ప్రత్యేక గణపతి -ధ్యాన శ్లోకం – కత్తినివదలి తంబురా పట్టిన కనక దాసు -రామకృష్ణ ప్రభ -సెప్టెంబర్

ganesh 2 001 ganesh 1 001 kanakadasa2 001 kanakadasa1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నట రాజ తత్త్వం -మూసి- సెప్టెంబర్

nataraja3 001 nataraja 1 001 nataraja2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వినాయక చిత్రం -స్వామిపై పద్యాలు -మూసి సెప్టెంబర్

musi2 001 musi1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో శారదక్కయ్య కొడుకు ఛి లక్ష్మణ్, ,కూతురు ఛి సౌ ఇందు

DSCN2369 DSCN2368 DSCN2367 DSCN2376 DSCN2375 DSCN2374

Posted in సమయం - సందర్భం | Leave a comment

బిహార్ మహా కూటమి ,అలుపెరుగని నాట్య మయూరి



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరంగల్ వద్దంటున్న గద్దర్ -లావణ్య పధం ,ఉద్రేకాలు రెచ్చగొట్ట తగునా


 
 

 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖేలానందం పేస్ జోడి విజయం


 
 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశ్రమలకు AP నంబర్ -2


 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు శుభ వార్తలు

నమ స్తే గోపాల కృష్ణ గారు -మొన్న గురువారం విశ్వనాధ వైభవం సదస్సులో మధ్యాహ్నం నేను పేపర్ ప్రెసెంట్ చేసిన సభకు కుప్పం ద్రవిడియన్ యూని  వర్సిటి తెలుగు ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు ..వారు ఏంతో గొప్ప పండితులు కవులు విమర్శకులు . సభను చాలా బాగా నడిపించి మార్గ దర్శనం చేశారు .వారి అడ్రస్ తీసుకొని మన సరసభారతి గ్రంధాలు వారికి శుక్రవారం రిజిస్టర్డ్ పోస్ట్ లోపంపాను .వారికి ఇవాళ సోమవారం వారికి అందగానే నాకు ఫోన్ చేసి చెప్పి ”చాలా శ్రమ పడి  రాశారండీ  ! చదివి మళ్ళీ చేస్తాను ”అన్న సంస్కారి .. అలాంటి వారి చేతిలో మన పుస్తకాలు ఉండటం మనకు, అదృష్టం గర్వకారణం .

  రెండో విషయం -శ్రీ ఎస్ ఆర్ భల్లం గారి రెండు పుస్తకాలు ”జ్ఞాన దర్శిని ””వేకువ పిట్ట ”లపై నేను నిన్న అంతర్జాలం  లో రాసిన సమీక్ష లను ఆయనకూ నెట్ లో పంపాను  . అయన ఇవాళ ఉదయం ఫోన్ చేసి సమీక్షలు చాలా బాగా ఉన్నాయని ,తనకు నారాయణ రెడ్డి గారు అత్యంత ఆప్తులని తన సభలు 80 కి పైగా ఆయనే అధ్యక్షత వహించారని ,ఇవాళ ఉదయం నా సమీక్షను సి నా రే ;గారికి ఫోన్ చేసి చదివి వినిపించానని ,ఆయనా చాలా సంతృప్తి చెందారని ,తాను  త్వరలోనే ”వేకువ పిట్ట  ”పై స్పందనలనన్నిటి ని ఒక పుస్తకం గా తేవాలని అనుకొంటు న్నానని,అందుకోసం నేను రాసిన సమీక్షకు మరికొంత కలిపి సమగ్రంగా తనకు పంపించమని కోరారు .
 మరో విషయ0 -మన ”కేమటా లజి పిత  కోలాచల సీతారామయ్య గారి మనవరాలు అనస్తే షియా తాతగారి మూలాలను  వెతుక్కొంటూ ఉయ్యూరు వచ్చిన విషయాన్ని నేను సమీక్షలో సమగ్రంగా రాయటం వలన తనకు ఆమె విషయం పూర్తిగా తెలిసిందన్నారు .తాను ఆమె రాకను పేపర్లో చదివి స్పందించి రాసిన ”పడమటి సంధ్యా రాగం ”కవిత ను ఆకాశ వాణి జాతీయ కవి సమ్మేళనం లో చదివానని తోటి కవులు ఏంతో  అభినందించారని తెలియ జేశారు భల్లం గారికి మన పుస్తకాలు ఈ రోజే పోస్ట్ లో పంపాను  ఇవి మీకూ  సంతోషం కలిగిస్తాయని తెలియ జేశాను -దుర్గాప్రసాద్ –
శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్గారికి అనేకానేక వందనములతో: విషయాలు చదివి చాలా సంతోషించాను . బహు ముఖ ప్రజ్ఞాశీలి ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటే శ్వర్లు గారి  , శ్రీ ఎస్ . ర్ . భల్లం గారి స్పందనలు,   మీ సాహిత్యరచన, విమర్శలలో అద్వితీయమైన ప్రతిభకు అద్దం పడుతోన్నై. మీలో నాకు తెలిసిన ఇతర పార్శ్వాలు (  సునిసిత హాస్యధొరణులతో మిళితమైన రాజకీయ ద్విప్లేట్స్ , సందర్భోజిత సంభాషణ , సమయ కాల నియమావళి, ధైర్యంతోకూడిన మనోభావ ప్రకటన, స్నేహ  సౌభ్రాతుత్వం, సౌశీల్యం , అన్నిo టికీ మించిన ఆధ్యాత్మికత) ఇవన్నీ కలిసి రంగరించిన వెలకట్టలేని లక్షణాలకు దరి కావటం మా అదృష్టం . భాషలో తప్పులు మన్నించగలరు . –మీ గోపాలకృష్ణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఏకవీర నవలలో సాంఖ్య యోగం ;డా జి వి.పూర్ణ చంద్

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సానియా వన్స్ మోర్

 
 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”స్మర సమరం ”మరియు నిస్శ్బ్దనాదాలైన హిందీ సినీపాటలు


 
 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బోయి భీమన్న ,అమ్మంగి వేణుగోపాల్ లపై వ్యాసాలూ ,ఒక కవిత


 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేకువ పిట్ట

వేకువ పిట్ట

శ్రీ ఎస్ .ఆర్.భల్లం గారి ‘’వేకువ పిట్ట ‘’56 కవితల సంపుటి .సందర్భాను సారంగా చెప్పినవి అనుభవం తో చేసినవి స్పందించి రాసినవి ,చెప్పాలని చెప్పిన కవితలివి .చాలా సాంద్రమైన కవిత్వం ఉంది. సుతిమెత్తగా చెప్పాల్సిన చోట చెబుతూ ,అవసరమైన ప్పుడు బల్లెం తో పోడిచినట్లూ చెప్పటం భల్లం వారి ప్రత్యేకత ‘       .ముందుగా మా ఉయ్యూరుకు సంబంధించిన కవితను గురించి తెలియ జేస్తాను .కొలచల సీతారామయ్యగారు అనే ఆయన 1917లో ఉన్నత చదువులకోసం మదారాస్ కు ఉయ్యూరు నుండి కాలినడకన వెళ్లి అక్కడ మదనపల్లి కాలేజిలో చదివి ,విద్యా తృష్ణ తీరక సైంటిస్ట్ అవ్వాలనే కోరికతో ఉండగా తండ్రి గారు చనిపోయారనే వార్త తెలిసి ఉయ్యూరు వచ్చి ఆ పది రోజులూ గడిపి అన్నగారు గాయత్రి అనంత రామయ్యగారికి మనసులో మాట చెప్పి ,ఆయన కాదనలేని పరిస్తితిలో అనుమతిపొంది తండ్రిగారు కూడ బెట్టి ఇచ్చిన రెండు వేల రూపాయలను అన్నగారివ్వ గా  తీసుకొని మద్రాస్ వెళ్లి అక్కడి నుండి అమెరికా వెళ్ళే ఏర్పాటు చేసుకొన్నారు .పొగ వోడఎక్కి  స్నేహితుడిగా నటించిన ఒక తమిళుడు డాలర్లుగా మార్చి డబ్బు తెస్తానని రెండు వేలు కాజేసి ఉడాఇంచగా బొగ్గు గదిలో కెప్టెన్ దయా దాక్షిన్యాలతో ప్రయాణం చేసి సింగపూర్ చేరి అక్కడ కొందరు సాయం చేయగా మళ్ళీ షిప్ లో ఎక్కి కెప్టెన్ చెప్పిన అరవ చాకిరీ అంతా చేస్తూ అమెరికా చేరాడు .అక్కడ నెమ్మదిగా చదువుపూర్తీ చేసి స్వంత కాళ్లమీద నిలబడి అనుకొన్నది సాధించాడు .

తనకు సరైన దేశం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సోవియట్ రష్యా అని భావించి అక్కడికి వెళ్లి మాస్కో నగరం లో ఉండి ఆయిల్ సైన్స్ లో అనేక పరిశోధనలు చేసి యుద్ధపు టాంక్ లలో ఉపయోగించే ఇంధనం సమర్ధ వంతంగా ,పని చేయటానికి కలుపవలసిన వాటినికనిపెట్టి సామర్ధ్యాన్ని పెంచి తేలిక రకమైన టాంక్ ల నిర్మాణానికి దారి చూపి ఆధునికకాలం లో ‘’కేమటాలజి’’గా పిలువ బడుతున్న శాస్త్రానికి ఆద్యుడై ‘’ఫాదర్ ఆఫ్ కేమటాలజి ‘’గా పేరు పొందిన సీతారామయ్యగారు ఉయ్యూరు వాడు కావటం మా అదృష్టం .ఆయన ఉయ్యూరు వదిలిన 46 ఏళ్ళకు రష్యానుండి ఇండియాకు 46 రోజులు ఉండటానికి వచ్చి ,ఇక్కడ పౌర సన్మానం పొంది బంధువులతో గడిపి క్షేత్ర సందర్శనం చేసి  వెళ్లి పోయారు అప్పుడు1963లో  ఆయన్ను చూసిన భాగ్యం మాకు కలిగింది .ఇక్కడి నుంచి వెళ్ళిన కొన్ని ఏళ్ళకే మాస్కోలో మరణించారు  రష్యా యువతినే వివాహమాడి ఇద్దరు ఆడపిల్లలకు జన్మ నిచ్చి భారతీయ పేర్లే వారికి పెట్టి అక్కడ వారింట్లో అచ్చమైన తెలుగు భోజనమే అతిధులకు అందిస్తూ సంప్రదాయాన్ని lతెలుగుదనాన్ని కాపాడుకొన్న మహనీయుడు .

ఆయన పెద్ద కూతురి కూతురు ‘’అనస్తేషియా ‘’సుమారు పదేళ్ళక్రితం తాతగారు సీతారామయ్యగారి స్వగ్రామం దర్శించాలని అమెరికాలోని కాలి ఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చింది .’’హాం రేడియో’’ వ్యవస్తాపకుడు మా ఉయ్యూరు వాసి మాకు హైస్కూల్ లో జూనియర్ అయిన సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి వెంబడి పెట్టుకొని ఉయ్యూరు తీసుకు వచ్చి ఆమె తాతగారి మూలాలను గుర్తింపజేసి ,సభ పెట్టి ఆమెను సత్కరించి మా బోటి వారితో మాట్లాడించాడు .ఆమె అచ్చమైన భారతీయ మహిళగా చీర జాకెట్ కట్టి బొట్టూకాటుక ,తలలో పూలుపెట్టుకొని గాజులు తొడుక్కుని వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది .మా ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆసభలో పాల్గొన్నాడు . సీతారామయ్య గారి జీవితం పై ఆయన పెద్దల్లుడు బ్రేజేనేస్కి రష్యన్ భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్ భాష లోకిశ్రీ  ఎస్.పి.కే గుప్త ,శ్రీమతి అచలా జైన్ ‘’A wreath for doctor Ramayya ‘’గా రాస్తే నేను దాన్ని ఆధారం గా అనేక శీర్హికలతో అంతర్జాలం లో ‘’కేమటాలజి పిత కోలచల సీతా రామయ్య ‘’అని 32 ఎపిసోడ్ లు రాసి దానికి టాగ్ గా ‘’పుల్లేరు నుండి ఓల్గా వరకు ‘’అని పెట్ట్టాను .ఈ నెలలో 5-9-15ఉపాధ్యాయ దినోత్సవాన్ని   సరసభారతి నిర్వహించిన కీ శే కోట  సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులు ,గురువు గారి వర్ణ చిత్రాన్ని రచించిన ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ ,శ్రీ రాజేంద్ర మొదలైన వారి సమక్షం లో ఆవిష్కరింప జేశాం ఈ సందర్భం గా నేను రామయ్యగారిపై రాసిన దాన్ని తాను  పుస్తక రూపం లో తెస్తానని రాజేంద్ర తెలియ జేశాడు .

ఎనస్తేషియా రాక సంఘటన ను చూసిన లేక తెలుసుకొన్న భల్లం గారు ‘’పడమటి సంధ్యారాగం ‘’కవితలో  అక్షర బద్ధం చేసి చిరస్తాయి కల్పించారు .’’ఒక మెలకువ లాంటి కలలోంచి –పూర్వీకం పుడమి పుట్టిల్లని –ప్రేమ పూత రేకులుగా వత్తడానికి –పెంగ్విన్ పిట్టలా ఎగి రోచ్చావా ?అని మొదలు పెట్టి రాశారు .’’అనురాగ రహిత సంగీతపు అపశ్రుతుల్ని వినటానికి –అలవాటు పడ్డ మా కర్ణ పుటలపై –పడమటి సంధ్యా రాగం లో ఇమిడే ఆత్మీయ చరణానివి ‘’అన్నారు .ఆమె రాకలో ‘’చెలిమి చెరువు ,శిధిలమైన ప్రేమ కింద చిగురించిన ప్రియ బాంధవ్య స్పర్శ ‘’కనిపించింది కవికి .

‘’నీ రాకతో అమ్మా అనస్తీషియా—ఉయ్యూరు చెరుకు మరీ తియ్యగించింది –పగుళ్ళు బారిన గుడి ధ్వజ స్థంభం పై చిరు గంట  –నీ  కరస్పర్శ కై కొంగ జపం చేస్తోంది .’’అని మా కెసీపి షుగర్ కు మరింత తీయ దానాన్ని తెప్పించారు .

‘’అమెరికా ఆంధ్రాకి దూరా భారమైతేనేం –నీ ఆత్మీయతా రెక్క ఎగురుడు ముందు తక్కువేగా’’ ?’’అని ఆత్మీయత ముందు దూరం చిన్నబోతున్దన్నారు .

‘’ఉయ్యూరు కంటే కాలిఫోర్నియా పెద్దదైతేనేం –నీ ప్రేమ సంకల్పం ముందు చిన్నదేగా’’అంటూ

‘’ప్రియాతి ప్రియమైన అనాస్తేషియా-నువ్వీ మట్టిని స్పర్శించి వెల్లడ మంటే –పూర్వీకం పేగుల్లో –పట్టెడు ప్రేమ మెతుకుల్ని పదిల పరచుకోవడమే ‘’అని గుండెలోని ఆనందాన్ని వ్యక్తపరచారు భలేగా భల్లం గారు .

మరోకవిత బుజ్జాయి లో ‘’చిగురు ముందు చెట్టు  శీర్షా సనమేయడం’’గా ఉందట .’’మరచెంబు ‘’తీపిజ్ఞాపకాలు నేమరేస్తూ ‘’బియ్యపు గింజ మీద తాజ్ మహల్ ని చిత్రించినట్లు –సంప్రదాయాన్ని వదులుకోలేని –ఈ మరచెంబు ఎన్నెన్ని రుచుల్ని గర్భీక రించు కొందో ‘’అన్నారు .’’

పల్లెటూరి లోని ‘’ఈతకొలను ,పూత రేకూ –గున్నమావీ ,గిలక బావి –గుడ్డ ఊయల ,బడి బంగాళా ‘’అన్నీ ఇప్పుడు ‘’రంగుల కరెన్సీ కంపే ‘’కొడుతున్నాయట .’’వంగడాల కోసం –లొంగ డాలు మొదలయ్యాక –పెంట ఎరువు సారం కంట కింపు ‘’అయిన్దంటారు ‘’పల్లె విత్తనం ‘’లో .’’ధింసా ‘’కవితలో ‘’ధింసా అంటే –నది  మీద  యెగిరి –మైదానం లో కురిసే వర్షం కాదు –పురాతనం మట్టి లోంచి –ప్రేమగా వీచే నాట్య సుగంధ సమీరం ‘’అనే అర్ధం చెప్పారు .తల్లికి జ్ఞాన బోధ చేస్తూ ‘’అమ్మాయీ !బుడ్డోడిని ఏడవ నివ్వకు-దేహం దేవిడీ లో –ధింసా స్వరాలు మటు మాయ మౌతాయేమో/అని సందేహం వెలిబుచ్చారు .సహజత్వానికి గొప్ప ఉదాహరణ ఈ కవిత . తండ్రి కవి సుధానిధి భల్లం తిరుపతి రాజుగారిని  ‘’ను  గుర్తుకు తెచ్చుకొంటూ ‘’నాయనా ‘’కవిత లో’’ మనిద్దరి మధ్య దివ్య భాష తప్ప –ద్రవ్య భాష ఎప్పుడూ స్పర్శించేదికాడు ‘’అనటం వారి ఆత్మీయ బంధానికి నిదర్శనం .పుస్తకం శీర్షిక అయిన ‘’వేకువ పిట్ట ‘’కవితలో రోడ్డు ప్రమాదం లో మరణించిన విలేకరి మిత్రునికి అశ్రుతర్పణం చేస్తూ అతడు ‘’గ్లోబల్ తోడేళ్ళ నోళ్ళకి –మానవీయ వలువల మాంస ఖండాల్ని అందించే –రాజకీయ ఋతువులలో కూడా –ఒక నులి వెచ్చని స్పర్శలా మెలగుతాడు ‘’అని మెచ్చుకొన్నారు .

పొలం భాష అయిన ‘’మునుం పాట ‘’లో ‘’కనుపాపా మనదే ,కను రేప్పా మనదే –చూపులే మనవికావు –బతుకు సరుకుగా మారినప్పుడే –మనిషి కలలు ఎప్పుడో చెదరి పోయాయి –మనసు పొరలు ఎప్పుడో చిరిగి పోయాయి ‘’అని ఆవేదన చెందాడుకవి .‘’ఆరుద్ర పురుగు తోల్వని మట్టి పుటలో –మునుం పాట చరణాలేమయ్యాయో-నాగేటి చాలులో రైతు నాటుకొన్న –ఆశల విత్తనాలేలా బుగిలి పోయాయో ‘’అని రైతు దయనీయ స్తితిని కవితాత్మకం చేశారు .అన్నం కారియర్లు అందించే అసిరిగాడిని  ఆకలి కబలిస్తే స్పందించి ‘’అమ్మలాంటి అతడు ‘’రాశారు .’’ఆకలి బెబ్బుల్ని హతమార్చతానికి –ఆత్మీయ ఆహార ఆయుధం తెచ్చిన ఇతడిని –గౌరవించ కుండా ఎలా ఉండగలను ?’’అని సహవేదన చెందారు సానుభూతి వర్షించారు .’’పేగు ని౦పని పోగు ‘’కవితచేనేతి వ్రుత్తి వారి చావులు ,దుర్భర జీవిత చిత్రణ –

‘’గంజి నీళ్ళలో గుంజి ఆరేసిన పోగుల పేగుల మీద –బుటాలు బుటాలుగా జరీ పూలు ఎలా అందగిస్తాయో –అరిగిన రూపాయి అడుగు జాడలలో –ముడి నూలుకి అంటు కట్టిన చక్ర వడ్డీల చీడ పీడా ఎలా వదుల్తుందో?’’ఎవరి మూసల్లో కాదు –మాసాల్లో వాళ్ళు కార్చే –మొసలి కంటి తుడుపు వాగ్దానాల జలదారాలకి –చచ్చిపడిన పచ్చి పడుక్కి ప్రాణ మొస్తుందా ?’’అని వారిభాషలోనే గొప్ప కవిత్వం అల్లారు భల్లం .’’మనిషి చరిత్ర పుస్తకం  అట్టమీద –చేనేత చెలికాని అసహజ మరణం మరకల్లేని –బొమ్మేపుడు ముద్రించ బడుతుందో ?’’అంటూ వారి చీకటి బతుకుల్లో వెలుగులేప్పుడు వస్తాయోనని ఆవేదన చెందారు .బొర్రా అంటే రంధ్రం –అవి గుహలు మాత్రమే కావు –అనంతానంత జల శిఖరాలు కూడా –పచ్చ మీగడ వంటి ప్రక్రుతి ఆకృతులు ‘’అని బొర్రా గుహల అండదచందాలను ప్రక్రుతి  రామణీయకతను ప్రశంసించారు భల్లం .గీతకార్మికులపై ‘’తాటి ముంజే దీపం ‘’,పిల్లలు సరిగ్గా చూడని అనాధ వృద్ధులమరణాలపై ‘’పోలి కట్టే ‘’,అవినీతిపై ‘’ఆమ్యామ్యా ‘’,హాస్టల్ విద్యార్ధుల అవస్తలపై ‘’ఇలా ఎందరో ‘’కవితలు రాసి కదిలించారు .

మహా రాష్ట్రలో అదనపు కలెక్టర్ ‘’యశ్వంత్ సోనావానే’’ను సజీవ దహనం చేసినపుడు ‘’దేశం కన్నా దేహమూ –కర్తవ్యమ్ కన్నా కరెన్సీ ఎక్కువైన చోట –పెట్రో కొలిమిలో చిట్లిన మృత్యు సంగీతం సాక్షిగా –ఊదు కడ్డీ పొగ తీగలకు వేలాడ దీయ బడిన దుర్మరణం ‘’అని కన్నీరు కార్చాడుకవి .

రోడ్డుమీద బొగ్గుతో బొమ్మలేసే వాడి గురించి ‘’బొగ్గు బొమ్మ ‘’కవితలో –

‘’శిలనైనా చిరునవ్వు కుంచెతో –పగుల  గొట్టగల నమ్మకం వాడిది –అవసరం ముందు అవనత చిత్ర మయ్యాడంతే ‘’-‘’గతుకుల బతుకు బాటలో –అతకని చిత్రాలు ఎపుడూ ప్రశ్నించవు –అరిగి అరిగి చెరిగిపోతాయ౦తే-రహదారి నుంచి విడివడని రంగుల వ్యామోహాల మధ్య –ఒక శూన్య చిత్రంగా నిర్జీవంగా నిలబడే ఉన్నాడు ‘’అని కాసులు రాల్చని వాడి కళకు నీరాజనమెత్తాడు కవి .

అనాలోచితంగా ఆత్మ హత్య చేసుకొనే వారికి ‘’ఎవరికోసం ‘’కవితలో ‘’అర్ధాంగి ఋణం తీర్చటమంటే –మరణానంతరం మౌనంగా దుఖించటం కాదు –ప్రతి రోజు ప్రేమ సామ్రాజ్యాన్ని –ఆమె పాదాల ముందు ప్రణమిల్ల చేయటం ‘’’’దహన  దాహాల తదనంతరం –తనని పోగొట్టుకొన్న అతడు తప్ప –ఉసురు తీసిన –ఇన్ని దాహాలతో యెట్లా బతికేది ఆమె లేకుండా ?’’అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కాని మరణమే శరణ్యం అనుకోరాదని హితవు .

‘తల్లి అంటే –అప్పుడప్పుడు గుర్తు చేసుకొనే గతం కాదు –పల్లె అంటే –అనేకానేక అభిమానాల మధ్య గుర్తు పట్టే వర్తమానం ‘’

ఇలా చాలా రసార్ద్ర్డంగా ,కమనీయం గా మూలాల లోకి వెళ్లి కవిత్వం చెప్పారు .ప్రతికవిత ‘’కదిలించేదే –కర్తవ్యమ్ బోధించేదే సానుభూతి కురిపించేదే సహవేదన తెలియ బరచేదే ,కకృతజ్ఞత  చూపించేదే సెభాష్ అని మెప్పించేదే . జన జాగృతిని చేసేదే  అందుకే  ‘’వేకువ పిట్ట ‘’అయింది .అందమైన ముఖ చిత్రం క్వాలిటీ ముద్రణ అదనపు ఆకర్షణలు .2004-14 కాల వ్యవధిలో అంటే పదేళ్ళలో రాసిన  చిక్కని చక్కని కవిత్వమేఇది . .పదబంధాలు పడభావ చిత్రాలు కోకొల్లలు . శబ్దం భల్లం గారి చేతిలో పల్లవమే అవుతుంది .సోగసులులతో సుగంధ భరితమౌతుంది .పదం కోసం వెతుకు లాట ఉండదు .సూటిగా హృదయానికి బల్లెంలా తాకేదే శ్రీ భల్లం కవిత .చదివి ఆస్వాదించి ఆనందం  పొందండి .

ముఖ చిత్రం జత చేశాను చూడండి

100 రూపాయల ఈ అపురూప ‘’వేకువ పిట్ట ‘’లభించే స్థలం

భల్లం సామ్రాజ్య లక్ష్మి 4 -87—12  -ఇందిరా నగర్ –గాంధి బొమ్మ సెంటర్

తాడేపల్లి గూడెం -534 101

Email-sr.bhallam @gmail.com

Cell-98854 42642

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ భల్లం రచనలు

jnanadarshini 1 001 jnana darshini2 001శ్రీ భల్లం రచనలు

శ్రీ భల్లం సూర్యనారాయణ రాజు అనే ఎస్. ఆర్. భల్లం భాషా ప్రవీణ ,తెలుగు ఏం ఏ .పశ్చిమ గోదావరి జిల్లా బాదం పూడి జి ప.ప. ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులు .తాడేపల్లి గూడెం నివాసం .’’నీటి భూమి ‘’,గూడు వదిలిన గువ్వలు ,చిగురు కేక ,కొల్లేరు, కొల్లేరు జీల్ ,జ్ఞాన దర్శిని ,వేకువ పిట్ట ‘’మొదలైన రచనలు చేశారు .ఉగాది కవితాపురస్కారం ,తెలుగు భాషా వికాసం పురస్కారం ,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,ధిల్లీ తెలుగు అకాడెమి సత్కార్ ,ఆంద్ర మహాసభ కవితా పురస్కార్ ,శాంతినికేతన్  పురస్కార్ అందుకొన్నారు .పశ్చిమ గోదావరిజిల్లా అధికార భాషా సంఘ కన్వీనర్ ,రచన సాహితీ గృహం –వ్యవస్థాపక అధ్యక్షులు .శ్రీ నారాయణ రెడ్డి కవితా యాత్ర ను   పల్లె నుండి ధిల్లీ దాకా శత ప్రసంగాలతో చేశారు .అలాగే సి నా రే కవితా ప్రసంగాలతో ఆంధ్రా నుండి అమెరికా వరకు ప్రయాణించారు .తిరుమల స్వామి వారి నిత్య కళ్యాణోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యాతలు .అమెరికా తెలుగు వెబ్ సైట్ లో వీరి రచనలు అనేకం చోటు చేసుకొన్నాయి .వీరి కవితలు బహుభాషలలోకి అనువాదం పొందాయి .ఇంతటి లబ్ధ ప్రతిస్స్టితుడైన శ్రీ భల్లం తన ప్రచురణలను నాకు ఎప్పటికప్పుడు పంపుతున్నారు .ఈ నెలలో వేకువ పిట్ట ,జ్ఞాన దర్శిని హిందీ రచన కొల్లేరు జీల్ పంపారు .జీల్ హిందీ కనుక నాకు అందులో ప్రవేశం లేదుకనుక మొదటి రెండు పుస్తకాలపై నా భావాలను మీతో పంచుకొంటున్నాను .

1-       జ్ఞాన దర్శిని

యాభై విభిన్న విషయాలపై రాసి జ్ఞాన బోధ చేశారు .’’ఆనందో బ్రహ్మ’’ తో ప్రారంభించి ‘’అనుభవ సారం ‘’తో పూర్తి చేశారు .ఏ విషయం తీసుకొన్నా లోతైన చర్చ చేసి నిగ్గు తేల్చారు .వేదోపనిషత్తులు ,మను స్మ్రుతి ,పురాణాలు మొదలైన మన పూర్వ గ్రంధాలనుండి అనేక ఉదాహరణలిచ్చారు వీరి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఓహో అని అనుకొంటాం చక్కని భాష మధురమైన పదాలు తేట తెల్లనైన భావాలతో గ్రంధం ఆద్యంతం రక్తి కట్టి శిఖరారోహణం చేయిస్తుంది భల్లంగారి ప్రతిభ శత పత్ర వికసనం గా పరిమళ భరితమై అలరిస్తుంది .ఎన్నో అనర్ఘ రత్నాలను జాలువార్చారు ఏరుకొనే వారికి ఎరుకోన్నంత .అందులో అతి ముఖ్యమైన వాటి గురించి మాత్రమె నేను తెలియ జేస్తాను .మిగిలినవి మీరే చదివి గ్రహించగలరు .

‘’సంతోషం శరీరానికి ,మనసుకు వావలసిన శక్తి సామర్ధ్యాలను సాధించి పెడుతుంది .సంతోషం గా ఉండే వారి వద్దకు ఉత్సాహం ఆసక్తి ,శ్రద్ధ ,పట్టుదల ,ఆరోగ్యం వగైరా గుణాలు వచ్చి చేరుతాయి .సుఖం శరీరానిది .సంతోషం మనసుది ,ఆనందం మనిషి చైతన్యానిది ‘’అంటూ సుఖ సంతోష ఆనందలలోని భేదాలను వివరించారు .ఆనందం భౌతికమైనదికాడు .ఆత్మీయకమైనది అన్నారు .

‘’కార్య సాధకులకు సంకల్పమే చక్కని సాధనం .అదే మొక్కవోని ఆయుధం .విశ్వాసం విజయ సాధనకు పునాది .’’ ‘’ప్రకృతిలో ప్రతిదీ నిస్వార్ధంగా తన పనిని నిబద్ధతతో చేసుకొంటూ పోతుంది .ప్రక్రుతి పంచ భూతాత్మికం అయితే విశ్వం ఏక పదార్ధ నిర్మితం .ప్రక్రుతి సామరస్యకతకు ,సాయుజ్యానికి ప్రతీక .ఇందులో పరస్పర ఆధారం పరస్పర సహకారం ఉన్నాయి .మానవుడిలో మహిషి ప్రవ్రుత్తి ,మనిషి ప్రవ్రుత్తి ఉన్నాయి .జంతు ప్రవ్రుత్తి మనిషి ప్రవ్రుత్తిలోకి మారాలి. అదే సమాజ హితం .ప్రక్రుతి అందరిదీ ఏ ఒక్కరిదోకాడు .

‘’శరీరం ఒక సముద్రం లాంటిది .ఇంద్రియాలు అనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడి లేస్తూ కల్లోలం చేస్తాయి వాటికి కామ క్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు .వీటిని  జయిస్తేనే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానం వైపుకు నడక సాగించగలం .శరీరానికి మనసు మన్సుకుశారీరం అవసరం .

‘’అయం నిజః పరోవేతి ,గణనా లఘు చేతసాం –ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ‘’వీడు నా వాడు వాడు పరాయి వాడు అనే భావం అల్ప బుద్ధులకే ఉంటుంది .ఉదార చిత్తులకు లోకం అంటా తన కుటుంబం గానే ఉంటుంది .’’మన జీవితం మనకు నచ్చినట్టే కాదు ,పది మంది మెచ్చేట్టు ఉండాలి ‘’..’’క్షీరం అనే ఈ విశ్వంలో బ్రహ్మ జ్ఞానం అనే కవ్వం తో చిలికి నవనీతం లాంటి భగవంతుడిని సొంతం చేసుకోవచ్చు .’’చెరువు నీటికి రక్షణ దానికి ఉన్న తూము .అలాగే దాచి పెట్టిన దనానికి రక్షణ దానం ధర్మం దయా గుణం .

‘’తర్కం చంచలం .శ్రుతి అనేక విధాలు .ఏ ఒక్కరుషి చెప్పిన ప్రవచనమో ప్రమాణం కాదు. ధర్మం యొక్క మూల తత్త్వం అవగాహనకు అందనిది .ఉత్తమ పురుషుల మార్గమే శరణ్యం .’’’’దానం ఇవ్వటం మనిషి వ్యక్తీ గత బాధ్యత’’అన్నది ఋగ్వేదం .

‘’మను ధర్మ శాస్త్రం కేవలం చట్టాలను మాత్రమే చెప్పే గ్రంధం కాదు .మనుషులను గుణ శీలురు గా మార్చే గ్రంధం .’’’’మనకు కనిపించని పరమాత్మను ఉపనిషత్తులు హృదయం లో ఆవిష్కరింప జేస్తాయి .ధర్మ లక్షణాలను చెబుతూ మనుస్మృతి –

‘’వేదః  స్మృతిః సదాచారః స్వస్వచ ప్రియమాత్మనః  ఏత చ్చతుర్విధం ప్రాహుః-సాక్షాద్ధర్మ స్య లక్షణం ‘’

వేద ప్రమాణం ,స్మ్రుతి వాక్యం ,సత్పురుషుల నడవడి కి అనుగుణమైంది ,తన ఆత్మకు ఇ౦పైనది అనే నాలుగు ధర్మానికున్న లక్షణాలు .

అర్ధ నారీశ్వర తత్వాన్ని వివరిస్తూ చెప్పిన ఒక శ్లోకం అద్భుతం

‘’రుద్రో ముండ దరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణా-స్కన్దః శంభు సుతః షడానన  యుతస్తుం డీ చ లంబోదరః

సింహ క్రేలిమ మూషకం చ వృష భాస్తేషాం నిజం వాహన –మిత్ధంశంభు గృహే విభిన్న మతిషు చైక్యం సదా వర్తతే ‘’

ఈశ్వరుడు కపాలాన్ని పాముల్ని ,పార్వతి సుందర ఆభరణాలను ధరిస్తారు .కుమారస్వామికి ఆరు ముఖాలు .వినాయకుడికి ఏనుగు తొండం .మరి వీళ్ళ వాహనాలేమో –ఎద్దు సింహం ,నెమలి ,మూషికం .ఇవన్నీ పరస్పర విరోధ స్వభావం కలవి .ఇలా విరుద్ధ స్వభావం గల శివ పరివారం నిత్యం భిన్నత్వం లో ఏకత్వాన్ని కలిగి సహజీవనం చేస్తున్నారు .అలాగే ఒక కుటుంబం లోని సభ్యులు విభిన్న మనస్తత్వాలు కల వారైనా ఏక భావనతో ఉండాలి .అప్పుడే ఆ కుటుంబానికి సమాజం లో గౌరవం .

‘’మాట అనేది తూటా కాదు ,తత్వమూకాడు .అదొక మహా మార్గం .అన్నిటికన్నా భిన్నమైనది. అది బహిరంగ ప్రదేశం లాంటిది .విశాలమైన రహదారి లాటిది ..మాట నిర్మలంగా ,నిస్వార్ధంగా ,నిష్కలంకంగా ఉండాలి .

‘’సత్యం మృదు ప్రియం ధీరో ,వాక్యం హితకరం వదేత్ –ఆత్మోత్కర్ష స్తదా నిందం పరేషాంపరి వర్జయేత్ ‘’అని ధర్మ శాస్త్రం .మృదువుగా ప్రియంగా ,ధైర్యంగా ,హితం గా ,సత్యవాక్యాన్నే పలకాలి .ఆత్మ స్తుతి ,పరనింద మాటలలో దోర్లరాదు అని అర్ధం .

‘’మనం అంతా నిమిత్తమాత్రులం .దేవుడు తనకు ఇష్టమైన పనినే మనతో చేయిస్తాడు ‘’ఇదే మాటను కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారు చెప్పారు .

‘’సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమ్రుతోపమే –కావ్యామృత రాసాస్వాదః సంగమస్సజ్జనై స్సహః ‘’

సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయి .మొదటిది కావ్యామృత రసాస్వాదనం రెండవది సత్పురుష సహవాసం .

‘’ఎవరిలో ఎటు వంటి స్వచ్చతను కోరుకొంతున్నావో ,నీలో దాన్ని పెంపొందించుకో ‘’అన్నారు శంకర భగవత్పాదులు

ఈ విధంగా శ్రీ భల్లం గారు తమ అనుభవ సారాన్ని విద్యా విజ్ఞాన సంపదను రంగ రించి చెప్పిన సూక్తి ముక్తావళి .ఇది చదివి ఆనంద సోపానాన్ని అధిరోహించాలి  .ఒక సద్గురువు చేసే ఉపదేశంగా, ఒక మహా మనిషి పలికే అమృత బిందువులుగా ,.ఈ వ్యాస పరంపర ఉంది .చదివిన వారు ఆనందామ్రుతాన్ని అనుభవిస్తారు .

100 రూపాయలు ఖరీదైన ఈ పుస్తకం కోటి విలువైన మాటల సముదాయం .ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలో లభిస్తుంది.ఈ పుస్తక ముఖ చిత్రాన్ని జత  చేశాను చూడండి .

భల్లంగారి ‘’వేకువ పిట్ట ‘’కువకువలు మరోమారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”ఎనస్తేషి యా ”ఉయ్యూరు రాక సందర్భం గా ఎస్ ఆర్ భల్లం గారి కవిత ”పడమటి సంధ్యా రాగం ”


సాహితీ బంధువులకు -ఉయ్యూరు వాసి ,రష్యాలో స్తిరపడిన ఆయిల్ శాస్త్రజ్ఞుడు ”,కేమటాలజి పిత ” 
స్వర్గీయ కొ లచల సీతారామయ్యగారి మనవరాలు ”ఎనస్తీషియా ”తాతగారి మూలాలను సందర్శించేందుకు తాను  ఉంటున్న అమెరికాలోని కాలిఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చిన సందర్భం గా ఈ మట్టి మీద ఆమెకున్న మమకారానికి పులకించి ప్రముఖకవి అనేక పురస్కారాల గ్రహీత ,తాడేపల్లి గూడెం వాస్తవ్యులు ,ఆత్మీయ కవిమిత్రులు అయిన శ్రీ యెస్ఽఅర్ .భల్లమ్ అనే భల్లం సూర్య నారాయణ రాజు గారు రాసిన కవిత ”పడమటి సంధ్యారాగం ”.దీనిని 2015 మే నెలలోవెలువడిన  వారి కవితా సంపుటి ”వేకువ పిట్ట ”లో చేర్చారు ఆ పుస్తకాన్ని నాకు అభిమానం తో పంపారు . అందులోని ఈ కవితను మీ అందరి ఆస్వాదన కోసం అంద  జేస్తున్నాను .-దుర్గా ప్రసాద్ 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊళ్లు తిరగటం మానేయాల్సోస్తోంది -జయధీర్ తిరుమల రావు


 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిశ్శబ్ద అన్తార్యుద్ధాలు


 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆడలేక మీడియా ఓడు



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ విశాఖలకు మెట్రో కేంద్రం ఖాయం వెంకన్న సన్నిధిలో తమాషా సీతా కోక చిలుక ,పెముడి చమురు దామల్


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప  బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’

  యువ కిశోరం మహేష్ బాబు కమల హసన్ కుమార్తె శృతి హసన్ జంటగా దూసుకొచ్చిన ‘’శ్రీమంతుడు ‘’సినిమాకు నేను మా మనవడు చరణ్ కిందటి ఆదివారం 6 వ తేదీ మాటనీ కి వెళ్లి ఉయ్యూరు లో చూశాము .బాల్కనీ ఫుల్లు  ,కింద సీట్లలో జనం నిల్లు .ఆశ్చర్యం వేసింది .శ్రీమంతుడిని శ్రీమంతులే పోషిస్తున్నారని పించింది . మా దియేటర్ లోపం కొంత ఉన్నమాట వాస్తవం . తెర బూజులు వేలాడుతున్నట్లు కూడా ఉండటం వాస్తవం మాటినీ అవటం మరి కొంత ఇబ్బంది . అయినా మా వూరు కనుక చూశాను .జగపతిబాబు రాజేంద్ర ప్రసాద్ వంటి హేమా హేమీలున్నారు .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ .కదవండటం డైరెక్ట్ చేయటం   కొరటాల శివ .

      ఆ వూళ్ళో అభివృద్ధికి అడ్డుపడే ముఠాను ఎదుర్కోలేక తండ్రి జగపతి బాబు  బయటికి వచ్చేసి కోట్లు సంపాదించి కొడుకూ తనలాగానే కోట్లు కూడ బెట్టాలని ఆశిస్తాడు. కాని దీనికి వ్యతిరేకం కొడుకు మహేష్ . ఆలోచనలే వేరు .ఇంట్లో ఎవరూ అతన్ని సమర్ధించరు  .మరో సోషల్ వర్కర్ శృతి తో కలిసి రూరల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో ఉంటాడు .ఇద్దరూ దగ్గరౌతారు .అకస్మాత్తుగా ‘’దేవర కోట ‘’గ్రామం అధికార దెయ్యాల కోటగా మారి జనం ఏదీ అందకా అన్నీ విలనీ ముఠా చేతికే  అందుతుంటే . ఊరు వదిలి వలస పోతూ ఉంటారు . నారాయణ రావు అనే మాస్టారు రాజేంద్రప్రసాద్ అందర్నీ వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు .కాని ఫలించదు . మహేష్ కి ఈ విషయం తెలిసి గ్రామాన్ని దత్తత తీసుకొని చెక్ బుక్ చేత్తో పట్టుకొని తిరుగుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సైకిల్ మీద విలాసంగా తిరుగుతూ అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాగా నిమిషాల్లో గ్రామం లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు .రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో గృహకల్లోలాలేర్పడి  అందర్నీ  ఊరు వదిలి వెళ్ళ వద్దని చెప్పిన వాడే విలనీ దుశ్చర్యలకు ఆగలేక తానూ వెళ్లి పోయే ప్రయత్నం లో ఉంటాడు .అంతకు ముందు జగపతి బాబు వచ్చి ఊరు మారిపోయినా విలన్ల దొంగ దెబ్బ తో గాయపడ్డ కొడుకు మహేష్ ను ఆ వూరు వదిలి పెట్టి తనతో రమ్మంటే వెళ్ళిపోయి .కోట్లు కూడా బెట్టినా మనసులో ఆ ఊరే జ్ఞాపకం వచ్చి మళ్ళీ అందర్నీ ఒప్పించి సమయానికి ఇక్కడికి చేరి గ్రామాన్ని కాపాడతాడు . ఇదీ కద .చంద్రబాబు ఆదర్శానికి రూపం . ఇది చూడటానికి వినటానికీ  బాగానే ఉంది .కాని సాధ్యా సాధ్యాలే మనకు ముక్కు మీద వేలు వేయిస్తాయి .

   విలన్లు బలవంతులు క్రూరులు .ఆయుధ సంపత్తి ఉన్నవారు. వాళ్ళను ఏ ఆయుధం లేకుండా పాంటు షర్ట్ నలగా కుండా   చేతి దెబ్బలతో దెబ్బకి పదిమందిని లేపేస్తూ ,వారిని పీటీ దెబ్బ కొడతాడు మైండ్ బ్లాక్ అయి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తుంటారు .వాళ్లకు అదే పని ఇతనికి ఇదే పని . మహేష్ బాబు ఫైట్ చేస్తుంటే కొంగ బకాసురులతో చేస్తున్నట్లనిపించింది  .శ్రుతితో కలిసి డాన్సులు చేస్తుంటే రెండు కొంగలు చేస్తున్నట్లుంది నాకు మాత్రం అది దియేటర్ ,లెన్స్ లోపం కావచ్చేమో . సాగదీసి సాగదీసి ‘’రామా రామా రామా ‘’పాట హిట్ చేశాడు దేవిశ్రీ .మరేపాటా మనసుకు పట్టదు. అర్ధవంతంగానూ లేదు .నాకు అనిపిస్తుంది ఇలాంటి హీరోలకోసం మ్యూజిక్ డైరెక్టర్లు మాధుర్యమైన పాటలు చెయ్యకుండా మోత పాటలతో గంతులతో సంగీతానికి చేటు తెస్తున్నారేమో నని .

         పేదలకోసం కోట్లాను కోట్లు మంచినీళ్ళ ప్రాయం గా ఖర్చు పెట్టిన హీరో సినిమా చూడటానికి మధ్య ,దిగువ తరగతి ప్రేక్షకులు రాక పోవటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు . శ్రీమంతులే శ్రీమంతుడు ను పోషిస్తున్నారనిపించి బాధేసింది . ‘’తాతా!సినిమా యెట్లా ఉంది?’’అని అడిగాడు హాలు లోంచి బయటికోస్తున్నమామనవడు ‘’ఏముందిరా  .రెండుకొంగల ఎగురుడు ,డాన్సు.ఊళ్ళో అందరూ ఎదురు తిరిగి బుద్ధి చెప్పలేక పొతే ఒక బక్క కుర్రాడు బట్టలు నలక్కుండా విలన్లను చితక్కోట్టటం నీ లాంటి వాళ్లకు బాగుంటుంది కాని నాకు కాదు ‘’అన్నాను ‘’తాతా! నువ్వెప్పుడూ ఇంతే .నీకేదీ నచ్చదు. ఏదో ఒక వంక పెడతావు ‘’అన్నాడు .మరి వాడి దృష్టిలో అంతేకదా .

    మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-15-ఉయ్యూరు   

Posted in రచనలు | Tagged | Leave a comment

డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’

డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’

చెన్నైలో ఉంటూ ఆ నగర జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఏది రాసినా దానిపై ఉన్నమక్కువను తెలియ జేసుకొంటూ తెలుగును జీవి౦పజేస్తూ  వ్రుత్తి వేరే అయినా ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంచుకొని అరుదైన రచనలు తెలుగులో చేస్తున్న డా ఉప్పలధడియం వెంకటేశ్వర్లు సరసభారతికి  ఆత్మీయులే . వారు ఇటీవలే  అరుదైన తెలుగు దేశీ ఛందస్సు ‘’మధ్యాక్కరలు ‘’లో శతకం రాసి 2015లో వెలువ రించారు .అందులోని నాకు తెలిసిన సొబగులను మీకు అందజేస్తున్నాను .

సాధారణం గా కవికి అక్కర వస్తేనే మధ్యాక్కరలు జోలికి పోతాడు .లేక పొతేపోరు . చాలామంది తెలుగు కవులు దాని జోలికి పోలేదు .ఒక వేళ రాసినా కొద్దిమంది మాత్రమె రాశారు. విశ్వనాధ సత్యనారాయణ గారు మాత్రం మధ్యాక్కర శతకాలు పది రాశారు అంటే 1,010.మధ్యాక్కరలు రాశారు . కల్పవృక్షం లో దాదాపు ౩౦౦మధ్యాక్కరాలతో సన్నివేశ అక్కర తీర్చారు .ఆదికవి నన్నయ గారు 39  రాస్తే ఎర్రాప్రగడ ఒకదానికే పరిమితమైతే తిక్కన గారు ఆ చాయలకే పోలేదు .తర్వాత తుమ్మల ,నాయని ఆరుద్ర ,సుప్రసన్న ,మొదలైన వారు తలో శతకం కాని  కొన్నిపద్యాలు కాని    సంతరించారు .అలాంటి ‘’నన్ను ముట్టుకోకు ‘’అన్న మధ్యాక్కరలపై వెంకటేశ్వర కు మోజు కలిగి శ్రీమతి ప్రోత్సాహం తో తన అనుభవాలను ఈ దేశీ ఛందస్సులో చెప్పాలని తపించి ఆ తపనకు అక్షర రూపం కల్పించి సరస్వతీ కంఠా భరణం చేశారు.  .

ఈ దేశీ ఛందస్సులో ఆధ్యాత్మికమే కాక ఇతర భావాలనూ చెప్పటానికి అణుమాత్రం సందేహం లేదన్నారు మొదటి పద్యం లో .తాను  పాటించిన నియమాలను వివరించారు .తెలుగు ఛందస్సులోని సొగసును దర్శింప జేయటమే తన ఆదర్శం అన్నారు .’’దేహంబు ఉండు నందాక దాహంబు తీరదట’’.సామాన్య మానవ జీవిత విశేషాలనుఈ  అసామాన్య ఛందస్సులో అతి సునాయాసంగా చెప్పటం ఉప్పలధడియం వారి గొప్పతనం .ఒకరకం గా పప్పు దప్పళం .

‘’భారత రామాయణాది ప్రాచీన వాజ్మయ మందు –నేరము లేన్నుత కంటే తిరముగా నిజ విద్య మెరయ –చారు కృతుల్ వెలయించు టే౦తేని  సత్కార్య మగును –పేరిమి కల్గునే ప్రుద్విని పెదవి విరుపుల చేత ‘’అని చక్కని జాతీయం తో చీకటిని తిట్ట్టు కుంటూ  కూచోకుండా చిరు దీపం వెలిగించాలని చెప్పారు .సిద్ధాంతాలు వల్లిన్చేవాడి చేత హుళక్కి . రాద్ధాంతాలు  చేసేవాడి రాణ కూడా అంతే .పధ్ధతి లేని మనుషులలో ఔచిత్యం ఉండదు అంటారు .కూరలు కొందామని వెడితే కొబ్బరి కూడా కాటా లో పెట్టి తూచటం చూసి ఔరా అనుకొన్నారు .మరో అందమైన మధ్యాక్కర ముక్కెర –

‘’గగన మండలమెల్ల క్రమ్ముకొన్నవి కారు చీకటులు –అగణిత సంఖ్యలో తారలగుపించే ,నన్నింటి నడుమ –నిగనిగ మని కళ లొలుకుచు౦డెను నిండు జాబిల్లి –తెగిన పూసల దండ వోలె ,నందలి దివ్యమణి వలె’’.

‘’పెట్రోలు ఖర్చులు తగ్గు ననెడి అభిప్రాయ మెసగ –మెట్రో కు స్వాగతం ‘’పలికాడు కవి .కాని నగా నట్రా  అమ్మితే కాని అణువు మాత్రం స్థలం కూడా రావటం లేదు .ఇదీ ‘’మెట్రోలియం ‘’గాధ .మద్రాస్ మహానగరం లో మానవాక్రుతులు కవికి ‘’సింహ శరభోర గేంద్ర శార్దూల –మద గజా కీర్ణంబు’’గా ఉన్దికనుక సామాన్య జనం జాగ్రత్తగా మసలాలి అని హెచ్చరించారు నన్నయ్యగారి భాషలో .’’రాయల వారు ‘’అనే మాట  కర్ణాలకు తాకితే కవి కి శరీరం  పులకి౦చి .పోతుందట . హృదయం రసజ్ఞత పొందుతుందట .రణ గోణ ధ్వనులతో కంపించిపోయే మద్రాస్ మహానగరం లో టి నగర్ ,మైలాపూర్ లు  శ్రావ్య సంగీతం వినిపిస్తూ ఘనమైన సంప్రదాయాన్ని పాదు  కోనేట్లు చేస్తున్నాయి .స్వర గంగలో మునకలు వేయిస్తున్నాయని మెచ్చుకొన్నారు .దక్షిణాది తెలుగును ఈసడించేవారికి  చెంప దెబ్బలాగా గా

‘’దక్షిణాది తెలుగు వారి మాటల తరహాయే వేరు –లక్షణో పేతమ్ము కాదనుచు  బుదులా పలుకులకు –ఆక్షేపణల్ తెలప వచ్చుగాని శతాబ్దాలుగా పరి –రక్షించు కొనినారు భాష ననుచు వారల మెచ్చవలదే ? ఇది అక్షర సత్యం స్వాభిమానం తో తెలుగును ఇంట్లో మాట్లాడుకొంటూ ,తమిళం పెత్తనాన్ని సహిస్తూ తెలుగు భాషను ప్రాణ ప్రదంగా కాపాడు కొంటున్న దక్షినాది తెలుగు వారికి జేజేలు .వారి సంకల్ప దీక్షకు అభినందనలు .

‘’రేవు ‘’అనే మాట మరుగై పోయి ;;పోర్ట్ ‘’అనే ఆంగ్ల పదమే విరివిగా వాడుకలో ఉండటం ఆంగ్లాను రక్తిఏ కాని   భాషాభిమానం కాదని బాధ పడ్డారు .

‘’మౌలికమైన భావనల వ్రాసితి మధ్యాక్కరలను –శ్రీలు పొంగెడు తెల్గు సౌష్ట వమ్మున చెలగు కృతి యని –మేలిమి బుధులు ,భాషాభిమానులు మెచ్చిన నదియె –చాలును ,పది వేలటంచు నే నాత్మ సంతృప్తి గొనుదు’’ అని ఏంతో వినయంగా చెప్పారు మధ్యాక్కరకవి వెంకటేశ్వర .దాక్షిణాత్యకవుల కృతులను వారిని కీర్తిస్తూ కవి

‘’లాక్షణికుల మెచ్చు వెంకట సుకవి ,లాఘవ మొప్ప-అక్షయంబగు దివ్య కృతులు పలికిన అల త్యాగ రాజు –దక్షిణ ప్రాంతపు కవుల వార సత్వము నిల్పు కొరకు –అక్షరార్చన సేతు నష్ట దిక్పరి వ్యాప్తాంద్రి కేను ‘’అని హృదయ పూర్వక అంజలి ఘటించారు .చెన్నైలో ప్రముఖ తెలుగు సంస్థలు ‘’వేద విజ్ఞాన వేదిక ,ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే ‘’తర తరాల తెలుగు కవిత ‘’ప్రసంగాలకు గొప్పగా స్పందించారు .పూర్వం రోజుల్లోనే కాదు ‘’నేటికిని చెన్న పట్టణమందు –కైతలు నవలలు ,కధలు వ్రాయు దిగ్దంతులు గలరు ‘’అని చాటి చెప్పారు .

‘’జీవన  సన్న వేశములు  కొన్నింటి చిత్రించినాను –భావము ,భాష ఇత్యాదిగా దీని పరికించి బుధులు –చేవగల క్రుతియో కాదో నిర్ణ యించెదరు ,తెలుగునకు –నా వంతుగా నొక కొన్ని పద్యాల నర్పించు చుంటి ‘’అని శతకాన్ని ముగించారు .దీన్ని చదివి బేరీజు వేసి నిగ్గు తేల్చమని కవి గారి కోరిక .పండితులు ఆపనికి పూనుకోవాలని నా విజ్ఞప్తి .

సాహసంగా మధ్యాక్కరలను మాధ్యమం గా గ్రహించి చక్కని తేట తెలుగు పదాలతో ఈ శతకం కూర్చిన శ్రీ వెంకటేశ్వరకు హార్దిక అభినందనలు .ప్రోత్సహించిన వారి అర్ధాంగి శ్రీ మతి ఉష గారికి శుభాశీస్సులు .అంకితం పొందిన శ్రీ విద్వాన్ ఎస్ దశరధ రామ రెడ్డి గారు ధన్యులు .

ముచ్చ్చటైన తెలుగు తల్లి వర్ణ ముఖ చిత్రం తో అచ్చు తప్పులు లేని అక్కరాల మధ్యాక్కరలు చూపులకే కాదు మనసుకూ ఆహ్లాదం కలిగిస్తాయి .ఆస్వాదించి కవిని అభినందించండి .స్కాన్ చేసిన పుస్తకం కవర్ పేజీలు  జత చేశాను చూడండి .

‘’అమూల్యం ‘’అయిన ఈ పుస్తక ప్రాప్తి స్థానం

General secretary

Janani (social and cultural Academy )

13/53 second street ,Vasuki nagar

Kodungaiyur ,Chennai -600,1118

Phone -044-25541 572

మీ-గబ్బట దుర్గా ప్రసాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూక్తి సుధ 4 క్రోధం

సూక్తి సుధ

క్రోధం

4

‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ ప్రణశ్యతి ‘’అని గీతా చార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు .’’అను క్షణం విషయ సుఖాల గురించి ఆలోచిస్తే దానిమీదే ఆసక్తి పెరుగుతుంది .ఆసక్తి క్రమంగా కామం లేక కోరిక గా మారు తుంది .కోరిక తీరక పొతే కోపం లేక క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది .దీని వలన మరపు కలిగి ,బుద్ధి నశిస్తుంది .బుద్ధి నాశనమైతే ,అయోగ్యుడై మనిషి నశిస్తాడు .అంటే ‘’ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి ‘’లాగ క్రమంగా పతనమై జీవి నశి౦చి పోతాడు .మరి దీనికి విరుగుడు లేదా?ఉన్నది ‘’రాగ ద్వేషాలు లేకుండా ఇంద్రియాలనుస్వాదీనం లో ఉంచుకొని ,విషయ సుఖాలను అనుభ విస్తూ కూడా మానవుడు నిర్మలుడే అవుతాడని ఆ భగవద్గీతే చెప్పింది .

అందుకే భగవద్గీత ను ‘’మనస్తత్వ శాస్త్రం ‘’అన్నారు .మానవ మనో లీలలను  పరమాద్భుతం గా వర్ణించింది .బందానికీ ,మోక్షానికీ కారణం మనసే .ఉద్ధరించినా అధోగతి పాలు చేసినా మనస్సే’’అదే బంధం శత్రువుకూడా .కనుక కోరిక పెరిగితే ,కామం పెరిగి మోక్షానికి అవరోధమవుతుంది .’’వీత రాగ భయ క్రోదో ,మన్మయా మా ముపాశ్రితాః-బహవో జనన తపసా పూతా మద్భావ మాగతాః’’అని పరమాత్మ తరుణోపాయమూ చెప్పాడు .అన్నిటికి కారణమైన కామాన్ని పిశాచం తో పోల్చింది ‘’యోగ వాసిస్టం ‘’’’తవనావహితం చిత్తం కామః కవల యిష్యతి –సావదానస్య బుద్ధస్స పిశాచః కిం కరిష్యతి ?అన్నది అంటే ‘’అజాగ్రత్తగా ఉంటె చిత్తాన్ని కామం మింగేస్తుంది .జాగ్రత్తగా ఉంటె కామ పిశాచి చిత్తాన్ని ఏమీ చేయలేదు ‘’అని భావం .కనుక సర్వ వేళల ,సర్వా వస్థలలో మెలకువగా అంటే జాగ్రత్తగా ఉండాలి .

పరశురాముని క్రోధం 14 సార్లుక్షత్రియ రాజ వంశాలపై దండెత్టించి,రాజ వంశ నిర్మూలనం చేసింది .మహా భారతం లో పరీక్షిత్తు మహారాజు తపస్సమాధిలో ఉన్న ‘’శమీక మహర్షి ‘’తనకు ఆతిధ్యం ఇవ్వలేదని ఆగ్రహించి ,చచ్చిన పామును తెచ్చి ముని మెడలో వేస్తె ఆ తర్వాత వచ్చి చూసిన కొడుకు ‘’శృంగి ‘’7 రోజుల్లో పరీక్షిత్తు మరణిస్తాడని శపించాడు .జరిగింది తెలుసుకొన్న మహర్షి కొడుకుతో ‘’క్రోధం తపస్సుకు భంగం .అణిమాద్యస్టసిద్ధి సాధనకు ఆవ రోధం .ధర్మ మార్గానికి అడ్డంకి .తపస్వికి క్రోధం పనికి రాదు .చేసే పని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే క్రోధం తగ్గుతుంది ‘’అని హితవు చెప్పాడు .విశ్వామిత్రుడికి వసిష్ట మహర్షిపై ఉన్న కోపం బ్రహ్మర్షి పదవికి అడ్డంకి అయింది .కార్త వీర్యార్జునుని కోపం పతన హేతువైనది .దుర్యోధనుని క్రోధం కౌరవ వంశ నిర్మూలనం చేసింది .’’కామం ఆవహిస్తే క్రోధం నాట్యం చేస్తుంది ‘’అనే సామెత లోకం లో ఉంది .కామ ,క్రోధాలు పరమ మిత్రులు .లోకోపకారానికి అవతార పురుషులు ‘’ధర్మాగ్రహం ‘’చూపిస్తారు .శ్రీరాముడిది రావణాది రాక్షస సంహారం లో ధర్మాగ్రహమే .భారత స్వాతంత్ర్య సముపార్జనకు మహాత్మా గాంధి  బ్రిటిష్ వారిని ఎదిరించింది ‘’సత్యాగ్రహం ‘’తోనే .

కామ క్రోదాలకు తోడు డంబం ,గర్వం ,అభిమానం అంటే దురహంకారం ,కాఠిన్యం,అవివేకం అసుర లక్షణాలుగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి .అందుకే ‘’కామ క్రోధ స్తదా లోభాస్తస్మా దే త్రయం వ్యజేత్ ‘’అన్నారు నరక ద్వారాలైన కామ క్రోధ లోభాలను మూడింటిని విసర్జించాలి .అహంకారం బలం దర్పం ,కామం క్రోధపరిగ్రహం –విముచ్య నిర్మమస్శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ‘’అని చెప్పి వీటిని విసర్జించి మన శ్శాంతి తో జీవించమని మహాత్ముల సందేశం .

శ్రీరాముడు తాను  రాజ సూయ యాగం చేస్తానని తమ్ములతో చెప్పాడు .వివేకి అయిన తమ్ముడు లక్ష్మణుడు ‘’రాజ సూయ యాగం వలన రాజులతో అనవసర కలహాలేర్పడి ప్రశాంతతకు భంగం కలుగుతుంది .రాజ వంశ వినాశనం జరుగుతుంది .వసుంధరా వధ చేయ వద్దు ‘’అని చక్కని సలహా ఇచ్చాడు .ధర్మ సూక్ష్మం గ్రహించిన రాముడు ‘’శుభం పలికావు చిన్నవాడివైనా .వివేకి లోక పీడా చర్యలు చేయరాదు ‘’అని విరమించుకొన్నాడు .చనిపోయే ముందు మనిషి కామ క్రోధాదుల వేగం అరి కట్ట గలిగితే ,యోగి ,సుఖి అవుతాడు .కామ క్రోధాలు తొలగి పోవటం ‘’వాసనా క్షయం ‘’అంటారు .దీని వలన చిత్తం స్వాధీనమై ,ఆత్మ జ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది .

5(చివరి భాగం )

‘’కామం లేక కోరిక క్రోదానికి హేతువు .కామ౦  వల్ల ద్యూతం ,వేట ,స్త్రీవ్యసనం ,మద్యపానం నిరర్ధక ధన వ్యయం అనే అయిదు వ్యసనాలు కలుగుతాయి .వీటి వలలో పడి ,కోరికలు పెరిగి ,అవి తీరక పొతే క్రోధం విజ్రు౦భిస్తుంది .క్రోధం వల్ల వాక్పారుషత్వం ,దండ పారుష్యం అనే రెండు వ్యసనాలొస్తాయి .’’అని భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ధర్మ రాజుకు ఉపదేశిం చాడు .’’ధర్మార్ధ కామాలు అనే వర్గ త్రయం ,ప్రభుత్వ మంత్రోత్సాహాలైన శక్తి త్రయం ,రాజు అధీనం లో ఉంటె ,సత్వ ర స్తమ గుణాల వివేచనతో రాజు ధర్మ పాలన చేస్తాడు .రాజు ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ,ప్రజలు చేసే సత్కార్యాలను మెచ్చుకుంటూ ,కౌటిల్యం ఆత్మ స్తుతి ,దురహంకారం ,క్రోధం విడనాడాలి’’ అని భీష్మ ఉవాచ .ఇవి  పరిపాలనలో ఉండే అందరికీ వర్తించే నిత్య సత్యాలు .పాలకులు ఈ మార్గం లో నడిస్తే ప్రజాశాంతి సాధన జరుగుతుంది .

కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ‘’అరిషడ్వర్గం ‘’అంటారు .ఇవి ఎలాకలుగుతాయో ఏ విధం గా తొలగి పోతాయో కూడా చెప్పారు .’’సంకల్పం వల్ల కామం జనిస్తుంది .దేహాత్మ విభేద జ్ఞానం వలన నశిస్తుంది .పరుల దోషాల వల్లక్రోధం ఏర్పడుతుంది .ఓర్పుతో ఇది నశిస్తుంది .అస్తిర జ్ఞానం లోపిస్తే లోభం కలుగుతుంది .ఎరుక వలన తొలగి పోతుంది .అజ్ఞానం వలన మోహావేశం కలిగి ధర్మాచరణ తో దూరమౌతుంది .కులం విద్య ,ధనం మదాన్ని పెంచుతాయి .అవి అశాశ్వతం అని గ్రహిస్తే మదం నశిస్తుంది .సాత్విక గుణ సంపత్తి లేకపోతె మాత్సర్యం ఏర్పడి సత్పురుష సా౦గత్యం వలన నిర్మూలనమౌతుంది .ఈ ఆరు మనసులో చేరితే ధైర్యం కోల్పోతారు .అయితే దీమంతుడిని ఇవి ఏమీ చేయలేవు .బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే వీటి వలన ప్రమాదం రాదు .

మన ఆలోచనా విధానం సక్రమ మార్గం లో ఉండాలి .మనసు నిర్మలం గా ఉంచుకోవాలి .ఈ ఆధునిక కాలం లో ఇది సాధ్యమేనా ?అంటే సాధ్యమే .వృత్తి ఉద్యోగాలలో అనుక్షణం టెన్షన్ లో ఉంటాం .సమాజం లో అసమానతలు ,చుట్ట్టూ దరిద్రం ,పరపీడన ,పురుషాహంకారం ,ప్రేమ పేరిట మృగాలవుతున్నమగాళ్ళు , ,అన్నిట్లో వివక్షత  మనల్ని అశా౦తులను చేస్తున్నాయి .అందుకని ఉద్రేకపడి ఉపద్రవాలు తెచ్చుకోకూడదు .కనుకనే శారీరిక మానసిక ఆరోగ్యం కోసం యోగ సాధన చేయాలి ‘’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు యోగాచార్యుడు కృష్ణుడు .యోగిగా  ఈ సమాజం లో జీవించు అని గీత చెప్పింది .చెప్పటం సులువే కాని ఆచరణ సాధ్యమా అనిసందేహం వస్తుంది .  .అందుకే ‘’మనసులో సమత్వం ఉన్నవారంతా యోగులే ‘’అన్నారు కంచి పరమాచార్య .’’మన వేదనా స్వరూపానికి శాంతి ప్రకరణమే వేదం ‘’అని గ్రహించమన్నారు .ప్రపంచం లో ప్రజలకోసం చేసే సేవ పరమేశ్వరా రాధనం అవుతుంది .అందుకే ‘’సమాజ పరమేశ్వరుడు ‘’అన్నారు .దీని వలన ఆత్మ సంతుష్టి కలిగి సేవలో పడిన క్లేశ ,దుఖాలు ఆనందాన్ని ,సుఖాన్ని ఇస్తాయి .

సమాజం లో జరిగే వాటిని చూసి భయపడి పని చేయకుండా ఉండరాదు .భగవంతుని తో సహా అందరం కర్మ చేయాల్సిందే .కర్మ లేక పొతే లోక కార్యం జరగదు .కర్మ వలన చిత్త శుద్ధికలిగి ,దాని వలన నిష్కామ కర్మ తెలిసి ,దీనిద్వారా ధ్యానం ,యోగం కలిగి చివరికి ఆత్మాను సంధానం లభిస్తుందని గీతలో పరమాత్మ చెప్పాడు .మనం శ్రద్ధ తో చేసేపని భక్తీ అయి ముక్తిగా విలసిల్లు తుంది .’’ఉద్రేకాలు అణచుకొని ,సదాలోచనలు పెంచుకొని ,ఉద్వేగాలకు లోనుకాకుండా ,బ్రతికితేనే శాంతి .మనసులో నిర్మలత్వం ,ద్రుష్టి లో విశాలత్వం ,ఆలోచనలలో అనంతత్వం ఉంటేనే శాంతి లభిస్తుంది ‘’అని జ్ఞాన ,వయో వృద్ధులైన రచయిత శ్రీ పోతుకూచి సాంబశివ రావు గారు అన్నారు .

‘’మనసు కలయిక గా విద్య ఉండాలి .అంతరిక సమతుల్యత ,సామరస్యం ఉన్న వ్యక్తులను విద్య సమాజానికి అందించాలి .జీవితాన్ని ,మానవుడిని ,ప్రవర్తనను నిర్మించే విద్య నేర్పితే ,అరిషడ్వర్గాలను అధిగమించే స్థితి కలుగుతుంది ‘’అని స్వామి  వివేకానంద  ప్రవచనం .విజ్ఞాన ,ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేస్తూ ,వ్యక్తిత్వ వికాసాన్ని విద్య పెంపొందిస్తే ,సమాజం లో రుగ్మతలు ఉండవు .

అందర్నీ కలిపి ఉంచేది ప్రేమ తత్వమే .ప్రపంచాన్ని కామక్రోధాలు పాలించ కూడదు .ప్రేమ మాత్రమె ప్రపంచ పాలన సాగించాలి .అప్పుడే సుఖం శాంతి ,పురోగమనం లభిస్తాయి .ప్రేమ వికశించి ,సంకుచితత్వాన్ని త్రెంచి పారెయ్యాలి . ‘’ప్రేమ వికశించి మస్తిష్కం పునర్వ్యవ స్థీక రించ బడాలి .సమస్త జీవుల్లో ఊర్జవం, శక్తి ,మాధుర్యం ,తేజస్సులు చొచ్చుకు పోవాలి .ప్రేమలో శాంతి సుఖ సంతోషాలు సేవ ఉన్నాయి .ప్రేమ విశ్వం కన్నా విశాలమైనది యుగాలు కల్పాలకన్నా శాశ్వతమైనది .అనంతమైనది .ప్రేమ అంటే మీరే .నేనే ,మనమే ‘’అన్నారు అరవిందాశ్రమ మాత .

సంపూర్ణం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

శ్రేష్ట భాష గా తెలుగు -ఆచార్య గంగి శెట్టి లక్ష్మీ నారాయణ



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘అక్షరార్చన ”


 
 

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో గోవధ నిషేధం మరియు దయనీయ స్తితిలో బ్రాహ్మణులు పంచదార చిలక కద


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ ఎన్నికలు విశాఖ స్మార్ట్త తె లుగుకు తానా ,తమిళనాడులో తెలుగు



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూక్తి సుధ-

సూక్తి సుధ-

3

ధార్మిక జీవిత వైశిష్ట్యం ఏమిటి అంటే ‘’కష్ట సహిష్ణుత ,స్వార్జిత విత్తానుభవ ప్రశస్తి ,సోదరత్వ సౌజన్యం ,ఆధ్యాత్మిక చింతన ,ద్వేష రాహిత్యం ,భగవద్భక్తి ,బాంధవ్యం ,సత్య నిష్ట,రుజు ప్రవర్తన ,స్నేహ శీలం ,విద్యా వినయ సంపద ,ఐకమత్యం ,పరోపకారం ,సానుభూతి ,సహవేదన .వీటిని ఆవరచుకొని ఆచరిస్తే సమాజం లో హింస ,క్రూర ప్రవ్రుత్తి నశించి ,సుఖ శాంతులు వర్ధిల్లి ,పురోగమనం చేకూరుతుంది .ఈ భావనలు కలగాలంటే నిరంతర ధార్మిక చింతన ఉండాలి .సద్గ్రంధ పఠనం ఆవశ్యకం. సత్సాంగత్యం ,సద్గురు బోధ ,ఉండాలి .మహా భారతం లో లేనిది ఏదీ లేదు .అది మనిషి కద.మనిషి మనసు కధ.మనిషిలోని ఉన్నత శిఖరాలను ,అతి భయంకరమైన లోయలను ,కుదుపులను చెప్పే కధ..విప్పే కధ. మానవ జీవితానికి అద్దం భారతం .వ్యక్తీ ప్రగతికి ,సమాజ ప్రగతికి , ,సుఖ దుఖాలకు అవసరమైన ధర్మాలు ,ధర్మ సూక్ష్మాలు వివరించింది .మానవ జీవితానికి వాటిని సమన్వయం చేసి , రసమయం చేసింది ,లోచూపు వెలిగించే దీపంగా భాసిస్తుంది భారతం .

రక్త మాంసాలతో ,రకరకాల మనస్తత్వాలతో ,మనతో పాటే ఉండే ,శకునులు ,శల్యులు ,సైంధవులు ,కీచకులు బకాసురులు ,దుర్యోధన ధృత  రాష్ట్రాదులు అన్ని యుగాల్లో ,అన్నికాలాల్లో ,అన్ని జాతుల్లో ఉన్నారు,ఉంటారు .వారిని పెరగనీయ కుండా మనమే జాగ్రత్త పడాలి .లేక పొతే మానవ జీవితం కల్లోలమయమై పోతుంది .ధర్మాన్ని ఆచరి౦చటమేకాదు ,ధార్మిక బోధనా అవసరమే .శాస్త్ర సాంకేతిక విద్యావలయం లో పరిభ్రమిస్తున్న నేటి ప్రపంచం మేధస్సుకు ఇస్తున్న విలువను ,ప్రాధాన్యాన్ని హృదయానికి ఇవ్వటం లేదు .హృదయం లేని మనిషి దానవుడు అయ్యే ప్రమాదం ఉంది .ఉంటోంది కూడా .ఇది అందరికి అనుభవమే .అందుకే మానవ విలువలను బోధించే సాంఘిక శాస్త్రం విద్యలో అంతర్భాగం కావాలి .హ్యుమానిటీస్ లేక పొతే మనిషి ‘’ఇన్ హ్యూమన్ ‘’అవుతాడు .పరస్పర గౌరవం ,మర్యాద అవగాహన అందించే విద్య నేర్పాలి .ప్రపంచం కుగ్రామం అయిన కొద్దీ ,మనిషి స్వార్ధం తో మరీ కుంచించు కు పోతున్నాడు .మానవత్వాన్ని మంట గలుపుతున్నాడు .బుద్ధి ,మేధస్సు వికసిస్తోందికాని హృదయ వికాసం రావటం లేదు .

ధార్మిక ప్రవ్రుత్తి నుంచి మనిషి వైదొలగితే వచ్చే ప్రమాదం ఇదే .’’మనం బ్రతికే అచ్చమైన ,స్వచ్చమైన బ్రతుకే ధర్మ స్వరూపం ‘’అన్నది కాశ్మీర దేశపు సంస్కర్త ,యోగిని ‘’లల్లాదేవి ‘’.అందుకే ముస్లిములు కూడా ఏంతో గౌరవించి ఆమెను ‘’లల్లారిఫా ‘’అని ఆత్మీయంగా గౌరవం గా పిలుచుకొన్నారు . ధర్మమే అందరిని కలిపి ఉంచుతుంది అని దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది .’’ఇదంశరీరం కౌంతేయ క్షేత్ర  మిత్యభిదీయతే ‘’అని చెప్పిన భగవద్గీత వాక్యానికి ‘’ఈ శరీరం ధర్మం అనే పంట పండించే క్షేత్రం ‘’అని పరమోత్క్రుస్టమైన  అర్ధం చెప్పారు శ్రీ కంచి పరమాచార్య .

‘’సర్వేషాం యః సుహృత్ నిత్యం –సర్వషాంచ హితే రతః –కర్మణా ,మనసా ,వాచా ,స ధర్మం వేదం జాజలే ‘’అని జాజలికి వర్తకుడు తులాభారుడు భారతం లో ధర్మ విషయం గురించి బోధించాడు .’’’’జాజలీ !నిత్యం అందరికి స్నేహితుడిగా ,మనో వాక్కాయ కర్మలా ,పర హితంగా ,ఉండే వాడే నిజంగా ధర్మం తెలిసిన వాడు ‘’అని భావం .’’తనను అధిగమించి ,తనను నిర్మించుకోక పొతే –యెంత పేదవాడు ఈ మనిషి ?’’అన్నాడు ప్రముఖ ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ .

రామాయణం లో రాముడు రావణాసురుడికి ధర్మ బోధ చేస్తూ ‘’ధర్మ ఏవ హతో హంతి-ధర్మో రక్షతి రక్షితః –తస్మాధర్మో న హంతవ్యః –మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు ‘’అధర్మాన్ని అణచి వేసే ధర్మాన్ని నువ్వు అణచి వేశావు రావణా !అందుకే ధర్మం నిన్ను హతం చేస్తుంది .ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .ధర్మాన్ని అణచ కూడదు.ధర్మం హతమైతే మనల్ని ధర్మం హతం చేస్తుంది ‘’.

‘’సత్యం పరమం ధర్మం ‘’అన్నారు .సత్యం లో ధర్మం ఉంది సత్యమే నాశనం లేనిది .సత్యం తర్వాత పదమే మోక్షం .విశ్వాన్ని సుఖ శాంతులతో ,ఉన్నతిలో ఉంచటమే అందరి ధ్యేయం కావాలి . ‘’అందర్నీ ప్రేమించే మనసు ,అందర్నీ సేవించే వయసు ,అందరి క్షేమం కోరే బుద్ధి నాకు ప్రసాదించు ‘’అన్నది మన ప్రార్ధన కావాలి .’’కుర్వంతు విశ్వం ఆర్యం ‘’అనేది భారతీయ సంప్రదాయం .విశ్వాన్ని సర్వోత్క్రుస్ట ,ఉన్నత మయమానవులనుగా తీర్చి దిద్దటమే భారతీయ ధార్మిక ఆదర్శం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’

సూక్తి సుధ

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను .

‘’ద్రుజ్ ధరణే’’అనే ధాతువు నుండి ‘’ధర్మం ‘’అనే పదం వచ్చింది .’’ధరతి విశ్వమితి ధర్మః –ధారణాత్ ధర్మః ‘’అని వ్యుత్పత్తి .సమస్త విశ్వాన్నీ ధరించేది ధర్మం .విశ్వ స్థితికి ఆధారమైనది ధర్మం .’’ధర్మ విశ్వస్య జగతిః ప్రతిష్టాలోకే –ధర్మిస్టం ప్రజా ఉప స్సర్ప౦తి-ధర్మేణ పాప మనువదతి-ధర్మే సర్వం ప్రతిష్టి తం –తస్మాధర్మం పరమం వదంతి ‘’అంటుంది శ్రుతి.అంటే ‘’సమస్తలోక స్థితికి పరమ ఆధారం ధర్మమే .ధర్మ నిస్ట కలవారిని ప్రజలు ఆశ్ర ఇస్తారు .ధర్మం పాపాన్ని తొలగిస్తుంది .ధర్మం లోనే అన్నీ ఉన్నాయి .కనుక ధర్మం సర్వ శ్రేష్ట మైనది ‘’అని భావం .రామాయణం లో కైక కూడా శ్రీ రామునితో ‘’ధర్మ మూల మిదం రామ విదితం చ సదామపి ‘’అని హితవు చెప్పింది .’’జగత్తు ధర్మ పైనే ఆధార పడి నడుస్తోందిరామా  .ఈ విషయం పండితులకు తెలుసు ‘’అని ఆమె మనో భావం .వనవాసానికి వెడుతున్న కొడుకు రాముడితో తల్లి కౌసల్య ‘’నువ్వు ఆచరిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది ‘’అని ధైర్యం చెప్పి పంపించింది .

ఇంతకీ ధర్మం మనకు చేసే మేలు ఏమిటి ?’’యతోభ్యుదయ నిస్శ్రేయససిద్ద్దిః స ధర్మః ‘’అభ్యుదయం నిస్శ్రేయస్సు లను ధర్మం కలిగిస్తుంది .మనుస్మృతి ‘’దశ లక్షణోధర్మః సేవితవ్యః ప్రయత్నతః –ధృతి ,క్షమా ,దమోస్తేయం ,శౌచ మింద్రియ నిగ్రహః –ధీః,విద్యా ,సత్యమక్రోదః దశకం ధర్మ లక్షణం ‘’అని ధర్మానికి ఉన్న పది లక్షణాలను చెప్పింది .ధర్మాలు రెండు రకాలు .ఆశ్రమ ధర్మాలు ,సామాన్య ధర్మాలు .గృహస్థాశ్రమ ,వానప్రస్థాశ్రమ ,సన్యాసాశ్రమాలలోని వారు ఆశ్చరించాల్సినవి ఆశ్రమ ధర్మాలు .సామాన్య జనులందరూ ఆచారిమ్చాల్సినవి సామాన్య ధర్మాలు .ఇవే సత్యం ,క్షమా ,భూత దయ ,కృతజ్ఞత మొదలైనవి .వాల్మీకి మహర్షి రామాయణం లో సామాన్య ధర్మాలకే ప్రాధాన్య మిచ్చాడు .ఇవన్నీ మానవతా ధర్మాలుగా లోకం లో పిలువ బడుతున్నాయి .ఇవే సమాజ పురోగతికి అవసరమైనవి .

ఐతే మానవత్వం అంటే ?’’మన్యతే అనేనా ఇతి ‘’అని చెప్పారు .’’దేని వలన సమస్తవ్యక్త ప్రపంచం ,దానికి కారణమైన అవ్యక్త ప్రపంచం తెలియ బడుతుందో అదే మానవత్వం ‘’.మానవత్వం లేని బ్రతుకు నిరర్ధకం .సాటి మానవునిలో దైవాన్ని చూసే చూపు కావాలి ,రావాలి .అప్పుడే మనిషి జన్మ సార్ధకం .సమాజం అలాంటి మానవులతోనే అభ్యుదయం చెందుతుంది .’’యతో ధర్మ స్తతో జయతి ‘’సుఖ సంతోషాలతో అందరూ వర్దిల్లటానికి ఈ ధర్మాలు అందరూ ఆనుస్టించాలి .ఈ రకమైన ధార్మిక పరమైన ఆలోచనా ,నిరంతర మననం  ను ‘’ధార్మిక చింతన ‘’అంటారు .

ధర్మం పురుషార్ధ హేతువు .కటుంబ ,బంధు ,సోదర ,దాంపత్య ,సాంఘిక ,న్యాయ ,రాజకీయాది ధర్మాలను అందరం ఆచరించాలి .అసత్యానికి మించిన అధర్మం లేదు .’’ధర్మ మూల జగత్సర్వం –ధర్మశ్చశ్రుతిమూలకః –భారతం పంచామో వేదః –శ్రుతి సర్వస్వ విస్తరం ‘’. ‘’సమస్త వేదాలకు మూలం ధర్మం .మహా భారతం పంచమ వేదం .వేదం సర్వస్వాన్ని మహా భారతం వివరించి చెబుతుంది .’’అని దీని భావం .భారతం చదివి అర్ధం చేసుకొని ,జీవితానికి అన్వయించుకొని ఆచరిస్తే ప్రపంచం సుఖ శాంతి మయమవుతుంది .అందుకే వివేకానందుడు ‘’ప్రాక్టికల్ వేదాంతం ‘’అవసరమని చెప్పాడు .ధర్మాలలో భూత దయ ఉత్త్తమమైనది .ఇదే భగవాన్ బుద్ధుని బోధనా సారాంశం .మానవుల విషయాలలోనే కాక పశు పక్షాదుల విషయం లో కూడా భూత దయ ఉండాలి అని వాల్మీకి మహర్షి బోధించాడు ..

ఒక క్రమ పద్ధతిలో ,అందరితో సహజీవనం తో ,అందరికి సమాన సంతృప్తిని కలిగిస్తూ జీవించటమే ధర్మం .’’అనేక ప్రాణి జేతే రహతి –త్యా సర్వా౦చి రహ వి సుస్తితి –సామాన్ సంధానాంఛి గతి వ్యాస –ధర్మ మహానవే ‘’.విశ్వాన్ని అంతటిని మన ఇల్లుగా భావించటం ,అందులో మన ఉన్నతి తో బాటు ,ఇతరుల సుఖ సంతోషాలు చూసే గొప్ప సంస్కృతినే ధర్మం అన వచ్చు .ఇందులో న్యాయం నీటి ,సమానత్వం ఉంటాయి .ఒకరికొకరు నిజాయితీగా సాయం చేసుకోవటమే లౌకికార్ధం లో ధర్మం .

2

ప్రపంచాన్ని ధరించేది రాక్షించేది ధర్మం .అనేక ధర్మాలు లోకం లో ఉన్నా వేదం ధర్మం శ్రేయస్కరం .’’ద్వివిదోహి వేదోక్తో ధర్మః ప్రవ్రుత్తి లక్షణో నివృత్తి లక్షణ శ్చ జగతః స్థితి కారణం ‘అని శ్రీ శంకర భగవత్పాదులు ‘’గీతా భాష్యం ‘’లో చెప్పారు .వేదం ధర్మాలు ప్రవ్రుత్తిధర్మం , నివృత్తి ధర్మం అని రెండు రకాలు .ప్రవ్రుత్తి ధర్మం అంటే ముందుకు వెళ్ళటం- ప్రోగ్రెస్ .నివృత్తి ధర్మం అంటే వెనక్కి తిరిగి చూసుకొని సవరించుకోవటం-రిగ్రేస్ .ఈ రెండు ధర్మాలు ప్రపంచం లో ప్రాణులన్నిటికి సహజమే .ఇందులో ఏది ముఖ్యమైనది అంటే రెండూ ముఖ్యమైనవే .ఉదాహరణకు-మానవుని పెరుగుదల శిశుత్వం తో ప్రారంభమై అనేక దశలలో,అనేక రకాలుగా విస్తరిస్తుంది .ఇది ప్రవ్రుత్తి ధర్మం .వృద్ధాప్యం లోఎదుగుదల ఆగిపోతుంది .మనిషి నెమ్మదిగా కుంచించుకు పోతాడు .ఇదే నివృత్తి ధర్మం .అంటే మొదట ప్రవ్రుత్తి ధర్మం ,తర్వాత నివృత్తి ధర్మం అనే దశలు ఉంటాయి .ఇవి ఒకదాన్ని వదలి రెండవది ఉండదు .ప్రవృత్తిలో ప్రేమ ప్రధానం .అదే అభ్యుదయ మార్గం .నివృత్తి లో శ్రేయస్సు ప్రధానం గా ఉండి ,ముక్తికి సోపానమవుతుంది .అలాగే మనసుకు కూడా  ఈ రెండు ధర్మాలు వర్తిస్తాయి . జీవితం లో ముందుకు సాగటం ప్రవ్రుత్తి .ఏవైనా అడ్డంకులు ఎదురైతే ,కొంచెం వెనక్కి తగ్గి ,మనల్ని మనం రక్షించుకోవటం నివృత్తి .మెలకువ స్థితిలో ప్రవ్రుత్తి లో ఉన్న మనసు ,ఇంద్రియాలు , నిద్రించే చేముందు నివృత్తి లోకి చేరతాయి .ముందుగా కర్మేంద్రియాలు ,తర్వాత జ్ఞానేంద్రియాలు ,మనసు విషయాల నుంచి వెనక్కి మరలి ,ఆత్మలో కరగి పోతాయి .నివృత్తి తో బాటు ధర్మాన్ని కూడా అలవరచు కొంటేనే నిజమైన ఫలితం కలుగుతుంది .

కేవలం నిద్రించటమే నివృత్తి ధర్మం కాదు .దానికి తోడుగా జ్ఞానం ఉండాలి అప్పుడే మోక్షం లభిస్తుంది .నివృత్తి స్థితికి చేరాలంటే మొదట ఇంద్రియ స్వేచ్చను అరి కట్టుకోవాలి .తర్వాత అనేక విషయాలపై ఉన్న దుఖాన్ని గుర్తిస్తూ వివేకం తో వాటిని విశ్లేషిస్తూ ,అనవసరమైన వాటిని విసర్జించాలి .అప్పుడు మాత్రమె మనసు నివృత్తి చెంది ఆత్మను తెలుసుకో గలుగుతుంది .అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుందన్నమాట .అయితే ఇదంతా సద్గురువుల సాన్నిధ్యం లో ,మార్గ దర్శకం లో మాత్రమె సాధ్యమవుతుంది .అప్పుడే ప్రవ్రుత్తి ,నివృత్తి ధర్మాలకు ధర్మ సూక్ష్మాలు గ్రహించే జ్ఞానం వస్తుందని సాధనలో పరి పక్వమైనవారు  తెలియ జేశారు .ఈ జ్ఞాన సాధన వలననే పునరావృత్తి రహిత మోక్ష పదం సిద్ధిస్తుంది .

‘’శరీరమాద్యం ఖాలు ధర్మ సాధనం ‘’అన్నారు ఏది సాధించాలన్నా శరీరం కావాలి .అది ఆరోగ్యం గా ఉండాలి .’’A sound mind in a sound body ‘’శరీరం ఆరోగ్యం గా ఉంటె మనసూ ఆరోగ్యంగా ఉంటుంది .’’బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి ‘’బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు .అలాగే ‘’ధర్మ విద్ ధర్మైవ భవతి ‘’ధర్మం తెలిసిన వాడు ధర్మ మూర్తి అయిన పరమాత్మయే అవుతాడు .ఇహ లోక వ్యవహారాలతో ముడి పడి  ఉన్నదే ప్రవ్రుత్తి ధర్మం .పరలోక వ్యవహారాలకు సంబంధించింది నివృత్తి ధర్మం .’’అరయగ ధర్మ తంత్రముల యందు –నిరర్ధకము లేదోకండు-నెవ్వరి మది యందు వ్రాలె దగ –వారు ,దానిన పూని యాచరింతురు’’అని తిక్కన గారు శాంతి పర్వం లో చెప్పారు .అంటే మానవుడికి ధర్మ స్వీకార స్వేచ్చ ఉన్నదన్నమాట .అనుమానం లేదు .ప్రవ్రుత్తి నివృత్తి ధర్మాలు ఒక దానికొకటి విరుద్ధం కావు .పరస్పర పోషకాలే . దీనికి మహత్తర ఉదాహరణ మన జాతి పిత మహాత్మా గాంధీయే –‘’ఒడలు దేశ సేవకు –ఎడద రాముని సేవకు –అప్పగించి ముక్తి గాంచె గాంధి ‘’అన్నారు తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు .

మానవ జీవితం లో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్సి ,సమాజ సేవకు అన్క్తం కావాలని మహా భారతం బోధించింది .జీవితం ద్వంద్వాత్మకం .మంచిని గ్రహించి ముందుకు సాగి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged , | Leave a comment

యాభై ఏళ్ళ తెలుగు సి ఐ డి ,మరియు అత్రేయం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోటపల్లి తో శుభారంభం ,దేశసేవలో ఆమె వెన్నముద్దల జనార్దన మహర్షి

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

10-9-15 గురువారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారి 120జయంతి రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సిద్ధార్ధ కాలేజి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ”విశ్వనాధ సాహితీ వైభవం ”దృశ్యమాలిక

10-9-15 గురువారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారి 120జయంతి రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సిద్ధార్ధ కాలేజి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ”విశ్వనాధ సాహితీ వైభవం ”దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వనాధ సాహితీ వైభవం లో నా పత్ర సమర్పణ

Image result for viswanatha satyanarayana

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి 120 వజయంతి సందర్భం గా కృష్ణా జిల్లా రచయితాల సంఘం ,విజయవాడ సిద్ధార్ధ కళాశాల  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన

విశ్వనాధ వారి సాహితీ వైభవం –జాతీయ సదస్సు -10-9-15-సిద్ధార్ధ కళాశాల –విజయవాడ

‘’తెలుగు భాషోద్యమం –విశ్వనాధ ప్రేరణ ‘’పై

పత్ర సమర్పణ– గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

శ్రీ మన్మధ నామ సంవత్సరం లో జన్మించిన విశ్వనాధ వారి నూట ఇరవై వ జన్మదినోత్సవాన్ని శ్రీ మన్మధ నామ సంవత్సరంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 10 న నిర్వహించటం చారిత్రాత్మక విషయం . అనుభూతికవి స్వర్గీయ తిలక్ మాటలలో ఇది ‘’అద్వైత మాన్మదం ‘’.

‘. ప్రపంచవ్యాప్తంగా 21నాగరకతలు వర్ధిల్లితే అందులో 19రూపు రేఖల్లేకుండా  నశించిపోయాయి .కారణం విదేశీ దండయాత్రకాదు ’ఎప్పుడైతే ఒక జాతి తన మూలాలను ,గత చరిత్రను మరచిపోతుందో అప్పుడు ఆ సంస్కృతీ దేశమూ నశించిపోతాయి ‘’అన్నాడు ఆర్నాల్డ్ టోయన్బీ.అదే నేడు భాషావిషయం లోనూ జరిగిపోతోంది .ప్రపంచ వ్యాప్తంగా భాషలు అంతరించి పోయి ఆ సంస్కృతులు కనుమరుగవుతున్నాయని యునెస్కో ఆవేదనే మన రాష్ట్రం లో తెలుగును బతికి౦చుకోవటానికి ‘’తెలుగు భాషోద్యమం ‘’వచ్చింది .కార్పోరేట్ సంస్కృతిలో  ఆంగ్ల మాధ్యమ ప్రభావ వ్యామోహం లో పడి మాత్రుభాషనే మర్చి పోయే విపరీత వింత పరిణామం వచ్చింది. దీని నుండి బయటపడటానికి మేదావి వర్గం  సాంఘిక ఆలోచనా పరులు భాషాభిమానులు నడుం కట్టి కదిలి కొంత మార్పు తెచ్చారు .అయినా జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది .

ఈ ప్రభావాన్ని సుమారు డెబ్భై ఎనభై ఏళ్ళ క్రిందటే  గుర్తించిన కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తెలుగు క్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’లో ఈ విద్యా విధానం పై తీవ్రంగా పాత్రల చేత చర్చి౦పజేసి తన మనోభావాలను వారి నోటితో చెప్పించాడు .హరప్పకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే ఈట్సన్ దొరకు నెలకు పన్నెండు వందల జీతం ఇస్తే తెలుగు ,సంస్కృతాలు బోధించే ధర్మారావు కు జీతం అ౦దు తోందో లేదో కనుక్కొనే అతీగతీ లేదు  .సుబ్బన్న పేటలో కేశవ రావు జాతీయ కళాశాల పెట్టి తెలుగు హిందీ సంస్కృతం రాట్నం వడకటం నేర్పిస్తుంటే  ,జమీందార్ ఇంగ్లీష్ కాలేజి పెట్టి పాశ్చాత్య  వ్యామోహం పెంచాడు .దీనికి ఎక్కినట్లు జనం జాతీయ కళాశాలలో చేరక ,లుకలుకలతో అవినీతితో ద్వంద్వ ప్రవృత్తుల పాలనలో క్రమంగా క్షీణించి , జమీందార్ కాలేజి దిన దిన ప్రవర్ధమానమైంది .అందులో జీతాలకు కటకట.ఇందులో పుష్కలం .యూరోపియన్ అధికారి చేతిలో జమీందార్ కాలేజి నడిపించాడు .జాతీయకళాశాల’’ పాలక సంఘం’’ ఆధ్వర్యం లో నడిచింది .

ఇంగ్లీష్ రాకుండా మనకు సాగదు అంటాడు వేయిపడగలలో శఠ గోపాచారి.కళాశాల కనుమరుగైపోతోంది .అది ఆనాటి పరిస్తితి .నేడు ప్రభుత్వ విద్యాలయాలు బక్క చిక్కి పోయాయి చేరేవారు లేకుండా పోతున్నారు . .కాన్వెంట్లు బలిసి పు౦జు కున్నాయి .ఆదర్శం గా ఉండి కళాశాలలో పనిచేసిన ధర్మా రావు సతీష్కే పోట్టగడవటం.లేదు .రాజా గారి కాలేజిలో తెలుగు పండితుడవ్వాల్సిన పరిస్తితి  వచ్చింది   .మన చరిత్ర సంస్కృతీ పై అవగాహన ఈ విద్యా వ్యవస్థ ఇవ్వటం లేదు .చదువు జ్ఞానాన్ని పెంచటం లేదు .’’టెక్కుల’’వరవడిలో కొట్టుకు పోతోంది జాతి .దీని నుంచి బయట పడాలి .అందుకే విశ్వనాధ ధర్మా రావు తో ‘’వందేళ్ళు బానిస చదువులు చదివి  భావనా శక్తి దరిద్రమై పోయింది .ఇది నశి౦చటానికే ఈ  విద్య  నేర్పిస్తున్నారు డిగ్రీ పొందినా ప్రపంచ జ్ఞానం రావటం లేదు ‘’.మరి దీనికి పరిష్కారం కూడా విశ్వనాధ అతనితోనే పశుపతికి  చెప్పించాడు .’’తెలుగు చక్కగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్పించు .బుద్ధి వికసించిన తర్వాత ఏ భాష అయినా త్వరగానే వస్తుంది .16ఏళ్ళ వరకు తెలుగులో చెప్పి ,,ఆ తర్వాత ఒక ఏడాది ఇంగ్లీష్ నేర్పిస్తే వ్యవహార జ్ఞానం వస్తుంది . మొదటి నుంచి ఇంగ్లీష్ చెప్పి చెడ గొడుతున్నారు. .మనం ఇంగ్లీష్ మానస పుత్రులం కాకూడదు .పరీక్షలు పాసై పోతున్నారుకాని అందులోని విషయాలు తెలియవు,అనుభవం లోకి రావు .పనికి మాలిన పుస్తకాలు ఎన్నో నేర్పించటం కంటే ఒక మంచి పుస్తకం నేర్పించు .’’పెద్ద బాల శిక్ష’’ చెబితే తెలుగు రాక పోవటం ఉండదు .’’అంటాడు  ఇప్పుడు మన పరిస్తితి అలాగే  ఉంది .అందుకే జ్ఞానోదయమై మళ్ళీ పెద్ద బాల శిక్షకు గిరాకీ పెరిగింది .

గుమాస్తాలుగా ,విదేశీయులకు బానిసలుగా చేసే విదేశీ విద్యనూ గాంధీజీ బహిష్కరించమని ఇచ్చిన పిలుపునే వేయి పడగలలో విశ్వనాధ నిక్షిప్తం చేశాడు .సుబ్బన్న పేటలో కరెంటు ,మిల్లులుఆధునిక సౌకర్యాలు  అన్నీ వచ్చాయి.విశ్వనాధ వీటికి వ్యతిరేకం కాదు .’’మనిషిలో మానసిక వికాసానికి అవసరమైన విలువల్ని ,సంస్కారాన్ని మర్చి పోనంతవరకు ఏ ఆధునిక మార్పునైనా పరిగ్రహించ వలసిందే ‘’అన్నాడు విశ్వనాధ .ఎక్కడా ఏమనిషీ ప్రేమలేనివాడు ,నిష్కరణుడు కాకూడదు ‘’అన్నదే ఆయన ధ్యేయం .జుగుప్స లేని కరుణా ,సానుభూతి మానవాళి పై ఉన్నవాడు .’’continuation with the past ‘’తో నిలబడ్డ యుగకర్త విశ్వనాద .కాలం కంటే యాభై ఏళ్ళు ము౦దున్నవాడు .శిల్ప సాహిత్యాదు లు జాతీయమై ఉండాలి.రాసిన వాడికి ముక్తి ,చదివిన వాడికి రక్తి ,ముక్తి .’’ఎంతసముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రికి గూడు చేరుతుంది .ఇదీ జాతీయత ,ఇదే సంప్రదాయం ‘’..ప్రాచీన ,ఆధునిక సాహిత్యానికి ఏకైక ప్రతినిధి విశ్వనాధ .భారతీయ సంప్రదాయ పరి రక్షణకు జీవితం అంకితం చేసిన విరాణ్మూర్తి .అందుకే ‘’ఒకడు విశ్వనాధ ‘’ అన్నారు ఆచార్య బేతవోలు  రామ బ్రహ్మం గారు .’’That is Visva Nadha  ‘’Unique one .’

పి. జి .వుడ్ హౌస్ ‘’your spine is made of tooth paste ,your veins flow water’’అని ఎద్దేవా చేశాడు .అలాంటి జాతిగా మనం మారిపోయాం దీనిని ఉద్ధరించటానికే విశ్వనాధ సాహితీ అవతారం ఎత్తాడు . సాహిత్యం,శిల్పం విజాతీయం కాకుండా జాతీయం కావాలి అనే ఆలోచన వచ్చిన కాలం లో ఆ సమకాలిక చైతన్యానికి సృజనాత్మక సాహిత్య శక్తి అయ్యాడువిశ్వనాధ ‘అంటారు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం .ఈ దేశం లో పుట్టిన ప్రక్రియల్లో పాశ్చాత్య ప్రక్రియలు లీనం కావాలి అనికోరాడు ఆపనే చేశాడు .మానవ జీవితం అర్ధ వంతం కావాలని కోరుకున్నాడు .రాజకీయ దాస్యం కంటే సాంస్కృతిక దాస్య౦ ఎక్కువ ఆవేదన కలిగించింది . .అందులో నుంచిజాతి  బయట పడాలి .  అప్పుడే వ్యక్తిత్వం గల జాతి అవుతుంది అంటాడు . ఆంద్ర పౌరుషం ఆంద్ర ప్రశస్తి లతో సకల చరాచారాలను కలుప్తూ ప్రబోధించాడు చైతన్యం తెచ్చాడు .’’తెలుగు తల్లి ,మానేల ,ఆంద్ర రాష్ట్రం, ఉరిత్రాళ్ళు ,బానిసల సముద్రం ‘’ మొదలైన వాటిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపాడు .స్వదేశీ అభిమానాన్ని చాటటానికే ‘’కిన్నెర సాని పాటలు’’ రాశాడు. ‘’తనకాలం నాటి తెలుగు నాట సామాజిక ,రాజకీయ ,పాలనా పరంగా వస్తున్న పాశ్చాత్య ధోరణుల పెనుగాలులకు రాక్షముఖంగా ప్రాతి నిధ్యం కల్పించి ఎడుర్కొన్నవాడు విశ్వనాధ ‘’అన్న ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి మాట యదార్ధం .

విశ్వనాధ చెప్పినట్లే  డాక్టర్ కొఠారి’’విద్యలో జ్ఞానం లోపించింది .దీనివలన యువతకు గుణాత్మక జీవన విధానం తెలియ కుండా పోయింది .మంచి వ్యక్తిగా పోరుడుగా  నైపుణ్య కారుడుగా తీర్చి దిద్దే విద్య నేర్పాలి ‘’అని యాభై ఏళ్ళ కిందటే చెప్పాడు .ఇప్పుడు మనం భాషోద్యమం లో అదే అంటున్నాం చరిత్ర మొదలైన హ్యుమానిటీస్ చేర్పించాలనికోరుతున్నాం .భారత రత్న ,మిసైల్ పితామహుడు అబుల్ కలాం కూడా ‘’విజ్ఞాన సముపార్జనకు పనికొచ్చేది అమ్మ భాష మాత్రమే . మాతృ భాషలో చదివితే మెదడు లోని ‘’నియో కోర్టే క్స్ ‘’బాగా స్పందించి ,సూక్ష్మ బుద్ధి ,కొత్త ఆలోచన ,వ్యక్తీకరణ సామర్ధ్యం పెరుగుతాయి . మాతృ భాష కు ఇంతటి మహత్తర శక్తి ఉంది .కలాం కూడా పదవ తరగతి వరకు తమిళ మాతృభాషలోనే చదువుకొన్నాడు .కలాం మాటలు మనకు శిరోధార్యం కారణం ఆయన మట్టి మనిషి .’’రామేశ్వరం నుండి రాష్ట్ర పతి భవనానికి దూసుకెళ్లిన రాకెట్ ‘’..’’విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల మీద నవతరానికి ఆసక్తి పెరగాలంటే అమ్మ భాష లోనే బోధించాలి .అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది ‘’అన్నాడు కలాం దీన్ని ఇస్రో చంద్రయాన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అన్నాదురై కూడా సమర్ధించాడు ఇంగ్లీష్ వాళ్ళు తప్ప, మిగిలిన ప్రపంచ శాస్త్ర వేత్తలందరూ సైన్స్ ను వాళ్ళ భాషలోనే రాస్తారు మాట్లాడతారు .మాతృ భాషలో విద్య నేర్పిస్తే వైజ్ఞానిక సాంకేతిక రంగాలకు అవసరమైన స్వంత ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది .సహజ మేధస్సును పదును పెడుతుంది .’’వైజ్ఞానిక సాధనకు అమ్మభాషే పెట్టు బడి’’అన్నాడు డాక్టర్ కలాం .’’కన్న పేగుతో అనుబంధం లేని ఇంగ్లీష్ అవసరాన్ని మాత్రమే తీరుస్తుంది .చదువుపై ఆసక్తి పెంచలేదు ‘’అన్నాడు రాకెట్ వీరుడు కలాం .మద్రాస్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కలాం చదివేటప్పుడు తమిళం లో రాసిన ‘’మన విమానాన్ని మనమే తయారు చేసుకొందాం ‘’వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది .’’జీవద్భాషలో చెబితే హృదయం స్పందిస్తుంది .ఎంతా పెద్ద ఉద్యోగానికైనా తెలుగే అర్హతకావాలి .వృత్తి, సాంకేతిక విద్యలలో కూడా తెలుగుకు ప్రాధాన్యమిచ్చి అందులో వచ్చిన మార్కులు అంతిమ ఫలితాలకు కలపాలి .అప్పుడే భాష బాగుపడుతుంది ‘’అని శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ఈ మధ్య చెప్పిన దాన్ని, వందేళ్ళ క్రితమే గిడుగు రామమూర్తిగారు ‘’అన్ని శాస్త్రాలూ మాత్రు భాషలో బోధిస్తేనే స్పష్టంగా అర్ధమవుతుంది .ఉగ్గుపాలనుండి తల్లిభాష లోనే అంటా నేర్పాలి ‘’అన్నారు .అందుకే ‘’అమ్మనుడి’’ సహజమైనది .దీనికోసం ప్రభుత్వానికి సరైన భాషా విధానం ఉండాలి దాన్ని నిర్దుష్టంగా అమలు చేయాలి .చట్టాలు న్యాయ వ్యవహారాలూ పాలనా అ౦తా తెలుగులోనే జరగాలి.తెలుగు మూలాల మీద పరిశోధన జరగాలి .మాధ్యమాలలో ఆంద్ర పద ధోరణి తగ్గాలి . ఇవన్నీ విశ్వనాధా ప్రేరణలే

.  ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. ఒక జాతిపాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. ‘ ‘జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి’’అన్న మహనీయుడు

ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన విశ్వనాధగారి వేయి పడగలుమాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతిహాసంవేయిపడగలు‘. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ‘’నేను చదవ వలసిన వాడినేకాని చూడవలసిన వాడిని కాదు ‘’ అని చెప్పగల సత్తా ఉన్నవాడు .ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, సాహితీ కల్పవృక్షం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ .

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

2-405 శివాలయం వీధి– ఉయ్యూరు -521165-కృష్ణా జిల్లా

చరవాణి-9989066375 ,o8676-232 797

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బీహార్ లో నితీష్ కె మళ్ళీ చాన్స్



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెల్లి మళ్ళీ మళ్ళీ సెరినా గెలుపు మరో ఏడాది సోనియా ,ఆరేళ్ళ సానియా ఆదర్శం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా గోదావరీ సంగమ హెల ,సంగీత శక్తి అనంతం



 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 3- 403- బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -3

403-  బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

 

‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీఠ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది .

 

Inline image 1  

గుంటూరు జిల్లా చంద వోలులో  తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసినందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ  తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని  తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు .

పాండిత్య ప్రకర్ష

శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠ  శాల నిర్వహణ లో తోడు  పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఏలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్  ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీఠా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు .

అమ్మ వారి సాక్షాత్కారం

దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి  తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి  అంగోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒరే ! ముష్టి పె డ  తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే .

అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం ,తపస్సు కొన సాగించారు .ఇంట్లో వేరు సెనగ  నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి  కాబేజీ ,నిషిద్దం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు కూతురు లక్ష్మి ని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు .ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవశం

‘’  శాస్త్రి గారిని చందవోలు శాస్త్రి గారు ‘’  అని ఆ ప్రాంతంవారంతా గౌరవం గా సంబోధిస్తారు .   శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాఠ శాలలో దయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి  పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు .

తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు. అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాసించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ  మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది.శాస్త్రి గారు మహా ఆగమ పండితులు .ఇంటి ఆవరణలో దత్తాత్రేయ ,సుబ్రహ్మణ్య ,సీతా రామ లక్ష్మణ ,హనుమాన్ దేవాలయ నిర్మాణం చేశారు .తనకు వ్యాకరణం నేర్పిన గురువుగారిని నిత్యం పూజా సమయం లో స్మరించేవారు .

ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతి కని పించి,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడితురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు ?’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పొర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి  ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు .

చందవోలు శాస్త్రి గారి రచనలు

చందవోలు శాస్త్రి గారు గొప్పకవి .సంస్కృతం లో తెలుగులో రచనలు చేశారు .అందులో సంస్కృత రచన ‘’మత్స్వప్నః అనేది చాలా ప్రసిద్ధమైనది .ఇదికాక ‘’హేమ దుర్గా౦బికా శతకం ‘’,పాండు  రంగేశ్వర ప్రశస్తి ‘’,బాలా త్రిపుర సుందరీ సమేత రాజ రాజ నరేంద్ర స్తవం , శాంకరీ స్తవం ప్రభు ప్రపత్తి ,సహస్ర లింగేశ్వర స్తుతి ,దత్త్తాత్రేయాస్టక గర్భితాత్మ సుప్రభాతం ‘’;ప్రారబ్ధ ప్రాబల్యం ‘’,దత్త భగవంతం,’’ శ్రీరామ కదామృత శేష పురాణం ,శివలీల, తుకారామదాసు చరితం ,వాసుదేవ సారదీయం ,మొదలైనవి రచించారు .లౌకిక వ్యవహారంగా ‘’ ‘’నాయోగము ‘’పాడిన పాట’’,నా యాత్ర (కాశీ ),’’నాకు తోచిన మాట ‘’,ఇంకొకమాట (వ్యాసావళి ).

‘’మత్స్వప్నం ‘’లోని శాస్త్రి గారి కవితా వైదుష్యాన్ని దర్శిద్దాం .

‘’శ్రీమాతా శ్రీ మహా రాజ్ఞీ –స్వధ్యాసీనా దేహలీ మధ్య మార్యా –స్వప్నే దృష్టా ద్రుస్టతః –శిల్పా నల్పాకల్ప భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి బాలా త్రిపుర సుందరీ దేవి ,సహస్రనామాలకు అధిదేవత .లక్ష్మీ వైభవం ఇచ్చేది ,శ్రీ విద్యా స్వరూపిణి ,దేవతలందరికీ అధినేత్రి అయిన ముత్తైదువ మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని కల్ప లతలతో సృష్టింప బడిన అంతు  లేని శిల్ప ప్రావీణ్యం గల సర్వాభరణాలతో ప్రకాశించే నా తల్లి నా అదృస్టవశాన స్వప్నం లో సాక్షాత్కరించింది .

అప్పుడు శాస్త్రిగారు అమ్మవారిని ‘’అమ్మా ! మమ్మల్ని అందరిని కన్న తర్వాత శంకరుని వివాహం ఆడావా లేక ము౦దేనా ?’’అని ప్రశ్నించారు అమ్మ నవ్వి భండాసుర వధను తానూ ఎలా చేసిందో వివరించింది ఆ కధను .అంతటినీ శాస్త్రి గారు ఇందులో రాశారు .మళ్ళీ సందేహం రావటం బాలా దేవికి నివేదించటం ఆమె కదా రూపం లో తెలియ జేయటం ఇందలో విశేషం .త్రిమూర్తులకు భేదం లేదని చెప్పారు .

‘’ఈశో  విష్ణుః శ్రీ రుమా వాణ్యు మాజో –పీశ శ్శక్ర స్చేశ ఈశా శాచీడ్యా-స్త్రీ సర్వోమా పూరుషస్సర్వ  ఈశః –ఇత్యూచే కోపి శ్రుతే ర్మౌళిభాగః ‘’

భావం –విష్ణువే ఈశ్వరుడు ,లక్ష్మి పార్వతి ,వాణిపార్వతి ,బ్రహ్మ ఈశ్వరుడు ,ఇంద్రుడు ఈశ్వరుడు ,శచీదేవి పార్వతి .ఇలా స్త్రీలు అందరూ పార్వతీ స్వరూపులే ,పురుషులంతా ఈశ్వర రూపులే అని ఉమామహేశ్వర ఉపనిషత్ బోధించిందిఅని చెప్పారు . .చివరికి తనకు విద్యలో రచనలో సహాయం చేసిన శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శ్రీ  నాగ లింగ శాస్త్రి వంటి మహనీయులను స్మరించి చివరి శ్లోకం గా

‘’తద్వద్యో యో మేలమేకం దదౌతు –చిత్తేనాహం గౌరవేణార్చయామి –దైవేభ్యో మిత్రేభ్య ఉచ్చైర్గురుభ్యః –పాండి త్యౌన్నత్యర్ది వద్భ్యో నమా౦ స్యోం ‘’చెప్పారు .

అర్ధం –ఏ ఏ మహాత్ములు నాకు ఒక్క అక్షరమైనా ఇచ్చారో వారందర్నీ గౌరవ ప్రపత్తులతో అర్చిస్తున్నాను .దేవతలకు మిత్రులకు ,సహచరులకు ,పెద్దలైన గురువులకు ,సర్వ సమత్వాన్ని ప్రవచించే ప్రబుద్దులకందరికి నమస్కారాలు .ఇంతకంటే చేయాల్సింది ,చెప్పాల్సింది ఏమీ లేదు ‘’అని అంతటి కర్మిషష్టి  బ్రహ్మిష్టి వశ్యవాక్కు ,నిత్య బాలా త్రిపుర సుందరీ దర్శన పులకా౦కితులు ,శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అత్యంత వినయంగా చెప్పుకొన్నారు ఇది మనందరికీ ఆదర్శం .శ్రీ విద్యోపాసకులు కనుకనే ఈ గ్రందాన్ని రాయగలిగారు .చిన్నదే అయినా ఈ శ్లోక గ్రంధం  అందరికి  పఠనీయం .ఈగ్రందాన్ని శాస్త్రిగారి దౌహిత్రులు ఉభయభారతి బిరుదుపొందిన సంపూర్ణ సంస్కృత శతావాధానం నిర్వహించిన  సంస్కృత౦లొ ‘’ కవితా మయూఖా ‘వంటి ’బహుగ్రంధ కర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ముద్రించి లోకానికి అందజేశారు . చందవోలు శాస్త్రిగారి తండ్రి గారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు కూడా విద్వత్ కవులే సంస్కృతం లో ‘’శ్రీ శైల తీర్ధ సారోఖ్యోయం ‘’వంటి గ్రంధ రచయిత .

 

శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు  గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ  ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది. అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .

ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి .

దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .వార్తా పత్రికలలో వేశారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి  . –

సశేషం

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

425కోట్ల బిర్లా ఇల్లు ,మాతా అమృతానందమయి భూరి విరాళం ,మరో శతఘ్నిమోడల్ సిటి గుంటూర్


 

 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇప్పటికీ ఇండియానే బెస్ట్ ,చదువులో కత్తిసాములో కత్తి ,మోడీ మాజిక్ తో సెన్సెక్స్ పైపైకి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఔరంగజేబు ను మళ్ళీ బతికించారు ,ఆదిభట్ల ,తెన్నేటి బూర్గులపై వ్యాసాలూ


 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణను కలిసే గోదారి -భాషా దినోత్సవాలు


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ జయంతి

విశ్వనాధ జయంతిfinal invitation00010002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జై జవాన్

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యేళ్ళ కేరళ శివాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వ్యాసాలు


 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment