విరామ చిహ్నం -సతీష్ చందర్ కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టి టి డి భారత వ్యాఖ్యానం ప్రామాణి కమైనదెనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభ్యుదయానికి ఆసరా ఎస్ వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68

105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

విద్య –గ్రంధ రచన

బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి వేదాంత శాస్త్రి పట్టాలను సాధించాడు .అమెరికాలోని కాలిఫోర్నియా లోఉన్న బెర్కిలీ యూని వర్సిటి నుండి భాషా శాస్త్రం లో పి.హెచ్.డి ని ..’’ముర్రే బి ఎమన్యు ‘’గైడెన్స్ లో చేశాడు .సంస్కృత ఆంగ్లాలలో బహు రచనలు చేశాడు .సంధ్య ,పాధేయ శతకం ,వీణ అనే సంస్కృత పద్యకావ్యాలు ,రాయసా ,సీమా అనే నవలలు  మహా భారతమలో కవిత్వ మూలాలు అనే గొప్ప పరిశోధనాత్మక విశ్లేషణాత్మక గ్రంధం రాశాడు .ఎన్నో వైద్య గ్రంధాలను అనువదించాడు .మహాకావ్యలను ,పురాణాలను అనువాదం చేశాడు .ఇండాలజీ(భారతీయ చరిత్ర సాహిత్యం వేదాంతం సంస్కృతీ ) పై జరిగిన ఎన్నో సెమినార్ లలో పాల్గొని అనేక పరిశోధనా పత్రాలను రాసి వెలువరించాడు .

పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడెమి నుండి సంస్కృతం లో అవార్డ్ అందుకొన్నారు .భాషా సాహిత్య పరిషద్ అవార్డ్ ,ధిల్లీ సంస్కృత అకాడేమి అవార్డ్ లను పొందాడు .కృష్ణ కాంత్ హాన్దీక్ మెమోరియల్ అవార్డ్  సంస్కృత భాషా వ్యాప్తికి చేసిన సేవకు లభించిది బిర్లా ఫౌండేషన్ వాచస్పతి పురస్కారాన్ని అంద జేసింది  .రాయల్ ఎసియాటిక్   సొసైటీ ,అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ లలో విశిష్ట సభ్యులుగా నియమిం పబడి గౌరవం పొందారు

దర్భంగలోని కామేశ్వర సింగ్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా 1974-80కాలం లో పని చేశాడు రాం కరణ్ శర్మ .వారణాసి లోని సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి కి కూడా ఉప కులపతిగా 1984నుండి ఒక ఏడాది సేవ  చేశాడు .అమెరకా  లోని చికాగో ,కొలంబియ ,పెన్సిల్వేనియా యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .

రాం కరణీయం

రాం కరణ్ శర్మ సంస్కృతం లో సంధ్య ,పాధేయ శతకం ,వీణా ,కవిత ,సర్వం సహా కావ్యాలను రాశాడు .రాయిసం సీమ అనే సంస్కృత నవలలు రచించాడు .ఇంగ్లీష్ లో elementsof poetry in Mha Bharata ,Anthology of midieval Indian literature,Researches in Indian and Buddhist philosophy (essays in honour of Professor Alex wayman )రాశాడు ఇవికాక శివ సహస్ర నామ శతకం ,శివ సుఖీయం ,గగన వాణి,చరక సంహిత ,రేజు వెనతీవ హితకారే –ఆయుర్వేద ,సర్వ మంగళ సుమనోమల ,దీపికా –ఇవి కాక గణేశ పురాణం ను స్వీయ సంపాదకత్వం లో వెలువరించాడు .

అంతర్జాతీయ భావ వ్యాప్తికి శర్మ అనేక సెమినార్ లను దేశ విదేశాలలో నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి విద్యా సలహా దారుగాఉన్నాడు  ,ఎన్నో విశ్వ విద్యాలయాలు గౌరవ సలహాదారుగా శర్మ సేవలను వినియోగించుకొన్నాయి.

Inline image 1  Inline image 2 Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

104-      సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది

విద్యాభ్యాసం

మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి వెళ్లి సంస్కృతాన్ని అభ్యసించాడు .సంస్కృత పూర్వ ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి సాహిత్యా చార్య  సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందాడు రాయపూర్ లోని రవి శంకర యూని వర్సిటి లో పి హెచ్ డి సాధించాడు .మధ్య ప్రదేశ్ జబల్పూర్ యూని వర్సిటి నుండి  డి లిట్ పొందాడు .ప్రతిభా విశేషం తో సంస్కృత ఆచార్య పదవిని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో పొంది 1977-95వరకు నిరాఘాటం గా పద్దెనిమిదేళ్ళు పని చేశాడు .ఈ విశ్వవిద్యాలయ  ‘’డీన్’’గా రెండు సార్లు సేవలందిం చాడు రేవాప్రసాద్ ద్వివేది .వారణాసిలో ‘’కాళి దాస సంస్థాన్ ‘’ఏర్పరచిన ఘనత ద్వివేదీదే .

రేవా ప్రసాదీయం

రేవా ప్రసాద్ సంస్కృతం లో ‘’సీతా చరిత్రం ‘’ స్వాతంత్ర సంభవం ‘’అనే మహాకావ్యాలు రాశాడు .మొదటగా ‘’ఉత్తర సీతా చరితం ‘’మొదలు పెట్టి1956నుండి పన్నెండేళ్ళు 1968వరకు రాశాడు .ఇది రామాయణాన్ని అనుసరించి రాసినదే .ఉత్త్తర రామాయణ కద ఉంది .దీన్ని ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్తితులనుస్పృశిస్తూ దేశ భక్తీ ప్రపూర్వాకం గా  రాశాడు . 1991లో రెండవ మహాకావ్యమయిన ‘’స్వాతంత్ర్య సంభవం ‘’కు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .ఇందులో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ను విపులంగా వర్ణించాడు .అణుయుగం పై రాసిన సంస్కృత కవితలను ‘’ప్రమతః ‘’పేరు తో ప్రచురించాడు .మధ్య ప్రదేశ్ జీవన వాహిని అయిన రేవా అంటే నర్మదా నదిని స్తుతిస్తూ   ‘’శ్రీ రేవా భద్ర పీఠం ‘’ అనే కావ్యాన్ని రాశాడు .శత పత్రం అనే కవిత సంపుటిని ,’’యూతిక’’అనే నాలుగు అంకాల నాటకాన్ని రేవా రాశాడు .కావ్యాలంకారిక ,నాట్యాను శాసనం ,సాహిత్య శరీరం అనే మూడు అలంకార శాస్ట్ర గ్రంధాలను సంస్కృతం లో రాశాడు .వీటిపై తానె హిందీలో వ్యాఖ్యానాలు రాశాడు .1976లో కాళిదాస సమగ్ర సాహిత్యాన్ని ముద్రించాడు .కాళిదాసకృత ఋతు సంహార ,రఘు వంశ కావ్యాలపై సమగ్ర వ్యాఖ్యానం రాశాడు ద్వివేదీ .సంస్కృత అలంకార శాస్త్రాలపై  హిందీ లో వ్యాఖ్యానాలు రాశాడు .

ప్రసాద్ కు పురస్కారాలు

1978లో రాష్ట్ర పతి పురస్కారం అందుకొన్నాడు .స్వాతంత్ర్య సంభవ కావ్యానికి సాహిత్య అకాడెమి ,కల్పవల్లి ,వాచస్పతి ,శ్రీవేణిలనుండి   నాలుగు పురస్కారాలు లభీంచాయి .అలంకార శాస్త్ర రచనకుమహా మహోపాధ్యాయ  పి .వి కాణే పురస్కారాన్ని బంగారు పతాకాన్ని పొందాడు .మధ్య ప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలనుండి మొత్తం తొమ్మిది అవార్డులను అందుకొన్న ఘనత రేవా ప్రసాద్ ది.భోపాల్ సంస్కృత అకాడెమి ‘’వ్యాసపురస్కారాన్ని’’ అంద జేస్తే ,రెండు సార్లు మిత్ర పురస్కారం ఒకసారి ‘’భోజ’’ అవార్డ్ గ్రహించాడు .న్యు ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ .మధ్య ప్రదేశ్ కాళిదాససంస్థాన్ ,సంస్కృత అకాడెమీ మొదలైన అనేక సంస్థలు ద్వివేదీని అనేక హోదాలలో నియమించి సేవలు అందుకొన్నాయి .,

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రాణాలతో ఆడుకోకండి

ప్రాణాలతో ఆడుకోకండి

బంతి తో పరుగుల వరద పారుతుంది

బాల్ తో వికెట్లు కూలిపోతాయి

బంతి బౌండరీలు దాటు తుంది

బాల్ వికెట్ ను విసిరి గాల్లోకి లేపుతుంది

బంతి బెయిల్స్ ను డాన్సు చేయిస్తుంది

బాల్ స్పిన్ అయి స్పీడై చెలరేగుతుంది

కాని బంతి ప్రాణాలు తోడేస్తుందని అనుకోలేదు

అదే చేసింది బాల్ –‘’ఫిలిప్ హ్యూస్ ‘’ఊపిరాపేసింది

ఆసీస్ యువ క్రికెటర్ ఆశల ఉసురు తీసింది

చేల రేగుతున్న యువ కిశోరాన్ని కబళించేసింది

దానికేం తెలుసు తాను ఏ ఘోరం చేస్తోందో ?

విసిరిన వేటగాడు గాడు చెప్పాలి సమాధానం .

రెండు జట్ల ను సరిగా ఆడించే వాడు అంపైర్

బంతి అవుతుందను కొంటాడా తన పాలిటి ఫైర్ ?

పాపం ఇస్రాయిల్ అంపైర్’’ హిలేన్ ఆస్కార్ ‘’

బాల్  తగిలి బలైపోయాడు గ్రౌండ్ లోనే

క్రికెట్ ఒక క్రీడారంగం గా రాణించాలి కాని

రణ రంగం కాకూడదు ఎన్నటికీ

క్రికెట్ ఆటలో బంతికి బలైన హ్యూస్ ,ఆస్కార్ లు

క్రికెట్ రణ రంగ వీరులై వీర స్వర్గం పొందారు

వారిద్దరి మృతికి గుండె భారం తో కన్నీటి తర్పణమిద్దాం

బంతి తో ఆడుకోండి కాని ప్రాణాలతో కాదని హెచ్చరిద్దాం .

Inline image 1   Hillel Oscar

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’

Namasthe Telangana Latest News

ఆదివారం
నవంబర్ 30, 2014

ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా

Updated : 11/30/2014 3:30:31 AM
Views : 32
ఆదర్శం
మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే
మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు తెలంగాణ వారు నిర్మాతలుగా 1960లో చివరికి మిగిలేది సినిమా తీశారని
ఇప్పటి దాకా సినిమా చరిత్రకారులు చెబుతూ వచ్చారు. అదంతా నిజమని నమ్ముతూ వచ్చాం. అయితే, హైదరాబాదు స్టేటుగా ఉన్న కాలంలోనే
మద్రాసు వెళ్లి 1952లోనే తెలుగు సినిమా తీసిన తెలంగాణ నిర్మాతల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా వారు తీసిన ఆ సినిమానే ఆదర్శం.

– హెచ్.రమేష్‌బాబు, 94409 25814


ఆదర్శం సినిమాను 1952లోనే తీశారు. దీని నిర్మాతలు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకా కందిబండ, గణపవరం గ్రామాలకు చెందిన దేశ్‌ముఖ్‌లు.

ఈ సినిమా సంగతులు తెలుసుకోవాలంటే 1952కు మరో అయిదేళ్లు వెనక్కు వెళ్ళాలి. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత
అప్పటిదాకా స్వతంత్ర రాజ్యంగా ఉన్న నిజాం స్టేట్‌ని ఇండియాలో విలీనం చేయడానికి ఆయన అంగీకరించని సంగతి తెలిసిందే. దీంతో నిజాం వ్యతిరేక
పోరాటం ఉధృతమైంది. ప్రజలపై అణచివేతకు, దాష్టీకాలకు పాల్పడుతున్న రజాకార్ల దాడులను తప్పించుకునేందుకు ఉద్యమకారులు, ప్రజలు ఇతర
ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ పరిస్థితుల్లో కందిబండ గ్రామ దేశ్‌ముఖ్‌లైన నారపరాజు కుటుంబం జగ్గయ్యపేటకు వెళ్లింది. వీరి వెంబడే గణపవరానికి చెందిన
బంధువులు కూడా అక్కడికి వెళ్లారు.

జగ్గయ్యపేటలో ఉన్నప్పుడే వారికి విజయవాడలో పలు నాటక ప్రదర్శనలు, సినిమాలు చూసే అవకాశం కలిగింది. సినిమా రంగానికి చెందిన వారితో

పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో ఆత్రేయ ఈనాడు నాటకం రాశారు. ఈ ప్రదర్శన విజయవాడలో జరిగింది. ఇందులో ఆయన ఒక ప్రధాన పాత్ర పోషించారు.
హిందూ, ముస్లింల సమైక్యతను ప్రబోధించే ఈ నాటకంలో ఆత్రేయ హిందువు వేషం వేశారు. 1948 జనవరిలో మహాత్మాగాంధీ హత్యానంతరం మారిన దేశ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసిన నాటకం అది.

ఆ నాటకం మన నారపరాజు జానకి రామారావు, తమ్మర వేంకటేశ్వరరావులకు బాగా నచ్చింది. వారికి ఆత్రేయ అభిమాన రచయితయ్యారు. ఆ రోజుల్లోనే

భవిష్యత్తులో వీలైతే ఆత్రేయను రచయితగా తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబర్‌లో పోలీసు యాక్షన్ తరువాత జగ్గయ్యపేటకు
వెళ్లిన మన వాళ్లంతా కోదాడ ప్రాంతాలకు తిరిగి వచ్చి మళ్లీ తమ వ్యవహారాల్లో మునిగిపోయారు. ఆ తరువాత రెండేళ్లకు ఓ రోజు మద్రాసు సినిమా రంగంతో
పరిచయం ఉన్న జగ్గయ్యపేటకు చెందిన గౌరవరం వెంకటరామయ్య నారపరాజు దగ్గరకు వచ్చి మేమంతా వందమందిమి షేర్ హోల్డర్స్‌గా ఏర్పడి సినిమా తీస్తున్నాం.
మీరేమైనా కలుస్తారా? అనడిగారు. ఎందుకో గానీ వందమందితో కలసి ఏం సినిమా తీస్తాం. మేమే సొంతంగా తీస్తాం అని సున్నితంగానే తిరస్కరించారు జానకి
రామారావు. ఆ తరువాత కందిబండ, గణపవరంలో ఉన్న తన బంధువులతో కలసి పదిమంది భాగస్వాములై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది
జరిగింది 1951 జనవరి ప్రాంతంలో. శుభోదయం ఫిలింస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై తమ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటినుండి ఆత్రేయ తమ
అభిమాన రచయిత గనుక ఆయననే సినిమాకు రచయితగా ఏర్పాటు చేసుకున్నారు. కథ, మాటలు, పాటలు ఆయనే రాశారు.

దర్శకుడెవరనే ప్రస్తావన వచ్చినప్పుడు హెచ్.ఎం.రెడ్డి అయితే తారలను, బడ్జెట్‌ను అదుపులో ఉంచి సినిమా తీస్తాడని వెంకట్రామయ్య వెంట వెళ్లి ఆయన్ను

కలిశారు. అప్పుడాయన నేను బిజీగా ఉన్నాను. మీకు మంచి దర్శకుడిని సూచిస్తానని హెచ్.వి. బాబును పరిచయం చేశారు. ఆయననే దర్శకుడిగా
నిర్ణయించారు. ఈ హెచ్.వి.బాబు పూర్తి పేరు హనుమంతప్ప విశ్వనాథ్‌బాబు. ఈయన తొలి తరం సినీ దర్శకులలో ఒకరు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936),
కనక తార (1937), భోజ కాళిదాసు (1940), కృష్ణప్రేమ (1943), ధర్మాంగద (1949) అప్పటిదాక ఆయన తీసిన సినిమాలు. వీటిలో ధర్మాంగద కరీంనగర్‌కు
 చెందిన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్రచారంలో ఉన్న జానపద గాథ. ఈ విషయాలు వేరొక సందర్భంలో ముచ్చటించుకుందాం.

ఆదర్శం సినిమా నటీనటుల సంగతికి వస్తే ప్రధాన పాత్రధారులు అంతా అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వచ్చి స్థిరపడుతున్న వారే. హీరోలు కొంగర జగ్గయ్య,

 రామశర్మలు కాగా, నాయికలుగా షావుకారు జానకి, సావిత్రి నటించారు. ఇతర పాత్రలలో గౌరీనాథశాస్త్రి, వంగర, రామశాస్త్రి, శ్రీవత్స, టి.కృష్ణ, ఇందిరాచారి,
రేవతి, సరస్వతమ్మ తదితరులు నటించారు.

చిత్ర రచయితగా పనిచేసిన ఆత్రేయ ఒక ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ఆయన తెరపై కనిపించిన తొలిచిత్రం కూడా ఇదే. కాగా, ఆ తరువాత

కోడెనాగు, మరో రెండు చిత్రాలలో నటించారాయన.

సాంకేతిక నిపుణులుగా సి.హెచ్.యి. ప్రసాద్ (కళాదర్శకత్వం), అన్నయ్య (ఛాయాగ్రహణం), అశ్వత్థామ (సంగీత దర్శకత్వం), ఎం.వి.రాజన్ (ఎడిటింగ్) తదితరులు

 పనిచేశారు. సినిమా ముగింపుకు వచ్చేసరికి హెచ్.వి.బాబు తప్పుకోవడంతో మిగిలిన దృశ్యాలను ఎం.వి.రాజన్, టి.కృష్ణలు డైరెక్ట్ చేశారు. టైటిల్స్‌తో దర్శక
నిర్మాతలుగా శుభోదయ ఫిలింస్ అని వేశారు.

ఇక నిర్మాతలుగా పదిమంది సంయుక్తంగా శుభోదయ పతాకంపై నిర్మించారని ముందుగానే చెప్పుకున్నాం. వారంతా వరుసగా నారపరాజు జానకి రామారావు,

తమ్మర వేంకటేశ్వరరావు (వీరిరువురూ మేనేజింగ్ డైరెక్టర్లు), కోదాటి వెంకట అప్పారావు, నారపరాజు లక్ష్మీ నరసింహారావు (నాబీరామ), కె.వి.లక్ష్మీనారాయణరావు,
కె.వి.రాజగోపాలరావు, కె.వి.వరదారావు, కె.వి.నరసింహారావు, కె.వి. సీతారామారావు, ఎస్.జె.వి.రామారావులు.

ఈ చిత్రంలో బాలనటుడిగా నిర్మాతల్లో ఒకరైన జానకి రామారావు కొడుకు సుగుణాకర్‌రావు నటించాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కృష్ణహరే శ్రీకృష్ణహరే పాటలో

ఇందిరాచారి వొడిలో కూర్చున్న బాలుడు సుగుణాకరరావే. వైద్య ఆరోగ్యశాఖలో నౌకరీ చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వీరు ఇప్పుడు హైదరాబాదులో
ఉంటున్నారు. అలాగే, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు కూడా నగరంలోనే ఉన్నారు. కాగా, 1974లోనే జానకి రామారావు కాలం చేశారు.

ఆదర్శం ఇతివృత్తం

స్థూలంగా సినిమా కథలోకి వెళితే… భారతదేశ స్వాతంత్య్ర సమయంలో పాకిస్థాన్ విభజన జరిగి మత కలహాలు రేగినపుడు పంజాబ్‌లో నివాసముంటున్న ఒక

తెలుగు కుటుంబం అల్లర్లకు బలవుతుంది. అందరూ పోగా అన్నా చెల్లెళ్లయిన రూప్, కామిని మాత్రం ప్రాణాలతో మిగిలి పారిపోతారు. మార్గమధ్యంలో రూప్ తప్పి
పోతాడు. కామిని ఎన్నో తంటాలు పడి మద్రాసు చేరుకుని ఒక నాటక సమాజంలో చేరుతుంది. మద్రాసులో ఉన్న శరణార్థుల శిబిరం సహాయార్థం నాటకాలు
వేస్తుంటారు. కామిని తనను తాను రక్షించుకోవడానికి మగవేషంలో తిరుగుతుంటుంది. ఈ విషయాన్ని నాటక సమాజంలో హీరోగా వేస్తున్న కుమార్ గుర్తిస్తాడు.
అటు తప్పిపోయిన రూప్, చెల్లెలిని వెదుకుతూ మద్రాసు వస్తాడు. బతుకు తెరువు కోసం ఒక సంగీత పరికరాల దుకాణంలో పనికి చేరతాడు.

నాటక సమాజం అధిపతి దయానిధి కూతురు శశి ఫిడేలు కొనాలని అక్కడికి వస్తుంది. తనకు సంగీతం నేర్పేందుకు అతనిని కుదుర్చుకుంటుంది. వీరిరువురు

ప్రేమలో పడ్తారు. అటు దయానిధి అక్రమాలను కుమార్ ఎండగట్టడంతో నాటక సమాజం నుండి అతను కామినితో సహా బయటికి వస్తాడు. కుమార్ కొత్తనాటక
సమాజం నెలకొల్పి వూరూరా నాటకాలాడి అంతటా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అటు కుమార్ విడిచిన నాటక సమాజంలో రూప్ చేరి నాటకాలాడితే రాళ్లు
విసురుతారు. ఇంతలో కుమార్, కామిని విడిపోవలసి వచ్చి ఏకంగా తనకు తెలీకుండానే స్వయాన అన్న రూప్‌తో పెళ్లికి వొప్పుకుంటుంది. దుఃఖంతో ఆత్మ
హత్యకు యత్నిస్తుంది. చివరికి కథ సుఖాంతమవుతుంది.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ఉన్నత ఆదర్శాలతో తీసిన ఆదర్శం చిత్రం 1952 డిసెంబర్ 25న విడుదలైంది. కానీ, బాక్సాఫీసు వద్ద ప్రేక్షకాదరణ లభించలేదు.


1952లోనే తీశాం:
చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు మాటల్లోనే ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1951 మార్చిలో మద్రాసు వెళ్లి సంవత్సరాంతానికి సినిమా పూర్తి

చేద్దామనుకున్నాం. కానీ, 1952 డిసెంబర్‌లో పూర్తయింది. దీనికి దర్శకునికి కథపై పూర్తిస్థాయి పట్టులేకపోవడం ఒక కారణమైతే, మధ్యలో మాకు రావలసిన
డబ్బు సకాలానికి రాకపోవడం, డిస్ట్రిబ్యూటర్‌కి కొన్ని ఆర్థిక సమస్యలు రావడం వీటన్నిటి వల్ల చిత్రం ఆలస్యంగా విడుదలైంది. నిర్మాణ వ్యయం పెరగడంతో
సినిమా నష్టాలు తెచ్చి పెట్టింది. దాంతో మేమంతా మద్రాసు వదిలి వచ్చేశాం. దాని నెగెటివ్ ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ఆ తర్వాత మరో సినిమా తీయలేదు.

అయితే, ఆదర్శం సినిమా ఆర్థికంగా అపజయం పొందవచ్చు. కానీ, టి.కృష్ణ వంటి ఎడిటింగ్, డైరెక్షన్‌లో గొప్ప పేరొందిన టెక్నీషియన్‌ని, ఆ తరువాత రాష్ట్ర స్థాయి

నంది, జాతీయ స్థాయి అవార్డులు పొందింది. అంతేకాదు, ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం వంటి చిత్రాలు తీసిన బి.ఎస్.నారాయణ, తొలిజాతీయ ఉత్తమ సంగీత
దర్శకుడి అవార్డు అందుకున్న ఎం.వి.రాజు వంటి తెలంగాణకు చెందిన వారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసి చరిత్రలో మైలురాయి వంటి సినిమాగా
నిలిచింది ఆదర్శం.

మన తొలి తెలుగు సినిమా తారాగణం
జానకి – జగ్గయ్య
సావిత్రి – రామశర్మ
రేవతి – ఆత్రేయ
ఇందిరాచార్య, గౌరినాథశాస్త్రి
వంగర, సరస్వతమ్మ
శ్రీవత్స, టి.కృష్ణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొబ్బిలి యుద్ధం కు యాభై ఏళ్ళు

bobbili1 001 bobbili2 001 bobbili3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

  • – సి. విజయలక్ష్మి
  • 20/10/2014
TAGS:

భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. శివ అన్నా శివలింగంపైన కాసిని నీళ్లు పోసినా, మారేడు దళం వేసినా చాలు శివుడు అత్యంత ప్రీతుడై వారిని తన దరికి చేర్చుకుంటాడు. కైలాసంలో తన ప్రక్కనే కూర్చునబెట్టుకొంటాడు. అలాంటి శివుడు కేవలం మానవులు స్తుతిస్తేనే ప్రీతి చెందుతాడనుకొంటే పొరపాటే. ఎందుకంటే శివుని మనసార స్మరించిన జంతువులకుకూడా మోక్షం లభించినదన్న శివభక్తకథలు మనకు కనిపిస్తాయి. శ్రీకాళహస్తి క్షేత్రం కూడా ఈ విషయానికే తార్కాణంగా నిలిచిఉంది. అంతటి దయాళువు అయిన శంకరుని పూజించని వారు ఎవరు ఉంటారు! శివ అనని నోరు నోరే కాదు సుమా అన్న శివభక్తుల మాట నిజమే!
ఒకానొకకాలంలో భక్తవత్సలుడైన శివుడిని ఓ విప్రుడు అమితమైన ఇష్టంతో పూజించేవాడు. నిరంతరం శివనామస్మరణతో కాలయాపన చేసేవాడు.కార్తికమాసం వచ్చిందంటే ఉపవాసాలు, అభిషేకాదులతో శివుని అనుగ్రహం పొందటానికి శాయశక్తులా శ్రమించేవాడు. అలాంటి విప్రుడు ఓ కార్తిక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యలో శివోపాసన చేయటానికి ఉపక్రమించి మారేడు దళానే్వషణకు వెళ్లాడు. ఎక్కడ చూచినా చంద్రుడు అగుపిస్తున్నాడు కాని మారేడు వృక్షమే ఆ విప్రునకు కనిపించలేదు. విసిగిన ఆ విప్రుడు ఆ శివుడు నాకు మారేడు దళాలతో పూజించటానికి అవకాశం ఇవ్వకపోతే నేనేమి సేతు లింగా… అనుకొని ఇంటి ముఖం పట్టాడు. అలా తిరుగు ముఖం పట్టిన ఆ ద్విజునకు ఎదురుగా మారేడు వృక్షం కనిపించింది. ‘ఓహో శివానుగ్రహం నాకు కలిగింది. ఇదిగో ఈ బిల్వవృక్షమే దానికి చిహ్నం’ అనుకొని ఎంతో సంతోషంతో మారేడు వృక్షం నుంచి దళాలను తెంపపోయాడు. అంతే అక్కడే క్షుద్బాధతో ఉన్న ఓ సింహం నరవాసనను పట్టింది.పెద్దగా గ్రాండించుకుంటూ ఈ విప్రుడున్నచోటికి రాబోతోంది. దీన్ని చూచిన విప్రుడు నిరుత్తుడయ్యాడు. ఇక జీవితాశ ఇక లేదు అనుకొంటూ గబగబా మారేడు చెట్టు ఎక్కాడు. అక్కడే అమ్మా పార్వతీ తండ్రీ శివా నన్ను రక్షించండి. ఈ పులి నుంచి నన్ను కాపాడండీ అంటూ ఎలుగెత్తి పిలుస్తున్నానుకుంటూ మనసుననే మొరపెట్టుకుంటున్నాడు. ఆ వ్యాఘ్రరాజము చెట్టుకిందనే నిలిచి పైకి విప్రునకేసి చూస్తూ గాడ్రిస్తోంది. భయంతో బిర్రబిగిసిన విప్రుడు చేసేదేమీ లేక శివనామమే నన్ను రక్షించాల్సింది ఇక ఎవరూ నన్ను రక్షించలేరు అనుకొంటూ కన్నీటితో శివనామస్మరణ చేయసాగాడు. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆకలితో నకనకలాడే కడుపుతో పులి చెట్టుకింద కూర్చుంది. చెట్టుకొమ్మను ఆసరాచేసుకొన్న విప్రుడూ శివనామస్మరణచేస్తూనే నిత్యమూ తాను చేసే పూజనే మానసికంగా చేయసాగాడు. మానసికంగా శివలింగానికి మారేడు దళాలను సమర్పిస్తున్నట్లుగా భావించసాగాడు. కాని, నిజానికి తాను తెంపిన దళాలను కిందనున్న వ్యాఘ్రంపై పడవేయసాగాడు కొద్దిసేపటికి నైవేద్యాలు సమర్పించినట్లుగాను, నీరాజనాలు పలికి ఆత్మప్రదక్షిణ నమస్కారాలు కూడా మానసికంగానే చేసేసాడా బ్రాహ్మణుడు పూజ చేసేశాననుకొంటూ కళ్లు తెరిచి చూడగా వర్తమానంలోని పులి మారేడు దళాలతో కప్పబడి చలనం లేకుండా ఉంది. ఒకవేళ పులి వెళ్లిపోయిందేమో ఈ మారేడు దళాలన్నీ నేను చేసిన పూజలోని భాగాలేనా అనుకొంటూ శబ్దం లేకుండా చెట్టుదిగి ఏమీ చేయడానికి పాలుపోక ఊరిలోనికి పరుగెత్తాడు. అక్కడున్నవారికి రాత్రి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ సంగతి విన్న యువకులు, గ్రామపెద్దలు కర్రలు, కత్తులు పట్టుకొని అడవికి విప్రునితో వచ్చారు. అక్కడున్న మారేడుదళగుట్ట వారికి కనిపించింది. ఇదే నేను ఉన్న మారేడు చెట్టు , అవే నేను పూజించిన దళాలు వాటికింద పులి వుంది అని చెప్పగా కొందరు మెల్లగా మెల్లగా దూరం గా నిల్చుని ఆ మారేడు దళాలను తొలగించసాగారు. అలా తొలగిస్తున్నప్పుడు పులి చర్మం కూడా తొలిగిపోయింది. వారంతా ఆశ్చర్యంతో చూస్తుండగా పులి వున్న ప్రదేశంలో పానవట్టంతో కూడిన శివలింగం వారిని ఆనందచిత్తులను చేసింది. ఆ రాత్రే ఆ ప్రాంత (పెద్దాపుర) సంస్థానాధీశ్వరునికి కలలో కనిపించి శివుడు ఫలాన మారేడు వృక్షం క్రింద వ్యాఘ్ర శరీరంనుంచి తాను ఉద్భవించినట్లు తనకో ఆలయనిర్మాణం చేపట్టుమని ఆదేశించాడట. ఆ సంస్థాన ప్రభువు తన పరివారంతో అక్కడికి అపుడే చేరుకున్నాడు. అక్కడ జరిగిన సంగతిని తెలుసుకొని తనకు వచ్చిన కలను అక్కడి వారికి తెలియచేశాడు. వారంతో ఎంతో సంతోషంగా వ్యాఘ్రశరీరంనుంచి ఆవిర్భవించిన శివుడు కనుక ఈ శివుణ్ణి వ్యాఘ్రేశ్వరునిగా కొలుద్దామని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి శివునికోసం ఆలయ నిర్మాణం చేశారు. అందుకే ఈ ఆలయానికి వ్యాఘ్రేశ్వరాలయం అనే వాడుక వచ్చింది. ఈ వ్యాఘ్రేశ్వర స్వామిని పుల్లేటి కుర్తివారు అర్చకులుగా ఉంటూ తరతరాలుగా స్వామిని సేవిస్తున్నారు. ఈ ఆలయంలో వ్యాఘ్రేశ్వరునితోపాటుగా శ్రీ రుక్మిణీ సత్యాసమేత గోపాలస్వామి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడుకూడా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న ఇరుసు మండ గ్రామంలో రాముని ప్రతిష్ఠగా భావించబడుతున్న బాలా త్రిపుర సుందరీ సమేత ఆనంద రామేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయం, ఓంకారేశ్వరాలయం కూడ మనం దర్శించుకోవచ్చు.
ఇంతకీ ఈ వ్యాఘ్రేశ్వరాలయం అంబాజీపేటకు అతిసమీపంలో, రాజమండ్రికి వెళ్లు ప్రధాన రహదారిలో, ఇంకా సులభంగా చెప్పాలంటే పుల్లేటి కుర్రు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది.
ఈ ఆలయంలో కార్తికామాసంలో ప్రత్యేకారాధనలు జరుగుతాయ. మహాశివరాత్రి లాంటి ప్రత్యేకమైన దినాల్లో ఇక్కడి జరిగే శివపూజ కనుల పండుగగా సాగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం శివానుగ్రహాన్ని పొందటం ఈ క్షేత్రంలో పరిపాటిగా జరుగుతున్నదే నంటారు ఇక్కడి స్థా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

  • – దాసరి దుర్గాప్రసాద్
  • 24/11/2014
TAGS:

సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రం అలరారుతుంది. యాగంటి అతి పురాతన శైవ క్షేత్రం. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడికోసం యాగంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. అతనికి ఓ రోజు ఓ పెద్దపులి కనిపించింది. అది సాక్షాత్తు శివుడే అని గ్రహించిన చిట్టెప్ప ‘నేగంటి శివుని నేగంటి’ అని ఆనందంగా అరిచాడు. దాంతో ఆ ప్రదేశానికి ‘నేగంటి’ అనే పేరు వచ్చి క్రమంగా అది ‘యాగంటి’గా రూపాంతరం చెందింది.
నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే యాగంటి దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. శివమహాదేవుడు ఈ క్షేత్రాన్ని తన నివాస స్థలంగా చేసుకోవడానికి కారణం ఇదే. యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. అడుగడుగూ ఆధ్యాత్మికానుభూతులతోపాటు విశేషమైన పౌరాణిక గాథలతో ముడిపడి ఉన్న క్షేత్రమిది.
15వ శతాబ్దంలో విజయనగర రాజైన హరిహర బుక్కరాయలు యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం వచ్చిన రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.
ఈ ఆలయానికి ముందు పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి దాటుకుని ముందుకి వెళితే అల్లంత దూరంనుంచే ఆలయ రాజగోపురం తేజో విరాజమానమవుతుంది. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో ఇది అలరారుతుంది. మెట్లమీదుగా ఈ రాజగోపురాన్ని దాటి భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ ఒకపక్క అలనాటి రాతి శాసనాలు, ఎదురుగా ధ్వజస్థంభము, దృష్టి మండపం మనకు గోచరిస్తాయ. ఈ మండపంలో శివలింగమొకటి ఉంది. గర్భాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇక్కడ కొలువుదీరిన ఉమామహేశ్వరస్వామిని సాక్షాత్తు అగస్త్యుడు ప్రతిష్టించాడు. పానవట్టంపై ఉన్న లింగం మీద శివపార్వతుల మూర్తులున్నాయి. అగస్త్యుని అభీష్టం మేరకు ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివార్లు కొలువుదీరారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి. ఆ స్వామి ఇక్కడ మరోపక్క ఆలయ ప్రాంగణంలో కొలువుదీరాడు. శివుని అంశతో పుట్టిన వీరభద్రస్వామి సర్వాభరణ భూషితమై శోభాయమానంగా కానవస్తాడు. స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
వెనకవైపు భాగంలో కేదారేశ్వరస్వామి మందిరం ఉంది. ఈ కేదారేశ్వరస్వామి దర్శనం పంచమహాపాతకాలను దూరం చేస్తుంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడూ కొలువుదీరాడు.ఇక్కడి పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అంటారు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చిందంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో వుండడమేఇక్కడి విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయవౌతాయని అంటారు. ఇక్కడవేంకటేశ్వరస్వామి గుహ ఉంది. దీనిని చేరుకోవడానికి సోపాన మార్గం ఉంది. ఈ గుహలో అగస్త్యమహర్షి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. యాగంటిలో తొలుత ప్రతిష్టించాలనుకున్న విగ్రహమిదే. ఈ విగ్రహంలోని ఒక భాగం ఇప్పటికీ భిన్నమైనట్లు భక్తులు గమనించవచ్చు. దీనిని పక్కగా శంకర గుహ ఉంది. దీనిని రోకళ్ళ గుహ అని కూడా అంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ గుహలోనే తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని చెబుతారు. ఈ గుహలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం అచ్చెమ్మ విగ్రహంతోపాటు శంకర లింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఉన్న మరో ప్రధానాకర్షణ ఇక్కడున్న బసవన్న విగ్రహం. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఉదహరించిన నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నంది విగ్రహం రోజురోజుకి పెరుగుతుంటుంది. ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.
ఇక యాగంటిలో కాకి కనిపించదు. కారణమేమిటంటే- పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యమహర్షి అక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సుచేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతారు.
ఈ ఆలయానికి కుడివైపువున్న కొండమీద దాదాపు నూట యాభై అడుగుల ఎత్తున అనేక ప్రకృతి సిద్ధమైన గుహలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి. 12మెట్లు ఎక్కి వెళ్తే ముందర అగస్త్య గుహవస్తుంది. అగస్త్యుడు ఇక్కడ చాలాకాలం తపస్సు చేసాడని ప్రతీతి. ఇదేకాక యాగంటిలో మరికొన్ని గుహలు ఉన్నాయి. ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే మహత్తర క్షేత్రం యాగంటి. ఇక్కడి శ్రీ ఉమామహేశ్వరస్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

===============
యాగంటికి మార్గం
కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం వుంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నూలు వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులో చేరుకోవచ్చు. అలాగే బనగానపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. వసతి సౌకర్యం: యాగంటిలో బస చేయడానికి వసతి సౌకర్యం వుంది. సత్రాలు, కాటేజీలు ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
===============

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ వాణి.. భవాని

మానవీయ వాణి.. భవాని

  • -సుధామ
  • 29/11/2014
TAGS:

సృజనకాంతి
(సి.్భవానీదేవి సాహిత్య వివేచన)
సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి,
వెల: రూ.350/-
హిమబిందు పబ్లికేషన్స్, 102,
గగనమహల్ అపార్ట్‌మెంట్స్,
దోమల్‌గూడ, హైదరాబాద్- 29;

నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా – డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, తన గ్రంథాలకు సంతరించబడిన పీఠికలతో తెచ్చిన ‘సృజనకాంతి’ ఒకటి. భవానిగారి కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవిత చరిత్ర ప్రక్రియా రచనలను వివేచిస్తూ డబ్భైమందికి పైగా వివిధ సాహితీవేత్తల రచనలు ఇందులో వున్నాయి.
పలు ప్రక్రియల్లో రచనాకృషి సల్పినా చేపట్టిన ప్రతి ప్రక్రియలో తనదైన సృజన కాంతిని వెలయించారు భవానిగారని ఇందులోని వ్యాసాలు విశదపరుస్తున్నాయి. దాదాపు పది కవిత్వ గ్రంథాలు వెలువరించిన భవానిగారిది తాత్త్విక సౌధం మీది కాంతిపుంజంగా మునిపల్లెరాజు, వర్తమాన దుఃఖంలో రగిలిన సంవేదన అని విహారి, సామాజిక రుగ్మతల కవిత్వీకరణ అని కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ప్రగతిశీల కవిత్వ జలపాతం భవానిదేవి అని ఎస్వీసత్యనారాయణ, స్ర్తివాద కవిత్వం లో బలమైన గొంతుక అని ఆచార్య ఎస్వీరామారావు అభినందించారు. మానవీయవాణి భవాని అని డా.ఎన్.గోపి పేర్కొన్నారు. గోపిగారు సృజించిన ‘నానీలు’ ప్రక్రియలో రచన చేసిన తొలి మహిళ భవానిగారే.
వివాహమా ఎంత పనిచేశావ్!
నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్
అన్న ఆవిడ ‘నాని’ నోచుకున్న ప్రాచుర్యం అంతాఇంతా కాదు. భవాని నానీలు, హైదరాబాద్ నానీలు ఆ ప్రక్రియను ఆమె వేగవంతం చేసిన కృషికి నిదర్శనం. ఇక భవానిగారి లలిత గీతాల కవిత్వం భక్తిరక్తి మాలికలంటారు శారదా అశోక్‌వర్థన్. వాటిని ఆమని ఆ ముఖంగా సంభావించారు డా.వడ్డెపల్లి కృష్ణ. భవానిది మనలను మనకు గుర్తుచేసే కవిత్వం అంటారు ఎన్‌క్యూబ్. అంతరంగ చిత్రాలు, అమ్మానన్ను క్షమించొద్దు, ఆవిడ కథాసంపుటాలు. ‘‘ప్రస్తుతం నెలకొన్న అనుబంధాల్లో రచయిత్రికెన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. ఈ అపశృతులన్నీ మాసిపోయి ఆరోగ్యకరమైన, ఆనందప్రదమైన, ఆదర్శప్రాయమైన సమాజం ఒకటి ఉద్భవిస్తే ఎంత బాగుండునన్నది ఆమె ఆకాంక్ష. పుట్టినప్పటినుంచీ సాహిత్యంచేస్తున్న ఆలోచన కూడా అ దే’’అంటారు మధురాంతకం రాజారాం గారు ఆవిడ కథల గురించి. ‘‘తను వ్రాస్తున్నదానిలో తనకి కల్తీలేని విశ్వాసం ఉండాలి. చమత్కారం, అతితెలివి, అనవసర భేషజం లేకుండా చేసిన రచనలివి’’అని మెచ్చారు తురగా జానకీరాణి.
సాహితీ విమర్శనాప్రక్రియలో స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత- తులనాత్మక పరిశీలన అనేది భవానిగారి గొప్ప సిద్ధాంత రచన. ‘ఆసక్తిని కలిగించే ఆమె అధ్యయనం’వారి సాహితీ విమర్శలో కానవస్తుందని డా.జి.బాలశ్రీనివాసమూర్తి అంటారు. రాసింది రంగస్థలానికి ‘బొబ్బిలియుద్ధం’ అనే ఒక చారిత్రక నాటకం. ఒక మహిళ అలాంటి నాటకం రాసి ప్రదర్శింపచేయడమే ఒక విశేషం! అలాగే బాల సాహిత్యంలోనూ ఆవిడ చేసిన అవిరళకృషిని చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, శైలజామిత్ర ప్రభృతులు ప్రశంసించారు. అలాగే, కొర్రపాటి గంగాధరరావు జీవితం-సాహిత్యం ఒక సార్థక రచనగా వెలయించారు.
ఆర్తిని స్ఫూర్తిచేసుకుని సాహిత్య దాహార్తిని కీర్తిమంతంగా మలుచుకుంటున్న ప్రజ్ఞ్ధారీణి భవాని. వారి ర చనల సాహిత్య వివేచన గ్రంథాన్ని డాక్టర్ సి. ఎస్.ఆర్.మూర్తిగారు సంపాదకులుగా ముందుకు తేవడం ముదావహం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

  • -వెలుదండ నిత్యానందరావు
  • 29/11/2014
TAGS:

శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ
ఉపన్యాసాలు- వ్యాసాలు
సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వెల: రూ.150; పుటలు: 160
ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం
తాళ్ళకాల్వ గ్రామం,
గాండ్లపెంట మండలం
అనంతపురం జిల్లా- 515521

డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటించడం ఈ వ్యాసాల లక్ష్యం. 1929నుండి 1936 వరకు రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవాల్లో విద్వాంసులు చేసిన ప్రసంగాలను, సభల విశేషాలను హరినాథరెడ్డి శ్రీసాధన కౌమోదకి మొదలయిన పత్రికల్లో నుండి సేకరించి పునర్ముద్రించారు. అప్పటివారి భావజాలాలను, ఆ నాటి స్థితిగతులను ఎనబై ఎనిమిదేళ్ళుదాటి వచ్చిన పిదప ఉన్న స్థితిగతులను పోల్చిచూడడానికి ఇలాంటి గ్రంథాలు ఎంతో అవసరం. 1929-2014 మధ్యలో మద్రాసు నుండి విడిపోవడం, ఆంధ్రుల వ్యవహార సరళి పట్ల రాయలసీమవారి భయ సందేహాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, రాయలసీమవారే ఎక్కువ కాలం పరిపాలించినా రాయలసీమ క్షామం, దారిద్య్రం తొలగకపోవడం, తెలంగాణా కలవడం, దోపిడీకి గురికావడం, విడిపోవడం మొదలైన పరిణామాలెన్నో సంభవించాయి. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రత్యేకమైన భిన్నమైన మనస్తత్వాల, సాంస్కృతిక వైరుధ్యాల అపవిత్ర కలయిక ఆంధ్రప్రదేశ్. తెలంగాణ తన దారి తాను చూసుకొంది. ఇదే తరుణంలో పనిలోపనిగా రాయలసీమ కూడ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఉంటే బాగుండేదేమో! బైరెడ్డి రాజశేఖరరెడ్డి లాంటి ఏ ఒకరిద్దరో గొంతు వినిపించారు. కాని అది ఎందుకో పుంజుకోలేదు. భవిష్యత్తులో జరుగబోయే పరిణామమదే.
1926లో వప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో వచ్చిన శ్రీసాధన పత్రిక రాయలసీమ గొంతును బలంగా వినిపించింది. 1929-1932ల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వప్పూరు రామాచార్యులు, చిలుకూరి నారాయణరావు, రొద్దం హన్మంతరావు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కల్లూరి సుబ్బారావు, వార్త కవి రామచంద్రరావు, కడప కోటిరెడ్డి, నాగపూడి కుప్పుస్వామయ్య, గార్లదినె్న సుబ్బారావు, అడవి లక్ష్మీనరసింహరావు లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు పెనుగొండలో 1929 ఫిబ్రవరి 22న జరిగిన కృష్ణదేవరాయ జయంత్యుత్సవ సభలో అన్న మాటలకు నేటికీ ప్రాసంగికత ఉన్నట్లే ఉంది. నిన్నమొన్నటి వరకు రాయలసీమవారే ఆంధ్రులలో నుత్తములు. తూర్పునాటివారన్న యేవగింపు. వారు తండోపతండములుగ వచ్చి యిచట యాచన చేయుచుండెడు పేదలు. కృష్ణానది డెల్టా యేర్పడిన వెనుక వారైశ్వర్యవంతులైరి. మన తుంగభద్ర ప్రాజెక్టు యింకను విట్టి స్థితిలో నున్నదో తెలియదు (పుట.28). మొదటినుండి రాయలసీమ వారికి ఆంధ్రుల పట్ల అనుమానమే ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాపన దగ్గర గొడవ వచ్చింది. రాజధాని విషయమై తగాదా వచ్చింది. శ్రీ్భగ్ ఒప్పందం. ఇంతేగాక బళ్ళారి, హోసూరు లాంటి రాయలసీమ ప్రాంతాలు కర్ణాటకలో కలపడం రాయలసీమ చరిత్రలో క్షంతవ్యంకాని అంశం.
కేవలం కృష్ణరాయల సూచకంగా కాకుండా సంగమ వంశస్థాపకులైన హరిహర బుక్కరాయల నుండి ఆరవీటి వంశీయుడైన అళియరామరాయల దాకా పరిపాలించిన సీమనుద్దేశించి రాయలసీమ అని పేరు పెట్టారట. సీడెడ్ డిస్ట్రిక్ (దత్తమండలం) అన్న కర్ణకఠోరమైన అసభ్య అవాచ్య నామాన్ని తీసేయడానికి నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆనాటి పెద్దలందరు తీర్మానించి వ్యవహారంలోకి తెచ్చారు. (పుట.40). కృష్ణదేవరాయలకు సంబంధించిన అనేక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదువుకోవచ్చు. ఆనాటి రాయలసీమ పెద్దల పేర్లను స్మరించుకొనే అవకాశాన్ని ఈ పుస్తకం కలిగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

  • 30/11/2014
  • — పి.ఎస్.ఆర్.

ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం గుర్తుంచుకోవాలి! అయితే, ఇప్పటికిప్పుడు రుచికరమైన మంచి వంటకం చేయడం సాధ్యమా? – సరిత మదిలో సవాలక్ష సందేహాలు *** అర్జెంటుగా యోగా నేర్చుకోవాలి.. పెళ్లికి ముందే ఊబకాయం తగ్గించుకుని నాజూగ్గా మారాలి.. కానీ, పొద్దునే్న లేవాలంటే విపరీతమైన బద్ధకం.. తనకు యోగా నేర్పే గురువెవరు..? – ప్రియాంకకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి *** మనసులో చెలరేగే భావాలకు అక్షర రూపం ఇచ్చేలా కవితలు, కథలు రాయడమంటే ఎంతో ఇష్టం.. సాహిత్యం, భాషపై మమకారం ఉన్న వారితో తన మనోభావాలను పంచుకోవడం ఎలా? – ఇరవై ఏళ్ల యామినికి ఇదో ఇరకాటం *** … ఇలా ఎనె్నన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నవారికి దిశానిర్దేశం చేస్తూ ‘ఆత్మీయ నేస్తం’గా నిలుస్తోంది- ‘అంతర్జాలం’. వారు, వీరు అనే తేడా లేదు… వయోభేదం అసలే లేదు.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వయోవృద్ధులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారూ నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. ‘అక్షరాలు రాని వారు నిరక్షరాస్యులు’- ఇది నిన్నటి మాట. ‘అంతర్జాలం వాడని వారు అన్నింటా వెనుకబడిన వారే’- ఇది ఇప్పటి మాట. దైనందిన జీవితంతో ఇంటర్నెట్ ఇంతలా పెనవేసుకుపోయింది. ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే పరిగణింపబడుతున్న భారత్‌లో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి మన దేశంలో ‘ఆన్‌లైన్’ వినియోగదారుల సంఖ్య 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తాజా నివేదిక చెబుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాను వెనక్కి నెట్టేసి అంతర్జాల వినియోగంలో రెండోస్థానానికి భారత్ చేరుకోబోతోంది. 600 మిలియన్ల వినియోగదారులతో మొదటి స్థానంలో ఉన్న చైనాను రాబోయే కాలంలో మన దేశం అధిగమించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అన్నింటికీ ఆధారమై… ఉదయం లేచింది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయే వరకూ అన్ని వ్యవహారాలకూ అంతర్జాలంపై ఆధారపడక తప్పని రోజులివి. పలు రకాల పన్నులు చెల్లించాలన్నా, పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా, వంట గ్యాస్ బుక్ చేయాలన్నా, పెళ్లి సంబంధాలు చూడాలన్నా, ఇంట్లోనే కూర్చుని ఎక్కడో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినాలన్నా, రైలు, బస్, విమానం టిక్కెట్లు రిజర్వు చేసుకోవాలన్నా, కొత్తరకం వంటలు నేర్చుకోవాలన్నా, ఆన్‌లైన్ షాపింగ్‌కు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా … ఇలా ఒకటేమిటి? అన్ని రకాల అవసరాలకూ అంతర్జాలాన్ని ఆశ్రయించాల్సిందే. ఇంటర్నెట్ సేవలు ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు అంచనాలకు మించి విస్తరిస్తుండగా మరోవైపు సెల్‌ఫోన్ల వినియోగం తప్పనిసరైంది. అంతర్జాలానికి అనుసంధానంగా ‘సెల్‌ఫోన్ ఆధారిత టెక్నాలజీ’ అన్ని వర్గాల వారిలో అనూహ్య మార్పులు తెస్తోంది. వ్యక్తిగతానికే కాదు, సామాజిక ప్రయోజనాలకూ వెబ్‌సైట్లు దోహద పడుతున్నాయి. మహారాష్టల్రో ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్‌ఐవి వ్యాధి ప్రభావంపై గ్రామీణులకు అర్థమయ్యేలా మొబైల్ ద్వారా సైన్స్ పాఠాలు బోధిస్తోంది. పాఠశాలల్లో పిల్లల హాజరీపై ఏరోజుకారోజు తల్లిదండ్రులకు ఒడిశా ప్రభుత్వం సందేశాలు పంపుతోంది. గుజరాత్‌లో ‘ఇ-మమతా హెల్త్’ పేరుతో గర్భిణులకు ఆరోగ్య సూత్రాలను మెసేజీల ద్వారా అందజేస్తున్నారు. అవినీతిని, అరాచకాలను ఎదిరించే వారికి నేడు సామాజిక వెబ్‌సైట్లు పదునైన ఆయుధాలు. వీడియో టేపుల్ని యూట్యూబ్‌లోకి ఎక్కిస్తూ అక్రమార్కుల బండారం బయటపెట్టేందుకూ అంతర్జాలం దోహద పడుతోంది. ఇంటర్నెట్ జీవితాల్ని మార్చేస్తోంది. రాజకీయాలను శాసిస్తోంది. స్వచ్ఛంద సేవకు ఆసరా ఇస్తోంది. ‘లోకల్ టాలెంట్’ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతోంది. అభివృద్ధికి బాటలు వేస్తోంది. విజ్ఞాన కాంతులను వెదజల్లుతోంది. నేర పరిశోధనకు అండగా నిలుస్తోంది. ఇలా ‘అంతర్జాల సాధికారత’ సమాజంపై అపార ప్రభావం చూపుతోంది. ‘ఎక్కడ అంతర్జాలం ఉండునో అక్కడ ప్రగతి వెలుగులు ప్రసరించును..’- ఇది సరికొత్త ఆర్థిక మంత్రం అంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి విషయాల్లో మన దేశం ఇంకా వెనుకబడే ఉన్నా- ఇంటర్నెట్ వినియోగం, సెల్‌ఫోన్ కనెక్షన్ల విషయంలో మాత్రం శరవేగంగా దూసుకుపోతోంది. ఇంట్లో టాయిలెట్ లేకున్నా చేతిలో సెల్‌ఫోన్ తప్పనిసరైంది. మొట్టమొదట- సమాచారం తెలుసుకోవడం, దాన్ని ఇతరులతో పంచుకోవడంతో ప్రారంభమైన అంతర్జాల వినియోగం ఇపుడు ‘జీవితమంత విశాలం’గా విస్తరించింది. అది ఎంతలా మారిందంటే కంప్యూటర్‌కు, స్మార్ట్ఫోన్‌కు జీవితాన్ని అర్పించుకునే పరిస్థితి వచ్చేసింది. ఉదయం నిద్ర లేచాక యోగా పాఠాలు, ఆధ్యాత్మిక విషయాలకు వెబ్‌సైట్ చూడాల్సిందే. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఈ-మెయిల్స్ చూసుకోవడం, ట్విటర్‌లో ట్వీట్లు చదవడం, ఫేస్‌బుక్‌లో మిత్రులను కలుసుకోవడం, ఆఫీసులో ఉన్నా లంచ్ టైమ్‌లో సరికొత్త మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) కోసం అనే్వషించడం, ఇంటికొచ్చాక భార్యతో ముచ్చటిస్తూ ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, నిద్రపోయే ముందు వెబ్‌సైట్ల నుంచి పాత పాటలు, కమ్మటి సంగీతం డౌన్‌లోడ్ చేసుకుని వినడం… ఇలా రోజంతా నీడలా- మన వెంటే ఇంటర్నెట్ అనివార్యమైంది. రాజకీయాలకు వేదికై… భారీ బహిరంగ సభలు, పెద్ద పెద్ద హోర్డింగులు, టీవీల్లో ప్రకటనల వల్ల అధిక వ్యయప్రయాసలు తప్ప అందరినీ ప్రభావితం చేయలేమన్న నిజాన్ని గ్రహించి ఇపుడు రాజకీయ పార్టీలు ఓటర్లను అంతర్జాల వేదికపై ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంతోమంది నేతలు ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఖాతాలు తెరిచి తమ మనోభావాలను ఎప్పటికప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో బహిర్గతం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను వలలో వేసుకునేందుకు- నేరుగా వారికే మెసేజీలు పంపుతూ రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు, నేతల వ్యవహార శైలిపై ఓటర్లు కూడా సామాజిక వెబ్‌సైట్లలో చురుగ్గా స్పందిస్తున్నారు. వాగ్దాన భంగానికి పాల్పడే నేతలను వెబ్‌సైట్లలో పదునైన మాటలతో ఎండగడుతున్నారు. జాతీయ పార్టీలే కాదు, పలు ప్రాంతీయ పార్టీలు కూడా సొంతంగా వెబ్‌సైట్లను నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు తాపత్రయ పడుతున్నాయి. బహిరంగ సభలకు వెళ్లేందుకు, టీవీల్లో ప్రకటనలు చూసేందుకు తీరిక లేని ఓటర్లు కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లకు, ఈ-మెయిల్స్‌కు స్పందిస్తారన్న విషయం గ్రహించి నేతలు సామాజిక మీడియా వైపే మొగ్గు చూపుతున్నారు. ట్విటర్‌లో నేతల కబుర్లు, బ్లాగుల్లో వారి సందేశాలు ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సామాజిక మీడియాను ప్రధాన వేదికగా చేసుకోవడం తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు రాబోయే కాలంలో ‘ఆన్‌లైన్ ఓటింగ్’ కార్యరూపం దాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక- ఉపాధ్యాయులు, విద్యార్థులూ కలిసి టెక్నాలజీ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునే దిశగా ఆధునిక పాఠశాలలు అడుగులు వేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి రావడంతో డిజిటల్ క్లాస్ రూములు, ఆడియో వీడియో సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మొబైల్ లెర్నింగ్ (ఎం-లెర్నింగ్) విధానం విశ్వవ్యాప్తం కాబోతోంది. అధ్యాపకుల్లో బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. అమెరికాపై ఆధిక్యత… మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 213 మిలియన్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 32 శాతం వృద్ధితో- 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిపుణులు తమ తాజా నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 354 మిలియన్లు దాటుతుందని వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇపుడు మూడో స్థానంలో ఉంది. 600 మిలియన్ల వినియోగదారులతో చైనా ప్రథమ స్థానంలో, 279 మిలియన్ వినియోగదారులతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది అంతానికి ‘పెద్దన్న’ అమెరికాను వెనక్కి నెట్టేసి రెండో స్థానాన్ని భారత్ కైవసం చేసుకోబోతోంది. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పది మిలియన్ల నుంచి వంద మిలియన్లకు చేరుకోవడానికి దశాబ్ద కాలం పట్టింది. కేవలం గత మూడేళ్లలో ఈ సంఖ్య వంద మిలియన్ల నుంచి 200 మిలియన్లకు చేరుకుంది. అయితే, 200 మిలియన్ల నుంచి 300 మిలియన్లకు చేరుకోవడానికి ఒక్క ఏడాది వ్యవధి చాలని నిపుణులు విశే్లషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 278 మిలియన్ల మంది నెట్ వినియోగదారులుండగా, పట్టణ ప్రాంతాల్లో 177 మిలియన్ల మంది (ఏడాది కాలంలో 29 శాతం వృద్ధి) వినియోగదారులున్నారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ సంఖ్య వచ్చే నెలాఖరుకు 190 మిలయన్లకు, 2015 జూన్ నాటికి 216 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగం 39 శాతం మేరకు పెరిగింది. గత నెలాఖరుకు పల్లెల్లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 101 మిలియన్లు కాగా, ఈ ఏడాది చివరినాటికి 112 మిలియన్లకు, వచ్చే జూన్ నాటికి 138 మిలియన్లకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా 278 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతుండగా, వారిలో ప్రస్తుతం 159 మిలియన్ల మంది నెట్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది అంతానికి సెల్‌ఫోన్లలో నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 173 మిలియన్లకు, 2014 జూన్‌కు 185 మిలియన్లకు చేరుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో 119 మిలియన్ల మంది, గ్రామాల్లో 40 మిలియన్ల మంది ఇపుడు సెల్‌లో వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారు. వచ్చే నెలాఖరుకు పట్టణాల్లో 128 మిలియన్లు, పల్లెల్లో 45 మిలియన్ల మేరకు మొబైల్‌లో నెట్ వినియోగదారుల సంఖ్య పెరగనుంది. శాశ్వతంగా నెట్ కనెక్షన్ తీసుకోకుండా ఏరోజుకారోజు డబ్బు చెల్లిస్తూ అంతర్జాలాన్ని వీక్షించే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం మంది సమాచార సేకరణకు, సామాజిక వెబ్‌సైట్లను చూసేందుకు,ఈ-మెయిల్స్‌కు, శోధన (సెర్చి)కు నెట్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వినోదం కోసమే (87 శాతం) అంతర్జాల వేదికను ఆశ్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని నిపుణులు గణాంకాలను వల్లెవేస్తున్నారు. నెట్ వినియోగదారుల్లో 90 శాతం మంది సమాచార సేకరణ కోసం మొగ్గు చూపుతున్నారు. ఈ-మెయిల్స్ కోసం 78 శాతం మంది నెట్‌ను వాడుతున్నారు. 75 శాతం మంది సామాజిక వెబ్‌సైట్ల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. 69 శాతం మంది వినోదం కోసం నెట్‌ను ఎంచుకుంటున్నారు. వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్, సంగీతం, పాటలు, ఆన్‌లైన్ షాపింగ్, సరికొత్త ఆప్స్ కోసం నెట్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక నైపుణ్యంతో మనం అంబరవీధిన దూసుకుపోతామా? విలువల్ని మరచి పాతాళానికి దిగజారుతామా? అన్నది మన చేతుల్లోనే ఉంది. మంచి, చెడులతో సాంకేతికతకు సంబంధం లేదు. అదంతా మనిషి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సాంకేతిక సామర్థ్యం వినాశనానికా? వికాసానికా? అన్నది తేల్చుకోవాల్సింది మనమే. అంతర్జాలం కూడా ఓ అణుబాంబు లాంటిదే! దాన్ని మానవ కళ్యాణానికి, సమాజ హితానికి వాడుకోవడం అందరి కర్తవ్యం. * ఆన్‌లైన్ షాపింగ్ అదరహో! ఇంటి నుంచి కాలు కదపకుండానే అవసరమైన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో దేశంలో ఇ-కామర్స్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 18,600 కోట్లు దాటిందని విశే్లషకుల అంచనా. మరో రెండేళ్లలో అంటే 2016 నాటికి భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల (93వేల కోట్ల రూపాయలు)కు చేరుకుంటుందని ‘సెర్చింజన్’ దిగ్గజం గూగుల్ తాజా నివేదికలో పేర్కొంది. 2012లో మన దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేవారి సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3.5 కోట్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఫర్నిచర్… ఇలా అన్ని రకాల వస్తువులను ఇళ్లలో కూర్చునే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం ఇపుడు ఫ్యాషన్‌గా మారింది. 2016 నాటికి ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా, రాబోయే 12 నెలల కాలంలో తాము అన్ని రకాల కొనుగోళ్లను ఆన్‌లైన్ ద్వారానే చేస్తామని 71 శాతం మంది స్పష్టం చేశారు. ఇంటర్నెట్ వినియోగం విస్తరించడం, ఆన్‌లైన్ షాపింగ్ పట్ల విశ్వసనీయతతో తమ వ్యాపారం రాబోయే కాలంలో అనూహ్యంగా పెరగడం ఖాయమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్డ్, ఆమెజాన్, స్నాప్‌డీల్ వంటి సంస్థలే కాకుండా దేశంలో ప్రముఖ ఉత్పత్తిదారులు సైతం సొంతంగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకుని ఈ-కామర్స్ రంగంలో అడుగుపెట్టేందుకు సుముఖత చూపుతున్నారు. 2016 నాటికి నమోదు కానున్న 10 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్లలో 4 కోట్ల మంది మహిళలు ఉంటారని గూగుల్ అంచనా వేసింది. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. సౌందర్య సాధనాలు, గృహాలంకరణ, పిల్లల వస్తువులు, ఆభరణాలు వంటివి మహిళలు విరివిగా కొంటున్నారు. డిస్కౌంట్లు, ఇతర రాయితీలు, ఉచిత పథకాలు, ఇళ్ల వద్దకే సరకులను చేర్చడం వంటి కారణాలతో ఎంతోమంది ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య అధికమైంది. ప్రతి ముగ్గురు ఆన్‌లైన్ షాపర్లలో కనీసం ఒకరు మొబైల్ ద్వారా కొనుగోళ్లకు ఆర్డర్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమకు అవసరమైన వస్తువుల కోసం గూగుల్‌లో ‘సెర్చి’ చేస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నా ఈ పద్ధతిలో ఇపుడు కొన్ని అసౌకర్యాలు లేకపోలేదని 62 శాతం మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోరుకోని వస్తువులు లేదా నాణ్యతపరంగా లోపాలున్న వాటిని వెనక్కి పంపడం (రిటర్న్) సంక్లిష్టంగా, ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉందని వారు అంటున్నారు. కాగా, షాపింగ్ మాల్స్‌లో కొనుగోళ్లు చేసేవారిలో 55 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువుల నాణ్యత, ఆర్థిక లావాదేవీల్లో భద్రత వంటి విషయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాణానికి రెండో వైపు.. సాంకేతిక పరిజ్ఞానం సర్వత్రా విస్తరించి, ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో కొన్ని విపరిణామాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. బూతు వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల వైపు ఎంతోమంది యువకులు మొగ్గు చూపుతున్నారు. మహిళలను వేధిస్తూ వారిని లొంగదీసుకునేందుకు కొందరు యువకులు ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లను దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు, అశ్లీల ఫొటోలను వెబ్‌సైట్లలో ఉంచడం ద్వారా కొందరు యువకులు వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కంప్యూటర్లలో, సెల్‌ఫోన్లలో వెబ్‌సైట్లను వినియోగించే వారి సంఖ్య ఎంతగా పెరుగుతోందో.. అంతే వేగంతో పెడ పోకడలు విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ‘పోర్న్’ (అశ్లీల) చిత్రాలు చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సైట్లను చూడడం కొంతమంది యువతకు వ్యసనంగా మారుతోంది. ఫలితంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌కు సంబంధించి- అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారిలో హింసా ప్రవృత్తి అధికమవుతోందని లండన్‌కు చెందిన ‘రెస్క్యూ’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. అశ్లీల చిత్రాలను చూడడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ సంస్థ విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలో పలు నగరాల్లో ఆ సంస్థ విద్యార్థులను సర్వే చేయగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 21 శాతం మంది విద్యార్థులు అశ్లీల చిత్రాలు, సామూహిక అత్యాచారాల సంఘటనలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. తొమ్మిదేళ్ల వయసు నుంచే కొందరు బూతు వెబ్‌సైట్లు చూస్తున్నారు. కొందరు యువకులైతే వారానికి కనీసం నాలుగు గంటల చొప్పున అశ్లీల దృశ్యాలను చూస్తూ.. నిజజీవితంలోనూ తాము అలాగే చేయాలని ఆరాటపడుతున్నారు. బూతు చిత్రాల ప్రభావంతో కొందరు ఇష్టారాజ్యంగా లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. హింసాత్మక అత్యాచారాలు, పిల్లలపై అకృత్యాలు చూసేందుకు మొగ్గు చూపే యువత సంఖ్య అధికంగానే ఉంటోంది. ఈ వెబ్‌సైట్లను చూసే వారిలో కనీసం 10 శాతం మంది లైంగిక నేరాలు పాల్పడుతున్నారు. అశ్లీల వెబ్‌సైట్లు చూసే విద్యార్థుల్లో 53 శాతం మంది చిన్నపిల్లలకు సంబంధించి లైంగిక చర్యలను చూసేందుకు బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ కేఫ్‌లపై ఎలాంటి నిఘా లేకపోవడంతో- వాటిలో బూతు సైట్లు చూసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఐటి చట్టం ప్రకారం అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ట్విట్టర్.. లీడర్.. బిజెపి ప్రచార రథసారథిగా ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో ఆసేతుహిమాచలం ప్రభంజనం సృష్టించి, దేశ ప్రధానిగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నరేంద్ర మోదీ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ట్విటర్’లో అక్షరాలా ఎనిమిది మిలియన్ల మంది అనుచరుల (్ఫలోవర్స్)తో మోదీ ప్రపంచంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ట్విటర్‌లో 43 మిలియన్ల మంది అనుచరులతో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రథమ స్థానంలోను, క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ 14 మిలియన్ల మంది అనుచరులతో ద్వితీయ స్థానంలోను ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే మోదీ సామాజిక మీడియాను ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రచార వేదికగా మలచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథిగా బాధ్యతలు చేపట్టాక ఎన్నికల సమయంలో ఆయన ట్విటర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో ముందుకు దూసుకుపోయారు. ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించి, ఈ ఏడాది మే నెలలో మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ‘ట్విటర్’లో ఆయన అనుచరుల సంఖ్య రెట్టింపయ్యింది. ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఎప్పటికప్పుడు జనంతో పంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. ప్రధాని పదవి చేపట్టిన సమయంలో ట్విటర్‌లో ఆయన అనుచరుల సంఖ్య నాలుగు మిలియన్లు మాత్రమే. ఆరు నెలల వ్యవధిలోనే ఆ సంఖ్య రెండింతలైంది. ఎన్నికల్లో మోదీ గెలిచినపుడు ఆయనను అభినందిస్తూ 70,586 ‘ట్వీట్లు’ నమోదయ్యాయి. భారత్‌కు సంబంధించి ఇదే ఇప్పటికీ ఓ రికార్డుగా నిలిచిపోయింది. కాగా, విదేశీ పర్యటనలో ఉండగా ‘ట్విటర్ మిర్రర్’ను వాడిన తొలి ప్రధానిగా ఆయన ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డును దక్కించుకున్నారు. ‘ట్విటర్ మిర్రర్’ అనే ప్రక్రియ ద్వారా బహిరంగ సభలో మాట్లాడుతున్న వ్యక్తి తన వెనుక దృశ్యాలను సైతం తల తిప్పకుండా చూసుకునే వీలుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని టోనీ అబ్బోట్‌తో ఓ సభలో పాల్గొన్నపుడు, క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీ విద్యార్థులను కలుసుకున్నపుడు ‘ట్విటర్ మిర్రర్’ను తాను వాడినట్లు మోదీ తన ‘ట్వీట్ల’లో పేర్కొన్నారు. ***

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్రమించని తోడేలు..

విశ్రమించని తోడేలు..

  • 29/11/2014
TAGS:

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు మన సైనిక దళాల స్థావరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హింసాకాండ కొనసాగుతోందనడానికి ఇది మరో సాక్ష్యం. ఈ జిహాదీ హంతకులను పాకిస్తాన్ సైనికులు ఆధీన రేఖను దాటించి మన వైపునకు ఉసిగొల్పినట్టు కూడ వెల్లడికావడం నవాజ్ షరీఫ్ నయవంచన విధానానికి మరో సాక్ష్యం. నవాజ్ షరీఫ్ ఖాట్మండులో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం పూర్వ నిర్ధారిత పథకానికి నిదర్శనం. భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకలాపాలను విడనాడలేదని హంతక నిష్ఠను నిరూపించుకొనడానికి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ పౌర ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో గురువారం నాటి దాడి భాగం. మన సైనికుల వేషాలను ధరించి మన సైనికులతో కలిసిపోవడం హఠాత్తుగా దాడులకు పాల్పడడం పాకిస్తానీ టెర్రరిస్టులు అనుసరిస్తున్న ఎత్తుగడ. అదేరీతిలో గురువారం కూడ పాకిస్తానీలు మన సైనిక స్థావరాల-బంకర్‌ల-లోకి చొరబడిపోయారు. ఎనిమిది మందిని హత్య చేశారు. నలుగురు టెర్రరిస్టులను హతమార్చడానికి 32 గంటల సమయం పట్టడం పాకిస్తానీ వ్యూహాత్మక పటిమకు నిదర్శనం. సార్క్ సమావేశం జరుగుతున్న సమయంలో మొదలైన దాడి శుక్రవారం కూడ కొనసాగింది. నరేంద్ర మోదీ కాశ్మీర్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడం పూర్వ నిర్ధారిత కార్యక్రమం. అదే సమయంలో దాడులు జరపడం తమ జిహాదీ అస్తిత్వాన్ని చాటుకోవడం పాకిస్తాన్ పౌర ప్రభుత్వ లక్ష్యం. ఇలా చాటుకోవడం వల్ల మాత్ర మే అధికార పీఠాలను అంటిపెట్టుకొని ఉండడానికి వీలవుతుందన్నది పాకిస్తానీ రాజకీయ నాయకుల విశ్వాసం. పాకిస్తాన్ రాజకీయ వేత్తల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక జిహాదీ తత్వం. పాకిస్తాన్ సైనిక దళాల స్వభావం కూడ అదే. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రజల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక తత్వం. కొంతమంది ఈ సమష్టి స్వభావానికి అపవాదం కావచ్చుగాక. ఈ మతోన్మాద తత్వం ప్రస్ఫుటించే మాధ్యమం భారత వ్యతిరేకత. అందువల్ల తమ వౌలిక భారత వ్యతిరేకతను పౌర ప్రభుత్వంవారు పదేపదే చాటుకుంటూ ఉండాలి. సైనిక ప్రభుత్వ విశ్వాసం పొందడానికి ఇదే మార్గం. ఈ విశ్వాసం సన్నగిల్లిన తక్షణం సైనిక దళాల వారు పౌర ప్రభుత్వాన్ని తొలగించి వేస్తున్నారు. నరేంద్ర మోదీతో ఖాట్మండు కరచాలనం…ఆధీన రేఖ వద్ద వెన్నుపోటు…నవాజ్ షరీఫ్ వంచన వ్యూహానికి ఇదీ నేపథ్యం. గతంలో వాఘా సరిహద్దు గుండా సీమాంతర బస్సును ప్రారంభించిన సమయంలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కార్గిల్‌లోని కిరాయి హంతకులను, సైనికులను ఉసిగొల్పింది. 1999నాటి నుండి కూడ షరీఫ్ స్వభావంలో మార్పు రాలేదనడానికి జమ్మూలోని ఆర్నియా ప్రాంతంలో ప్రస్తుతం జరిగిన హత్యాకాండ నిదర్శనం. ఆర్నియా ఆధీన రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతం.
ఖాట్మండులో జరిగిన సార్క్ సమావేశంలో నవాజ్ షరీఫ్‌తో ద్వైపాక్షి చర్చలు జరుపడానికి నిరాకరించడం ద్వారా మన ప్రధానమంత్రి పాకిస్తాన్ నడిపిస్తున్న హింసాకాండ గురించి ఇరుగుపొరుగు దేశాల ధ్యాస పెంచగలిగారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీరు సమస్యను ప్రస్తావించడానికి అలవాటు పడిన నవాజ్ షరీఫ్ సార్క్ వేదికపై మాత్రం అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. మనదేశంతో ఎలాగైనా మళ్లీ చర్చలు ప్రారంభించాలన్న తహతహ దీనికి కారణం కావచ్చు. ఇలా చర్చలు ప్రారంభించినట్టయితే భారత వ్యతిరేక హింసాకాండ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు సమసిపోతుంది. ఈ నవాజ్ షరీఫ్ ఎత్తుగడ ఖాట్మండులో బెడిసి కొట్టింది. భారత దేశాన్ని యుద్ధంలో ఓడించలేని పాకిస్తాన్..సాయుధులను, ఉగ్రవాదులను, బీభత్సకారులను ఉసిగొల్పి ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తోందని అమెరికా ప్రభుత్వం గత నాలుగవ తేదీన బహిరంగంగా ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం వారు పాకిస్తాన్‌ను ఇలా బహిరంగంగా ఉగ్రవాద వ్యవస్థగా నిర్ధారించినట్టయింది. అమెరికాకు అంతర్జాతీయంగా ఉన్న పలుకుబడి కారణంగా అనేక దేశాల ప్రభుత్వాలు పాకిస్తానీ బీభత్సకాండను ఇప్పుడు గుర్తించగలిగాయి. అందువల్ల దేశం వెలుపల ఈ చెడ్డపేరును తగిలించుకోవడం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తక్షణ సమస్యగా మారి ఉంది. మన ప్రభుత్వం చర్చలకు అంగీకరించి నట్టయితే అమెరికా నిర్ధారణకు, అంతర్జాతీయ అభిప్రాయాలకు విలువలేకుండా పోతుంది. ఎందుకంటె పాకిస్తాన్ జరుపుతున్న హింసాకాడకు ప్రధానంగా బలియవుతున్నది భారతీయులే…
సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మానుకోనంతవరకు పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదన్నది ప్రస్తుత మన ప్రభుత్వ విధానం. బీభత్సకారులను ఉసికొల్పడం మాననంతవరకు పాకిస్తాన్‌తో సకల విధమైన సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం మన విధానం కావాలి. నేపాల్ తదితర సార్క్ దేశాల ఒత్తడికి లొంగిన కారణంగా సమష్టి ఇంధన నిధి ఒప్పందానికి నవాజ్ షరీఫ్ ఖాట్మండులో మద్ద తు పలుకవలసి వచ్చింది. సార్క్ దేశాలలో క్రమంగా తమ దేశం ఒంటరి అయిపోకుండా నిరోధించడానికే ఈ ఒప్పందానికి నవాజ్ షరీఫ్ అంగీకరించాడు. ఈ ఒప్పందాన్ని మనదేశం ప్రతిపాదించింది కాబట్టి ఇది మన ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం. తమ దేశంలో జరిగిన సభా వేదికపై భారత పాకిస్తాన్ ప్రధానులు కరచాలన లాంఛనాన్ని నిర్వహించాలన్న నేపాల్ ప్రభుత్వ అభ్యర్థనను మన్నించడం ద్వారా నరేంద్ర మోదీ రెండు వ్యూహాత్మక విజయాలను సాధించారు. మొదటిది నేపాల్ ప్రభుత్వానికి మన ప్రభుత్వం పట్ల మరింత సృహృద్భావం ఏర్పడింది. రెండవది పాకిస్తాన్‌తో స్నేహానికి మనదేశం సిద్ధమేనన్న భావం కూడ సార్క్ అధినేతల్లో కలిగింది. అయితే ఈ స్నేహం పాకిస్తాన్ తన హింసా ప్రవృత్తిని విడనాడినప్పుడు మాత్రమే సాధ్యం కాగలదు. పాకిస్తాన్ తన ప్రవృత్తిని మార్చుకోలేదన్నది జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ జరిగిన దాడుల వల్ల ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్‌ను దారికి తేవడానికి వలసిన తదుపరి చర్యలకు మన ప్రభుత్వం పూనుకోవలసిన తరుణమిది…
పాకిస్తాన్ ప్రేరిత హత్యాకాండ ఆగనంతవరకు పాకిస్తాన్ సరిహద్దు ద్వారాలను మూసివేయడం ఒత్తడి పెంచడానికి మొదటి చర్య కాగలదు. సీమాంతర వాణిజ్యం, బస్సు సర్వీసులు, రైలు ప్రయాణాలు నిలిపివేయడం వల్ల వివిధ రకాల వేషాలలో పాకిస్తాన్ నుండి జిహాదీలు మన దేశానికి రాకపోకలు జరుపకుండా నిరోధించడానికి వీలవుతుంది. అప్పటికీ పాకిస్తాన్ తన ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్మూలించకపోయినట్టయితే దౌత్య సంబంధాలను సైతం తెగతెంపులు చేసుకోవాలి. పాకిస్తాన్‌ను హింసాప్రేరక వ్యవస్థగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి సైతం మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో పాకిస్తాన్‌ను కామన్‌వెల్త్‌నుంచి బహిష్కరించిన చరిత్ర ఉన్నది. సార్క్‌నుండి పాకిస్తాన్‌ను తప్పించే ప్రయత్నం చేయడం అందువల్ల తప్పు కాబోదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్‌.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. కేవలం నార్ల సంపాదకీయం కోసమే పత్రిక చదివే వారుండేవారన్న అతిశయోక్తి కాదు. ఆంగ్ల భాషలోను ప్రతిభా సంపన్నుడైన నార్ల ఇంగ్లీషు జర్నలిజం వైపు కాక తెలుగులోనే కొనసాగుతూ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకొన్నారు. ఆయన తెలుగు పత్రికల సంపాదకుడుగా కొనసాగడం తెలుగు వారు చేసుకొన్న అదృష్టమేనేమో! ఆయనీ పత్రికా రచనను ఒక పవిత్రమైన వృత్తిగా స్వీకరించి నిబద్ధతతో నిజాయితీతో పనిచేశారు. పత్రికారంగంలో తిరుగులేని వ్యక్తిగా రాణించిన నార్ల అక్కడే ఆగి పోలేదు. తెలుగు సాహిత్యంలోని వివిధప్రక్రియల్లో ఆయన ఎన్నో రచనలు చేసారు. ఆంగ్లంలోను విశిష్టమైన రచనలు చేసారు.
పత్రికా సంపాదకత్వ బాధ్యతలను నార్ల ఆషామాషీ వ్యవహారంగా ఎన్నడూ భావించలేదు. పత్రిక తన భుక్తికి పనికి వచ్చే ఒక ఉద్యోగంగా ఆయన తీసుకోలేదు. ప్రజలచేతిలో ఆయుధంగా ఆయన పత్రికలను భావించారు. ప్రజలపక్షాన నిలిచి పత్రికలు యుద్ధం చేయాలి.
ప్రపంచ చరిత్రను పరిశీలించి చూచినట్లయితే పత్రికలు ప్రజల పక్షాన ప్రజల కోసమై పోరాడిందే ఎక్కువగా కనబడుతోంది. ఎన్నో దేశాల పోరాట యోధులు మతతత్వం, నియంతృత్వం, ఫ్యూడలిజం వంటి దాష్టీకాలనుంచి ప్రజలకు విముక్తికలిగించే దశలో పత్రికలను తమ పోరాటాలకు ఉపకరణంగా చేసుకొన్నారు. మన దేశంలోను పత్రికల ఆవిర్భావ వికాసదశలను పరిశీలించినట్లయితే దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికో దురాచారాలను నిర్మూలించడానికో, సాహితీ సంస్కృతుల అభివృద్ధికో స్థాపించినట్లుగా కనబుడతోంది. ఎలకా్ట్రనిక్‌ మీడియా కంటే ముందే విశాల భారతదేశాన్ని చుట్టివచ్చి ఒక ప్రాంత వాసులకు మరొక ప్రాంత వాసుల్ని దగ్గర చేసింది పత్రికలే.
ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా ఛానల్స్‌ వచ్చి పడ్డా, ఇంటర్నెట్‌ సదుపాయమున్నా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందించేవి -సామాన్యుడికి సైతం చేరువులో ఉన్నవి పత్రికలే. పత్రికలు చేసింది చాలా వున్నప్పటికి చేయవలసింది ఇంకా ఎంతో వుంది. పత్రికల పైని గురుతరబాధ్యత వుంది. ఎన్నెన్నో సమస్యలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఆవహించినప్పుడు పత్రికా సంపాదకుడు సంయమనంతో, వివేచనతో వ్యవహరించవలసివుంటుంది. అట్టి వివేచన, విశ్లేషణ నార్ల వారి సంపాదకీయాల్లో మనకు కనబడుతోంది. మన రాష్ట్రం, మన దేశం ప్రపంచం అయోమయ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1942 నుంచి 1978 వరకు నార్ల సంపాదకుడుగా ఉన్న పత్రికల్లో ఆయన అభ్రిపాయాలు సుస్పష్టంగా, హేతుబద్ధంగా వుండేవి. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తోన్న ఈ దేశంలో సమస్యలు లెక్కకు మించినన్ని ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోని, కనీసావసరాలు తీరని గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఏలికలు, పాలకులను పక్కనబెడితే ఉన్న ఈ సమస్యలన్నింటిని వెలుగులోకి తెచ్చే నాథుడెవరు? అని ప్రశ్నించుకుంటే ఠక్కున సమాధానం వచ్చేది ప్రజాస్వామ్యానికి కాపలాదారులైన వార్తా సంస్థలే. అట్లాటి పత్రికలు ఎన్ని వుండాలి, ఎట్లా వుండకూడదు అనే విషయంలో నార్లకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి.
పత్రికా సంపాదకునిగా అపార విషయ పరిజ్ఞానం ఉన్న నార్ల కవిగా, నాటకకర్తగా, విమర్శకునిగా, హేతువాదిగా, మానవతావాదిగా, శాసీ్త్రయ విజ్ఞానశీలిగాను ఎన్నో రచనలు చేసారు. వేమనను విపరీతంగా అభిమానించిన నార్ల ఆ మహాకవి వలెనే ఆటవెలది పద్యాలు రాసారు. మొదట ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చారు. ఈ పద్యాల్లో చమత్కారం, సూటిదనం, వ్యంగ్యం, లోకజ్ఞత కొట్టొచ్చినట్లు కనపడతాయి. వెయ్యి వరకు రాయాలనుకొన్న ఈ పద్యాల సంఖ్య అంతవరకు చేరుకోలేదు. అనేకానేక విషయాలను ఈ పద్యాల్లో వెల్లడించిన నార్ల పత్రికలంటే ఎట్లా వుండాలి అని కొన్ని పద్యాల్లో చెప్పారు.
పాలకుల కొమ్ముకాచే పత్రికలు, పాలకులకు పాదాభివందనం చేస్తూ బానిసల్లా వార్తలు అందించే ఎడిటర్లని ఆయన ఏవగించుకొన్నారు. ‘ఎడిటరైన వాడు బిడియముచూపు చో/ ధాటి తగ్గి వృత్తి ధర్మమందు/ కడుపు కూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా!’ జరుగుతోన్న విషయాలను చూచిచూడనట్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్న విషయాలను బయటపెట్టని ఎడిటర్లు ఉంటే ఏమి? ఊడితే ఏమనేది ఆయన మాట. ‘వర్తమాన జగతి పరివర్తనాలపై/ స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి/ ఎడిటరెందుకోయి ఏటిలో గలపనా?’ అని ఆయన అన్నారు. నిజానిజాలు తెలిపే పత్రికలు ప్రజలపక్షాన పోరాడే పత్రికలకే ప్రజాస్వామ్యంలో స్థానముంటుంది. అటువంటి పత్రికలనే ప్రజలు ఆదరిస్తారు. ఏదో ఓ పార్టీకో, కులానికో వెన్నుదన్నుగ నిలిచే పత్రికల పోకడలను ప్రజలు గమనించకపోరు. ఒకవేళ ఏదేని పత్రిక పత్రికకుండవలసిన లక్షణాలను మరచి ఏలికలకు కొమ్ముకాస్తే అటువంటివి పత్రికలే కావు హంతకులే అంటారు నార్ల. ‘నీతినియతిలేని నీచుని చేతిలో/ పత్రికుండెనేని ప్రజలకు చేటు/ హంతకుని చేతికత్తి గొంతులు కోయదా?’ పాలకులు కొందరు ‘మీడియా’ను పరమ శత్రువులుగా భావిస్తూ నిప్పులు చెరగుతుంటారు. అప్పుడు నిజానికి ప్రజాళి ఏం చేయాలి? ప్రజలపక్షాన పత్రికలు పోరాడుతున్నప్పుడు, మీడియా పక్షాన వుండి అది ప్రింట్‌ లేదా ఎలక్ర్టానిక్‌ మీడియా ఏదైనప్పటికీ వాటి పక్షాన వుండి ప్రజలు పోరాడాలి. కానీ ప్రజల్లో ఓ లాటి నిర్లిప్తత, భయం, పోరాటపటిమ లేకపోవడం కూడా మనం గమనించవచ్చు.
అసలు పత్రికలే లేకుంటే? ప్రజలపక్షాన వకాల్తా పుచ్చుకుని పోరాడేదెవరు? ప్రభుత్వాల తప్పొప్పులు చిట్టా విప్పేదెవరు? ప్రజాస్వామ్యం చక్కగా పరిఢవిల్లాలంటే ప్రజల కోసమై గొంతువిప్పే ఉపకరణాల్లో పత్రిక కూడ ఒకటన్నతి ఆయన దృఢమైన అభిప్రాయం. అందుకే నార్ల అంటారు: ‘పత్రిక నియంత పక్కలో బల్లెమ్ము/ పత్రిక ప్రజాళి పట్టుగొమ్మ/ ప్రభుత వక్రమౌను పత్రికలేనిచో’.
పత్రికలు అనుసరించవలసిన ధర్మం ‘సత్యనిష్ఠ’ అనిచెప్పారు నార్ల. పత్రికలు ప్రజాళికి మేలుమాత్రమే చేయాలనేది ఆయన ప్రగాఢ వాంఛ. అట్లాకాకుండా పత్రికలు ప్రజల్లో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ, ఏదో ఒక ప్రయోజనం నిమిత్త ం వాళ్ళల్లో పోరాట పటిమను, చైతన్యాన్ని నిర్వీర్యం చేయటం తగదు. పత్రికొకటుంటే అదే ‘కాగల కార్యాన్ని నిర్వర్తిస్తుందని ప్రజలు ఆదమరచి నిద్రించగలరని’ అంటారు. పత్రికారంగంపైన నార్ల కెంత విశ్వాసం! ఎంత మక్కువ!
నార్ల మాటల్లో ఉత్తమ సంపాదకుడు అంటే ‘విశ్వమానవ దృష్టి, శీల సంపద, ధర్మాభినివేశం’ ఉన్నవాడు. ఇవి ‘లేనివాడు ఏమైనాకావచ్చు కాని ఉత్తమ శ్రేణి సంపాదకుడు కాలేడు’ అని నార్ల అన్నారు.
డా. కనుపర్తి విజయ బక్ష్‌
(డిసెంబర్‌ 1న నార్ల జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త మురిపెం’ ముగిసింది!

కొత్త మురిపెం’ ముగిసింది!

రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు ఉభయులూ తమదైన శైలిలో తెలుగు ప్రజలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ వచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినందున అటు కేసీఆర్‌కు, ఇటు చంద్రబాబుకు ప్రత్యేక సౌలభ్యం లభించింది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించినందున, అదే సెంటిమెంట్‌ను వినియోగించి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యర్థులను, విమర్శకులను ఆత్మరక్షణలోకి నెడుతూ వచ్చారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే భూతల స్వర్గం దిగివస్తుందని నమ్మిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆచరణలో ఏమవుతాయో తెలియని అద్భుత పథకాలను కేసీఆర్‌ ప్రకటిస్తూ వచ్చారు. గ్రాఫిక్స్‌ మాయాజాలం ద్వారా హైదరాబాద్‌ ఎలా ఉండబోతోందో ఆవిష్కరించారు. ఈ అద్భుతాల మధ్య రైతుల ఆత్మహత్యలు, ఆసరా లభించని ఫించన్‌దారుల మరణాలు మరుగునపడిపోయాయి. ఇక ఏపీ విషయానికి వస్తే రాజధాని కూడా లేకపోవడం, లోటు బడ్జెట్‌తో రాష్ర్టాన్ని విభజించడాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రజల నుంచి ఒత్తిడి రాకుండా తప్పించుకుంటున్నారు. అదే సమయంలో రాజధాని నిర్మాణంతో పాటు, ఇతర జిల్లాలలో తాను చేయబోతున్న అభివృద్ధిని చెప్పుకొంటూ, ప్రజలు కూడా కలలు కనేలా చేసుకుంటూ వచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ట్రాక్‌ రికార్డును చూసిన ప్రజలు కూడా చంద్రబాబు చెబుతున్న విషయాలను నమ్ముతూ వచ్చారు. మధ్యలో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాను వల్ల నష్టపోయిన విశాఖ వాసులను ఆదుకోవడానికి అహర్నిశలు శ్రమించడం ద్వారా ప్రజల మన్ననలు కూడా చూరగొన్నారు.
 గ్రామీణంలో ఆగ్రహం
హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినందున ఇప్పుడు ముఖ్యమంత్రుల పనితీరుపై విమర్శకులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ప్రభుత్వాల పనితీరుపై ఉభయ రాష్ర్టాల ప్రజలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలలో సామీప్యంకనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న విద్యావంతులు, ఉద్యోగులు స్వరాష్ట్రం సిద్ధించింది అన్న భావనలో మునిగితేలుతూ ప్రభుత్వ లోటుపాట్లను పట్టించుకోవడం లేదు. కేసీఆర్‌ ప్రకటిస్తున్న పథకాలను చూసి ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందబోతుందా అంటూ కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రజల మనోభావాలు మరో రకంగా ఉంటున్నాయి. నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించిన తమను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని గ్రామీణ రైతాంగంతో పాటు పేదలు కూడా వ్యక్తంచేస్తున్నారు. కరెంట్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వంపై రైతాంగం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కష్టాలలో ఉన్న రాష్ర్టాన్ని నిలబెట్టడానికి, అభివృద్ధి చేయడానికి చంద్రబాబు తపిస్తున్నారనీ, తెగ కష్టపడిపోతున్నారనీ అంటూ విద్యావంతులు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలవుతున్నా రుణమాఫీని ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ అధికారపక్ష ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రుల ప్రకటనలను మభ్యపెట్టే మాటలుగా గ్రామీణ ప్రజానీకం అభిప్రాయపడుతోంది. దీంతో ఉభయ రాష్ర్టాల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ పూర్తిగా కరిగిపోతోంది. కేసీఆర్‌, చంద్రబాబు ఇరువురు కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన తరుణం ఆసన్నమైంది. మాటల నుంచి చేతల్లోకి దిగాల్సిన సమయం వచ్చింది. హైదరాబాద్‌లో కూర్చుని అంతా సవ్యంగా ఉందనుకుంటే అది వారిష్టం.
కొందరు మంత్రుల కొద్ది చేష్టలు!

ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు తపనపడుతున్నారు. అందుకు అనుగుణంగా కష్టపడుతున్నారు కూడా! పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి వచ్చారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇదే విధంగా అమెరికాలో పర్యటించారు. ప్రముఖ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది చంద్రబాబు హయాంలోనే! ఐటీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలుగు ప్రజలకు తెలిసివచ్చింది కూడా ఆ కాలంలోనే! ఇవాళ అమెరికా, తదితర దేశాల్లో తెలంగాణ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అప్పుడు పడిన పునాదే కారణం. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను బహుముఖంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. ఇది తనకు లభించిన సదవకాశంగా ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. పనిలో పనిగా ఏపీలో జరిగిన అభివృద్ధి చూపించి 2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన సహచరులు మాత్రం ఆయనకు గుదిబండగా మారుతున్నారు. కొంత మంది మంత్రులు, వారి పుత్రులు కలిసి అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వానికీ, పార్టీకీ చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా ఉండేట్టుగా అధికారుల ద్వారా చంద్రబాబు జరిపించారు. ఈ చర్యపై పార్టీ నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయన మంత్రులు, శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి అన్న తేడా లేకుండా బదిలీల్లో డబ్బు చేతులు మారింది. ఒక జిల్లాలో అయితే ఉపాధ్యాయులు, స్టాఫ్‌ నర్సుల బదిలీలకు కూడా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. రెవెన్యూ డివిజనల్‌ అధికారి బదిలీకి కోటికి పైగా చేతులు మారిన విషయం కలకలం రేపడం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రకటించిన రుణమాఫీని అమలుచేయలేకపోతున్నందున వారిని మరో విధంగా సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ రంగంలో వారికి అనుభవం లేకపోవడంతో డ్వాక్రా మహిళల పేరిట అధికారపక్షానికి చెందిన కొంతమంది ఇసుకను యథేచ్చగా అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అదే సమయంలో వినియోగదారులపై భారం పడుతోంది. పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కంటే అధ్వానంగా మారాయని కొన్ని జిల్లాలలో ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పరిస్థితులు బాగుపడతాయనుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నవారిలో ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల చేతిలో బందీగా మారారు. దీంతో జిల్లాలో అన్ని విషయాల్లో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెచ్చుమీరుతోందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరో మంత్రి విషయానికి వస్తే బదిలీలు సహా ఏ విషయంలోనైనా పని జరగాలంటే ఆయన కుమారుడిని కలిసి సంతృప్తి పరచాలట! మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది. పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల కాబోలు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు రేపు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకొని ఈ ధోరణికి అడ్డుకట్ట వెయ్యని పక్షంలో రాష్ర్టాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, పడుతున్న శ్రమ పూర్వపక్షమవుతాయి. చంద్రబాబునాయుడు స్వతహాగా మొహమాటస్తుడు. తప్పు చేసిన వారిని తీవ్రంగా మందలించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి జావగారిపోతారు. తప్పు చేసిన వారిని పిలిపించుకొని సుద్దులు చెప్పి పంపుతారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులపై పూర్తి పట్టు సాధించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా మంత్రులను తన అదుపాజ్ఞలలో ఉంచుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి తమ మాట వినడం లేదని మంత్రులు వాపోతుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడంలో స్వేచ్ఛ ఇవ్వడం ఎంత ముఖ్యమో, అరాచకంగా ప్రవర్తిస్తున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యుల్ని కట్టడి చెయ్యడం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. ఎన్నికల హామీలలో ప్రధానమైన రుణమాఫీ విషయంలో ప్రజలు అసహనానికి గురవుతున్నందున వారి ఆవేదన ఆగ్రహంగా మారకముందే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అవసరం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. సంఖ్యాపరంగా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ నైతికంగా ఆ పార్టీ బలహీనపడింది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజలకు నమ్మకం క్రమంగా సడలుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ పిల్లాడికి ఓటువేస్తే ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారని పలువురు భావిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా వ్యవహరిస్తున్నాడన్న నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. తన వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సింది పోయి ఫలానా ఫలానా పత్రికలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నందువల్లనే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారని విమర్శిస్తూ తనను తాను మభ్యపెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. చంద్రబాబుకు లేనిదీ తనకు ఉన్నదీ ‘దేవుడి దయ’ అని ఆయన తరచుగా అంటుంటారు. దేవుడి దయే ఉండి ఉంటే జగనే ముఖ్యమంత్రి అయిఉండేవారు కదా. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

 కట్టడి మంత్రం…!

ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ సెంటిమెంట్‌ను కవచంగా మలచుకొని ఆరు నెలలుగా పరిపాలిస్తున్న చంద్రశేఖర్‌ రావు విషయంలో కూడా ఇంతకుముందే పేర్కొన్నట్టు గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రాచుర్యంలోకి రాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తనదైన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను పరిశీలిస్తే మొత్తం సభలో కేసీఆర్‌ ఒక్కరే తెలివైనవారు అన్న విషయం స్పష్టమవుతోంది. మీడియాతో పాటు రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి లేదా అణచివేయడానికి సరికొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రెండు చానళ్లపై నిషేధం విధించడం ద్వారా మీడియాను ఇదివరకే లొంగదీసుకున్న కేసీఆర్‌, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి సారించారు. గతంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవకతవకలపై పత్రికలలో వార్తలు వచ్చేవి. వాటి ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఇరుకున పెట్టేవి. ఇప్పుడు తెలంగాణ శాసనసభలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. నిన్నటివరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ప్రముఖుల గత చరిత్రపై కేసీఆర్‌ తన సొంత పత్రికలో ప్రముఖంగా వార్తలు ప్రచురిస్తున్నారు. దీంతో సదరు నాయకులు ఆత్మరక్షణలో పడిపోగా, ప్రభుత్వం జరుపుదామనుకుంటున్న విచారణలను తామే స్వాగతించే పరిస్థితిని వారికి కల్పిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందున ఆయనను టార్గెట్‌ చేసి వార్తలు ప్రచురించారు. నాగార్జునసాగర్‌ కాలనీలో అక్రమంగా నివసిస్తున్నారంటూ వార్తలు ప్రచురించడం ద్వారా ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిని ఆత్మరక్షణలోకి నెట్టారు. కేసీఆర్‌ వ్యవహార శైలి ఎలా ఉంటున్నది? ఆయన ప్రజాస్వామికవాదా.. కాదా? క్షమాగుణం ఉందా.. లేదా? ప్రభుత్వ నిర్వహణలో కార్యదక్షత ఎంత అన్న విషయాలను పక్కన పెడితే ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో మాత్రం ఆయన చెడుగుడు ఆడుకుంటున్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే శాసనసభలో ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయగలుగుతున్నారు. భూముల వ్యవహారాలకు సంబంధించి కడచిన కొన్ని రోజులలో ప్రభుత్వం కొన్ని విచారణలకు ఆదేశించింది. సభాసంఘాల నియామకం వల్ల అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది పక్కనపెడితే కేసీఆర్‌ మాత్రం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చుకోబోతున్నారు. హౌసింగ్‌ సొసైటీల మీద సభా సంఘాల నియామకం మంచి ఉద్దేశంతోనే జరిగినా, దానివల్ల కొన్ని చానెళ్లు దారిలోకి వచ్చే అనుబంధ ప్రయోజనం కూడా చేకూరనున్నది. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలో జరిగిన అవకతవకలలో కొన్ని చానళ్ల యజమానులకు సంబంధం ఉందన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలను ఆయుధాలుగా, కవచాలుగా మలచుకొని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంతో పాటు, ప్రభుత్వంపై ఎవరూ విమర్శలు చేయకుండా చూసుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. దీంతో మొత్తం తెలంగాణ సమాజంలో భయం ఆవహించింది. ప్రభుత్వాన్ని తప్పుపడితే ఏ ముప్పు ముంచుకువస్తుందోనన్న భయంతో ప్రశ్నించవలసిన వర్గాలు స్తబ్ధుగా ఉంటున్నాయి. ఈ కారణంగానే చైతన్యానికీ, ప్రశ్నించే తత్వానికీ ప్రతీకగా ఉండే తెలంగాణ సమాజంలో స్తబ్ధత ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వాన్ని శభాష్‌ అని మెచ్చుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉంటున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 40 వరకు భారీ టవర్లు నిర్మించాలన్న నిర్ణయం ఇందులో ఒకటి. ఈ టవర్లను నిర్మించి ఏమి చేస్తారు? వాటి అవసరం ఏమిటి? అని ప్రశ్నించే వారు కరువయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు భవనాల్లోని పై అంతస్తులు ఖాళీగా పడి ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానికి తరలి వెళ్తే పలు ప్రభుత్వ భవనాలు కూడా ఖాళీ అవుతాయి. సచివాలయంలో సగం భవనాలు ఖాళీ అవుతాయి. వాటిని ఏమి చేయాలో తెలియకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌ను నిర్మించాలన్న కేసీఆర్‌ ఆలోచనను ఆక్షేపించడానికి కూడా ఎవరూ సాహసించలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలలోని సాధ్యాసాధ్యాలను పరిగణనలోనికి తీసుకోకుండా మీడియా కూడా వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నది. గతంలో ఇలాంటి నిర్ణయాలు వెలువడినప్పుడు వాటిపై సమీక్షలు ఉండేవి. ఇప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే, ఏంటి తెలంగాణలో టవర్లు కట్టుకోకూడదా? మీరు తెలంగాణ ద్రోహులు అంటూ ఒంటికాలి మీద లేస్తున్నారు. దీంతో ఎవరికి వారు మనకెందుకులే అని సర్దుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి గమనించిన ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ, ‘రాజకీయ పార్టీలను, మీడియాను బెదిరించడం ఇంత తేలికా? ఈ సంగతి మాకు తెలిస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసి ఉండేవాళ్లం కదా’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా సమకూరుతున్న బలాన్ని పక్కనబెడితే తెలంగాణ శాసనసభలో కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిన మెజారిటీ అంతంత మాత్రమే. మామూలుగా అయితే అత్తెసరుగా ఉన్న ప్రభుత్వానికి సుస్థిరత సమస్యగా మారేది. తెలంగాణలో ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలే అభద్రతా భావానికి గురవుతున్నాయి. ఇది మంచి పరిణామమా కాదా అన్నది పక్కనబెడితే, ఇట్లాంటి పరిస్థితి కల్పించిన కేసీఆర్‌ను అభినందించకుండా ఎలా ఉంటాం. తెలంగాణ సమాజం విలక్షణమైనది. ప్రతిఘటనతో పాటు అణకువ కూడా ఉంటుంది. అలాంటి సమాజంలో ఫ్యూడల్‌ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డికి సభలో ఎదురవుతున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. తనపై నేరుగా విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుక్కలు చూపిస్తున్నారు. శాసనసభలో రేవంత్‌ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారు.
ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు చేయడమే నేరమన్నట్లుగా తన చర్యల ద్వారా కేసీఆర్‌ ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నారు. ఈ దేశంలోని ఏ శాసనసభలో కూడా ప్రతిపక్ష సభ్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండదు. జార్జి ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు శవపేటికల కుంభకోణంతో ఆయనకు సంబంధం ఉందని నమ్మిన ప్రతిపక్షాలు అప్పట్లో మంత్రిగా ఆయన లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యుడు రేవంత్‌ రెడ్డిని అధికార స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది. ఈ విషయంలో మిగతా ప్రతిపక్షాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి భయాలు వారికి ఉండి ఉంటాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో మరెందరిపై నిర్బంధం కొనసాగుతుందో తెలియదు. రాజకీయ నాయకుడిగా విజయం సాధించడం వేరు, ముఖ్యమంత్రిగా శభాష్‌ అనిపించుకోవడం వేరు. ఆర్భాటపు ప్రకటనలతో ఒక వర్గం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతానికి సఫలీకృతులయ్యారు. ప్రత్యర్థులను అణచివేయడం ద్వారా తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ప్రస్తుతం ఉన్న ఫీల్‌గుడ్‌ ఎప్పటికీ ఉండదు. తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు. తెలివితేటల్లో తనకు తానే సాటి అయిన కేసీఆర్‌కు ఈ విషయం తెలియదా?

ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు… తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్

ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా  కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ జిల్లా రానోలి లో జన్మించాడు .అయిదుగు పిల్లలో రెండవ వాడు .స్వగ్రామం లో ప్రాధమిక విద్య నేర్చి ,సంస్కృతాన్ని వారణాసి లో వర్నిజి స్థాపించిన ప్రసిద్ధ  ‘’స్వాద్ వాద్ ‘’మహా  విద్యాలయం లో  అభ్యసించాడు  .అచార్యశాంతి సాగర్ సాంప్రదాయానికి చెందిన  ఆచార్య వీర సాగర్ వద్ద   జైన మతావలంబిగా(క్షుల్లక్) దీక్ష పొందాడు .దీక్ష పొందిన తర్వాత ఆయన పేరు ‘’క్షుల్లక్ జ్ఞాన భూషణ్’’ గా మారింది .అక్కడ నాలుగేళ్ళు సాధనలో గడిపి, అదే సంప్రదాయానికి చెంది న ఆచార్య  శివ సాగర్ ఆశీస్సులతో  జైపూర్ లోని ఖనియాజి ఆశ్రమం లో1959లో  జైనముని అయ్యాడు .1968లో పదోన్నతి పొంది రాజస్థాన్ లోని నశీరా బాద్ లో ఆచార్య పదవి అధిస్టిం చాడు. నశీరాబాద్ లోనే 1-6-1973లో నిర్యాణం చెందాడు .

సంస్కృతం లో మహా నిధి అయిన జ్ఞాన సాగర్ అనేక అమూల్య గ్రంధాలు రచించాడు .ఆయన గ్రంధాలపై కనీసం ముప్ఫై మంది విద్యార్ధులు పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీలు సాదించారంటే  ఆయన గ్రంధ విస్తృతి యెంత ఉత్తమమైనదో తెలుస్తుంది .మూడు వందల మంది రిసెర్చ్ పేపర్లు ఆయన గ్రంధాలపై రాసి ప్రచురించారు .సంస్కృత భాష మృత భాష అని ,దాని పని అయిపోయిందని ,దాన్ని ఇంకెవరూ చదవరూ దాని జోలికి పోరు అని భావిస్తున్న కాలం లో జ్ఞాన సాగర్  నాలుగు సంస్కృత మహా కావ్యాలు.రాశాడు .ఇవికాక మూడు జైన గ్రంధాలు రాశాడు .వీటిని చదివి మహా మహా సంస్కృత విద్యా వేత్తలు ,పండితులే ఆశ్చర్యం పొంది ముక్కు మీద వేలేసుకొన్నారు .అంతటి ఉత్తమోత్తమ సాహిత్య సృష్టి చేశాడు జ్ఞాన సాగర్ .ఆయన పేరుమీద కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .

Inline image 1  Inline image 2

103- జగద్గురు శ్రీ రామ భద్రాచార్య

14-1-1950లో గిరిధర్ మిశ్రా గా జన్మించిన రామ భద్రా చార్య బహుభాషా వేత్త ,కవి వేదాంతి ,బహు గ్రంధకర్త ,మహా విమర్శకులు నాటక కర్త ,.గాయకులూ సంగీత దర్శకులు ‘’చిత్రకూట  కదా కారులు అన్నిటికి మించి నలుగురు జగద్గురువులలో ఒకరుగా  గా సుప్రసిద్ధులు .సర్యుపరీన బ్రాహ్మణ కుటుంబం లో రామ భాద్రాచార్య ఉత్తర ప్రదేశ్ లోని జానాపూర్ జిల్లా శాండీ కుర్ది గ్రామం లో జన్మించారు వీరిది వాశిస్టగోత్రం .తల్లి శచీదేవి. తండ్రి పండిత రాజ దేవ మిశ్రా .ఈయన మేనత్త భక్త మీరా బాయి భక్తురాలు .

రామ భాద్రాచార్య చిత్రకూటం లో సంత్  తులసీదాస్ స్మారకార్ధం’’ తులసీ పీఠం’’స్థాపించారు .దానికి వ్యపస్తాపక అధ్యక్షులుగా పని చేశారు .చిత్రకూటం లోని జగద్గురు రామ భాద్రాచార్య వికలాంగుల విశ్వ విద్యాలయాన్ని స్థాపించి దాని చాన్సలర్ గా జీవితాంతం ఉన్నారు .వికలాంగులు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయటానికి ఏర్పడిన ప్రత్యెక విశ్వ విద్యాలయం ఇది .రామ భాద్రాచార్య చిన్న నాట రెండవ నెలలోనే కంటి చూపు కోల్పోయారు .జీవితాంతం అంధ జీవితమే గడుపుతున్నారు .ఎన్ని వైద్యాలు చేసినా చూపు రాలేదు .ఎవరైనా చదివితే విని అర్ధం చేసుకొని అనంత జ్ఞానాన్ని సంపాదించారు .తానూ చెప్పి ఎవరి చేతనైనా రాయిస్తారు .అలానే అనంత గ్రంధ రచన చేశారు .ఇదొక అద్భుతమైన విషయం కనీ విననట్టిది .పది హేడవ ఏడు వరకు ఏ విద్యనూ నేర్చుకోలేక పోయారు .బ్రెయిలీ లిపిని ఏ సందర్భం లోనూ వాడని విద్యా వేత్త ఆయన .ఆదర్శ గౌరీశంకర్ సంస్కృత విద్యాలయం లో చేరారు .ఏక సందా గ్రాహి అవటం వలన చదివి వినిపించినదంతా ఆకళింపు చేసుకొనే వారు .సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి లో వ్యాకరణం చదివారు .ఆచార్య ,మాస్టర్ డిగ్రీ లు సాధించారు .యూని వర్సిటి గ్రాంట్ కమిషన్ నుంచి స్కాలర్షిప్ పొంది అయిదేళ్ళు చదివి సంస్కృతం లో విద్యా వారిధి డిగ్రీ పొందారు ‘’.ఆధ్యాత్మ రామాయణములో పాణిని ప్రయోగం ‘’అనే అంశం పై పరిశోధన చేసి అందులో అపాణినీయప్రయోగాలపై ప్రత్యెక ద్రుష్టి తో రాశారు .పి .హెచ్. డి .సాధించిన తర్వాత అదే వర్సిటీలో వ్యాకరణ శాఖ అధ్యక్ష పదవి కి ఆహ్వానించినా  ,హిందూ మతం సంస్కృత వ్యాప్తి కోసం కృషి చేస్తానని సున్నితం గా తిరస్కరించి  తన కోరికను సఫలం చేసుకొన్నారు .

రామ భాద్రాచార్య 22భాషలలో నిష్ణాతులు ,ఆశువుగా కవిత్వం చెప్ప గల నేర్పున్నవారు .సంస్కృత, హిందీ ,అవధి మరాటీ మొదలైన భాషలలో అనేక గ్రంధాలు రచిం చారు .వందకు పైగా గ్రంధాలు యాభైకి పైగా పరిశోధన పత్రాలు రాశారు .ఇందులో నాలుగు సంస్కృత మహా కావ్యాలున్నాయి .తులసీదాసు రామ చరిత మానస్ ,హనుమాన్ చాలీసా ,పాణిని సంస్కృత ‘’అష్టాధ్యాయి ‘’ లపై విపుల మైన వ్యాఖ్యానాలు రచించారు .’’ప్రస్తాన త్రయం ‘’కు సంస్కృతం  భాష్యం రాశారు .సంస్కృత వ్యాకరణం న్యాయ ,వేదాంతా లలో మహా పండితునిగా గుర్తింపు పొందారు .భారత దేశం మొత్తం మీద తులసీ దాస్ పై పూర్తీ సాధికారిత ఉన్న శ్రేష్ట విద్వాంస పండితులని గుర్తింపు పొందారు .రామ చరిత మానస్ కు అద్భుత వ్యాఖ్యానం రచించారు .రామాయణ భాగవతాలకు’’ కదా కళా కారుని’’గా ప్రసిద్ధి చెందారు .ఆయన కదా ప్రదర్శనలు భారత దేశం లోని ప్రతి పట్టణం లోను నిర్వహించారు .అవి రేడియో టి వి లద్వారా ప్రసారమై గొప్ప గుర్తింపు లభించింది .విశ్వ హిందూ పరిషద్ అగ్ర నాయకులలో రామభాద్రాచార్య ఒకరు .

రామభాద్రాచార్య జీవితాంతం బ్రహ్మ చారిగా ఉన్నారు .వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి వైరాగ్యం పొంది రామానంద సంప్రదాయం లో విరక్త దీక్ష తీసుకొన్నారు .

Inline image 3  

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది

ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో  రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో  అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో మధ్య ప్రదేష్ లోని జబల్పూర్ లో ఉన్న రాణి దుర్గా వతి యూని వర్సిటి నుండి సంస్కృతం లో పి. హెచ్ .డి.పొందాడు  .సంస్కృత మహా కావ్యాల గురించి ధీసిస్ సమర్పించాడు .తర్వాత జబల్పూర్ లో రాణి దుర్గావతి యూని వర్సిటి సంస్కృత శాఖలోనే అధ్యాపకునిగా చేరి శాఖాధ్యక్ష హోదా పొందాడు .ఆ కాలం లో 16మంది ఆయన వద్ద డాక్టరేట్ దీసేస్ చేశారు .విద్యా వాచస్పతి డిగ్రీ ని పొందాడు .

సంస్కృత హిందీ ఆంగ్లాలలో సుమారు యాభై పరిశోధనా పత్రాలను సమర్పించిన మేటి విద్యా వేత్త ద్వివేదీ .అందులో ముఖ్యమైనవి-ఏడవ శతాబ్దం లో సంస్కృత మహా కావ్యాలపై విమర్శనాత్మక పరిశోధన చేసి పి హెచ్ డి కి ధీసిస్ ను రాశాడు .తరువాత ‘’అర్వాచీన సంస్కృత కావ్యాను శీలనం ‘’ను ఆధునిక సంస్కృత కావ్యాలను విశ్లేషిస్తూ 1981లో రాశాడు .దీన్ని మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో ఉన్న సాగరిక సమితి ముద్రించింది .సంస్కృత విమర్శనా వ్యాస సంకలం గా ‘’సాహిత్య విమర్శనం ‘’ను 2002లో తెస్తే సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ప్రచురించింది .స్వస్తి సందేశం ,స్వరిత సందేశం ,సంస్కృత వాజ్మయే విజ్ఞా న్ ,తీర్ధ భారతం అనే భారతీయ యాత్రా స్థలాలపై గ్రంధం రాశాడు

Inline image 1  

101-శతావ దాని గణేష్

సంస్కృత కన్నడ ,ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశుఅవిత్వం లో దిట్ట అని పించుకొన్న బహు భాషా వేత్త ఆర్ .గణేష్ కర్నాటక లోని కోలార్ లో 4-12-196న జన్మించాడు .తండ్రి శంకర్ అయ్యర్ .తల్లి అలివేలమ్మ .చిన్నప్పుడు సంస్కృత తమిళ కన్నడ తెలుగు భాషా పరిచయం ఏర్పడింది .సంస్కృత కావ్యాలు చదివి జీర్ణం చేసుకొని పదహారో ఏట నే కవిత్వం చెప్పాడు .స్కూలు లో ఇంగ్లీష్ అభ్యసిస్తూ ప్రాకృత ,పాళీ ,గ్రీక్ లాటిన్ ఇటాలియన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు .మెకానికల్  ఇంజినీరింగ్ లో బి .ఇ .పాసైనాడు .మెటలర్జీ లో ఏం ఎస్ .చేశాడు .మెటీరియల్స్ ,సైన్స్ మెటలర్జీ లలో పరిశోధన చేశాడు .సంస్కృతం లో ఏం ఏ .డిగ్రీని కన్నడం లోహంపి యూని వర్సిటి నుండి  డి .లిట్ ను ‘’అవధాన కళ’’పై ధీసిస్ రాసి పొందాడు .

శతావధానం

చక్కని చిక్కని ఆశుదారా  కవిత్వం ,సునిసిత మేధా ,అవగాహన, ధారణా ,జ్ఞాపక శక్తి ,హాస్య స్పూర్తి ,చిక్కులను అధిగమించే ఓర్పూ నేర్పూ  విస్తృత లోక పరిశీలన ,బహు శాస్త్ర పరిచయం, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నీ పుష్కలం గా ఉన్న గణేష్ అష్టావధాన శాతావదానాలను అలవోక గా చేసి  ప్రుచ్చకులను , సభాసదులను మెప్పించాడు .సంస్కృత కన్నడ తెలుగు -మూడు భాషలలో గణేష్ 1000కి పైగా అవధానాలు చేసి అపర  గణేశుడని పించాడు  .అమెరికా యూరప్ దేశాలలో ఇరవైకి పైగా అవధానాలు చేసి మెప్పుపొండాడు .15-12-1991 నమొదటి శతావదానాన్ని బెంగళూర్ లోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించాడు .మరో పదిహేను రోజుల్లో మరొక  అవధానాన్ని చేశాడు .ఇలా జైత్ర యాత్ర సాగింఛి2012లో పూర్తిగా కన్నడం లోనే చేశాడు .

గ్రంధ రచన

అవధానాలు చేసి ఊరుకోలేదు గణేష్ .’శతావధాన  శారద’’,  ‘’శతావధాన శ్రీవిద్య ‘’శతావధాన శాశ్వతి ‘’అనే గ్రంధాలు కూడా రాశాడు .ఇవి అవధాన విద్యలో రాణించాలనుకొన్న వారికి కరదీపికలు గా ఉన్నాయి .నాట్యాలకు పాటలు రాశాడు .యక్షగాన విద్య అభ్యసించి ,’’ఏక వ్యక్తీ యక్ష గానం ‘’అనే దాన్ని తాను తయారు చేసి ఎన్నో ప్రదర్శనలలిచ్చి తన ప్రజ్ఞను చాటాడు .ఈ విద్యకు ‘’మంటప ప్రభాకర ఉపాధ్యాయ ‘’అనే బిరుదు పొందాడు .షేక్స్పియర్ నాటకం  హామ్లెట్ కు కన్నడాను సరణం గా ‘’హొరాషియో ‘’రాసి  తానె ముఖ్యపాత్ర ధరింఛి ప్రదర్శించాడు .

సంస్కృతం లో గణేష్ –అన్వేషణం అనే ఏకాం కిక ,సాంబ లహరి అనే ఖండకావ్యం ,శంకర వివేకీయం అనే పద్య కావ్యం,అంతః కాంతి ,సౌగందిక చిత్ర  చూళిక (చిత్ర కావ్యం ),,శ్రీ కృష్ణ లహరి ,శ్రీ జాంబ లహరి ,శృంగార లహరి ,జటా శకుంతల ,ఇళాకైవల్యమ్ ,ఏవం అపిర్వతః ,చాటు చంద్రిక ,శ్రీ చంద్రేశ్వరి స్తవం ,మధు సద్మ అనే సంస్కృత కవిత్వ సంకలం .

కన్నడం లో వితాన ,నిత్య నీతిమొదలైన ఇరవై గ్రంధాలను రాశాడు .

బిరుదులూ పురస్కారాలు

గణేష్ కు కర్ణాటక ప్రభుత్వం ‘’రాజ్యోత్సవ ప్రశస్తి ‘’పురసారాన్ని అందించి గౌరవించింది .కావ్య కంఠప్రశస్తి ,రాష్ట్రీయ యువ ప్రతిభా పురస్కార ,బాదరాయణ –వ్యాస పురస్కారం ,తుంకూర్ యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ ,చిత్ ప్రబంధ అవార్డ్ ,ఎర్యా ,సేదియాపు అవార్డులెన్నో ఆయన్ను వరించాయి .ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలి డా.ఆర్ గణేష్ నడిచే సరస్వతిగా గణపతిగా భాసిస్తున్నాడు .

Inline image 2    

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోటి హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణా హుతి-30-11-14 ఆదివారం -ఘంట సాల మ్యూజిక్ కాలేజి -విజయవాడ

chalisa1 001 chalisa2 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

  • -స్వపన్ దాస్‌గుప్తా
  • 29/11/2014
TAGS:

జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఏవిధమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. రాష్ట్ర ప్రజల్లో చొరబాట్లపై నెలకొనివున్న తీవ్ర వ్యతిరేకతను, ఈ ఎన్నికలు ధ్రువపరిచాయి. ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించడం వల్ల, విశే్లషకులు తగిన ఆధారాల కోసం మీడియా రిపోర్టులపైనే ఆధారపడక తప్పదు. ఇవి విస్తృతంగా మూడు అంశాలను మనకు తెలియజేస్తున్నాయి. మొదటిది, ముఫ్తీ మహమ్మద్ సరుూద్ కుమార్తె మహబూబా ముఫ్తీ నేతృత్వలోని పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ కాశ్మీర్‌లోని 46 స్థానాల్లో లాభం పొందబోతున్నది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, దాని సహచర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోవడం ఖాయం. రెండవది భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో బలోపేతమైందనేది స్పష్టమైంది. బహుశా జమ్ము ప్రాంతానికి చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు హురియత్ కాన్ఫరెన్స్‌తో తప్పనిసరి పరిస్థితుల్లో అంటీముట్టని విధంగా సంబంధాలు నెరపుతున్న వారు ప్రస్తుత ఓటింగ్‌లో పాల్గొనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇక చివరిగా గత సాధారణ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన మూడు లోక్‌సభ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేసుకోబోతున్నది. జమ్ములో భాజపా బలోపేతమయిందంటే..అక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పూర్తిగా దెబ్బతినడమే కారణం. ఇక లఢక్ ప్రాంతంలో భాజపా తన ఉనికిని చాలా శక్తివంతమైన రీతిలో చాటడమే కాకుండా, కాశ్మీర్ లోయలోని ఆ రు నియోజక వర్గాల్లో దూసుకుపోతున్నది.
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలున్నాయి. రాష్ట్రంలో సువిశాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ స్థానాల్లో, భాజపా 44+ స్థానాల్లో ఎంతవరకు విజయాలను నమోదు చేస్తుందనేది ప్రశ్నార్థకం. జమ్ము, లఢక్ ప్రాంతాల్లో మొ త్తం స్థానాలను గెలుచుకున్నా, కాశ్మీర్ లోయలోని ఆరుస్థానాలను ఆశ్చర్యం కలిగించే రీతిలో కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 44+ చేరుకోవడం సాధ్యమవుతుందా అన్నది విశే్లషకులను వేధిస్తున్న ప్రశ్న. అయితే ఒక్కటి మాత్రం నిజం. పార్టీ పనితీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ భాజపా జమ్ము కాశ్మీర్ రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందనేది మాత్రం ముమ్మూటికీ నిజం. ఢిల్లీకి చెందిన ఒక విలేకరి కాశ్మీర్ లోయలో ఎన్నికల ప్రచార సరళిని కవర్ చేయడానికి వెళ్ళారు. కాశ్మీర్‌లోయలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లకోసం ప్రచారం చేయడం ఆమెను ఎంతో అబ్బుర పరచింది.‘‘ కొద్ది సంవత్సరాల క్రితం భాజపా అభ్యర్థులు ఆవిధంగా ప్రచారం చేసే పరిస్థితే ఉండేది కాదు. ఒకవేళ ధైర్యం చేసినా దాడికి గురి కావడమో కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా జరిగేది.’’
కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంభవించిన వరదలు విలయాన్ని సృష్టించినప్పుడు, సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్న మన సైనికులు అందించిన సేవ లు, లోయ ప్రజల్లో భాజపా అభ్యర్థుల పట్ల వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి కారణమని చెప్పవచ్చు. మరో అభిప్రాయం ఏమంటే..మిగిలిన భారత ప్రజల మాదిరిగానే నూతన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశం కల్పించాలన్న భావన ప్రజల్లో బలంగా నాటుకొని పోవడం వల్ల కూడా కావచ్చు. పూర్తిగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాట్లో పెట్టడానికి నరేంద్ర మోదీ యత్నిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. అన్నింటికంటే ఆసక్తి కలిగించే అంశం మహబూబా ముఫ్తీ ఎన్నికల ప్రచారంలో స్మార్ట్ సిటీల గురించి మాట్లాడటం! నేషనల్ కాన్ఫరెన్స్ పాలనా రాహిత్యాన్ని ఒకపక్క ఎండగడుతూనే మరోపక్క స్మార్ట్ సిటీల ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడటం గొప్ప విశేషం.
అంతమాత్రం చేత రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రకియకు పెద్ద ఆటంకంగా మారిన 370వ అధికరణాన్ని తొలగించాలన్న భాజపా అభిప్రాయానికి రాష్ట్రంలో మద్దతు లభిస్తున్నదని కాదు. ఢిల్లీ మీడియా అనవసరంగా ఊహాజనితమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిచ్చిందనే చెప్పాలి. మరో ఆసక్తికరమైన అంశమేమంటే..జమ్ము కాశ్మీర్‌ను ఇండియన్ యూనియన్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న అంశంలో పూర్తి సానుకూల స్థితి ఉన్నదని చెప్పవచ్చు. ఇస్లామిక్ గుర్తింపును ఏమాత్రం చెక్కుచెదరనీయకుండానే భాజపా దీన్ని సాధించడం విశేషం. బహుకాలంగా జమ్ముకాశ్మీర్ రాజకీయ నిర్వాసితులకు ఆశ్రయంగా మారుతున్న మాట నిజం. వీరివన్నీ కృత్రిమ సంక్షోభానికి దారితీసే అజెండాలే. వీటిల్లో కొన్ని సమస్యలు కేవలం పాకిస్తాన్ కోణంలోవి. ఈ అన్యమనస్కత, ఆసక్తి అనేవి ఉగ్రవాదం కేంద్రంగా కలవి కావు. కానీ జాతీయ సమస్యలకు బహు పరిష్కారాల కేంద్రంగా కలవి. పరిపాలనా విధానాల్లో అద్భుతమైన మార్పు వస్తుందని, మానవహక్కుల ఉల్లంఘన పట్ల అది తీవ్ర ప్రతిస్పందనతో కూడినదై ఉంటుందని మరికొందరి భావన. అయితే వీరందరి పరిశీలనలు అప్రమాణికమైనవి కావు. కానీ జమ్ము కాశ్మీర్ గురించిన కొన్ని వాస్తవాలను గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది కాశ్మీర్ లోయ భారత ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చందనిది లేదా పేదరికంలో మగ్గుతున్న ప్రాంతం కాదు. దీనికి విరుద్ధంగా జమ్ము ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తమ ప్రాంతంలోని వనరులను అభివృద్ధికోసం వినియోగించడంలో వహిస్తున్న నిర్లక్ష్యానికి కారణం కేవలం ఢిల్లీ మాత్రమే! తాము వినయ విధేయతలతో ఉండటాన్ని ఢిల్లీ అలుసుగా తీసుకుంటున్నదన్న భావం జమ్ము ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక రెండవది కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్నది కాశ్మీర్ లోయ ప్రాంతం మాత్రమే. రాష్ట్రంలో అర్థవంతమైన అంతర్గత ఆదాయాన్ని సృష్టించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇక్కడి ప్రజలపై విధించే పన్నులు చాలా తక్కువ. వీరికిచ్చే సబ్సిడీల మొత్తం మరింత ఎక్కువ.
జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం వల్ల..ప్రభుత్వం పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తుందని లేదా అందిస్తున్న సబ్సిడీలను ఒకేసారి ఎత్తివేస్తుందని లేదా అభివృద్ధి నిధులను నిలిపివేస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చేయాల్సింది ఒకటుంది. అసలు ఖర్చు పెడుతున్న నిధులు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయనేదానిపై లోతైన ఆడిటింగ్ నిర్వహించాలి. జాతీయ జనజీవన స్రవంతిలో విలీనం కావడం విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, జమ్ము కాశ్మీర్ పూర్తిగా వక్రించిన వ్యావహారిక సత్తావాదంతో నిండిపోయింది. దీని ఫలితంగా స్థానికంగా పెద్దలుగా చెలామణీ అయ్యేవారిలో చాలామంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం సాధారణమైపోయింది. ఈ అనైతిక రాష్ట్ర నాయకులు భారత్‌కు చేసిన నష్టం లెక్కించడం సాధ్యం కాదు.
గతంలో జరిగిన ఎన్నికలతో పోలీస్తే ఈసారి జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల విషయంలో సర్వే సర్వత్రా ప్రశంసలే వినవచ్చాయి. భాజపా రంగంలో ఉండటం, ఎన్నికలు బహిష్కరించాలన్న ప్రచారం లేకపోవడం మొత్తం పరిస్థితినే మార్చివేసింది. జమ్ముకాశ్మీర్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం రాష్ట్రాన్ని భిన్న పథంలో నిర్మించాలి. ఇప్పటి వరకు ఉన్నదానికంటే భిన్న మార్గంలో పయనించాలి. అయినప్పటికీ అదనపు ప్రోత్సాహం చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్యాన్ని తొలగించి, వారిస్థానంలో సుశిక్షితులైన పారామిలిటరీ దళాలను ఉంచడం శ్రేయస్కరం. దీన్ని ఒక్కసారి ప్రభుత్వం పరిశీలించాలి. కేవలం నియంత్రణ రేఖవద్ద మాత్రమే భారత సైన్యం చురుగ్గా పనిచేయాలి. చొరబాట్లను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
ఎన్నికల ఫలితాలు వచ్చి, వీటిని జీర్ణం చేసుకున్న తర్వాత జమ్ము కాశ్మీర్‌పై ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించుకోవాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడు మహేష్ బాబు ను కలవాలనుకొంటున్న నట గాయక దర్శకుడు ఫరాస్ అక్తర్

మహేష్ ని కలవాలనుకుంటున్నా

నటన, దర్శకత్వం, పాటలు పాడటం- ఇలా బహుముఖ ప్రజ్ఞ ఉన్న బాలీవుడ్‌ నటుల్లో ఫరాన్‌ అక్తర్‌ ఒకరు. ఈయన ఇంకా బాగా గుర్తుకు రావాలంటే ‘రాకాన్‌’, ‘జిందగి నా మిలేగీ దొబారా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ వంటి చిత్రాల గురించి చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సంగీతానికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
నటుడు, గాయకుడు, దర్శకుడు – ఈ మూడింటిలో మీరు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
దర్శకుడిగా పనిచేయడం ఎంత ఇష్టమో నటించడం కూడా అంతే ఇష్టం. ఇష్టం కదాని రెండూ ఒకేసారి చేయలేను. నటిస్తున్నప్పుడు పూర్తిగా దానిపైనే దృష్టిపెడతాను. దర్శకత్వం చేస్తున్నప్పుడు ధ్యాసంతా దానిమీదే. దేనిమీదైతే అమితమైన ఇష్టం, చేయగల సామర్ధ్యం ఉంటుందో ఆ పని చేసేందుకు వెనకాడకూడదు. ఈ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఒకవేళ అది ప్రయోగమే అయినప్పటికీ మీ పని మీరు చేయాలి. అప్పుడే ఆ పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టైం మేనేజ్‌మెంట్‌ అనేది చాలా కీలకం.
గాయకుడు అవ్వాలని ఎప్పుడనిపించింది?
బాల్యం నుండే సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. చాలా ఏళ్లు గిటార్‌ వాయిస్తూ, పాటలు పాడాను. కాని సినిమా ప్రాజెక్టు వల్ల రెగ్యులర్‌గా పాడలేకపోయాను. అయినప్పటికీ ఏడాదిలో నాలుగైదు నెలల సమయాన్ని సమాజానికి సంబంధించిన అంశాల గురించి పాడేందుకు కేటాయిస్తాను. గాయకుడిగా నాకు మొట్టమొదటి స్ఫూర్తి ‘బీటిల్స్‌ బ్యాండ్‌’. ఈ బ్యాండ్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల వల్లే నాకు సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. హిందీలో నా మీద బాగా ప్రభావం చూపింది కిషోర్‌కుమార్‌, ఆర్‌.డి. బర్మన్‌లు. ఆ తరువాత ‘కోల్డ్‌ప్లే, యు2, పర్ల్‌ జామ్‌’ బ్యాండ్‌లంటే ఇష్టం.
అమితాబచ్చన్‌తో పనిచేస్తున్నారు కదా. ఆయనతో మర్చిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?
మొదట్లో ఆయనతో పనిచేయడం ఎలాగా అని చాలా ఆందోళన పడ్డాను. కాని ఒకసారి పనిచేయడం మొదలుపెట్టాక అదెంత సులువో అర్థమైంది. ఆయన సానుకూల వ్యక్తిత్వం కలిగిన మనిషి. సెట్‌లో తన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎంతో తేలికపరుస్తారు. సెట్‌పైకి రాగానే ఆయనతో మాట్లాడితే చాలు మీకు తెలియకుండా కంఫర్టబుల్‌ జోన్‌లోకి వచ్చేస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది అద్భుతమైన అవకాశం. నా సినిమా ఇంకా పూర్తికాలేదు ఇప్పటికీ ఆయనతో షూటింగ్‌ చేస్తూనే ఉన్నాను. ఆయన పనంటే నాకెంతో ఇష్టం. అమితాబ్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం వల్ల ఎక్కువ సమయాన్ని ఆయనతో గడుపుతున్నాను. అది నాకెంతో ఉత్సాహాన్నిస్తోంది.
తెలుగు సినిమా గురించి, ఈ పరిశ్రమ గురించి మీకెంతవరకు తెలుసు? హైదరాబాద్‌ వచ్చారు కదా తెలుగునటుల్ని ఎవరినైనా కలుస్తారా?
నా షెడ్యూల్‌ చాలా టైట్‌గా ఉంది. టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.
‘మర్ద్‌’ క్యాంపెయిన్‌ గురించి…
మర్ద్‌(MARD- Men Against Rape and Discrimination) క్యాంపెయిన్‌ను 2013లో ప్రారంభించాను. ప్రారంభం నుంచే ఈ క్యాంపెయిన్‌ పలు సామాజిక వెబ్‌సైట్లలో చర్చలకు వేదికయ్యింది. షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, అర్జున్‌ రాంపాల్‌, హృతిక్‌రోషన్‌లు దీనికి మద్దతుగా నిలిచారు. ఈ క్యాంపెయిన్‌ ఏర్పాటుచేయడం వెనక బలమైన కారణమే ఉంది. 2012 ఆగస్టులో ముంబయికి చెందిన పల్లవి అనే న్యాయవాది అతి కిరాతకంగా హత్యకి గురైంది. వాచ్‌మెన్‌ లైంగిక అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఆమె నిరాకరించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడా ప్రబుద్ధుడు.
క్యాంపెయిన్‌ను విద్యాసంస్థలకి చేరువ చేయాలనేది నా ఆలోచన. అలాగయితే మహిళల్ని గౌరవించాలనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరేలా చేయొచ్చనేది నా అభిప్రాయం.
ఈ క్యాంపెయిన్‌ నుంచి ఏం కోరుకుంటున్నారు?
నా జీవితాంతం చేయాలనుకున్న పని ఇది. సంగీతం ద్వారా మర్ద్‌కు సాయపడదామనుకుంటున్నాను. అలాగని నేను దాన్ని సెన్సేషనల్‌ చేయాలనుకోవడంలేదు. మర్ద్‌ గురించి తెలుసుకున్న వాళ్లు దాన్లోని ఫిలాసఫీ పట్ల నమ్మకం చూపాలి. అంతేకాని అంతా విన్నాక ఆశ్చర్యంతో ‘అవును’ అనడంతో సరిపెట్టడం కాదు. బాల్యం నుంచే ఆడ, మగ ఇద్దరూ సమానం అనేది అర్థమయ్యేలా చెప్పాలనేదే మా ఉద్దేశం. సమాజంలో నెలకొన్న ఈ అసమానతల వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో క్యాంపెయిన్‌ ద్వారా వివరిస్తాం. ఈ క్యాంపెయిన్‌ నాజీవిత కాలపు కమిట్‌మెంట్‌. ఒక్కరాత్రిలో మార్పు రాకపోయినా నెమ్మదిగా మార్పు రావడం ఖాయమనేది నా నమ్మకం. మేము ‘మ్యాజిక్‌ బస్‌’ అనే ఎన్జీవోతో కలిసి ఆడపిల్లల విద్య కోసం పనిచేస్తున్నాం. చాలా కుటుంబాల్లో సమీపంలో విద్యాలయాలు లేని కారణం వల్ల కాకుండా అమ్మాయిలకు చదువు ఎందుకనే భావనతో వాళ్లని చదివించరు. ఆ ధోరణి పోగొట్టి అమ్మాయిలకు చదువు చెప్పించేందుకు గాను ‘మ్యాజిక్‌ బస్‌’ కోసం నిధులు సేకరిస్తున్నాం.
మీరు ఎదుర్కొన్న వైఫల్యాలు ఎక్కువ సమయాన్ని పనికి కేటాయించేలా చేశాయా?
వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితంలో ఎత్తుపల్లాలనేవి ఒక భాగం. అలాగని వాటి గురించే బాధపడుతూ డిప్రెస్‌ అయిపోయి అక్కడే ఆగిపోరు కదా. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా తరువాత ఏం చేయాలనేది ఆలోచించాలి. అంతేకాని విచారిస్తూ కూర్చోవడం, చిటపటలాడడం, సోమరిగా మారిపోవడం వల్ల ఏం ఒరుగుతుంది. వైఫల్యాల నుంచి పాఠాల్ని నేర్చుకోవాలి. అప్పుడు వైఫల్యాలనే అవకాశాలుగా మలచుకోవచ్చు. అలాచేసినప్పుడు వైఫల్యం అనేది అనుభవపాఠంగా మాత్రమే మిగిలిపోతుంది. ఇక్కడ చెప్పిన వాటిలో చివర్లో చెప్పిన పని చేసేందుకే నేను ఇష్టపడతాను. ఇలా చెప్తున్నానని పుట్టుకతోనే నాకు ఈ సత్యం తెలిసిరాలేదు. జీవితానుభవాలే నేర్పాయి.
హైదరాబాద్‌లో ఇవ్వబోయే ఈ ప్రదర్శన గురించి మీరెలా ఫీలవుతున్నారు? ఈ ‘విండ్‌సాంగ్‌’ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ గురించి వివరించండి…
దీని గురించి నా ఫీలింగ్‌ని ఒక్కమాటలో చెప్పడం కష్టం. కాన్సర్ట్‌ చేస్తున్న సమయంలో ఎక్కువమందిని కలుస్తాం. ఎక్కువమంది ఔత్సాహికులు వస్తారు. వాళ్లని చూస్తే మాకు ఉత్సాహం వస్తుంది. ప్రేక్షకులతో నేరుగా కలవడం వల్ల వాళ్లు మనం చేస్తున్న దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. ప్రదర్శన జరుగుతున్నప్పుడు వాళ్లలో కనిపించే వ్యక్తీకరణ నిజాయితీతో ఉంటుంది. అది చాలా అపురూపమైనది. ప్రదర్శన జరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో అనుసంధానమయ్యేలాంటి అవకాశం సినిమాల్లో నటించినప్పుడు రాదు.
టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”సినీ బ్రహ్మం” గారికి ముప్ఫై ఏళ్ళు-

మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ విడుదలై నేటికి 30 ఏళ్లు

                                             చారిత్రక చిత్రాలకు తలమానికం
కులమత విభేదాలు, విగ్రహారాధన, జంతుబలులు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 400 ఏళ్ల క్రితమే నినదించిన సంస్కర్త, తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం. అటువంటి మహనీయుని చరిత్రను అనితరసాధ్యమైనరీతిలో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు మహానటుడు ఎన్టీఆర్‌. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం.

ఇతిహాసాలు, చారిత్రక కథాంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రాల్లో ఒక పాత్రలోని బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యదశలను చూపించిన చిత్రాలు తెలుగులో ఏ మూడో నాలుగో ఉంటాయి. వాటిల్లో ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలే రెండు ఉండటం గమనార్హం. ఆ చిత్రాలు ‘భీష్మ’,‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’. ఏమాత్రం గ్లామర్‌, వినోదం లేకుండా కాషాయ వస్ర్తాలు ధరించి, సందేశాలు చెప్పే ఒక తత్వవేత్త కథతో సినిమా రూపొందించడమే ఒక సాహసం. అందులో వాస్తవచరిత్రలో ఉన్న వివాదాంశాలను కూడా ధైర్యంగా చర్చించడం, ప్రజలను ఒప్పించి మెప్పించడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అంతకుముందు ఐదారుగురు బ్రహ్మంగారి గురించి చిత్రాలు ప్రారంభించినప్పటికీ అనేక అవాంతరాలతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేశారు. ఎన్టీఆర్‌ ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపించినా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. దాదాపు రెండేళ్లు పరిశోధనలు చేసి స్ర్కిప్ట్‌ రూపొందించారు. సంఘాన్ని చూసి బాధపడి, భవిష్యత్‌ను ఊహించిన మహాజ్ఞాని బ్రహ్మంగారనీ, పీడత వర్గాలను చూసి వేడి కన్నీటిబొట్లు రాల్చిన సంస్కర్త అనీ ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ చెప్పేవారు. బ్రహ్మంగారు తన జీవితంలో ఏ యే ప్రాంతాల్లో పర్యటించారో అక్కడే ఈ చిత్రం షూటింగ్‌ జరగడం విశేషం. రాయలసీమ ప్రాంతంలో ఎన్టీఆర్‌ తొలిసారిగా షూటింగ్‌ జరిపిన చిత్రం ఇదే. రాయలసీమలోని కందిమల్లాయపల్లె, అహోబిలం తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. అలాగే ముమ్ముడివరం బాలయోగి మందిరం దగ్గర షూటింగ్‌ జరిపిన ఏకైక చిత్రం ఇదే. షూటింగ్‌కు ముందు బ్రహ్మంగారి మఠాన్ని ఎన్టీఆర్‌ సందర్శించారు. అప్పుడే బ్రహ్మంగారు ఉపయోగించిన వస్తువుల నకళ్లను తయారు చేయించడానికి ఆయన పాదుకల్ని పరిశీలించారు. బ్రహ్మంగారి పాదుకలు ఎన్టీఆర్‌ పాదాల కొలతతోనే ఉండటం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో సిద్ధయ్య పాత్రను నందమూరి బాలకృష్ణ పోషించారు. ఆయన నటజీవితంలోనే అత్యుత్తమమైన నటన ప్రదర్శించిన చిత్రంగా నిలిచింది. అలాగే కక్కడిగా సత్యనారాయణ పాత్ర కూడా ప్రశంసలు అందుకొంది. ముక్కామల, రుష్యేంద్రమణి, దేవిక, కాంచన, రతి, ప్రభ తమ పాత్రల్లో రాణించారు.
కొండవీటి వేంకటకవి రచనా చాతుర్యం, సుసర్ల దక్షిణామూర్తి సంగీత సౌరభం, నందమూరి మోహన్‌కృష్ణ ఛాయాగ్రహణ నైపుణ్యం బంగారానికి తావి అబ్బినట్లుగా వన్నె తెచ్చాయి. ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు ఈ చిత్రానికి సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి, అద్భుతమైన అభినయంతో, అనితర సాధ్యమైన దర్శకత్వ ప్రతిభతో ఎన్టీఆర్‌ ప్రాణం పోశారు. చిత్రంలోని పాటలు, కాలజ్ఞాన తత్వాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గాయకుడు రామకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిందీ సినిమా. 1981లో ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్రనిర్మాణం పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం 1984 నవంబర్‌ 29న విడుదలై ఘనవిజయం సాధించింది.
తెలుగులో తొలిసారి వందకు పైగా ప్రింట్లతో విడుదల కావడం ఒక విశేషం.
                   ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో విడుదలైన
‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రం ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ రాజకీయ జైత్రయాత్రకు ఒక టానిక్‌లా పనిచేసింది. పార్లమెంట్‌లో ఒక ప్రాంతీయపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఏకైక చారిత్రక సంఘటనలో ఈ చిత్రం తనదైన ప్రభావం చూపించింది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనువాదం “అయితే” నేం ?

scan0003

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64

99-  రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ  జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో డిగ్రీ పొంది  ఆ నాటి ఆగ్రా యూనివర్సిటి నేటి అంబేద్కర్ యూని వర్సిటిలో నుండి సంస్కృత  ఏం .ఏ. సాధించాడు .జీవిత కాలం బికనీర్ లో గడిపాడు .1962లో భారత రాష్ట్ర పతి నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు నందు కోన్నాడు .

బికనీర్ లోని దుంగార్ కాలేజిలో సంస్కృత అధ్యాపకుడుగా 1928లో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు .హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పదోన్నతి పొంది1956లో పదవీ విరమణ చేశాడు .తరువాత ఆలిఘర్ లో ఉన్న హీరాలాల్ బరాశాని కాలేజి లో  సంసృత శాఖాధ్యక్షునిగా సేవలందించాడు .1958లో సంస్కృత ,రాజస్థానీ , హిందీ విద్యా వ్యాప్తికోసం ‘’హిందీ విశ్వ భారతి ‘’సంస్థను స్థాపింఛి జీవితాంతం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .

బికనీర్ సంస్థానం లో’’ రాజ గురు ‘’  .హోదా లో ఉంటూ ఎందరో విద్యార్ధులను ప్రభావితం చేశాడు .ఆయన ప్రముఖ శిష్యులలో నరోత్తమ దాస్ ,బ్రహ్మానంద శర్మ ,కాశీరాం శర్మ ,కృష్ణ మెహతా ,రేవత్ సరస్వతి వంటి దిగ్గజాలున్నారు .

విద్యాధరీయం

తాత గారు హరనాం  దత్ శాస్త్రి గారి జీవిత చరిత్రను సంసృతం లో ‘’హర నామామృతం ‘’అనే మహా కావ్యాన్ని విద్యాధర శాస్త్రి రచించాడు .ప్రపంచాన్ని అభివృద్ధి చేయటమే ఈ కావ్య పరమావధి గా రాశాడు .రెండవ మహాకావ్యం ‘’విశ్వ మానవీయం ‘’ఇందులో ఆధునిక శాస్త్ర  సాంకేతికాభిద్ధిని అభివర్ణిస్తూ మానవుడు చంద్ర మండలం పై కాలు మోపే మహత్తర సంఘటను కూడా చేర్చటం ఆయన మానవీయ ,నవీన భావ అవగాహనకు  నిదర్శన .చంద్ర గుప్త విక్రమాదిత్యుని కాలం లో సాంస్కృతిక వ్యాప్తిని వివరించే ‘’విక్రమాభి నందనం  ‘’రాశాడు .ఇందులో శంకరాచార్య ,రాణీ  పద్మావతి ,రాణా ప్రతాప్  ,గురు గోవింద సింగ్ ,శివాజీ వంటి త్యాగ ధనులజీవితాలను తెలియ జేశాడు .’విక్రమాభ్యుదయం ‘’అనే చంపూ కావ్యమూ రాశాడు .’వైచిత్ర్య లహరి ‘’లో అడ్డూ ఆపూ లేని స్వేచ్చా జీవితాన్ని హాస్య స్పోరకం  గా చిత్రించి మార్గ దర్శనం చేశాడు .అలాగే ‘’మత్త లహరి ‘’లో ఒక మత్తు మందు భాయీ సమాజం లోని అందర్నీ సంఘ కట్టు బాట్లు చేదించుకొని తనతో కలిసి మందు కొట్టమని  ఆహ్వానించే విషయాన్ని సరదాగా రాశాడు సంస్కృతం లో. మత్తుడి స్నేహితుడి మనోభావాలను’’ఆనంద మందాకినీ ‘’లో రాశాడు .’’హిమాద్రి మహాత్మ్యం ‘’ను1962లో  పండిత మధన మోహన మాలవ్యా శత జయంతి  సందర్భం గాను ,భారత చైనా యుద్ధ సమయం లో రాశాడు .ఈ కావ్యం లో మాలవ్యాజీ దేశ ప్రజలను హిమాలయాలను రక్షించాలి ,పర్యావరణం కాపాడాలని చేసే సందేశం ఉంది .మహా కవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకంపై వ్యాఖ్యా నం గా ‘’శాకుంతల విజ్ఞానం ‘’రాశాడు .దీనీలో ప్రేమ సౌందర్యాన్ని  ఆరాధనీయత ను   వివరించాడు .

1915లో విద్యాధరుడు రాసిన ‘’శివ పుష్పాంజలి ‘’మొదటగా ప్రచురితమైంది .ఇందులో ఒకే ఛందస్సును వాడకుండా వైవిధ్యం గా గజళ్ళు,ఖవ్వాలీలు కూడా చేర్చాడు .దీనితో బాటు ‘’సూర్య స్తవం ‘’కూడా ముద్రించాడు .ఆన్ని వేదాంత విషయాలకు అద్వైతమే భూమిక అని తెలియ జేస్తూ ‘’లీలా లహరి ‘’రాశాడు .’’పూర్ణానందం ‘’అనే సంస్కృత చారిత్రిక  నాటకం,’’కాళీ దైన్యం’’ ,’’దుర్బల బలం ‘’అనే నాటకాలూ  కూడా  శాస్త్రి రాశాడు .ఇందులో భౌతిక సుఖాల కంటే పారమార్ధక జీవన విధానం శ్రేష్టం అనే నీతి బోధ ఉంది .   తులసీదాసు శ్రీ కృష్ణునిపై రాసిన గీతాలను ‘’కృష్ణ గీతావళి ‘’పేరిట సంకలం చేసి ప్రచురించాడు

అవార్డులు –రివార్డులు

వారణాసి లోని విశ్వసంస్కృత  సాహిత్యపరిషత్ ఆధ్వర్యం లో ఆనాటి రాష్ట్ర పతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చే  అభినందన సత్కా రాలు అందు కోన్నారు . 1962 లో రాష్ట్ర పతి శ్రీ సర్వేపల్లి రాదా క్రిష్ణ గారి నుంచి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు పొందారు  .రాజస్తాన్  సాహిత్య అకాడేమి ఉదయపూర్ వారి నుంచి ‘’మనిషి ‘’అనే మహా బిరుదు ను పొందారు .భారత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా రాష్ట్ర  పతి శ్రీ గిరి గారి నుండి సంస్కృత విద్యా వేత్త సన్మానం పొందారు .ఆఖిల భారత సంస్కృత ప్రచార సభ ‘’కవి సామ్రాట్ ‘’బిరుదుతో సత్కరిం చింది .బికనీర్ భారత విద్యా మందిరం వారు 1980లో ఘనం గా పౌరసన్మానం చేసి గౌరవించారు .వీరికి ‘’హరిత్ రుషి ‘’స్మారక పురస్కారం కూడా లభించింది .

విద్యా ధర శాస్త్రి సర్వ గ్రందాలను ‘’విద్యాధర గ్రంధావళి ‘’పేరున ప్రచురణ పొందాయి

Inline image 1Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63

98-  బహు భాషావేత్త-అభినవ కాళిదాసు  పండిత భట్ట మధురానాధ శాస్త్రి

23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు  చెందిన అనేక  సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర వేత్త ,బహు భాషా శాస్త్రజ్ఞుడు .ఆధునిక సంస్కృత కవుల్లో ప్రాచీన ,నవీన రచనలు చేసిన మేధావి .సంస్కృతం లో అనేక ప్రక్రియలను పరిచయం చేసిన ప్రయోగ శీలి .యాత్రా సాహిత్యం ,రేడియో నాటికలు ,వ్యాసాలూ చిన్నకధలు మొదలైనవి రాసి కొత్త ఒరవడి సృస్టిం చాడు .గజల్ ల తో సహా టుమ్రీలు ,దర్దులు ,ద్రుపద లు అనేక  పాటలు రాసి మెప్పించిన కవి .వైవిధ్యం ఆయన సొత్తు .సంసృతం లో హిందీ ని ప్రాకృత వ్రజ భాషను చొప్పించిన మేటి .

బాల్యం విద్యాభ్యాసం

మదురా నాద శాస్త్రి జైపూర్ లో సాంప్రదాయ ‘’దేవర్షి కుటుంబం’’ లో జన్మించాడు .వీరిది తరతరాలుగా కవి పండిత కుటుంబం .వీరి పూర్వీకులు తెలంగాణా ప్రాంతం నుండి వచ్చి జైపూర్ లో ఉన్నారు.  గౌతమస గోత్రం ..కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన వారు .వీరి పూర్వీకుడు బావాజీ దీక్షితులు ఆంద్ర దేశం నుండి వారణాశికి వలస వచ్చి  ,ప్రయాగ ,రేవా బుండీ లలో నివాసం ఉన్నారు. వీరి వంశం లో ప్రసిద్ధులైన దేవర్షి కవి కళానిధి అనేసంస్కృత , , వ్రజ భాషా పండితకవిని సాదరం గా జైపూర్ సంస్థానానికి రాజా సవాయ్ జై  సింగ్ ఆహ్వానించి గౌరవించి ఆస్థానకవిని చేసి ‘’కళానిధి’’ బిరుదునిచ్చి సత్కరించాడు .ఈ వంశం వారే కృష్ణ భట్ట ,ద్వారకా  నాద భట్టు ,జగదీశ భట్టు వాసుదేవ భట్టు ,మండన భట్టు .వీరందరూ రాజస్తాన కవులే .ఈ దేవర్షి వంశం లో మధురా నాద భట్టు 23-3-1889న జైపూర్ లో జన్మించాడు .

ఉర్దూ ,పారశీక భాషల్లో మొదట విద్య నేర్చి మధురానాద శాస్త్రి తర్వాత వ్యాకరణం సంస్కృతం జైపూర్ మహా రాజా కాలేజి లో అభ్యసించాడు .1903లో వ్యాకరణం లో సర్వోత్క్రుస్ట శ్రేణిలోను,1906లో సంస్కృత ఉపాధ్యాయ పరీక్షలో మొదటి స్థానం సాధించ ఉత్తీర్ణుడైనాడు .1909లో సంస్కృత ఆచార్య పరీక్ష లో అద్వితీయమైన మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు . ఆయన విద్యా గురువులు ప్రసిద్ధులైన పండిత మధు సూదన ఓజా ,పండిత కాశీనాద్ శాస్త్రి ,పండిత గోపీనాద్ నాంగ్ల్యా ,లక్ష్మీ నాద శాస్త్రి ,హరి దత్తు ఝా ,శ్రీ కృష్ణ శాస్త్రి .మధురానాధుని సహ  విద్యార్ధులలో ప్రముఖులు వేద చూడామణి పండిత మోతీలాల్ శాస్త్రి ,మహా మహోపాధ్యాయ పండిత గిరిధర చతుర్వేది .వ్యాకరణ మార్తాండ పండిత లక్ష్మీ నాద శాస్త్రి ,లక్ష్మీ రాం స్వామి ,రాజ గురు పండిత చంద్ర దత్తు ఓజా ,పండిత సూర్య నారాయణ శర్మ ,పండిత గోపీ నాద కవిరాజ్ ,పండిత చంద్రాధర్ శర్మ గులేరి .

మధురానాధుడు మూడు సార్లు వివాహమాడాడు .1909లో రాజాస్థాన పురోహితుని కుమార్తే సావిత్రీ దేవిని పెళ్లి చేసుకొని ముగ్గురు సంతానాన్ని పొందాడు .వారు పసి తనం లోనే చనిపోయారు భార్య కూడా మరణించింది . తర్వాత మధురాదేవిని పెళ్లాడితే ఆమె ప్లేగు వ్యాధితో చనిపోతే తృతీయ వివాహం గా పండిత గోపీ కృష్ణ కుమార్తె రమాదేవిని వివాహం చేసుకొన్నాడు .ఈమెకు  నలుగురు –ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలూ  జన్మించారు .కుమారులు ,మనుమలు అందరూ ప్రసిద్ధ కవి పండితులైనారు .

ఉద్యోగం –రచన

1926 -31కాలం లో జైపూర్ మహా రాజా సంస్కృత విద్యాలయం లో ఉపాధ్యాయుడు గా మధురానాధుడు పని చేశాడు తర్వాత సంసృత అధ్యాపకునిగా ,సంస్కృత శాహాధ్యక్షునిగా సేవలందించాడు .ఉద్యోగం చేస్తూ ‘’సంస్కృత సుబోధిని ‘’అనే రెండు భాగాల పుస్తకం రచించాడు .పిమ్మట ‘’సులభ సంస్కృతం ‘’రాస్తే దానిని రాజస్థాన్ ప్రభుత్వం పాఠ్య గ్రంధం గా చేసింది .భట్టు కు మొదటి నుండి హిందీ మీదకూడా వల్లమాలిన అభిమానం ఉంది .ఆయన చొరవతో జైపూర్ మహా రాజా కాలేజి హిందీ సాహిత్య సమ్మేలన్ వారు నిర్వహించే హిందీ పరీక్షా కేంద్రమైంది .ఈ పరీక్షలు హాజరయ్యే వారీ ఒక గుడిలో సాయం కాలం ఉచితం గా క్లాసులు నిర్వహించి తరిఫీదు నిచ్చేవాడు .

శాస్త్రి పద్నాలుగవ ఏడు నుంచేసంసృతం హిందీలలో  రచనలు చేశాడు .చనిపోయే వరకు సాహిత్య రచన చేస్తూనే ఉన్నాడు .ఆయన సాహిత్యం లక్ష పేజీల వరకు  ఉంటుంది .సంస్కృతం లో –ఆదర్శ రమణి ,గాదా రత్న సముచ్చయం ,గీర్వాణ గిరా గౌరవం ,గోవింద వైభవం ,చషకం ,జయాపూర్వ విభవం ,ప్రబంధ పారిజాతం ,భాతి భావనో భగవాన్ ,భారత వైభవం ,మంజులా నాటికా,మొఘల సామ్రాజ్య సూత్రదార్ మాన్సింగ్ ,రస గంగాధరం పై ‘’సరళ ‘’పేరిట వ్యాఖ్యానం ,  సంస్కృత సుధా ,ధాతు ప్రయోగ పరిజ్ఞానం ,ఆర్య నామాది భాషా కావ్య కుంజ ,రస సిద్ధాంత ,వినోద్వాటిక,సంస్కృత కదా నికుమ్జ్ ,బిహాన్ స్తస్య కావ్యామ్చి ,కావ్య సిద్ధాంతం  ,స్తుతి కుసుమాంజలి ,రసగంగాధర సమీక్ష

అనేక సంస్కృత కావ్యాల ముద్రణకు సంపాదకత్వం వహించాడు .అందులో కాదంబరి, రసగంగాధారం  ,సంస్కృత గాదా సప్త శతి ,గీర్వాణ గిరా గౌరవం ,ప్రబంధ పారిజాతం ,మొదలైనవి .సంస్కృత పత్రికలైన ‘’సంసృత రత్నారం ‘’ ‘’భారతి ‘’లకు సంపాదకునిగా సేవ చేశాడు .

హిందీ భాషలో –శరణాగతి రహస్య ,వ్రజ్ కవితా

పాటలు –సంస్కృతం లో గజళ్ళు ,హిందూ స్తాని సాంప్రదాయ సంగీత కీర్తనలు ,టుమ్రీలు ద్రుపదలు ,దర్దాలు రాశాడు భారతీయ శాస్త్రీయ సంగీతం రవీంద్ర సంగీతాలు అంటే మహా ఇస్ట పడేవాడు

పురస్కారాలు

కవి శిరోమణి ,కవి సార్వ భౌమ సాహిత్య వారిది అనే బిరుదులూ పొంది వివిధ సంస్తలచేత సమ్మానింప బడ్డాడు .మధురానాద శాస్త్రి కున్న పరిజ్ఞానం చాలా తక్కువ మందికి మాత్రమె ఉందని విమర్శులు ముక్త కంఠంతో చెప్పారు .సంస్కృత సాహిత్యానికి నవీన సూర్యోదయం తెచ్చాడు .ఎన్నో ప్రక్రియలను ప్రవేశ పెట్టాడు .1930-60కాలాన్ని’’భట్ట యుగం ‘’అన్నారు అందుకే .ఉజ్జైన్ లోని కాళి దాస సమితి ‘’అఖిల భారత సంస్కృత సమ్మేళనం ‘’లోమధురానాద శాస్త్రిని ఆహ్వానించి ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారాన్ని అందించి సత్కరించి ‘’అభినవ కాళిదాసు  ‘’బిరుదును ప్రదానం చేసింది . ఈయనపై అనేక  మంది పరిశోధనలు చేసి పి హెచ్ డి లు సాధించారు .

4-6-1964ణ 75 వ ఏట పండిత భట్ట మధురానాధ శాస్త్రి గుండెపోటుతో మరణించాడు .

మరో కవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంద్రకీలాద్రి ఇక్క ట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం మరచిన ఫూలే మాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”నట షావుకారు” జానకి -అంతరంగం

హీరోయిన్‌గా పనకిరావన్నారు..

సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. త్వరలో 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకున్నారు.
సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. ‘దేవదాసు’లో సావిత్రి పాత్రకు తనను తీసుకుని, దుస్తులు కుట్టించి, షూటింగ్‌ రేపు అనగా ‘నిన్ను సినిమా నుంచి తీసేస్తున్నాం’ అన్న నిర్మాతల ఏకవాక్య లేఖ అందుకుని కూడా నిబ్బరంగా ఉండగలిగారు. తన పని తాను చేసుకుంటూ, వివాదాలకు దూరంగా సినీ ప్రయాణం చేసిన ఆ ధీశాలి గురించి…
‘‘మాది రాజమండ్రి. నాన్నగారు టేకుమళ్ల వెంకోజీరావు, అమ్మ శచీదేవి. నాన్న పూర్వీకులు మరాఠీ వారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ భాషలు కూడా మాట్లాడేవారు. ఆచారాలు, విలువల పట్ల ఎంతో గట్టి నమ్మకం ఉండే కుటుం బం మాది. నేను గుంటూరులోని ‘కుగ్లర్స్‌’ ఆసుపత్రిలో పుట్టాను. మా అమ్మమ్మ పేరు ‘జానకి బాయి’. ఆ పేరే నాకు పెట్టారు. మా అమ్మాన్నాలది మేనరికపు వివాహం. ముగ్గురు పిల్లలు పుట్టాక ఆయన ఇంగ్లాండు వెళ్లి రసాయన శాస్త్రం, కాగితం తయారీలో శిక్షణపొందారు. మా నాన్న ఇంగ్లాండులో ఉండగానే మా రెండో అన్నయ్య రామకృష్ణ, సోదరి సుగుణ చనిపోయారు. అయినా, మా అమ్మ ఆ కష్టం తనలో దాచుకుని, మా నాన్నను చదువు పూర్తి చేసే తిరిగి రమ్మని చెప్పింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారికి మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనే నాన్నను ఇంగ్లాండ్‌ పంపించడానికి ఏర్పాటు చేశారు. అంతకు ముందు గాంధీగారి అనుచరుడిగా నాన్న ‘కల్లు మానండోయ్‌’ అంటూ ఊరూరా ప్రచారం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.
పోస్టల్‌ కోచింగ్‌లో ఆంగ్లం…
నాన్న ఇంగ్లాండ్‌లో చదువుకున్న మూడేళ్లలో పోస్టల్‌ కోచింగ్‌ ద్వారా అమ్మకు కూడా ఇంగ్లీషు నేర్పించారు. ఆయన లండన్‌ నుండి వచ్చాక ‘ఆంధ్రాపేపర్‌ మిల్స్‌’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మా నాన్న సముద్రం దాటి వెళ్లడంతో రాజమండ్రిలో మా బంధువులు మమ్మల్ని బహిష్కరించారు. కుటుంబాల్లో జరిగే ఏ కార్యక్రమాలకూ పిలిచే వారు కాదు. బాల్యంలో రాజమండ్రిలో మా ఇంటికి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర, గోదావరి గట్టున పిల్లలతో ఆడుకుంటూ గడిపాను. అక్కడే జీళ్లు, తేగలు, మొక్కజొన్న కంకులు కొని తినేవాళ్లం. అయితే, ఇంటి వద్ద ఎంతో క్రమశిక్షణ ఉండేది. చివరికి భోజనం వద్ద కూడా పద్ధతిగా ఉండాలనేవారు. అసత్యం చెప్పకూడదని, నిజాయితీగా ఉండాలని అమ్మానాన్న చెప్పేవారు మాకు. ఆ లక్షణాలే నాకూ వచ్చాయి. నా పిల్లలకూ అవే నేర్పాను.
లెక్కలంటే తలనొప్పి…
రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో సెకండ్‌ ఫాం చదివాక చెన్నై వచ్చేసాం. మా నాన్న బెంగాల్‌ పేపర్‌ మిల్లుకు వెళ్లిపోయారు. మద్రాసులో ఆంధ్రమహిళాసభలో చదువుకున్నాను. అపుడే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ నన్ను ఎంతో అభిమానించేవారు. మేం అక్కడ చదువుకుంటున్నపుడే ఆమె వివాహం జరిగింది. నేను లెక్కల్లో చాలా వీక్‌. గణితం అంటే తలనొప్పి. ఇప్పటికీ అంతే. ఆ విషయం మా నాన్నతో చెబితే… లెక్కలు లేకుండా సంస్కృతం, హిందీ చదువుకోమన్నారు. దాంతో పాఠశాలలో నాటకాల్లో నటించడానికి వీలు చిక్కింది. దుర్గాబాయ్‌ గారు నా చేత ‘రాధ, రుక్మిణి’ వంటి వేషాలు వేయించేవారు. అలాగే ఎగ్మూరులో ఉండే మద్రాసు రేడియోలో ‘బాలానందం’ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. పాలగుమ్మి పద్మరాజు, పివి రాజమన్నార్‌, ఆరుద్ర, బుచ్చిబాబు వంటి వారి కథలు రేడియోలో చదివే అవకాశం కలిగింది. వీటికి ఆకాశవాణి నాకు డబ్బులు ఇచ్చేది. ఆ సొమ్ము బ్యాంకులో వేసేదాన్ని, ఇంట్లో ఎవరికైనా డబ్బు అవసరం వచ్చినపుడు నేను చెక్‌ ఇచ్చేదాన్ని.
గాంధీదర్శనం…
1946లో గాంధీజీ మద్రాసు వచ్చారు. హిందీ ప్రచారసభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మూడు రోజులు నగరంలో ఉన్నారు. ఆ మూడు రోజులూ నేను, చెల్లెలు కృష్ణకుమారి గాంధీగారికి సేవలు చేయడానికి దుర్గాబాయ్‌ అమ్మగారు ఏర్పాటు చేశారు. రోజూ ట్రాములో వచ్చి వెళ్లేవాళ్లం. మూడురోజులు గాంధీగారితో ఉన్న సమయం ఎంత గొప్పదో ఆ తరువాత తెలుసుకున్నాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్‌, పండిట్‌ నెహ్రూ, సివి. రామన్‌, సత్యసాయిబాబా వంటి మహామహుల పరిచయం నాకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
తొలి సినిమా ప్రయత్నం…
రేడియోలో నా గొంతు విని బిఎన్‌ రెడ్డిగారు పిలిపించారు. ‘సినిమాల్లో నటిస్తావా’ అని అడిగారు. సరే అన్నాను. కానీ మా నాన్న అంగీకరించలేదు. రేడియో అంటే ఫరవాలేదు. సినిమాలు మనకొద్దని కోపగించుకున్నారు. నాకు పదహారేళ్లప్పుడు అంటే 1947 నవంబర్‌ నెలలో పెళ్లి చేశారు. అందుకే నేను ‘దేశానికి స్వాతంత్రం వచ్చింది, నాకు స్వేచ్ఛపోయింది’ అని సరదాగా అంటుండేదాన్ని. పెళ్లితో టేకుమళ్ల జానకి కాస్తా శంకరమంచి జానకిగా మారిపోయాను. మా వారి పేరు శంకరమంచి శ్రీనివాస్‌. తను ఆకాశవాణిలో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తరువాత విజయవాడలో కాపురం పెట్టాం. సత్యనారాయణపురంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం. అప్పుడే ‘గౌహతి వర్సిటీ’లో పరీక్షలకు రాశాను. అమ్మా వాళ్లు అప్పట్లో గౌహతిలో ఉండేవారు. పరీక్షలప్పుడు గర్భవతిని. అందుకని మానాన్నగారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. వాళ్లక్కడ ‘హ్యాపీ వ్యాలీ’లో ఉండేవారు కానీ నా మనసులో తీవ్ర ఆశాంతి ఉండేది. పెళ్లి తరువాత పుట్టినింటికి రావడం ఎంత తప్పో ఆ రోజుల్లో తెలుసుకున్నాను. స్వంతంగా జీవించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అక్కడ ఉండగానే నా ఆలోచనలో మార్పు వచ్చింది. కొంత స్థిరత్వం కూడా వచ్చింది.
మద్రాసు పయనం…
ప్రసవం తరువాత కొన్ని రోజులకు గౌహతి నుండి కోల్‌కతా వచ్చి, మద్రాసు బయలుదేరాం. అక్కడ మా సామానంతా దొంగల పాలయింది. వెండి, బంగారం పోయింది. కట్టుబట్టలతో మద్రాసు చేరాం. మా మేనమామ, అత్త మాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ తరువాత, మా వారి పొలం అమ్మిన సొమ్ముతో జీవనం ప్రారంభించాం. చేతిలో పసికందు, పాల డబ్బాలకు డబ్బులేని పరిస్థితి. సంపాదనపై దృష్టి పెట్టాలనుకున్నాను. ఏంచేయాలో తోచలేదు. ఉద్యోగాలు వచ్చే చదువు చదువుకోలేదు. మనసంతా దిగులుగా ఉండేది.
రెండో ప్రయత్నం…
చేతిలో మూడు మాసాల పసికందును పట్టుకుని, భర్తతో కలిసి మళ్లీ బిఎన్‌ రెడ్డిగారి దగ్గరకు వెళ్లాను. ఆయన్ని సినిమాలో వేషం ఇమ్మని అడిగాను. పై నుంచీ కిందికి ఓసారి చూసి ‘అప్పుడు ఇస్తానంటే వద్దని వెళ్లిపోయావ్‌, ఇపుడు నేను సినిమా ఏదీ తీయడంలేదే’ అన్నారు. నా పరిస్థితి వివరించిన తరువాత నాగిరెడ్డిగారికి ఫోన్‌ చేసి, నా గురించి చెప్పారు. అప్పుడు వాహినిలో ‘షావుకారు’ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగిరెడ్డిగారు నాకు మేకప్‌ టెస్ట్‌ చేయించారు. ఏడు రకాలు డైలాగ్‌లు ఇచ్చి చెప్పమన్నారు. దాదాపు నెల రోజుల వరకు ఏ సమాధానం రాలేదు. నేను చాలా ఆందోళన చెందాను. చివరకు ఒక రోజు షావుకారులో నువ్వే హీరోయిన్‌, హీరో ఎన్‌టీఆర్‌ అంటూ నాగిరెడ్డి వర్తమానం పంపారు. నాగిరెడ్డి, చక్రనాణి, ఎల్వీ ప్రసాద్‌లు మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అలా జూలై, 1949లో షావుకారు ప్రారంభమైంది. ఆ సినిమాకు ఎల్వీ ప్రసాద్‌ దర్శకులు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. స్వయంగా నటించి చూపించే వారాయన.
ఈ లోగా ‘పల్లెటూరి పిల’్ల చిత్రానికి సంతకం చేశాను. మూడు నెలల పాపాయిని ఇంట్లో వదిలిపెట్టి షూటింగులకు వెళ్లేదాన్ని. 1950లో షావుకారు విడుదలైంది. మంచి విజయం సాధించింది. నాకూ మంచి పేరు వచ్చింది. సినిమా పేరే ఇంటి పేరుగా మారి ‘షావుకారు జానకి’ అయ్యాను. కాని ఆ తరువాత సినిమాలు రాలేదు. ఆ సమయంలో ఒకసారి కెవి రెడ్డిగారిని కలిసాను. అప్పుడాయన ‘నీకు సినిమాలు రావు. హీరోయిన్‌గా పనికిరావు. విజయవాడ వెళ్లిపోవడం మంచి’దన్నారు. కానీ పట్టుదలతో ప్రయత్నించాను, జెమినీ, మోడరన్‌ థియేటర్‌ వంటి వారు తీసిన సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
దేవదాసు గాయం…
డిఎల్‌ నారాయణ గారు ‘దేవదాసు’లో నన్ను కధానాయకిగా ఎంపిక చేశారు. నాకు కావలసిన డ్రస్సులు కూడా కుట్టించారు. ‘ఓ దేవదా.. చదువు ఇదేనా’ పాట రిహార్సల్‌ కూడా జరిగింది. రేపు షూటింగ్‌ అనగా ‘నిన్ను సినిమా నుంచీ తొలగిస్తున్నాం’ అంటూ ఒక లేఖ పంపారు. చాలా బాధ అనిపించింది. పది రోజులు తేరుకోలేకపోయాను. నా జీవితంలో బాగా బాధపడిన సంఘటన అదొక్కటే. మా నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ వల్ల నేను త్వరగా తేరుకోగలిగాను. గతంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణగారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దేవదాసులో జానకిని తొలగించి, సావిత్రిని చివరి నిమిషంలో తీసుకున్నారని నాకు తెలియ’దన్నారు. ఆ షో లైవ్‌లో నేనూ నాగేశ్వరరావుతో మాట్లాడాను. నా తొలి సినిమా హీరో ఎన్‌టీఆర్‌ నన్ను ఎంతో గౌరవించేవారు. వారి స్వంత సంస్థ ఎన్‌ఏటీ చిహ్నం(ఎంబ్లమ్‌)లో నా బొమ్మనే వాడుకున్నారు.
సినిమా పరిశ్రమకు రాకముందు విజయవాడలో ఉండేవాళ్లం, అపుడు నైజాంలో రజాకార్ల పోరాటం జరిగేది. ఆ వార్తలను రేడియోలో వింటూ ఉండేదాన్ని. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అని వినిపించేది. చివరకు సినిమాల్లోకి వచ్చిన తరువాత జగ్గయ్యగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. 1949 నుంచీ 1973 వరకూ కథానాయకిగా పనిచేశాను. ఆ తరువాత నెమ్మదిగా సినిమాలు తగ్గించుకున్నాను. వయసు పెరగడం, పిల్లలు, బాధ్యతలు, కుటుంబ జీవితం కూడా ముఖ్యమే కదా. సినిమాలు కాకుండా 300కు పైగా నాటకాల్లో నటించాను. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో చేశాను. కె.బాలచందర్‌ గారికి నేనంటే ఎంతో గౌరవం.
ఆత్మకథలు చదువుతా…
సాహిత్యం అంటే కూడా చాలా అభిమానం. బాగా చదువుతాను. మా నాన్న మాకు చక్కటి ఇంగ్లీషు నేర్పించారు. ఆత్మకథలు ఎక్కువగా చదువుతాను. హాలీవుడ్‌ జీవిత చరిత్రలు చదువుతాను. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటాను. రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కాకపోతే ఇప్పుడీ వయసులో ప్రత్యక్షంగా పనిచేసే ఆలోచన లేదు. నరేంద్ర మోదీ, సానియా మీర్జాలంటే ఇష్టం.
మరపురాని పురస్కారం…
ఒక సభలో ఆరుద్ర గారు మాట్లాడుతూ ‘షావుకారు జానకి త్యాగరాజకీర్తన వంటిది. తెలుగువారు ఆదరించకున్నా, తమిళులు ఆదరిస్తున్నారు’ అన్నారు. నాకింతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది. బాలచందర్‌ గారి తమిళ సినిమా ‘కార్యతలైవి’ కొని, తెలుగులో డబ్‌ చేశాను. కానీ విడుదల కాలేదు. అల్లురామలింగయ్య వాళ్లు కొని, రీళ్లు పోగొట్టారు. ఆ సినిమా ఎంతో ఇష్టంగా చేశాను. అది వెలుగు చూసి ఉంటే తెలుగులో ఎంతో పేరు వచ్చేది. నటిగా కాకుండా చేసిన ఒకే ప్రయత్నం అది.
ఇప్పుడూ బాగా చేస్తున్నారు…
నూతన నటీనటులు బాగా చేస్తున్నారు. వాళ్లకి జాగ్రత్త ఎక్కువ, డబ్బు విలువ తెలుసు. ప్రస్తుతం కృష్ణకుమారితో బెంగళూరులో ఉంటున్నా. ప్రశాంత జీవనం, మంచి కుటుంబం, తోట పని, చదువుకోవడంతో కాలక్షేపం చేస్తున్నాను. ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అభిమానం చూపారు. అవన్నీ మధురానుభూతులే. కానీ ‘సీతామయ్య గారి మనవరాలు’ వంటి సినిమాల్లో నన్ను కాకుండా ఇతర భాష నటితో ఎందుకు చేయించారో అర్థం కాలేదు. దేవుడ్ని నమ్ముతాను. అవార్డులు, పురస్కారాలు రావలసినవి రాలేదని అభిమానులు చెప్పినా వాటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దేనికీ అశాంతి లేదు. పాకులాడేది లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించాను. జాతీయ, ప్రాంతీ య సినిమా అవార్డుల జ్యూరీగా పనిచేశాను. సినిమా వృత్తి అని తెలుసు, అందుకే ఎటువంటి ఫిర్యాదులూ లేవు.’’
కృష్ణకుమారి…
కృష్ణకుమారి నా చెల్లెలు. మా నాన్నగారు పోవడంతో తనూ సినిమాల్లోకి వచ్చింది. తన సొంత నిర్ణయమది. సినిమా నటిగా కృష్ణకుమారి సాధించిన విజయమంతా ఆమెకే చెందుతుంది. అప్పట్లో మేం కలిసింది కూడా చాలా తక్కువ. అంతరాలు ఉండేవి. సినిమాల నుంచీ మానేసిన తరువాత మేం బాగా దగ్గరయ్యాం. తను సినిమాల్లో సంపాదించిందంతా మా కుటుంబానికే ఖర్చు చేసింది. ఎంతో సాయం చేసింది. నేను సాంఘికాలకే పరిమితమైతే, తను జానపదాలు, చారిత్రకాలు అన్నీ చేసింది. నాకంటే బాగుంటుంది కదా. అలాగే నా కో-స్టార్స్‌తో కూడా నాకు పోటీ లేదు. నా పరిమితి నాకు తెలుసు. భానుమతి నన్ను ఎంతో బాగా ఆదరించేది. సూర్యకాంతంగారు కూడా బాగా చూసుకునేవారు.
మన్నవ గంగాధర ప్రసాద్‌, ఆంధ్రజ్యోతి, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్ర కీ లాద్రి పై విధ్వంస పరంపర -శాసనాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజ్ఞం -ఎనిమిదో కధ – దాసరి అమరేంద్ర – అవభ్రుత స్నానం

YAJNAM

అవభ్రుత స్నానం

My friend and writer Dasari Amarendra wrote an article on Yajnam of
Ka.Ra. Mastaru and sent  me the manuscript. This was published in
in an online magazine Saranga  on 9th Nov on the occasion of Kalipatnam
Ramarao’s 90th birth day. I typed the article and sent as PDF to Amarendra
and called it by the following name.
అవభ్రుత స్నానం 

గబ్బిట కృష్ణమోహన్ 
0001 0002 0003 0004 0005 0006 0007

అవభ్రుత స్నానం 

గబ్బిట కృష్ణమోహన్ 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

హద్దులు చెరిపిన ”హలీమ్ ఖాన్ ”అందెల రవళి

 

 

హద్దులు చెరిపిన అందెల రవళి
  నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయటం చాలా   కళ
అరుదైన విషయం. అదీ కూచిపూడి సంప్రదాయంలో. ప్రముఖ నృత్య కళాకారుడు హలీంఖాన్‌- ఇటీవల మా లఖాచందా అనే కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించినందుకు అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి థ్యాంక్స్‌ గివింగ్‌ అనే నృత్యం ద్వారా తన కృతజ్ఞతలు చెప్పాడు. ఈ నేపథ్యంలో- నవ్య హలీంఖాన్‌ను పలకరించింది. అప్పుడు ఆయన చెప్పిన విశేషాలివి..
హైదరాబాద్‌లో పైగా ప్యాలెస్‌కు వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. మూడో నిజాం పాలిస్తున్న సమయంలో ఈ ప్యాలెస్‌ ‘మా లఖాచందా’ అనే కవయిత్రి కవితాలపలనలతో మార్మోగుతూ ఉండేది. పైగా ప్యాలెస్‌ అమెరికా కాన్సులెట్‌ కార్యాలయంగా మారిన తర్వాత- శిధిలావస్థలో ఉన్న కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించారు. ఇప్పుడు అనేక మంది ఆ సమాధిని సందర్శిస్తున్నారు. రెండు వందలేళ్ల క్రితం నాటి వైభవాన్ని మళ్లీ తిరిగి తీసుకువచ్చినందుకు- అమెరికా అధికారులకు కృతజ్ఞతలు చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నమే థ్యాంక్స్‌ గివింగ్‌. ఇది వెల్‌కం డ్యాన్స్‌, జావళి, థిల్లాన, తరంగం, తాండవంల సంగమం. నృత్యంలో ఈ విధమైన ప్రయోగాలు చేయటం నాకు కొత్త కాదు. తానీషా, కులీ కుతుబ్‌షాలు రాసిన కవితలను నాట్యంగా మార్చి ‘యాద్‌-ఎ-మాజి’గా, అర్థవంతమైన ఇంగ్లీషు కవితలతో ‘రైమ్‌ అండ్‌ రిథమ్‌’, కూచిపూడి, బాలే, సమకాలీన సంగీతాల మేళవింపుతో ‘మిలాంజ్‌ ఆఫ్‌ డాన్సెస్‌’ లాంటి ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాను.
రూపానురూపం
భావాన్ని వ్యక్తం చేయటానికి వీలున్న చక్కని మాధ్యమం నాట్యం. ఫలానా నాట్యం సీ్త్రలే చేయాలి. పురుషులు చేయకూడదనే నిబంధనేదీ లేదు. నిజానికి 50 – 60 ఏళ్లకు ముందు నాట్య కళను కేవలం పురుషులే అభ్యసించేవాళ్లు. ఆ తర్వాత దేవదాసీలు నాట్య కళను సాధన చేసి వేదికల మీద ప్రదర్శనలివ్వటం మొదలుపెట్టారు. అలా నాట్యకళను సీ్త్రలు అభ్యసించటం మొదలైంది. పురుషులు సీ్త్ర వేషంలో, సీ్త్రలు పురుషుల వేషంలో డాన్స్‌ చేసే పద్ధతిని ‘రూపానురూపం’ అంటారు. నేను చేసేది ఈ పద్ధతే. అయితే దీనిలో అనేక ఇక్కట్లు ఉన్నాయి. గత 16 ఏళ్లలో మన దేశంలోను, ఇతర దేశాల్లోను కలిపి 800కు పైగా నాట్య ప్రదర్శనలిచ్చాను. ముఖ్యంగా నాట్య ప్రదర్శన ఇచ్చేటప్పుడు సభికుల్లో ఎలాంటి అనుమానాలు రేకెత్తకుండా ఉండటం కోసం ముందుగానే నా ఐడెంటిటీని స్పష్టం చేసేస్తూ ఉంటాను. ముఖ్యంగా విదేశీయులు ఆడ వేషంలో ఉన్న పురుషుడిని చూసి ‘గే’ లేదా ‘ట్రాన్స్‌జెండర్‌’గా పొరబడుతూ ఉంటారు. అలాంటి ఉద్దేశంతో సభికులు నాట్యం వీక్షిస్తే కేవలం శరీర కదలికల మీదే తప్ప హావభావాల మీద వారు దృష్టి పెట్టలేరు కదా! ఆ పొరపాటు జరగకుండా రూపానురూపం గురించి వివరించిన తర్వాతే ప్రదర్శన మొదలు పెడుతూ ఉంటాను. కానీ కొంతమంది డాన్స్‌ ఆర్గనైజర్లు ప్రదర్శన ఐపోయాక నేను పురుషుడినని చెప్పి సభికుల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు కదా! అని అంటూ ఉంటారు. కానీ మగవాడినైన నేను సీ్త్ర వేషంలో నాట్యం చేసి మెప్పించటానికి ఎంత అంకితభావంతో కృషి చేశానో వాళ్లు గ్రహించాలంటే నా ఐడెంటిటీని ముందుగా చెప్పక తప్పదు కదా! ఇలా ఇప్పటివరకూ పాకిస్తాన్‌, సింగపూర్‌, మలేసియా, అమెరికాలలో ప్రదర్శనలిచ్చాను.
ప్రస్థానం మొదలైందిలా..
మాది ప్రకాశం జిల్లా ఒంగోలులోని సత్యన్నారాయణ పురం. టీవీ, సినిమాల్లో కూచిపూడి నాట్యం చేస్తున్న కళాకారుల్ని చూసి నాకు కూడా అలా నాట్యం చేయాలనిపించేది. అప్పుడు నాకు పద్నాలుగేళ్లుంటాయి. ఎలాగైనా డాన్స్‌ నేర్చుకోవాలనుకున్నాను. ఇంట్లో చెప్తే ఆడపిల్లలా నాట్యం నేర్చుకోవటమేంటని వద్దనేశారు. దాంతో వాళ్ల అనుమతితో నాట్యం నేర్చుకోవటం సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకే ట్యూషన్‌ పేరుతో చాటుమాటుగా కూచిపూడి నేర్చుకోవటం మొదలుపెట్టాను. స్కూలు చదువు పూర్తయ్యాక వెంపటి చినసత్యంగారి శిష్యుడు కె.వి.సుబ్రహ్మణ్యంగారి దగ్గర నాట్యకళ అభ్యసించి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగాను. హైదరాబాద్‌లో ఓ పక్క ప్రముఖ కంపెనీకి పర్సనల్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోపక్క నాట్య ప్రదర్శనలిచ్చేవాడిని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నాట్య ప్రదర్శలు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్లకి ఆ విషయం తెలియదు. 2008లో రవీంద్రభారతిలో బాలే, కూచిపూడి మేళవింపుతో ‘మిలాంజ్‌’ అనే నాట్య ప్రదర్శన ఇచ్చాను. దానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ సమయంలో ఒక ఛానల్‌ వారు- నా ఇంటర్వ్యూతోపాటు మా అమ్మానాన్నల స్పందనను కూడా కవర్‌ చేయాలనుకున్నారు. మా అమ్మనాన్నల అడ్రస్సు అడిగారు. అప్పటివరకూ ఇంట్లో తెలియకుండా గుట్టుగా నెట్టుకొచ్చాను. ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందనిపించింది. ఆ ఛానల్‌ రిపోర్టర్‌ మా అమ్మనాన్నల ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. దాంతో మా అమ్మనాన్నలకు నా నాట్యం గురించి తెలిసింది. దాంతో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ముస్లింగా పుట్టి హిందూ సంప్రదాయ కూచిపూడి నాట్యం నేర్చుకోవటం వాళ్లకసలు మింగుడుపడని విషయం. పైగా అమ్మాయి వేషంలో ప్రదర్శనలిస్తూ పేరు తెచ్చుకోవటంతో వాళ్లు మరింత కంగారుపడ్డారు. పెళ్లి కావటం కష్టమని, నాట్యం మానేసి చక్కగా ఉద్యోగం చేసుకొమ్మని నన్ను పోరు పెట్టారు. ఎంతో ఇష్టపడి నేర్చుకున్న నాట్యాన్ని అమ్మానాన్నల అభ్యంతరం కారణంగా వదిలేయగలనా? అది జరగని పని. అదే విషయాన్ని సూటిగా చెప్పేశాను. మొదట్లో బాధపడ్డారు. కానీ నా ఎదుగుదల చూశాక క్రమంగా నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి మద్దతు ఉంది.
చాలా చేయాలనుంది..
నాకు థ్యాంక్స్‌ గివింగ్‌లాంటి నాట్య ప్రయోగాలెన్నో చేయాలని ఉంది. అలాగే యువతు నాట్యం వైపు ఆకర్షితులయ్యే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. మన . దేశ ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పటానికి, సంస్కృతిని కలకాలం కాపాడుకోవటానికి కళలెంతో తోడ్పడతాయి. భావ వ్యక్తీకరణకు నాట్య కళను మించిన కళ మరొకటి లేదనేది నా విశ్వాసం. అంతటి ప్రత్యేక లక్షణం కలిగిన నాట్యంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ దుర్గ గుడిపై ధ్వంస పరంపర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీ భేష్ అన్న నేపాల్ ప్రధాని – స్వప్న సాధకు డు మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనంmopidevi 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కోరంగి ”తుఫాన్ కు వ175 ఏళ్ళు

korangi1 001 korangi2 001 korangi3 001 korangi4 001 korangi5 001 korangi6 001భీమ ఖండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నటి మనోరమ

23_11_2014_002_010నటి మనోరమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌!

వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద తబలా విద్వాంసునిగా పని చేసిన ఆయన ఆ వాయిద్యాన్నే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘తబలా ప్రసాద్‌’ అయ్యారు. చెన్నైలోని ఎన్‌టీఆర్‌ వీధిలో నివశిస్తున్న ప్రసాద్‌.. వెయ్యి సినిమాలకు 
‘‘మాది విజయనగరం. మా నాన్నగారు జె.జగన్నాధం, అమ్మ గుబ్బమ్మ. నాన్న జెమినీ స్టూడియోలో నలభయ్యేళ్ల వరకూ తబలా విద్వాంసునిగా పని చేశారు. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. 11 మంది సంతానంలో నేను మూడోవాడిని. తేనాంపేటలో వున్న కేసరి స్కూల్లో చదువుకున్నాను. నాతో పాటు రాజశ్రీ, జయచిత్ర, రాఘవేంద్రరావు, రేలంగి గారి పిల్లలు, మణిమాల, బాబూరావ్‌ వంటి వారంతా ఆ స్కూల్లోనే చదువుకునేవారు. అన్నయ్య వీజే రామలింగం కూడా తబలా వాయిద్యకారుడే. అప్పట్లో ఆయన కేవీ మహదేవన్‌ వద్ద పని చేశారు. ఆయనకు సహాయకుడిగా నేను వెళ్తుండేవాడిని. 1950లో, అంటే నా ఏడవ ఏట ఘంటసాల గారి పాట రికార్డింగ్‌కి వెళ్లాను. అప్పుడు నాకన్నా నేను వాయించే తబాలా ఎత్తుగా వుండేది.
ఏడేళ్లకే.. 
అప్పటికే ఇంట్లో నాన్న, అన్నయ్య తబలా వాయిస్తుండడంతో వారి వద్ద నేర్చుకునేవాడిని. ఆదిలో ఆసక్తితో, ఆ తరువాత అలవాటు ప్రకారం నేర్చుకున్నాను. నా ప్రావీణ్యం చూసిన నాన్నగారు ఏడేళ్లకే తీసుకెళ్లి ఘంటసాల మాస్టారి వద్ద పెట్టేశారు. ఆయన దగ్గర ముప్ఫయ్యేళ్లపాటు పని చేశాను. చిన్నపిల్లాడినైనా పెద్దలంతా నాకు అవకాశం ఇచ్చేవారు. నాలోని విద్యని ప్రోత్సహించేవారు. ఘంటసాల వారి వద్ద పని చేస్తూనే నాన్న, అన్నయ్యలతో కలిసి కచేరీలకు, సినిమా రికార్డులకూ వెళ్తుండేవాడిని. ‘‘ఒసే వయ్యారి రంగీ! వగలమారి రంగీ…’’ పాటకి తబలా వాయించింది నేనే. ‘విప్రనారాయణ’ సినిమాలో నాన్న, అన్నయ్య, నేను కలిసి పని చేయడం విశేషం. ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు కూడా మేం ముగ్గురం కలిసి పని చేశాం. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. ఎంఎస్‌ విశ్వనాధన్‌ వద్ద 1972 నుంచి పని చేస్తున్నాను. నేను తబలాతో పాటు డోలక్‌, డోల్కీ, పఖావాజ్‌ కూడా వాయిస్తాను. చిన్న రేకు ముక్క ఇచ్చినా దానిని వాయిద్యంగా ఉపయోగిస్తాను. అలా ఎన్నో సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశాను.
వారిద్దరే ముఖ్యులు..
ఘంటసాల మాస్టారితో పాటు ఎంఎస్‌ విశ్వనాధన్‌, సత్యం, పెండ్యాల నాగేశ్వరరావ్‌, ఇళయరాజా, సాలూరి రాజేశ్వరరావ్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, ఆర్‌డీ బర్మన్‌, నౌషద్‌, చిత్రగుప్తా, రవి, బప్పిలహరి, కీరవాణి, చక్రవర్తి, ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా వంటి ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద పని చేశాను. వారంతా నన్నెంతో ప్రోత్సహించారు. ఏఆర్‌ రెహ్మాన్‌తో ‘రోజా’ సినిమాకు పని చేశాను. ఓసారి ఎంఎస్‌ విశ్వనాధన్‌ ఏదో సినిమాకు రికార్డింగ్‌ చేస్తున్నారు. పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు. నేను ఎంతోమంది మహామహులతో పని చేశాను. కానీ వీరిద్దరు మాత్రం కళాకారులను అంచనా వేయడంలో దిట్ట.
బాంబేకు రమ్మన్నారు…
ఓసారి చెన్నైలోని పామ్‌గ్రూవ్‌ హోటల్లో ఏదో కచ్చేరీ ఇస్తుండగా లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ చూశారు. నా పనితీరు నచ్చి బాంబేకి పిలిపించుకున్నారు. అలా అలా ఎంతోమంది హిందీ సంగీత దర్శకుల వద్ద పని చేశాను. ఆర్‌డీ బర్మన్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘షాలిమర్‌’ సినిమా నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది. హిందీలో ‘అమర్‌-అక్బర్‌-ఆంటొనీ’ సినిమాలో ‘పరదా హై పరదా…’ సినిమా కూడా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘ఆమె కథ’ చిత్రంలో తబాలా సోలో నాకు ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘అపూర్వ రాగంగళ్‌’ తమిళ చిత్రంలో కమల్‌ మృదంగం వాయిస్తారు. హిందీ రీమేక్‌లో ఆయన తబలా వాయిస్తాడు. అందుకోసం ఆయనకు తర్ఫీదునిచ్చేందుకు నన్నే పిలిచారు. ఒకటిన్నర నెలలపాటు నేను ఆయనింటికి వెళ్లి తబలా వాయుద్యం నేర్పాను. ఆయన కూడా అప్పుడప్పుడూ మా యింటికి వచ్చేవారు.
వారసులదీ అదే బాట..
నాకు నలుగురు సంతానం. ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు రమణ, కుమార్‌ వున్నారు. వారిద్దరూ ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌ శంకర్‌రాజా, హ్యారిష్‌ జయరాజ్‌ వద్ద తబలా వాయిస్తున్నారు. వారంతా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నా మనవడు కార్తీక్‌ వంశీ కూడా తబలా, డ్రమ్స్‌ వాయిస్తాడు. వారంతా బాగానే స్థిరపడ్డారు. మళ్లీ జన్మ వుందో లేదో తెలియదు. ఒకవేళ వుంటే మాత్రం మళ్లీ ‘తబలా ప్రసాద్‌’గానే పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. 65 ఏళ్లపాటు తబలా వాద్యకారునిగా కొనసాగానంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పటికీ నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. శరీరానికి వయసు వచ్చింది తప్ప, మనసుకి కాదు.
నేడు సహజత్వం లేదు..
అప్పట్లో మద్రాస్‌లో తెలుగు పరిశ్రమ వున్నప్పుడు తెలుగులోనూ నాకు మంచి అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడిక్కడ తెలుగు పరిశ్రమ లేదు కదా, అందులో అవకాశాలు తగ్గడం సహజమే. అప్పట్లో పాటకు 100 నుంచి 200 రూపాయల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు పాటకి 10 వేల నుంచి 20 వేల వరకు ఇస్తున్నారు. కానీ అప్పుడే హాయిగా వుండేది. అప్పుడు డబ్బు తక్కువైనా గౌరవం ఎక్కువగా వుండేది. కానీ ఇప్పుడు డబ్బు ఎక్కువ, మర్యాద తక్కువ అయిపోయాయి. కళాకారుడు డబ్బు కన్నా గౌరవమర్యాదల్నే అధికంగా కోరుకుంటాడు. ఇప్పుడు మర్యాదలతో పాటు అవకాశాలు తక్కువైపోయాయి. అన్నీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి కదా!

ఇప్పుడు కంప్యూటర్‌తోనే అన్ని వాయిద్యాలు వినిపిస్తున్నారు. మ్యాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగించడం లేదు. అందుకే పాట సంగీతంలో సహజత్వం వుండడం లేదు. సంగీతకారులు దీనిని బాగా గుర్తించగలరు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వల్ల కూడా డైలాగ్‌ మనకు స్పష్టంగా వినిపించదు. అదే మాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగిస్తే మనకు దేనికది స్పష్టంగా వినిపిస్తుంది. అంతేగాక పదిమందికి పని దొరుకుతుంది. పది కుటుంబాలు బాగు పడతాయి. సంగీత దర్శకులు దీనిని గుర్తిస్తే బావుంటుంది.
డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరు అట్లాలేదు- బెల్లి యాదయ్య

మా ఊరు అట్లాలేదు

  • – బెల్లి యాదయ్య
  • 24/11/2014
TAGS:

సహజంగా
పడమర నుంచి తూర్పుకే
వీస్తుంటుంది గాలి
ప్రవహిస్తుంటాయి నీళ్లు

దేవుడు బ్రాహ్మడూ దొరలూ
వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న
కొలువుతీరి ఉంటారు

మా పాలెం అట్లా ఉండదు
జ్వాలా నరసింహుడి గొప్ప గుడి
హరిజనుల చీకటి అరలు
పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి
మా ఊరికి

అహంకారం మనువు ఎత్తిపోస్తే
మోకాళ్లమీద కూర్చొని
వాకిట్లో గంగ దాహం తీర్చుకునే
నిషిద్ధ లోకాన్ని మీరూ చూసే వుంటారు.

సాంద్ర స్వరంగా
ఇంట్లోకి వచ్చి బల్లపీట మీదో
పట్టె మంచం మీదో కూర్చొని
సేదదీరిన దొడ్డి శ్రీరాములును
నేను మా తాతకు తోబుట్టువుగా భావిస్తాను.

ఒరేయ్ ఎల్లిగా
ఒసేయ్ లచ్చీ మాటల కొరడాలు ఫెళ్ళుమనడాలు
స్వర్గలోక గర్జనలూ మీరూ చూసే వుంటారు
వినే వుంటారు

మాల దేవయ్య
గౌండ్ల ఎంకన్నను అరేయ్ తమీ అనడం
మాదిగోల్ల స్వామి
గొల్ల కృష్ణమూర్తిని ఒరే కొడకా అనడం
మా వూళ్లో ప్రజాస్వామ్యం

ఇదీ అదీ
దీనికీ దానికీ అని
పాలు ప్రత్యేకం నేనేమి చెప్పను
కల్సి బువ్వ తినడం బాగోతా లాడడం
మంచికీ చెడుకూ అర్సుకోవడం
మరీ ముఖ్యంగా
మనుషులిక్కడ సర్వం సమానం
అనే కథ చెప్పకోడానికి
ఏ ద్వీపం అవసరమో
అదే మా ఊరు

గుడి ఓచోటా
బ్రాహ్మడో దిక్కూ
దొరలు ఓవైపూ ఉండేవారు
మా ఊళ్లో

ఈ మూడు దూరాలే
మా జనం చైతన్యానికి ముఖద్వారాలు
మా ఊరులాంటి ఊరు
ఏదైనా ఉంటే ఎన్నైనా ఉంటే చెప్పండి
అక్కడ మూడు నిద్రలు చేసి వస్తాను

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి

శేషప్పకవి సామాజిక చిత్రణ

  • – తిరునగరి, 9392465475
  • 24/11/2014
TAGS:

తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది నీతి శతకం కావచ్చు, భక్తి శతకం కావచ్చు. ఆ కాలంనాటి సమాజం పద్యాలలో కన్పిస్తుంది. తెలుగునాట ప్రశస్తికెక్కిన ‘నరసింహ శతకం’ శతక కర్త శేషప్ప కవి. ఈ కవి 1780-1800 ప్రాంతం వాడని సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. నరసింహ శతకంలో శేషప్ప నాటి సమాజాన్ని, ప్రజా జీవనాన్నీ కొన్ని పద్యాలలో ప్రస్తావించాడు. శేషప్ప కవి సమాజావలోకనాన్ని ఎత్తి చూపించడానికి అతని పద్యాలే నిత్య సత్యాలు.
అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె
వదరుపోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి
దుష్టమానవులు వర్ధిష్టులైరి
పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె బాటుమాకు
భూషణవికాస శ్రీ్ధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కరీంనగరం జిల్లాలోని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సంబోధిస్తూ చెప్పిన శతకమిది. శేషప్ప తన కాలంనాటి వికృతులను, వైపరీత్యాలను పై పద్యంలో వివరించాడు. వ్యాఖ్యానం అవసరం లేనంత సరళభాష శేషప్ప కవిది. ప్రతి పాఠకుని మదిని కదిలించే పద్యం. విద్యావంతులు, సత్యవంతులు, ధార్మికులు, పుణ్యవంతులు బాధలు పడడం, పూర్ణశుంఠలు, వదరుబోతులు పరమలోభులు, దుష్టమానవులు వెలిగిపోవడం కాలవైపరీత్యమంటూ బలహీనులైన వారికి నీవే రక్ష అని దైవాన్ని ప్రార్థించాడు కవి.
‘జందెమింపుగవేసి సంధ్యవార్చిననేమి?
బ్రహ్మమందకకాడు బ్రాహ్మణుడు
తిరుమణి శ్రీచూర్ణగురురేఫలిడినను
విష్ణునొందకకాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిననేమి?
శంభునొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి?
యాశపోవకకాడు యతివరుండు
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
– అంటూ లౌకిక వేషాలు వేసే పరమధముల బండారాన్ని బయటపెట్టాడు. పరుల ద్రవ్యంమీద బ్రీతినొందిన వారిని, పరకాంతలనపేక్షపడే వారిని, సభలలోపల నిల్చి చాటి చెప్పేవాళ్ళను. పక్షపాత సాక్ష్యం పలికే వాళ్ళను, విష్ణుదాసులను వెక్కిరించేవాళ్ళను, ధర్మసాధువులను తిట్టేవాళ్ళను, ప్రజలను, జంతువులను హింసించే పాతకులను కవి నిందించిన తీరు (54వ పద్యం) అప్పటి సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని తేటతెల్లం చేస్తుంది. వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వసిష్టుడు, వాల్మీకి, గుహుడు, శ్రీశుకుడు, శబరి వంటి మహాత్ములకు కులమేదని ప్రశ్నిస్తూ భగవంతుని కృపా పాత్రులకు కులం లేదని (74వ పద్యం) చెప్పాడు. తన నాటి వ్యవస్థలోని కులభేదాలను శేషప్ప ఖండించాడు.
మాన్యంబులీయ సమర్ధుడొక్కడుం లేడు
మాన్యముల్ చెరుప సమర్థులంత
యెండిన యూళ్ళగోడెరిగింపడెప్పుడు
పండిన యూళ్ళకు ప్రభువులంత
యితడు పేదయటంచు నెరిగింపడెవ్వడు
కలవారి సిరులెన్నగలరు చాల
దనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు
బెరకాంత తప్పెన్న పెద్దలంత
యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును పలుకవలెను (14వ పద్యం) – అంటూ నాటి సంఘంలోని అసమానతలను, అన్యాయాలను, అక్రమ పద్ధతులను తూర్పారపట్టాడు శేషప్పకవి.
నరసింహ శతకంలోని పద్యాలను నిశితంగా పరిశీలిస్తే, శేషప్పకవి తననాటి సమాజాన్ని ఎంతగా చూచాడో, అధ్యయనం చేశాడో గ్రహించవచ్చు. కొన్ని పద్యాలను మాత్రమే ఉదహరించాను. శతకాన్ని సాంతం చదివి ఆకళింపు చేసుకోవలసినవారు సహృదయులైన పాఠకులు.
‘నరసింహ శతకము ఇంత జనరంజకమగుటకు కారణములు కలవు. ఈతడు సామాన్య జనుడగుటచే జనసామాన్యమునకుగల కష్టనిష్ఠురములను గ్రహించినవాడు. వినయము వలన వివేకియగుటచే అపూర్వ విషయములనందుకొనక సామాన్య భావములనే సరసముగా, హృదయంగమముగా నొదుగునట్లు మనోజ్ఞ సీసపద్యములు చెప్పినాడు’ అన్నారు ఇతి శివశంకరస్వామి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు

  • – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788
  • 24/11/2014
TAGS:

‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత కథలుగా ఎలా మారాయా అని ఆశ్చర్యం కలిగింది. సాహిత్య సృజనకి సంబంధించి దాని ఉనికి కాలానుగుణంగా రెండు రకాలుగా మారవచ్చు.
ఒకటి – రాసిన కాలానికి ప్రాసంగికమై అప్పటి అవసరాలను నెరవేర్చి క్రమేణా మరుపులోకి మరలిపోవడం. రెండు – రాసిన కాలంలో నిశ్శబ్దంగా ఉండి తదనంతర కాలంలో ఒక పర్టిక్యులర్ దశకి ప్రాసంగికమై ఉండడం. అదృశ్యము, బలహీనులు కథలు రెండవ విభాగానికి చెందినవి. దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత నేటి కాలానికి అవసరమైన ఆలోచన, చర్చల్ని ఇవ్వగలిగినవి. స్ర్తి పురుష సంబంధాలని చిత్రించిన సాహిత్యాన్ని నైతిక పరిధి లోపలా, వెలుపలా విశే్లషించడం ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈ కథల రచనా కాలపు నేపథ్యాన్ని తరచి చూస్తే కారా మాస్టారిని ప్రభావితం చేసిన అంశాలు కనపడొచ్చు. 1945 సంవత్సరానికి, దానికి అటూ ఇటూగా ఉన్న కాలానికి చరిత్రలో ప్రాధాన్యత ఉంది.
1945 – రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం, దేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తిని వాగ్దానం చేస్తున్న కాలం, స్ర్తిలు ఉన్నత విద్యలోకీ ఉద్యోగాల్లోకీ అడుగులేస్తున్న కాలం, మధ్యతరగతి రూపురేఖలు స్పష్టపడుతున్న కాలం, మోటు విలువలు పోయి నాజూకు విలువలు ప్రవేశిస్తున్న కాలం, విస్తృత-విస్మృత వర్గాలు స్వరం సవరించుకుంటున్న కాలం, ఇటువంటి కాలంలో ఈ కథలు వచ్చాయి. కుట్ర, యజ్ఞం, చావు వంటి కథలు రాసిన కాళీపట్నం రామారావు మాస్టారు అదృశ్యము, బలహీనులు అనే కథలు రాయడం యవ్వన ప్రభావం అనిపించే అవకాశాన్ని అట్లా ఉంచుతూనే మరికొన్ని కారణాలు కూడా గుర్తించాలి.
1945 నాటికి స్ర్తి పురుష సంబంధాలను తమ రచనల్లో విస్తృతంగా చిత్రిస్తున్న రచయితలు ఇద్దరు. చలం, కొడవటిగంటి కుటుంబరావు. సంప్రదాయవాదులకీ స్వేచ్ఛాప్రియులకీ మధ్య చర్చలకి వీరి సాహిత్యం చాలా ఉపయోగపడింది. ఆ చర్చల ప్రభావం కాళీపట్నం మాస్టారు మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రెండు కథల్లోనూ అటువంటి చర్చ, పాత్రల ద్వారా ఘటనల ద్వారా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ కథాంశాలను పై ఇరువురికన్నా భిన్నంగా లాక్కొచ్చే పెంకితనాన్ని చూపారు కారా.
15 ఏళ్ల అవివాహిత లలిత, అందరికీ అన్నివిధాలుగా నచ్చిన ఒక పెళ్లి సంబంధాన్ని తోసిపారేస్తోంది. ఎందరు ఎన్ని విధాలుగా అడిగినా కారణం చెప్పదు. ఈసడించినా నోరు మెదపదు. అందరూ ఆమెని మూర్ఖురాలు అంటున్నా ఆమె మూర్ఖురాలు కాదు. ఆమె తిరస్కరణకి కారణం ఉంది. ఆ కారణం వెల్లడించకపోవడంవల్ల ఆమె మూర్ఖురాలు అనిపించుకుంది. ఆ సంబంధాన్ని లలిత ఎందుకు తిరస్కరించిందో చెప్పే క్రమంలో కథాంశం విస్తరిల్లింది. పట్నంలో ఉండే అక్కాబావ వద్దకి చుట్టం చూపుగా వచ్చిన లలిత, పక్కింటి పాతికేళ్ళ వివాహిత అనూరాధల మధ్య నడిచిన సంభాషణలే స్ర్తి పురుష సంబంధాల నైతికతకి ఉండే పలు కోణాలని పరిచయం చేస్తాయి. ఎదురింటి పెళ్లికాని కుర్రాడితో చూపులతో శృంగారాన్ని (Flirting) నెరిఫే అనూరాధ, లలితకి ఆ స్థితిలో పట్టుబడి తన ప్రవర్తనని సమర్ధించుకునే వాదన చేయగా దానిని వ్యతిరేకించే ఆలోచన లలిత చేస్తుంది. చివరికి లలిత తిరస్కరించింది ఆ ఎదురింటి కుర్రాడినే అన్నది కొసమెరుపు ముగింపు ద్వారా చెపుతారు రచయిత.
లలితకి అనూరాధకి మధ్య జరిగిన సంభాషణ ఒక ఇబ్బందికర ఘటనవల్ల పుట్టింది కనుక చర్చని నడిపిన తీరు కూడా అందుకు అనుగుణంగా సృష్టించారు. అంటే కేవలం చెప్పదలచుకున్న అంశాలను ఏదోలా సంభాషణల రూపంలో చెప్పించేయడం కాకుండా అందుకు అనువైన మూడ్‌ని సృష్టించడంలో కారా మాష్టారు చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ సంభాషణలో కేవలం నీతికి సంబంధించిన అంశాలే కాకుండా మానవ మనస్తత్వ పరిశీలన కూడా శక్తిమంతంగా ప్రతిఫలించింది. లోకానికి తప్పు అనిపించే పనిచేసి దొరికిపోయిన యువతి దాన్ని ఒప్పుగా నమ్మించడానికీ నమ్మించుకోడానికీ ఎలా ప్రయత్నిస్తుందో, ఆ తప్పుని కనిపెట్టిన యువతి దానిని తన నైతిక ఆధిక్య ప్రదర్శనకు ఎలా ఉపయోగించుకున్నదో పాత్రోచిత కథనం, సంభాషణల ద్వారా చెప్పగలిగారు రచయిత.
‘అదృశ్యాని’కి ముందు రావలసిన కథ ‘బలహీనులు’. స్ర్తి పురుషుల తొలి పరిచయాల్లోని అస్పష్టత సందిగ్ధతల దోబూచులాటని రెండే పేజీల్లో స్పష్టంగా చిత్రించారు యువ కారా. కోరుకునేది ఒకటి, ప్రవర్తించేది వేరొకటి అయిన బలహీనులకు నిరాశ అనివార్యమనే సూచన ముగింపులో కనపడుతుంది. ఒక ఆసుపత్రిలో నర్స్‌గా చేస్తున్న ఆమె సౌందర్యవతి, అంతేకాకుండా ఆ విషయం ఆమెకి బాగా తెలుసు. పేషెంట్ తాలూకు వ్యక్తి ఒకతను రోజూ ఆమెని Trickingగా ఛూస్తుంటాడు. చూడగా చూడగా చూడగా ఆమెకి కూడా అతనంటే ఆసక్తి కలుగుతుంది. కోరిక కూడా కలుగుతుంది. దానిని శీల పతనంగానూ గుర్తిస్తుంది, అయినా ఆకర్షణ తగ్గదు. పేషెంట్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకున్న అతను ఆకస్మాత్తుగా. మళ్ళీ తనకి ఎదురుపడేసరికి తన కోరిక కన్నా నైతికతే ముందుకు తోసుకువచ్చి అతన్ని నొప్పించే మాట అంటుంది. తడబడి వెళ్ళిపోతాడు అతను. నిరాశతో దుఃఖానికి లోనవుతుంది ఆమె.
ఈ రెండు కథల్లోనూ తరువాతి కథలన్నిటిలోనూ సమానంగా కనిపించే సుగుణం ఒకటుంది. కారా మాస్టారు కథని, దాని చుట్టూ అల్లుకుని ఉండే కథాంగాల్లో దేనినీ వాచ్యం చేయరు. ఎత్తుగడ మొదలు ముగింపువరకూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు కనుకనే ఆయన చెప్పకనే చెప్పిన అంశాలను వెలికి తీయడానికి ఈ డెబ్భై ఏళ్ల కాలమూ సరిపోలేదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలూ, అన్వయాలూ స్ఫురించడానికి ఈ గుణమే కారణం. కథని వాచ్యం చేయకుండా వాక్యం చేయడమనే అంశానికి నైతిక తీక్షణత కూడా ఉంటుంది. కనుకనే కారా కథలు భయపెడతాయి కూడా. ఈ రెండు కథల్లో కూడా పై గుణముంది. తన తొలి రచనల కాలానికే కథని వాచ్యం కాకుండా వ్యక్తం చేయడాన్ని సాధన చేసిన కారా వ్యక్తిగా కూడా అంతే నిగూఢ స్వభావం కలవారు. ఆ స్వభావ సిద్ధత కూడా ఈ సుగుణానికి చేర్పు అయి ఉంటుంది.
కారా కథల్లోని పాత్రలు సర్వ స్వతంత్రమైనవి. రచయిత ఆగ్రహానికో ప్రేమకో వ్యంగ్యానికో ఇష్టానికో బలికానివి. వలపక్షం లేని పాత్ర చిత్రణ వల్లనే కథకి సాధికారికత వస్తుంది. కారా తన కథల్లో ఏ పాత్రనూ సమర్ధించరు. వ్యతిరేకించరు. వాటి ప్రవర్తనలను గమనించి మంచీ చెడూ గ్రహించడమే పాఠకుల పని. ‘అదృశ్యం’ కథలో కథకుడు ఇటు లలితనూ అటు అనూరాధనూ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. కథకుని స్వరం ద్వారా ఈ అంశాన్ని గ్రహించవచ్చు.
‘‘నేను ఆలోచించాను. నా సుముఖత్వం అతనికి కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా ఉండడంవల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ కాడికి అతనిని బాధ పెట్టటమెందుకూ? ఆ ఆరంభ యవ్వనుని ఒంటరితనంలోని యాతన ఊహించి జాలి కలిగించుకున్నారు’’ (కాళీపట్నం రామారావు రచనలు, పుట 17) అంటుంది అనూరాధ. అనూరాధ మాటల్నిబట్టే ఆమె మానసిక స్థితీ, సమర్థన కోసం వాడుతున్న లాజిక్ తెలుస్తాయి. అలాగని నైతిక విలువలకే అంతిమ ప్రాధాన్యం ఇచ్చి లలితను సమర్థించారని అనుకోవడానికీ వీలు లేదు. ఆ విషయం ముగింపులో వ్యక్తమవుతుంది.
‘‘….వాళ్లకి శారీరక సంబంధం ఉండే ఉంటుందని జాణతనం ఉపయోగించి అసలు విషయం దాచి దానికి రంగులు పూచి చూపెడుతోందనీ… నేను ఇటువంటి మాటలకు మోసపోను’ అని తనలో తాను గర్వంగా అనుకుంటూ వారి దోషాన్ని స్థిరీకరించింది లలిత,’’ ‘‘గుణ శీలాలకి ప్రాధాన్యత యిచ్చే భారతనారి- లలిత- ఆ దుర్మార్గుణ్ణి, నీచుడినీ, రౌడీని తెలిసి తెలిసి యెలా వరిస్తుంది?’’ (కాళీపట్నం రచనలు, పుట-18) అంటారు కథకుడు.
స్ర్తిల లైంగిక విలువలకి సంబంధించిన చర్చ ఆ కాలానికన్నా ముందున్న అంశం. అందులోనూ ఫ్లర్టింగ్, ట్రిక్కింగ్ లాంటి సున్నిత శృంగార భావనలను ఆధునికంగా నిర్వచించడం, అసలు అటువంటి స్థితులు ఉంటాయన్న అంశాన్ని ముందుగా కథకుడు ఆమోదించడం, వాటిని కథలుగా మలచడం వలన కాలాతీతమైన ఇటువంటి భావనల మంచీ చెడూ చర్చలోకి వస్తాయి.
కారా మాస్టారి సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలించినపుడు స్ర్తి పురుష సంబంధాల చిత్రణలో శృంగారపరమైన అంశాల విషయంలో గోప్యతని పాటించడం కనిపిస్తుంది. ఈ గోప్యతని నాటక సాహిత్యంలో ఔచిత్యగుణంగా పోషించారు. నాటకంలో ప్రదర్శనకు వీలుకాని అంశాలను అర్థోపక్షేపకాల్లో చెపుతారు. యుద్ధం, రక్తపాతం, ఆహార, నిద్ర, మైధునాదులు ప్రదర్శన యోగ్యం కాదు. అందుకే సూత్రధారుడు వచ్చి వాటిని ప్రస్తావించి వెళ్ళిపోతాడు. కారా మాస్టారు కూడా తన కథలకి సూత్రధారుని వంటి పాత్ర మాత్రమే పోషించారు. పాఠకులలో తామస గుణాలను రేకెత్తించే అంశాల పట్ల గోప్యతనే అలంకారంగా మార్చుకున్నారు. కారా కథలు, దృశ్యకథలుగా కూడా భాసించడానికి ఇటువంటి జాగ్రత్తలు కూడా సాయపడ్డాయి. అందుకు అదృశ్యము, బలహీనులు కథలే ఉదాహరణలు. తన మిగతా కథలతో పోల్చుకుని గానీ, వాటి పరిణామాన్ని విశే్లషించుకున్నప్పుడు గానీ తన తొలి కథల పట్ల కారా మాస్టారికి అంతగా ఏకీభావం ఉన్నట్లు కనపడదు. అది సహజమే అయినప్పటికీ అరుదుగా తీవ్ర శ్రుతిలో దీర్ఘ్ధ్వనితో వాటిని వ్యతిరేకిస్తూ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు. అయినప్పటికీ ఈ రెండు కథలూ ఇలాంటి కథలు మరికొన్నిటి మీద విశే్లషణలు రావాల్సిన అవసరం ఉ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య

అభాగినుల పాలిట ఆపన్నహస్తం

  • -లావణ్య
  • 16/11/2014
TAGS:

ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. ‘ప్రజ్వల’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ నిరాశ్రయులకు ఆమె ఆశ్రయం ఇస్తున్నారు. ‘మహిళలను, పిల్లలను అపహరించే వారితో యుద్ధం చేసే పోరాట యోధురాలి’ (యాంటీ ట్రాఫికింగ్ క్రుసేడర్) గా ఆమెను అంతా అభివర్ణిస్తుంటారు. సంఘ సేవకురాలైన సునీతా కృష్ణన్ తాను ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ద్వారా అనేక సమాజహిత కార్యక్రమాలను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అయతే- వీధి బాలలు, అనాథ మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఎదో ఒకటి చేయాలన్న తపన పెరగడంతో ఆమె వినూత్న కార్య్రకమాలను ప్రారంభించారు. మనదేశం నుంచి నేపాల్, బర్మా వంటి పొరుగు దేశాలకు మహిళలను, పిల్లలను తరలించే ముఠాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె ధీరత్వం ప్రదర్శించారు. ఆమె సాహసాన్ని పోలీసులు, న్యాయవాదులు, సంఘ సంస్కర్తలు పలుసార్లు ప్రశంసించారు.
అసాంఘిక శక్తుల నుంచి తాను కాపాడిన మహిళలు వారి కాళ్లమీద వారు నిలబడి జీవించేందుకు సునీతా కృష్ణన్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. కార్పెంటరీ, వెల్డింగ్, కుట్లు, అల్లికల వంటివి అనాథ మహిళలకు నేర్పించి వారు స్వయం ఉపాధి పొందేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. బంధుమిత్రులు, పరిచయస్థుల చేతుల్లో అత్యాచారాలకు గురయ్యే యువతలను రక్షించి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇపుడు ఆమె వద్ద ఆశ్రయం పొందుతున్న మహిళలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. స్వయం ఉపాధితో తాము స్వతంత్రంగా బతుకుతామన్న ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల సంస్థ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని వారు చెబుతుంటారు. మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ, వీధి బాలలకు చదువు నేర్పిస్తూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అన్ని అవకాశాలను సునీతా కృష్ణన్ కల్పిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి అనేకమంది యువతులకు ఆమె వివాహాలు జరిపించారు. ఇంతగా సేవ చేస్తున్నా- ప్రజ్వల సంస్థ గురించి కానీ, సునీతా కృష్ణన్ గురించి కానీ ఎక్కడా ఎలాంటి ప్రచారం కనిపించదు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రచార పటాటోపం అనవసరమని ఆమె చెబుతుంటారు. అయతే- సమాజంలో మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న దురాగతాలపై అందరూ గొంతెత్తాలని, అన్యాయాన్ని అంతా ప్రశ్నించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే అత్యాచారాలు, అరాచకాలు కొంతవరకైనా తగ్గుముఖం పడతాయని ఆమె చెబుతుంటారు. మన దేశంలో ఏటా వేలాదిమంది అమ్మాయలు, పిల్లలు అపహరణకు గురవుతున్నారని, డబ్బు కోసం వారిని ఇతర దేశాలకు విక్రయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ మరింత పకడ్బందీగా పనిచేస్తే తప్ప దీన్ని ఆపడం సాధ్యం కాదని ఆమె అంటున్నారు. అపహరణకు గురైన ఆడపిల్లల్లో చాలామంది వేశ్యావాటికల్లో దుర్భర జీవితాలు గడుపుతూ, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని సునీత చెబుతున్నారు. సమాజంలో అన్ని వర్గాల వారూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సంఘ వ్యతిరేక శక్తుల దురాగతాలను అరికట్టవచ్చని ఆమె సూచిస్తున్నారు.

చిత్రం.. అనాథ బాలలతో సునీతా కృష్ణన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వచ్చభారత్ కు ఆదర్శం -సాలూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”తెలింగ”కుల పదం కూడా అంటున్న – ఆర్.వి ఆర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నామిని సుబ్రహ్మణ్యం రాసిన ”మూలిoటామే”నవలపై సిద్ధాంత రాద్దాం తాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముచ్చటైన మూడు -కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment