .ఆమెనే దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాశాడు .అంతరార్ద నాటకాలు రాసి ప్రఖ్యాతి చెందాడు .క్రమంగా ఐరిష్ కవులలో మార్గ దర్శి అనిపించుకున్నాడు .పారిస్ లో జే. ఏం .సిన్జ్ అనే నాటక రచయితనుకలిసి ‘’ఆరన్ ‘’అనే ఆదిమ జాతి ప్రదేశానికి ,ఆ ప్రజల మధ్యకు తిరిగి రమ్మని పిలిచాడు . బైబిల్ ను వారి భాషలోకి అనువాదం చేయించాడు ఆయనతో .ఐరిష్ జాతీయాలను పలుకు బడులను అందులో చొప్పించి రాయించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
27-ఉదయ రాజు గంగాధర కవి
దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి బ్రాహ్మణుడు ఇప్పటికీ ఈకుటు౦బం వారు కరీం నగర ,వరంగల్ జిల్లాలో ఉన్నారు .
‘’మద్ర కన్యా పరిణయం ‘’5 ఉల్లాసాల కావ్యం .శ్రీకృష్ణుడికి బృహత్సేనుడి కుమార్తె లక్ష్మణకు జరిగిన వివాహ వృత్తాంతం ఇది .కావ్యాన్ని కవి –‘’కళ్యాణ మవ్యహతమాతనేతు సంవ్యాన లీలా క్రుద భూద్రజస్యః-కర్ణానిలేనాహృతేంశు కాంతే,యో వల్లభాయాఃస్మిత పల్లవేన ‘’అంటూ ప్రారంభించాడు .తన తండ్రి దత్తాత్రేయ గురించి కొంత చెప్పాడు .కావ్యాన్ని పూర్తీ చేస్తూ –
‘’నందావా నిందావా మత్క్రుతి రేషాద్యయత్క్రుతోత్పన్నా –శైశవ వాణీవ పితుః నంద తనూజస్య నందినీ భూయాత్ ‘’
28-మహా మహోపాధ్యాయ మానవల్లి గంగాధర శాస్త్రి (1854-1914)
19వ శతాబ్దం లో మహా పండితకవి అని పించుకొన్న మానవల్లి గంగాధర శాస్స్త్రి నరసింహ శాస్స్త్రి కుమారుడు కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర యాసర గుట్ట లో 1854లో జన్మించాడు .తండ్రితో బాటు కాశీకి కుటుంబం వలస వెళ్ళి’’కావ్యాత్మ సంధానం’’రాశాడు తండ్రి దగ్గర ,రాజా రామ శాస్త్రి ,బాలశాస్స్త్రి ల వద్ద విద్య నేర్చాడు .1879లో కాశీ కాలేజిలో 25ఏళ్ళకే సంస్కృత ఆచార్యుడయ్యాడు 1887లో విక్టోరియా రాణీ జూబిలీ మహోత్సవాలలో మహా మహోపాధ్యాయ బిరుదు పొంది సన్మానం అందుకొన్నాడు .1914లో మరణించాడు గంగాధరుని ఏడుగురు శిష్యులూ మహా మహోపాధ్యాయ బిరుదాన్కితులవటం ఆ గురువు విద్యా పాటవానికి మహా గొప్ప ఉదాహరణ .
గంగాధర శాస్త్రి –‘’వాక్య పదీయం ,’’వైయాకరణ సిద్ధాంత కౌముది ‘,ప్రౌఢ మనోరమ ,’’,శబ్ద రత్న ,’’,శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’,తత్వ బిందు ‘’,న్యాయ మంజరి ‘’,గౌతమ న్యాయ సూత్రాలు ,జైమిని మీమాంస సూత్రాలు ,కుమారిల భట్టు ‘’తంత్ర వార్తిక ‘’,లౌకిక న్యాయ సంగ్రహం ,జగన్నాధుని రసగంగాధారం వంటి ఉద్గ్రంధాలకు సంపాదకత్వ బాధ్యత త్తీసు కొన్నాడు
స్వయంగా ‘’అలి విలాసి సంలాప’’గంగాధర శతకం ,తనగురువులైన రాజారామ శాస్త్రి ,బాల శాస్త్రి ల జీవిత చరిత్రలు రాశాడు .ఇన్నిటిలో లభ్యమైనది ఒక్క ‘’అలి విలాసి సంలాపం ‘’మాత్రమె .ఈ ఖండ కావ్యం లో 9 శతకాలున్నాయి .వెయ్యి శ్లోకాల సమాహారం .దీన్ని 1908లో రాసినట్లు చెప్పాడు .అనేక విభిన్న విషయాలను వీటిలో చెప్పాడు .తన ఉద్దేశ్యమేమిటో ఉపోద్ఘాతం లో చెప్పాడు .మొదటి శతకం శివుని గూర్చి చెప్పినది .-‘’విద్యా విద్యాత్ ఏవ యత్ర సతతం వేద్యో యో రాగిణాం-యమ వైద్యం మనసా ప్రపద్య విషత్యయా లేష్వభీకా బుధాః’’మంచి ఆలోచన రేకెత్తించే సుందర శ్లోకాలురాశాడు .-‘’సఫల్లవా న్తాంతవనోప యుక్తా మనర్హ పుష్పా వసరాభి సారం –శ్రితాం సుసంపన్నరవంశకుంతే రిచరాత్త తారుణ్య ఫలామిమాందికం ‘’
గంగాధర కవి రాసిన ‘’హంసాస్టకం ‘’కు సోదరుడు రామశాస్త్రి తైలాంగ్ వ్యాఖ్య రాశాడు .ఇందులో శివునిపై ఉన్న మంచి శ్లోకం ఒకటి
‘’యః షండ వక్త్ర గజాననా ద్భుతా విష్కారణావ్యంజితా—అచిన్త్యో త్పాదన వైభవాం గిరి సుతాం మాయాంనిజంకే దధత్ ‘’
ఈ అష్టకం లో రెండు అర్ధాలు వచ్చేటట్లు రాశాడు హంస అంటే మానస సరోవర హంస అని ఒక అర్ధం ,హంస అంటే ఆత్మ అని మరో అర్ధం రెండినీ సమన్వయము చేస్తూ ప్రతిభావంతంగా రూపొందించాడు .ఇందులోని రెండు శ్లోకాలు చూద్దాం –
‘’బ్రహ్మాహం సత్స్వ రూపం చితి సుఖ మవిదన్ మాయయా క్షిప్య మాణా-తత్సంప కాన్రిపత్యై శరణ ముప గతః సద్గురూం జ్ఞాత వత్వం ‘అని మొదలుపెట్టి –
‘’శ్రావం శ్రావం తదుక్తిస్చిర తర మననా పాస్తదుస్తర్క జాలః –సాక్షాత్కారైక శోషా ద్విగలితనిఖిలోపప్లవో హంస ఏవ ‘’
ఆసుకవిగా ప్రఖ్యాతుడైన గంగాధర శాస్త్రి ఉత్తర భారతం లో ఎన్నోసంస్కృత శతావధానాలు నిర్విఘ్నం గా నిర్వహించి కీర్తి గడించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
24-కృష్ణ మూర్తి కుమార
మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల వరాహ నరసింహ స్వామి వస౦ త ఋతు ఉత్సవాలలో ఆడేవారు .కవికూడా విశాఖ జిల్లా లేక గోదావరి జిల్లా వాడై ఉంటాడు .శిస్టుకవికంటే ముందువాడు అయి ఉండాలి .
కృష్ణ మూర్తి కవి తన భాణ రచనను ‘’శ్రీకాంతా తవ జీవితం ఖలు తతో వక్షః స్తలే లక్ష్యతే –నై కాంతా మయి చిత్త వ్రుత్తి రిహ బుద్వోతిముగ్దా గతిః’’అనే శ్లోకం తో ప్రారంభించాడు .ఇందులో ఉన్న భావోద్వేగాలను నాందీ వాక్యానంతరం తెలియ జేశాడు .-‘’అద్రుత స్థన మండలం స్వ వపుషా ముచ్చూ వాస లీలా పుషా –మున్మీల ద్రతి లాభ మీలిత దృశా ముత్దాన నభేద స్ప్రుశం ‘
తన వంశం గురించి ఆరు శ్లోకాలలో కవి చెప్పుకొన్నాడు .సూర్య పండితునికి బుచ్చయా చార్య ,వెంకట పండిత ,సర్వజ్ఞపండిత కుమారులని ,,సర్వజ్నుని కొడుకు మంజులాచార్య అంటే తానేనని చెప్పాడు .తన రచనా వైభవాన్ని ,శైలిని గురించి ఘనంగా చెప్పుకొన్నాడు –‘’క్కచిత్ ప్రసూన కేసర ప్రసూన వల్లరీ లల-న్మాదూలికా నిరర్లక్షర జ్జ్హారీ సహోదరీ
కచిత్ప్రభిన్న దంత దాన మారుతా విల –భ్రమాత్కరాభ్రదంత దంభ బుమ్హితో రువైశ్వరీ ‘’ రసలాలతిక అనే నాయిక గురించి వచనం లో వర్ణించాడు .-‘’సంప్రతి సకల వారచకోర లోచనా జన మాస్ట కన్యస్తు మణిః-కుఛ వసుంధరా ధర సముల్లల ద్వదు రాజ్ఞాన శంకః కారణాచసరస రముక్త మణిః-కటీ తటసమారూఢ సారశన చారుతహీర ఘంటికసరద్రుణిః-కామన జన మోహపారావార రసలాలతికాయా యవీయసీ ‘’.ఈ ప్రేమ కదా నాగ పురం అనే కల్పిత నగరం లో జరిగినట్లు,ఆపుర వర్ణనా చేశాడు .
25-తడకమళ్ళ కృష్ణ మార్య(18 వ శతాబ్దం )
18 వ శతాబ్దానికి చెందిన తడక మల్ళకృష్ణ మార్య కవి ‘’తారావళి ‘’అనే లఘుకావ్యం రాశాడు .27శ్లోకాలలో ఉన్న శ్రీరామ స్తుతి ఇది . 1879లో రాసిన ‘’ద్రుగ్గణితం’’లో కవి వివరాలున్నాయి .రంగరాయ ,కనకా౦బలు పెంపుడు తలిదండ్రులు .అసలు తలిదండ్రులు కుట్టిమాంబ ,రంగ రాయలు .సోదరుడు వెంకన్న పండితుడుచిత్తూర్ జిల్లా కార్వేటినగరం పాలకుడు బొమ్మ రాజు ఆస్థాన మంత్రి .కవి తెలుగు సంస్కృత ఆంగ్ల మళయాళ భాషలలో మహా పండితుడు .నుంగం బాకం కేలండర్ తయారు చేయటానికి ప్రోత్సహించాడు .ఇప్పుడు కవి గారి రెండు శ్లోకాలు చూద్దాం –
‘’శ్రీవాస వత్స చిహ్నా౦చిత వక్షస్థల ధారా సుతా జానే –త్వమహి దయా దృష్ట్యా మందాక్రాంతం రక్షమాం దయాశరదే ‘’
రత్న కిరీట ధరా చ్యుత రామానంత ముకుంద దయాశరదే –కిమసౌ శనిరివ కిం కురుతే మాం పరిపాలయ దాశరధే ‘’’
శ్రీరాముని దయా ,కృపా వుంటే శని కూడా ఏమీ చేయలేడు అనే నిశ్చల మనస్సును ఆవిష్కరించాడు .
26-రంగ రాజు కేశవ రావు (—1904)
రంగ రాజు కేశవరావు జననం ఎప్పుడో తెలియదుకాని మరణం 1904..వరంగల్ జిల్లా ఖిలశాపురం వాసి .ఈత తప్ప సకల కళా ప్రపూర్ణుడు..పర్షియన్ ఆరబిక్ లతో బాటు చాలా భాషలలో లోతైన పాండిత్యం ఉంది .గొప్ప వీణా వాదనా నిపుణుడు..మంచి చిత్రకారుడు కూడా .సంగీతం పై వివిధ భాషలలో పుస్తకాలు రాశాడు .నవాబ్ ఇఖాబలుద్దౌలా బహదూర్ ఈయనకున్న పార్సీ భాషా పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి ‘’కవి శిరోమణి ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .కవి వైష్ణవుడు .వివిధ దేవతలపై స్తోత్రాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’శఠ కోప స్తుతి ‘’ఒకటి వేదాంత దేశికుని పై 62శ్లోకాలు రచించాడు .తన గురువు హనుమకొండ నివాసి అయిన నృసింహా చార్య పై 24 శ్లోకాలు చెప్పాడు .భుజంగ ప్రయాత వృత్తం లో 12శ్లోకాలో గురు స్తుతి చేశాడు .సంస్కృతం లో చాలా పెద్ద గ్రంధాలు రాశాడు .కాని అచ్చుకాలేదు .భుజంగ ప్రయాతం లో నృసింహ గురు స్తుతి –
‘’పయోజాసనస్తం క్రుతాన్జల్యుపేతం స్ఫురద్రను భాసం స్ఫుటాబ్జ చ్చాద దక్షం
స్తితంవక్త్రుకామో వివ్రుత్యేవ వక్త్రం హనుమద్గిరీశం భజే భాష్యకారం .’’
27-ఇంద్రకంటి కొండయ
ఇంద్రకంటి నారాయణ అంచమ పుత్రుడు కొండయ .పుట్టిన తేదీ కాలం అలభ్యం .కాశ్యప గోత్రం .నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో ఇంద్రకంటి వారున్నారు. బహ్వ్రచ శాఖకు చెందినవాడు ‘’మహేశ్వర మానస మహోత్సవం ‘’,శృంగార రస భ్రున్గారం అనే ఉద్గ్రంధాలు రాశాడు మొదటిది శివాలయాలలో అర్చన విధానమంతా వర్ణించి చెప్పాడు .దీని నకలును కొడుకు లింగభట్టు రాశాడు
‘’తత్పుత్రేణైవ లిఖితా లింగ భట్టేన సూరిణా –తాద్రుశేన మహేశస్య పూజా మానసికీ శుభా ‘’అని కొడుకు చెప్పుకొన్నాడు
రెండవ రచన ‘’శృంగార రస భ్రున్గారం ‘’భాణం.శ్రీశైల ఉత్సవాలలో ప్రదర్శించేవారు .నాందీ ప్రస్తావన లో మల్లికార్జున స్వామి స్తుతి –
‘’కైలాసం పరిహృత్య శైల సుతయా సాకం గణేశ్చస్వయం –శ్రీ శైలేత్ర హి మల్లికార్జున ఇతి ఖ్యాతో స్తి సర్వేశ్వరః ‘’
శృంగార రస భ్రున్గార నామకం రూపకం సతాం –ఏషామభి నినీషామిరిరి౦జయిషయా హృదః ‘’
28-కోదండ రామయ్య
ఎక్కడ ఎప్పుడు పుట్టాడో కోదండ రామయ్య ఎవరికీ తెలియదు. బొబ్బిలి లో నివసించాడని భావిస్తారు .’సూర్య శతక ‘’కర్త గా గుర్తుండి పోయాడు
‘’శ్రియా సమేతం శ్రిత పారిజాతం వియత్ప్రదీపం వితత ప్రతాపం –నయ ప్రచారం నగ రాజ ధీరం దయా సముద్రం తపనం నమామి ‘’
తేజో మయే మండల మధ్య భాగే సి౦హా సనే రత్న మయేబ్జపీఠే-ఆశీ నము గ్రాయుధ దీప్ర హస్తం చాయాపతిం చండకరం నమామి ‘’
సూర్య శతకాన్ని ముగిస్తూ చెప్పిన శ్లోకం –
‘’కోదండ రామార్య కృత స్తుతిం యేపఠింత శ్రుణ వంతిచ భక్తీ యుక్తాః-తేషాం శ్రియం పుత్రా కళత్ర సౌఖ్యం ,స్వర్గం చ మోక్షం దిననాద దేహి ‘’అని దీన్ని రాసినవారికిభక్తిగా చదివినవారికి భార్యా బిడ్డలతో కలకాలం సౌఖ్యం పొంది చివరకు మోక్షం ప్రసాదించమని సూర్య దేవుడిని వేడుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -29-11-15-ఉయ్యూరు
భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత
భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత
– ఆచార్య వెలుదండ నిత్యానందరావు 944166688123/11/2015

కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు… రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని స్వీకరించి నవ్య ప్రబంధ రీతి కవిత్వం రాశారు. వీటిలో సమకాలీనతని ప్రతిబింబించారు. మూలమెరిగి గ్రంథ పరిష్కరణ చేసిన కొద్దివారిలో వీరొకరు. సృజనాత్మక పరిశోధనా పాండిత్యం జమిలి చిరునామా వీరు. ప్రాచీన గ్రంథ పరిష్కరణలో అందె వేసిన చేయి. ఓనాడు ‘్భరతి’ పత్రికలో వీరి రచన పడని సంచికలు తక్కువ. వార్ధక్యం వీరి వెంటే ఉన్నా అది ఆయన సాహిత్య సంకల్పం ముందు వాలిపోయిన నీడే.
విశ్వవిద్యాలయాల కావల, నగరాల ఛాయ పడని పాలమూరు జిల్లా నాగర్కర్నూలులో ఉంటూ తానే ఒక సాహిత్య కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత డా. కపిలవాయి లింగమూర్తి గారితో ఒకరితో ఒకరు.
==================
మీరు కృషిచేసిన సాహిత్య ప్రక్రియల గురించి వివరించండి…
మా తాతగారి తండ్రి కాలంనుంచే మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. మా మేనమామ గారైన పెద్ద లచ్చయ్య గారికి సాహిత్యంలో ప్రవేశం ఉండేది. వారి సాహచర్యంవలన నాకు రచనా వ్యాసంగం, సాహిత్యం అబ్బింది. నాకు ఏ పద్యమైనా పాఠమైనా ఒకసారి కంఠతా చదవగానే వచ్చేది. నేను పదునాలుగవ యేట మొట్టమొదట పాటలు రాశాను. తర్వాత పద్యాలు వ్రాయడం మొదలు పెట్టాను. వ్రాసిన మొదట పద్యం మా మేనమామగారికి చూపించగా ఆయన బాగుందన్నాడు. దానితో నేను వ్రాయడం ప్రారంభించినాను. నేను సాహిత్యంలోని ఇంచుమించు అన్ని ప్రక్రియలలో కృషి చేశాను – పద్యం, గద్యం, గేయం, వచనాలు, శతకం, కథ, నవల, కావ్యం, ద్విపద, నాటకం, చరిత్ర, ఉదాహరణం బాలసాహిత్యం, సంకీర్తనం, బుర్రకథలు, హరికథలు, సంకలనం, అనువాదం, పీఠికలు రాసే అవకాశం లభించింది. వానిలో 80 ముద్రితాలు, 30 అముద్రితాలు ఉన్నాయి.
మీరు రాసిన శతకాల్లో ఇతరులు చెప్పని వినూత్నత ఏమిటి…?
నేను 13 శతకాలు వ్రాసినాను. ప్రతి శతకంలో ఓ కొత్తదనం ఉంది. పాండురంగ శతకం ఏకప్రాస, ఏకవృత్తాత్మకం. తిరుమలేశ శతకం ధ్వనిపూర్వకమైన అధిక్షేపశతకం. భర్గ శతకంలో అన్ని పాదాలలో ఒకే యతి ఉంటుంది. దుర్గ శతకం స్ర్తివాచకమైన ఆటవెలదిలో స్తుత్యాత్మకంగా అలంకారాలను వివరించాను. సాయి త్రిశతి అని మూడు గేయ శతకాలు. ఇవి మూడు మూడు రకాల ఛందస్సులతో – షిర్డి సాయి రామరామ శతకం, పర్తిసాయి శతకం, భజగోవిందం పద్ధతిలో, ప్రేమ సాయి శతకం తోహర పద్ధతిలో కూర్చినాను. సుందరీ సందేశం స్ర్తి వర్ణనాత్మకమైన నిర్మకుట శతకం. ప్రాచీన కావ్యాల్లో ఉండే స్ర్తి వర్ణనలన్నీ సీస పద్యాలుగా కూర్చినాను.
అన్నింటికంటే చెప్పదగింది ఆర్యా శతకం ఇది చిత్ర పది. ఇదో ప్రత్యేకమైంది. దీనిలోని శబ్ద చిత్రమే ఆ పదం చెప్పే అర్థాన్ని వ్యంజిస్తుంది. ఈ శతకాలలో వచ్చిన నూరు పద్యాలు వచ్చిన చిత్రం మళ్లీ రాకుండా ఉంటాయి. ఇట్టిది ఇంతవరకు తెలుగు సాహిత్యంలో రాలేదు. ప్రబంధాలలో వసుచరిత్ర శతకాలలో నా ఆర్యా శతకం ప్రత్యేకమైనవి.
మాంగల్య శాస్త్రం రాశారు. వాటి విశేషాలు వివరించండి..
స్వర్ణ శకలాలు తెలుగు సాహిత్యంలోని 90 కావ్యాలలో ఆయా కవులు ప్రస్తావించిన స్వర్ణ్భారణాలను విశ్వకర్మలను గురించిన పద్యాలను తీసుకొని వాటిని గుణ దోష పూర్వకంగా చెప్పాను. మాంగల్య శాస్త్రం వ్రాయడానికి పుణ్యక్షేత్రాలలో ఉండే శిల్ప భంగిమలు, వాటికున్న ఆభరణాలు, దేవతావిగ్రహాల ఆభరణాలు ఆయా ప్రాంతాల స్ర్తిలు ధరించే ఆభరణాలు, పురాణాలు కావ్యాల్లో ఉండే ఆభరణాలకు వ్యాఖ్యానాలు అన్నీ సేకరించి ఆభరణాలపై సమగ్ర గ్రంథం చేయడానికి ప్రయత్నించాను. ఇవన్నీ బొమ్మలతో ఉన్నాయి. ఇది భారతీయ ఆభరణాలపై వచ్చిన సమగ్రమైన గ్రంథం.
మూడు తరాల విద్యా పరిణామం ఎలా ఉంది?
చదవాలి. వ్రాయాలి. అర్థం చేసుకోవాలి. చదువంటే చదివే నాటికీ పుస్తకం చదువుతుంటే ధారాళంగా చదివేవారం. చదివింది అర్థం చేసుకొని చెప్పేవారం. అప్పటికి వారి పరిశీలనా శక్తి, విజ్ఞానతృష్ణ అద్భుతంగా ఉండేవి.
నేను కళాశాలలో చదువు చెప్పేనాటికి (1972-83) కూడా విద్యార్థులకు ఆసక్తి ఉండేది. వారు గురువులు చెప్పేది శ్రద్ధగా వినేవారు. వారు కూడా ఇప్పుడు మంచి రంగాలలో స్థిరపడ్డారు. ఆనాటి వాళ్లకు నిరంతరం చదవాలి, రాయాలి, రాసినదాన్ని దిద్దుకొందామన్న తపన, ఆరాటం ఉండేది. ఇపుడే మేం రాసిందే గొప్ప, అదే ప్రమాణం అనే అహంకారం, అజ్ఞానం ప్రబలింది. భావపరిణతి, భాషాప్రామాణ్యం లుప్తమయాయి. చదువుకు మూడు దశలు 1. శాస్తద్రృష్టం, 2. గురుర్వాక్యం, 3. ఆత్మనిశ్చయం. ఏ విషయమైనా మొదట గురువులతో వినవలె. ఆ తరువాత దాన్ని తన పాఠంలో అనగా శాస్త్రంలో చూచుకోవలె. గురువుగారు చెప్పింది, శాస్త్రంలో ఉన్నది ఒక్కటేనా కాదా అని తర్కించుకున్నాక అప్పుడు తాను ఒక నిశ్చయానికి రావలె. కాని ఈనాటివారికి శ్రుతపాండిత్యం అనగా వినికిడి జ్ఞానం తప్ప పఠనజ్ఞానం లేదు. చదువు అనేది వౌఖిక క్రియ – ఈనాడు ఎంతో గొప్ప డిగ్రీ కలవారైనా తెరచి గొంతెత్తి ధారాళంగా చదవలేకపోతున్నారు. దానికి కారణం – అది అభ్యాసంలో లేకపోవడమే. అట్లాగే ఉక్తలేఖనం (డిక్టేషన్) అంటే మనం చెప్పింది చెప్పినట్లు అక్షరదోషం లేకుండా రాయలేకపోతున్నారు. దీనికి కూడా కారణం అలవాటు లేకపోవడమే. కాబట్టి చదువు, వ్రాత, వినటం అనే మూడు సమానంగా సాగవలెను. విషయం అర్థం కావడంతోనే సరిపోదు. అది భావితరానికి అందించవలెనంటే అతనికి సరైన భాషలో నిర్దుష్టంగా కాగితం మీద పెట్టడం కూడా రావాలి గదా.
సాహిత్య లోకానికి అవసరమైన మీ పరిశోధనాత్మక రచనలేమిటి?
కావ్యగణపతి, కళ్యాణ తారావలి, స్వర్ణ శకలాలు, రుద్రాధ్యయం, హనుమత్సందేశం, పామర సంస్కృతం, మంగల్య శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, భాగవత కథాతత్వం యయాతి చరిత్ర వ్యాఖ్యానం ముఖ్యమైనవి.
మహబూబ్నగర్ జిల్లా కవి పండిత వంశాల గురించి చాలా విస్తారంగా రాశారు కదా. వాటి వివరాలు చెప్పండి. మరి అది పుస్తక రూపంలోకి ఎందుకు రాలేదు. ఇది 1978-83 నాటి సంగతి. బహుశా కొన్నింటికి నేను లేఖకుడిని కూడా కావచ్చు. రాత ప్రతి ఉందా పోగొట్టుకున్నారా? సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ముందుకు వస్తే ప్రచురించడానికి అవకాశమిస్తారా?
ఒకే వంశంలో ఎక్కువగా కవులున్న కుటుంబాలను తీసుకొని దాదాపు 230 పండిత వంశాలను గురించి వ్రాసినాను. వాటిలో వట్టె నంబివారు, పల్లావారు, తెల్కపల్లి రామచంద్రశాస్ర్తీ కుటుంబీకులు, సంబరాజు వంశస్థులు, వెల్లాలవారు మొదలైన వారెందరో ఉన్నారు. దీని మూలప్రతి పోయింది. కాని చాలావరకు వ్యాసాలు ‘పరిశీలన’ అనే స్థానిక పత్రికలో వచ్చినాయి. వాటన్నింటినీ సేకరించి ఎవరైనా పుస్తకంగా ప్రచురిస్తామంటే ఆనందంగా అంగీకరిస్తాను.
చరిత్ర పరిశోధనలో మీ ప్రత్యేకత ఏమిటి?
స్థానిక చరిత్రలు ఇంకా వెలుగులోనికి తీసుకురావాలి. ప్రముఖ రాజుల చరిత్రలు గాక సామంతుల చరిత్ర కూడా అధ్యయనం చేయాలి. రాజుల వంశాలు, శాసనాలు వివరాలు అన్ని చోట్ల లభిస్తాయి. ఎలాగూ అవి ప్రజలందరికీ తెలుస్తాయి.
నేను ఎక్కడికివెళ్లినా స్థానిక చరిత్రలు, ప్రజల నోళ్ళలో నానుతున్న చరిత్రలు, కథలు అన్ని సేకరించి గ్రంథస్థం చేసినాను. పాలమూరు జిల్లా దేవాలయాలు, ఇంకా చాలా వ్యాసాలో స్థానిక చరిత్ర వివరించాను. ఈ తరం దాటిపోతే గ్రామాల స్థానిక చరిత్ర కూడా మనకు లభించదు. ఈ చరిత్ర సేకరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొంతమంది వ్యక్తులు వివరాలు చెప్పడానికిష్టపడేవారు కాదు. పాలమూరు జిల్లా దేవాలయాలు. మహాక్షేత్రం, మామిళ్ళపల్లి, సోమేశ్వర క్షేత్ర మహత్మ్యం, భైరవకోవ మహాత్మ్యం, ఉమామహేశ్వర కథ నేను రాసిన స్థానిక చరిత్రల్లో ముఖ్యమైనవి.
సామెతలు, మాండలిక పదాలు సేకరించారు కదా. ఇవి కేవలం పాలమూరు జిల్లాకు చెందినవేనా? మొత్తం తెలంగాణకు వస్తుందా? దీని స్ఫూర్తిగా ఇతర జిల్లాలవారు కృషి చేయవచ్చా?
నేను గోలకొండ పత్రిక చదివినపుడు ఆ భాష అంత శుద్ధ వ్యావహారికంగా ఉండేది. దానితో నాకు జానపదుల భాషలో రచనలు చేయవలెనని అభిలాష కలిగింది. అప్పటినుండి అంటే దాదాపు 50 సంవత్సరాల నుండి పదాలు, సామెతలు, జాతీయాలు సేకరించడం మొదలుపెట్టాను. ఇవి దాదాపు 6000 పదాలు. ఇవి ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందినవే కానీ, ఇతర జిల్లాలో కూడా ఉండవచ్చు. దీనిలోని పదాలన్ని శబ్దర్థచంద్రికలో లేని పదాలే. దానికి అనుబంధంగా ద్వంద్వాలు, ఊతపదాలు, జాతీయాలు, భాషీయాలు, న్యాయాలు కూడా ఉన్నాయి. జానపదులు గుర్తించిన పక్షులు, అంగవికారాలు, న్యాయాలు ఇలా ఎన్నో సేకరించినాను. వీటన్నింటిని ‘పామర సంస్కృతం’ పేరిట ముద్రణకు సిద్ధం చేసిపెట్టాను.
వ్యాపారధోరణి, యాంత్రిక నాగరికత, ఆధునికత్వం ప్రబలిన నేటి కాలంలో ప్రాచీన సాహిత్య అధ్యయనంవల్ల, చారిత్రక పరిశోధనలవల్ల కలిగే ప్రయోజనమేంటి?
తెలుగు భాష తీయనైనది. తెలంగాణ భాషకు ప్రామాణికత ఏర్పరచుకోవాలి. వ్యాకరణం ఏర్పరచుకోవాలి. భాషల ప్రామాణికత ఉండాలి. ఎవరు ఏది ఎట్లా వాసినా సక్రమమే అంటే భాష పాడవుతుంది. నా దగ్గరకు పీఠికల కోసం వచ్చిన వారికి ముందు పూర్తిగా చదివి వారికి నాకు తోచిన సవరణలు, వివరణలు చెప్పిన తర్వాతే పీఠికలు వ్రాసినాను. ఈ రోజు పుస్తకాలలో భాషాదోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
భాషలో మాండలికలు ఉపయోగించాలి గాని భాషను ఖూనీ చేయరాదు. సూర్యనారాయణీయం అనే ఒక వ్యాకరణ గ్రంథం ఒకటి ఉంది. అది తెలంగాణ పద్యాల స్వరూప స్వభావాలను భాషా ప్రయోగాలను వివరించింది. ఇది నేటి తెలంగాణకు సరిపోతుంది. భాష విషయకంగా తెలంగాణ భాష చాలా స్వచ్ఛమైన భాష. మహబూబ్నగర్ జిల్లాలో సంస్థానాలు ఎక్కువగా ఉండటం చేత, పండితులు ఇక్కడ ఎక్కువగా వర్థిల్లడం చేత భాష రక్షించబడింది. ఈనాడు చాలామంది రచయితలకు ప్రూఫ్ రీడింగ్ చేత కావడంలేదు. అసలు శబ్ద స్వరూపం పట్ల దృష్టే లేదు.
అవశ్యం ఈ అంశాలను పరిశోధనకు స్వీకరిస్తే బాగుంటుంది అని మీరనుకొనేవి కొన్ని చెప్పండి…
తెలంగాణాలో జాగీర్లు, మక్తాలు చాలా వున్నాయి. వాటిపై పరిశోధనలు జరగాలి. వాటిని వెలుగులోనికి తెస్తే చాలా సాహిత్యం బయటకు వస్తుంది. చరిత్రకెక్కని గ్రామాలగూర్చి పరిశోధనలు జరగాలి. ప్రభుత్వం పనిచేపడితే బాగుంటుంది. గ్రామస్థుల సహకారంతో ఈ పని చేస్తే ఫలితాలు బాగుంటాయి.
మన డిండి (దింది)కీ చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని కడుపునిండా ఎంతో చరిత్ర దాగివుంది. నేను చూడగానే దానిలో కలిసిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి. దాని వెంట కెయిరనలు (వీరగల్లులు)కు కూడా కొదువలేదు. దాని సమగ్రంగా బయటకు తీస్తే మన తెలంగాణ చరిత్రలో దుందుభీ తీర నాగరికత అని ఓ కొత్త అధ్యాయమే రాయవచ్చు. ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రాగలవు. మహబూబ్నగర్ జిల్లా ఆవంచ, డిండి లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాలు పోయాయి. నాటి చరిత్ర బయటకు తీయగలగాలి.
మీ దృష్టిలో పరిశోధనలు ఎలా ఉండాలంటారు? ఎలా ఉన్నాయంటారు?
పరిశోధనలు అనేవి నాలుగు కాలాలకు నిలిచేవిగా ఉండాలి. పరిశోధన ఏదో పట్టా కోసం మొక్కుబడిగా కాకుండా ప్రామాణికంగా ఉండాలి. ప్రామాణికత అనేది నేడు పలుచనైపోయింది. ఈనాటి పరిశోధనలలో భాష, వస్తువు రెండు కూడా అపరిపక్వంగానే ఉంటున్నవి. ఇపుడు మనకు అలవాటు అయిన భాషను వాడుకుంటూనే దాన్ని పూర్తిగా తిరస్కరించకుండా తెలంగాణ భాష, పలుకుబళ్ళు, దేశ్య పదజాలాన్ని విరివిగా వాడుకుంటూ విస్తృతీకరించాలి. ఆంగ్లాది అన్యదేశ్యాలకు మాత్రం తెలుగు సమానార్థకాలు వాడడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విషయంలో కన్నడ, తమిళ వాళ్ళకు ఉన్న పట్టుదల మనకు కూడా రావాలి.
కోరి కొలువైన కైలాసవాసుడు
04/06/2015

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ మరునాడు వెంకమ్మ ధాన్యపు పురిలో వెదికింది. ఆ ధాన్యపు పురిలో కాంతులీనుతూ శివలింగం కనిపించింది. వెంటనే వెంకమ్మ విజయరామ గజపతి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా తెలియచెప్పింది. మహారాజు ఒక మంచిరోజున వీరరాజేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అనంతర కాలంలో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో వీరరాజేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, గౌరీ శంకరులు ఉండటంతో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. 1978 సంవత్సరంలో మూడు కోవెళ్ళు దేవాదాయశాఖ అధీనంలోనికి వెళ్ళింది.
ఈ కోవెలలలో సీతారామస్వామి, జగన్నాథస్వామి పూజలు అందుకుంటున్నారు. వీర రాజేశ్వరస్వామికి ఇరువైపులా వినాయక సుబ్రహ్మణ్య స్వాములతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. మూడు కోవెళ్ళలో కొలువైన వీరరాజేశ్వరుని దర్శనం ముక్తిదాయకం.
మరో మనిషి రోబో
మరో మనిషి రోబో
-బి.వి.ప్రసాద్28/11/2015

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.
రోబోల గురించి చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. కాని తనను తయారుచేసిన సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది. తనలాంటి ఎన్నో రోబోలను తయారుచేసి విధ్వంసానికి కాలుదువ్వుతుంది. డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనం. ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది. అలాగే టివిల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మరమనిషిని చూస్తున్నాం. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను కూడా చేయడానికి 50 ఏళ్ల క్రితమే మరమనుషుల్ని ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. మనిషి కూడా చేయలేని పనులను సునాయాశంగా మర మనిషి చేయగలుతోంది. అయితే మరమనిషి ముప్పును సినిమాల్లో ప్రదర్శించారు. రోబో సినిమాలో చిప్ మార్చడంతో జరిగిన ప్రళయం కళ్లకుకట్టినట్టు చూపించారు. దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని తయారు చేసిన ఈ రోబో చిప్ మార్చడంతో భయానకంగా విరుచుకుపడుతుంది. రోబోల ఉత్పత్తిలో అనూహ్యంగా ప్రగతి సాధిస్తున్న తరుణంలో శాస్తవ్రేత్తలకు , ప్రజలకు ఆ చిత్రాలు ఒక హెచ్చరిక. ముందున్న ముప్పును గుర్తుచేశాయి. కాని అలాంటి సంఘటనలే ఇటీవల నాలుగైదు చోటు చేసుకోవడంతో రోబోల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రోబోలు వినాశకారిగా మారడం మనం సినిమాల్లోనే చూశాం. కాని ఇప్పుడవి నిజంగానే అనుభవంలోకి వచ్చాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న రోబోలు సహ కార్మికులను చంపేస్తున్నాయి. సహాయకారిగా ఉండాల్సిన రోబో మనుషులను ఎందుకు చంపేస్తున్నాయి? ఓ సినిమాలో చెప్పినట్టు ఈ రోబోలు భవిష్యత్లో వినాశకారిగా మారితే మనిషి పరిస్థితి ఏమిటి?
రోబోల చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో ఇదే మొదటిసారి. ఢిల్లీ సమీపంలోని గూర్గావ్లోని మానేసర్ ఎస్ కె హెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను అది ఎత్తుతుంది. రోబో ఎత్తిన ఒక షీట్ ఒకవైపు ఒరిగి పోయి ఉండడాన్ని గమనించిన రామ్ జీ లాల్ అది కింద పడితే డ్యామేజీ జరుగుతుందని భావించి దానిని సరిచేసేందుకు ముందుకువెళ్లాడు. అంతే రోబో అతనిని కూడా మెటల్కు సంబంధించినదిగా భావించి నలిపేసింది. గత ఏడాది జూన్ 29న జర్మనీలోని వోక్స్వేగన్ ఫ్యాక్టరీలోనే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేట్కు అదిమి గుండెలపై గట్టిగా నొక్కి చంపేసింది.
1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్ వర్కర్ను రోబో పొట్టనపెట్టుకుంది. తర్వాత 1984లో జపాన్లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలే అని సరిపెట్టుకోవాలా? లేదా హింసకు పాల్పడేలా ప్రోగ్రామింగ్ ఇన్ స్టాల్ చేశారా ఇలాంటి సాఫ్ట్వేర్ ఉంటుందా అనేది ఆలోచించాలి. రోబో ఒక యంత్రం కిందకే వస్తుంది కనుక యంత్రాల ముప్పుగానే దీనిని పరిగణించాలి.
మనిషి ఆవిష్కరణల్లో
మరో మైలు రాయి రోబో..
మనిషి దాహం తీరనిది, తన ఉనికిని కాపాడుకునేందుకు జాతి మనుగడకు రోజుకో ఆవిష్కరణ చేస్తునే ఉన్నాడు. మనిషి పరిణామ చక్రంలో లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రాన్ని ఆవిష్కరించిన తర్వాత యంత్ర పరికరాలు, వస్తు ఉత్పత్తి, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ వర్తకం, టెలిఫోన్, రేడియో, టివి, పర్సనల్ కంప్యూటర్, పేజర్లు, ఇంటర్నెట్, సెల్ఫోన్లు, స్మార్టు ఫోన్లు ఇలా స్వరూపం మారిపోతూ వస్తోంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, వినోదం, ప్రయాణం, విజ్ఞానం, వైద్యం, షాపింగ్, ఆర్ధిక లావాదేవీలు అన్నీ ఫోన్లలోనే సాగిపోతున్నాయి. ఈ క్రమంలో వినూత్న ఆవిష్కరణ మర మనిషి. విపత్తు, వినాశనం, వికాసం మూడూ కలగలసిన విధ్వంసకర ఆవిష్కరణ మరమనిషి. మరమనిషి అని మనం రోబోను చెప్పుకుంటున్నాం. ఒక వాస్తవికమైన యాంత్రిక కృత్రిమ ఉపకరణమే మరమనిషి. దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ మార్గనిర్దేశంతో పనిచేసే ఒక విద్యుత్ యాంత్రిక ఉపకరణంగా పిలుస్తాం.
మనిషి చేసే ప్రతి పనిని చేయగలిగే శక్తిసామర్ధ్యాలు రోబోలకు ఉన్నాయి. కర్మేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలు కూడా రోబోలకు ఉన్నాయని చెప్పవచ్చు. త్వక్కు, చక్షువు, రసన, శ్రోతం, ఘ్రానం రోబోలకు ఉంటున్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంథం, మనస్సు, బుద్ధి రోబోలకు దక్కుతున్నాయి. తాజాగా అహంకారం కూడా కలుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగా సొంతంగా పనులు నిర్వహించగలుగుతోంది. భౌతిక రోబోలు, వాటి సాఫ్ట్వేర్ ఉపకరణాలను కలిపి మనం రోబోట్ అంటున్నాం. రోబోట్లతో చాలా ప్రయోజనాలున్నాయన్నది నిర్వివాదాంశం. రానున్న రోజుల్లో ఇంటి పని నుండి యుద్ధాల వరకూ రోబోలు చేయని పని అంటూ ఉండదు. ఆ విధంగా చూస్తే భవిష్యత్ మొత్తం మరమనుషులదే. కానీ మనిషి తనకు సాయపడుతుందని తయారుచేసుకున్న రోబోలు చివరికి మనిషి ప్రాణానికే సంకటమవుతున్నాయి
1960లో జార్జి చార్లెస్ డోవోల్ అనే శాస్తవ్రేత్త తొలిసారిగా పారిశ్రామిక మరమనిషిని డిజైన్ చేశాడు. ఏంజెల్ బెర్జర్ సహకారంతో డోవోల్ తయారు చేసిన మొట్టమొదటి రోబోట్ను జనరల్ మోటార్స్కు విక్రయించారు. 1961లో డోవెల్ ఫ్యాక్టరీ నుండి యునిమేట్ అనే పేరుతో తొలి పారిశ్రామిక మరమనిషిని తయారుచేసి న్యూజెర్సీలోని జనరల్ మోటార్స్కు అమ్మేశాడు. ఆ తర్వాత పరిశోధనలు కొనసాగించి డిజైన్లో లోపాలను సరిచేసి విస్తృత స్థాయిలో 1966 నుండి రోబోల ఉత్పత్తి మొదలైంది. న్యూజెర్సీలో ఇన్స్టాల్ చేసిన తొలి రోబోను డై కాస్టింగ్ మెషిన్ నుండి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లను తీసి దొంతరగా పేర్చడానికి రోబోట్లను వాడారు.
కదిలే సామర్ధ్యం ఉండటం, యాంత్రిక అవయవం కలిగి ఉండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం రోబోల నిత్యకృత్యంగా ఉంది. గతంలో మానవ ప్రమేయం లేకుండా వాటి సాఫ్ట్వేర్ ఆధారంగా నియంత్రించబడే పరికరాలను పిలిచేందుకు మాత్రమే ఉపయోగించేవారు. స్వయంచాలక నియంత్రణ, పునఃక్రమణిక చేయగలిగే బహుళ ఉపయోగ యంత్రమే రోబో. పదార్థాలు, భాగాలు, సాధనాలు తరలించే పునఃక్రమణిక చేయగలిగే బహుళ క్రియా ఉపకరణాలు లేదా వైవిధ్యభరితమైన క్రియలు నిర్వర్తించేందుకు వివిధ క్రమణిక చర్యలు ద్వారా పనిచేసే ప్రత్యేకించిన పరికరాలను రోబోట్లుగా నిర్వచించవచ్చు. అనూహ్యమైన జోక్యం చేసుకోవలసిన క్లిష్టత ఉన్న కఠిన నియంత్రణ పర్యావరణాల్లో రోబోలను ఉపయోగిస్తున్నారు. అవయవాలను నియంత్రించే సామర్థ్యం ఉండటంతో పాటు మానవ లక్షణాలను కలిగి ఉన్న లేదా మానవ ప్రవర్తననే జంతు భాషలో చెప్పగలిగితే అటువంటి వాటిని రోబోలుగా చెబుతున్నాం. స్వయం చాలక పియానో కూడా రోబోనే.
చెక్ రచయిత కారెల్ కాపెక్ తొలిసారి రోబో అనే మాటను వినియోగించాడు. రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అని తన నాటకంలో వాడాడు. రోబోలుగా పిలిచే కృత్రిమ మనుషులను తయారుచేసే కర్మాగారంలో ఈ నాటకం ప్రారంభం అవుతుంది. ఇక్కడ యాండ్రాయిడ్స్ (యంత్ర మనుషులను ) తయారుచేస్తుంటారు. మనుషుల ఆధునిక భావాలకు దగ్గరగా అవి ఉంటాయి. కారెల్ కాపెల్కు ముందు దీనిని చిత్రకారుడైన తన సోదరుడు జోసఫ్ కాపెక్ దీనిని ఉపయోగించారని కూడా చెబుతుంటారు. గాడిద చాకిరి చేసే కఠోర పరిశ్రమ చేయగలిగే ఒక యంత్ర బానిసే రోబో. అలాంటి రోబోల గురించి వివరంగా అర్ధం చేసుకునేందుకు విస్తరించిన శాస్తమ్రే రోబోటిక్స్. రోబోలు నేడు బాగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆధునికీకరించబడుతున్నాయి. రోబోట్ల ప్రవర్తనను ఏ విలువలు నియంత్రిస్తాయనే ప్రశ్నలతో పాటు ఏదైనా సాంఘిక , సాంస్కృతిక నైతిక లేదా న్యాయపరమైన హక్కులు పొందగలవా అంటూ నిపుణులు, పరిశోధకులు పెద్ద ఎత్తున చర్చను ప్రారంభించారు. కంప్యూటర్లు, రోబోట్లు మానవుల కంటె తెలివిగా వ్యవహరించే రోజు వస్తుందని వెర్నోర్ వింజే పేర్కొన్నాడు. దీనిని అతడు ఏకైతత్వంగా వ్యవహరించాడు. ఈ పరిస్థితి మానవులకు కొంత వరకూ లేదా బహుశా తీవ్ర ప్రమాదకారిగా చెప్పవచ్చు. 2009లో కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రత సాధించగలగాలి అనే అంశంపై చర్చించారు. వాటి సామర్థ్యాలు ఎంత వరకూ ముప్పు కలిగిస్తాయి లేదా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది కూడా చర్చించారు. కొన్ని రోబోలు వివిధ రూపాల్లో పాక్షిక స్వాతంత్య్రతను సాధిస్తాయని నిపుణులు తేల్చారు. సొంతంగా విద్యుత్ వనరులను గుర్తించడం, ఆయుధాలతో దాడి చేసేందుకు లక్ష్యాలను స్వతంత్రంగా ఎంచుకునే స్థితికి వస్తాయని వారు గుర్తించారు. కొన్ని కంప్యూటర్ వైరస్లను నాశనాన్ని తప్పించుకోగలవని, అవి బొద్దింక మేథాశక్తిని సాధించగలిగాయని పేర్కొన్నారు. వైపరీత్యాలు, ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని వారు గమనించారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు పోకడలు కలిసి రోబోట్ కచ్చితత్వం, స్వతంత్రత విస్తృతమయ్యేందుకు దోహదం చేయగలవని వివిధ మాధ్యమ వర్గాలు , శాస్ర్తియ వర్గాలు చెబుతున్నాయి. మిలటరీ పోరులో రోబోల వినియోగాన్ని నిపుణులు , పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఆయుధ సహిత రోబోట్లను ఇతర రోబోటు నియంత్రించి ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థ ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. స్నేహపూర్వకంగా, మానవత్వంతో వ్యవహంరిచేలా చేసేందుకు ఉద్దేశించిన చర్యలతో రోబోలను అనుసంథానం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రోబోట్లను భద్రతా వ్యవస్థల సాధన సామగ్రిని అమర్చేందుకు పాటించాల్సిన నియమాలు అమలులోకి తేవడం ప్రారంభించాయి. అవి అసిమోవ్స్ రోబోటిక్స్ మూడు సూత్రాలను పోలిన చట్టాలు. సర్వీసు రోబోలను జపాన్ పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లో భాగం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రామాణిక కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏర్పడింది. రోబోట్ల నిర్వహణ వ్యవస్థ అనేది కొన్ని క్రమణికలు (ప్రోగ్రాంలు) ఉండే సర్వ ప్రవేశ (ఓపెన్ సోర్స్) వ్యవస్థ. దీనిని స్టాన్ఫోర్టు విశ్వవిద్యాలయం , మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , జర్మనీలోని మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్నాయి. ఉపయోగించిన నిర్దిష్ట హార్టువేర్తో సంబంధం లేకుండా ఒక రోబోట్ మార్గనిర్దేశకం , అవయవాలను ప్రోగ్రాం చేసేందుకు రోబోట్ నిర్వహణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ కంప్యూటర్పై బూట్ అయినపుడు అన్ని రకాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహిస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా రోబోటిక్స్ డెవలపర్స్ స్టుడియోలో రోబోట్ల వ్యవస్థ కోసం విండోస్ను రూపొందించింది.
తొలి రోజుల్లో గృహాల్లో కర్మాగారాల్లో రోబోట్లను ఉపయోగించినా, అనేక కొత్త అంశాలు కనుగొనేందుకు సుదీర్ఘకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 9 మీటర్ల పరిమాణంలో యంత్రాలు లేదా రోబోట్లను తయారుచేసేందుకు ఉద్దేశించిన నానో రోబోటిక్స్ ఇప్పటికీ ఎక్కువగా ఊహాత్మక సాంకేతిక పరిజ్ఞానంగానే ఉంది. వీటిని నానోబోట్లు లేదా నానైట్స్ అని పిలుస్తారు. వీటిని పరమాణు యంత్రాల నుండి రూపొందిస్తారు. పరిశోధకులు ఇంత వరకూ ఎక్కువగా సంక్లిష్ట వ్యవస్థలకు సంబంధించి బేరింగ్లు, సెన్సార్లు సింథటిక్ మాలిక్యులర్ మోటార్లను తయారుచేయగలిగారు. సూక్ష్మ స్థాయిలో పనిచేయగలిగే వైరస్లు లేదా బాక్టీరియా పరిమాణంలో ఉండే రోబోట్లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సూక్ష్మ శస్తచ్రికిత్సల సమయంలో వీటిని వాడుతున్నారు. సిలికాన్ శరీర నిర్మాణంతో సౌకర్యవంతమైన యాక్యుయేటర్లు (వస్తువులను కదిపే సాధనాలు), ఎయిర్ మజిల్స్, ఎలక్ట్రోయాక్టివ్ పాలిమర్స్, ఫెర్రో ఫ్లూయిడ్లు వంటి వాటిని మనం సాఫ్ట్ రోబోట్లు అంటున్నాం. ఫిజిలాజికల్, న్యూరల్ నెట్వర్కుల వినియోగంతో నియంత్రించబడటంతో పాటు ధృడమైన అస్తిపంజరంతో రోబోట్లకు భిన్నంగా కనిపిస్తాయి. వివిధ రకాల ప్రవర్తనను ప్రదర్శించగలిగే శక్తి వీటికి ఉంటుంది.
రీకాన్ఫిగరబుల్ రోబోట్లు కూడా రూపొందబోతున్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన పనికోసం తమ భౌతిక రూపాన్ని మార్చుకోగలిగే రోబోట్లను తయారుచేయడం కూడా సాధ్యపడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దీనికి పోలిన సూపర్ రోబోలు క్యూబ్ , చతురస్రాకారాల్లోకి ఇప్పటికే మారుతున్నాయి. చీమలు, తేనెటీగలు వంటి పురుగుల సమూహాల స్ఫూర్తితో పరిశోధకులు వేలాదిసూక్ష్మ రోబోలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాగి ఉన్నవాటిని కనుగొనడం, శుభ్రపరచడం, గూఢచర్యం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. చీమల దండు సమూహ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్టే మహాజీవవ్యవస్థగా పనిచేసేలా రోబో సమూహాలు తయారు చేస్తున్నారు. ఇంత వరకూ సృష్టించిన వాటిలో అతిపెద్ద సమూహాల్లో ఐరోబోట్ స్వార్మ్ ఒకటి.
రోబోల్లో సగభాగం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. 32 శాతం రోబోలు ఐరోపాలోనూ, 16 శాతం అమెరికాలోనూ, ఒక శాతం ఆస్ట్రేలియాలోనూ, ఒక శాతం ఆఫ్రికాలోనూ ఉన్నాయి. మొత్తం రోబోట్లలో 30 శాతం జపాన్లోనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానానికి జపాన్ నేతృత్వం వహిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భవిష్యత్ రోబోట్లకు సంబంధించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. ప్రసిద్ధ ఆస్ట్రోబాయ్ కారణంగా ఇక్కడ రోబోటిక్ అనుకూల సమాజం ప్రారంభం కావడం సాధ్యంగానే కనిపిస్తోంది. ఆసియా సమాజం రోబోలను మానవులతో సమానంగా భావిస్తున్నాయి. వృద్ధుల సంరక్షణ, పిల్లలతో ఆడుకోవడం, వారికి బోధనలు చేయడం లేదా పెంపుడు జంతువుల స్థానాన్ని భర్తీ చేయడం వంటి వాటికి వినియోగిస్తున్నారు.
****
చాలా వరకూ రోబోట్లు నిర్దేశిత పనినే చేస్తాయి. అయితే సాధారణ ఉపయోగార్ధం స్వతంత్ర రోబోట్లు వివిధ పనులను స్వతంత్రంగా నిర్వర్తించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. తెలిసిన ప్రదేశాల్లో స్వతంత్రంగా కదలగలుగుతాయి. వాటి సొంత రీ చార్జింగ్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ డోర్లు, ఎలివేటర్లతో సంకర్షణ జరపడం, ఇతర ప్రాథమిక విధులను నిర్వర్తించడం చేస్తాయి. కంప్యూటర్లు మాదిరిగానే నెట్వర్కులు, సాఫ్ట్వేర్లతో అనుసంథానం అవుతాయి. వ్యక్తులను, పక్షులను, వస్తువులను , జంతువులను గుర్తించడం, మాట్లాడటంతో పాటు సహచర్యాన్ని అందించగలుగుతాయి. ఉపయోగకరమైన పనులు చేయగలుగుతాయి. అంతే కాదు ఏకకాలంలో వివిధ రకాల పనులు కూడా చేయగలుగుతాయి. వివిధ సందర్భాల్లో వేర్వేరు పాత్రలను పోషిస్తాయి కూడా. కొన్ని రోబోట్లు మానవులను అనుకరించేందుకు , వ్యక్తుల ఆకారాన్ని ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి వాటినే మనం హ్యుమనాయిడ్ రోబోట్లు అంటున్నాం. మానవుల కంటే అధిక ఉత్పాదకత, కచ్చితత్వం, సహనం ప్రదర్శించగలిగే సామర్థ్యం రోబోట్లకు ఉంది. ఆటోమొబైల్ రంగంలో రోబోట్ల ఆధిపత్యం మొదలైంది. ప్రతి కర్మాగారంలో రోబోట్ల వినియోగం పెరిగింది. కనే్వయర్పై ఉన్న వాహన చట్రం వెల్డింగ్ చేయడం, అంటించడం, రంగు వేయడం చేస్తోంది. ప్యాకేజింగ్ కంపెనీల్లో వస్తువులను భద్రపరచడం, కనే్వయర్ బెల్టుపై నుండి డ్రింక్ కార్టన్లను వేగంగా తీయడం, వాటిని పెట్టెల్లో పెట్టడం, యంత్ర కేంద్రాల్లో బరువులు ఎక్కించడం లేదా దించడం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోబోలు ఖండాలు లేదా పళ్లేల నుండి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ కాంపొనెంట్లను తీసుకుని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై అత్యంత ఖచ్చితత్వంతో అమరుస్తున్నాయి. ఇటువంటి రోబోలు గంటకు వేలాది భాగాలను అమర్చుతున్నాయి . ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్గా కూడా రోబోలు పనిచేస్తున్నాయి. ఉపరితలంపై గుర్తులు లేదా తీగలు లేదా దృష్టిని ఉపయోగించే మొబైల్ రోబోలు సరకుల గిడ్డంగులు కంటైనర్ పోర్టులు లేదా ఆస్పత్రుల వంటి భారీ వసతుల్లో సరకులు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం
28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం
Posted in సమయం - సందర్భం
Leave a comment
రామారావు గూడెం బంధువు ఛి సౌ కల్పన దంపతులబాచుపల్లి స్వగృహం లో27-11-15 సాయంత్రం మేము
This gallery contains 34 photos.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 21-తిరుచానూర్ కృష్ణ కవి
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
21-తిరుచానూర్ కృష్ణ కవి
తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి –
‘’లక్ష్మీ మండ కురయాత్యసో శశికళా చూడావ చూడాయితా –శంభోర్య ప్రధమాన విభ్రమ భ్రుతః
వవ్రే సర్వ సురాసురస్య మిష తః స్పర్ధవతః కోమలా –రుడేశ్వర్యమనాన్య తుల్యా మమ్రుతో త్మాధో త్సవే శడంకరం ‘’
కవి పేరు తెలిపే శ్లోకం
‘’ద్ద్రాక్షా వీక్ష ప్రతీ సుక్రుదయ సరసతాభి శ్రురిశ్రుశ్వ సాక్షాత్ –నీచా మోచపి వాచాం మధురి మధురి సా పాద దూలిర్మదూ లిః
పీయూషం యోష వేషం వహతి నవ పాయో జోష మస్తో స ఏష –ధ్వన్యా ధ్వన్య ధ్వనీనో భువి జయతి తరాం కృష్ణ నామా కవీన్ద్రః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26 -11 -15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )
శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ కాలం లో మహా వ్యాకరణ వేత్తగా ప్రఖ్యాతుడు .అక్కడ వ్యాకరణ విద్యాలయం స్థాపించి నేర్పాడు .ఇందులోచదివిన వారిలో భట్తోజీ నాగోజీ లున్నారు .నరసింహుని ఇద్దరుకోడుకులు చితామణి,కృష్ణ లు గొప్ప విద్యావేత్తలు రచయితలూ .కృష్ణ కుమారులు వీరేశ్వరుడు నారాయణుడు .ఇందులో వీరేశ్వరుడు పండిత రాజు భట్టోజి ,అన్నం భట్టు లకు గురువు .శేషా లేక శేషం కుటుంబం వారణాసి వాస్తవ్యులైనా ఆంధ్ర దేశీయులే .
శేష కృష్ణ గిరిధారి అనబడే గోవర్ధన దారి అక్బర్ ఆస్థానం లో ఆర్ధిక మంత్రి అయిన రాజా తోడర్ మల్ కుమారుడు . కనుక కృష్ణ కవి 16 వశతాబ్దం చివరిదాకా 17 వశతాబ్దం ప్రారంభకాలం దాకా జీవించి ఉండ వచ్చు .ఈ కవి కంస వధ మురవిజయం ,ముక్త చరిత్ర సత్యభామా పరిణయం అనే నాటకాలను ,పారిజాత హరణం ,ఉషాపరిణయం ,సత్యభామా విలాసం ,క్రియా గోపన రామాయణం చంపూ కావ్యాలు రాశాడు .ఇవికాక ప్రక్రియా ప్రకాశంఅనే వ్యాఖ్యను రామచంద్ర విరచిత ప్రక్రియా కౌముది పై రాశాడు ,స్ఫోటత్వం ,యంగ్లు ఘంటా శిరోమణి అనే వ్యాకరణ గ్రంధాలను ,శేష కృష్ణ కారిక రచించాడు కాని లభ్యమైనవి కంసవధ నాటకం ,పారిజాతహరణం చంపు మాత్రమే .
కంస వధ 7 అంకాల నాటకం .1588 లో రాశాడు .భాగవత కద.గురువు గిరిధారి ప్రోద్బలం తో రాసినట్లు చెప్పాడు
‘’తస్యాస్తి తండన కులామల మండస్య శ్రీ తోడర క్షితి పతే స్తనయో న్యాజ్ఞః –ఆనాకలా కుల గృహం స విదగ్ధ గోస్టీమేఖో దితి గురుర్గిరి దారీ నామ్నా ‘’
ఈ నాటకాన్ని కాశీ విశ్వేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .మహా వ్యాకరణ వేత్త అయిన కృష్ణకవి వ్యాకరణ జ్ఞానం లేక పొతే యెంత గోప్పకవినైనా లోకం చులకనగా చూస్తుంది అన్నాడు
‘’రసాలంకార రసాసపి వాణీ వ్యాకర ణోజ్నితా-రివత్రేవనం రంజయతి సజ్జనాన్ ‘’
సాధారణం గా అన్ని శ్రవ్యకానాట కాలు లాకుండా ప్రదర్శన యోగ్యం గా ఉంది .మొదటి అంకం లో కంసుడు ఆకాశవాణి చెప్పింది విని కృష్ణుడిని సంహరించే అన్ని విధానాలు అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు .రెండవ అంకం లో కృష్ణలీలలు శకటాసుర ,కేశిని పూతన సంహారాలు ఉంటాయి .మూడవ దానిలో కంసుడు బలరామ కృష్ణు లను మధురకు ఆహ్వానించి చంపే కుటిల ప్రయత్నం చేయటం ఉంది .నాలుగవ అంకం లో శ్రీకృష్ణ బలరామూల మధురానగర ప్రయాణం ,యమునా ,గోకుల బృందావన వర్ణన ,చెలికత్తె విలాసవతి ద్వారా రాధ కృష్ణుడి కి పంపిన సందేశం ,రాసక్రీడ ఉంటాయి .అయిదులో బలరామ కృష్ణులు చాకలి నుండి బట్టలు తీసుకోవటం సుదాముని ఆతిధ్యం ,కుబ్జకు సుందర రూపమివ్వటం ,మధురానగర ప్రవేశం ఉన్నాయి ఆరు లో కువలయాపీడ ఏనుగును చాణూర మర్దన మల్లులను చంపటం ,చివరికి కంస వధ ఉన్నాయి .ఏడవ చివరి అంకం లో దేవకీ వసుదేవులను కంసుని చెరనుండి విడిపించటం ,ఉగ్రసేనుడిని రాజుగా అభిషిక్తుడిని చేయటం తో నాటకం పూర్తవుతుంది .
శేష కృష్ణ కవితా ప్రతిభ ఆద్యంతం కనిపిస్తుంది .కవికి జ్యోతిశ్శాస్త్రం లో ప్రవేశామున్నట్లు అర్ధమౌతుంది .బలరామ కృష్ణులు మధురకు బయల్దేరే ముహూర్తం దివ్యంగా ఉండేట్లు దైవజ్నుని చేత చెప్పించాడు .కాలిందీ నది సోయగాన్ని కమనీ యంగా వర్ణించాడు –
‘’పశ్యన్నేతాం చపల శఫరీ లోచనాంపంకజస్య –కోక ద్వంద్వస్తన భారనతాం బాల శైవాల కేశీం.
భ్రున్గశ్రేణీ మధుర వచనాం రాజ హంస ప్రచారం –వ్యాసక్తో పిక్షణమిహ పునః ప్రేయసీం స్మరితోస్మి ‘’
రాధ విరహ వేదనను పరమాద్భుతంగా విలాసవతి చేత చెప్పించాడు –
‘’మాలా వ్యాలానుకారా పరిమళ బహుళ స్నిగ్ధ చంపాను శంపా –పంపా కంపానిలోస్యా మలయా జని లయాశీ విషోద్గర ఘోరః
నస్యా దస్యా విభవ్య జ్వరమిహ కత మస్యో త్సకంపాను కంపా -ఝంపా సంపాత జగ్ర త్రుహిన కర హరి ప్రోద్గమో న్నాస భాజః ‘’
‘’పారిజాత హరణ చంపు ‘ను తాండవ రాజు సోదరుడు నరోత్తముని ప్రేరణ పై రాశాడు –‘’
‘’సానందం మకరంద బిందు నికర ప్రస్యంద బందీ భవన్ –మందీ భూతి మిలింద తు౦దిల దలన్మందార మందాదరం
భూయః సౌరభ లోభ సంభ్రమ భరాత్ భ్రుంగీ భిరంగీ కృతే –భామాయః కిల పారిజాత కుసుమే జీయాత్రుష్ణ౦ మనః ‘’అలాటి దివ్యపారిజాతాన్ని కోరకుండా ఎవరు ఉండగలరు .నందితిమ్మనతెలుగులో రాసిన ‘’పారిజాతాపహరణం ‘’ను శేష కవి బాగా అధ్యయనం చేసి రాసినట్లు కనిపిస్తుంది .దీని పై నంది కవి ప్రభావం అడుగడుగునా ఉంది .గంభీర రచనలో సిద్ధ హస్తుడైన కవి అతి సరళంగా సుందరంగా పారిజాత సుమాల౦త కోమలంగా కవిత్వం చెప్పాడు . తిమ్మన పద్యాలను ఒకరకంగా సంస్క్రుతీకరించాడని చెప్పచ్చు .సత్యభామ కోపాన్ని అనునయించే కృష్ణుడి పాట్లు –
‘’త్వం చంద్రికా చేత్తదహం చకోరే స్త్వందీపికా చేత్తదహం ప్రకాశః –కాదిమ్బినీ త్వం యది చాతకోహం ,మా మన్యదా మానిని మా స్మబుద్ధః ‘’.
మిగతా పారిజాత కావ్యాలలో పుణ్యక కవ్రతాన్ని వివరంగా వివరిస్తే మన శేష కవి ఒకే ఒక శ్లోకం లో చెప్పేశాడు –‘’
‘’అమర ముని సమాజే తత్ర సాత్రాజితీ సా గురుభి రధ నియుక్తా నారదాయా ర్చ యిత్వా –అదిత విదిత పుణ్యో పుణ్యకే పారిజాతం విదివదఖిల భర్త్రా వాసు దేవేన సార్ధం ‘’
ప్రతి సర్గ చివర్లో తన పోషకరాజు పేరును ప్రస్తావించాడు శేష కృష్ణ పండితకవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27 11 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్
‘’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి
బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .దీని మాతృక తెలుగు లో రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం .వసుచరిత్రను ముందుగా సంస్కృతం లో అనువాదం చేసినవాడు కాళహస్తి కవి అని మనకు తెలుసు .శ్రీధర పేరి సూరి దీనినే ‘’వసుమంగళనాటకం ‘’గా రాశాడు .బాబానృపాలుడూ ఇదే పని చేశాడు .కామ శాస్త్రి ఆ కోవలో మూడవ వాడయ్యాడు .
కామ శాస్త్రి ఈ నాటకం లో కొన్ని కొత్త పాత్రలను ప్రవేశ పెట్టాడు కొన్ని మార్పులూ చేశాడు .నాటక శాస్త్ర మర్యాదలనన్నిటి కి సమాధానం గా కోత్త సా౦కేతికతో దీన్ని చేశాడు .కాని టెక్నాలజీ యే మిగిలింది కానీ నాటక కళ దెబ్బతిని పోయింది .నాందీవాక్యం –‘’శ్రేయసే భూయసే భూయా ద్రాజ చూడామణి గిరావః –గిరిజా వదనా౦ భోజ చంచరీక ద్రుగస్చలః .’’
అయిదు అన్కాలకు 1-గిరికా దర్శనం 2 అమరావతి ప్రస్తానం 3 మహేంద్ర కృత ప్రతిజ్ఞ 4-కోలాహల కన్యాదాన ప్రతిజ్ఞా 5 –గిరిక కల్యాణం అని పేర్లు పెట్టాడు .రామరాజకవి వాడిన శ్లేషలను సంస్కృతం లోకి దింపే ప్రయత్నం చేశాడు .వసురాజును చూసి గిరిక లేవ బోతుటే వద్దని మర్యాదగా చెప్పిన శ్లోకం
‘’గుణాల నాలాధిక సౌకుమార్యకా –న్యనయద్రుగంబా పానల చుమ్బితానిచ –క్షామాణితన్వంగి మద్విదేషు తే మ్రుదూని గాన్నాన్యుప చార కర్మణి ‘’అని మర్యాద ఇస్తాడు .
అయిదవ ఆకం లో వసు గిరిక కల్యాణం వర్ణించాడు .అచ్చమైన తెలుగు ఇంటి పెళ్ళిలా మన పద్ధతిలోనే చేయి౦ చేశాడు పెళ్లి .ఫలశ్రుతి చెప్పాడు
‘’శ్రీ వెంకట గిరి నిలయః కరుణా రాసా వృష్టి శమిత జన తాపః –పాయాన్నః కృష్ణ ధనః సమవర్ధిత సుకృతి జన కడంబో యం ‘’
20 – మిశ్రమ భాణం రాసిన –కాశీపతి(17 20
కౌండిన్య గోత్రీకుడు ఉమాపతి పుత్రుడు కాశీపతి .1734లో మైసూరు రాజు సైన్యాధ్యక్షుడైన ఆంధ్రుడైన కలులే నాగ రాజు పోషణలో ఉండేవాడు .విలువైన 1- తన పోషకుడు నంజరాజు రాసిన ‘’సంగీత గంగాధరం ‘’ శ్రావణ నందిని అనే వ్యాఖ్యానాన్నిరాశాడు .2 –ముకున్దనందన భాణం రాశాడు .రెండింటిలోను గణపతిని ఒకే విధంగా స్తుతించాడు
‘’వందే వందారు మందార మిందు చూడస్య నందనం –అమందానంద సందోహ బంధురం సి౦ధు రాననం ‘’
వ్యాఖ్యానం లో కొన్ని చారిత్రిక విశేషాలు తెలియజేశాడు .రెండవది అయిన భాణం భద్రగిరి చూదేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఈ ముకుంద నందం విషయం లో, వివరణలో వినూత్నమైనదిగా కనిపిస్తుంది .ఇది మిశ్రభాణం. .ఆ రోజుల్లో వినూత్నమైనది అరుదైనదికూడా .సంస్కృత ప్రాక్రుతాలను కలిపి రాశాడు .రాజు భుజంగ శేఖరుడి క్రీడలు శ్రీ కృష్ణ గోపికా క్రీడల్లాగా ఉంటాయి ..తర్కం లో దిట్ట ఐన కవి కవిత్వం లో అదే పదును చూపాడు .సూత్రధారుడు కవి ప్రతిభను చక్కగా వివరించాడు –
‘’తర్క కర్కశ వక్ర వాక్య గహనే యా నిష్టురా భారతీ –సా కావ్యే మ్రుదులోక్తి సార సురభౌ స్యాదేవ మే కోమలా ‘’
కవి ఊహకూ సరల కవిత్వానికి మరో ఉదాహరణ
‘’భూయో నిపీయ లావణ్యా౦బుధి మప్రభాత౦ –పుంజీభవన్నుదయతే త పంచ్చలేన
ఔర్వీ గ్నిరంభార పయోనిది మత్చ్య పాతుం –నీలో దుబుద్ధద కడంబమితి ప్రతీమః ‘’’
కాశీపతి కవిత్వం లో కాళిదాస, జయ దేవ, లీలాశుకుల కవిత్వం మిశ్రితమై కనిపిస్తుంది
‘’తప్తాంబురుహం తదూరు యుగళం తాద్రుక్ నితంబ స్థలం –తన్మధ్యం స గభీర నాభి వలయస్తా వాను రోజ క్రమః
తదంకం తదపాంగ ముగ్ధ వలనం తే నీల నీలాలాలకాః-సా తన్వీతి తదంక కేషు హృదయం దావన్న విశ్రామ్యతి ‘’
ఇది ముకుందుడైన శ్రీకృష్ణుని గురించి రాసినదే అయినాకాదంబినీ అంటే మబ్బు కుమార్తె సౌదామిని అంటే మెరుపు ,కళానిధి కళత్ర చంద్రికా మొదలైన పేర్లు కూడా వస్తాయి కనుక ఇది పూర్తిగా భాణ లక్షణాలను కలిగి లేదు కొన్ని సామెతలనూ పనిలో పనిగా కవి చెప్పాడు. ఆ నాటి కాలం లో శృంగార వీరవిహారం గురించి వర్ణించాడు. తనకు ఇష్టమైనవి ,అయిస్ట మైనవీ చెప్పాడు. గూర్జరులను గూర్జర స్త్రీ లను విమర్శించాడు .ఇలా యే భాణం లోనూ లేదు ,
ఆంద్ర దేశం లో ఈ బాణం విస్తృత ప్రచారం లో ఉండేది .దీని చాలామంది కవులు అనుఅరించారు అనుసరించారు .కొందరు అందులోని వాక్యాలను ప్రేరణగా తీసుకొన్నారు .అందులో ముఖ్యమైనది –‘’మద్యం విష్ణు పదం కుచౌ శివపదం వక్త్రం విధాతుః పదం ‘’వంటివి .చిలకపాటి రామానుజ శర్మ దీన్ని పూర్తిగా అనువదించాడు .మరో సూక్తి ‘’చౌర్యేనైవ కృతం హికుక్షి భరణం జన్మ ప్రభూ ‘’ ను అవధానకవులు తిరుపతికవులు తమ ‘’పాణిగ్రహీత ‘’లో అనువాదం చేసి రాశారు .కనుక ఎందరికో ప్రేరణ నిచ్చి కొత్తమార్గం తోక్కించింది కాశీపతి రాసిన ‘’ముకున్దానంద భాణం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 11- 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 17-కవి కు౦జరుడు (1235)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
17-కవి కు౦జరుడు (1235)
అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు .ఇవి రాజశేఖర రాజాస్థాన కధలే .వీటిని రాజు సుబుద్ధికి వివరించాడు .కుంజర కవే అభినవ కాళిదాసు రాజశేఖరుని ఆస్థానకవి అని చెప్పాడు .రాజశేఖరుడు పినాకినీ తీర విద్యానగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు .కుంజర కవికావ్యానికినారాయణుడు వ్యాఖ్య రాశాడు .
కావ్యారంభం చేసినాక రాజుకు భా౦డవ్యుడికి జరిగిన సంభాషణ ఉంటుంది .
రాజు –స్కందే కృషీవల హలం కలయన్ క యాసి ?
భా౦డవ్య –గచ్చామి తే నికటమేవ విభో
రాజ –కిమర్దం ?
భాండవ్య—హ హంత కర్షణ పరాస్తవ వైరి భూషః
రాజ –(గద్యం నితంత సంతుష్ట స్తస్మే నిజ కర్ణా గతేస్వ కుండలే ప్రయచ్చత్
ఆశ్వాసాంత గద్యలో ‘’ఇతి శ్రీ కవి కుంజర కృతౌ రాజ శేఖర చరిత్రే సభా రంజన ప్రబందే ప్రధమోల్లాసః ‘’
కవి కుంజర ఇందులో 28కధలు 1-దుర్జయ 2-సూక్ష్మమతి 3-సారంగా 4 దైవజ్న వల్లభ 5 సోమ 6 కామలీల కవ యిత్రి 7 కాశీపతి 8 సానంద 9-రత్నాకర 10 కుటుంబ కవి మొదలైన శీర్షికలు పెట్టి కధలు వివరించాడు .ఈ పేర్లు అన్నీ అసలైన వో కాదో తెలియదు .కై ఇందులో శ్రింగార శేఖర ,మందర ,లలితపాల ,శ్రీకామ కమలాకర మొదలైన వారు అభినవ కాళిదాసు నేతృత్వం తో తమకు జరుగుతన్న అన్యాయానికి గాను దుర్జయుని దెబ్బ తీశారు .రాజుకు దుర్జయుని దురాలోచన తెలిసి బహిష్కరించాడు .
కుంజర కవి వెల్లాల కవి శిష్యుడు కనుక ,రామచంద్రకవి తరువాతి వాడుకనుక కాలం 1235 గా చెప్పవచ్చు .కవికి వచ్చిన బిరుదేకాని అసలు పేరు వేరుగా ఉండిఉంటుంది .రాజ శేఖరుని సమకాలీన రాజులు రాజేంద్ర చోళుడు ,పాండ్య రాజు విజయ వర్మ ,మాల్వలోని దారానగర రాజు ,సింహళ పాలకుడు ,కొంకణేంద్రుడు హూణ క్షోణిధరుడు మొదలైన వారున్నారని తెలుస్తోంది .దీనిని బట్టి చూస్తె అభినవ కాళిదాసు భోజరాజాస్తానకవి అనిపిస్తాడు .అక్కడినుండి రాజశేఖరుని ఆస్థానం చేరి ఉంటాడు .ఇవన్నీ ఊహాగానాలే .చారిత్రిక సత్యాలుకావు .వెల్లాల కవి భోజ రాజ ఆస్థానకవి అనటం అసంబద్ధమని పిస్తుంది .రాజ శేఖరుని దగ్గరకు రాకముందు మరొక దక్షిణ దేశ రాజు ‘’పుణ్య కోటి’’ ఆస్థానం లో ఉండేవాడినని ‘’అభి కవి ‘’స్వయంగా రాసుకొన్నాడు .కనుక కవి కుంజరునిరాజ శేఖర చరిత్ర ,రామ చంద్ర కవి ‘’ప్రక్రియ కౌముది ‘’కి తరువాత నే రాయబడింది అని అర్ధమౌతోంది .
18-కవి రాక్షసుడు (11 -13 శతాబ్దం )
గొప్ప లక్షణ గ్రంధ కర్త అని 14వ శతాబ్ది తర్వాతి తెలుగు లాక్షణికులు వ్యాకరణ కర్తలు ,అలంకార శాస్త్ర రచయితలూ . కవులచేత ప్రశంసి౦ప బడిన కవి రాక్షసుడు మహా కవి బహు గ్రంధ రచయిత.ఇతని రచనలు –కవి రాక్షసీయం ,ఆది నారాయణ చరిత్రం ,అనే తెలుగు రచనలు ,కవిరాక్షసీయం అనే ద్వ్యర్ధి కావ్యం ,సదార్ధ నిర్ణయం అనే నిఘంటువు సంస్క్రుతం లో రాసినట్లు చెప్పబడ్డాడు ..ఆంద్ర కవులు ఇతనికాల౦ 11-13శతాబ్దాల మధ్య అన్నారు .దాక్షారం నివాసి అన్నారు .రాక్షస నిఘంటువులో 67శ్లోకాలు మాత్రమె ఉన్నాయి .అసలు పేరు కాక బిరుదనామమే కవి రాక్షసుడు ‘ఈ బిరుదు రావటానికి కారణం కవే చెప్పాడు –
‘సాక్షరేషు భవతీహ జగత్యం సర్వ ఏవ హృది మత్సర యుక్తః –సాక్షరం కవి జనేషు తమేనం లోక ఏష ‘’కవి రాక్షస మహా ‘’
కవిరాక్షసీయం పై నాలుగు వ్యాఖ్యలున్నాయి .1-నాగ నారాయనుడి ‘’సిద్ధార్ధ దీపిక ,తెలుగుకవి లోకనాదుడురాసిన వ్యాఖ్యానం కాక అజ్ఞాత రచయితలవి మరో రెండున్నాయి .
కవి రాక్షసీయం 105 శోకాల గ్రధం .ప్రతి శ్లోకానికి రెండు అర్దాలుంటాయి .అందులో మొదటిశ్లోకం
‘’గుణ దోషో బుదో గృహ్నాన్ ఇందు క్ష్వేలా వివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చాతి’’
చివరి శ్లోకం
‘’మహాన్ స ఏవ పురుషో యస్య సత్యానురోదినః –ఆక్షిప్త పారిజాతేన బాహునా రక్ష్యతే జగత్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11 15 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)
అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦ పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం
అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కున్జరుడు .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి కొత్తవారినేవ్వరినీ ప్రోత్సహించానివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వె ల్లాలకవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగా రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,శృంగార శేఖర భాణంకూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డి త్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .
భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం చారు చంపూ ప్రబంధం ”.
అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చవర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .
ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యాప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –
”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేతశ్రుమ్ఖలితం
రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-15 -కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్














