పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందనnoriletter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సురవరం ప్రతాప రెడ్డిగారు –

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదా

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం

  • 28/05/2015
TAGS:

కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు హాజరై కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదుతో పాటు ఎన్‌టిఆర్-జిపిఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్‌టిఆర్ పేరుతో బిరుదును ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కోట శ్రీనివాసరావు తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. నందమూరి లక్ష్మీపార్వతి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వంశీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు, బిజెపి మహిళా మోర్చా సభ్యురాలు కె.మధుబాల, సామాజిక కార్యకర్త అంజనారెడ్డి, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, గానసభ అధ్యక్షుడు డా. కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సంగీత విభావరి అందరినీ అలరించింది.

సేవా రత్న పురస్కారాల ప్రదానం
కాచిగూడ, మే 27: గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీవేత్త గిరిరాజు విజయలక్ష్మీ సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గిరిరాజు విజయలక్ష్మీ పేరుతో సేవా పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సెంట్రల్ సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, సాహితీవేత్త డా.శరత్ జ్యోత్నారాణి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో డా.లక్కరాజు నిర్మల, మంగళగిరి ప్రమీలాదేవి, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకటదీక్షితులు పాల్గొన్నారు.

మనస్విని నృత్య మందారం
రవీంద్రభారతి, మే 27: చిదంబరంలో శివుడు ఎడమ కాలు పైకెత్తి ఒంటి కాలుతో నాట్యం చేస్తున్నట్లు నటరాజ స్వామిగా సాక్షాత్కరిస్తాడు.. ఈ భంగిమ ఆధారంగా హిందోళ రాగంలో రూపకల్పన చేసిన తిల్లాన అంశాన్ని చిన్నారి మనస్విని ముచ్చటగా రమ్యంగా నర్తించింది. 9వ తరగతిలో అడుగుపెడుతున్న ఈ చిన్నారి బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో భరటనాట్య సంప్రదాయంలో అరంగేట్రం ప్రదర్శించింది. ‘్ధరసమేరా యమునా తీరానా..’ జయదేవుని అష్టపధిని యమన్ కళ్యాణి రాగంలో మంతా శ్రీనివాస్ ఆలపించగా నాట్యాచారిణి మీనాక్షి రవీందర్ నట్టువాంగానికి అనువుగా మనస్విని హృద్యంగా నర్తనచేసి ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో ప్రధాన అంశం వర్ణం ‘దానికే తగు జానరా…’ తోడి రాగం, రూపక తాళంలో ఆలపించగా చిన్నారి అభినయానికి ప్రేక్షకులు హర్షధ్వనాలు ప్రకటించారు. ఈ అంశంలో పార్వతీదేవి చెలికత్తె శివుని గురించి కొనియాడుతూ పార్వతీ పరమేశ్వరుల ఆనంద తాండవాన్ని వర్ణించడంను తన అభినయంలో ముచ్చటగా ప్రదర్శించింది. నృత్య కార్యక్రమం పుష్పాంజలితో ప్రారంభమైంది. ఆది గురువు మాతృమూర్తికి, నటరాజస్వామికి, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ప్రేక్షక దేవుళ్లకు నమస్కరించి నృత్య కార్యక్రమం శుభ ప్రదం అవ్వాలని ప్రార్థించి రాగమాళికా రాగంలో శ్లోకాలను అభినయించింది. కర్ణాటక దేవగాంధారీ రాగంలో పంచాక్షరీ దేవి కీర్తనను నృత్యం చేస్తూ సృష్టి స్వరూపిణి జగన్మాతను వివిధ అవతారాలతో కొనియాడుతూ అభినయంలో చిన్నారి ప్రార్థించింది. సావేరి రాగంలో జతిస్వరంను కూడా ప్రదర్శించి చివరగా మంగళంతో అనిల్‌కుమార్ వయొలెన్‌తోను, సుధాకర్ వీణా వాయిద్యంతోనూ, నాగేశ్వరరావు మృదంగంతో సహకరించగా నృత్య కార్యక్రమం ముగిసింది. సి.శివశంకర్‌రెడ్డి, సీతాలక్ష్మి మనవరాలు చిన్నారి సి.మనస్విని పుష్పాలతో నాట్యగురువు మీనాక్షి రవీంద్రకుమార్‌కు పాదాలకు నమస్కరించి గురుసత్కారం చేసింది. మనస్విని ఇస్కాన్ ప్రతినిధి రామచంద్రకృపాదాస్, గైనకాలజిస్ట్ డా. మీనా ఉగేల్, గీతాంజలి సంస్థ ప్రిన్సిపల్ మాధవీ చంద్రా, సి.రాజశేఖర్‌రెడ్డి, శారద, నిశ్చల్‌రెడ్డి ఆశీర్వాదించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కలిసిసాగుదామని కె సి ఆర్ కు బాబు పిలుపు

Inline image 1
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

.  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్

అమెరికన్ కవయిత్రి  ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం  .యదార్ధం కాని అనేక జీవిత చరిత్రలు ఆమె చుట్టూ అల్లేశారు .అందులో ఊహాగానాలే ఎక్కువై అసలు నిజం మరుగున పడి పోయింది .అయినా శతాబ్దాల కాలం ఆమె అజ్ఞాత వ్యక్తిగా జనం వెంట బడి వదలలేదు .బాలికగా ఉండగానే అద్భుత సౌందర్య వతి అని పించుకోంది.అబ్బాయిల గుండెల్లో గాలమై గుచ్చుకొన్నది .మొదటరాసిన కవిత్వం లో శృంగారమే ఎక్కువ .కాని ముఖం లో ఏభావమూ జ్యోతకంయ్యేదికాదు.ఆకర్షణ తక్కువైనా మనిషి కొట్టొచ్చినట్లు కనిపించటం ఆమె ప్రత్యేకత .నల్ల కంచు రంగు కళ్ళు ,తెల్లటి శరీరం తో టైటాన్ లాగా అగుపించేది .ఫోటో తీయటానికి ఒప్పుకోని ఎమిలీ తానె స్వంతంగా తన చిత్రాన్ని మధురజ్ఞాపికగా చిత్రి౦చు కొన్నది .’’’నా ఫోటోలు ఏవీలేవు .నేను’రేన్ అంటే ముక్కు వంకరగా పొట్టి రెక్కలతో గుండ్రని కురచ తోక తో సన్నని కాళ్ళతో కొంచెం మాత్రమె పొడవుగా ఉన్న ‘’జీవ రాయి పిట్ట ‘’(కంప చిట్ట పిట్ట )లాంటి చిన్నదాన్ని .’’అని చెప్పుకొన్నది .ఇలా తన గురించి చెప్పుకొన్న విషయాలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి .

ఒంటరి జీవితం

ఎమిలి డికిన్సన్ అమెరికాలో మాసా చూసేట్స్ రాష్ట్రం లో ఆమ్ హీర్స్ట్ లో 1830 లో డిసెంబర్ 10 న జన్మించింది .ఏ ఇంటిలో పుట్టిందో ఆ ఇంటిలోనే జీవించి ఆ ఇంట్లోనే మరణించింది .ఎప్పుడైనా కొద్దికాలం బయటిప్రదేశాలకు వెళ్ళినా ఆమె అక్కడే ఉండేది ఎప్పుడూ .బాల్యం ఆనందంగా గడిచింది .అన్న విలియం ఆస్టిన్ ,చెల్లెలు లవీనియా ఉండేవారు .ఇరవై ఏళ్ళు వచ్చాక ఒంటరి జీవితానికే అలవాటు పది పోయింది .కాలక్షేపంగా యెడ తెగకుండా లెక్కలేనన్ని కవితలు రాసేది . కాని వాటిని ప్రచురించటానికి ఒప్పుకోనేదికాదు .బయటి ప్రపంచం తో సంబంధమే ఉండేదికాదు ఆమెకు .బయటి ప్రజల పై ఏవగింపు కవితలలో కనిపించేది .తానెవ్వరికి చెందని దానినని బయటివారూ అలాంటివారే అయితే వారితో జతకట్టగలనని ఇది బయటికి చెప్పద్దని చెబితే ఇద్దర్నీ వెలి వేస్తారని  రాసుకొన్నది .ఆకవితలు చూద్దాం –

‘’I am no body !Who are you ?-Are you nobody ,too –Then there is a pair of us –don’t tell !-They would banish us ,you know ‘’

‘’How dearly to be somebody !How public ,like a frog –To tell your name the livelong day –To an admiring bog ‘’

కుటుంబ నేపధ్యం

ఎమిలీ తండ్రి కౌంటీలాయర్ ,శాసన సభ్యుడు ,గవర్నర్ కౌన్సిల్ మెంబర్ .పిల్లలు విద్యలో ఉన్నతి సాధించారు .ఎమిలి మాత్రం ఆటగోలు తనం తో ,ఏదీ పట్టని దానిలాగా ఉండేది .దేవుని గూర్చి తండ్రి గురించి చెప్పేది .ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తె తండ్రి ఎడ్వర్డ్ డికిన్సన్ అచ్చంగా బ్రౌనింగ్ కవి భార్య అయిన ఎలిజబెత్ బార్రేట్ తండ్రి మౌల్టన్ బారేట్ లాగా ఉండేవాడని పిస్తుంది .కాని కవయిత్రి ఎలిజబెత్ లా కాకుండా.ఎమిలి బాల్యం నుండి తిరుగుబాటు ధోరణి తో ఉండేది .ఎమిలీ ఆమ్ హీర్స్ట్ అకాడెమీ లోను ,మౌంట్ హోలీ యెక్ ఫిమల్ సేమినరి లోను చదివింది .శ్రద్ధగా చదివినట్లు కనిపించేదికాదు .ఏదీ పట్టనట్లే ప్రవర్తించేది .లెక్కలు ,జామెట్రీ ,కేమిస్త్రి ,ఆస్ట్రానమి లలో బాగా అభి వృద్ధి కనపరచినా ఆమెకు చర్చి కట్టుబాట్ల విషయం లో ఇష్టం ఉండేదికాదు ..ఆటగోలు తనం ,ఉండేదని క్రిస్టియన్ గా ఉండటానికి అభ్యంతరం చెప్పేదికాదని ,ఆత్మ న్యూనతా భావం ఉండేదని ఆమె స్నేహితులు చెప్పేవారు ..ఈ మాటే తండ్రితో ‘’నేను చెడ్డ దాన్నే నాన్నా !’’అని చెప్పి ఒక్క ఏడాదిలోనే హోలీ యోక్ కు గుడ్ బై చెప్పేసింది .

ఇరవైలలో ఏదో జరిగి ఉంటుంది

ఎమిలీకి ముప్ఫై ఏళ్ళు వచ్చాక అన్నిటినీ పూర్తిగా విసర్జిన్చేసింది .కాని ఆమె జీవితం లో ఇరవై ముప్ఫై ఎల్లమధ్య ఏదో సం థింగ్ జరిగి ఉంటుందని చరిత్రకారుల నమ్మకం .అందుకే ప్రపంచానికి దూరంగా బతకటం అలవాటు చేసుకొన్నది అని భావన .కనుక శారీరక మానసిక ఉపశమనం కోసం ఏకైక విధానంగా కవిత్వం రాయటం ప్రారంభించి కడదాకా కొన సాగించింది .ఆమె భద్రంగా రహస్యం గా రాసుకొని దాచుకొన్న డైరీ వలన ఈ విషయాలన్నీ వెలుగు లోకి వచ్చాయి .ఆమె జీవితం లో ఓడిపోయిందని అర్ధమవుతుంది .దాన్ని ఆమె ‘’ప్రపంచానికి లేఖ ‘’అని పేరుపెట్టింది .ఇంకేముంది ఊహలు చేసే వారికి చేతినిండా పని దొరికింది .అనేక పుక్కిటి పురాణాలు ఆమె చుట్టూ అల్లారు .అందులో నిజమెంతో కల్పనా ఎంతో తెలియనంత జటిలమైపోయింది ఆమె యదార్ధ జీవితం .1930లో ‘’the life and mind of Emily Dickinson ‘’ అనే పుస్తకాన్ని జేనేవీవ్ టగ్గార్డ్ అనే రచయిత రాసి ప్రచురించాడు .ఎమిలీ జీవితం లో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారి వలననే ఆమెలోని  శృంగారాభావం తెగిపోయిందని తెలియ జేశాడు .అందులో ఒకడు లియోనార్డ్ హంఫ్రీ అనే అతను ఆమెకు ఇరవై ఏళ్ళు రాకముందే చనిపోయాడు .రెండవ వాడు జార్జి గౌల్డ్ .ఇతను ఆమె తండ్రికి భయపడి దూరమై ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంటి గార్డెన్ కే పరిమితమయ్యేట్లు చేశాడని .కాని ఎమిలీకి అతను అంటే గుండె నిండా ప్రేమ ఉండేదని ,కాని బహిర్గతం కాకుండా అణచు కొన్నదని రాశాడు .కనుక బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా ‘’Nun of Amherst ‘’గా మిగిలిపోయిందని చెప్పాడు .

అదే ఏడాది జోసేఫిన్ పోలేట్ అనే ఆతను ‘ఎమిలీ  దికేంసన్  –ది హ్యూమన్ బాగ్రౌండ్ ‘’పేర ఒక పుస్తకం రాసి మూడో వ్యక్తిని చెప్పి అతని వలననే ఆమె ప్రేమ జీవితం భగ్నమైపోయిన్దన్నాడు. ఆ భావాలే ఆమె కవిత్వం లో చోటు చేసుకొన్నాయని తేల్చాడు .యితడు ఎమిలీ కుటుంబానికి అతి సన్నిహితురాలన హెలెన్ హంట్ భర్త ఎడ్వర్డ్ హంట్ .రెండేళ్ళ తర్వాత ‘’ఎమిలి దికేంసన్ ఫేస్ టు ఫేస్ ‘’పుస్తకం రాసిన మార్తా డికేంసన్ బియాంచి అంటే ఎమిలీ మేనకోడలు ఎమిలి కి పెళ్లి అయిన ఒకబ్బాయితో ఎఫైర్ ఉండేదని అతనిభార్యకు అన్యాయం చేయలేక ఎమిలి కుమిలిపోయి ,ఇంటికీ , ఏకాంతానికి  అంకితమై పోయిందని వివరించింది .1938లో మరొక పుస్తకం ‘’దిస్ వజ్ ఏ పోయేట్ ‘’రాసిన జార్జ్ ఫ్రిస్బీ విచేర్ ఈ గాసిప్ లకు స్వస్తిపలికాడు .సూటిగా విషయ పరంగా పరిశోధన చేసి ఆమె జీవితాన్ని ఆవిష్కరించాడు . ఇందులో ఎమిలి కి ఇరవై –ముప్ఫై ఏళ్ళ మధ్యకాలం లో రెండు పెద్ద నష్టాలు జరిగాయని .మొదట గా ఆమె చేత ‘’డియర్ ఫ్రెండ్ అండ్ టీచర్ ‘’అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాన్క్లిన్  న్యూటన్  అనే గొప్ప సారస్వతారాధకుడు ,కాలానికంటే ముందు ఆలోచించే బుద్ధి జీవి .ఆమె ఇతని ప్రభావం లో పడేనాటికి అతని వయసు ఇరవై ఏడు –ఆమెకు పద్దెనిమిది .కాని మూడేళ్ళ తర్వాత న్యూటన్  తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు న్యూటన్ రెండేళ్ళ తర్వాత క్షయ వచ్చి చనిపోయాడు ఈ విషయాన్ని థామస్ వెంట్ వర్త్ విద్డింగ్గ్ట న్   అనే ఒక విద్వాంసుడికి ఉత్తరం రాస్తూ ఎమిలీ ‘’నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు .అతను నాకు అమరత్వం (ఇమ్మోర్టాలిటి )బోధించాడు .దానికి దగ్గరవుతున్నసమయం లో అతను మళ్ళీ తిరిగి రాలేదు .తర్వాతా నా గురువు మరణించాడని తెలిసింది ,అప్పటినుంచి నాకు అక్షరమే నా మిత్రమైంది .మరొకాయన నాజీవితం లో ప్రవేశించాడు .కాని ఆయనే నన్ను గురువుగా అనుకోని సంతృప్తిపడక ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు . ఈ రెండు నష్టాలు ఆమె కవిత్వాన్ని భర్తీ చేశాయి .తరచుగా ఆమె రాసిన లైన్లు ‘’ I never lost as much but twice ‘’ఈ విషయాన్ని ద్రువీకరిస్తాయి .కాని ఆ రెండుకవితలు బాగా ప్రాచుర్యం పొందాయి .

1-‘’My life closed twice before its close –It yet remains to see –If immortality unveil –A third event tome ‘’

‘’2-‘’So huge so hopeless to conceive –As these that twice befell -.Parting is all we know of heaven –And all we need of hell ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,

       నమస్కారములు !  మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా నెలకొని ఉన్న ఆయన దేవాలయాల గురించిన  విశేషాలను, అన్నీ స్వయంగా చూడలేని వారికి, కనుల ముందుకు తెచ్చి ఎంతో పుణ్యం కట్టుకున్నారు మీరు.      రాముడంటే హనుమంతుని భక్తి ఎంత పరిపూర్ణమైనదో  ఒక సందర్భంలో నిదర్శనమైనదని పెద్దలు చెప్తారు.
        శ్రీ రామ పట్టాభిషేక సందర్భంలో, శ్రీ రాముడు వానార వీరులన్దరినీ పిలిచి యథోచితంగా బహుమతులిస్తూ సత్కారిస్తాడట. చివరికి, హనుమను పిలిచి, సీతమ్మ వైపు చూస్తాడట. ఆ తల్లి, ఎంతో ప్రేమతో తన కంఠహారాన్ని తీసి బహుమతిగా హనుమకు ఇస్తుందట. హనుమ, ఆ హారాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఆ హారంలోని ముత్యాలను ఒక్కొక్కదానిని కొరికి, చూసి, పెదవి విరిచి పారవేస్తాదట. అది చూసి, సీతమ్మ కినుక వహిస్తూ రామునివైపు, ‘అదేమిటి ? ఇలా ప్రవర్తిస్తున్నాడు ?‘ అని ప్రశ్నార్థకంగా చూస్తుందట. రామచంద్రుడు నవ్వి, హనుమ వైపు చూసి అంటాడట:” హనుమా, సీత ఎంతో ప్రేమతో తన కంఠ హారాన్ని తీసి నీకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వలా కొరికి పారవేస్తావేమిటీ ?  ఆమెకు కోప వచ్చింది  !”.
      దానికి హనుమ వినయ వినమిత గాత్రంతో, ‘స్వామీ ! ఏమని చెప్పేది ?  నాకు లోపలా బయటా, అంతటా నా  రాముడే కనపడతాడు !  మరి ఈ హారంలో ఏ కోశాన అయినా, ‘నా రాముడు కనబడతాదేమోనని, వెతుకుతున్నాను. అలా కనపడక పోయేటప్పటికి, ‘నా రాముడు లేని ఈ ముత్యాలు నాకెందుకూ’ అని పారవేస్తున్నాను. అంతే  !’ అంటాడట. పుత్ర సమానుడైన, ఆ భక్త పరాయణుడి రామ భక్తికి, ఎంతో మెచ్చుకుని సీతమ్మ కూడా సంతృప్తి చెందుతుందట. తనకు తెలుసు కాబట్టి, రామ చంద్రుడు చిరునవ్వుతో హనుమను ఆశీర్వదిస్తాడట’
         ఈ ఘట్టాన్ని గురించి,  ఎక్కడో కొన్ని సంవత్సరాల  క్రితం ఒక ఉపన్యాసంలో విన్నాను. ఎవరి భక్తి  ఐనా, అలా  అంకిత భావంతో, ‘ఆత్మార్పణ’ భావంతో, నిర్మలంగా ఉండాలని చెప్పటానికి ఈ ఘట్టం నిదర్శనంగా చెప్తారు.
         అటువంటి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలను మీరు పరిచయంచేసి ధన్యులయారు. గ్రంథం ఆత్మీయతతో పంపినందుకు, శతాధిక ధన్యవాదాలు. ఈరకంగా, మీరు ఈ వయసులో కూడా  సాహిత్య, వేదాంత సేవ చేస్తూ తరిస్తున్నారని నా భావన. ఇలాగే, మీ నిస్వార్ధ సేవ కొనసాగాలనీ, అందుకు ఆ పరమేశ్వరుడు మీకు నిండు ఆయురారోగ్యాలను ప్రసాడించాలనీ, ప్రార్థిస్తూ, సెలవు.
మీ గీతాంజలి మూర్తి 


మీ గీతాంజలి మూర్తి 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేజ్రి బ్రహ్మాస్త్రం -చేత తక్కువ మోత ఎక్కువ -ఇండియా గే ట్ కృష్ణారావు

Inline image 1


 
 
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాజధాని మాస్టర్ ప్లాన్ – ఇదే

unname6

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

 

ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని

Inline image 1  Inline image 2

1837లో ఇటలీలోని రెస్కాల్దిన్  లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది .

చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై ఆకర్షణ కలిగి ముందుగా అందులో చేరింది .క్రమంగా ఎదిగి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసింది .స్త్రీలకు అన్నిటా సమాన హక్కులు కావాలని ఉద్యమాలు నిర్వహించింది .పితృ స్వామ్య బంధాలనుండి మహిళా విముక్తురాలై ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ తానను తానూ తీర్చి దిద్దుకోవాలనేది మజోన్ని మహత్తర ఆశయం .ఇటాలి సివిల్ కోడ్ లో మార్పులు తేవటానికి ‘’మహిళలు –సాంఘిక బంధాలు ‘’అనే పుస్తకాన్ని 1864 లో రాసి అందులో ఇటలీ కుటుంబ న్యాయం గురించి చర్చించింది .1877లో మహిళలకు ఓటుహక్కు ఇవ్వాలని ఇటలీ పార్లమెంట్ కు మెమొరాండం సమర్పించిన ధీశాలి మోజోన్ని .1878లో పారిస్ లో ’మహిళాహక్కులకోసంజరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్ కు ఇటలీదేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .

ప్రముఖ ఆంగ్ల రచయిత జాన్ స్టువార్ట్ మిల్ రాసిన ‘’ది సబ్జేక్షన్ ఆఫ్ వుమెన్ ‘’ పుస్తకాన్ని ఇటలీ భాషలోకి అనువదించి 1879 లో ప్రచురించింది .1881 లో మేధావులు రాడికల్స్ ,రిపబ్లికన్లు సోషలిస్ట్ లు అందరు కలిసి మహోద్రుతంగా నిర్వహించిన ‘’అందరికి సమాన వోటు హక్కు ‘’ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి స్పూర్తినిచ్చింది .అందులో మహిళా వోటు హక్కును కూడా చేర్చి నినదించింది .1881 లో స్త్రీల సాధికారత కోసం ‘’లీగ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దిఇంట రెస్ట్ ఆఫ్ వుమెన్ ‘ సంస్థనుమిలన్ లో  స్థాపించింది . 83 ఏళ్ళు జీవించి ఆననా మేరియా మోజోన్ని 1920లో చనిపోయింది


 
\
 
 
 


 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

శాస్త్రి గారి చారిత్రిక రచన

బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని  సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు  పెట్టించి  శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర ‘’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు .ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన ,పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది .అలాగే  ‘’మాధవ విద్యారన్యులవారు’’,’’శిస్టు కృష్ణ మూర్తి కవి ‘’,’’చేమకూర వెంకట కవి ‘’,’’కృష్ణ దేవరాయలు ‘’’’సంకుసాల నృసింహ కవి ‘’,’’నారాయణ భట్టు ‘’,సారంగ తమ్మకవి ‘’,’’భీమకవి ‘’,’’పిల్లల మర్రి పిన వీరభద్రుడు ‘’,’’నాచన సోముడు ‘’మొదలైన ఘన చారిత్రలు రాసిన మహా పరిశోధక సార్వ భౌములు శాస్త్రిగారు .

శాస్త్రిగారి లలిత కళా విహారం

శాస్త్రిగారు గొప్ప  లలిత కళోపాసకులు .లలితకలలపైన కూడా గ్రంధాలు రాశారు .’’వేశ్యా నృత్తగానములు ‘’గురించి 72 పేజీల గ్రంధాన్ని రాశారు .’’కవిత్వము -చిత్రలేఖనం’’ అనే వ్యాసం లో ఈ  రెండిటికి  ఉన్న పరస్పర సంబంధాన్ని బాగా చిత్రించారు .శాస్త్రిగారికి చిత్ర రచనలోనూ మహా ప్రావీణ్యం ఉంది .తమ వ్యాసాలలో రాసిన భావాల ననుసరించి మోడల్ చిత్రాలను గీసి చూపించారు .

సండే స్టాండర్డ్ లో శాస్త్రి గారి పై కితాబు వ్యాసం

శాస్త్రిగారి మత సంబంధ రచనలను గురించి ముందే ముచ్చటి౦చు కొన్నాం .ఉద్యోగం చేసినకాలం లో శాస్త్రిగారిని గూర్చిపాశ్చాత్యుల  చే  నడుప బడుతున్న  ‘’రవి పత్రిక ‘’ఇలా రాసింది –‘’బ్రహ్మయ్య శాస్త్రిగారు రవి పత్రికకు లేఖకులుగా పని చేశారు .ఎన్నో మంచి విషయాలను చక్కని శైలిలో వ్రాసేవారు .శాస్త్రిగారు  కలెక్టర్ ఆఫీస్ లో   అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో లేఖకులుగా ఉన్నారు .ఇప్పుడు శాస్త్రిగారిని కొవ్వూరు తాలూకాకు బదిలీ చేశారని విని చాలా విచారిస్తున్నాం .వీరి మత భావాలతో మేము ఏకీభ వించక పోయినప్పటికీ ,విద్యార్ధుల హృదయాలలో దేవుడున్నాడని ,సన్మార్గం లో నడవటం పరమ ధర్మమని శాస్త్రిగారు ఎప్పుడూ బోధిస్తారని మాకు తెలిసి మిక్కిలి సంతోషించాం .ఉపన్యాసం లో వీరు చెప్పే విషయాలు మృదు మధురంగా ,ఆహ్లాదకరం గా ఉంటాయని విద్యార్ధుల వలన ,ఉపాధ్యాయులవలన మేము విని తెలుసుకొన్నాం .శాస్త్రిగారికి విశ్రాంతి దొరికనప్పుడేల్లా తెలుగు భాష విషయం లో నే కృషి చేస్తారని ,ఇలాంటి ఉత్తముల సాంగత్యం కాకినాడ  పట్టణానికి ఇక నుండి లభ్యం కాదని ,వీరి నాయకత్వం విద్యార్ధులకు ఇక దొరకటం దుర్లభమైపోతోందని బాధ పడుతున్నాం .శాస్త్రిగారిని బదిలీకాకుండా ఇక్కడే ఉంచే కార్యక్రమాన్ని భాషాభిమానులందరూ కలిసి ఆలోచించి ఫలితం సాధించాలి ‘’అని రాసింది .ఈ వ్యాసం గొప్ప ప్రభావం కలిగించి శాస్త్రిగారి ట్రాన్స్ ఫర్ ఆగి పోయేట్లు చేసింది .

గ్రంధ రూపం లోకి  రాని  శాస్త్రిగారి విపుల  సారస్వత రచనలు

శాస్త్రిగారు రాసిన అనంత సాహిత్యం లో చాలాభాగం గ్రంధ రూపాలను  సంత రించు కోలేక పోయింది .గుడ్డిలో మెల్లగా శ్రీ నందిరాజు చలపతి రావు పంతులుగారు మతపర వ్యాసాలను సేకరించి ‘’ఉపన్యాస పయోనిధి ‘’పేరుతొ అయిదు సంపుటాలు గా ముద్రించి మహోపకారం చేశారు .ఇంకా వారి రచనలు గ్రంధ రూపాలలోకి వస్తే ఇరవై గ్రంధాలు అవుతాయి .శాస్త్రిగారు రాసిన పత్రికా వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకం గా ముద్రి౦ప బడ్డాయి .ఇదివరకే ముద్రింపబడిన శాస్త్రి గారి గ్రంధాలు ఇప్పుడు అలభ్యాలు .ఉదారులు ,వదాన్యులు పూనుకొని శాస్త్రిగారి అమూల్య సారస్వతాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి .

ఉపన్యాస కేసరి

శాస్త్రిగారి రచనలు ప్రచురించని పత్రిక ఆనాడు లేనేలేదు .అలాగే వారి ఉపన్యాసం వినని పట్టణం కూడా లేనేలేదు .శాస్త్రిగారు అమోఘ మైన మహా వక్తలు . గంగా ప్రవాహం గా వారి ఉపన్యాస ధోరణి సాగుతుంది .ఎక్కడా తొణకటం, బెణకటం ఉండదు .సభలో వ్యతిరేకులు ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా అల్లరి చేస్తున్నా తమ ప్రసంగాన్ని కొనసాగించి విజయ దుందుభి మ్రోగించేవారు .మాధుర్యమైన పద ప్రయోగం శాస్త్రిగారి ప్రత్యేకత .రచనలో గ్రాంధికమే వాడారు .వందలాది సభలలో ప్రసంగించారు. ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు .ఆంద్ర దేశం లో బరంపురం లో ‘’ఆంద్ర సారస్వత సభ’’ ,గుంటూరులో నిర్వహించిన ‘’నిఖిలాంధ్ర దేశ వర్ణాశ్రమ ధర్మ మహా సభ ‘’లలో శాస్త్రిగారే అధ్యక్షత వహించారు .ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి .

ఆ బాల వృద్ధులకు ఆరాధనీయులు

బాలురనుండి వృద్దులవరకు ,పామరుల నుండి పండితులవరకు శాస్త్రిగారంటే అపార గౌరవం .వారికీ అందరి యెడల అపూర్వ అభిమానం. వారి వదనం లో శాంతం ఎప్పుడూ తొణికిస లాడుతూ ఉండేది .మాటలలో మర్యాద స్పష్టంగా కనిపించేది .టీ ,కాఫీ, ముక్కుపోడుం  చుట్ట  మొదలైన అలవాట్లు శాస్త్రిగారికి లేనే లేవు .న్యాయం అని భావిస్తే ఎవరెదురోచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు .హిందూమత భావ వ్యాప్తికి అంకితమై శాస్త్రిగారు పని చేశారు .దీనికోసం ప్రొమోషన్ వచ్చే పరీక్షలు రాయకుండా వదిలేశారు .శ్రద్ధ పట్టి రాస్తే శాస్త్రిగారు తాసిల్దారు అయ్యేవారు .సంవత్సరానికి ఉద్యోగ వేతనం కాని ,భూములపై వచ్చే ఆదాయం కాని సుమారు ౩౦౦ రూపాయలు మాత్రమె వచ్చేవి .ఇలాంటిపరిస్తితిలో కూడా స్వంత ఖర్చు తోనే పుస్తకాలు ,కరపత్రాలు ముద్రిస్తూ ,ఉపన్యాసాలకోసం దేశాటనం  చేసేవారు .దీనిని బట్టి శాస్త్రిగారి త్యాగనిరతి  ఎంత  ఉత్కృష్ట మైనదో తెలుస్తుంది.

బిరుదులూ సత్కారాలు

శాస్త్రిగారికి ఏలూరు ,సామర్ల కోట ,నెల్లూరు ,కడప ,కూరాడ ,కిర్లంపూడి పట్టణాలలో ఘన సన్మానాలు నిర్వహించి సత్కరించారు .విజయ నగరం లోని ‘’ఆంద్ర సారస్వత సభ ‘’శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదునిచ్చి సన్మానించింది .ఏలూరు ‘’విద్వద్వర విద్వాద్త్ప్రభు ‘’సంస్థ ‘’మహోపాధ్యాయ ‘’బిరుదమునిచ్చి ఘనంగా సత్కరించింది .నెల్లూరు ‘’విద్వజ్జన మహాసభ ‘’ఉపన్యాసక  పంచానన’’ బిరుదుతో గౌరవ సత్కారాలు అందజేసింది .కొవ్వూరు’’ ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం ‘’’’ఆర్య మతోద్ధారక ‘’బిరుదం ఇచ్చి సత్కారం చేసింది .

ఒక్కసారి శాస్త్రిగారి వ్యాస పరంపర ను దర్శిద్దాం –

1-     సంఘ సంస్కార విషయ౦  పై రాసినవి -24 –ఇందులో సస్కరణలు –సంస్కర్తలు ,వెంకటరత్నం నాయుడుగారి వివాహ బంధం ,దమయంతీ ద్వితీయ స్వయంవరం స్త్రీ పునర్వివాహానికి అనుకూలమేనా ?కాకారాతి –ప్రత్యుత్తరం ,అలీక దేశాభిమానం ,కృష్ణా పత్రిక –వింత మూర్ఖత ,మొదలైనవి

2-     ఆధ్యాత్మిక వ్యాసాలూ -17 –వీటిలో –బ్రహ్మజ్ఞానం ,వేదాంత పునరుజ్జీవనం ,జపాను దేశము –వేదాంతము ,ఏకేశ్వర వాదము,బాలుర వేదాంతము ,మొదలైనవి .

3-     మత ధర్మ విషయ వ్యాసాలూ -43 –ఇందులో –ఆర్య మతము ,జన్నిదము గూర్చి ,యజ్ఞోపవీత రహస్యము ,శ్రీ కృష్ణ మూర్తి ,దీపావళి ,పునర్జన్మము –వీరేశ  లింగం గారు ,ఇండియా దేశపు స్త్రీలు  –  వివాహ ధర్మమూ ,హిందూమతమననేమి మొదలైనవి

4-     సాహిత్య వ్యాసాలూ -62- వీటిలో –కుచావరజ్ఞానము  –కలికాల నీతి బోధకుడు ,పురాతనాంధ్ర పత్రికలూ ,పాత్రౌచిత్య విచారము ,రామ మోహన రాయలు విగ్రహా రాధకులు కారా ?నన్నయ క్షత్రియుడా ? త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా తెలుగు నుండి త్రిలింగము పుట్టినదా ?మానవల్లి వారి మోసపు రాతలు , గ్రామ్యం గ్రాన్దికభాష గా ఉండ దగునా?భాషా సాంకర్యం ,ఆంద్ర దేశ పత్రికలూ మొదాలైనవి

5-     కవిత్వ విషయ వ్యాసాలు  -16 –ఇందులో –ఛందో విశేషాలు ,కలికాల కవిత ,చిత్ర కవిత్వం ,బంధ కవిత్వం ,భారతీ స్తవ గీతాలు గడ్డిపరక ,మొదలనవి

6-     ప్రక్రుతి శాస్త్ర వ్యాసాలూ -11- వీటిలోజ్యోతిస్శాస్త్రము  గూర్చి ,పంచ భూతములు ,ప్రమాణ విచారము ,భూమి యొక్క ఆకర్షణ శక్తి ,భూమి తిరుగు చున్నదా సూర్యుడు తిరుగు చున్నాడా ?పండిత శివనాద శాస్త్రిగారు భ్రమర కీటక న్యాయము ,జగము సృజింప బదడినదా? మొదలైనవి

కొమ్ములు తిరిగిన పండితులనే ఆశ్చర్య చకితులను చేసిన శాస్త్రిగారు

భాషా సాదృశ్య శాస్త్రం లో ,సంస్కృతాంధ్ర వ్యాకరణాలలో ,తత్వ శాస్త్రం లో ,దేశ చరిత్రలలో ,శ్రౌతంలో ఉద్ద్దండులై కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు అని పించుకొన్న పండితులకే ఆశ్చర్యం కలిగించే అనేక అమూల్య విషయాలు తవ్వి తీసి బహిర్గతం చేశారు శాస్త్రిగారు .వారి  ధిషణ అంతటిది ..మౌలిక గ్రందాలనేకం శాస్త్రి గారు రాశారు .

77 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపిన విమర్శకాగ్రేసర శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు 1940లో పరమపదించి ఆంధ్ర సాహితీలోకం లో శూన్యం మిగిల్చారు .శాస్త్రి గారు జీవితకాలం అంతా కాకినాడ జగన్నాధ పురం లోనే గడపటం మరో గొప్ప విషయం .

ఇంతటి మహనీయుని గురించి నేను చదివినది ,తెలుసుకొన్నది మీకు అందజేసి ధన్యడనయ్యాననే సంతృప్తి నాకు కలిగింది .ఇంకా ఏమైనా విశేషాలు దొరుకుతాయేమో నని తెలుగు విజ్ఞాన సర్వస్వం లోకి తొంగి చూశాను .అందులో శాస్త్రిగారిపై వ్యాసం రాసినవారు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారని తెలుసుకొన్నాను .నేను ఇప్పటిదాకా రాసిన విషయాలే ఇందులోనూ సంక్షిప్తంగా ఉన్నాయి .అదే ధోరణిలో కూడా ఉన్నాయి. కనుక మా నాన్న గారు సంతరించి పెట్టుకొన్న 75 ఏళ్ళనాటి చిన్న గ్రంధం ‘’విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి జీవిత చరిత్రము ‘’రచయిత శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారే అనే నిర్ణయానికి వచ్చాను .

సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆశ్యాత్మిక -హింస రాజ్య హింస – కంచ ఐలయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సేల్ఫీ లో చూసి మురిసిపోయే మోడీ అభివ్రుద్ధి

Inline image 1

Inline image 1

 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్

భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్

ఎండ వేడి భరిస్తున్నవాళ్ళ గుండె వేడి చల్లార్చటానికి  ఈ చిరు హాసపు జల్లులు –

1-ఫోన్ సంభాషణ

వదినా ఎలాఉన్నారు ?

‘’మాడి మసి అవుతున్నాం వదినా

మీ మామగారు బాగా ముసలివారు కదా ఏయే జాగ్రత్తలు తీసుకొంటున్నారు ?

మా మామగారిది మరీ చోద్యం వదినా –ఎండలో తిరగద్దని రేడియో టి వి వాళ్ళు వాయించి పారేస్తున్నారుగా .అది విని ఒకే ఇదై పోతున్నారు .మా అపార్ట్ మెంట్ లో బాత్ రూమ్ ఒకటే చల్లగా ఉంటుంది .ఆయన అక్కడే తిష్ట వేశారు .నేలమీద జ౦పఖానా  పరచుకొని ,ఒక దిండు పెట్టుకొని అక్కడే పడక సీను .టిఫిను భోజనం అన్నీ అక్కడికి పంపిస్తేనే తింటున్నారు .అది దాటి బయటికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంత కంగారు పడి మమ్మల్ని పడేస్తున్నారు .వేరే బాత్ రూమ్ ఉన్దికాబట్టి సరి పోయింది లేకపోతే మా గతి కుక్కలగతే వదినా.

అయినా మీ ముసలాయనకి అంత చాదస్తం  ఏమిటి   ?బతికి ఇంకేం ఉద్ధరిస్తాడుకనుక

ఆ మాట ఆనకు వదినా మాకు పెద్ద దిక్కు ఆయనే ఆయన ఇష్ట ప్రకారమే మీ అన్నయ్య నడుచుకొంటారు. తండ్రిమీద ఈగ వాలనీయరు .

ఈగంటే జ్ఞాపకం వచ్చింది –బాత్ రూమ్ లో ఈగా దోమా ఆయన్ని ఏమీ కుట్టటం లేదా ?

ఫినాయిలు ,డెట్టాల్  సీసాలకు సీసాలు కుమ్మరిస్తున్నా౦.అవి చచ్చి నా బతకలేవు .సరే వదినా మళ్ళీ మాట్లాడుకొందాం మామగారికి బాత్ రూమ్ లో అన్నం పెట్టె టైం అయింది .

2-అమ్మా ! అమ్మమ్మ ఈ ఎండల్లో ఎలా ఉందే అసలే గుంటూరు ఎండలు మిర్చి ఘాటుకంటే ఘోరం .ఒక కూతురు ఫోన్ లో తల్లితో

నిజమేనే తల్లీ .ఎండలు కావివి బండలు పగల గొట్టే గునపాలు గా ఉన్నాయి సూర్య కిరణాలు .మీ అమ్మమ్మ కేమీ భయం లేదే .జాగ్రత్తలు తీసుకొంటున్నాం .వంటింట్లో పడక కుర్చీలో కోర్చోబెట్టి పంపుకు ట్యూబు తగిలించి అరగంటకోసారి ఆవిడను తడుపుతున్నాం .హాయిగా చల్లగా ఉందని తెగ మురిసి పోతోంది మా అమ్మ .

అమ్మా ! అలా చేస్తే న్యుమోనియా వచ్చి టపాకడుతున్దేమోనే !

తల్లీ ! ఆ మాట ముందే చెప్పాం. మొండిఘటం వింటేగా .వింటే మా నాన్న ముందే ఎందుకు పోయే వాడులే.వాళ్ళ అమ్మకు అలా చేశారట. ఆవిడ నిక్షేపంగా ఉందిట. వేసవిలో తనకూ అలానే చేయాలని పురమాయింపు .తప్పుతుందా తడపక చస్తామా .గంటో అరగంతో వచ్చే కుళాయి నీళ్ళు ఆవిడను తడపతానికే సరిపోతున్నాయి  .

మరి మీరందరూ ఏం చేస్తున్నారే -? కూతురి ఫోన్ ప్రశ్న

అమ్మా ! గుంటూరు కదా తాడి లోతు బావి మనకు ఉందిగా .దానిలో అడుగున ఎక్కడో నీళ్ళు ఏడిశాయి .వెయ్యి రూపాయలిచ్చి నీటికి గజం పైన పక్కాగా కర్రలతో మంచే కట్టించాం . గిలకకి గట్టి మోకు కట్టి ఒక్కొక్కరం నూతి పైనుంచి లోపలి మంచే పైకి చేరుకొంటున్నాం .కింద జలం ఉందిగా మహా చల్లగా ఉందిలే .హిమాలయాలలో ఉన్న అనుభూతి కలుగుతోంది తల్లీ  . ఇక్కడే చిన్న టి .వి .లాప్ టాప్ ఏర్పాటు చేసుకొన్నారు నాన్నా అన్నయ్యా .ఇక కాలక్షేపానికి కొదవ లేదు. బయట ఎండలు మమ్మల్నేమీ చేయలేవు .’’ఎండలు జయించిన వీరులం ‘’మేము. అమ్మమ్మకోసం మాత్రం  ఎవరొ ఒకరం పైకెళ్ళి చూసి తడిపి వస్తాం .ఇక ఉంటానమ్మా అమ్మను తడపాలి పైకి వెడుతున్నా .

అమ్మా ! ఇప్పటిదాకానూతిమీద మంచే మీంచే మాట్లాడావా ?

అవును చిన్నీ

3-పక్కింటి వాళ్ళ సంభాషణ –

అక్కా !ఇవాళ వంట ఏం చేశావ్ ?

చెల్లీ ! ఏడింటికే  బియ్యం ఎసట్లో పోసి ఎండలో పెట్టాను .పదినిమిషాల్లో ఉడికి పోయింది లోపలి తెచ్చిపెట్టా .నువ్వేం చేశావ్ ?

చికెన్ ను అట్లకాడకు గుచ్చి ఎండలో పెడితే అయిదునిమషాలలోఉడికి ‘’చికేన్’’ సన్ ‘’దూరీ ‘’ తయారైపోయింది  పిల్లలు  తెగ ముచ్చట పడి  పీక్కు తిన్నారు .టిఫిన్ ఏం చేశావ్ ?

వాకిట్లో నాపరాయి మీద అట్లు వేశాను .పది అట్లు పది నిమిషాల లోపలే ఉడికి మహా రుచిగా ఉన్నాయి

నీ లౌక్యం అందరికీ రాదక్కా కోళ్ళు  గుడ్లు పెడుతున్నాయా?

అవిపెతట్టటమేకాదు ఎండలో అయిదు నిమిషాలు ఉంచితే పిల్లలు ఎండకు భయపడి గుడ్డు చీల్చుకొని బిలబిల మంటూ బయటికి వస్తున్నాయి .కోడి ,పొదగటం అనేది ఇక లేనే లేదు .బట్టలు ఎలా ఉతుకు తున్నావ్ ?

వాషింగ్ మెషీన్ బయటే పెట్టాం .నీళ్ళు పోసి  సబ్బు పొడి వేస్తె పదే పదినిమిషాలలో పూర్వం చాకలి వాళ్ళు బానల్లో బట్టలు ఉడకేసినట్లు ఉడికి భలే తెల్లగా ఉంటున్నాయి .కరెంటు ఆదా కూడా .

4-ఏరా యెట్లా ఉన్నారు భాగ్యనగర్ లో ?కోస్తా ఆంధ్ర అన్న తెలంగాణలో ఉన్న తమ్ముడిని పరామర్శించాడు ఫోన్ లో

ఎందుకొచ్చిన రాష్ట్రం రాబాబూ అని ఆలో లక్ష్మణా అని ఏడుస్తున్నాం అన్నయ్యా .కరెంటు లేదు గులాబీ ఆయన మాటల తూటాలు తప్ప .నీళ్ళు లేనే లేవు ఆయన వాక్ ప్రవాహం తప్ప .వీధులు ఊడుస్తున్న పోజులేకాని ఊడ్చిన పారిశుధ్య  పని వారు లేనేలేరు .వేడికి ఎండకూ మాడిపోతున్నాం  పెనం లోంచి పొయ్యిలో పడినట్లు ఉన్దిమా పని .ఉక్క బిక్కు బిక్కు మంటూ జీవితం .పగవాడిక్కూడా వద్దురా ఈ నగర జీవితం .ఏడాదిలో పదేళ్ళు వెనక్కి పోయామేమో ననిపిస్తోంది .శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలూను .అనుకోకుండా వర్షం వస్తే ముల్లోటు నీళ్ళల్లో నాని పోతున్నాం .మీరెలా ఉన్నారు అన్నయ్యా?

ఒరే తమ్ముడూ ! మంచికో చెడుకో విడిపోయాం కాని మా చంద్రబాబు ను జనం తలచుకోని క్షణం లేదంటే నమ్ము .ఒక్క క్షణం కూడా కరెంటు కోత లేదు . ఎండలు మండుతున్నా హాయిగా ఇళ్ళల్లో ఫాన్లు ఏ. సి.లు కూలర్లు పెట్టుకొని కంటి నిండా నిద్ర పోతున్నాం .వేసవిలో అందులోనూ ఇంత భగభగల భాను ప్రతాపం లోనూ మాకు అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. మహానుభావుడు నిరంతరం విద్యుత్తూ ఇస్తూ మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు చంద్రన్న చంద్రునిలా చల్లగా .ఆయన ఋణం ఏమిచ్చినా తీరదురా .మాకు మళ్ళీ మళ్ళీ బాబే ముఖ్యమంత్రిగా ఉండాలి . సరేరా మీ ఏడుపు మీరేడవండి కావాలని తెచ్చుకోన్నారుగా నెత్తిమీడికి గులాబిముళ్ళ  కుంపటి.అనుభ వించండి మరి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శన సాహిత్యం

కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి  ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను  రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని శాస్త్రిగారికి కృతజ్ఞత చెప్పటానికి ఆభిజాత్యం అడ్డం వచ్చి ఉంటుంది .1911లో ‘’నన్నయ భట్టారక చరిత్రము ‘’రాసి ప్రచురించారు ఇందులో శాస్త్రిగారు చెప్పిన విషయాలే నేటికీ పరమ ప్రామాణీయ కంగా ఉన్నాయని అంటారు. ‘’మను చరిత్ర’’ ,’’వసు చరిత్ర’’ల పై అనేక విశేషాలతో వ్యాసాలూ రాశారు మను చరిత్రకంటే వసు చరిత్ర ప్రశాస్తమైనదని శాస్త్రి గారి అభిప్రాయం .మరో గొప్పరచన ‘’కురుపాండవ దాయభాగ నిర్ణయము ‘’ఇందులో కౌరవ రాజ్యం ద్రుతరాష్త్రుడిదేకాని పాండురాజుది కాదు అని నిష్కర్ష గా తేల్చారు శాస్త్రిగారు .ఈ వాదం లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు మొదలైన ఉద్దండులు శాస్త్రిగారికి వ్యతిరేక పక్షం గా మొహరించారు .పాండవులు న్యాయస్తులని  కౌరవులు  అన్యాయం చేస్తున్నారని హిందువులలో గొప్ప నమ్మకం ఉంది .ఈ అభిప్రాయాన్ని శాస్త్రి గారు అనేక సభల్లో ఉపన్యాసాలలో నొక్కి చెప్పేవారు .పూర్వపు వారి అభిప్రాయాలన్నీ సరైనవికావు అన్నిటినీ గుడ్డిగా నమ్మరాదు అని శాస్త్రిగారి భావం .’’ఆంద్ర కవితాగురు కవిత్వాది ప్రశంశ ‘’,అప్పకవి ‘-పోతనామాత్యులు ‘’,ఉత్తర రామ చరిత్ర యందలి రస విచారము ‘’మొదలైన సారస్వత విమర్శలను ఎన్నిటినో శాస్త్రి గారు రాశారు .మహామహోపాధ్యాయ బిరుదు పొందిన శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు సంస్కృత భాష ఒకప్పుడు లోక వ్యవహారం లో ఉన్న సామాన్య భాషగా ఉండేదని ఒక వ్యాసం రాశారు .బ్రహ్మయ్య శాస్త్రి గారు అతి నైపుణ్యం తో సంస్కృతం ఎప్పుడూ లోక వ్యవహార భాషగా లేదని ,అదెప్పుడు పండితుల భాషగా మాత్రమె ఉండేదని అందుకే దానికి ‘’గీర్వాణ భాష’’ ,’’విబుధ భాష’’ మొదలైన పేర్లు వచ్చాయని సప్రమాణం గా రుజువు చేశారు .శాస్త్రి గారి లోతైన ఆ పరిశీలనకు అందరూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయారు .

భాషా శాస్త్ర రచనా పాటవం

బ్రహ్మయ్య శాస్త్రిగారు భాషా శాస్త్ర విషయానికి సంబంధించిన రచనలు చాలా చేశారు ‘’కాగడా ‘’అనే చిన్న పుస్తకం లో కాగడా శబ్ద చరిత్రను అంతా సేకరించి వివరించారు .’’అరవము లోని వింత అక్కరము తెలుగునా గలదా ?’’అనే శీర్షిక తో శాస్త్రి గారు రాసిన వ్యాసపరంపర అతి ఉత్కృష్ట మైనవిగా పరిగణిస్తారు .’’దాస శబ్దార్ధ చంద్రిక ‘’మొదలైన వ్యాసాలూ శాస్త్రిగారి భాషా స్వరూప ఆలోచనలకు ప్రమాణాలు .శాస్త్రి గారికి భాషలో నాగరికులం అనుకొనేవారు తెచ్చే వ్యావహారికమార్పులు నచ్చేవికావు . అవి భాషాభివృద్ధికి హానికరాలు అని భావించి దానిని రుజువు చేయటానికి చాలా గ్రంధాలు రాశారు .చాలా చోట్ల మహోపన్యాసాలిచ్చారు .ఆనాటి వ్యావహారిక భాషా వాదులు శాస్త్రి గారి వాదాన్ని కాదన లేక గమనిస్తూ ఉండేవారు శ్రద్ధతో .అప్పుడప్పుడు శాస్త్రిగారు తమవాదపు తీవ్రతను తగ్గించుకొని సవరించుకోవటమూ జరిగింది .

విమర్శక విరించి

ఆంద్ర భాషలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసినంత విమర్శనా వాజ్మయం మరొకరు రాయ లేదనటం నిర్వివాదా౦శమే .తెలుగులో విమర్శకు బీజం నాటింది బ్రహ్మయ్య శాస్త్రిగారే అని చాలామంది అభిప్రాయం .కాదన్న వారూకొందరు  ఉన్నారు .దీనిపై వాదం జోలికి పోకుండా విమర్శ ప్రారంభించిన తొలి రచయితలలో శాస్త్రిగారున్నారు అంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు .శాస్త్రిగారి విమర్శ అన్నిటికంటే అగ్రేసరం అని బహుజనాభిప్రాయం. అందుకే శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర ‘’బిరుదు లభించింది .ఇది బ్రహ్మయ్య శాస్త్రి గారికి పర్యాయ పదం అయిపొయింది. దేశం లో .సమగ్ర విమర్శకు ఆద్యులు శాస్త్రిగారు. ప్రతి వాదులు లేవ నెత్తిన నెత్తిన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని రాచి రంపాన బెట్టి నిగ్గు తేల్చటం శాస్త్రి గారి అసమాన ప్రజ్ఞ .ఒకే అంశాన్ని స్థాపించటానికి అనేక ఉదాహరణలు ఇవ్వటం యుక్తిగా వాదించి గెలవటం శాస్త్రి గారి బహు నేర్పు .ప్రతి వాది’’ఓడిపోయాను మహా ప్రభో !నన్ను క్షమించి వదిలేయండి బాబో !’’అని కాళ్ళా వేళ్ళా పడి బతిమాలినా అదేపనిగా వాడిని’’ బాది పారేయటం’’ శాస్త్రిగారి విమర్శలో పెద్ద లోపం అని అంటారు .అనవసరంగా తన విమర్శనా కౌశలాన్ని ప్రదర్శించే వారుకాదు .సానుభూతితోనే ఉండేవారని శాస్త్రి గారి రచనలు చదివిన వారికి తెలుస్తుంది .’’వినాశకర విమర్శకుడు ‘’అని కూడా శాస్త్రిగారికి బిరుదు తగిలించారుకొందరు .ఇది సత్యదూరం .శాస్త్రిగారి విమర్శలో వినాశనం తో బాటు నిర్మాణం కూడా ఉందని ,విమర్శక అంశం యొక్క సత్య స్వరూపాన్ని పాఠకులకు తెలియ జేయటమే పరమావధిగా ఎంచుకొన్నారని ,మత ,సాహిత్య విషయాలలో అంతవరకూ ఎవరూ చెప్పని అనేక కొత్త విషయాలను శాస్త్రిగారు తెలియ జేశారని ,విమర్శించటమే పనిగా ఎన్నడూ ఉండలేడని బహు శాస్త్ర పారంగతులైన నిష్పాక్షిక పండితులు శాస్త్రిగారి నైపుణ్యానికి జోహారు లర్పించారు .ప్రతివాదులను ఒక నెపం గా పెట్టుకొని లోకానికి తెలియని అమూల్య విషయాలను వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలనుండి  వెలికి తీసి అంద జేసిన మహా విద్వాంసులు శాస్త్రిగారు .ఆ అంశాలను ఆంధ్రలోకం కళ్ళకు అద్దుకొని మనసుకు హత్తుకోన్నది .మన మత తత్వం లోని ఉత్క్రుస్టతను తెలుసుకొని ముచ్చటపడింది .అన్య మతాల వాదాలను తిరస్కరించే నేర్పు సామాన్య జనులకు కల్గించారు శాస్త్రిగారు .

సారస్వత శాఖా స్వతంత్ర గ్రంధాలు

సాహిత్య శాఖలన్నిటి లోను బ్రహ్మయ్య శాస్త్రిగారు స్వతంత్ర గ్రంధాలు రాశారు .’’మంగతాయి ‘’,’’సైంధవ వధ ‘’,ఉత్తర సరస్వతీ నారద విలాపము ‘’,’’వీర రాఘవము ‘’,అనే నాటకాలు రాశారు .’’వెదురుపాక జనార్దన శతకం ‘’,’’ప్రశ్నోత్తర పద్యాలు ‘’,’’చిత్ర పద్యావళి ‘’,’’కోకిల గీతము ‘’,’’భారతీ స్తుతి గీతములు ‘’,’’గడ్డిపరక ‘’,అభినవ కవితా ప్రశంస ‘’ఆంద్ర కవితా వాజ్మయ ఆస్థానం ‘’అనే ఖండ కావ్యాలు రాశారు . ‘’రావణచరిత్ర ‘’,అనేచక్కని చిక్కని  వచనకావ్యాన్ని రాశారు .అనేక రామాయణాల నుండి విషయ సేకరణ చేసి రాసిన గ్రంధం ఇది .కాకినాడలో  ‘’రావణ వర్ధంతి ‘’ ని  నిర్వహించారు .అందుకోసమే ఈ రావణ చరిత్ర రాశారు .ఇది అచ్చుకాకుండా చేయటానికి శాస్త్రిగారి ప్రతికక్షులు విశ్వ ప్రయత్నం చేశారు .అయినా శాస్త్రిగారు దీన్ని ముద్రించి తన మనో నిబ్బరాన్ని లోకానికి మరో సారూ రుజువు చేసి చూపించారు . సుభద్రా విజయము ‘’అనే ద్వ్యర్ధి కావ్యం రాసి తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించారు .

అనేక గద్య కావ్యాలురాశారు .’’మనుష్యావయవ సంఘ సంస్కార సభ ‘’,మనము మోములకు (ముఖాలకు )వెల్ల వేసు కొందుముగాక ‘’అప్పుడు –ఇప్పుడు ,రూపాయ దండకం ‘’,ముద్దులు –ముచ్చటలు’’ ,మరికొన్ని హాస్య గ్రంధాలు రాశారు .విగ్రహారాధన గురించి ‘’సీతా లక్ష్మణ సంవాదం ‘’శారదా శాసనం పై ‘’రామ కృష్ణ సంవాదము ‘’,గ్రాంధిక వ్యావహారిక భాషా వివాదంపై ‘’గో మహిష సంవాదము ‘’,తారక తారావళి ,’’నిర్గద్య నిరోస్త్య నిష్కంఠయ(thya) జీర్ణ చేల చరిత్ర ‘’,విచారలహరి ‘’,నావిబుధ లోక సందర్శనము ‘’,మొదలైన పద్యకావ్యాలు రచించారు .సీతాకల్యాణం అనే హరికధ రాశారు దీపావళీ వర్ణనము ,మద్య పాన నిషేధము ,త్రొక్కుడు బండి ,సీసమాలికలు మొదలైనవి శాస్త్రి గారి అనేక రచనలలో కొన్ని మాత్రమె .’’విక్టోరియా విలాసం ‘’అనే ద్విపద కావ్యంమృదు మధురంగా   రాశారు .ఇందులో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యతను వివరించారు .స్త్రీ విద్య అవసరం అని చెప్పే సంస్కార వంతులు శాస్త్రిగారు .మహిళలకోసం చాలా తేలిక భాషలో అనేక వ్యాసాలూ రాశారు .ఈ వ్యాసాలు ఆనాడు ప్రసిద్ధమైన పత్రిక ‘’హిందూ సుందరి ‘’లో ధారావాహికం గా ప్రచురింప బడేవి .

పత్రికలలో చచ్చి బతికిన శాస్త్రేజీ

శాస్త్రిగారు రాసిన ‘’నా విబుధ లోక సందర్శనము ‘పద్యకావ్యం ‘’ఆంద్ర సాహిత్య పరిషత్ పత్రిక ‘’లో ప్రచురితమైనది .ఈ కావ్యం రాయటానికి కారణం కూడా తమాషాగా ఉంది .’’బ్రహ్మయ్య శాస్త్రి గారు మరణించారు’’ అనే వార్తా ఒకటి పొరబాటున పత్రికలో వచ్చింది .1930 సెప్టెంబర్ లో రాజమండ్రి కి చెందినా కాశీభట్ట లింగ మూర్తి శాస్త్రి గారు అనే ఆయన చనిపోతే హిందూ పత్రిక విలేకరి దాన్ని బ్రహ్మయ్య శాస్త్రిగారికి లంకె పెట్టి బ్రహ్మయ్య శాస్త్రిగారు పరలోక గతులయ్యారని వార్త పంపాడు .దీన్ని చూసి ఆంధ్రపత్రిక కూడా వంత పాడింది .ఇంకాస్త ముందుకు వెళ్ళిన ఆంద్ర పత్రిక బ్రహ్మయ్య శాస్త్రిగారి మరణానికి సంతాపం ప్రకటించి ఆయన సాహిత్య సేవను బహువిధాల సంపాదకీయం లో ప్రస్తుతించింది .ఈ వార్త చదివిన ఆంద్ర దేశం లోని  సాహిత్యాభిమానులు  హిందూమతాభిమానులు   విచారం వెలి బుచ్చుతూ వారి కుటుంబానికి సాను భూతి తెలుపుతూ సభలు జరుపుతూ  లేఖలు కూడా రాసేశారు . వీటిని  పట్టించుకోకుండా శాస్త్రిగారు తమ సాహితీ కృషిని కోన సాగిస్తూనే ఉన్నారు .పత్రికలకు వ్యాసాలూ రాస్తూనే ఉన్నారు అవి అచ్చు అవుతూనే ఉన్నాయి .శాస్త్రిగారు  అఖండ  ఆంద్ర జన సోదరుల సౌహార్దం చేత, భగవత్క్రుప చేత తాను సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూనే ఉన్నానని ఆంద్ర పత్రికా సంపాదకునికి లేఖ రాశారు .అప్పుడు నాలుక కరచుకొన్న ఆ పత్రిక అసత్య వార్తను నమ్మి తాము శాస్త్రిగారి విషయం లో పొరబాటు చేశామని  దీనికి చాల చింతిస్తున్నామని శాస్త్రిగారు సంపూర్ణా రోగ్యం తో ఉన్నందుకు అభినందనలూ తెలిపి బహిరంగ క్షమాపణ కోరింది .ఇదంతా చూడటానికి ,వినటానికి తమాషాగా చిత్రంగా  ఉందని పించింది శాస్త్రి గారికి .ఒక కావ్యం రాయటానికి కావలసిన దినుసు ,సరుకు దొరికింది. వెంటనే ‘’నావిబుధ లోక సందర్శనము ‘’అనే చమత్కార వచన కావ్యం రాసి లోకం మీద వదిలారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-15- ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జాతీయ స్థాయి తెలుగు కవితల పోటీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషేంద్ర కవితా శేముషి -సాహితీ గవాక్షం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశోధనా ప్రభాకర -పల్లా దుర్గయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..

చరిత్రలో మొట్టమొదట జరిగిన ఆధిపత్య పోరు.. ప్రపంచ యుద్ధం. జర్మనీ అధికార కాంక్ష వల్ల ఎన్నో లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు. భారతదేశం ఎన్నో లక్షల మంది సైనికులను ఈ సమరానికి మద్ధతుగా పంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇచ్చిన తోడ్పాడు ఎనలేనిది.. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.
మొదటి ప్రపంచ యుద్ధం… యూర్‌పలో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలైలో జర్మనీ, ఆస్ర్టియా, హంగేరి, ఒట్టోమన్‌ మొదలైన దేశాలకు గ్రేట్‌ బ్రిటన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, ఫ్రాన్స్‌, రష్యా, ఇటలీ, జపాన్‌ (మిత్ర దేశాలు) దేశాలకు మధ్య ఈ యుద్ధం జరిగింది. దాదాపు 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది మామూలు ప్రజలు చనిపోయారు.
  • ఆస్ర్టేలియా, కెనడా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు మించి సైనికులను మిత్ర రాజ్యాలకు మద్దతుగా భారతదేశం పంపింది. దాదాపు 15 లక్షల మంది భారత సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు.
  • బ్రిటన్‌ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం ‘విక్టోరియా క్రాస్‌ హానర్స్‌’. భారత సైనికులు 11 విక్టోరియా క్రాస్‌ హానర్స్‌ పొందారు. మొత్తం మీద 13,000 వేర్వేరు పతకాలు భారత సైనికులు పొందారు.
  • మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత సైనికులు స్వదేశానికి రాకుండానే ఆఫ్ఘాన్‌ మూడో యుద్ధం, వజీరిస్తాన్‌ దండయాత్ర మొదలైన వాటిల్లో పాల్గొన్నారు.
  • మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు 53,486 మంది చనిపోగా, 64,350 మంది గాయపడ్డారు. 3,762 మంది కనిపించకుండా పోయారు. వారిలో కొంతమంది జైలులో బందీలుగా ఉండిపోయారు.
  • యుద్ధం వల్లనే కాదు ఫ్రాన్స్‌లో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా భారత సైనికులు చనిపోయారు. అక్కడ ఉండే విపరీతమైన చలి వల్ల దాదాపు 9,000 మంది సైనికులు చనిపోయారు.
  • సైనికులు, వస్తు రూపేణా కాకుండా దాదాపు 900 కోట్ల రూపాయల్ని యుద్ధం కోసం భారతదేశం ఖర్చు చేసింది.
  • 43,737 మంది ఇతర సిబ్బంది(వంటవాళ్లు, పనివాళ్లు) భారత సైనికుల వెంట వెళ్లారు.
  • అందరికంటే ముందుగా భారత్‌దేశ సైనికులే యూరప్‌ చేరుకున్నారు.
  • ఫ్రాన్స్‌ వీధుల్లో తొలిసారి మార్చ్‌ ఫాస్ట్‌ చేసిన ఘనత మన సైనికులదే.
  • యూరప్‌ నుంచి ఆఫ్రికా, చైనా దేశాల వరకు అన్ని దేశాల్లో భారతీయ జవానులు యుద్ధం చేశారు.
  • బిక్‌నూర్‌(మహారాష్ట్ర) మహారాజా గంగ సింగ్‌ యుద్ధం కోసం తమ పోలీసు బలగాల(కామెల్‌ కార్ప్స్‌)ను పంపించాడు. ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, పాలస్తీనా దేశాల్లో వీటి సేవల్ని ఉపయోగించుకున్నారు. పాటియాలా మహారాజు భూపిందర్‌ సింగ్‌ గల్లిపోలి(ప్రస్తుత టర్కీ)లో జరిగిన యుద్ధంలో పోరాడాడు.
  • యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే భారత దేశం తన తోడ్పాటును అందించింది. 7 కోట్ల విలువైన మందు గుండు సామాగ్రిని, 6 లక్షల మెషిన్‌ గన్స్‌, రైఫిల్స్‌, యుద్ధ వాహనాలను అందించింది.
  • నాలుగు సంవత్సరాల యుద్ధ సమయంలో ఆర్మీ క్లాత్‌ డిపార్డ్‌మెంట్‌ 41,920,223 దుస్తుల్ని ఉత్పత్తి చేసింది.
  • 1,302,394 మంది సిబ్బందిని, 1,72,815 జంతువులను 369.1 మిలియన్‌ టన్నుల సరుకును భారతదేశం అందజేసింది.
  • ప్రస్తుత లెక్కల ప్రకారం 7,420,800,000 రూపాయలను భారతదేశం యుద్ధం కోసం ఖర్చు చేసింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రు అంతిమయాత్రలో సినీకవి కైఫీ ఆజ్మీ ఆత్మ ఘోష

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడాది మోడీ ఇన్ఫోసిస్ విశ్లేషణ ,అదిరి పోయే పెట్టుబడులెక్కడ ?దేవుడే ఇచ్చాడు స్టైలు ఒక్కటి ఇచ్చాడు స్టైలు ఒక్కటి

Inline image 1

 
 
 
Inline image 2


 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హైమవతి కవిత -ఈ దేహం – మరియు చలం తో మిత్రులు

Inline image 1

Inline image 3

 

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది ?వెల్చేరు నారాయణ రావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం

బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది .అందులో రెండు ఉదాహరణలు మాత్రమే చూద్దాం .లింగం గారు రాజ శేఖరుని ఇంటిని చాలా విపులంగా వర్ణించారు .అలా వర్ణించినట్లు ఇల్లు కట్టటం అసాధ్యం అని శాస్త్రిగారు యుక్తి యుక్తం గా నిరూపించారు .రాజశేఖరం మంచి ముహూర్తం లో బయల్దేరినా దొంగల బారిన పడ్డారని కందుకూరి రాశారు .శాస్త్రిగారు రాజశేఖరుడు ప్రయాణానికి బయల్దేరిన ముహూర్తాన్ని జ్యోతిశ్శాస్త్ర బలం తో పరిశీలించారు .ఆ ముహూర్తం ‘’చోర పంచకం ‘’లో పడిందని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .కనుక దొంగల బాధ ఈ ముహూర్తానికి తప్పదు అన్నారు .జ్యోతిశ్శాస్త్రం ఎంత శాస్త్ర సమ్మతమో వీరేశలింగం గారే రుజువు చేసి చెప్పారని దానికి ఈ ఉదాహరణమే చాలునని అన్నారు  .ఈ విమర్శను ‘’వివేక చంద్రికా విమర్శనం ‘’పేర 1896లో ప్రచురించారు ‘’.రాజ శేఖర చరిత్రము మిక్కిలి రసహీనమైన కావ్యాభాసము .దీనిని  వచనకావ్య రచనకు ఉదాహరణ గ్రంధంగా పేర్కొనటం కావ్య కళకు హాని .కనుక కావ్య కళాద్రుష్టిలో చూసి సారస్వతాభి వృద్ధికోసం దీనిపై ఖండనం రాయాల్సి వచ్చింది ‘’అని శాస్త్రిగారి అభిప్రాయం .అంతేకాదు ఈ పుస్తకం లో సంఘం పరమ మూర్ఖమైనదిగా ,వంచన మాత్రమె ప్రాధాన గుణం కలదిగా  పంతులుగారు ఇతరుల మెప్పుకోసం రాశారని ఎండ గట్టారు .స్వదేశస్తుడే స్వసంఘాన్ని ఇంత నీచమైనదానిగా వర్ణించటం దారుణం అన్నారు .మనజాతిని హీనమైన దానిగా చూడటానికి ఎప్పుడూ ప్రయత్నించే క్రైస్తవ మిషనరీలు దీనిని ఇంగ్లీషులోకిఇంగ్లాండు లో  అనువాదం చేయించుకొన్నారు దీనిపై  పాశ్చాశ్చ పండితులు  .’’written by a native gentleman of refinement and education ,the book is fine ,and invaluable as an important study of native character as seen by native eyes ‘’He tilts the astounding guillibility and the un fathomable deceit of native character ‘’అని రాశారు .దీన్ని చదివిన ప్రతి  పాశ్చాశ్చ పండితుడు ఇండియా వచ్చి ఎంతహీనం గా మనల్ని చూస్తారో అని బాధపడ్డారు శాస్త్రిగారు .దేశాభిమానులైన శాస్త్రిగారు అందుకే ఖండనం రాయవలసివచ్చింది .ఉత్తమ ఆశయం లేకుండా శాస్త్రిగారు ఏ గ్రంధం పైనా ఖండనం రాయనే లేదు .శాస్త్రిగారు ఏది రాసినా యుక్తి యుక్తంగా ,సమగ్రంగా సరసంగానే ఉంటుంది .దీన్ని బట్టి ఉత్తమ కావ్యం ఎలా ఉండాలో శాస్త్రి గారు నిరూపించారు .పంతులుగారి కలం ప్రతి వారిమీద విమర్శ తో విరుచుకు పడుతున్నకాలం లోనే శాస్త్రి గారు ఖండనం రాశారు .అంతటి ధీశాలి శాస్త్రిగారు .శాస్త్రిగారి ఖండనానికి వీరేశ లింగం గారుకాని ఆయన శిష్యులు కాని ప్రతి విమర్శ రాయకపోవటం ఆశ్చర్యమే. అంటే శాస్త్రి గారి వాదం ఎంత సమర్ధనీయమో అర్ధమవుతోంది .

ఆ తర్వాత కొన్నేళ్ళకు శ్రీ రాయసం వెంకట శివుడు గారు వీరేశలింగం గారికి ‘’మీ రాజశేఖర చరిత్రము లో రాజశేఖరుని గృహ వర్ణన తప్పుగా ఉందని ఒకాయన రాశాడు దానికి మీ సమాధానం ఏమిటి ?’’అని ఉత్తరం రాశారని దానికి కందుకూరి వారు తమ ఇంటినే రాజశేఖరుని ఇల్లుగా వర్ణించా మని నవ్వుతూ సమాధానం చెప్పారని వెంకట శివుడు ప్రకటించారట .కాని ఇదీ తప్పేనంటున్నారు .వీరేశ లింగం గారింటికి రాజ శేఖరం గారింటికి చాలా భేదం ఉందని రాజశేఖరం గారి ఇంటిపై మేడ లేదని ,వీరేశలింగం గారింటిపై మేడ ఉందని తేల్చారు .కనుక శాస్త్రి గారు రాసిందే యదార్ధం అని తేల్చారు పండితులు .

వెంకట  శివుడుగారు శాస్త్రి గారి విమర్శకు ప్రతి విమర్శ ఏదో రకంగా రాసినా అందులో శాస్త్రి గారి పేరు పేర్కొనలేదు ప్రతి విమర్శకు పేరుకూడా పెట్టలేదు .తాను  శాస్త్రిగారి పేరు ఎత్తితే ఆయన ఖ్యాతి  పెరుగు తుంది కనుక దానిజోలికి పోలేదని శివుడు గారు దాటేశారు .శాస్త్రి గారికి పేరు రాకుండా చేయటానికి సంస్కరణ వాదులం అని చెప్పుకొనే వారు విశ్వ ప్రయత్నం చేసినా శాస్త్రిగారి ప్రతిభా సూర్య ప్రతాపాన్ని వారి అరచేతి తో ఆపలేకపోయారు. ఇది శాస్త్రి గారి గొప్ప నైతిక విజయం .

శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు  చిత్రాడ సభలో సారస్వత పరి శోధన గూర్చి ముచ్చటిస్తూ శాస్త్రిగారు సారస్వత విషయం లో విశేషం గా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు .శ్రీ దుగ్గిరాల సూర్య ప్రకాశ రావు పంతులుగారు ‘’న్యు ఇండియా ‘’అనే పేపరులో శాస్త్రి గారి సాహిత్య సేవను గూర్చి రాసి మెచ్చుకొన్నారు. కొవ్వూరులో శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగింది .శ్రీ చిలుకూరి వీర భద్ర రావు గారు పాల్గొని తమకు శాస్త్రిగారికి కొన్ని అభిప్రాయ భేదాలున్నా ,శాస్త్రిగారి దేశ సేవ నిరుపమానమై నాదని ,అందుకే ఈ సన్మాన సభలో ఆనందంగా పాల్గోన్నానని  చెప్పారు .శాస్త్రి గారికి చేసే సన్మానం ఆంద్ర దేశానికి చేస్తున్న సన్మానం అన్నారు చిలుకూరి వారు .సంస్కార వాదులు కూడా నెమ్మది నెమ్మదిగా శాస్త్రిగారినే సమర్ధిస్తూ వచ్చారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం

‘’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం

ఈ రోజు 24-5-15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు  ఆకాశ వాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన ‘’రావణ దాన్యమాలి ‘’గంట నాటకాన్ని విన్నాను .అద్భుతం అనిపించింది .చిన్నవిషయాన్ని తీసుకొని రావణుని చుట్టూకద అల్లి ,కాటూరి వెంకటేశ్వర రావు గారి ‘’పౌలస్త్య హృదయం ‘’అందులో చొప్పించి ,దాన్యమాలి స్వయం వ్యక్తిత్వానికి ,మాతృత్వ మహిమకు ప్రాధాన్యత నిచ్చి అన్నిపాత్రలకు చక్కని సరస సందర్భోచిత సంభాషణలు కూర్చిన రచయిత పి .లక్షీ కులశేఖర్ అభినందనీయులు .పాత్రధారులందరూ చాలా గొప్పగా తమ పాత్రలను పోషించి న్యాయం చేకూర్చారు .దాన్యమాలి  పాత్రధారిణి రావణ పాత్ర దారులిద్దరూ హృదయాలను దోచేసుకొన్నారు .ఎక్కడా వ్యర్ధపదం అనేది లేదు అనవసరపద్య ప్రయోగమూ లేదు .సూటిగా హృదయానికి తాకేట్లుగా ప్రతి పదమూ ఉంది. అందరూ మహాను భావులే అనిపించారు . కద ను కొద్దిగా వివరిస్తా –రామునితో యుద్ధ సన్నాహం లో ఉన్న రావణుడు కొలువు తీరి ఉంటాడు .అప్పటికే ఇంద్రజిత్ తోసహా మహామహులైన వాళ్ళంతా యుద్ధం లో చనిపోయారు .రావణుని రాక్షసత్వాన్ని విభీషణాదులు గుర్తు చేస్తారు .అందులో దాన్యమాలికి జరిగిన అన్యాయం జ్ఞప్తికి తెస్తారు .అక్కడి నుండికద ఫ్లాష్ బాక్ లోకి వెడుతుంది .రావణ సోదరి శూర్పణఖ గంధర్వుడైన  విద్యుజ్జిహ్వుని ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. అది రావణుడికి ఇష్టం లేదు .రావణుడు ప్రశాంతంగా ఉన్న గాంధర్వ లోకంపైకి దండెత్తాలని చూస్తాడు .శూర్పణఖ వచ్చి వద్దని వారిస్తుంది ఆమెభర్త రాయబారిగా వస్తే చీత్కారిస్తాడు లంకాధిపతి .చంపాలనీ ప్రయత్నిస్తాడు కాని తమ్ముని హిత బోధవలన ఆపని చేయడు.పెద్దల మాట ప్రకారం అక్కడ ఎవరూ ఏ గంధర్వ స్త్రీని బలత్కారించారాదని వారికిస్టమైతేనే ప్రేమించాలని కట్టడి చేస్తాడు .దాన్యమాలి విజ్జుజ్జిహ్వుని  సోదరి .ఆమె పై మరులుగొంటాడు రావణుడు .తాను ప్రేమించాడుకనుక ఆమె కూడా ప్రేమించాల్సి౦దేనంటాడు .తిరస్కరిస్తుంది ఆమె .ఆడదానికీ హృదయం ఉంటుందని దాన్ని అర్ధం చేసుకోవాలని చెబుతుంది .బలాత్కారం చేయలేక ఆమెను బంధించి లంకలో ఉంచాడు రావణాబ్రహ్మ. ఆమె కూడా మనసు మార్చుకొని దశ కంఠుని ఇల్లాలు అవటానికి ఇష్టపడుతుంది. మాతృత్వం కావాలని కోరుకొంటే తిరస్కరిస్తాడు .చివరికి రస యోగం వలన ఆమె కు తన వీర్యం తో మహా బలుడు అనే కొడుకు పుట్టేట్లు  ఏర్పాటు చేస్తాడు .రామ రావణ యుద్ధం లో వాడూ చనిపోతాడు .అప్పుడు పశ్చాత్తాపం చెంది రావణుడు దాన్యమాలిని చేరి గాంధర్వ విధిలో వివాహమాడి ఆమె కోరిక తీర్చి ఆమెను’’ రావణ ధాన్య మాలిని ‘’చేస్తాడు .ఆమె సుమంగళిగా చనిపోతుంది .యుద్ధం లో రామబాణానికి రావణుడు నిహతుడవుతాడు .బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూ విశిష్ట స్థానం లభించింది .ఒక జానపద గీతాన్ని బాక్ గ్రౌండ్ లో వినిపించటం భేషుగగా ఉంది  ’’టైట్ నిట్’’ అంటే ఏమిటో రుజువు చేసిన నాటకం ఇది .ఈ నాటకానికి దర్శకత్వం వహించింది మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు అని చెప్పగానే ఆగలేక నాటకం అయిపోగానే వారికిసాయంత్రం 4 గంటలకు  ఫోన్ చేశాను .

ఆదిత్య ప్రసాద్ గారు నా ఫోన్ నంబర్ గుర్తుపట్టి సాధారణం గా ఆయన భాషలో ‘’మాస్టారూ !ఎలాఉన్నారు ?’’అని అడిగారు .నేను ఇప్పుడే నాటకం విన్నానని  మహాద్భుతంగా నాటకం వచ్చిందని అందులో వారి దర్శకత్వ ప్రతిభ ప్రతి అంగుళం లోను కనిపించిందని ,ఎక్కడా అపశబ్ద ఉచ్చారణ లేకుండా గొప్పగా ఉందని అభినందించాను .అప్పుడు ఆయన ఆ నాటకాన్ని తాను కడప కేంద్రం లో పని చేసినప్పుడు దర్శకత్వం వహించానని అది 1989వ సంవత్సరం అని అన్నారు .అంటే ఆ నాటకం సుమారు 25  సంవత్సరాల కిందటిది  అన్నమాట. అయినా నూతనత్వం తో తొణికిస లాడిం దని చెప్పాను .అప్పుడాయన అ ‘’అవును మాస్టారూ !అప్పుడు అందరం అంత తపన పడి అంకిత భావం తో చేసేవాళ్ళం  అందుకే అంత  పెర్ఫెక్షన్ కనిపిస్తుంది .మళ్ళీ అలాచేయగలమా అనిపిస్తూ ఉంటు౦ది  ‘’అన్నారు .

నేను పంపిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’పుస్తకాలు రెండూ అందాయా అని అడిగాను .అందాయని చెప్పి ఉత్తరం రాద్దామని అనుకొంటూనే కాలయాపన చేశానని అంటూ ‘’మాస్టారూ ! మిమ్మల్ని మీ రచనలని చూస్తూ ఉంటె నాకు విషయపు లోతులు తవ్వి తీసే బిరుదు రాజు రామరాజు గారే ఎప్పుడూ గుర్తుకొస్తారు .ఇది పొగడ్తకాదు నిజం .మీది అంత గొప్ప రిసెర్చ్ వర్క్ .అందరికి స్పూర్తి మీరు ‘’అన్నారు ‘నేను ‘’సార్ !రామరాజుగారికి నాకూ హస్తిమశకాంతరం ఉంది .వారెక్కడ ?వారి ప్రతిభ ఎక్కడ నేనెక్కడ?’’అన్నాను .

నిన్న గుంటూర్ నుంచి దాసరి చంద్ర శేఖర్ గారు ఫోన్ చేశారు .మేమిద్దరం ఫిబ్రవరి తెలుగు సభల్లో కలుసుకోన్నామని గుర్తు చేశారు .దర్శనీయ దైవ క్షేత్రాలను శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి వద్ద చూశానని ,తనతో బాటు గుంటూరు లో ‘’భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ‘’నిర్వహిస్తున్న శ్రీ గొల్లపల్లి సత్యనారాయణ గారు కూడా రామడుగు వారింట్లో ఈ పుస్తకాన్ని చూసి తనతో ‘’రాసినాయన సామాన్యుడు కాదు .ఏంతో పరిశీలనతో, తాదాత్మ్యం తో రాశారు ‘’అన్నారని, రామడుగు వారిని ఆ పుస్తకం ఇమ్మంటే ఇవ్వనన్నారని అది అమూల్య నిదిగా ఆయన భావించారని చదివి ఇస్తానన్నా ఒప్పుకోలేదని చంద్ర శేఖర్ ఫోన్ లో చెప్పారు .అంతేకాక చంద్ర శేఖర్ ఆప్యాయం గా ‘’ప్రసాద్ గారూ ! మిమ్మల్ని చూస్తె ,మిమ్మల్ని గుర్తు చేసుకొంటే శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు పులకించి పోతారండీ .మీ అనుబంధం ఏమిటో మాకు అర్ధం కావటం లేదు .ఆదిత్య ప్రసాద్ గారి మనసంతా మీరు నిండి పోయారండీ ‘’అన్నారు .ఈ మాటను ఇవాళ ఆదిత్య ప్రసాద్ గారికి చెప్పాను ఆయన నవ్వి ‘’మీరంటే నాకు అంతటి అభిమానం మాస్టారూ ! మీలాంటి ఆత్మీయులు నాకు చాలా తక్కువ మందే ఉన్నారు ‘’అన్నారు .ధన్యోస్మి అనుకొన్నాను .

చంద్ర శేఖర్ గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడిన దానిలో ‘’గొల్లపల్లి సత్యనారాయణ గారూ మీలాగా నిత్య యవ్వనులు .ఎప్పుడూ ఏదోఒకటి  రాస్తూ, సభలు చేస్తూ ఉంటారు .ఈ లక్షణాలున్నవారు’’ దత్తాత్రేయ అవతార ప్రభావం ‘’ఉన్నవారు .అని నేను భావిస్తాను ‘’అన్నారు .వెంటనే నేను ‘’మరీ ములగ కొమ్మ ఎక్కించకండి .సత్యనారాయణ గారు ఎవరో  నాకు తెలియదు .ఆయనకు మీరన్నట్లు దత్తాత్రేయ లక్షణాలు ఉండే ఉంటాయి .నాకు అవి ఏమాత్రమూ లేవు .నేనొక సామాన్య సాహితీ సేవకుడినిమాత్రమే ‘’అన్నాను .చంద్ర శేఖర్ నవ్వి నాతొ ఏకీభవించలేదు .తనదీ ,సత్యనారాయనగారిదీ అడ్రస్ లు ఫోన్ నంబర్లూ ఇచ్చారు .క్షేత్రాలు పుస్తకాలూ ఇద్దరికీ పంపమని కోరారు . సత్యనారాయణ గారితో ఫోన్ లో మాట్లాడమని చెప్పారు. మాట్లాడితే ఆయన సంతోషిస్తారనీ అన్నారు . ఒక సారి చేస్తే ఆయన పలక లేదు .రెండో సారి చేస్తే నిద్ర పోతున్నారని చెప్పారు .నిన్ననే వారిద్దరికీ 1-మహిళామాణిక్యాలు ,దర్శనీయ దైవ క్షేత్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ,గీర్వాణకవుల కవితా గీర్వాణం –నాలుగు పుస్తకాలు బుక్ పోస్ట్ లో పంపాను .సహృదయ స్పందన ఇలా ఉంటుందికదా అని అనిపించి రేడియో నాటకం తో మొదలు పెట్టి ఇంత దూరం లాక్కొచ్చా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సంచలన మోడీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు

Inline image 1

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి  వివాదం

ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా  ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు .వాళ్ళు నాటకం రాస్తే నాటకం తోనూ వ్యాసం రాస్తే వ్యాసం తోనూ జవాబు చెప్పటం శాస్త్రి గారి ప్రత్యేకత .సంస్కరణ పిపాసి వీరేశలింగం గారు ఎప్పుడూ శాస్త్రిగారికి ప్రధాన వ్యతిరేక పక్షమే .లింగం గారు విమర్శించారన్నమాత్రాన హిందూమతం లో ఏ స్వల్ప మార్పులు జరగటానికైనా శాస్త్రి గారు ఒప్పుకోనేవారుకాదు. అంతటి నియమ పరులు .కందుకూరి వారు కాలాన్ని బట్టి  యుక్తిని బట్టి మతం లో మార్పులు రావాలని కోరేవారు .కాని ఆయనే ఆ నియమాన్ని  పాటించలేదు అనే విమర్శ ఉండేది .ఆత్మకు పుట్టుక ఉందికాని చావు లేదనేవారు లింగం గారు .కానిలోకం లో పుట్టుట గిట్టుటకోసమే అనే మాట మర్చిపోయారని నింద మోశారు. శంకరాద్వైతం యుక్తి యుక్తమే అయినా ఒప్పుకోనన్నారు వీరేశలింగం  .డార్విన్ పరిణామ వాదం శాస్త్రీయమే అయినా తాను  అంగీకరించనన్నారు కందుకూరి .సృష్టివాదం అంటే క్రియేషన్ ధీరీ అశాస్త్రీయం అయినా అంగీకరిస్తున్నానన్నారు వీరేశలింగం .పులి ,పాము ,ఉప్పెన భూకంపం ,మహామారి మొదలైన విపత్తులను దేవుడే సృష్టించి ప్రజలకు భయం కలిగేట్లు చేసి తనను సేవి౦చేట్లు దేవుడు చేసినవే నంటారు కందుకూరి .ఇది మూఢ విశ్వాసంకాదా అని ఆనాడు శాస్త్రి గారు లాంటి సనాతనులు లింగం గారిని అవహేళన చేశారు ..ఇలా వీరేశలింగం గారు చాలా విషయాలలో పరస్పర విరుద్ధం గా ప్రవర్తించారనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది .అందుకే బ్రహ్మయ్య శాస్త్రి గారు వీరేశ లింగం గారి అన్నివాదాలను సమూలంగా  చేది౦చాల్సి  వచ్చింది .ఇవన్నీ గమనిస్తే శాస్త్రిగారు మహా వక్త మహా రచయిత మహా విమర్శకులేకాక మహా నిర్మాణ కౌశలం కలిగినవారు అని స్పష్టమౌతుంది .హిందూమతాభిమానం ,ప్రచార ఉత్సాహం తాటాకు మంటలాగా కాసేపు ఉండి  ఆరిపోయేవికావు ఆయనలో .అవి నిత్య జ్వాలలే .యాభై ఏళ్ళు వీటికోసమే పోరాడిన మహితాన్వితులు .

స్పర్ధయా వర్ధతే విద్యా

శాస్త్రిగారిని ఇంత పని చేయించింది ప్రతిపక్షాలవారే. వారి ప్రేరేపణే.ఒక సారి ధిల్లీ దర్బారు సందర్భం గా ఒక సభలో బ్రహ్మ సమాజ ప్రవర్తకులు బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ బ్రిటిష్ వారు మనదేశానికి వచ్చిన తర్వాతనే శూద్రులు బాగు పడ్డారని  అంతకు ముందు బ్రాహ్మణ సమాజం చేత  అణగ ద్రోక్క బడినారని  చెప్పారు .దీనికి  శాస్త్రిగారు బదులిస్తూ ‘’బ్రాహ్మలు శూద్రులకు అన్యాయం చేసిరా?’’అనే చిన్న పుస్తకం రాసి ప్రచురించారు .ఇందులో శ్రుతి స్మ్రుతులనుండి ,మహాభారత నుండి శుక్రనీతి మొదలైన మహా గ్రంధాలనుండి అనేక ప్రమాణ వాక్యాలు ఉదాహరణగా ఇచ్చి శూద్రులు ఎప్పుడుకూడా నీచంగా చూడబడలేదని సప్రమాణంగా రుజువు చేశారు .ఇంకో సారి శ్రీ త్రిపురనేని రామ స్వామి చౌదరి ‘’శబుక వధ ‘’నాటకం రాసి బ్రాహ్మణులను అనవసరంగా నిందించటం గమనించిన శాస్త్రిగారు ‘’శ౦బుక వధా విమర్శన గ్రంధం ‘’రాసి తమ పాండిత్యాన్ని ,ప్రతిభను వాద పటిమను ,లోకజ్ఞానాన్ని ,యుక్తిని నిరూపించుకొన్నారు .మరోసారి కాకినాడలో బ్రహ్మ సమాజం వారు శివలింగం అశ్లీలాన్ని బోధిస్తోందని ఒక పెద్ద సభలో అన్నారు .వెంటనే స్పందించిన బ్రహ్మయ్య శాస్త్రిగారు సమాధానంగా  ‘’శివలింగం యోగి రూపం లో భావింపబడిన శివుని శిరస్సు’’ అనే సిద్ధాంతాన్ని చెప్పి దానికి ప్రమాణాలను పేర్కొని అనేక శాస్త్రాలను పరిశోధించి సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చి వ్యాస పరంపరను పత్రికలో ప్రచురించారు .

వీరేశలింగం గారు వితంతువుల కేశ ఖండననం ,పరలోకం లో దంపతులు కలుస్తారు అనే హిందూ మతం లో ఉన్న నమ్మకాన్ని పరిహసిస్తూ ‘’నారద సందర్శనం ‘’అనే ప్రహసనం రాశారు .దీనికి దీటుగా సమాధానం రాస్తూ శాస్త్రిగారు ‘’పర్వత సందర్శనం ‘’అనే ప్రహసనాన్ని రాసి వదిలారు .మరోసారి బ్రహ్మ సమాజీకులుతమ మందిరం లో  విగ్రహారాధన తుచ్చం, నీచం, హేయం అని నిందించారు  .దీనికి శాస్త్రిగారు ‘’ఇలాంటివి ఏదో ప్రైవేటు మందిరం లో కూర్చుని చెబితే తేలేవికావు ప్రజా సమక్షం లో వాదోపవాదాలు చేసి నిగ్గు తేల్చేవి. అప్పుడే అసలు సత్యం ఏమిటో సామాన్య ప్రజలు గ్రహిస్తారు .మేము బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం దానికి మీరు రండి మీ వాదాలు వినిపించండి మా వాదాలు మేమూ వినిపిస్తాం ‘’అని జవాబిచ్చి నిజంగానే బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో తన వాదంగా శాస్త్రిగారు విగ్రహారాధనను సమర్ధిస్తూ చేసిన ఉపన్యాసం మహా విశిష్టంగా ఉంది .చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖి౦పబడదగినదినది అయింది .అదీ శాస్త్రి గారి వాదనా సామరధ్యం .వాక్ పటిమ .సర్వ గ్రంధ పరిశీలనం .

శాస్త్రిగారు పరిష్కరించిన సమస్యలు

బ్రహ్మయ్య శాస్త్రి గారు తమ అమూల్యమైన ఉపన్యాసాలలో ఎన్నో విషయాలను చర్చించి విషయ వివరణం చేశారు .ఎన్నో సమస్యలకు తగిన సమాధానాలు పరిష్కరించి చెప్పారు .వారు పరిష్కరించిన వాటిలో కొన్ని సమస్యలు -1 శ్రీ కృష్ణుడు జారుడా ?2- గణపతి 3-జీవన్మత మేది ?4-హిందూమతం ఆవశ్యకత 5-త్రిమతములు మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ ప్రతి హిందువు చదివి అర్ధం చేసుకొని అనుసారించాల్సినవే .అలాగే రజస్వలానంతర వివాహం వితంతు వివాహం లను యుక్తి యుక్తంగా ఖండించి శాస్త్రాదారాలు చూపి నిరూపించారు. దీనిలో వారిని మించిన వారెవ్వరూ లేరని చెప్పటం అతిశయోక్తి కాదు

హిందూ విజ్ఞానం

బ్రహ్మయ్య శాస్త్రిగారు హిందూ విజ్ఞానం పైన అనేక అమూల్య వ్యాసాలూ రాశారు .ఆధునికులు చెప్పే ప్రక్రుతి శాస్త్రము మన ప్రాచీనులు చెప్పిన ప్రాచీన గ్రంధాలనుండి గ్రహించి వ్రాయబడినదే అని ఘంటాపధం గా రాసి నిరూపించారు . హిందూ విజ్ఞానంపై శాస్త్రిగారు ‘’జగము సృజింప బడినదా?భూమి తిరుగు చున్దా?భూమి వర్తులత్వం యెంత ,?భూమి తిరుగుటకు ఆధారమేమి ?భూమి యొక్క యాకర్షణ శక్తి ,రాశి చక్రము ,పంచ భూతములు గ్రహణ కదా చర్చ రామయణమందలి వానరు లెవరు ?మొదలైన వ్యాసాలూ విజ్ఞాన సోపానాలే. శాస్త్రిగారి అసమాన ప్రాక్ ప్రచీతీ విజ్ఞాన సమ్మేళనానికి గొప్ప ఉదాహరణలే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత్ భద్రమేనా?

భారత్ భద్రమేనా?

  • 24/05/2015
  • -ఎస్.కె.రామానుజం/ బి.శ్రీధర్

‘్భవిష్యత్‌లో భారత్‌కు పెనుభూకంపం ప్రమాదం పొంచి ఉందా?’-అంటే ‘ఔన’నే అంటున్నారు శాస్తవ్రేత్తలు. వారు భయపడుతున్నట్లు అదే జరిగితే తట్టుకోగలిగే శక్తి మన దేశానికి ఉందా? కనీసం ఆ స్పృహ ప్రజలకు, నాయకులు, అధికార యంత్రాంగానికి ఉందా? దేశ రాజధానిలో భూకంపం వస్తే నష్టం, కష్టం ఏ స్థాయిలో ఉంటాయో ఊహించారా? అంటే ఇప్పటివరకూ అలాంటి తీవ్రమైన అంశంపై ఎవరూ దృష్టి సారించడం లేదనే చెప్పాలి. నేపాల్ అనుభవాల నుంచి మనం వెంటనే పాఠాలు నేర్వకపోతే, ప్రకృతే గుణపాఠం చెబుతుందని హెచ్చరిస్తున్న నిపుణుల మాటల్లోని నిజం ఏమిటో తెలిస్తే సగటు భారతీయుడి మనసు బరువెక్కడం ఖాయం. ఇప్పుడేంటి సమస్య? అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లే ఎప్పుడూ ఉండే సమస్యలు మినహా దివ్యంగా ఉన్న ఈ దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమిటి? భారత్ భద్రతకు వచ్చిన సమస్య ఏమిటి? అనుకుంటే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని అర్థం. మన పొరుగున ఉన్న నేపాల్‌లో తాజా భూకంపాలు, అదే సమయంలో మనదేశంలో సంభవిస్తున్న ప్రకంపనలు భారత్‌కు ఓ హెచ్చరిక అని శాస్తవ్రేత్తలు నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా వినేవారు, నమ్మేవారు తక్కువే. మనసుదోచే తెల్లని మంచుతెరలతో, ప్రకృతి సోయగంతో మెరిసిపోయే హిమాలయ పర్వత ప్రాంతం నిజానికి అంత చల్లగా ఏమీ లేదు. ఉన్నట్టుండి ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణంలో భూకంపం, అదీ తీవ్రస్థాయిలో అంటే- ఇప్పుడు నేపాల్‌లో వచ్చినదానికంటే ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం చాలా ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. భూకంపాలను కచ్చితంగా పసికట్టడం, కట్టడి చేయడం మానవుడికి ఇంకా సాధ్యం కాని విషయమే. కానీ గత అనుభవాలు, భూకంపాల చరిత్ర, భూగర్భంలో జరుగుతున్న మార్పులను బట్టి వారు ఈ పరిణామాలను ఊహిస్తున్నారు. ఇప్పుడు నేపాల్‌లో వచ్చిన భూకంపాల గురించి వివిధ దేశాలకు చెందిన సెస్మాలజిస్టులు ముందుగానే హెచ్చరించారు. అయితే ఎప్పుడు, ఏ స్థాయిలో వస్తుందన్నది వారు చెప్పలేకపోతున్నా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని దేశాలకు ఈ ముప్పు పొంచి ఉందని చెప్పారు. నేపాల్‌లో భూకంపాల ఫలితంగా భారీ కట్టడాలు పేకమేడల్లా కూలిపోయి, అంచనాలకు అందని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. మున్ముందు అంతకంటే ఎక్కువ స్థాయిలో భూకంపాలు వస్తే భారత్ తట్టుకోగలదా? నష్టాన్ని నివారించుకోగలదా? అంటే పెదవి విరుపే తప్ప సరైన సమాధానం లేదు. భూకంపాల గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, నష్టనివారణపై ప్రచారం, ఏర్పాట్లు లేకపోవడంవల్ల మనం పెద్దనష్టానే్న ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇతర ప్రమాదాల మాదిరిగా భూకంపాలు ఎవరి ప్రాణాలు తీయవు. కాకపోతే భూకంపాల తాకిడికి కొండ చరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం, హిమనీనదాలు జారిపడటం, అగ్నిపర్వతాలు పేలడం వంటి పరిణామాలతో నష్టం సంభవిస్తూంటుంది. భూకంప ప్రభావాన్ని తట్టుకోగలగడం, నష్టాన్ని తగ్గించగలగడం మన చేతుల్లోని పనే. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అంటే లేదనే చెప్పాలి. భూకంపం అంటే.. ప్రపంచం అంతా కొన్ని భూ ఫలకాల సమాహారం. సముద్రాల కింద ఉన్న కొన్ని ఫలకాలు, భూమి ఉపరితలంగా ఉన్న ఫలకాలు కొన్ని నిరంతరం భూమి అంతర్భాగంలో నెమ్మదిగా కదులుతూంటాయి. ఈ ఫలకాల మధ్య రాపిడి, ఒకదానిని మరొకటి ఢీకొట్టడం, ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవడం వల్ల అనంతమైన ఒత్తిడి కలిగి పెను శక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి పైకి ఎగతన్నుకురావడమే భూకంపం. ఆ ఫలకాల సర్దుబాటు పూర్తయ్యేవరకు ఈ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయిలో భూకంపం వస్తే- అంటే శక్తి పైకి వస్తే దాని ప్రభావం వల్ల ఆస్తి,ప్రాణనష్టం సంభవిస్తుంది. ప్రపంచంలో హిందూకుష్ పర్వత శ్రేణుల్లోను (హిమాలయాలు సహా), ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ ప్రమాదం ఎక్కువ. భూమి అంతర్భాగంలో ఉన్న ఈ ఫలకాల కదలికల్లో భారత ఉపఖండం ఉన్న ఫలకం మిగతావాటికన్నా వేగంగా కదులుతూ పక్కనే ఉన్న యురేషియా ఫలకంతో తరచూ ఢీకొట్టడం, లేదా రాసుకుపోవడం జరుగుతోంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇనే్నళ్లుగా ఉద్భవిస్తున్న శక్తి బయటకు రాకుండా భూమిలోనే ఉండిపోయి లోపలి భాగంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ రెండు ఫలకాలు ఢీకొట్టడం వల్లే వేలాది మైళ్ల పొడవున హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి. ఇప్పుడు కూడా అవి ఉన్న ప్రాంతంలోనే భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకం వైపు కదులుతూ ఢీ కొడుతూండటంతో ప్రమాదం పొంచి ఉందని సెస్మాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఏమి జరగొచ్చు..? మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. ఏడాదికి 1నుంచి 6 సెంటీమీటర్ల చొప్పున భారత ఉపఖండ ఫలకం యురేషియా ఫలకం వైపు(అంటే ఉత్తర దిశగా) దూసుకువెళుతోంది. కొన్నివేల సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామం ఇది. ఈ ఫలకాల మధ్య ఒత్తిడి వల్ల ఇప్పటివరకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. అయినా భూమిలోపల దాగి ఉండిపోయిన అనంతమైన ఒత్తిడి (శక్తి) బయటకు ఇంకా విస్ఫోటనం కాలేదు. ఎప్పటికైనా అది బయటపడే అవకాశం ఉంది. 1255-1934 సంవత్సరాల మధ్య హిమాలయాల చరిత్ర, హై రిజల్యూషన్ ఉన్న ఛాయాచిత్రాలు, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా లెక్కగట్టిన శాస్తవ్రేత్తలు భారత్, నేపాల్ దేశాలకు ముప్పు చాలా దగ్గరలో, తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సగటున ప్రతి 30 లేదా 75 సంవత్సరాలకు ఒకసారి పెనుభూకంపాలు వచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్శిటీ 2012లో ప్రచురించిన జర్నల్ నేచర్ జియోసైన్స్‌లో భారత్‌కు పొంచి ఉన్న ముప్పును సూచించింది. నేపాల్‌లో తాజా భూకంపాల గురించి ప్రపంచ దేశాలకు చెందిన 50మంది శాస్తవ్రేత్తలు రెండు నెలల ముందే హెచ్చరించారు. అయితే వారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వస్తుందని చెప్పారే తప్ప ఏ దేశం అన్నది స్పష్టం చేయలేదు. అది అంచనాకు సాధ్యం కాదు. ఇప్పుడు నేపాల్ ప్రాంతంలో భూకంపాలు వచ్చాయి కనుక, దిగువ ఫలకం కదలికవల్ల భూమి పొరల్లో కొంత సర్దుబాటు కలిగింది. ఇక మిగిలిన ప్రాంతాలపై దాని ప్రభావం ఉంటుందన్నమాట. మిగిలిన ప్రాంతమంటే భారత్‌లోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, దిల్లీతోపాటు మరికొన్ని ప్రాంతాలు. గడచిన 150 సంవత్సరాలలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చిన అతిపెద్ద భూకంపాలు, వాటి మధ్య ఉన్న కాల పరిమితిని పరిశీలిస్తే ఇక ఎప్పుడైనా మరో తీవ్ర భూకంపం అంటే రిక్టర్ స్కేలుపై 8 పాయింట్లకన్నా ఎక్కువ స్థాయిలో రావచ్చన్నమాట. హిమాలయ ప్రాంతంలో (్భరత్ వైపు) 1897లో షిల్లాంగ్‌లోను, 1905 హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా, 1934లో నేపాల్-బీహార్ సరిహద్దుల్లోను, 1950లో ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్‌లోను పెనుభూకంపాలు నమోదయ్యాయి. ఆయా సంఘటనల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించాయి. ఆ తరువాత ఇప్పటివరకు అంటే మొన్న నేపాల్‌లో వచ్చిన స్థాయిలో అక్కడ భూకంపాలు రాలేదు. అదే ఇప్పటి భయానికి కారణం. భూమిలోపల దాగిఉన్న శక్తి బయటకు వచ్చి ఒత్తిడి తగ్గితే తప్ప ప్రమాదం లేనట్టు భావించలేం. ముఖ్యంగా భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకాల రాపిడికి గురవుతున్న 240 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రాంతాల్లో భూకంపాల ముప్పు ఉందన్నమాట. ఆ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో మన దేశానికి చెందిన చమోలి, ఉత్తరకాశి, మున్సియారి, ఉత్తరాఖండ్, జోషిమఠ్ వంటివి ఉన్నాయి. అంటే తొలి ప్రమాదం ఆ ప్రాంతాలకేనన్నమాట. సన్నద్ధత ముఖ్యం..కానీ… ప్రపంచంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ప్రాంతాల్లో రెండవది భారత ఉపఖండం. మనదేశంలో 54 శాతం ప్రాంతంలో భూకంపాలు రావొచ్చు. అయినా ఆ ప్రమాదం వస్తే తట్టుకోగలిగే సామర్థ్యం మన వద్ద ఇంకా పూర్తిగా లేదు. ఎదుర్కొనే శక్తి ఉన్నా ఆసక్తి లేకపోవడమే పెద్దసమస్య. భూకంపాల పుట్టగా చెప్పుకునే కాలిఫోర్నియాలో కూడా ఇదే సమస్య. చిన్నదేశమైనా పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో అవగాహనతో జపాన్ భూకంపాలను తట్టుకోగలిగేలా, నష్టాన్ని కనిష్ఠం చేసేలా అడుగులువేసి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. మొన్నటికి మొన్న నేపాల్‌లో వచ్చిన మాదిరి లేదా అంతకంటే పెద్దస్థాయిలో భూకంపం వస్తే దిల్లీ రూపురేఖలు ఏ మాత్రం మిగలవని నిపుణులు చెబుతున్నారు. పద్ధతీపాడు లేకుండా నిర్మించిన అసంఖ్యాక భవనాలు, నిర్మాణ శైలి, ఒకదానిని ఒకటి ఆనుకుని కట్టడం, యుమునా తీరంపై నిర్మాణాలు పెరిగి, జనాభా పెరిగి ఒత్తిడి ఎక్కువ కావడంతో నష్టాన్ని ఊహించడానికే భయం వేస్తోందని అంటున్నారు. మొన్న వచ్చిన చిన్నపాటి భూప్రకంపనలకే దిల్లీ సచివాలయం ఊగిసలాడింది. ఇక భారీ ప్రకంపనలు వస్తే అది నిలబడుతుందంటే నమ్మేదెవరు? రిక్టర్ స్కేలుపై 8 కన్నా ఎక్కువ ప్రభావంతో భూకంపం వస్తే చారిత్రాత్మక కుతుబ్‌మినార్ తట్టుకోవడం కష్టమేనని వారి వాదన. అంటే హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లోని కొండలు, లోయల్లో ప్రకృతిప్రకోపాన్ని పెంచేలా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు, అపార్టుమెంట్లు, హోటళ్లు పెను భూకంపానికి పేకమేడల్లా కూలిపోతాయని, పెనునష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే గంగానదీ పరీవాహక ప్రాంతంలో పెరిగిన నిర్మాణాలు, అధిక జనాభా ఫలితంగా భూకంపాలు వస్తే అపారనష్టం అనివార్యం కావొచ్చు. ఆమధ్య గుజరాత్‌లోని భుజ్ భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో మేల్కొన్న కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. నైనిటాల్‌లో ‘అడ్వాన్స్‌డ్ స్టడీ ఆన్ జియాలజీ’, గాంధీనగర్‌లోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెస్మాలాజికల్ రీసెర్చ్’ సంస్థలను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నివారణ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనే సంపూర్ణ, సాధికార సంస్థ ఇంకా రూపుదిద్దుకోవలసి ఉంది. జపాన్ ఏం చేస్తోంది. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూప్రకంపనలు వస్తూనే ఉంటాయి. రోజుకు కనీసం 57 సార్లు భూమి కంపిస్తుంది. కాకపోతే రిక్టర్ స్కేలుపై 3కన్నా ఎక్కువ స్థాయిలో ఉండేవే నమోదవుతాయి. మిగతావి ప్రమాదకరమైనవిగా గుర్తించరు. 4 కన్నా ఎక్కువ స్థాయిలో వస్తే కొందిరికి ప్రకంపనల ప్రభావం అనుభవంలోకి వస్తుంది. భూకంపాలతో తరచూ నష్టపోయిన జపాన్ ప్రకృతిని జయించే దిశగా అడుగులు వేసింది. 2004లో వచ్చిన తీవ్ర భూకంపంతో కకావికలమైన జపాన్ అప్పటికే భూకంపాలను తట్టుకునే సాంకేతిక ప్రగతిని సాధించి అన్ని విధాలా తట్టుకోగలిగింది. అక్కడ ప్రతి వీధిలో, రైల్వేలైన్ పైన భూకంపాలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేశారు. కనీసం కొన్ని క్షణాలముందు లేదా ప్రకంపనలు వచ్చిన వెంటనే హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఉంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపం వస్తే సురక్షితంగా ఆ రైళ్లు ఆగేలా ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు సురక్షిత మార్గాలు చూపిస్తూ ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకునే ఏర్పాట్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన వెంటనే టీవీల్లో మిగతా ఛానళ్ల ప్రసారాలు ఆగి, కేవలం జాగ్రత్త చర్యలు చెప్పే వార్తలే ప్రసారమయ్యే ఏర్పాట్లు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఏ భవనమైనా, ఆకాశహర్య్మాలైనా భూకంపాలను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టాల్సిందే. భూమిలోపల ఉండే పునాదులు, ఉపరితలం పైన ఉండే నిర్మాణానికి మధ్య ఎక్కడో ఒకచోట ‘షాక్ అబ్జర్వర్’లు, డక్టెల్‌లాంటివి నిర్మిస్తారు. వాటివల్ల భూప్రకంపనలు వచ్చినపుడు కట్టడం అంతా ఊగిపోకుండా ఆ డక్టెల్ లేదా అలాంటి మరో ఏర్పాటు ‘మేనేజ్’ చేస్తుందన్నమాట. మంచినీటి పైపులైన్లు భూకంపాలకు పగిలిపోకుండా కొత్త టెక్నాలజీని సైతం జపాన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్‌లోనూ ఈ టెక్నాలజీతో కొత్తగా పైప్‌లైన్లు వేయాలని ప్రయత్నిస్తోంది అమెరికా. కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపాలు వస్తే అవి తలకిందులైనప్పుడు అందులో ఉన్నవారికి ప్రమాదం జరగకుండా ఎయిర్‌బ్యాగ్‌ల మాదిరిగా ఉండే సంచులను అమరుస్తారు. వాటిలో ఒకరకమైన లిక్విడ్ ఉంటుంది. దానివల్ల వారికి దెబ్బలు తగలకుండా ఉంటుంది. ఇక స్కూళ్లలో పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భూకంపాలు వచ్చినపుడు ఏం చేయాలో చిన్నప్పటినుంచి, స్కూళ్ల ప్రేయర్ టైమ్‌లోనే నేర్పిస్తారు. అంటే ఏరోజైనా, ఏ క్షణమైనా భూకంపంవస్తే ఎదుర్కొనేలా, క్షేమంగా బయటపడేలా చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పిస్తారు. మొన్నటికిమొన్న అక్కడ భూకంపం వచ్చినపుడు విద్యార్థులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం తగ్గిన తరువాత ఎటువంటి జంకూగొంకూ లేకుండా బయటకు రావడాన్ని సీసీటీవీ ఫుటేజిల్లో చూసి ప్రపంచం అవాక్కయింది. ప్రకంపనలు వచ్చినపుడు ఆరుబయటకు రావడం, భవనాల మధ్య ఉండకుండా గోడల వారకు చేరడం, బల్లలకిందకు చేరడం, కంగారుపడటం, భయపడటం, ఏడ్వటం వంటివి చేయకుండా బయటపడటం, ఎవరో ఒకరు వచ్చేవరకు ఎదురుచూడటం, మానసికంగా బలంగా ఉండటం నేర్పిస్తారు. రోజువారీ కార్యక్రమాల్లో భూకంపాల గురించి, జాగ్రత్తల గురించి చెప్పడం అక్కడ పరిపాటి. జపాన్‌తో పోలిస్తే మనదేశంలో భూకంపాలు తక్కువే అయినా, వస్తేగిస్తే తట్టుకునే శక్తి, సాంకేతిక సన్నద్ధత, ప్రజల్లో అవగాహన ఇంకా ముమ్మరం అవ్వాల్సి ఉంది. రిక్టర్ స్కేల్ – ఎం.ఎం.ఎస్ భూకంపాలను కొలిచే సాధనం ‘రిక్టర్ స్కేల్’. 1930లో దీనిని అభివృద్ధి చేశారు. అంతకుముందు భూకంపాల తీవ్రత లెక్కగట్టే సాధానాలు (వుడ్-అండర్సన్ టోర్సన్ సెస్మోగ్రాఫ్) ఉన్నా దీనికి కచ్చితత్వం ఎక్కువ కావడంతో అదే ప్రామాణికంగా మారింది. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సెస్మాలజిస్ట్ ఛార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్, బెనో గిటెన్‌బర్గ్‌లు రూపొందించిన స్కేల్‌కు ‘రిక్టర్’ పేరు పెట్టారు. ఇది 1930 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇది భూకంప తీవ్రతను చెబుతుంది. ఇది ఒకటికన్నా తక్కువ భూప్రకంపనలను నమోదు చేయదు. ఆధునికయుగంలో అంటే 1970 తరువాత రిక్టర్ స్కేలును ఆధునీకరించి, ఎంఎంఎస్ (మూమెంట్ మాగ్నిట్యూట్ స్కేల్)ను వినియోగిస్తున్నారు. రిక్టర్ స్కేల్ కన్నా దీన్ని మేలైన సాధనంగా చెబుతారు. దీనినే ‘మెరికల్లి ఇంటెన్సిటీ స్కేల్’అని, ‘మెద్వదెవ్-స్పాన్‌హడర్-కార్మిక్ స్కేల్’ అని కూడా అంటారు. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను చెబితే, ఎంఎంఎస్ భూకంప తీవ్రతతోపాటు, అది చూపే ప్రభావాన్నికూడా చెబుతుంది. అంటే నష్ట తీవ్రతను చెబుతుందన్నమాట. నిజానికి చాలా దేశాలు ఇప్పటికీ రిక్టర్ స్కేలునే వినియోగిస్తున్నప్పటికీ అమెరికా జియలాజికల్ విభాగం మాత్రం ఎంఎంఎస్‌నే వినియోగిస్తోంది. సెస్మిక్ జోన్స్ నాలుగు మనదేశంలో భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో రావచ్చో ఊహించి 2,3,4, 5 సెస్మిక్ జోన్లు ప్రకటించారు. జోన్ 5: ఇక్కడ అతి తీవ్ర భూకంపాలు రావొచ్చన్నమాట. అంటే అత్యధిక ‘రిస్క్’ ఉన్న ప్రాంతం అన్నమాట. హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఈ జోన్‌లో చేర్చారు. కాశ్మీర్, మధ్య, పశ్చిమ హిమాలయాలు, ఉత్తర బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాణ్ ఆఫ్ కచ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ జోన్‌లోకి వస్తాయి. జోన్ 4: ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలున్న జోన్ ఇది. ముఖ్యంగా గంగ, యమున నదులు ప్రవహించే ప్రాంతాలన్నమాట. దిల్లీ, జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, నేపాల్-బీహార్ సరిహద్దులు, మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జోన్ 3: మోడరేట్ డామేజ్ రిస్క్ ఉన్న ప్రాంతాలు. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాలు, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 2: సాధారణ నష్టం కలిగే ప్రాంతాలు. పై మూడు జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాలన్నమాట. నిజానికి గతంలో ఆరుజోన్లు ఉండేవి. తాజాగా కేంద్రప్రభుత్వం దీనిని నాలుగు జోన్లుగా మార్చింది. భాగ్యనగరం సురక్షితమే- కానీ.. భూ ప్రకంపనలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ రెండో జోన్‌లో ఉంది. భూకంపం వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేని జోన్‌లో ఉంది. ప్రకంపనల వల్ల ఏ ముప్పు ఉండదని చెప్పుకునే ‘ఒకటో నెంబర్ జోన్’ను తొలగించారు. తెలంగాణ రాజధాని రెండో జోన్‌లో ఉందంటే విపత్కర పరిస్థితి పొంచి ఉందని అర్థం. అలాగని భారీ నష్టం జరుగుతుందన్న ఆందోళన అవసరం లేదు. దిల్లీ, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాలతో పోల్చితే భూ ప్రకంపనలకు సంబంధించి హైదరాబాద్ సురక్షిత ప్రాంతమే. భూమిలోపల మొత్తం పనె్నండు రకాల ఫలకాలుంటాయి. భూమిలోపల వేడి తీవ్రత కారణంగా కొన్ని ఫలకాలు కరిగి ద్రవ రూపంగా మారినపుడు, వాటిపై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ

బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ
  • హాస్యనటి హేమ చెప్పిన షూటింగ్‌ ముచ్చట్లు 

‘స్వాతి చినుకులు’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగుతెరకు పరిచయమైంది హేమ. మాటకారితనంతో పాటు కాస్త అమాయకత్వం కలబోసిన నవ్వుతో ఆమె చేసిన ప్రతి పాత్రా పేక్షకులకు గుర్తుండిపోయేదే. ‘అతడు’లో బ్రహ్మీకి భార్యగా, ‘మల్లీశ్వరి’లో వెంకటేష్‌ను తిట్టిపోసుకునే కొలీగ్‌గా, ‘జులాయి’లో ఇలియానా సవతితల్లిగా రకరకాల పాత్రలతో తెలుగులో తనకు రిప్లేస్మెంట్‌ లేదని నిరూపించుకుంది. చిరంజీవి నుండి సాయిధర్మతేజ వరకూ ఎందరో హీరోలతో 200 చిత్రాలకు పైగా నటించిన హేమ చెప్పిన షూటింగ్‌ ముచ్చట్లే ఇవి.

చిరంజీవి మీద అభిమానంతో సినిమాల్లోకి వచ్చాను. బాలకృష్ణ గారి ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో రౌడీలు తరుముతుంటే నటి కిన్నెర నన్ను సైకిల్‌ మీద కూర్చోపెట్టుకుని తొక్కుతూ తీసుకువెళ్ళాలి. ఈ సీన్‌ తీయటం అయ్యేటప్పటికి నాకు నడుం నొప్పి వచ్చేసింది. ఇదే సీన్‌ చివర మా ఇద్దరినీ కలిపి ఒకే గోతిలో ఒకరిపై ఒకరిని పడుకోబెట్టి పాతేస్తారు. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు మట్టంతా నోట్లోకి ముక్కు, కళ్లల్లోకి వెళ్లిపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా బాధపడ్డాను. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక నాకు మంచి పేరొచ్చింది.
 

ఏనుగు కొట్టిన దెబ్బ

‘మురారి’ సినిమాతో నా రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఈ సినిమాలో మహేష్‌ బాబు పాత్రకు ఒక పెంపుడు ఏనుగు ఉంటుంది. షూటింగ్‌ గేప్‌ లో నటుడు చిన్నా నావెనుకగా వచ్చి ఏనుగుకు గుగ్గిళ్ళు పెట్టబోయాడు. అది నా మీదకు వచ్చేసి తొండంతో గట్టిగా కొట్టింది. అంతే భయంతో పెద్దగా అరిచి పడిపోయాను. అక్కడున్నవాళ్ళంతా చిన్నాను తిట్టేసారు. ఈ సినిమాలో నటించిన ఆడవాళ్ళందరినీ సులువుగా గుర్తుపట్టడానికి వీలుగా కృష్ణవంశీగారు అందరికీ తలా ఒక రంగు చీర కేటాయించారు. సరిగ్గా నాకు ఇచ్చిన రంగు చీరనే లక్ష్మిగారు కట్టుకు వచ్చేవారు. ఆవిడను మార్చమని అనలేక నన్నే వేరే రంగు చీర కట్టుకు రమ్మనేవారు వంశీగారు. ఇలా చాలాసార్లు జరిగింది.
 

మహేష్‌బాబు నన్ను ఆంజనేయుడ్ని చేశారు

‘అతడు’ సినిమా అనగానే బ్రహ్మానందంగారికి , నాకు మధ్య ఉన్న కాఫీ కప్పు సీను టక్కున గుర్తుకు వస్తుంది ఎవరికైనా అక్కడే ఎడిట్‌ చేసిన సీన్‌ ఒకటి ఉంది. బ్రహ్మానందంగారు ఊరి నుండి రాగానే ఇంట్లో ఉన్న నన్ను పిలుస్తూ కాలి షూ విసురుగా నా మీదకు వచ్చేలా విడవాలి. అయితే ఆయన షూని కాస్త వేగంగా విడిచేసరికి అది నా మీదకు వచ్చి ముఖానికి బలంగా తగిలింది. దాంతో నా మూతి పెద్దగా వాచిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళంతా కంగారుపడిపోయారు. త్రివిక్రమ్‌గారయితే ఇక నేను ఎప్పుడూ ఆడవాళ్ళను కొట్టే సీను రాయనన్నారు. ‘‘పక్కనే కృష్ణవంశీ ‘శ్రీ ఆంజనేయం’ షూటింగ్‌ జరుగుతోంది, అక్కడ ఆంజనేయుడు లేడట ఈవిడను పంపించేద్దాం కరెక్టుగా సూటవుతుంది’’ అంటూ మహేష్‌బాబు నామీద జోకులేసారు కూడా. అప్పటికి అంతా నన్ను నవ్వించినా ఆ నొప్పితో రెండురోజులు బాధపడ్డాను.
 

త్వరగా పడుకోవడం మానేసాను

నాకు చిన్నతనం నుండీ రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు. ‘అతడు’ సినిమా షూటింగ్‌ జరిగేటప్పుడు అలాగే భోజనం అయున కాసేపటికి పక్క ఎక్కేసాను. షూటింగ్‌లో భాగంగా నేను పడుకున్న మంచం కింద కుంపటి పెట్టారు. వెచ్చగా ఉంది కదా అని నేను మెదలకుండా పడుకున్నాను. మొదటిరోజు ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజు మహేష్‌బాబు నా భోజనం కాగానే ‘‘ఆ! హేమక్క పడుకుంటుందికానీ మంచంవేసి, కుంపటి పెట్టేయండ్రా’’ అంటూ ఏడిపించేసరికి నాకు సిగ్గేసి ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకూ అందరితో పాటు లేటుగానే పడుకునేదాన్ని. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎంత ఎంజాయ్‌ చేసామో! అక్కడే వంట చేసుకుని తినేవాళ్ళం. త్రివిక్రమ్‌గారికి పప్పు టమాటా, మహేష్‌ బాబుకి రసం, బ్రహ్మనందానికి ఆలు ఫ్రై ఇవన్నీ నేను, సుధక్క కలిసి చేసేవాళ్ళం.
 

వెంకటేష్‌ తనను తాను తిట్టుకున్నారు
‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్‌గారిని బాగా తిట్టే పాత్ర నాది. అలా తిట్టాలంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయం తెలిసి వెంకటేష్‌గారు సడెన్‌గా నా ముందుకు వచ్చి ‘‘హేమ నువ్వు నన్ను ‘సచ్చినోడా’ అన్నావట, ‘ఈడికేం పోయేకాలం’ అంటున్నావట’’ అంటూ ఆయన్ని ఆయనే తెగ తిట్టేసుకున్నారు. నేను పడుతున్న భయాన్ని పోగొట్టి అక్కడి వాతావరణాన్ని తేలిక చేసేసారు. మల్లీశ్వరి రిలీజ్‌ అయ్యాక మా ఇద్దరి కాంబినేషన్‌లో సీన్లన్నీ బాగా పండాయన్నారు అంతా. ఆ సినిమాతో నేను కామెడీ, సెంటిమెంట్‌ ఏదన్నా చేయగలనన్న ధైర్యం వచ్చింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు. ఈ పాత్రకు హేమ సరిపోతుంది అని నన్ను నమ్మి పిలిచి పాత్రలు ఇచ్చిన వాళ్ళే తప్ప నేను కోరి అవకాశం ఇవ్వమని ఎవర్నయినా అడిగింది చాలా తక్కువ. సినిమాల మీద ఇష్టం నన్ను ఇంకా నా అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేసిందేకానీ నన్ను నిరాశపరచలేదు. మీకు వినిపించే మా నవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళు కష్టాలు చాలా ఉంటాయి. వాటన్నింటి మధ్య మీరు కొట్టే చప్పట్లే ఇంకా మంచిపాత్రలు చేయాలన్న ఆత్మబలాన్ని మాకు ఇస్తాయి.
– శివాని

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటిమాట నేటికీ శిరోదార్యం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్ లైన్ పూజార్లు -మరియు హిమఖండం లో మహిళ-

Inline image 1


 
 
Inline image 2


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2

గ్రంధాలయ స్థాపన

1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను  ఇరవై సంవత్సరాల వయసు లోనే స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు .కృత్తివెంటి పేర్రాజు ,నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి  కార్య దీక్షకు మెచ్చి చేయూత నిచ్చారు .ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండా గారం ‘’అనే గ్రందాలయన్నీ స్థాపించారు . మొదట్లో జగన్నాధ పురం లో ఉన్న ఈ లైబ్రరి తర్వాత పెద్ద వీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’లోకి మ్కార్చారు .కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు .సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు .ఇక్కడే శాస్త్రి గారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు .ప్రసిద్ధులను కూడా ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు .హరికధా కాలక్షేపాలు కూడా ఏర్పాటు చేశారు .ఆర్య మత బోధిని సభ ద్వారా శాస్త్రి గారు చేసిన హిందూమత సేవ అపారమై నిలిచింది .

వీదిప్రచారం

క్రైస్తవ మత ప్రచారకులు బ్రహ్మ సమాజికులు  ఆనాడు వీధుల్లో బృందాలుగా వచ్చి మత బోధ చేయటమేకాక హిందూమతాన్ని తీవ్రంగా దూషించేవారు .సనాతన ధర్మంపై వ్యతిరేక ప్రచారం ఎక్కువ చేసేవారు .వారి ప్రచారం లో పస లేదని రుజువు చేయాలని శాస్త్రి గారు భావించి తానుకూడా వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసి నిర్వీర్యులను చేయాలని నిశ్చయించుకొన్నారు .1884లో ఈ వీధి ప్రచారం మొదలు పెట్టి శాస్త్రిగారు ఎన్నో వీధి ప్రచార సభలు నిర్వహించి ,కరపత్రాలను అచ్చు వేసి పంచి పెట్టారు .ప్రజలలో భక్తిని ప్రబోది౦చటానికి భక్తీ గీతాలను పాడుకొంటూ వీధుల వెంట తిరిగేవారు .దీనికోసం ఒక సమాజాన్ని 1885 లో స్థాపించారు .అవసరమైన పాటలను,కీర్తనలను  శాస్త్రిగారే రచించి పాడటం నేర్పించి సమాజాన్ని వీధి ప్రచారానికి పంపేవారు .దీని వలన గొప్ప ప్రచారం జరిగీ క్రైస్తవ  బ్రహ్మ సమాజాలు సమాజాలు బయటికి రావటానికి భయపడ్డాయి .

మహా పురుషుల జయంతి వర్ధంతులు

భారత దేశం లో జన్మించి తమ అమూల్య జీవితాలను ఆదర్శ వంతంగా తీర్చి దిద్దుకొన్న మహా పురుషులైన శ్రీ రామ కృష్ణ పరమ హంస ,శ్రీ శంకరాచార్య ,శ్రీ రామానుజాదుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి వారి జీవితాలలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రేరణ కలిగించేవారు .శాస్త్రిగారు ఆనాడేప్పుడో మొదలు పెట్టిన శంకర జయంతి కాకినాడలో ఈ నాటికీ నిర్వహిస్తూనే ఉన్నారు .తర్వాత ఈ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఉద్యోగులు నిర్వహి౦చారు  .

మాస పత్రిక నిర్వహణ

శాస్త్రి గారు హిందూ మత విజ్ఞానాన్ని జన సామాన్యానికి అందించాలన్న తలంపుతో ‘’ఆర్య మత బోధిని ‘’అనే మాస పత్రిక ను స్థాపించి నిర్వహించారు .దీన్ని 1905 జనవరి ఒకటవ తేదీ ప్రారంభించారు .అప్పటికే శాస్త్రిగారు హిందూ మత సంబంధమైనవి ,సాహిత్య పరమైనవి అయిన వ్యాసాలూ వందల కొద్దీ రాసి ఉన్నారు .అవి వివిధ పత్రికలలో ప్రచురితాలుకూడా. కనుక శాస్త్రి గారి పేరు ఆంద్ర దేశం లో తెలియని వారు ఆ రోజుల్లో ఎవరూ ఉండేవారు కాదు. అంత గా పాప్యులర్ అయ్యారు శాస్త్రిగారు ‘’ఆర్య మత బోధిని కి దేశ మంతటా విశేషం గా పాఠకులు౦డేవారు శాస్త్రి గారి ప్రభావం వలన క్రమంగా బ్రహ్మ సామాజికుల ప్రభావం బాగా తగ్గి పోయింది అని వీరేశ లింగం పంతులుగారే అంగీకరించారు శాస్త్రి గారి ప్రభావం అంత గొప్పది .వీరేశ లింగం గారి  మాటల్లోనే ‘’వెయ్యగా వెయ్యగా వెర్రి వాడే గెలిచి నట్లు శాస్త్రి గారి రాతలు ,చేతలు జనులను భ్రమల్లో ముంచాయని గ్రహించి నేను తలపెట్టిన మహా కార్యానికి విఘాతం కలుగుతుందని భావించి ‘’సత్య వాదిని ‘’అనే పత్రిక ప్రారంభించాను ‘’అని వీరేశ లింగం గారే రాసుకొన్నారు .ఆనాడు సంఘ సంస్కార పత్రికలన్నీ శాస్త్రి గారి మీద కత్తి కట్టాయి .అయినా జంకూ గొంకూ లేని శాస్త్రిగారు సరైన సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి వారి నోరు మూయి౦చ గలిగారు .అదే వారి ఘన విజయం .పరుషంగా వారు మాట్లాడినా శాస్త్రిగారు మృదువుగా యుక్తి యుక్తం గా సమాధానాలిచ్చేవారు .కలహానికి కందుకూరి ఎప్పుడూ కాలుడువ్వేవారు .చివరికి లింగం గారే పశ్చాత్తాపం ప్రకటించాల్సి వచ్చింది .సత్యమేవ జయతే అని శాస్త్రి గారు రుజువు చేశారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు

ఎవరిపేరు చెబితే విద్వాంసులు చేతులు జోడిస్తారో ,ఎవారు అజ్ఞాన తిమిరాలను చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించారో ,ఎవరు వందలాది శిష్యగణానికి ఆరాధనీయులో  ఎవరు నడిచే విద్యా సరస్వతిగా భాసిల్లారో ,ఎవరు విమర్శనా వాజ్మయ జలధిని మదించి అనర్ఘ రత్నాలనీ వెలికి తీశారో ,ఎవరు సర్వ శాస్త్ర పారంగతులో, ఎవరు సమాజ దేవ పూజ చేశారో ,ఎవరు మూఢాచారాలను ఖండించి ప్రగతిమార్గ ప్రవర్తకులయ్యారో,ఎవరు సంస్కరణలను చెప్పటమేకాక పాటించి ఆదర్శంగా నిలిచారో   వారే బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు .

శాస్త్రిగారి కుటుంబం

బ్రహ్మయ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా పలివెల గ్రామం లో మాతామహులైన మైలవరపు నరసన్న గారింట క్రీ శ.2-4-1863 న జన్మించారు .అది రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి గురువారం .శాస్త్రి గారి పూర్వీకులు రాజోలు దగ్గర కడలి గ్రామం లో ఉండేవారు .తెలగాణ్యులు .గౌతమస గోత్రులు .ఆపస్థంభ సూత్రులు .ముత్తాత గారు కడలి గ్రామం వదిలి కాకినాడ లో జగన్నాధ పురానికి చేరుకొని స్వగృహమేర్పరచుకొని నివాసమున్నారు .తండ్రిగారు బ్రహ్మావదానిగారు వేద శాస్త్రాలలో నిష్ణాతులు .తల్లిగారు సుబ్బమ్మ గారు .బ్రహ్మయ్య శాస్త్రిగారి తమ్ములు కూడా తక్కువ వారేమీకాడు .తమ్ముడు సుబ్బయ్య శాస్త్రి’’ శ్రీరామ విజయ గ్రంధ కర్త ‘’.బ్రహ్మయ్య శాస్త్రి గారి పెద్దకుమారుడి పేరుకూడా బ్రహ్మయ్య శాస్త్రి యే..ఈయన ‘’శ్రీరామ శతకం’’ రాసి తండ్రిగారికి అంకితమిచ్చాడు .శాస్త్రిగారి రెండవ కుమారుడు నరసింహ మూర్తి సుబ్బయ్య శాస్త్రి గారికి దత్త పుత్రుడయ్యాడు .ప్రసిద్ధ సారస్వత సేవకుడు  దేశభక్తుడు కోటమర్తి చిన రఘుపతి రావు గారు బ్రహ్మయ్య శాస్త్రిగారి అల్లుడే .శాస్త్రి గారు మొదటిభార్య సుబ్బమ్మగారు మరణించిన తర్వాత వెదురుపాక నివాసి దంతుర్తి బ్రహ్మయ్య శాస్త్రులుగారి పెద్ద కూతురు సూరమ్మగారిని శాస్త్రిగారు ద్వితీయం చేసుకొన్నారు .

విద్యాభ్యాసం –సకల కళా ప్రపూర్ణులు

బ్రహ్మయ్య శాస్త్రి గారు కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో ఆంగ్ల విద్య నేర్చి మెట్రిక్ పాసైనారు .ఎఫ్ ఏ .పరీక్షకు చదువుతుండగా కుటుంబ పరి స్థితులవలన చదువు సాగక మానేశారు .కాలేజీ లో చదివేటప్పుడే శాస్త్రిగారు ఆంద్ర ప్రబంధ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .ఇంగ్లీష్ నేర్వక ముందే సంస్కృత పంచకావ్యాలు చదివేశారు .కాలేజి వదిలేసిన తర్వాత ‘’సిద్ధాంత కౌముది ‘’ని ఆపోసన పట్టారు .దానిపై వ్యాఖ్యానాలను చదవక పోయినా అందులోని సారాన్ని ఆస్వాదించారు .సంస్కృత ,ఆంద్ర ఆంగ్ల భాషల త్రివేణీ సంగమ స్నానం చేసి’’ సాదృశ భాషా శాస్త్రం’’ (ఫైలాలజి )లో క్రుషికూడా చేశారు .త్రిభాషా పాండిత్యం అబ్బటం వలన ప్రతి విషయాన్ని తులనాత్మకం గా పరిశీలించేవారు .దేశం లోని సాంఘిక విషయాలనూ అవగాహన పరచుకొన్నారు .హిందూ మతం పై వీరాభిమానమేర్పడింది .హిందూమతం లాంటి మతం, హిందూ సంఘం లాంటి సంఘం ప్రపంచం లో ఇంకెక్కడా లేవు అనే దృఢమైన అభిప్రాయమేర్పడింది .హిందూమతం యొక్క బాహ్య స్వరూపం తెలుసుకొంటే చాలదని భావించి అందులోని మత విజ్ఞానం పై ద్రుష్టి సారించారు .వివిధ శాఖలలో ఉన్న అతి సూక్ష్మ విషయాలను కూడా ఆకళింపు చేసుకొన్నారు .ప్రాయశ్చిత్త పశు నిర్ణయం ,పురాణాలలో ఉన్న గ్రహణాల విషయం అధ్యయనం చేశారు .వీటిపై అనేక వ్యాసాలూ రాశారు .అవి చదివితే శాస్త్రిగారికి ఉన్న శ్రౌత పాండిత్యం ,జ్యోతిష అవగాహన మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి .గానకళ లో నాట్యకళ లో ప్రావీణ్యం సాధించారు .ఎప్పుడూ ఏదో ఒక కొత్త విద్య నేర్వటం దాని లోతుపాతుల్ని తరచటం శాస్త్రిగారి హాబీ .అందుబాటులో ఉన్న గ్రంధాలయాలకు వెళ్లి తనకు కావలసిన విషయాలను చదువుకొంటూ లోకాన్నే మర్చి పోయేవారు .ఇతర గ్రంధాలను అనేకం చదవటం వలన ఆయనకు 60 వ ఏట నేత్ర ద్రుష్టి క్షీణించింది .మద్రాస్ వెళ్లి నేత్ర వైద్యులు డాక్టర్ కోమన్ నాయర్  కు చూపించగా వారు మరల దృష్టిని ప్రసాదించారు .రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ గ్రంధ పఠనం  కొనసాగించారు .విద్య నేర్పటంకంటే విద్యార్ధిగా ఉండటమే శాస్త్రి గారికి మహా ఇష్టం .

నిత్య కర్మ వీరులు

బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత నిఘంటువు లో   విశ్రాంతి అనే మాట కు చోటే లేదు .అనునిత్య కర్మవీరులు శాస్త్రిగారు .ప్రజా విషయాలపై అత్యంత శ్రద్ధ చూపటం  మొదటి నుండి అలవాటు .కాకినాడ ట్రెజరీ డిప్యూటీ కచేరిలో గుమాస్తాగా శాస్త్రి గారు ఉద్యోగించారు .అక్కడ పని చేస్తున్నా వీరి ఇతరపనులకు ఏ ఆటంకమూ ఉండేదికాదు .కాలేజీ చదువు మానేసి ఇందులో కొలువులో చేరి నిరాఘంటంగా తమకు 56 వ ఏడు వచ్చేదాకా పని చేశారు .తరువాత దీనికి గాను నెలకు ఇరవై రూపాయలు పెన్షన్ పొందేవారు .విధి నిర్వహణలో ఏమరుపాటు లేకుండా పై అధికారుల మెప్పును పొందేవారు .ఆఫీసులో బండ చాకిరి చేసి ఇంటికి వచ్చినా శాస్త్రిగారు విశ్రాంతి తీసుకొనే వారుకాదు .ఎక్కడో ఒక  చోట ఉపన్యాసం ఉండేది .వ్యాసాలూ రాసేవారు .అంతేకాక ప్రజాహిత సంస్థలను ఏర్పాటు చేసి వాటిద్వారా ప్రజా సేవ చేసేవారు .అందుకే వారికి విశ్రాంతి అనేది గగన కుసుమమే అయింది .

నాటక సమాజ స్థాపన

శాస్త్రిగారు విద్యార్ధిగా ఉండగా మహా రాష్ట్ర నుండి ధార్వాడ నాటక సమాజాలు వచ్చి ప్రదర్శనలు ఇచ్చేవి . .వారి రంగాలంకరణ ,ప్రక్రియా వైవిధ్యం ఆంధ్రులను ముగ్ధులను చేసేవి .ఆ కొత్త పద్ధతులు ఆంద్ర దేశం లో కూడా అభి వృద్ధి చెందాలని శాస్త్రిగారు భావించారు .’’ఆంద్ర బృందానంద సంధాయి ‘’అనే పేరుతొ ఒక నాటక సమాజాన్ని స్థాపించారు .ఈ సమాజం వీరేశ లింగం గారు రాసిన శాకుంతలం ‘’నాటకాన్ని బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసిన ‘’త్రిపురాసుర విజయ వ్యాయోగం ‘’నాటకాన్ని ఆడేవారు .ప్రసిద్ధ కవులు రాసిన నాటకాలనూ ప్రదర్శించి ప్రజారంజనం చేసేవారు .తర్వాత ఈ సమాజం మరో సమాజం లో కలిసి పోయింది .

భక్త సమాజ స్థాపన

విద్యార్ధి దశనుండి హిందూ మతానికి నవ నాగరికత వలన వస్తున్న ముప్పును బ్రహ్మయ్య శాస్త్రి గారు గ్రహించారు .దానిని నివారించటానికి ప్రజలలో భగవద్ భక్తీ పెంచటానికి అనువుగా 1880లో ‘’భక్త సమాజం ‘’అనే సమాజాన్ని స్థాపించారు .శాస్త్రి గారి నిర్మల నిశ్చయ భక్తీ వలన సమాజం దిన దిన ప్రవర్ధమానమైంది .సమాజం తరఫున అనేక గ్రామాలలో పర్యటించి భక్తిపై స్పూర్తిపూర్వకప్రసంగాలు చేసేవారు .కొంతకాలం తర్వాత ఈ సమాజం ‘’హిందూమత బాల సమాజం ‘’లో కలిసి పోయింది .

ఆధారం – మా తండ్రిగారు కీ .శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారు భద్రం గా తమ గ్రంధాలయం లో2-4-1940అని తమ సంతకం కింద తేదీ వేసి  సంతరించి దాచుకొన్న ‘’విమర్శకాగ్రేసర కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత చరిత్రము ‘’ అనే గ్రంధం .సుమారుగా 75 ఏళ్ళక్రిందటిపుస్తకం అన్నమాట .అనుకోకుండా నా కంట బడితే సార్ధకం చేసుకొంటున్నాను . కవర్ పేజి చినిగిపోయింది .కనుక గ్రంధ కర్త ఎవరో నాకు తెలియలేదు .ఇది 40 పేజీలున్న చిన్ని పొత్తం .రచయితకు కృతజ్ఞతలు తెలియ  జేసుకొంటున్నాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-15-ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీతం యూనివర్సిటి చాన్సెలర్ -పద్మశ్రీ డా . కోనేరు రామకృష్ణారావు గారి స్పందన

గీతం యూనివర్సిటి చాన్సెలర్ -పద్మశ్రీ డా . కోనేరు రామకృష్ణారావు గారి స్పందన

koneru 001

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దిల్లీకి గవర్నరు సర్వాధికారి -కేంద్రం – నెత్తిన సూర్యాగ్ని హోత్రం -సమిధలౌ తున్న జీవులు

Inline image 1

Inline image 1
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త ఝాన్సీ ని బోతున్నారు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -10-

   ఆనంద రామాయణ విశేషాలు -10-

          సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం

సీత  తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె సంప్రీతి చెంది ఒక పాయస పాత్రను ఆయనకు ఇచ్చి’’మునీశ్వరా ! ఈ పాత్రలో అనేక పక్వాన్నాలు సమస్త భోజ్య పదార్ధాలు ఉన్నాయి .నీభార్య లోపాముద్రకు ఈ పాత్రనిచ్చి అందరికి వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అదృశ్యమయింది. అలాగే అగస్త్య పత్ని రామ పరివారానికి వడ్డించింది .అందరికి ఎవరికి ఏది ఇష్టమో ఆ పదార్ధాలన్నీ పాయస పాత్త్రనుండి వస్తుండగా సంతోషంగా వడ్డించి వారదరికీ తృప్తి కలిగించింది .భోజనాల తర్వాత సీతా రాములకు బంగారు ఆభరణాలను నూతన వస్త్రాలను ముని దంపతులు సమర్పించి ఆశీర్వ దించారు .

    రాముడు అగస్త్యునితో పంచాప్సర సరోవరానికి వెళ్ళటం

 మళ్ళీ పుష్పకమెక్కి పరివారం తో దండకాటవి సోయగాలను తిలకిస్తూ పంచాప్సర సరోవర తీరం చేరి ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని సంకల్పించారు .సీతారాములు అప్సర నాట్య గానాలు తిలకించి సంతోషించారు .కాని అప్సరసలు మాత్రం ఎవరి కంటికీ కనిపించలేదు .అందులోని రహస్యాన్ని రాముడు అగస్త్య మునినిని తెలియ జేయమని కోరాడు .’’రామా ! సర్వజ్నుడివి నీకు తెలియని విషయమే లేదు. నాద్వారా వినాలనే నువ్వు అడిగావు .చెప్తున్నాను విను ‘’పూర్వం గంధర్వ రాజు పుత్రికలు అయిదుగురు మనోహరా౦గులై రజస్వలలు కాకపూర్వం ఈ సరోవరం లో క్రీడించారు .ఇంతలో సరోవరం నుండి ఏడుగురు నాగకన్యలు కూడా బయటికి వచ్చి జలక్రీడలాడుతున్నారు .ఇలా నాగ గంధర్వకన్యలకు బాగా పరిచయాలు పెరిగిపోయాయి .సరస్సు ఒడ్డున తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరునికి వీరి జలక్రీడల వలన తపో భంగం కలిగింది .ఆయన వారందరినీ సరస్సు వద్దకు రావద్దని గట్టిగా చెప్పాడు .చపల చిత్తం కల అకన్యలు ముని మాట లక్ష్యపెట్ట లేదు. దేవేంద్రుడు కూడా వారిని ప్రోత్సహించి మరికొంతమంది అప్సరసలను అక్కడికి పంపి ముని సహనాన్ని పరీక్షించాడు .ఏంతో కోపం వచ్చిన వీళ్ళకు శాపం ఇస్తే తన తపస్సు వృధా అవుతుందని ముని ఆగుతున్నాడు .ముని జలదేవతలను ప్రార్ధించాడు. వారు వచ్చి అయిదుగురు అప్సరసలను నాగ కన్యలను బలాత్కారం గా అక్కడినుంచి తీసుకొని వెళ్లి ఎవరికీ వినపడని కనపడనిని నీటి ఇంటిలోదాచేశారు .హాయిగా తపస్సు చేసుకొని కొంతకాలానికి ఆ ముని స్వర్గం చేరుకొన్నాడు ..వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు నృత్య గీతాలాపన కొనసాగిస్తున్నారు .అదే నువ్వు వింటున్నది .నువ్వు వారిపై దయతో వారిని సంతుస్టూలను చేయి ‘’అన్నాడు .

ముని ఆజ్ఞను ఔదల దాల్చి శ్రీ రాముడు లక్ష్మణ స్వామిని తన ధనుర్బాణాలను వెంటనే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు  తాను వెళ్లి జలదేవతను శిక్షించి నాగకన్యల చేర విడిపిస్తానని అన్నాడు .అన్న చెప్పినట్లు తమ్ముడు చేశాడు. చాపం చేత బూని ధనుస్టంకారం చేసి బాణాన్ని సంధించ టానికి సిద్ధ పడ్డాడు  రాముడు .అప్పుడు భూమి కంపించింది  చండమారుతం వీచింది ,దిక్కులన్నీ దుమ్ము కమ్మి చీకటి పడినట్లయింది .చుక్కలు రాలిపడి పోతున్నాయి .ప్రళయ భీకర రామ ధనుస్టంకారానికి భయపడిన జలదేవాతలు భయపడి తాము దాచి ఉంచిన కన్యలనందరిని వెంట బెట్టుకొని రామ దర్శనానికి వచ్చారు .రామపాదార విన్దాలపై పడి ప్రణమిల్లారు .సర్వాలంకార శోభితులైన పన్నెండుమంది నాగ కన్యలను శ్రీరామునికి సమర్పించారు .రాముని పాదాలపై వ్రాలిన జల దేవతలు రామునితో ‘’శ్రీ రామా !మా అపరాధం క్షమించు .బాణాన్ని ప్రయోగించవద్దు .సూర్య వంశాజులెవ్వరూ స్త్రీలపై బాణ ప్రయోగం చేయలేదు .నువ్వు కూడా గంగా తీరం లోసీతాదేవి ప్రతిజ్ఞ చేసినప్పుడు  బాణం ప్రయోగించకుండా భూదేవిని రక్షించిన కరుణా సముద్రుడివి .తాటకిని చంపానుకదాఅని నువ్వు ప్రశ్నించ వద్దు .పాపులను  సంహరించటం తో బ్రహ్మ హత్యా పాతకం రాదనీ నీకు తెలుసు ‘’అని భయ భక్తులతో ప్రార్ధించారు .సంతోషించిన రాముడు వారి మాటల విశేషానికి నవ్వి బాణాన్ని తూణీరం లో నుంచి బయటికి తీయలేదు .జలదేవతలు రాముని పూజించారు .వారిని స్వస్థానాలకు వెళ్ళిపొమ్మని రామాజ్న .అప్పటికే అక్కడికి చేరిన నాగ ,గంధర్వులు సీతారామ అగస్తులను అభినందించి రామునికి కానుకలు అందించి మనోహర వాక్యాలతో ప్రశంసిస్తూ .

      నాగ గంధర్వులు శ్రీరాముని ప్రార్ధించటం

‘’రాజీవాక్షా !ఈ కన్యలు రజస్వల కాని కన్నెలు .వీరందరూ నీ పుత్రికలుగా భావించు .వీల్లనందర్నీ నీ పుత్రులకు ఇచ్చి వివాహం చేసి కన్నెచెర విడిపించు .నీవలన మాకులాలు పవిత్రమయ్యాయి .’’రాముడు వారికి అలానే చేస్తానని వాగ్దానం చేసి వారినిపంపేశాడు .అగస్త్యుదు రామునితో  ‘’రామా  !నువ్వు  వైకుం ఠానికి  వెళ్ళేటప్పుడు కుముదుని చెల్లెలైన కుముద్వతిని కుశుని ధర్మ పత్నిగా ఏర్పాటు చేయి .ఈ చంపిక కు మగ పిల్లలు పుట్టరు .కుముద్వితి వలన కుశునికి అతిధి అనే కొడుకు జన్మిస్తాడు అతడే రాజ్యానికి ఉత్తరాదికారి అవుతాడు .వంశ వర్ధనుడౌతాడు .ఇప్పుడు కుశుడు తప్ప మిగిలిన లవుడు మొదలైన వారికి నాగ కన్యలను ఏడుగురిని విధి విధానంగా వివాహం చేయించే ఏర్పాటు చేయి .నీ కొడుకు యూప కేతువు ఇంకొక అమ్మాయిని రాక్షస వివాహం చేసుకొంటాడు .అతని సమర్ధత వలన వచ్చే భార్యకూడా మంగళాంగి అవుతుంది .వారికి కొడుకులు మనుమలు కలుగుతారు .నీకొడుకులు కోడళ్ళు అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు .మనుమలు మునిమనుమలను కళ్ళారా చూసి వారి సౌభాగ్యాన్ని గమనించి సంతృప్తి చెంది అప్పుడు మాత్రమె నువ్వు  వైకుంఠానికి సపరివారంగా వెళ్ళాలి ‘’అని ఆదేశించాడు రాముడు చిరునవ్వుతో ముని ఆజ్ఞను శిరసా వహిస్తానన్నాడు .కన్యల పేర్లను అడిగి తెలుసుకొన్నాడు రాముడు .వారే చంద్రిక ,చంద్ర వదన ,చంచల ,చపల ,అచల ‘’అని తెలియజేశారు గంధర్వులు .ఆ తర్వాత నాగుల నడిగి ఆ కన్యల పేర్లు ‘’కంజానన,కంజ నేత్ర , కంజాంఘ్రి ,కలావతి ,కళిక ,కమల ,మాలతి ‘’అని తెలుసుకొన్నాడు .వారందరి మనోభావాలను తెలుసుకొని వారికి తనకుమారులతో వివాహం మనస్పూర్తిగా ఇష్టమే నని గ్రహించాడు .అందరిని పుష్పకం ఎక్కించి సుఖ నిద్రపోయారు .మర్నాడు ఉదయం స్నానాదికాలు నిర్వహించి అగ్ని హోత్రాన్ని అర్చించి గాంధర్వ నాగ జనాన్ని చూసి రాముడు ‘’ఈ జనం తో నేను నాగ గాంధర్వ స్వర్గ లోకాలకు మనుష్యలోక వాసినైన నేను రావటానికి యోగ్యుడినికాను .కనుక నామాట విని మీరు మీ స్వస్థానాలకు వెళ్లి పోయి ,ఈ కన్యల వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా మళ్ళీ అయోధ్యాపురికి విచ్చేసి  కళ్యాణాలనులను తిలకించి పులకించి మా ఆతిధ్యాన్ని స్వీకరించి మమ్ములనందరిని ఆనందింప జేయండి ‘’అని చెప్పి అయోధ్యకు చేరాడు .

  వీరందరి వివాహం ఎలా జరిగిందో కిందటి ఎపిసోడ్ లో తెలుసుకొన్నాం కదా .ఇక స్వస్తి

 ఆనంద రామాయణం ప్రధమ సంపుటం లోని విశేషాలు ఇంతటితో సమాప్తం .

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురుక్రుపతోనే ఆత్మజ్ఞానం -స్వరూపానంద ,రవిశంకర్ ”జ్ఞాన దీపిక ”,మానవుడు -దానవుడు -అవధూత

Inline image 1

 Inline image 3
 
 
Inline image 2


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంత్రార్ధం తెలియాలి -శ్రీ అరవిందరావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఎండ టు ది పవర్ ఆఫ్ ఎండ

Inline image 1

 
 
 
Inline image 2


 
 
Inline image 3

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆనంద రామాయణ విశేషాలు -9

ఆనంద రామాయణ విశేషాలు -9

                     పన్నెండు పెళ్ళిళ్ళు

ఒక రోజు రామ రాజు  సింహాసనం  పై ఆసీనుడై జ్యోతిశాస్త్ర పండితులను పిలిపించి ,కులగురువు వశిస్టమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి కూర్చో బెట్టి ,నాగ గాంధర్వ పురోహితులనూ ఆహ్వానించి తన 7 గురు కుమారులకు దివ్యమైన వివాహ ముహూర్తాన్ని నిర్ణయించమని అర్ధించాడు .అందరు పండితులు తమలో తాము సంప్రదించుకొని ఏకగ్రీవం గా ‘’వైశాఖ మాసం లో శుక్ల పక్షం లో ఒక ముహూర్తాన్ని దానికి పదిహేను రోజుల్లో కృష్ణ పక్షం లో మరో ముహూర్తాన్ని సూచించారు .అలాగే జ్యేష్టమాసం లోకూడా శుక్ల పక్షం లో ఒకటి కృష్ణ పక్షం లో మరొకటి దివ్యమైన ముహూర్తాలని సెలవిచ్చారు ,మార్గశిరమాసం లోనూ రెండు ,మాఘ మాసం లో మూడు ముహూర్తాలున్నాయని చెప్పారు .ఇలాగ పన్నెండు ముహూర్తాలు పన్నెండుమందికన్యలకు తగి ఉన్నాయని సెలవిచ్చారు .మళ్ళీ అందరూ కలిసి వసిస్టూలవారి తో సంప్రదించి శ్రీరామునికి నివేదించారు .లవునికి ,అంగదునికి వైశాఖ మాస ముహూర్తాన్ని ,చిత్రకేతు ,పుష్కరులకు జ్యేష్టమాస ముహూర్తాన్ని ,వేర్వేరు పక్షాలలో బాగున్నాయని నిర్ణయించారు .తక్షుడికి సుబహువుకు మార్గ శిరమాస ముహూర్తాలు భేషుగ్గా ఉన్నాయన్నారు .యూపకేతువుకు ,అంగదునికి ,చిత్రకేతువుకు మాఘ మాస ముహూర్తాలు కుదిరాయన్నారు పుష్కర ,తక్షక ,సుబాహువులకు ఫాల్గుణ మాస మూడు ముహూర్తాలు తగినవిగా ఎంచారు .ఇలా రాజకుమారులు 12 మందికి 12 శుభ ముహూర్తాలు నిర్ణయించారు జ్యోతిశ్శాస్త్ర పండితులు .వారిని రాముడు ఘనంగా సన్మానించాడు .

      జ్య్తోతి ష్ శాస్త్ర పండితులు మహర్షి వసిస్టూడు ,గాంధర్వ నాగ పురోహితులు అందరూకలిసి శ్రీరాముని సన్నిధానానికి చేరి గాంధర్వ ,నాగ కన్యలను పెళ్లి కుమారులకు చక్కగా పంచారు . కన్జానన  ను లవునికి ,కంజాక్షి ని అంగదునికి కన్జాంఘ్రిని చిత్ర కేతువునికి ,కలావతిని పుష్కరునికి ,కాలిక ను తక్షునికి ,కమలను సుబాహునికి ,మాలతిని యూప కేతువునకు ,ఇచ్చి వివాహం చేస్తే చక్కని పొంతన ఉంటుందని తెలియ జేశారు .ఈ విధం గా ఏడుగురు నాగ కన్యలకు తగిన వరులను నిర్ణయించి చెప్పారు .తర్వాత చంద్రికను అంగదునికి ,చంద్రాస్యను చిత్ర కేతువుకు ,చంచలను పుష్కరుడికి ,ఆచలను సుబాహువుకు ఇచ్చి వివాహం చేస్తే  దాంపత్యం  అన్యోన్యంగా వర్ధిల్లుతుందని చెప్పారు .సంతోషించిన రాముడు అందరిని సముచితంగా సత్కరించిపంపి సీతా దేవికి ఈ విషయ౦ వర్తమానం పంపాడు .

         ఏడుగురు కొడుకులకు పన్నెండు మంది కన్యలతో వివాహం చేసిన తండ్రి శ్రీరాముడు

 రాజకుమారుల వివాహవార్త దేశమంతటా చాటించగా అశేష జన సందోహం అయోధ్యకు వచ్చి చేరుకొన్నది. ఎక్కడ చూసినా జయ జయ ద్వానాలే .రాజవీదులన్నీ క్రిక్కిరిసిపోయాయి .అందరికి తగిన వసతి సౌకర్యాలు కల్పించారు .రాక్ష సేనతో విభీషణుడు ,వానర సేనతో సుగ్రీవుడు ,ఇద్దరు కొడుకులతో భూరి కీర్తి ,సపరివారంగా జనక మహారాజు తమ్ముడు ,యుదాజిత్తు తో సహా విచ్చేశారు .ఎవరికీ ఏ లోపం లేకుండా మంత్రులు ఏర్పాట్లు అద్భుతంగా చేశారు .

 శ్రీరాముడు వైశాఖ శుక్లపక్షం లో పురోహిత ,బంధు మిత్రులతో మంగళ స్నానాలు చేశాడు .లవకుమారునికి మంగళ స్నానాలు చేయించి పెండ్లికోడుకును చేయించాడు వ.ధువు చే  సువాసినీ పూజ జరిపించాడు .సీతాదేవి మిగిలిన రాణులు అభ్యంగన స్నానాలు చేశారు .దివ్యాభరణాలతో శోభాయమానంగా అల౦కా రాలు చేసుకొన్నారు .మంగళ వాద్య ధ్వనులు మిన్నులు ముట్టు తున్నాయి .శ్రీరాముడు పురోహితుల సహాయం తో శ్రీ మహా గణపతి పూజ చేశాడు .తర్వాత పున్యాహవాచనం నవ గ్రహ పూజ చేశాడు .మునులన్దరిని ఉచిత రీతిలో సత్కరించాడు .ముహూర్త సమయానికి ముందే నాగ రాజులున్న విడిది ఇంటికి చేరుకొన్నాడు ..లవకుమారుని నాగకన్య కన్జనయనకు శాస్త్రోక్తంగా ముహూర్త సమయానికి వివాహం చేశాడు .నాలుగవ రోజున లవుడు మంగళ మంటపం లో శోభాయమానం గా విరాజిల్లాడు .రాముడు స్వగృహం లో లవుని చేత శ్రీమహా లక్ష్మీపూజ చేయించాడు .అనేక దానాలు ఇప్పించాడు .వివాహానికి తరలి వచ్చిన నాగ యక్ష గాధర్వ పౌరజనం అంతా రామునికి నూతన వస్త్రాభరణాలు చదివించి పూజించి ధన్యులయ్యారు .లక్ష్మణుడిని కుశుడిని సన్మానించారు .రాజ పత్నులు ,మిత్రపత్నులు గంధర్వ పత్నులు వేర్వేరుగా సీతాదేవి మొదలైన రాజ పత్నులను సత్కరించారు .వారందరికీ సీతా దేవి యధోచిత సత్కారాలు చేసింది .ఇలా వైశాఖ మాస శుక్లపక్షం లో రాముడు లవుని వివాహం చేసి అందరికి ఆనందం కలిగించాడు .

     వైశాఖ కృష్ణ పక్షం లో రాముడు అంగద వివాహం మహా వైభవం గా నిర్వహించాడు .జ్యేష్టమాసం లో శుక్ల ,కృష్ణ పక్షాలలో చిత్ర కేతు ,పుష్కరులకు పెళ్ళిళ్ళు ఘనం గా చేశాడు .సమస్త రాజులను సత్కరించి మర్యాద చేసి పంపాడు .మళ్ళీ మార్గ శిరమాసం వివాహాలకు రావాలని కోరాడు .మళ్ళీ అందరి సమక్షం లో మార్గశిరమాసం లో తక్షకునికి సుబాహువుకు వైభవోపేతం గా కళ్యాణాలు జరిపించాడు .మాఘ మాస వివాహాలకు ఆహ్వానించి యూప కేతువు అంగదుడు ,చిత్రకేతువు లకు ఘనంగా వివాహాలు నిర్వహించి వచ్చినవారందరినీ  వెనక్కి వెళ్ళకుండా అయోధ్యలోనే ఉంచుకొని ఫాల్గుణ మాసం లో పుష్కర,తక్షక ,సుబాహువుల పెండ్లిండ్లు మహా వైభవోపేతంగా జరిపించాడు .ఈ విధంగా తన ఏడుగురు కుమారులకు పన్నెండుమందికన్యలతో వివాహం జరిపించి రికార్డ్ సృష్టించాడు రాముడు .ఈ కళ్యాణాలు జగదానంద కారకాలుగా ,బ్రహ్మానందం గా జరిగినందుకు దేవ యక్ష గాంధర్వ నాగ ,రాక్షస వానర సమూహాలన్నీ పరమానంద భారితులయ్యాయి .అందరినీ శ్రీరామ పరివారం సగౌరవం గా సత్కరించి మర్యాదలతో వీడ్కోలు పలికి రాముని గొప్పతనానికి వన్నె తెచ్చారు .వారందరూ అయోధ్యను ,రాముని వదలలేక వదలలేక వెళ్ళారు .  సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2

ఆనంద రామాయణ విశేషాలు -7

శివుడు చేసిన రామ స్తవం -2

భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం తం భక్తి ప్రియం భాను కుల ప్రదీపం –భూతాది నాదం భజామి రామం భవ రోగ వైర్యం –సర్వాది పత్యం రణరంగ ధీరం సత్యం చిదానంద సుఖ స్వరూపం –సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానంద మహం భజామి –కార్యం క్రియా కారణ మప్రమేయం కవిం పురాణం కమలాయ తాక్షం –కుమార వేషం కరుణామయం తం కల్ప ద్రుమం రామమహం భజామి –త్రైలోక్య నాధం సరసీ రుహాక్షం దయానిదిం ద్వంద్వ వినాశ హేతుం –మహాబలం వేద నిధిం సురేశం సనాతనం రామమహం భజామి –వేదాంత వేద్యం కవిమీశితారం అనాది మధ్యంత మచింత్య మాద్యం –అగోచరం నిర్మల మేక రూపం పరాత్పరం రామమహం భజామి –

అశేష వేదాత్మక మాది దేవ మజం హరిం రామ మనంత మూర్తిం –అపార సంవిత్సుఖమేక రూపం నమామి రామం మనసః  పరస్తాత్ –తత్వ స్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత మేకమేవ –రాజాదిరాజం రవి మండలస్తం విశ్వేశ్వరం రామ మహం భజామి –యోగీంద్ర సంఘై రపి సేవ్యమానం నారాయణం నిర్మల మాదిదేవం –నతోస్మి నిత్యం జగదేక నాధం హరిం చిదానంద మయం ముకుందం –అశేష విద్యాదిపతిం నమామి రామం పురాణం తమసః పరస్తాత్ –విభూతిదం విశ్వ సృజం విరాజం రాజేంద్ర మీశం రఘునాధ నాధం  –అచింత్య మవ్యక్త మనంత రూపం జ్యోతిర్మయం రామమాహం భజామి  సమస్త సాక్షిం తమసః పరస్తాత్ –మునీంద్ర గుహ్యం పరిపూర్ణ మేకం కలానిదిం కల్మష నాశ హేతుం –పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహాతోమహాంతం –బ్రహ్మ  విష్ణుశ్చ రుద్రశ్చదేవేంద్రో దేవతాస్తధా –ఆదిత్యాది గ్రహిస్చైవ త్వమేవ రఘు నందనః –తపస రుషయస్సిద్దా స్సాధ్యాస్చ మునయస్తదా –విప్రా వేదాశ్చ యజ్ఞాశ్చ పురాణం ధర్మ సంహితాః – వర్ణాశ్రమా స్తదా ధర్మా వర్ణ ధర్మ స్తధైవచ –నాగ యక్ష్మాస్చ గంధర్వా దిక్పాలాది గజాదిశః –వసవోస్తౌత్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః –తరకా ద్వాద శాదిత్యా స్త్వమేవ రఘునాయకః –సప్త ద్వీపా స్సముద్రాశ్చ నదానద్య స్తదా ద్రుమాః –స్థావరా జ౦గ మాస్చైవ త్వమేవ రఘునందనః –దేవా తిర్యజ్మనుష్యా ణాం దానవానాం దివౌకసాం –మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందనః –శాంతం సర్వ గతం సూక్ష్మం పరబ్రహ్మ సనాతనం –రాజీవ లోచనం రామం ప్రణమామి జగత్పతిం –తతః ప్రసస్సా శ్రీరామః ప్రోవాచ  వృషభధ్వజం  ‘’

అని శివుడు రాముడిని స్తుతించాడు .విన్న శ్రీరాముడు పరమానందం తో పరమేశుని అభినందించి ప్రసంనుదనైనానని ఏదైనా వరం కోరుకోమన్నాడు ..రాం స్మరణ తో తానూ ధన్యుదనయ్యానని తెలిపి తనకు ‘’అద్వైత జ్ఞానం ‘’బోధించమని  రామపాదార విందా సేవలో ధాన్యం యెట్లు చేయమని వేడాడు .కాని రాముడు శివుడికి వేరే వరం ఇచ్చి అనుగ్రహించాడు .శివుడు చేసిన ఈ రామస్తుతి విన్నా చదివినా పారాయణ చేసినా ఉత్తమ లోకప్రాప్తికలుగుతుందని ఫల శృతి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం

రెండుముక్కలాట

తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’

సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు  నేను బెజవాడలో మండిపోతున్నాను .నీది బలిసిన రాష్ట్రం నాది బక్క రాష్ట్రం .అందరూ తలాచేయి విదిలిస్తే బతికి బట్టకడతాం .ఏడాది అయిందికాని హామీలేతప్ప ఆచరణే లేదు .నెలకి మూడు సార్లు బాబు మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ‘’చేపిందేమీ’’ లేదు బాబు ఉట్టికెగరలేకపోయినా స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నాడు .ఇదీ మా పరిస్తితి .అందుకని’’ తెలంగాణా అమ్మను’’ నువ్వు తీసుకొని హైదరాబాద్ లో జాగ్రత్తగా చూసుకో .అమ్మకి అన్నీ కావాలి .అన్నిటిమీదా కోరికలున్నాయి .మీరు బలిసిఉన్నారు . మా సొమ్మంతా నొక్కేసి కుక్కేసుకొన్నారు .కనుక అమ్మ నీది .నాన్న నోట్లో నాలుక లేనివాడు .ఉన్నా లేకున్నా సర్దుకు పోతాడు .నాన్న బరువు నాకేమీ కష్టం కాదు .ఎలాగోఅలా బాబు లాగా బండీ ఈడుస్తాను . మనుషులం వేరైపోతున్నా మనస్సులో ఒకటిగా బతుకుదామని ముక్కలయ్యేటప్పుడు  ముక్కలు చేసేటప్పుడు పెద్దలు చెప్పిన మాటల్ని పాటిద్దాం .బై అమ్మా –వెళ్లి హాయిగా అన్నయ్య దగ్గర బతుకు .ఇక్కడేముంది శివాలయం ?ఫోన్లూ గట్రా చేసుకొంటూ ఉందాం లే ‘’అన్నాడు తమ్ముడు .సరేనని అన్న అమ్మను తమ్ముడు నాన్నను పంచుకొని భరిస్తున్నారు .

సీన్ 2- ‘’ఒరే ! ఒద్దంటే ఆ తెలంగాణా పోరి వెంటబడి ప్రేమించి మా కొ౦పలమీదికి తెచ్చావ్ .ఎగేస్తే  బ్రహ్మ హత్యా దిగేస్తే గోహత్యా లాగా ఉంది మా పని ‘’ అన్నాడొక ఆంధ్రా పుత్ర రత్నం తండ్రి .’’నాన్నా !మనసులు కలవటానికి ఆంధ్రా తెలంగాణా ఏమిటి ?ఇద్దరం ప్రేమించుకోన్నాం .పెళ్లి చేసుకోవాలనుకోన్నాం వాళ్ళ నాన్నకు అమ్మకూ ఇష్టమే మీ అభిప్రాయం కోసమే ఆగాం .లేకపోతె ఏ కోటప్పకొండమీదో లోనో పెళ్లి చేసేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం .మీ మీద గౌరవం తో ఆ పని చేయలేదు .రేపు ఆ ఆమ్మాయి అమ్మానాన్నా వస్తారు. ఇద్దరూ కూర్చుని ఎలా చేయాలో ఆలోచించి మా పెళ్లి చేయండి ‘’అన్నాడు పుత్ర రత్నం .

మర్నాడు ఇరువైపులా వియ్యాలవారూ కూర్చుని మాట్లాడుకొంటున్నారు ఆ వివారాలు –

పెళ్లి కూతురు తండ్రి –బావ గారు ! పెళ్లి ఎక్కడ ఎలా చేయమంటారు ?

పెళ్ళికొడుకు తండ్రి –మీ ఇష్టం బావాజీ ! ఏ సంప్రదాయం లో చేద్దాం ?

పెళ్లి కూతురి తల్లి –ఎలాగో రెండుముక్కలయ్యాం కదా అటూ ఇటూ రెండుద్ధతులూ పాటిద్దాం

పెళ్ళికొడుకు తల్లి –వొదిన గారు మా భేషుగ్గా చెప్పారు .తాంబూలాలు తెలంగాణలో పద్ధతిలో తీసుకొందాం

పె కూ త –అయిడియా బాగుంది వొదినా ! పెళ్లి ఆంధ్రా పద్ధతిలో లాగిద్దాం

పె కొ త –ఒకే వొదినా

పపె కూ త-అయితే కార్యం మాత్రం మా తెలంగాణా విధానం లో ధూమ్ ధాం గా జరగాలి వొదినా

పె కొ త –వెరీ గుడ్ –ఇక హనీమూన్ సంగతి ?

పె కొ తండ్రి –మీది బలిసిన రాష్ట్రం .మావన్నీ లాక్కుని మరీ బలిసిపోయారు .కనుక ఖర్చు అంతా మీరే పెట్టుకొని ఏ సింగపూర్ కో పంపండి .

పె కూ తండ్రి –దాందేముంది బావాజీ ! మొన్నటిదాకా మీరు మేశారు ఇప్పుడు మేము మేస్తున్నాం .తినేవాళ్ళం మారారుకాని  తినటం మారలేదు .అయినా పెళ్లి విషయాలలో ఈ దెప్పుల్లెందుకు లెండి .

పె కొ తం –బాగా చెప్పారు బావగారు .మా రాయల సీమ సరుకు దిమ్పుతాం పెళ్లి రోజున .కంగారు పడకండి .హాయి గా జాయ్ అండ్ ఎంజాయ్ .ఇదే సమన్యాయం అంటే .

సీన్ 3- కుర్రది -ఏరా! ఆన్ద్రోన్నని గీర్వనం సేయమాకు .పాపం ఎంటబడ్డావని ఒకే అనేస్తి .జర- జాగర్త  మీ అమ్మఆంధ్రోల్లంట నా మీదికి వస్తే తెలంగాణా శకుంతల మాదిరి లొల్లి సేస్తా .

కుర్రాడు  -ఎందే నీ మిడిసిపాటు .మా నాన్న తెలంగాణా బిడ్డ తోలు వోలుస్తాడు బిడ్డా ఒళ్ళు జాగ్రత్త .

కుర్రది –అరె అసలు మనకింకా పెళ్ళే కాలేదు అప్పుడే ఈ సోది ఏందిబే

కుర్రాడు –అందుకే నిదానించు .పెద్దోళ్ళు ఏం నిర్వాకం చేశారో మనకొద్దు .మనం మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం .మనకు భేదాలు ఒద్దు .నువ్వూ నేనూ మనం .అంతే .వాళ్లకు మన నడకతో బుద్ధి సెప్పాల .ఆల్లు తప్పు సేశామని సెంపలేసుకోవాల .అదీ మనిద్దరి పధ్ధతి

కుర్రది –ఒకే రా .అంతే మనం ఒక్కటే .ఒక్కటిగా మనం .మనం మనకోసమేకాడు అందరికోసం

కు ,కుర్రాడు –ఒకే బాబా ఒకే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-15- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -8

ఆనంద రామాయణ విశేషాలు -8

శ్రీరాముడు గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళటం

ఒకసారి శ్రీరాముడు సీతా లక్ష్మణ భారత శత్రుఘ్న సమేతుడై పుష్పక విమానం ఎక్కి సూర్య గ్రహణ స్నానానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు .అప్పటికే దేవ గాంధర్వ కి౦పు రుషలాదులందరూ అక్కడికి చేరుకొన్నారు .అన్ని ఆశ్రమాలనుండి మునులూ విచ్చేశారు .నానాదేశ రాజులూ వచ్చారు .శ్రీరాముడు సీతా సమేతంగా గ్రహణ స్నానం చేశాడు .గజ ,తురగ ఉస్ట్ర మొదలైనవానిని దానం గా సమర్పించాడు .రాజులు విలువైన కానుకలు రామునికి సమర్పించారు .సీతా రామ దర్శనానికికై అందరూ ఉవ్విళ్లూరుతున్నారు .జానకీదేవి రాజపత్నులను ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలతో వారిని సంతృప్తి పరచింది .మునిపత్నులకు నమస్కరించి ఉచితాసనాలపై వారిని కూర్చుండ బెట్టింది .

సీతా లోపాముద్ర సంవాదం

సీతాదేవి ముని పత్నులఎడ చూపుతున్న గౌరవ మర్యాదలకు పొంగిపోయిన అగస్త్యమహర్షి భార్య లోపాముద్ర సీతను ఆమె పెండ్లి నాటినుండి ఇప్పటివరకు జరిగిన కధను  వివరించమని  కోరింది .సీత అన్ని విషయాలు ఆసక్తికరంగా వివరించింది .అంతా విన్న లోపాముద్ర ‘’జానకీ !అంతా బాగానే ఉంది .కాని ఒక విషయ౦  లో మీ ఆయన అనవసరంగా కష్టపడ్డాడేమోనని పించింది  .సముద్రంపై సేతువును కట్టటానికి అంత కష్టపడాలా ? మావారు కు౦భసంభవులు అగస్త్యమహర్షికి చెప్పి ఉంటె ,ఆ సముద్ర జలాన్ని మూడు గుక్కల్లో తాగేసి లంకకు దారి ఏర్పరచేవారుకదా?కోతిమూకకు సేతువుకట్టే శ్రమ ఉండేదికాదు కదా ?’’అని సన్నాయి నొక్కులు నొక్కింది .లోపాముద్రా దేవి చాలా గర్వంతో తనభర్త అగస్త్యమహర్షి గొప్పతనాన్ని గురించి చెప్పిందని గ్రహించిన సీతా దేవి నవ్వి ఆమెతో ‘’తల్లీ అగస్త్య అర్ధాంగి లోపాముద్రా దేవీ !నా భర్త శ్రీరాముడు సేతువును చాలా తేలికగానే సక్రమంగానే కట్టారు .మీరు కూడా వినండి రాజపత్నులారా ! సవివరంగా ఆ విషయం మీ అందరికి వివరిస్తాను .శ్రీరాముడు మీరు అనుకొన్నట్లు చేతకాని వాడేమీకాదు.రామ బాణం ఎక్కు పెట్టి సముద్రుడిని శోషింప జేయగల మహా  సమర్ధుడు నా రాముడు .కాని అలా చేస్తే సాగరం లోని అనేక జీవ రాశులకు అపాయంకలిగి హత్యా దోషం కలుగుతుందని సందేహించాడు .ఒక వేళ రాముడు ఆకాశ గమనం తో సముద్రాన్ని దాటితే అప్పుడు రావణుడు శ్రీరాముని మనుష్యమాత్రునిగా ఎలా భావిస్తాడు ?ఇదీకాక భక్తుడైన హనుమ వీపుమీద ఎక్కి సాగర ఉల్లంఘనం చేసి లంకకు వెళ్ళగల సమర్దుడే కదాఅంటారేమో  ! అప్పుడు రామ పౌరుషాన్ని లోకం ఏ విధంగా భావిస్తుంది ?పోనీ ఈదుకుంటూ సముద్రం దాట వచ్చు కదా అని అనుకొంటే ‘’బ్రాహ్మణ మూత్రం అయిన సముద్రాన్ని మనం దాట రాదు’’ అని శంకించాడు .-‘’పీతోయం జలధిః పూర్వం శ్రుతం క్రోదా దగస్తినా –మూత్ర ద్వారా ర్బహిస్త్యస్త సమాత్ క్షారత్వ మాగతః –సర్వదా మూత్రవత్ క్షారస్స కదం పాతు మర్హతి –స రుషి ర్మమ వాక్యేన చులకం తు కరిష్యతి ‘’.

‘’అయినా మీ ఆయన మా ఆయన చేత ప్రార్ధనీయుడే .కాదన లేను .నీ భర్త అగస్త్యముని కోపంతో ఈ సాగరాన్ని పానం చేశాడని విన్నాను.లోకాలు తల్లడిల్లి మహర్షిని ప్రార్ధిస్తే తన మూత్రం ద్వారా సాగరాన్ని బయటికి వదిలాడని లోకానికి తెలిసిన విషయమేకదా.అందుకే తీయగా ఉండే సముద్రజలం అగస్త్య మూత్రం తో  ఉప్పగా మారి క్షార జలధి అనే పేరు వచ్చింది .ఈ సంగతి నీకు తెలియనిదికాదు .’’మూత్రపానం బ్రాహ్మణేన స్వకార్యార్ధం నిజొక్తిభిః ‘’ అలాంటి మూత్ర రూప సాగరాన్ని నా భర్త  ఇక్ష్వాకు ప్రభువు రాఘవ స్వామి మళ్ళీ ఎలా పానం చేస్తాడమ్మా!ఒక వేల నువ్వు హితం చెప్పినట్లే నేను నా రాముని నీ భర్త అగస్త్యమునిని వేడుకొని సముద్రజలాన్ని ‘’చులికీక్రుత సర్వ పాదోది జలం’’గా చేయమని కోరినా ,అయన అంటే నీ భర్త అగస్త్యుడు మళ్ళీ ఎల్లా తన మూత్రాన్నే పానం చేయగలడు?’’ఇది లోక ధర్మ విరుద్ధంకదా మాతా ! లోకం  ఏమను కొంటుంది?  ‘’రాముడు సొంత కార్యం కోసం పాపం  నిష్టా గరిస్టూడైనబ్రాహ్మణుడి చేత  స్వమూత్ర పానం చేయించాడు ‘’అనే లోక నింద పడమంటావా .అపకీర్తి మూట గట్టుకోమంటావా ? ! ఇది న్యాయమా ?అందుకే రాముడు ధర్మ స్వరూపుడు కనుక నీ భర్త అగస్త్యుని ప్రార్ధించలేదు . ఇన్ని రకాలుగా అలోచించి వానర మూకల చేత సేతు బంధాన్ని చేయిన్చాడుధర్మ మూర్తి రామ మూర్తి .ఇంతవరకు ఎవరూ చేయని సాహసం చేసి సేతు నిర్మాణం గావించి చిరకీర్తి పొందాడు రాముడు .ఏ రామునిచేత సముద్రం లో రాళ్ళు సంతరి౦ప బడ్డాయో అలాంటి వాడు కదా’’ దాశరధి’’ అని నా భర్త శ్లాఘింప బడ్డాడు  కీర్తింప బడ్డాడు !‘’అని సీతా సాధ్వి సవినయంగా మనవి చేసింది .లోపాముద్ర ఈ సమాధానికి  ఓడిపోయి తలవంచుకొని నిలబడింది .మునిపత్ని ఖిన్నురాలుకకుండా ఆమెపై తన కున్న అపూర్వ గౌరవాన్ని ప్రకటిస్తూ లోపాముద్రాదేవిని యధోచితంగా సత్కరించి మిగిలిన మునిపత్నులనూ పూజించి అందరి ఆశీస్సులు అందుకొన్నది .ఇంకా మునిపత్ని మనసులో ఏమైనా కోపం ఉందేమోనని సీతాదేవి ఆమె చెంతకు చేరి ‘’అమ్మా లోపాముద్రా దేవీ ! పరమ పవిత్రురాలివి నువ్వు .నేను చాలా అపరాధం చేశాను .అంత పరుషంగా నేను మాట్లాడి ఉండి ఉండాల్సినదికాదేమో . ప్రసంగ వశం లో, పరవశం లో శ్రీరామ గుణగానాన్ని చేశాను .ఆయన పౌరుషాన్ని ప్రకటించాను. అంతే నీ మీద నాకు ఏ విధమైన ద్వేష భావమూ లేదు .మహర్షి అగస్త్యులవారివలననే నా భర్త శ్రీరామునికి అంతటి పరాక్రమ పౌరుషాలు లభించాయని నాకు తెలుసు .నన్ను మన్నించమ్మా మనసులో ఏమీ భేదభావం నాపై ఉంచుకోకు తల్లీ  ‘’అని పాదాలపై పడి ప్రార్ధించి స్వస్త చిత్తను చేసి యధోచిత సత్కారాలు అందించి లోపాముద్రాది మునిపత్నులకు  వీడ్కోలు పలికింది సీతా సాధ్వి .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7

ఆనంద రామాయణ విశేషాలు -7

శివుడు చేసిన రామ స్తవం -2

భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం తం భక్తి ప్రియం భాను కుల ప్రదీపం –భూతాది నాదం భజామి రామం భవ రోగ వైర్యం –సర్వాది పత్యం రణరంగ ధీరం సత్యం చిదానంద సుఖ స్వరూపం –సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానంద మహం భజామి –కార్యం క్రియా కారణ మప్రమేయం కవిం పురాణం కమలాయ తాక్షం –కుమార వేషం కరుణామయం తం కల్ప ద్రుమం రామమహం భజామి –త్రైలోక్య నాధం సరసీ రుహాక్షం దయానిదిం ద్వంద్వ వినాశ హేతుం –మహాబలం వేద నిధిం సురేశం సనాతనం రామమహం భజామి –వేదాంత వేద్యం కవిమీశితారం అనాది మధ్యంత మచింత్య మాద్యం –అగోచరం నిర్మల మేక రూపం పరాత్పరం రామమహం భజామి –

అశేష వేదాత్మక మాది దేవ మజం హరిం రామ మనంత మూర్తిం –అపార సంవిత్సుఖమేక రూపం నమామి రామం మనసః  పరస్తాత్ –తత్వ స్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత మేకమేవ –రాజాదిరాజం రవి మండలస్తం విశ్వేశ్వరం రామ మహం భజామి –యోగీంద్ర సంఘై రపి సేవ్యమానం నారాయణం నిర్మల మాదిదేవం –నతోస్మి నిత్యం జగదేక నాధం హరిం చిదానంద మయం ముకుందం –అశేష విద్యాదిపతిం నమామి రామం పురాణం తమసః పరస్తాత్ –విభూతిదం విశ్వ సృజం విరాజం రాజేంద్ర మీశం రఘునాధ నాధం  –అచింత్య మవ్యక్త మనంత రూపం జ్యోతిర్మయం రామమాహం భజామి  సమస్త సాక్షిం తమసః పరస్తాత్ –మునీంద్ర గుహ్యం పరిపూర్ణ మేకం కలానిదిం కల్మష నాశ హేతుం –పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహాతోమహాంతం –బ్రహ్మ  విష్ణుశ్చ రుద్రశ్చదేవేంద్రో దేవతాస్తధా –ఆదిత్యాది గ్రహిస్చైవ త్వమేవ రఘు నందనః –తపస రుషయస్సిద్దా స్సాధ్యాస్చ మునయస్తదా –విప్రా వేదాశ్చ యజ్ఞాశ్చ పురాణం ధర్మ సంహితాః – వర్ణాశ్రమా స్తదా ధర్మా వర్ణ ధర్మ స్తధైవచ –నాగ యక్ష్మాస్చ గంధర్వా దిక్పాలాది గజాదిశః –వసవోస్తౌత్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః –తరకా ద్వాద శాదిత్యా స్త్వమేవ రఘునాయకః –సప్త ద్వీపా స్సముద్రాశ్చ నదానద్య స్తదా ద్రుమాః –స్థావరా జ౦గ మాస్చైవ త్వమేవ రఘునందనః –దేవా తిర్యజ్మనుష్యా ణాం దానవానాం దివౌకసాం –మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందనః –శాంతం సర్వ గతం సూక్ష్మం పరబ్రహ్మ సనాతనం –రాజీవ లోచనం రామం ప్రణమామి జగత్పతిం –తతః ప్రసస్సా శ్రీరామః ప్రోవాచ  వృషభధ్వజం  ‘’

అని శివుడు రాముడిని స్తుతించాడు .విన్న శ్రీరాముడు పరమానందం తో పరమేశుని అభినందించి ప్రసంనుదనైనానని ఏదైనా వరం కోరుకోమన్నాడు ..రాం స్మరణ తో తానూ ధన్యుదనయ్యానని తెలిపి తనకు ‘’అద్వైత జ్ఞానం ‘’బోధించమని  రామపాదార విందా సేవలో ధాన్యం యెట్లు చేయమని వేడాడు .కాని రాముడు శివుడికి వేరే వరం ఇచ్చి అనుగ్రహించాడు .శివుడు చేసిన ఈ రామస్తుతి విన్నా చదివినా పారాయణ చేసినా ఉత్తమ లోకప్రాప్తికలుగుతుందని ఫల శృతి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచం లోనే గజరాజు తొలి సేల్ఫీ -గజరాజు చేసిన అద్భుతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment