సాహితీ మిత్రులు మచిలీపట్నం 33 వ వార్షికోత్సవ సభ ఆహ్వానం 25.01.2015

ఆహ్వానం1 (1)0001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆయనొక నిత్య చైతన్య దీప్తి – జ్ఞాని అక్కినేని

ఆయనొక నిత్య చైతన్య దీప్తి

సాధారణంగా సినిమాల్లో హీరోలు మరణించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అయినా ‘దేవదాసు’, ‘మేఘసందేశం’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేసిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఒక్క ‘దేవదాసు’లో తప్ప మిగిలిన ఆ రెండింటిలోనూ సహజనటి జయసుధ అక్కినేనితో కలిసి కథానాయికగా నటించింది. ప్రాతల గురించిన చర్చ సరే, అంత కు మించిన జీవితసత్యాల మీద నాగేశ్వరరావు చేసే అమూల్యమైన వ్యాఖ్యానాల్ని ఆమె తనివితీరా వింది. తన జీవన గమనానికీ, స్పూర్తికీ అవి ఎంతో ఉపయోగపడ్డాయని మనసు విప్పి చెబుతోంది. ఒక్క జయసుధకే కాదు కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకులకు మనోల్లాసాన్ని, చైతన్య దీప్తిని అందించి వెళ్లిపోయిన అక్కినేని తొలివర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్న విశేషాలే ఇవి..
‘‘అప్పటికే ‘నోము’, ‘పండంటి కాపురం’ సినిమాల్లో నటించిన నాకు నాగేశ్వరరావు గారు హీరోగా ‘మహాకవి క్షేత్రయ్య’లో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి కాకపోయినా అందులో ఉన్న చాలా మంది హీరోయిన్లలో నే నొకరినయ్యాను. అందులో నాది ఒక నర్తకి పాత్ర. నాకు నాట్యం పెద్దగా రాకపోయినా ఏఎన్నార్‌తో కలిసే మహదావకాశం కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాను. ఆ తర్వాత రామానాయుడి గారి ‘సెక్రెటరీ’లో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలా దాదాపు పాతిక సినిమాల దాకా ఆయనతో కలిసి నటించాను.
సాధారణంగా మాతరం వాళ్లు షాట్‌లో తమ పాత్ర లేకపోతే దూరంగా వెళ్లి కూర్చోవడం చేస్తుంటారు. అక్కినేని గారు మాత్రం అలా వెళ్లే వారు కాదు. లోపల కూర్చుని స్ర్కీన్‌ మీద మా నటనను గమనిస్తుండే వారు. ఎప్పడైనా వీలు చిక్కినప్పుడు బాగుంటే అభినందించడం, ఏదైనా తేడా కనిపిస్తే ఆ విషయాన్ని సూటిగా చెప్పేవారు. దాంతో ఎక్కడ తప్పు చేస్తున్నామనేది కొత్తవాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. సినిమా అంటే అదొక సమష్టి కృషి.. అనే మాట అనుక్షణం మనసులో ఉంచుకోవడమే అందుకు కారణం. ‘‘ఈ అమ్మాయికి తెలుగు రాకపోయినా ఒకసారి డైలాగ్‌ వినిపించగానే వెంటనే గుర్తు చేసుకుని ఇంత బాగా ఎలా చెబుతోంది?’’ అంటూ పలుమార్లు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ వ్యక్తం చేసేవారాయన. మీడియా ముందు కూడా నన్ను మెచ్చుకుంటూ ఓపెన్‌గానే మాట్లాడే వారు. వాస్తవానికి ఆ మహానటునికి అప్పుడప్పుడే వచ్చిన నటి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరమేముంది? ఆయన పెద్ద మనసు కాకపోతే!.
సరదా మనిషి..
తానున్న వాతావరణాన్ని ఎప్పుడూ తేలిగ్గా, హాయిగా ఉంచడం అక్కినేని నైజం. సభావేదికల్లో ఉన్నంత సహజంగానే షూటింగ్‌ సమయాల్లో కూడా ఉండేవారు. కాకపోతే సరదాగా ముందు మాట్లాడినా ఆ తర్వాత ఆయన ఆలోచనలు మెల్లమెల్లగా విషయాల లోతుల్లోకి వెళ్లేవి. ప్రతి తాత్విక విషయాన్నీ ఒక హాస్యోక్తితో మొదలుపెట్టే వారు. ఎక్కడా కాసింత నిరాశకూ, నిర్లిప్తతకూ చోటిచ్చే వారే కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? వాస్తవానికి ఎలా ఉండాలి? అనే విషయమే ఆయన మాటల్లో ఎక్కువగా ధ్వనించేది. ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారు. అయితే పరోక్షంగానే తప్ప ఏ రోజూ వ్యక్తిగత విషయాల్ని ఉటంకించేవారు కాదు. అలా మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఒక పరంపరగా ఆయన నోట వచ్చే మాటలు మనం ఊహించని దూరాలకు తీసుకువెళ్లేవి. చాలా మంది నటీనటులకు ఆరోగ్యపరమైన విషయాలు జీవన శైలికి సంబంధించిన విషయాలే ఆసక్తిగా ఉంటాయి. పరిధి దాటితే ఆ మాటల్ని వినడానికి ఆసక్తి చూపరు. ఆయన ప్రపంచంలోని పలు విషయాలు మాట్లాడేవారు. నాకైతే ఈ విషయాలపైనే ఆసక్తి ఎక్కువ. అందుకే ఎంత సేపు మాట్లాడినా అంతే ఆసక్తిగా వినేదాన్ని. ఆయన నడిచే గ్రంథాలయం అనే మాట నేనే కాదు ఒక గంట పాటు ఆయన సంభాషణలు విన్న ఎవరికైనా అదే భావన కలుగుతుంది.
గొప్ప మార్గదర్శి..
మానవ సంబంధాల్ని ఎలా మెయింటెన్‌ చేయాలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్‌ చేయాలో బాగా చెప్పేవారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి రంగం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఒక పండితుడాయన. అయినా పరిశ్రమలో అన్ని దశాబ్దాలుగా ఉన్నా ఒక్క నిర్మాతగా తప్ప మరే రంగంలోనూ అడుగు మోపలేదు. రెండు పడవల మీద కాలు మోపడం ప్రమాదమని ఆయన నమ్మడమే అందుకు కారణం. ఎక్కువ రంగాల్లోకి వెళితే ఉన్న రంగం మీద ఏకాగ్రత లోపిస్తుంది. ఇది అసలుకే ముప్ప తెస్తుంది అనేవారారు ఏఎన్నార్‌గారు. మాలాంటి వారు ఎదుర్కొనే ఏ సమస్య విషయంలో సలహా అడిగినా ఒక సమగ్రమైన సలహా ఇచ్చేంత సమర్ధులాయన. అలా సలహా అడగకపోవడం వల్లే మాలాంటి వారు అప్పుడప్పుడు మొట్టికాయలు తినడానికి కారణమయ్యింది. నేను రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలుసుకుని ‘‘అక్కడ నీకు ఓకేనా?’’ ఇంతే అన్నారాయన. నేను సలహా ఏదీ అడగలేదు కాబట్టి. రాజకీయ రంగం మనకంత సరియైుంది కాదనే విషయం నాకు ఎప్పటి కో గానీ తెలిసి రాలేదు.
ఆయనొక వైద్యుడు..
ఆరోగ్య విషయాల్లో ఆయనకున్న అవగాహన చాలా అరుదైనది. మానసికంగా స్థిరంగా ఉండడానికి ఆయన అనుసరించే విధానం కూడా అనుసరణీయమైనది. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు, మనం చేయగలిగేది ఏమీ లేనప్పుడు ఆ విషయాల్లోకి వెళ్లకపోవడమే ఉత్తమమని అక్కినేనిగారు నమ్మేవారు. అందుకే వెళ్లకూడదని భావించిన చోటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లే వారు కాదు. ఘంటసాల గారు మరణించినప్పుడు తాను వెళ్లకపోవడం పట్ల ఎన్ని విమర్శలు ఉన్నాయో మనకు తెలుసు. విమర్శలు వస్తాయన్నది ఆయనకు తెలియని విషయమేమీ కాదు. ఆయన వెళ్లనంత మాత్రాన ఆ తాలూకు బాధ, దుఃఖం అవేవీ అతనిలో లేవని కాదు కదా! ఏమైనా ఆ నియమాలు అంత కఠోరంగా ఉండేవి మరి. అవన్నీ ఆయన ఆరోగ్య రహస్యాలే. ‘‘మీ ఆయుష్షు ఇక్కడికే పరిమితం’’ అని డాక్టర్లు చెప్పినా ఆయన వారందరినీ ఆశ్చర్యపరుస్తూ 90 ఏళ్లు జీవించారు. ఆయన అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడానికి ఒక సుఽధీర్ఘమైన జీవితాన్ని కోరుకున్నారు. దాన్ని సాధించారు.
ఆయన నాస్తికుడు. నిజమే. అయితే నా మటుకు నేను ఆయన ఆత్మే ఆయన దేవుడు అని అర్థం చేసుకున్నాను. ఆ దైవం లాంటి ఆత్మతో ఆయన నిత్యం సంభాషించేవారు. దాని ఫలితమే ఆయన నోట అమృతం లాంటి ఆ వాక్యాలు వస్తాయని నా నమ్మకం.
మనసులో దేన్నీ దాచిపెట్టుకునే వారు కాదాయన. తనకు క్యాన్సర్‌ ఉందని బహిరంగంగా చెప్పడానికి ఎవరికైనా ఎంత ధైర్యం కావాలి? అలా చెప్పడం వల్ల ఏమైనా నష్టం కలిగితే కలగవ చ్చు. కానీ అలా చెప్పడం ద్వారా ఇతరులకేమైనా లాభం కలిగే అవకాశం ఉంటే ఎందుకు ఊరుకోవాలి? అనేది ఆయన తత్వం. ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్‌ కణాలు ఉంటాయి. ఒక్కోసారి అవి కాస్త పెరుగుతాయి. సరైన వైద్యం అందితే అవి మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేస్తాయి అంటూ.. క్యాన్సర్‌ ఒక సాధారణ జబ్బేనంటూ ఎంతో మందిలో ధైర్యం నింపారాయన. అందుకే ఆయన ఎప్పటికీ చైతన్యదీప్తి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా మద్రాస్ మేనకోడలు ఛి సౌ కళ, ఉయ్యూరులో మా ఇంట్లో

మా మద్రాస్ మేనకోడలు ఛి సౌ కళ, ఉయ్యూరులో మా ఇంట్లో -మరియు 30 ఏళ్ళ క్రిందటి గండ్రాయి హైస్కూల్ శిష్యుడు జానకి రామయ్య మా ఇంటికొచ్చిన సందర్భం -21-1-15  DSCN0117 DSCN0118 DSCN0119 DSCN0120 DSCN0121 DSCN0122 DSCN9977 DSCN9978 DSCN9979 DSCN9980 DSCN9981

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహదేవన్ అందరికి మామే -విశ్వనాధ్

ఆయన అందరికి మామే

‘‘పరిపూర్ణమైన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌గారు. అన్ని రకాల పాటలకూ సమర్థవంతంగా స్వరాలు సమకూర్చగలిగే సత్తా ఆయన సొంతం. బాణీలు కట్టడమే కాదు నేపథ్య సంగీతాన్ని అందించడంలోనూ దిట్ట’’ అని అంటున్నారు కె.విశ్వనాథ్‌. ‘ప్రైవేటు మాస్టార్‌’ నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ‘స్వాతికిరణం’ వరకు ఆ బంధం సాగింది. నేడు కె.వి.మహదేవన్‌ జయంతి. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నారు కె.విశ్వనాథ్‌.
‘‘నన్ను విశ్వం అని పిలిచేవారు. నేను ‘మామా’ అనేవాడిని. నాకే కాదు ఆయన అందరికీ మామ. యూనివర్శల్‌ మామ. ‘మూగమనసులు’ సినిమాకు ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర నేను సెకండ్‌ యూనిట్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పటి నుంచి మహదేవన్‌ గారితో పరిచయం ఉంది. ఆ చిత్ర సంగీత చర్చలు హైదరాబాద్‌లోని తాజ్‌మహల్‌ హోటల్లో జరిగాయి. నేను దర్శకుడిని అయ్యాక మామతో కలిసి చేసిన తొలి సినిమా ‘ప్రైవేటు మాస్టార్‌’. అంతకు ముందే పరిచయం ఉండటంతో ‘కొత్త’ అనే భావన ఇద్దరిలోనూ లేదు. మేమిద్దరం కలిసి పనిచేసిన సినిమాల సంగీత చర్చలన్నీ సినిమా ఆఫీసుల్లోనే జరిగేవి. పాటల కోసం బయటికెళ్లి చర్చించే అలవాటు లేదు.’’
పవిత్రమైన దేవాలయం
‘‘మహదేవన్‌గారితో సంగీత చర్చలు చాలా పవిత్రంగా సాగేవి. చీకులు, బ్రాంది, సిగరెట్‌ పొగ, బయటి మాటలు… ఇలాంటి వాటికి దూరంగా ఉండేది వాతావరణం. అరచేయి వెడల్పు జరీ సేలం పంచె, సిల్కులాల్చీ (చొక్కా చేతులు రెండూ మడిచేవారు) నుదుటి నిండా చందనంతో చాలా పవిత్రంగా వచ్చేవారాయన. పుహళేంది, లిరిక్‌ రైటర్‌, డైరక్టర్‌, అప్పటికి అందుబాటులో ఉంటే నిర్మాత, తబలా వాయించే మైఖేల్‌ అక్కడ తప్పక ఉండేవాళ్లం. ఉదయం 10 గంటలకు మొదలుపెడితే మధ్యాహ్నం ఒంటిగంటదాకా, సాయంత్రం నాలుగు నుంచి ఏడుదాకా సాగేవి చర్చలు. రాత్రుళ్లు పనిచేయడమనే మాటకు తావే లేదు.’’
మహానుభావుడు
‘‘రచయితకు స్వతంత్రతనిచ్చి ముందు సందర్భానికి తగ్గట్టు పాట రాయమనేవారు. తెలుగు కాస్త అర్థమయ్యేది. అయినా నేను పక్కనుంచి ఓ సారి ఆ పాటకు అర్థం చెప్పేవాడిని. దానికి తగ్గట్టు ట్యూన్‌ కట్టేవారు. ‘పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్‌ని ఇచ్చినా మామ ట్యూన్‌ కట్టగలరు’ అని అందరూ గొప్పగా, ఒకింత ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. రచయిత రాసిన పాటకి ట్యూన్‌ చేయడమనే ప్రక్రియకు ఒకరంగా ఆద్యుడు ఆయనే. నాకన్నా వయసులో చాలా పెద్దవారు. అందుకే ట్యూను కట్టాక ఏదైనా అభ్యంతరం చెప్పాల్సి వస్తే ‘బాణీ ఏదోలా ఉంది. మీ స్టాంపు లేదు మామా’ అనేవాడిని. ‘ఏం దీనికేమైంద’ని అడిగేవారు కాదు. ‘ఫర్లేదు. రేపు మరలా కూర్చుని చేద్దాం’ అనే చెప్పేవారు. ఎదుటివారికి నచ్చకపోతే వారికి సర్దిచెప్పి ‘మమ’ అనిపించాలనే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. నిరంకుశత్వం అనే మాటకు అక్కడ తావు ఉండేది కాదు. ఎవరికీ ఈగో ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘వెన్‌ హి ఈజ్‌ ఆన్‌ జాబ్‌, హి ఈజ్‌ రియల్లీ ఆన్‌ జాబ్‌’. అంతటి మహానుభావుడు.’’
గురువాయూరప్ప..
‘‘ఎన్‌ అప్ప గురువాయూరప్ప అనడం ఆయనకి అలవాటు. ఆనందం వచ్చినా, ఆశ్చర్యం అనిపించినా అనేమాట అదొక్కటే. మేం కలిసి చేసిన సినిమాల్లో ‘శంకరాభరణం’ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. నా విజయాన్ని బాగా ఆస్వాదించేవారు. స్వతహాగా మలయాళీ అయినా ‘శంకరాభరణం’ మలయాళంలో విడుదలైనప్పుడు తెలుగు పాటలనే అక్కడా వినిపించారు. తెలుగు పాటల్లో ఉన్న సంస్కృతం వల్ల మలయాళీయులకు కూడా అర్థమవుతుందని ఆయన భావన. అందుకే కేవలం డైలాగులను మాత్రం అనువదించుకున్నారు. ఇటీవల తమిళంలో ఆ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదలైంది. బాణీలు పాతవే. అయితే తమిళ పదాలతో పాటలు రాసుకున్నారు.’’
ఆత్మీయంగా..
‘‘నేను, మామ కలిసి పనిచేసినప్పుడు ఎలాంటి భేషజాలకు తావుండేది కాదు. నేనేదో పెద్ద దర్శకుడినని, ఆయనేదో పెద్ద సంగీత దర్శకుడనే భావన కనిపించేది కాదు. ఇవాళ పెద్ద హిట్లుగా అనిపించే ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘స్వాతికిరణం’లాంటి పాటలను కూడా మేము కర్తవ్యనిర్వహణలో భాగంగా త్రికరణశుద్ధిగా చేశామంతే. అదేదో రికార్డులకోసం తపించి చేసిన పని కాదు. మా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి పాటా మాకు ఆత్మసంతృప్తి కలిగిన తర్వాతే సినిమాల్లోకి వచ్చిందనేది వాస్తవం.’’
వాళ్లు ఆశ్చర్యపోయేవారు
‘‘మహదేవన్‌గారి మరో ప్రత్యేకత ఏంటంటే రీ-రికార్డింగ్‌. ఏకసమయంలో ఒక రీలుకు రీ-రికార్డింగ్‌ చేసేవారు. ముందుగా ఏ బిట్‌ ఎన్ని సెకన్లుందో నోట్‌ చేసుకునేవారు. దేనికి ఏ వాయిద్యం అయితే బావుంటుందో నోట్‌ చేసుకునేవారు. ఒకటీరెండు సార్లు రిహార్సల్‌ చేసి నేపథ్యాన్ని అందించేసేవారంతే. అదే బాలీవుడ్‌లో అయితే ప్రతి బిట్‌కూ ప్రత్యేకంగా రీ-రికార్డింగ్‌ చేసేవారు. మామ రీ-రికార్డింగ్‌ చేసే విధానం చూసి బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి రీల్‌ను చూస్తే దర్శకుడి కన్నా గొప్పగా గుర్తుపెట్టుకోవడంలో ఆయన దిట్ట.’’
నాలుగు రోజులు
‘‘ఢిల్లీలో అవార్డు అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నేను, మహదేవన్‌గారు, ఆయన భార్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు, వాణిజయరాం కలిసే ఢిల్లీ వెళ్లాం. అప్పడు ఓ నాలుగు రోజులు ఆయనతో గడిపే అవకాశం వచ్చింది. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. ఆయన తెలుగువాడు కాదంటే నమ్మడం కష్టమే. ‘మూగమనసులు’లో పాటలు వింటుంటే అచ్చమైన తెలుగు వ్యక్తి స్వరాలు సమకూర్చినట్టు అనిపిస్తుంది. అంతటి ప్రతిభామూర్తి.’’
మహదేవన్‌గారిలాంటి వ్యక్తి ఒకసారి పరిచయమైతే ఆయన్ని వదులుకోవడం చాలా కష్టం. కె.వి.మహదేవన్‌, పుహళేంది కాంబినేషన్‌లో అద్భుతమైన సంగీతం వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చేతివేళ్ల మీద సరస్వతి పలికి తీరేదంతే. అంతటి పరిపూర్ణులు వాళ్లు. ‘స్వాతికిరణం’ సంగీత చర్చల్లోనే ఆయన్ని ఆఖరి సారి కలిశాను. ఆ తర్వాత ఆయన పోయారన్న చెడువార్త వినాల్సి వచ్చింది.’’
చల్లా భాగ్యలక్ష్మి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుమార్చని రాకకీయ యోద్ధ పాలడుగు -పి వి కి వీరాభిమాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ హవా తాగ్గిందా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐక్యతపై అనైక్యత -కమ్మీల తీరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సoఘo -3 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

Telugu maha0001 0002 0003 0004 0005

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

Letter to interested Teachers

mdevineni@icloud.com17-1-14
0001
0002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భజన చేసే విధము తెలియండీ…

భజన చేసే విధము తెలియండీ…

  • – భాస్కర్. యు.
  • 19/01/2015
TAGS:

ఇటీవలికాలంలో- జంటనగరాల్లో జరుగుతున్న పుస్తకావిష్కరణల జాతర చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. రోజురోజుకు వీటి జోరు పెరుగుతోంది. ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరుకొంటోంది. కవుల దగ్గర ఇంత డబ్బుందా? అనే ఆలోచన కలవరపెడుతోంది.
ఇవాళ పుస్తక ముద్రణతోపాటు ఆవిష్కరణ సభ, ఆ తర్వాత జరిగే సభానంతర కార్యక్రమం ఖర్చు దాదాపు యాభై వేల రూపాయలకు చేరిపోయిందనడం సత్యదూరం కాదు. కవిగాని, రచయితగాని ఈ మాత్రం ఖర్చును భరించడం సామాన్యంగానే మారింది. నగరంలోని అధిక శాతం రచయితలు బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారే కావటాన వారికిది లెక్కకాదు.
ఆవిష్కరణ సభ జరిగి పుస్తకం బయటికొస్తుంది. ఇక అది మహాగ్రంథంగా, రచయిత మహాకవిగా గుర్తింపు పొందాలి. నిస్సందేహంగా ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. సమీక్షకులు అస్మదీయులే కదా! ఇదంతా సజావుగా జరిపించడానికి, జరగడానికి సాయంత్రాలున్నాయి. కూర్చోవడాలు, లేవడాలున్నాయి. అనుకూలమైన అడ్డాలున్నాయి.
రకరకాల కవిత్వాలు. అనేక గ్రూపులుగా సాహితీమిత్రులు. సంప్రదాయ అభ్యుదయ, విప్లవ, మైనారిటీ, స్ర్తివాద, దళితవాద ధోరణులు. వీటికితోడు స్థిరపడిన ‘రెక్కలు’ ‘నానీ’ ప్రక్రియలు. అంతరంగాల్లో ఎవరూ ఎవరినీ ఖాతరుచేయరు. ఎవరికివారే గొప్ప. వీరంతా గొప్ప నటులు కూడా. అందరూ అన్ని సభలకు హాజరవుతారు. రచయితను వాటేసుకుంటారు. శుభాకాంక్షలు తెలియజేస్తారు. సుహృద్భావం ప్రకటిస్తారు. ఎలాగో వక్తల రెండు గంటలపాటు ఊకదంపుడు ఉపన్యాసాలను భరిస్తారు. సభానంతర కార్యక్రమం ముగిశాక మళ్లీ ఆ కవిని గాని, అతని పుస్తకాన్ని గాని తలచుకుంటే ఒట్టు. ఇది వారికి తెలిసిన మర్యాద.
ఇక వక్తల గురించి- అన్ని సభలనూ వీరే అలంకరిస్తుంటారు. వీరు వివిధ రంగాలవారై ఉంటారు. నిజానికి వీరికీ, మాట్లాడవలసిన అంశానికి సంబంధమే వుండదు. ఎవరికి తెలిసింది వారు వాగేస్తారు. తాత బోడినెత్తికీ, నానమ్మ మోకాలి చిప్పకూ ముడివేస్తుంటారు. కవిగారిని ఏ మేరకు మునగ చెట్టెక్కించాలో అంతవరకూ ఎక్కిస్తారు. మహాకవి లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయంటారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వేదికను ఎక్కుతూనే వుంటారు. కానీ మర్నాడు నిన్నటి కవినిగాని, అతని కవిత్వాన్నిగాని మాటమాత్రంగానైనా ఎక్కడా ప్రస్తావించరు. అది వారి హోదాకు చిన్నతనం అనుకుంటారు.
ఇక సమీక్షకుల వంతు వస్తుంది. వ్యాసకర్తలు నడుము బిగిస్తారు. వీళ్లు పుస్తకాన్ని చేలోపడ్డ ఆబోతు అక్కడక్కడా గడ్డిపరకలను కొరికినట్టు కొన్ని పేజీలు తిప్పుతారు. అలాగే ముందుమాటల్లోని కొన్ని వాక్యాలను, వెనుక మాటల్లోని మరికొన్ని వాక్యాలను తెలివిగా వాడుకుంటూ అక్కడక్కడ ప్రాచీన కవుల ప్రస్తావనలు, లేక ఆధునిక కవుల కొటేషన్స్‌ని ఉటంకిస్తుంటారు. నిజానికి తాము ఏమి చెప్పదలచుకున్నారో, వారికి ఏమి అర్థమైందోగానీ చెప్పరు. ముక్కును చూపడానికి చేతితో తలను చుట్టి హైరానా పడతారు. ఏదీ సూటిగా ఉండదు. మరికొందరైతే తాము ఫలానా పత్రికలో రాసిన సమీక్షవల్లే ఫలానా కవికి అవార్డు వరించిందని గొప్పలు చెప్పుకుంటూ వుంటారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూలు. ఇటీవలి కాలంలో ఇంటర్‌వ్యూల జోరు బాగా పెరిగింది. వ్యక్తి ఎవరు? ఏ కోణంలో ప్రసిద్ధుడు అనేది ముఖ్యం కాదు. ఇంటర్వ్యూలు జరుపుతుంటారు. సొల్లు రాతలతో పేజీలు నింపిపడేస్తారు. పత్రిక కొన్న పాపానికి పాఠకులు దాన్ని ఒక శాపంగా భరిస్తుంటారు. అంతటితో ఇది ఆగదు. ఇలాంటి ఇంటర్వ్యూలనీ కలిపి ఒక పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ఇంటర్వ్యూలు చేసేవారికి ఇదొక ఆటవిడుపు. పబ్బం గడిచిపోతూ వుంటుంది.
ఫైనల్‌గా పీఠికాధిపతుల గురించి- వీరిది చాలా పెద్ద లెక్క. ఒకవైపు కవిని పిండేస్తూ మరోవైపు తమ పాపులారిటీని పెంచుకుంటారు. ఒకే ఒక్క పుస్తకంతో దేశానే్నలేయాలని భావించే అమాయకులను వీరు చేరదీస్తుంటారు. విషయానికి అందని పీఠికలు రాస్తారు. పుస్తకాలు బయటికి వస్తాయి. కవుల స్వస్థలాల్లో ఆవిష్కరణోత్సవాలు. పీఠికాధిపతికి ప్రముఖ స్థానం. ఆయన రాజధాని నుండి రావాలి. రాను పోను ప్రయాణ ఖర్చులు. హోటల్ ఖర్చులు. ఇవన్నీ కవి భరిస్తాడు లేదా అతని మిత్ర బృందం భరిస్తుంది. సభలో కవిగారి కవిత్వం సంగతేమోగాని పీఠాధిపతిని మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు. రాత్రికి తీర్థప్రసాదాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది.
ఇక అవార్డులు- ఇదంతా ఓ మాయ. సెలక్షన్ కట్టుదిట్టంగా జరుగుతుందన్న భ్రమ కలిగిస్తారు. చివరకు ఏ ఆశ్రీతుడికో కట్టబెడతారు. ఏ మాత్రం నిజాయితీ లేని ఏడుపు. మళ్లీ అవార్డు ప్రదానోత్సవ సభ. మళ్లీ హడావుడి, హంగామా. పూర్వకవులకు, ఇవాల్టి కవులకు ఉన్న తేడా ఏమిటంటే, పూర్వకవులు ఎంత వెంపర్లాడినా పాపులారిటీ దొరికేది కాదు. వారిని వారి కవిత్వమే నిలబెట్టాలి. ఇవాళ కవులను త్రిశంకుస్వర్గంలో నిలపడానికి అనేక మార్గాలేర్పడ్డాయి. సాహిత్యం, సాహిత్య సభలు, సాయంత్రాలు కాలక్షేపం చేయడానికి వేదికలయ్యాయి.
సామర్థ్యం లేని కవి పొగను పోగేస్తాడు. ఆ పొగను బొమ్మగా విగ్రహంగా, చివరకు స్వర్ణశిల్పంగా భ్రమింపజేయడానికి అనేకమంది మాయగాళ్లున్నారు. కాని చివరకు అది పొగలాగే జారిపోతుంది. కవీ వుండడు, వాడిచుట్టూ చేరిన భజన బృందం మిగలదు. నిజమైన సాహిత్య ప్రేమికులకు మాత్రం చేదు అనుభవాలు కలుగుతాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లంకలో తెలుగు వాళ్ళు

1lanka 001 2lanka 001 3lanka 001 4lanka 001 5lanka 001 6lanka 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం

ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం

  • -కె.బి.గోపాలం
  • 17/01/2015
TAGS:

సౌందర్య లహరి
(శంకర భగవత్పాదుల
రచనకు ఆంగ్లంలో
అనువాదం, వ్యాఖ్యానం)
డా.లంక శివరామప్రసాద్,
పేజీలు: 140,
వెల: రూ.250/-
ప్రతులు అన్ని పుస్తకాల అంగళ్లలో

ఆదిశంకరుల రచనలు, వ్యాఖ్యానాలు, భక్తులకు, అనురక్తులకు మార్గదర్శకాలు. ఒక్క సౌందర్య లహరికే సంస్కృతంలోనే 35కు పైబడి విస్తృత వ్యాఖ్యానాలున్నాయి. కొన్ని రచనలను గురించి ఎంత చర్చించినా కొత్త అర్థాలు పుడుతూనే ఉంటాయి.
శంకరులు వారణాసిలో ఉండగా, సకాయముగ కైలాసానికి, శివసేవార్థము వెళ్లిరట. అక్కడ గోడ మీద ఈ రచన ఉందట. శంకరులు 41 శ్లోకాలు చదివేలోగా గణపతి మిగతావాటిని తుడిపివేసినాడట. ఇది మానవ మాత్రులకు అందగూడని రచనయని భావమట. కథ సంగతి ఎట్లున్నా సౌందర్య లహరిలో 100 శ్లోకాలున్నాయి. 41 శ్లోకాలు, గహనమయిన మంత్ర, యంత్ర విషయాలను చెపుతాయి. కడమలి అమ్మవారి సౌందర్యమును రకరకాలుగ వర్ణించి చెప్పినవి. అన్నింటిలోనూ ఆదిశంకరుల శైలి కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ప్రాచీన పండితులు కూడ ఇదే మాట అన్నట్లు తెలియవస్తుంది.
సౌందర్య లహరి శ్లోకాలను అంత సులభంగా అర్థంచేసుకోవడం కుదరదేమో! ఇందులోని 17వ శ్లోకాన్ని పారాయణం చేస్తే, జ్ఞానం కలుగుతుందట. 33వ శ్లోకంతో లక్ష్మి అనుగ్రహిస్తుందట. ఫలితాల సంగతి పక్కనబెట్టి కేవలం రచన, అలంకారం, పదగుంఫనం లాంటి లక్షణాలను ఆస్వాదించేందుకు కూడ ఈ రచనను చదవవచ్చును. శంకరుల సంస్కృతము సాటి లేనిది!
వృత్తిపరంగా అనుభవ వైద్యులు శివరామప్రసాద్‌గారు, సౌందర్యలహరీ శ్లోకాలకు ప్రతిపదార్థము, అనువాదములతోబాటు కొంతపాటి వ్యాఖ్యానాన్ని కూడా జతచేసి, ఇంగ్లీషులో అందించారు. నాగరి లిపిలో శ్లోకం, తరువాత తెలుగు అక్షరాలలో అదే శ్లోకం, ఇంగ్లీషు అక్షరాలలో శ్లోకం, ఆ తరువాత ఇంగ్లీషు కవితా రూపం, ప్రతిపదార్థాలు ఇచ్చారు. బాగుంది. అక్కడే శ్లోకం యొక్క భావార్థాన్నికూడా నాలుగు పంక్తులలో యిచ్చిఉంటే మరింత బాగుండేది. పేజీకి ఒకటిగా శ్లోకాలను ఏర్పాటుచేశారు. ఇచ్చిన వ్యాఖ్యానం అదనపు సంగతులను చెప్పింది.
పుస్తకం ముందు, వెనుక మరెన్నో ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. అక్కడే పాఠకులకు సంస్కృతంతో పరిచయం చేయించే ప్రయత్నం చేశారు. నవరత్నాలను గురించి, ఆదిశంకరుల గురించి, మరెన్నో అంశాల గురించి ఇచ్చిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
కవర్ పేజీల మీద/ లోపల ప్రఖ్యాత కార్టూనిస్ట్ జయదేవ్‌గారి రేఖాచిత్రాలు ఈ బుక్‌లోని స్పెషల్ అట్రాక్షన్స్. జయదేవ్‌గారు ఇటువంటి చిత్రాలు యింతకుముందు ఎక్కడా వేసినట్టులేదు. ఇది ఇంగ్లీషు పుస్తకం! గుర్తుంచుకోవాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

  • -ముదిగొండ శివప్రసాద్
  • 17/01/2015
TAGS:

తెలంగాణ చరిత్ర
జి.వెంకటరామారావు
వెల:రూ.300/-
ప్రతులకు: అన్ని ప్రధాన
పుస్తక విక్రయ కేంద్రాలు.

తెలంగాణలో ప్రతి రాయికి, ప్రతి రప్పకూ చరిత్ర ఉంది. ప్రతి చెట్టుకూ, ప్రతి గట్టుకూ చరిత్ర ఉంది. ఎందరో మరుగున పడిన మాణిక్యాలున్నారు. వారిని వెలికితీసే పరిశోధకుల సంఖ్య అగణితంగా ఉండాలి. జి.వెంకటరామారావుగారి పేరు చెప్పగానే నిరాడంబరుడు, కర్తవ్యశీలి అయిన ఒక పండిత రచయిత, విమర్శకుడు మన కన్నులముందు సాక్షాత్కరిస్తారు. పరిశీలనాత్మక వ్యాసాలను పత్రికలకు అందించడంలో జివిఆర్ దిట్ట. ఇటీవల 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్ఫూర్తితో చరిత్రకందని కాలంనుండి నేటివరకూ తెలంగాణ చరిత్రను సాధికారికంగా అందించేందుకు ఒక బృహత్ ప్రయత్నం చేశారు. తెలంగాణ అనే పదం త్రిలింగ శబ్ద్భావం. త్రిలింగనుండి తెలుగు, తెలింగాణా, తెలంగాణా పదములు పుట్టాయి. శాతవాహనుల మూడు రాజధానులలో ఒకటి ప్రతిష్ఠానపురం. నేడు పఠాన్ పేరుతో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఓ మోస్తరు పట్టణం. ఇదికాక ధాన్యకటకం, శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) వారి మరి రెండు రాజధానులు కాణ్వాయన సుశర్మను ఓడించి శ్రీముఖ శాతవాహనుడు (సిముఖ) క్రీ.శ.187లో శాతవాహన రాజ్యం ప్రారంభించటంతో తెలంగాణా – ఆంధ్ర ప్రాంతాల చరిత్ర మొదలవుతుంది. వీరు క్షత్రియ వృత్తిని స్వీకరించిన బ్రాహ్మణులు. దాదాపు 300 సంవత్సరాలు పాలించిన తొలి తెలుగు రాజులు. ఆ తరువాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, చోళులు, చాళుక్యులు, ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో పాలించారు. గరుడచేత, బొట్టుచేత రాజులతో కాకతీయ వంశం ప్రారంభమైంది. వీరి పాలన క్రీ.శ.1000 నుండి 1323 వరకూ సాగింది. తెలంగాణ చరిత్రలో ఇదొక స్వర్ణయుగం. అందరూ అనుకుంటున్నట్లు కాకతీయ రాజ్యం కాంచీపురం వరకే పరిమితం కాలేదు. అది రామేశ్వరం వరకూ వ్యాపించింది. 1310 నుండి వరుసగా ఖల్జీ తుగ్లక్ రాజవంశాలు ఢిల్లీనుండి చేసిన దాడులతో తెలంగాణా బలహీనమైపోయింది. ఆ తరువాత కాపయనాయకుడు, ప్రోలయ నాయకుడు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనప్పటికీ ఎక్కువకాలం వారి రాజ్యం నిలువలేదు. బహమనీ సుల్తానులు, మొగలులు, అసఫ్ జాహీలువంటి ఎన్నో రాజవంశాలు తెలంగాణాను పాలించాయి. అంటే, 1948 సెప్టెంబర్ వరకూ తెలంగాణ తురుష్క పాలనలోనే ఉంది. 1947 ఆగస్టు 15 మొత్తం దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణా ప్రాంతంలో మాత్రం జాతీయ పతాకం ఎగురలేదు. 1952లో బూర్గుల రామకృష్ణారావుగారి నేతృత్వంలో స్వతంత్ర తెలంగాణ మంత్రివర్గం ఏర్పడింది. 1956లో ఆంధ్ర తెలంగాణలు ఆంధ్రప్రదేశ్ అనే భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఈ పొత్తు ఎక్కువ దశాబ్దాలు నిలువలేదు. 2014 జూన్‌లో మళ్లీ సీమాంధ్రనుండి తెలంగాణ విడివడిపోయింది. ఇందుకుగల నేపథ్యం ఉద్యమ కారణాలు, పరిణామాలు అన్నీ రామారావుగారు ఈ గ్రంథంలో విశే్లషించారు. రచయిత ప్రధానంగా పత్రికా పాఠకుల నాడి తెలిసినవాడు కావటంతో గహనమైన చారిత్రక విషయాలను సరళమైన భాషలో సామాన్యులకు అందించటానికి కృషిచేశారు.
ఈ గ్రంథంలో మొదటి 60 పుటలలోనే దాదాపు 16వ శతాబ్దంవరకుగల చరిత్రను ముగించారు. ఈ కారణంచేత ఈ భాగంలో ఇంకా చాలా అంశాలు చేర్చే అవకాశం లేకుండాపోయింది. తరువాతి భాగాన్ని విస్తరించారు. ఉదాహరణకు కాకతీయ చరిత్ర 15 పుటల్లో ముగించారు. పద్మనాయకుల చరిత్రకు ఐదు పుటలే కేటాయించారు. హళిబీడుద్వార సముద్ర ప్రాంతం. ఇక్కడి శిల్పానికి పాలంపేట రామప్ప శిల్పానికి సాన్నిహిత్యం ఉంది. రామప్ప హొయసాల రాజ్యంనుండి వచ్చాడా? ‘అప్ప’ శబ్దం రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లోనే వాడతారు. పాలంపేట చెరువువద్ద పెద్ద శిల్ప కళాక్షేత్రం ఉండేది. రామప్ప త్రికూట నిర్మాణం కందుకూరు రాజుల సోమేశ్వర త్రికూట నిర్మాణం వంటి వివరాలు కాకతీయుల అధ్యాయంలో విస్తరించటం అవసరం.
30వ పుటలో ఘీయాజుద్దీన్ ఉలుఫ్ దండయాత్రల సుదీర్ఘ చరిత్రను పది పంక్తులలో సంగ్రహీకరించారు. కోహినూరు వజ్రాన్ని కాకతమ్మ జ్ఞాననేత్రంగా అలంకరించేవారు. దానిని ప్రతాపరుద్రుడు మాలిక్ నరుూబ్ కాఫర్‌కు ధారాదత్తం చేశాడు. ఈ వివరాలన్నీ పాఠకులకు అవసరం. అంటే ఈ అధ్యాయం పది పంక్తులనుండి పాతిక పుటలు విస్తరించి ఉండవలసింది. కాకతీయుల పతనానికి అనేక కారణాలున్నాయి. రామారావు పేర్కొన్నట్లు హిందువుల అనైకమత్యం ఒక ప్రధాన కారణం. పద్మానాయకులు, రెడ్డిరాజులు పరస్పరం కలహించుకున్నారు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయింది. ఈ గ్రంథంలో పదవ అధ్యాయం నిజాం రాజుల పాలననుండి ఎక్కువ వివరాలు ఉన్నాయి.
సర్దార్‌పటేల్ పోలీసు చర్యకు దారితీసిన పరిస్థితులేమిటో ఈ తరం ప్రజలకు తెలియవు. వాటిని ఈ గ్రంథంలో చూడవచ్చు. ‘‘హైదరాబాద్ భారతదేశం నడిబొడ్డున ఉంది. హైదరాబాద్ పోతే మొత్తం భారతదేశం పోయినట్లేనని అప్పటి బొంబాయి ప్రావిన్స్ గవర్నర్స్ హైదరాబాద్ రెసిడెంట్‌ను హెచ్చరించాడు’’ (191వ పుట).
‘‘అప్పటివరకూ నిజాం దుశ్చర్యలను ప్రతిఘటించటానికి స్టేట్ కాంగ్రెస్‌లో కలిసి పనిచేసిన కమ్యూనిస్టులకు నెహ్రూ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా కనిపించింది’’ (అదేపుట).
పోలీసు చర్య తరువాత పటేల్ కమ్యూనిస్టులపై గాలింపు ముమ్మరం చేశారు. ‘‘పగలంతా మిలటరీవారు రాత్రిళ్ళు కమ్యూనిస్టులు గ్రామాలలో బీభత్సం సృష్టించారు’’ (191వ పుట).
ఇదంతా భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం జరిగిన పోరాటమేనా? రష్యాకు మార్షల్ స్టాలిన్ డాంగే, అజయ్‌ఘోష్, రాజేశ్వరరావు, బసవపున్నయ్యలను పిలిచి తెలంగాణ పటం ముందుపెట్టుకుని సుదీర్ఘ చర్చలుచేశారు (అదే పుట).
స్వామి రామానంద తీర్థ ఉద్యమం, వినోబాభావే భూదాన ఉద్యమం, జె.పి ఉద్యమం, అణచివేతలు, ఆంధ్ర మహాసభ స్థాపన, రాజరాజనరేంద్ర కృష్ణదేవరాయ గ్రంథాలయాల ఆవిర్భావం- అవి భాషాపరంగా సాధించిన వివరాలు, అణచివేతలు ఈ గ్రంథంలో రామారావుగారు సప్రమాణంగా, సరళభాషలో వివరించారు. 2014 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అవతరణతో గ్రంథం పరిసమాప్తమైంది. ఇది మంచి ప్రయత్నమే అయినా గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసి ప్రథమ భాగం మరింత పెంచవలసిన అవసరం ఉంది. శాతవాహనులనుండి కాకతీయులవరకు గల తెలంగాణ చరిత్ర, కోటిలింగాల వివరాలు పాఠకులకు అందించాలి. బృహత్క్థ రాసిన గుణాఢ్యుడు, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీమాత తెలంగాణావారే. ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యుల వివరాలు ఈ పరివర్థిత గ్రంథంలో ఇవ్వవచ్చు. ఇలాంటి పుస్తకాలు రాయడానికి చిత్తశుద్ధి, ఓపిక, పట్టుదల, వివేకం తప్పనిసరిగా కావాలి. అవి జి.వెంకటరావుగారిలో సమృద్ధిగా ఉన్నాయి. తెలంగాణ 400 సంవత్సరాలు ముస్లిం పాలనలో మగ్గినప్పటికీ అక్కడక్కడా ఎడారిలో ఒయాసిస్సులవలె దోమకొండ, వనపర్తి, గద్వాల వంటి సంస్థానాలు చేసిన సాహిత్య సేవ తక్కువేమీ కాదు. ఆ వివరాలు ఈ తరంవారికి తెలియజెప్పడం అవసరం.



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎమెస్కో సంపాదకుడితో ఇంటర్వ్యు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందమైన పాండవ ‘వనవాసం’

pandava 1 001 pandava2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

10-1-15 శనివారం

సరసభారతి ప్రచురించిన 14వ పుస్తకం ,నేను రాసిన తొమ్మిదవ పుస్తకం  నెట్ లో రాసిన ఆరవ పుస్తకం ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ సభ సరసభారతి 74 వ సమావేశం గా 11-1-15 ఆదివారం సాయంత్రం అయిదుగంటలకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో ఘనం గా జరిగింది .ఒక రకం గా ఈ కార్యక్రమం రెండు రోజులు జరిగినట్లు లెక్క

దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవం .

జనవరి 10 వ తేదీ శనివారం సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం ,సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారల ఆరాధనోత్సవం కూడా .అందుకని పదవ తేదీ ఉదయం ధనుర్మాస ప్రత్యెక పూజలో శ్రీ త్యాగ రాజ స్వామి వారల చిత్రపటానికి పూల మాల వేసి ‘’నేను రాసినఅస్తోత్తరం’’ తో పూజ చేశాం . శనివారం సాయంత్రం  శ్రీ మైనేని వారి పుట్టిన రోజు పండుగను శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఘనం గా జరిపాం .శ్రీ మైనేని దంపతుల పేరిటస్వామి వారలకు ప్రత్త్యేక పూజ చేయించి ,ప్రత్యేకం గారెండుకిలోల పిండితో  అరిసెలు ప్రసాదం గా చేయించి ,వాటితోస్వామివారలకు  పూజ కూడా చేసి వచ్చిన భక్తులకు  ప్రసాదం గా అందజేశాం .శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకుమిగిలినవి ఆదివారం తెనాలి నుండి వచ్చే శ్రీ కోగంటి సుబ్బారావు గారి కుటుంబానికి బందుగణానికి ,మిత్ర బృందానికి అంద జేయాలని భావించాం .పిల్లలు మైనేని వారికి ‘’హేపీ బర్త్ డే ‘పాటపాడగా చప్పట్లతో ఇక్కడినుండే అమెరికా వినిపించేట్లు శుభా కాంక్షలు తెలియ జేశాం .మైనేని వారు కోరిన ప్రకారం శ్రీ సువర్చలాదేవికి ,శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి ,శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టు కు  పట్టు చీర జాకెట్ ,పట్టుపంచలు కొని గోపాల కృష్ణ  దంపతులు అందజేసినట్లు గా స్వాములకు అంద జేశాం . పూజారి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ కు, శ్రీ బలరాం గారికి మైనేని వారు కొనిపించిన పట్టు బట్టలు కట్ట బెట్టి శాలువాలు కప్పాం.స్వామి వారల పాదాల చెంత ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’ఒక పుస్తకం ఉంచి ,పూజారి గారితో స్వామి సన్నిధిలో ఆవిష్కరింప జేశాం .అంటే మొదటి నుంచీ మైనేని వారి పుట్టిన రోజున పుస్తకావిష్కరణ జరగాలన్న కోరిక ఈ విధం గా నేర వేరింది .శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవ సందర్భం గా ‘’పంచ రత్న కీర్తనలు ‘’కాసేట్ పెట్టి వినిపించాం .ఉదయం స్వామి వారి సన్నిధిలో సంగీత గురువు శ్రీమతి సూరి రాజ్య లక్ష్మి గారు ఒక గంట సేపు త్యాగ రాజ కీర్తనలు గానం చేసి ఆ సంగీత పెన్నిదికి ఘన నివాళులు అర్పించారు .అనుకోకుండా ఈ రోజు కార్యక్రమం వైభవం గా ,సంతృప్తికరం గా జరిగింది .

11-1-15- ఆదివారం

ఈ రోజు కార్యక్రమాన్ని అమెరికాలో ఉన్న మైనేని గోపాల కృష్ణ గారి కుటుంబం ,చూడటానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశాం .ఉయ్యూరులో ఒక సాహిత్య కార్యక్రమం ఇలా ‘’లైవ్ ‘’లో తిలకించటం ఇదే మొదలు. ఆ కీర్తి సరస భారతికి దక్కింది .కళ్యాణ మండపం చాల సువిశాలం గా అన్ని హంగులతో కన్నుల పండువుగా ఉంది. వేదిక పై కార్యక్రమం చాలా రక్తి కట్టింది .దూరం గా ఉన్న వారందరూ చూసి చాలా అభినందించారు .కళ్యాణ మండపం అద్దె పదివేల రూపాయలకు పైనేఉంటుంది . కాని మా రమణ మిత్రుడు శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులు చొరవతో ఉచితం గా రూపాయి ఖర్చు లేకుండా లభించింది .దీనికి  ఆంజ నేయుల్ని అభినందించాలి .కార్యక్రమ ఏర్పాట్లు అన్నీ దగ్గర ఉండి పర్య వేక్షిస్తూ ఆతను చేసిన సేవ మరువ రానిది .

సంగీత కచేరి

ఈ రోజు కూడా శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం నిర్వహించాం .సాయంత్రం అయిదుగంటలకు విజయ వాడకు చెందిన రేడియో ఆర్టిస్ట్ శ్రీ పి. ఇంద్ర కీలాద్రి శర్మగారు తన బృందం తో కచేరీ చేశారు .వయోలిన్ పై కుమారి వి లక్ష్మి ,మృదంగం పై ఛి ఆదిత్య ఆయనకు సహకరించారు .సుమారు నలభై అయిదు నిమిషాలపాటు కచేరీ వివిధ గీతాల తో జరిగింది .కచేరీ బృందానికి శ్రీ గోపాల కృష్ణ గారు మాతో కొనిపించిన నూత్న వస్త్రాలు ,అందజేసి శాలువాలు కప్పి పుష్పమాలలతో సత్కరించి సరసభారతి ముద్రించిన పుస్తకాల సెట్ ను అందరికి అందించి ప్రత్యేకం గా ఈ కార్య క్రమం కోసం తయారు చేయించిన  సంక్రాంతి ,తెనాలి రామాలయం లతో కూడిన ముచ్చటైన జ్ఞాపికలను అంద జేశాం .బృందానికి మైనేని వారు ఏర్పాటు చేసిన 2,౦౦౦ రూపాయల పారితోషికాన్ని సరసభారతి తరఫున అంద జేసి వారందరికీ గొప్ప సంతృప్తిని కల్గించాం .

శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలో శ్రీ కోగంటి బంధుగణం

క్షేత్రాలు అంకితం పొందే ఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్ధులు శ్రీ కోగంటి సుబ్బారావు గారు ,కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనుమలు ,మనుమరాళ్ళు మిత్ర బృందం తో కార్లలోతెనాలి నుండి బయల్దేరి  సాయంత్రం అయిదింటికి ఉయ్యూరు కు చేరి, సభలో పాల్గొన్నారు .వారిని ముందుగా దగ్గరలోనే ఉన్న మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయానికి తీసుకొని వెళ్లి అష్టోత్తర పూజను  వారి గోత్రనామాలతో  పూజారి గారితో చేయించి  పులిహోర ప్రసాధం గా చేయించాం .హారతి ఇప్పించి ,మంత్రం పుష్పం యదా విధిగా చెప్పించి ,తీర్ధ ప్రసాదాలను ఇప్పించాం .వారిని అడగ కుండా గోత్రనామాలు పూజారిగారు చెప్పటం వారికి అమితాశ్చర్యం వేసినట్లు కనిపించింది .ముందుగానే నేను గోపాల కృష్ణ గారి నుండి కోగంటి వారి గోత్రం భాస్కరేంద్ర గారి గోత్రం అడిగి తెప్పించి పేర్లు ,పూజారికి రాసి ఇచ్చి ఉదయం సహస్రనామ పూజ సాయంత్రం అస్తోత్తరం చేయించాను .సుబ్బారావు గారికి,  వారికుమారులు శ్రీ శివ ప్రసాద్ గారికి  అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు గారికిమొదలైన వారికి పూజారి గారితో స్వామి వారి శేష వస్త్రాలు కప్పించాను .ఆడవారికి అమ్మవారి జాకెట్ ముక్కలను అంద జేశాం .వారెవరూ ఇలా జరుగుతుందని ఊహించలేదు .అందరి ముఖాల్లో ఏంతో  వెలుగు, ఆనందం సంతృప్తి జ్యోతకం అయింది .సుబ్బారావు గారు పరవశించి పోయినట్లు కనిపించింది .సుబ్బారావు గారిని చూడటం ఇదే మొదటి సారి .గోపాల  కృష్ణ  గారికి వారిపై అంత అభిమానం ,ఆరాధనా ఎందుకు ఉన్నదో చూడగానే అర్ధమైంది .ఆ ముఖం లో గొప్ప ప్రశాంతత ,కళ్ళల్లో పెద్ద వెలుగు ,ఆ పంచె కట్టు దానిపై చక్కని షర్టు మహా హుందాగా ఉన్నారు .ఇలాంటి ఉన్నత మూర్తికి ఈ గ్రంధం అంకితమిచ్చి నేనూ సరసభారతి ధన్యమౌతోందని అనిపించింది. మైనేని గారి కోరిక ఈ విధం గా తీరుతున్నందుకు మహదానందం గా ఉంది .ఆ పర్సనాలిటీ కళ్ళల్లో ,మనస్సులో నిండిపోయింది .గొప్ప వ్యక్తీ ని చూశాననే ఆనందం తో మనసు పరవళ్ళు తొక్కింది .దేవాలయం అంతా కోగంటి వారి బంధుగణం తో అభిమానులతో కిక్కిరిసి పోయింది .స్వామి సేవలో అందరూ ధన్యులయ్యారు .

ఆవిష్కరణ సభ

దేవాలయం నుంచి అందరం వచ్చి కళ్యాణ మదిరం చేరాం .అప్పటికే ముఖ్య అతిధి నది సంపాదకులు ఈ నాటి పుస్తకావిష్కరణ కర్త శ్రీ జలదంకి ప్రభాకర్ గారు ,ఆత్మీయ అతిధి శ్రీ చలపాక ప్రకాష్ గారు వచ్చి కూర్చున్నారు .దాదాపు నూట పాతిక మంది తో మందిరం కళకళ లాడింది .మైనేనిగారి బావగారు శ్రీ అన్నే హనుమంతరాగారు చెల్లెలు శ్రీమతి  హేమలత గారు వచ్చారు . గౌరవ అతిధిగా రావాల్సిన ‘’అఖిల భారత వాసవీ ట్రస్ట్ –పెనుగొండ –ఉపాధ్యక్షులు శ్రీ బొండాడ రామ మోహన రావు గారు క్రితం రోజు అనుకోకుండా కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినందున రాలేక పోయారు .ఒకటవ తేదీకూడా వారి తో మాట్లాడాను .వస్తానని ఖచ్చితం గా చెప్పారు .సభకు హాజరైన వారందరికి స్వీటు హాటు ఉన్న పాకెట్ అందించారు. టీ ఏర్పాటు చేశాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ రెండో సారి తేనీరు అందజేశాం

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి అతిధులను పేరు పేరునా వేదికపైకి ఆహ్వానించింది .అందరికి కమలా ఫల ద్వయం తో సరసభారతి సభ్యులు ,మా మనవాళ్ళు మనవ రాళ్ళు కోడళ్ళు స్వాగతం పలికారు . నేను శ్రీ కోగంటి సుబ్బారావు గారిని పరిచయం చేసి వేదికమీడకు ఆహ్వానించాను శ్రీ జలదంకి ప్రభాకర్ గారిని  ఛి బాలాజీ  ,చలపాక ప్రకాష్ గారిని శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అన్నే హనుమంతరావుదంపతులను   మా పెద్దకోడలు శ్రీమతి సమత ,శ్రీ రామి నేని భాస్కరేంద్ర రాగారిని శ్రీ శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులనుమా మనుమరాలు ఛి రమ్య చక్కగా స్పష్టమైన ఉచ్చారణ తో స్క్రిప్ట్ చదివి పరిచయం చేసి అందరి ప్రశంసలు పొందారు.అందరికి  జంట కమలాలతో స్వాగతం చెప్పారు .

సభాధ్యక్షునిగా నేను ప్రసంగిస్తూ సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు తెనాలి వారిని ఉయ్యూరు వారిని ఈ విధం గా ఇక్కడ కలిపారని ఈ కార్యక్రమం ఖర్చు ,పుస్తక ముద్రణ ఖర్చు ఈ బందుగణానికి యధోచిత నూత్న వస్త్రాల సమర్పణ అంతా ఆయనదే నని ఇందులో ఏ మంచి పని అయినా, ఘనత అయినా మైనేని వారికే చెందుతుందని ఏ చిన్న లోపం ఉన్నా అది నాకు మాత్రమే చెందుతుందని అన్నాను .ఇప్పటికి నాలుగు పుస్తకాలు స్పాన్సర్ చేసి సరసభారతికి కొండంత అండగా గోపాల కృష్ణ గారున్నారని ,వారికి ఉయ్యూరు మీద ఉన్న అభిమానం మరువరానిదని. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు విరాళాలు అందజేసి తోడ్పడ్డారని చెప్పాను  నాలుగు సార్లు పుస్తకాన్ని అంకితం తీసుకోమని గోపాల కృష్ణ గారిని అడిగినా సున్నితం గా తిరస్కరించి ఒకటి ‘’సిద్ధ యోగిపున్గవులు ‘’వారి తల్లిగారు శ్రీమైనేని సౌభాగ్యమ్మ గారికి ,రెండవది ‘’మహిళా మాణిక్యాలు ‘’తమ ధర్మ పత్ని శ్రీమతి సత్య వతి గారికి మూడవది ‘’పూర్వాంగ్ల. కవుల ముచ్చట్లు ‘’తమ బావ గారు డాక్టర్ శ్రీ రాచ కొండ నరసింహ శర్మ,ఏం డి . గారికి నాలుగవది అయిన ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’తనకు మార్గ దర్శి అత్యంత ఆప్తులు  గొప్ప మిత్రులు ,తన జీవితాన్ని తీర్చి దిద్దిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –‘’శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితమివ్వమని చెప్పి ఇప్పించిన విశాల హృదయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అని చెప్పాను .ఇటీవలే అంతర్జాలం లో 145 మంది సంస్కృత కవులపై రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను మైనేని వారికీ చెప్పకుండానే నెట్ ద్వారా ఎవరికీ రూపాయ ఖర్చు లేకుండా  అంకితమిచ్చానని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశాను .ఇప్పుడు దాని సి డి ని శ్రీ సుబ్బారావు గారు ఆవిష్కరిస్తారని అది గోపాలకృష్ణ గారికి మహా ఆనందం కలిగిస్తుందని చెప్పాను .దీనికి గురుభాక్తిగా ఆయన నాకు ఏదో చేయాలని భావించారని ఆయన సహృదయత నాకు గురు దక్షిణ అనిఇంకేమీ అక్కర్లేదని మెయిల్ రాసి తెలియ జేశానన్నాను .కాని ఆయన ఊరుకొనే రకం కాదు .వెంటనే సరస భారతి, శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల కార్యక్రమాలను చిత్రీకరించటానికి వీలుగా ఒక’’ సోని వీడియో కెమెరా ‘’కొనిచ్చి గురు దక్షిణ చెల్లించారని ఇక నేనేను ఏమీ మాట్లాడలేక పోయానని వివరించాను .అయితే రెండురోజుల క్రితంశుక్రవారం  రాత్రిఆయన ఫోన్ చేసి ‘’గీర్వాణం ‘’పుస్తకాన్ని తన మేనకోడలు , డాక్టర్ శర్మ గారి కుమార్తె ,అమెరికాలో డాక్టర్ గా ఉంటున్న శ్రీమతి జ్యోతి గారుస్వంత ఖర్చులతోసరసభారతి ద్వారా  ముద్రించి  అ౦ద జేయటానికి సంసిద్ధత వ్యక్త పరచారని తెలిపారు చాలా ఆనందం వేసిందని వారికి కృతజ్ఞతలు తెలియ జేయమని చెప్పానని అన్నాను .దీనిలో భాగాస్వాములవ్వటానికి జ్యోతిగారి సోదరీమణులు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలియ జేశాను. సరసభారతి కి ఇప్పటికి అయిదు పుస్తకాలు ముద్రించి ఇచ్చిన ప్రకాష్ గారి ఆత్మీయత మర్చిపోలేనిదని ,ఈ పుస్తకాన్ని కూడా వారే తీసుకు రావటానికి ముందుకొచ్చారని ,అలాగే శ్రీ టి వి సత్యనారాయణ గారు రాసిన ‘’పేరడీలు ‘’కూడా సరస భారతి ముద్రిస్తోందని దాన్ని స్వర్గీయ బాపు –రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేశాను .13 -51-15 బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా మా మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (అమెరికా)  స్పాన్సర్ చేస్తూ అతని తలిదండ్రులు ,మా అ అక్కా బావలు అయిన శ్రీ వేలూరి వివేకానంద శ్రీ మతి దుర్గ గార్లకు అంకితం ఇస్తూ160 దేవాలయ చరిత్రలున్న   ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’ఆవిష్కరణ స్వామి సన్నిధిలో చేస్తామని తెలియ జేశాను . ఇందరు బంధు గణం తో అభిమానులతో ఈ వేదిక, హాలు మెరిసిపోవటం ఏంతో గొప్పగా ఉందని చెప్పి గ్రంధావిష్కరణ చేయ వలసిందిగా ప్రభాకర్ గారిని కోరాను

పుస్తకావిష్కరణ

దర్శనీయ దైవ క్షేత్రాలుగ్రంధా విష్కరణ ను శ్రీ జలదంకి ప్రభాక ర్ గారు చేసి మొదటికాపీ ని సుబ్బారావు గారికి అంద జేశారు.తర్వాత వేదిక పై ఉన్న అతిదులందరికి అంద జేశారు . తరువాత సభకు హాజరైన వారందరికీ పుస్తకాలను సరస భారతి కార్య కర్తలు అందజేశారు .ప్రభాకర్ గారు గ్రంధం లోని కొన్ని ముఖ్య విషయాలపై ప్రసంగించారు ప్రకాష్ గారు ఈ పుస్తకాన్ని ‘’అమూల్యం ‘’అని ప్రచురించటం ఏంతో  హర్షణీయ మైన విషయ౦  అన్నారు .శ్రీ భాస్కరేంద్ర క్లుప్తంగా ఒక పండుగ వాతావరణం గా ఈ కార్య క్రమం జరిపినందుకు అభినందించారు .శ్రీ అన్నే హనుమంతరావు గారు ఉయ్యూరుతో తమకున్న అనుబంధాన్ని మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రి గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ వారి సరస్వతీ ట్యుటోరియల్ కాలేజీ లో పని చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు .కోగంటి వారి పెద్దకోడలు శ్రీమతి పుష్పలత చక్కగా ఇంత గొప్ప వేడుక ఇక్కడ జరగటం తమల్ని అందరిని ఆహ్వానించి గౌరవించటం జీవితం లో మరపు రాని సంఘటన అని ఇది గోపాల కృష్ణ గారి పెద్ద హృదయానికి నిదర్శనమని అన్నారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –సి డి ఆవిష్కరణ .

నేను అంతర్జాలం లో రాసి నెట్ ద్వారా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితం ఇచ్చిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’సి డి ని శ్రీ కోగంటి సుబ్బారావు గారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి నన్నూ శ్రీ గోపాల కృష్ణ గారిని అభి నందించారు .ఈ సి డి ని మైనేనిగారికి వారికోసంవారి డబ్బుతో  కొన్న పట్టుపంచె ,ఉత్తరీయం శాలువావారి శ్రీమతి శ్రీమతి సత్యవతిగారికి కొన్న పట్టు చీర జాకెట్ ,పసుపు కుంకుమ ,మొదలైన వాటితో బాటు పాక్ చేసిన పాకెట్  ను  శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు అందజేసి శ్రీ గోపాల కృష్ణ గారికి అందజేయ మని కోరాను .

సన్మాన సంరంభం

ముందుగా ఈ నాటి కృతి భర్త శ్రీ కోగంటి సుబ్బారావు గారి ని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి చందనం పూసి పన్నీరు చల్లి గులాబీ పుష్పహారం వేసి .సెంట్ రాసి ,తాంబూలం అందించి బొట్టుపెట్టి  మైనేని వారు ,కోగంటి వారి కోసం మాతో కొనిపించిన పట్టు బట్టలు కప్పి వారి శ్రీమతికి పట్టు చీర జాకెట్ పసుపు కుంకుమ అందించి ,శాలువా వేసి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అంద జేశాం .గోపాల కృష్ణ గారు అమెరికా నుండి శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ఆర్డర్ ఇప్పించి చేయించిన ‘’శ్రీ లక్ష్మీ నరసింహ బంగారు కాయిన్ ‘’ను శ్రీ సుబ్బారాగారికి సభా మఖం గా అంద జేశాము. సుబ్బారావు గారు సంక్షిప్తం గా ప్రసంగించి తనకు జరిగిన ఈ సత్కారానికి గోపాల కృష్ణ గారి ఔదార్యానికి వితరణకు బంధు ప్రేమకు ,పెద్దల యెడ ఉన్న గౌరవాభిమానాలకు మురిసిపోతున్నానని సరసభారతిద్వారా ఉయ్యూరు వచ్చే గొప్ప అవకాశం కల్పించి నందుకు కృతజ్ఞతలు తెలియ జేశారు

తరువాత కృతి కర్త అయిన నాకు మా శ్రీమతి ప్రభావతికి జలదంకి వారు కోగంటి వారు పై విధం గానే సన్మానం చేశారు .ఉయ్యూరు హైస్కూల్ లో నాకు డ్రిల్ మాస్టారు ,ఆ తర్వాత సహా ఉపాధ్యాయులు అయిన పెద్దలు శ్రీ సూరపనేని వెంకట సుబ్బారావు గారు ఈ కార్యక్రమాని విచ్చేసి నా మీద ఉన్న అభిమానాన్ని చాటి నాకు నూతన వస్త్రాలతో సత్కారం చేసి నా గురించి అభినందన వాక్యాలు పల్కి ఆశీర్వ దించటం నేను చేసుకొన్న పూర్వ  జన్మ సుకృతం .

ఆ తర్వాత శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు ,శ్రీ భాస్కరేంద్ర దంపతులకు శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులకు శ్రీ ప్రభాకర్ గారికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి అదే తీరులో ఘనం గా నూతన వస్త్రాలు శాలువా దండలు జ్ఞాపికలు చందన సత్కరాలు చేశాం .అందరూ ఏంతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .సభకు రాలేక పోయిన కోగంటి వారి రెండవ కుమారులు శ్రీ శ్రీనివాసరావు శ్రీమతి అరుణ  దంపతులకుకూడా కొన్నవాతిని సుబ్బారాగారికి అందజేశాం . మనుమలు ,శ్రీ అవినాష్ శ్రీ మతి భారతి ,శ్రీ ఆశ్వాంత్ శ్రీమతి హారిక  సుబ్బారావు గారి మనుమ రాళ్ళు కుమారి మయూరి ,కుమారి హరిణి  ,హనుమంతరావు గారి మనుమరాలు కుమారి తన్వి లకు  కోగంటి వారి ఆజన్మ  మిత్రులుశ్రీ అన్నే వెంకటేశ్వర్లు గారికి ,వారి శ్రీమతి గారికి  మైనేని వారు అభిమానం తో మాతో కొనిపించిన నూతన వస్త్రాలు ,జ్ఞాపికలు మొదలైనవి అందజేసి మైనేని వారి కి అత్యంత ఆనందాన్ని కల్గిన్చాం . అమెరికా లో ఉండి ప్రత్యక్ష ప్రసారం లో  ఆ దంపతులు వీక్షించి ఏంతో కనుల పండువుగా జరిగిన ఈ కార్యక్రమానికి సంతోషించి ఉంటారు .మా అబ్బాయి రమణ ,కోడలు శ్రీమతి మహేశ్వరి లకు మైనేని వారుకోనిపించిన నూతన వస్త్రాలు ,శాలువా ,జ్ఞాపిక పుష్పహారం చందనాది సత్కారాలతో సత్కరించారు .ఇదంతా ఒక పెళ్లి వేడుకలాగా  జరిగింది .ఒక సాహిత్య కార్యక్రమం ఇంత వైభవం గా జరగటం నేనెప్పుడూ చూడలేదు .వస్త్రాల నాణ్యతలో ,శాలువాల విలువలో ఎక్కడా మైనేని గారు రాజీపడలేదు అన్నీ నంబర్ వన్ గా ఉండాలని కోరారు అలానే చేశాం .జ్ఞాపిక విషయం లోనూ ఏంతో జాగ్రత్త తీసుకొన్నాం

ఈ కార్యక్రమాని విజయ వాడ నుండి వచ్చిన ప్రసాద్ గారికి ,శాలువా జ్ఞాపికలతో సత్కరించాం. సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మికి ,ప్రచార కార్య దర్శి శ్రీ వీరమాచనేని బాల గంగాధర రాగారికి పుష్పహారం శాలువా చందనాది సత్కారం జ్ఞాపిక లతో సన్మానం చేశాం ,కళ్యాణ మండపాన్ని ఉచితం గా ఇప్పించి ఈ కార్యక్రమం బాగా జరగటానికి సహకరించిన శ్రీ వెంట్ర ప్రగడ  ఆంజ నేయులను కూడా పై విధం గా సన్మానించి కృతజ్ఞతలు తెలియ జేశాం .

కోగంటి వారికి తెనాలి లో పంచి పెట్టటానికి 250 పుస్తకాలను ,భాస్కరేంద్ర గారికి మదన పల్లిలో పంచటానికి సుమారు 150 పుస్తకాలను ఇచ్చాం  ఏంతో సంతోషం గా వారు వాటిని తీసుకు వెళ్ళారు .ఈ విధంగా ఆవిష్కరణ రోజునే సుమారు 500 పుస్తకాలను ఉచితం గా అందరికి అందజేసి ఏంతో సంతృప్తి చెందాం

తరువాత ఘన మైన విందు ఏర్పాటు చేశాం .అన్ని పదార్ధాలు చాలా రుచికరం గా శుచిగా ఉన్నాయని మెచ్చుకొంటూ భోజనం చేశారు వచ్చిన వారందరూ .కిళ్ళీ కూడా చాలా బాగుందని మెచ్చారు .అన్నే వెంకటేశ్వర్లుగారు మరీ మరీ మెచ్చుకొన్నారు .శ్రీ ఆంజనేయ స్వామి వారికి చేయించిన అరిసెలు ప్రసాదం గా కోగంటి వారి బందుగణానికి అంద జేసింది మా శ్రీమతి ప్రభావతి  అరిసెల  ఐడియా ఆవిడదే .బాగా క్లిక్ అయింది .అందరికి ఉపయోగపడింది  జనవరి ఒకటి వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారలకు చేసిన లడ్డూ పూజ ప్రసాదం లడ్డూ లను కూడా తెనాలి వారందరికీ అందించింది  వారి ఆనందానికి అవధి లేదనిపించింది వారి ముఖాలలో కనిపించిన సంతృప్తిని చూస్తే.

ఆవిష్కరణ కార్యక్రమం లో నేను ఆలోచన చేసినదాన్ని మా అబ్బాయి రమణ చక్కగా అమలు అయ్యేట్లు పూర్తీ బాధ్యతలు తీసుకొన్నాడు .ఆహ్వానాలు ,బానర్లు జ్ఞాపికలు ,స్టేజి ఏర్పాటు మైకు ,ప్రత్యక్ష ప్రసారం ,పుస్తకం డి టి పి అందులో దేవుళ్ళ దేవాలయాల ఫోటోల డి తీపి చేసిన శుశీల్ తో పెట్టించటం దగ్గరుండి సంతృప్తిగా చేశాడు .మైనేని వారి మన్ననలు అందుకొన్నాడు .సభను ఆసాంతం అద్భుతం గా నిర్వహించిన శ్రీమతి శివలక్ష్మి కి ప్రత్యెక అభినందనలు కెమెరా వాయిస్ రికార్డర్ లతో కార్యక్రమాన్ని కవర్ చేసిన మా సాంకేతిక సలహా దారు శ్రీ గంగాధర రావు గారిని యెంత పొగడినా తక్కువే .ఇందరి సహకారం తో ఈ కార్యక్రమం రూపు దిద్దుకొని ,అద్భుతం గా నిర్వ   హింప బడి అందరి ఆనందానికి హేతువైనది . జ్ఞాపిక రూప శిల్పి జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ కు   సరసభారతి కృతజ్ఞతలు .ఈ గ్రంధాన్ని ఇంత అందంగా ముద్రించి మాకు అందజేసిన శ్రీ రామా ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారికి ,కవర్ పేజీ డిజైనర్ శ్రీ కళాసాగర్ గారికి ,దగ్గరుండి ముద్రణ విషయం లో జాగ్రత్తలు తీసుకొని అందజేసిన ఆత్మీయులు చలపాక ప్రకాష్ గారికి అభినందనలతో కృతజ్ఞతలు .

సభ లో పదనిసలు

1-కచేరీ వారు నాలుగున్నరకు వస్తానని అయిదుంబావుకు రావటం చిరాకు అనిపించింది

2-త్యాగరాజ అరధనోత్సవం లో త్యాగరాజ స్వామి కీర్తనలుపాడక పోవటం అన్నమయ్య పాటలు పాడి లాగుడు సంగీతం తో విసుగు తెప్పించటం అసహనాన్ని కలిగించింది .

3-ప్రత్యక్షప్రసారం మొదటి అరగంట లో నెట్ అందక ఇబ్బంది పెట్టింది తరువాత వీయిన అన్ని సోర్సులను ఉపయోగించి ప్రసారం  అంతరాయం కాకుండా జాగ్రత్త పడటం తో కొంత టెన్షన్ తగ్గింది

4- నది సంపాదకులు గ్రంధాన్ని గురించి చక్కగా క్లుప్తం గా ప్రసంగించ కుండా శాఖా చంక్రమణం చేయటం, అసలు అందులో సరుకు ఏముందో తెలియ జేయక పోవటం  మరీ ఇబ్బంది పెట్టింది

5-గౌరవ అతిధి రాకపోవటం –చాలామంది కి నిరాశ కల్గించింది

6-కోగంటి వారి కుటుబ సభ్యులు తాముకూడా సుబ్బారావు గారికి  తలొక   శాలువా కప్పటం దండ వేయటం చేయక పోవటం పద్ద వెలితి .చక్కని అవకాశాన్ని సద్వినియోగం చెసుకకో లేకపొయారేమో అనుకొన్నాను .ఆ ఎనభై అయిదేళ్ళ వృద్ధ జ్ఞానమూర్తిన ఉయ్యూరులో సత్కరించే మహద్భాగ్యం వారుకోల్పోయి నందుకు బాధగా ఉంది .

7- కుటుంబ సభ్యులలో భాస్కర్ ,పుష్పలత్ గార్లు తప్ప మిగిలిన వారు సుబ్బారావు గారి గురించి రెండుమాటలు చెప్పక పోవటం భావ్యం అనిపించలేదు .

సరిగమలు

1-మా కుటుంబ సభ్యులు దాదాపు హాజరై తలొక పనిలో భాగ స్వాములవ్వటం సంతోష కరమైన విషయ౦

2- చిన్నపిల్లలు కూడా హుషారుగా పాల్గొని తమ వంతు బాధ్యత నేర వేర్చటం

3-మా గుడి దగ్గరున్న  బడ్డీ బుడ్డి సోదరులు నిలబడి సేవలందించటం

4- మా గుడి అర్చకులు తమ ధర్మాన్ని సక్రమం గా నిర్వర్తించటం

5- వెయ్యి ఆహ్వానాలు పంచితే 125 మంది అంటే పదికి ఒకరు వంతున రికార్డ్ గా హాజరవటం

6- కార్యక్రమం ఒక గొప్ప వేడుకగా జరగటం .

7-ఇదొక తీపి గుర్తుగా మిగిలిపోవటం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-15 –ఉయ్యూరు

 

 

.

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్‌ ఘనత (13-Jan-2015)

శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్‌ ఘనత (13-Jan-2015)
‘పాండవ వనవాసం’
చరిత్ర
ఎన్టీఆర్‌ నటించిన పౌరాణికాలు పలు భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా విజయఢంకా మోగించాయి. ‘పాండవ వనవాసం’ సినిమా బెంగాల్‌లో అనువాదమై అక్కడ శతదినోత్సవ వేడుకను జరుపుకోవడం విశేషం. 1965లో తెరకెక్కిన ఈ సినిమాకి రూ.పది లక్షల ఖర్చయింది. విడుదలైన 40 ఏళ్ళకు జీ టీవీ రూ. 50 లక్షలకు శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకుంది. అంటే పెట్టుబడిని మించి ఐదింతలు లాభం తెచ్చిపెట్టింది. ఈ రికార్డు ఇండియాలోనే మరెవ్వరికీ లేకపోవడం విశేషం.
మహానటుడు నందమూరి తారక రామారావు నటజీవితంలో ఎన్నో తరగని, చెరిగిపోని రికార్డులున్నాయి. వాటిలో కొన్నింటిని ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపిన ‘పాతాళభైరవి’(1951) నుండి ఆయన నటించిన పలు చిత్రాల ద్వారా చిత్ర సీమలో రికార్డులను నమోదు చేశారు. సరిగ్గా యాబై ఏళ్ళ క్రితం ఎన్టీఆర్‌ నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ను ఈ ఐదు పదుల కాలంలో ఎవరూ అధిగమించలేకపోవడం గమనార్హం. ఇది కేవలం తెలుగునాడుకే సంబంధించిన విషయం కాదు. యావత్‌ భారతదేశంలోనూ ఎవరికీ సాధ్యపడని రికార్డ్‌ను ఆయన 50 ఏళ్ళ క్రితమే సునాయాసంగా సాధించారు. ఒక్క సినిమా చెయ్యడానికే మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇప్పటి మన స్టార్‌ హీరోలు. అలాంటిది నంబర్‌వన్‌ హీరోగా ఉంటూ 1965లో 12 సినిమాల్లో నటించారు ఎన్టీఆర్‌. వాటిలో కొన్ని పౌరాణికాలు, కొన్ని జానపదాలు ఉండడం విశేషం. ఈ పన్నెండు సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకోగా, ఎనిమిది సినిమాలు (నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం, మంగమ్మ శపథం, తోడూ నీడ, దేవత, వీరాభిమన్యు, సి.ఐ.డి, ఆడబ్రతుకు) డైరెక్ట్‌గా శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. ఆ ఏడాదే విడుదలైన ‘దొరికితే దొంగలు’ తెలుగువారికి తొలి సైంటిఫిక్‌ ఫిక్షన్‌ సినిమా. 92 రోజులు ఆడిందా సినిమా. ‘సత్యహరిశ్చంద్ర, ‘ప్రమీలార్జునీయం’, ‘విశాల హృదయాలు’ కూడా అర్ధశత దినోత్సవాలు జరుపుకోగా వీటికి ఒక్కవారం గ్యాప్‌లో విడుదలైన ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవ వనవాసం’ ‘ఆడబ్రతుకు’ చిత్రాలు 25 వారాలు ప్రదర్శితం కాగా ‘వీరాభిమన్యు’ చిత్రం 156 రోజులు ఆడింది. ఏడాది కాలంలో ఆయన నటించిన డజను సినిమాలు ఈ విధంగా రికార్డు సృషించాయి. ఎన్టీఆర్‌ తర్వాత ఆయనకంటే మిన్నగా డజనుకు పైగా సినిమాల్లో నటించిన హీరోలున్నారు. కానీ ఏ ఒక్కరూ ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకోవడం అన్న రికార్డ్‌ను అధిగమించలేకపోయారు. యాబై ఏళ్ళుగా ఎన్టీఆర్‌ పేరిట ఈ రికార్డ్‌ నిలిచి ఉండడం తరిగిపోని, చెరిగిపోని ఎన్టీఆర్‌ రికార్డ్‌లకు ఓ నిదర్శనం. భవిష్యత్తులోనూ ఈ ఘనత చెక్కు చెదరక చరిత్ర పుటల్లో నిలిచే ఉంటుందని చెప్పొచ్చు.
చెక్కు చెదరని ఇమేజ్‌
ఎన్టీఆర్‌ రికార్డ్‌లానే ఇమేజ్‌ కూడా చెక్కు చెదరనిది. అందుకు మరో నిదర్శనం ఉంది. షమ్మీ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ‘చైనా టౌన్‌’ సినిమాను 1969లో ‘భలే తమ్ముడు’గా రీమేక్‌ చేశారు. దాదాపు అదే తరహా కథాంశంతో 1978లో అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా రూపొందిన ‘డాన్‌’ చిత్రాన్ని మరుసటి ఏడాది ఎన్టీఆర్‌తో తెలుగులో ‘యుగంధర్‌’గా నిర్మించారు, ఈ రెండు సినిమాలను తమిళంలో రీమేక్‌ చెయ్యగా ‘చైనా టౌన్‌’లో ఎమ్జీఆర్‌, డాన్‌ రీమేక్‌లో రజనీకాంత్‌ అభినయించడం గమనార్హం. అమితాబ్‌ని స్టార్‌గా నిలిపిన ‘జంజీర్‌’(1973) సినిమాను ఎన్టీఆర్‌ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ నిర్మిస్తే తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ వయసు 52 కాగా, అమితాబ్‌ వయసు 35 సంవత్సరాలే. అదే 52 ఏళ్ళకు అమితాబ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్స్‌కి దిగిపోయారు. ఎన్టీఆర్‌ చివరిదాకా నంబర్‌వన్‌ హీరోగా కొనసాగడం విశేషం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెంది ఈ రోజుల్లో ఓ సినిమా ఖండాంతరాలు వెళ్ళడం విశేషం కాదు. సరైన ప్రచార సౌకర్యం లేని ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ సినిమాలు పరభాషల వారినీ ఆకర్షిస్తూ మెప్పించడం అసలైన ఘనత.
– కొమ్మినేని వెంకటేశ్వరరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేతాజే మృతి వీడని మిస్టరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామన్న స్పూర్తి -ఆదివాసుల దైవం నాగోబా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్తపలుకు ఆర్ కె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం పేరడీలు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -3 పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు  అంతర్జాలం లో నేను 145 మంది సంస్క్రుతకవుల  పై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”నుసరసభారతి నిర్వహించే  శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకల రోజున అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం జరిగే సభలో ఆవిష్కరింప జేస్తామని ,దీనిని సరసభారతికి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిస్తున్నామని ఈ పుస్తకానికి ముద్రణ ఖర్చు అంతా శ్రీమైనేనిగారి మేనకోడలు ,అమెరికాలో ఉంటున్న డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు భరించి పుస్తకం తెస్తూ తన ”కృష్ణ మామ”పై ఉన్న గౌరవాభిమానాలను ప్రకటిస్తున్నారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .
 ఉయ్యూరు కె సి పి లో కెమిస్ట్ గా పని చేసి రిటైర్ అయిన సరసభారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ టి .వి.  .సత్యనారాయణ గారు రాసిన ”పేరడీలు ”కూడా సరసభారతి ముద్రించి మన్మధ ఉగాదినాడు ఆవిష్కరిస్తోందని ఈ పుస్తకాన్ని ప్రముఖ హాస్య జంట స్వర్గీయ బాపు -రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేస్తున్నాం
 మా అమెరికా మేనల్లుడు జె .వేలూరి .స్పాన్సర్ చేస్తున్ననేను నెట్ లో రాసిన  ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శ్రీహనుమజ్జయంతి నాడు 13-5-15 బుధవారం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో స్వామి వారల శాంతి కళ్యాణ మహోత్సవం లో ఆవిష్కరిస్తామని దీనిని మా అక్క బావలు శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ దంపతులకు అంకితమిస్తున్నామని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది మీ  -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మకర సంక్రాంతి వీధులలో సంక్రాంతి రంగవల్లులు

15-1-15గురువారం మకర సంక్రాంతి వీధులలో సంక్రాంతి రంగవల్లులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-1-15గురువారం మకర సంక్రాంతి పర్వదినాన మా బ్రహ్మణోత్తమునికి కూష్మాండ దానం 

వై బి రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు ఇంటి వద్ద భోగిమంటలు మామనవడు ఛి భువన్ హాజరుyvrp 001

15-1-15గురువారం మకర సంక్రాంతి పర్వదినాన శ్రీ సువర్చలాన్జనేయస్వామి పూజ ,మరియు ఉయ్యూరు వీధులలో సంక్రాంతి రంగవల్లులు ,మా  బ్రహ్మణోత్తమునికి కూష్మాండ దానం

DSCN0116 DSCN0115 DSCN0114 DSCN0113 DSCN0112 DSCN0111 DSCN0110 DSCN0109 DSCN0108 DSCN0106 DSCN0105 DSCN0104 DSCN0103 DSCN0102 DSCN0101 DSCN0100 DSCN0099 DSCN0098 DSCN0096 DSCN0095 DSCN0094 DSCN0093 DSCN0092 DSCN0091 DSCN0090

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మారణాయుధాల మధ్య తూనీగలు

మారణాయుధాల మధ్య తూనీగలు

  • – వి.బి.ఎన్. శ్రీనివాస్ 8522846585
  • 12/01/2015
TAGS:

మబ్బు చిచ్చుబుడ్డి చిమ్మే పువ్వుల్ని
భూమికన్నా ముందే అందుకునే
కొన్ని చేతులు

ముత్యపు చిప్పలకన్న ముందే
గుప్పిట పట్టే కొన్ని నోళ్ళు –

మొక్కల మొదళ్ళకన్న ముందే
మట్టి సాక్సులు తొడుక్కునే కొన్ని కాళ్ళు –

కాల్వ పక్కనే ఎదురుచూస్తున్న
కాగితపు పడవల్ని సుతారంగా లేపి
నీటి మీద బతుకునిచ్చే కొన్ని ప్రాణాలు –

ఏం చెప్పాలి
నవ్వుల వెనె్నల్ని కాసే
వేల చందమామలు!
ఇల్లు పూలవనమయ్యే
పుప్పొడి అడుగులు!!
అమ్మ నాన్నల్ని ఆరోగ్యపరిచే
అద్భుత ముద్దుల గుళికలు!

అక్షరాలమీద వాలిన తూనీగల్ని
ముక్కలు చేసి
ఆయుధానికి దండేశారు
కూలిన కలల నెత్తుట్లో
పసివాసన నవ్వులు!
రాలిన కలల నెత్తుట్లో
మరణించిన బాల్య పరిమణాలు!
వాలిన కలల నెత్తుట్లో
మినుకు మినుకు కళల
నిర్జీవ నక్షత్రాలు!
వాలి కూలి రాలిన నెత్తుట్లో తేలిన
బాల్యపుస్తకాల శవాలు!

చిగురాకుల్ని కాల్చి
ఖండఖండాలు చేసి
తల్లివేరు కడుపుమీద
ఆరని చితి పేర్చారు
రాజ్యం కనుగప్పిన ఆయుధమా!
నీకో పాలబువ్వల బాల్యాన్నిస్తున్న
నీకో సుతిమెత్తని తరగతి పుస్తకాన్నిస్తున్న
నీకో సతత వసంతబడి వాతావరణాన్నిస్తున్న
నీకో ప్రేమల అమ్మ ఒడినిస్తున్న
నీకో హృదయపు తడినిస్తున్న
ఇక బతుకు!

వెర్రితలల తుపాకుల్లారా!
కత్తుల్లారా! బాంబుల్లారా!
బాల్యాన్ని మింగడమంటే-
రేపటి ప్రపంచాన్ని చంపడమే!
బాల్యం పాలస్తీనా అయినా
బాల్యం పాకిస్తాన్ అయినా
బాల్యం భారత్ అయినా…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు

ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు

  • – ఎన్. బద్రి, 9154421505
  • 12/01/2015
TAGS:

టంచన్‌గా నెలజీతం జేబులో వేసుకునే ఉద్యోగ కవులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అందులో కొందరు కేవలం సత్తాలేని చలామణీ కవులు. మరికొందరు సామాజిక, ఆర్థిక హోదాలను అనుభవిస్తున్న పాండిత్వ కవులు. ఇంకొందరు కష్టాల నేపథ్యంలోంచి ఎదిగి స్థిరపడి గతాన్ని నెమరువేసుకునే కవులు. మనసా వాచానే కాకుండా కర్మనా నమ్మిన బాటను, నచ్చిన మాటను ధైర్యంగా ప్రతిఫలింపజేసే కవులు మాత్రం తక్కువగానే ఉన్నారు. వారే కాలాతీత కావ్య స్రష్టలుగా మిగిలిపోతారు. అభిమానుల గుండెల్లో ఆత్మీయ స్థాయిని అందుకుంటారు. అందుకే అలిశెట్టి ప్రభాకర్ అంటే ఇంత అలజడి. ఆయన కవిత్వంలో ఓ విద్యార్థి, ఓ శ్రామికుడు. ఓ అబల తమను తాము చూసుకుంటారు. అలిశెట్టిది కేవలం కంటితో చూసిన అవగాహనా కవిత్వం కాదు. అది అనుభవ సారం. కఠోర జీవన మధనంలోంచి చిలికిన ఘర్మజలాల వెల్లువ. ఆ కవిత్వమంతా రక్తాక్షరాలే. అభాగినుల వెచ్చని అశ్రుధారలే. శ్రామికుడి ఆరని చెమట బిందువులే.
కష్టజీవి గురించి రాయడానికి ఆ కష్టాన్ని రుచి చూశాడు. అందుకే ‘నను / తొలిచే / బాధల ఉలియే / నను మలిచే / కవితా శిల్పం’ అన్నాడు. సమిష్టి బాధల / సుదీర్ఘ శ్వాసే / ఒక ఊరేగింపు’ అని అన్నాడు. ఆకలి గురించి రాయాలంటే ఆకలీ తెలియాల్సిందే. ఆకలిగొన్న వానిపట్ల సానుభూతితో రాసే కవిత్వం ఆకలి కవిత్వమే కాదు. ఆకలి తెలిసిన కవి మాత్రమే – ‘అందంగా / తోకాడించే / కుక్కపిల్లలాటిది / కాదు / కుట్టిన / ఎర్రతేలు / మంటలాంటిది ఆకలి’ అనగలడు. మానవ జాతి చరిత్ర యావత్తూ సామాన్యుడి రోదనామయమేనని నమ్మిన కవి అలిశెట్టి. అందుకే ‘చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం / చిరత్రకు చెమట బొట్టే ఆధారం / చరిత్రకు ఆకలి ప్రేరణ’ అని ఏ రాణీ ప్రేమ పురాణం చరిత్రసారం కాదన్న శ్రీశ్రీకి తోడయ్యాడు. పోరుబాటను అమితంగా ప్రేమించిన కవి అలిశెట్టి. తన కవిత్వాన్ని అదే మార్గాన నడిపిన ధీశాలి. ‘అనంతాకాశ క్షేత్రంలో / అక్షరాన్ని / సూర్యబింబంగా నాటగలిగిన వాణ్ణి / ఒక పోరాట కెరటాన్ని / యుద్ధనౌకగా / తీర్చిదిద్దలేనా’నని ధీమా వ్యక్తం చేస్తాడు. తన కలమూ కుంచె పీడితుల పక్షాన నిలవాలని కాంక్షించి – ‘అసలు నువ్వెప్పుడన్నా / నా ఆలోచన ఆయుధాగారం / తెరిసి చూసైనా / లక్షలాది పీడితుల పిడికళ్ళే / నా అక్షరాలని’ మాట నిలబెట్టుకున్నాడు. విద్యాధికుడు కాని ప్రభాకర్ కవిత్వంలోని ఆర్థికశాస్త్రం అబ్బుర పరుస్తుంది. ఇంత లోతైన ఆలోచన ఎలా తట్టిందో ఆయన జీవన సరళికే తెలుసు. ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ‘పారిశ్రామికీకరణ’ను ‘కమిలిపోయిన / కార్మికుడి దేహమీద వాలి / యంత్రాల / ఇనుపగోళ్లతో / రక్కెయ్యడమే’నని ఏకి పారేశాడు. ఆర్థిక శాస్త్రంలో శ్రమ విలువ తేల్చడం మామూలుగా ఓ బ్రహ్మపదార్థం. రెండు ముక్కల్లో ప్రభాకర్ ‘అన్నం మెతుకునీ / ఆగర్భ శ్రీమంతున్నీ / వేరు చేస్తే / అసలు / శ్రమ విలువేదో / తేలిపోదూ’ అని విప్పిచెప్పాడు. సామ్రాజ్యవాద లక్షణాలను పాతికేళ్లముందే పసిగట్టిన, చదువు పట్టాలముందు పసిపిల్లవాడు అలిశెట్టి. సులభ శైలిలో పిడుగుల్లాంటి విషయాల్ని పేల్చి చెప్పాడు. ‘ఏ దేశం శిరసు మీద / మోపిన / పాదాలైనా / హోదాలైనా / సామ్రాజ్యవాదాలే’. ఇంకేముంది మనలనేలుతున్న ప్రభుత్వాలు కీలుబొమ్మలని కొత్తగా చెప్పడానికి. అనుమానం ఏమైనా ఉంటే ఇదీ చదవండి – ‘దాహం దాహంగా / డాలర్ నాలుక చాచిన / బహుళ జాతి కుక్కా / దేశం దేశమంతా / వాగ్దానాల ఊళ పెడుతున్న / అరాజకీయాల నక్కా / రెండూ బహు ప్రమాదకరమైనవి…’ అంటూ ప్రపంచంలోని దొంగలంతా ఒక్కటయ్యారని హెచ్చరించాడు. శ్రామిక పక్షపాతి అయిన ప్రభాకర్ కవిత్వం నిండా చెమట వాసన సచాలిస్తుంది. రక్త వర్షం చెమట నదిగా రూపాంతరం చెందడం దర్శిస్తాడు. ‘నల్ల రేగడి నేలమీద నాగళ్ళ లిపిని’ చదువుతాడు. ‘కణకణ మండే కండరాల ఎరుపు నూకను – గొంటాడు. అందుకే ‘పాలరాతి బొమ్మయినా / పార్లమెంటు భవనమైనా / వాడు చుడుతేనే శ్రీకారం / వాడు కడితేనే ఆకారం’ శ్రామికుడిని తలనెత్తుకుంటాడు. బతికిన 39 ఏళ్ళలో 20 ఏళ్లకు పైగా జీవితాన్ని కవిత్వానికే కేటాయించాడు. తన కవితలు వెలుగు విరజిమ్మేందుకు తన ఆస్తిని, ఆరోగ్యాన్ని ధారపోశాడు. చివరి రోజుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సైతం ‘మున్సిపాలిటీ వాళ్ళెత్తని చెత్తలా / నెత్తిమీద జుత్తు పెరిగిపోతే / నన్ను నేను పోల్చుకుంటానో లేదోనని / అద్దంలో చూసుకొని / అచ్చు అలిశెట్టి ప్రభాకర్‌నే అనిపించి / సంతృప్తిగా నవ్వుకుంటాను’ అని తనపైనే సెటైర్లు వేసుకున్నాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి అనుకుంటే ఆ కవి అలిశెట్టి ప్రభాకర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవ సంబంధాల మాధుర్యం ఇలా..

మానవ సంబంధాల మాధుర్యం ఇలా..

  • -పాలంకి సత్యనారాయణ
  • 10/01/2015
TAGS:

రెల్లు
– బి.పి.కరుణాకర్
వెల: రూ.80/-
పుటలు: 128;
మనోప్రియ
ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

జీవితాన్ని తేలికగా, ఆనందంగా, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం గల బండారు కరుణాకరప్రసాద్ రచించిన ‘రెల్లు’ కథల పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో ఇరవైఒక్క కథలున్నాయి. విశాలాక్షి, ఆంధ్రజ్యోతి, తేజ వారపత్రిక, సాహితీ స్రవంతి, వార్త, ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, సాక్షి ఫన్ డే, నవ్య, విపుల, చిత్ర, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం ఇతివృత్తంగా అనేక కథలు వచ్చాయి. తాజా ప్రియుడితో ఉన్నపుడు మాజీ ప్రియుడు ఎదురైతే ఇబ్బందికరమైన పరిస్థితే. వారిద్దరు స్నేహితులన్న సంగతి తెలియని కథానాయికకి ఎదురైన అనుభవం తెలుసుకోడానికి ‘హార్ట్‌గేలరీ’ కథ చదవాలి.
ఆఫీసులో సహోద్యోగి గంగాధర్‌తో ప్రేమలోపడిన తర్వాత, అతను పెళ్లై పిల్లలుకలవాడన్న సంగతి తెలుసుకుని, సంబంధం తెంచుకుంటుంది కథానాయిక. అదే ఆఫీసులో రామానుజాన్ని పెళ్లిచేసుకుని పిల్లవాడికి తల్లి అవుతుంది. దురదృష్టవశాత్తూ కొడుకు చనిపోవడమేకాకుండా రామానుజం చెప్పాపెట్టకుండా ఎటో వెళిపోతాడు. ఈ పరిణామాలకి గంగాధర్ కారణమని భావించిన కథానాయిక శ్రీమతి గంగాధర్‌కి అన్ని విషయాలు చెప్పి పగ తీర్చుకున్నాననుకుంటుంది. చెప్పాల్సిన వ్యక్తి, చెప్పిన వ్యక్తి ఒకరు కాదన్న కొసమెరుపుతో ‘ఎదురునీడ’ కథ ముగుస్తుంది.
బోగస్ రేషన్‌కార్డుల సమస్య ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమైనదే! ఏరివేత కార్యక్రమం ద్వారా ఓట్లు నష్టపోతామన్న భయం ఏలికలకుండడం సహజం. ఉన్న కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఇవ్వాల్సిరావడం ఆడిట్‌లో ప్రభుత్వానికి అక్షింతలు పడడం మనకు తెలిసినదే! రేషన్‌కార్డుల ఏరివేత పర్యవేక్షక అధికారి, లచ్చుమమ్మని కార్డులో రాయించిన పేర్లతో ఎంతమంది లేరో చెప్పమంటారు. లచ్చుమమ్మ ఇచ్చినది తప్పుడు సమాచారం అన్న సంగతి అధికారికి ఎలా తెలిసింది? అన్న విషయం ‘ఏరివేత’ కథ ఇతివృత్తం. ఆఖరివాక్యం ఉత్కంఠ భరితంగా ఉంది.
రత్తయ్య, భార్య పోయిన తర్వాత కొడుకు, కోడలు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించి, ఉండలేక ఒంటరి జీవితానికే అలవాటుపడతాడు. రిక్షా తొక్కి జీవితం కొనసాగిస్తూంటాడు. ఆ ఊళ్లో రామిరెడ్డి తోటకి, రాత్రి ఎనిమిది దాటితే విటుల తాకిడి ఎక్కువ వుంటుంది. రత్తయ్య ఆ తోటలో ‘సావిత్రి’ని వెతుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వారెవరూ సరైన చిరునామా చెప్పరు. ఇక ప్రయత్నం విరమించి వెళిపోదామనుకుంటున్నపుడు, రిక్షా చెయిను ఊడిపోతుంది. చెయిను సరిచేసి ఎదురుకుండా ఉన్న పాకవైపు చూసేసరికి ‘సావిత్రి’ కనబడుతుంది. సావిత్రి, రత్తయ్యతో అన్న మాట ఎందుకు దుఃఖం కలిగించిందో ‘కన్నీటి నురుగు’ కథలో తెలుస్తుంది.
ఆకలిని తట్టుకోడం సులభసాధ్యం కాదు. ప్రేమించినవారి ఆకలిని తీర్చడంకోసం తన ఆకలిని మరిచిపోయే వ్యక్తిచుట్టూ తిరిగిన కథ ‘దోసెడు ఆకలి’ కథానాయకుడి కారు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఉంటుంది. భాగ్యనగరంలో రోడ్డు దాటడానికి ఆగిన కార్ల మధ్యనుంచే వెళ్లాలి. కథానాయకుడు- ఓ పాదచారి రోడ్డు దాటే ప్రయత్నాన్ని గమనిస్తూంటాడు. తన కారుని ముందుకెళ్లనివ్వకుండా దాటే ప్రయత్నం చేసిన పాదచారిని ఢీకొడతాడు. దెబ్బతగిలినా పట్టించుకోకుండా- ‘అయ్యా ఈ కవర్లో ఉన్న అన్నం మా ఇంట్లో ఇవ్వండి నేను కారు కింద పడ్డట్టు చెప్పద్దు’ అన్న పాదచారి అభ్యర్థన చదువరుల హృదయాలను ద్రవింపచేస్తుంది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదనుకున్న పద్మారావు, సుధ తమ పెళ్లికి ముందు ప్రేమించినవారి గురించి వివరాలు చెప్పుకుంటారు. పద్మారావులో అనుమాన బీజం పడి మహావృక్షమవుతుంది. మాజీ ప్రియుడింటికి వెళ్ళిందన్న సంగతి తెలుసుకున్న పద్మారావు, సుధ శీలాన్ని శంకిస్తాడు. వెళ్లిన కారణం తెలిసిన తర్వాత పద్మారావు ‘ఎంత నీచంగా ఆలోచించాను’ అనుకోడానికి దారితీసిన పరిస్థితి ఇతివృత్తంగా రాయబడిన కథ ‘కలికి కడలి.’ మిగతా కథలుకూడా నిజజీవితంలో జరిగినట్టుగా అనిపిస్తాయి. మారిపోతున్న మానవ సంబంధాలని నిశితంగా గమనించిన రచయిత, ఏకపక్షంగాకాక విశాల దృక్పథంతో రాసిన కథలు పాఠకాదరణకు పాత్రమవుతాయనడానికి సందేహించనక్కరలేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’

జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’

  • -మానాపురం రాజా చంద్రశేఖర్
  • 10/01/2015
TAGS:

బహుమతి కథ-2
వెల: రూ.120/-
చీఫ్ ఎడిటర్: చీకోలు సుందరయ్య
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,
హైదరాబాద్ మరియు అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్
తెలుగు బుక్‌హౌస్,హైదరాబాద్-27

కథలు వర్తమాన సమాజానికి దర్పణం పడతాయి. వీటిలో వ్యక్తమయ్యే పలు రకాల కోణాలు సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. అలా ఊపిరి పోసుకున్నవే సంఘర్షణాత్మక జీవితాలకు ప్రతీకగా రూపుకడతాయి. ఇలాంటి ఇతివృత్తాలకు జీవం పోసిన కథల సంకలనమే ‘బహుమతి కథ-2’. ఇందులో 17 కథలుదాకా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క సందర్భాన్ని విడమర్చి విశే్లషించి చెబుతాయి. ఇవన్నీ 2013 సంవత్సరంలో రంజని బహుమతిని పొందినవే. కథావస్తువు ఎంపిక దగ్గర్నుండి శైలిలో శిల్పంలో సరళత్వంలో ఒకదానితో మరొకటి పోటీపడినట్టు కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత కారణంగా విలక్షణంగా వైవిధ్యపూరితంగా రాసిన చెయ్యి తిరిగిన తనం తారసపడుతుంది. ఇందులో రాసికంటే వాసికే అధిక ప్రాధాన్యమివ్వడం రూపుకడుతుంది. ఈ నేపథ్య మూలాలను అక్షరాలతో తడిమి, మనసు కళ్ళతో ఒడిసిపట్టుకోవాలంటే లోతైన దృష్టితో అధ్యయనం చెయ్యాలి.
టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న పాటల పోటీలలో ఓడిపోయిన సెలబ్రెటీల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పేదే ఈ ‘ఎగిరిపోతే… ఎంత బాగుంటుందీ’ కథ. పిల్లల పట్ల వ్యాపారదృష్టి కలిగిన తల్లిదండ్రులు అవినాశ్ లాంటివాళ్ళను ఎలా బలిపశువులను చేసి ఆడిస్తున్నారో.. ఎంత చిత్రవధకు గురిచేస్తున్నారో వివరిస్తుంది. చాలా ఆర్ద్రపూరితంగా సాగి మనసుని హత్తుకుంటుంది. మనుషులను ఆలోచింపజేస్తుంది. దీని రచయిత రామదుర్గం మధుసూదనరావు. ‘మార్జినోళ్ళు’ కథలో పి.శ్రీనివాస్‌గౌడ్‌ది ఒక ప్రత్యేకమైన నిర్మాణశైలి కనిపిస్తుంది. చిరకాలంగా రైల్వే మార్జినులో పాకలేసుకుని బతుకుతున్న మార్జినోళ్ళకి నాయకుడు లాంటి కోటేశంటే గొప్ప భరోసా. ప్రభుత్వ భూమిని ఖాళీచేసి వెళ్ళాల్సిందిగా నోటీసులు పంపితే, స్వామినాయుడి ప్రైవేటు స్థలంలో తిరిగి అంతా పాకలు వేసుకుంటారు. ఇంతలో గూండాల దాడి జరిగి.. విషయం పత్రికలకీ మీడియాకీ చేరిపోతుంది. ఈ వాస్తవాన్ని ముందే పసిగట్టిన కోటేశు ముందుచూపుకి, వ్యవహార శైలికి నిలువెత్తు దర్పణం ఈ కథ. ఇది తిరుగుబాటుతనంలోని భిన్నత్వంలోని ఏకత్వం ఆవశ్యకతను నొక్కిచెబుతుంది.
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణచేసిన వ్యక్తి- కొడుకూ కోడలు దగ్గరికెళ్లి కాలం వెళ్ళదీసినా.. సొంత వూరు, ఇంటిపై వున్న మమకారం తిరిగి అతణ్ణి వెనక్కి తెస్తుంది. పార్కులో పరిచయమైన కుర్రాడితో స్నేహంలోపడి, వాళ్ళమ్మ చనిపోగానే తనింట్లోకి తెచ్చిపెట్టుకొని.. విద్యాబుద్ధులు నేర్పించి.. చాలామందికి విద్యాదానం చేసిన ఓ వ్యక్తి కథ ‘తోడొకరుండిన’. రంగనాథ రామచంద్రరావు రాసిన ఈ కథ- మనసుని కదిలించి, మనిషిలోని కర్తవ్య బాధ్యతను తట్టి లేపుతుంది. ‘జ్ఞాపకం’ కథలో రాచమళ్ల ఉపేందర్ కథనం చివర్లో మెలికతో మలుపుతిప్పిస్తుంది. క్రైం విభాగంలో ఇనె్వస్ట్‌గేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివుడుకి బాల్యమిత్రుడు పరమేశం ఫోన్‌చేసి, తన అవసరంకోసం రమ్మనమని ప్రాధేయపడతాడు. సొంత ఊరిలోకి అడుగుపెడుతూనే.. మిత్రుడు కుటుంబాన్ని పరామర్శించి, కష్టనష్టాలు తెలుసుకుంటాడు. అమ్మకంకోసం వచ్చిన ఇంటిలో- గతంలో గొడవపడి వెళ్ళిపోయిన తండ్రి.. ఓ వింత నల్లటాకారంలో వచ్చి, బెదరగొట్టి, బేరాన్ని చెడగొడతాడు. శివుడి ద్వారా జ్ఞానోదయం పొంది, అతనికిచ్చిన సొమ్ముతో వ్యాపారంచేసి, కొడుకు పెళ్ళికి పిలవడానికి రావడంతో కథ ముగుస్తుంది. స్నేహ పరిమళం ఇందులో తొంగిచూస్తుంది.
‘నీకూ నాకూ ఒక వేకప్ కాల్’ కథలో వయసుమళ్ళిన ఓ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి ‘మానవతా ప్రవాహ’ అనే స్వచ్ఛంద సేవాదళ సంస్థవాళ్లు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొంటాడు. ఆ సందర్భంలో ‘సుగంధి ఆస్పత్రి’లో తారసపడిన దృశ్యానికి చలించిపోయి.. ఓ ముగ్గురు మిత్రుల సహకారంతో ఓ రాత్రి కాపువేస్తాడు. తుపాకీతో బెదిరించి అక్కడ జరుగుతున్న దురాగతాన్ని ప్రజోపయోగ వ్యాజ్యంలో ఎదుర్కొంటాడు. కోర్టు కేసుల ఆధారంతో ఆర్థికశాఖ ద్వారా గ్రాంట్లు మంజూరుచేయించి, అనాధ వృద్ధుల తరపున సాధించిన విజయం ఈ కథకు స్ఫూర్తి. దీనిని చూసి వేరేచోట వున్న, కుమారులు అడిగిన ప్రశ్నలకు తగిన రీతిలో జవాబిచ్చి, కథను చాలా అర్థవంతంగా ముగిస్తారు రచయిత పాండ్రంకి సుబ్రమణి. అవసరానుగుణంగా వ్యవహరించే మనుషుల తీరూ.. దూరమైపోతున్న మానవ సంబంధాల విలువలకు అద్దంపట్టే కథ ‘మెమరీ కార్డు’. దీనిని రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి చాలా హృద్యంగా చిత్రించారు. ‘్ధనమూలమిదం జగత్’ కథలో మూర్తి ఒక రచయిత. అతని రచనలంటే గిట్టని భార్య- ‘ఇంటర్‌నెట్ క్యాష్ ఇన్‌కమ్’ వివరాలతోకూడిన వెబ్ పత్రికను చూపించి అతన్ని ప్రోత్సహిస్తుంది. అలా మొదలైన అనేకరకాల కంపెనీల ప్రకటనలు ఇతరుల ఈ-మెయిల్‌కి పంపిస్తూ.. డాలర్ల చెక్కుల్ని, అందుకుని, భార్య పిల్లల మెప్పును పొందుతాడు. పది లక్షలదాకా సంపాదిస్తాడు. ఒక రచయిత తన ఇష్టాయిష్టాల్ని, రచనలోని సృజనాత్మకతని ఎలా చంపుకొని బలవంతంమీద ధన సంపాదనాపరుడిగా మారిపోతాడో రచయిత కె.బి.కృష్ణ ఈ కథలో విడమర్చి చెబుతాడు.
ఒక చిన్న సినిమా తియ్యగల ఇతివృత్తాన్ని ‘సారా’జ్యం కథలో రచయిత రామదుర్గం మధుసూదనరావు జొప్పించారు. ఊర్లో సారాబట్టీలు తయారుచెయ్యడం మొదలుకొని… దాన్ని తిరిగి ఒళ్లుగుల్ల చేసుకునే సంజన్న లాంటోళ్ళు… ఈరేసప్పలాంటి వ్యాపారికి పోలీసు- వైద్యుల లంచగొండితనాన్ని ఎరగావేసి, లాకప్ డెత్‌లో చనిపోయిన సంజన్న చావుని సారాచావుగా మలచడంతో.. అతని పెళ్ళాం పిల్లలు ఏకాకులుగా మిగిలిపోతారు. దీనితోపాటు గవర్నమెంట్ ఆస్పత్రి అవినీతిని, టీవీ రిపోర్టర్ల సహజప్రవృత్తిని ఎండగడుతూ చక్కని కథగా మలిచారు రచయిత. ఇలాంటిదే- డా.ఎం.సుగుణరావు రాసిన ‘అంతరంగం అట్టడుగున’ కథ ఓ ముగ్గురు వ్యక్తుల కథ. సతీష్ ఓ కార్డియాలజిస్ట్. తన తండ్రి చావుకి కారకుడైన తాడిపర్తి జమీందారు చెంగల్రాయుడుని పథకం ప్రకారం చంపాలనుకుని.. అనుకోని పరిస్థితుల్లో అతను గుండెనొప్పితో మెలికలు తిరిగిపోతుంటే- తానే స్వయంగా ట్రీట్‌మెంట్‌చేసి, టాబ్లెట్లిచ్చి రక్షిస్తాడు. మధ్యలో ఓ సర్దారు కూతురికి హార్ట్‌హోల్ ప్రాబ్లెం. దాని ఆపరేషన్‌కోసం వాళ్ళ ప్రయాణం. చివర్లో తాతకి మంచిని బోధించి వదిలేస్తాడు సతీష్. ఇదీ స్థూలంగా కథ. చాలా సున్నితంగా అర్థవంతంగా సాగిపోతూ మానవతా దృక్పథంతో సందేశాత్మకంగా మిగిలిపోతుంది. సంపాదన మత్తులో పడిపోయి విద్యాధికుడైనప్పటికీ… ఒక్కగానొక్క కూతురు వౌనికను నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకున్న వైనం మంత్రవాది మహేశ్వర్ కథ ‘వౌనాక్షరాలు’లో కనిపిస్తుంది. వౌనికతో అనేక కారణాల సాకుతో గడిపినట్టు గడిపి- ఇతరులు జరిపే పైశాచిక చేష్టలు ఈ కథలో రూపుకడతాయి. చివరికి తనపై జరుగుతున్న ఈ ఆగడాలను తల్లికి చెప్పుకున్నా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు వౌనికకి. అందుకే భాస్కర్రావు అనే పెద్దమనిషి తనను శారీరకంగా మానభంగం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. రవీంద్ర- ప్రమీలల ఏకైక కూతురు వౌనిక. చివరికి ఆమె పేరున పిల్లల సంక్షేమంకోసం సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఈ కథ ముగుస్తుంది. పిల్లల జీవితాలపై తగిన శ్రద్ధతీసుకోకపోతే దాని పర్యవసాన పరిస్థితులు దీనిలో మన కళ్ళకి కట్టిస్తారు.
ఇలా మంచి శిల్పనిర్మాణాన్ని ప్రదర్శించిన ఈ కథలన్నీ జీవితపు లోతులను అనే్వషిస్తూ వాటికి పరిష్కారమార్గాలను కనుక్కునే ప్రయత్నం చేస్తాయి. ఆధునిక సమాజానికి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. వీటిలో చాలా పాత్రలు నిత్యం మన కళ్ళముందు తిరుగాడుతున్నవే. అందుకే వీటిలో ఆ బలమూ, ఆర్ద్రత, ఆవేశమూ శక్తియుక్తులుగా ప్రదర్శితమవుతాయి. ఇవి చిరకాలం నిలబడాల్సిన కథలు. భవిష్యత్తును నిలదీసే కథలు. చాలా మంచి ప్రయత్నంచేసి వడబోసిన కథలు కాబట్టే అందరికీ ఆదర్శప్రాయంగా మిగిలాయి. ఈ కృషి వెనుక రంజని చూపించిన ఆసక్తిని, అభిమానాన్ని, మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవచైతన్య దీప్తి సంక్రాంతి

నవచైతన్య దీప్తి సంక్రాంతి

  • 11/01/2015
  •  -సుధామ

కేవలం- మతంతో ముడిపడి కాకుండా ప్రకృతితో, పర్యావరణంతో ముడివడి సకల మానవాళీ సమాదరించదగిన అసలు సిసలు పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అని వ్యవహారం. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులకు విస్తరించిన పర్వం కావడంవల్లనే ఇంత పెద్ద పండుగ మరొకటి లేదు అంటారు. నిత్యం కనబడే కర్మసాక్షి సూర్యుడు. సూర్యుడు అటు ఆధ్యాత్మికంగానూ, ఇటు వైజ్ఞానికంగానూ సకల చరాచర ప్రపంచంలో అస్తిత్వం కలిగి, గ్రహగతులకు, కాలచక్ర పరిభ్రమణకు మూలాధారమై నిత్య నూతన ప్రకృతిగా ఉదయాస్తమయాలతో ఉనికి, మనికి గలవాడు. ఖండఖండాంతరాలలో కూడా రీతులూ, రివాజులూ వేర్వేరయినా జన హృదయాలను దోచుకున్న ఆనందహేల సంక్రాంతి. రవి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథ ప్రవేశం చేసే శుభ ముహూర్తం మకర సంక్రమణం. నవ జీవన సమ్యక్ క్రాంతి సంకేతంగా ‘సంక్రాంతి’ అంటున్నాం. ప్రాచీన కాలంలోనే ఖగోళ విజ్ఞానాన్ని మన భారతీయం అనితర సాధ్యంగా అందిపుచ్చుకుంది. గ్రహగతులు, గ్రహణాలు ఆయన క్రమం, ఋతువుల విశే్లషణం ప్రకృతిని అవలోఢనం చేసి అభివ్యక్తీకరించింది భారతీయులే. నిజానికి ఏడాదిలోని పనె్నండు నెలల్లోనూ సంక్రమణాలుంటాయి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రమణంగా పేర్కొంటాం. కర్కాటక రాశి ప్రవేశ సంక్రమణం దక్షిణాయనం కాగా మకర సంక్రమణం ఉత్తరాయణం. మకర రేఖ నుండి ఉత్తర దిశగా సూర్యుడు పయనించే పుణ్యకాలమే ఉత్తరాయణంగా, మకర సంక్రమణంగా, సంక్రాంతిగా సంభావించడం జరుగుతోంది. ఇదంతా ప్రకృతి పరిణామ మూలమే. తమో గుణ ప్రధానమైన మనిషి మనస్సును ఉజ్జ్వల భావ అంతర్లోకాల వైపు దృష్టిపెట్టమని వైజ్ఞానిక ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే అసలు సిసలు ప్రకృతి పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ మార్గం జ్యోతిర్మయం అనీ, దక్షిణాయణ మార్గం తమోమయం అనీ భగవద్గీత పేర్కొంటోంది. ఉత్తరాయణా గమనం అంటే సంకల్ప వికల్పాలు లేని అమనస్క యోగ సిద్ధి. అదే ఉత్తమగతి అని యోగశాస్త్ర నిర్వచనం. అమనస్క యోగ సిద్ధి పొందిన ఆత్మ ఉత్తరాపథంలో పయనించి, ‘స్వాదిష్ఠాన’మనే వైతరణి నదిని దాటి, ‘పింగళనాడి’ అనే మార్గంలో ముందుకు సాగి, ‘సోహం’ అనే విమానం ఎక్కి, సూర్య ద్వారంగా చెప్పబడే ‘సుషుమ్న’లో లీనమై, అనంతత్వాన్ని పొందుతుంది. ‘ఉత్తరాయణం’ అనే దానికి ఇంత అర్థం ఉంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలని, పరమాత్మను చేరగోఱే జీవాత్మ ఆరాటపడుతుందిట! దివి భువి కలిసిన పవిత్ర ప్రాంతం ఉత్తర దిశలోనే ఉందంటారు పెద్దలు. అంపశయ్య మీద వున్న భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షించి ప్రాణాలు వదిలింది అందుకేనట! సంక్రాంతి పెద్ద పండుగే కాక, పెద్దల పండుగ అనీ ఎందుకంటారంటే- ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల ఆత్మలు సుషుమ్నా వికాసం కలిగి, విశ్వవ్యాప్తమైన ‘ఈథర్’ రూపంలో ఉంటాయని ఆర్య వాక్యం. ఆధ్యాత్మిక, వేదాంతపరమైన అంశాల కోణంలో కాక, వైజ్ఞానిక ఉపపత్తులతో చూడగోరే ఆధునికులైనా- ‘సంక్రాంతి’ వైశిష్ట్యాన్ని అంగీకరిస్తారు. ఉత్తరాయణమనే ఈ కాలంలో ఉత్తర దిక్కోణం నుండి ప్రభవించే సూర్య కిరణాలు ‘ఆల్ట్రా వయొలేట్ రేస్’ అనబడుతున్నాయి. ఈ కిరణాలకు సమస్త రోగనాశక శక్తి ఉంది. ‘ఉద్యాసద్యా మిత్రమః అహోరున్నుత్తరాం దినం హద్రోగం మమసూర్యాహరి మాణాంచ హరయ…’ అని సాగే వేద మంత్రం – ఉత్తర దిక్కోణం నుండి ఉదయిస్తున్న బాలభాస్కరుని కిరణాలు మా యొక్క బాహ్యాభంతర రోగాలను హరించుగాక, అన్న అర్థం వలనే! ఉత్తరాయణంలోనే బహిరాకాశంలో సూర్యుడితోబాటు, ‘అగస్త్యోదయం’ అనే నక్షత్ర సముదాయం వస్తుంది. ఈ నక్షత్ర కాంతిపుంజాలలోని రేడియో ధార్మిక శక్తితో, సూర్యశక్తి కలిసి, మన భూమి మీదున్న జల నిదులను, గాలినీ, నదీనదాలను నూతన జవసత్త్వాలతో నింపుతుంది. గత మాలిన్య రహితమై, నవ్య క్రాంతి పరిఢవిల్లుతుంది. ఈ భౌతిక ప్రక్రియ మన చర్మచక్షువులకు అందేది కాదు. కానీ ఆధునిక వైజ్ఞానిక ఉపకరణాలు ఈ మార్పును గుర్తిస్తున్నాయి. సంక్రాంతి అంటే ఇలా భౌతిక, ఆధ్యాత్మిక, యోగశాస్త్ర యుతమైన నవ్యతా పరిణామం. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి కాక, సంక్రాంతియే నిజానికి కొత్త సంవత్సరంగా సంభావించదగిన విశిష్టమైన పండుగ. చలిని తరిమివేసి, రోగకారకాలైన క్రిమికీటకాల నాశనానికై వేసే మంటయే ‘్భగిమంట’. నిజానికి ఆవు పిడకలతో వేసే భోగిమంటయే ఆరోగ్యదాయకం. ఆవు పిడకలతో వేసే భోగిమంటతో వెలువడే పొగ, వేడి, ఆరోగ్య కారకాలని శాస్తజ్ఞ్రులు అంగీకరించిన విషయం. సంక్రాంతి పెద్ద పండుగ. దీని వేడుకలు అపారం. సంక్రమణం పర్వం పితృకార్యానికి శ్రేష్ఠం. కనుమరోజు గ్రామ దేవతలకు నివేదనలు చేస్తారు. పాడి పశువులతోబాటు ధాన్యలక్ష్మి పసిడి చిందులు వేస్తుంది. ఈ మూడు రోజులూ బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. సంక్రాంతి పర్వం ధాన్య లక్ష్మి పూజాపర్వం. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆవుపేడతో కళ్లాపుజల్లి రంగవల్లులు అలంకరించడాలు, కేవలం సరదాతో కూడినవే కాదు, ఆచారం వెనుక వైజ్ఞానిక సూత్రం, పర్యావరణ పరిరక్షణం ఇమిడి వున్నాయి. ఇది భారతీయ దార్శనికుల విశిష్ఠత. సంక్రాంతి రోజుల శోభ వర్ణనాతీతం. జానపద కళారీతుల నిదర్శనాలుగా రంగవల్లులతో ముంగిల్లు, ధాన్యరాశి దరహాస చంద్రికలు, వైభవోపేత ఆలయాలు, గొబ్బిళ్లు, భోగిమంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ల సంబరాలు ఆబాలగోపాలం అష్టాదశ వర్ణాల వారూ జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి గురించి కథలకూ కొరతేమీ లేదు. అపార దాన గుణ పరాయణుడైన బలి చక్రవర్తి, వామనుడికి మూడడుగులు దానం చేసి, పాతాళవాసి అయ్యాడు. అయితే తన సామ్రాజ్య వైభవాన్ని తిలకించడానికి ఏడాదికి ఒకసారి భూలోక దర్శనానికి ఆ మహావిష్ణువు అనుమతినిచ్చాడు. మహాదాత అయిన తమ చక్రవర్తి రాక సందర్భంగా ఏటేటా భూలోక పౌరులు రంగవల్లులతో, ధన ధాన్య, దాన కార్యాలతో చేసుకునే పండుగే సంక్రాంతి అంటారు. అలాగే మకర సంక్రాంతికి చేసే ‘పితృకల్పం’ మనిషికి పూర్వజన్మ స్మృతులతో ఉత్తమ పథగామిని చేయగలదని హరివంశంలో ప్రస్తావించబడింది. ముందే చెప్పినట్లు – ఈ పండుగ కొన్ని ప్రాంతాలకే పరిమితం అనుకోనక్కర్లేదు. పేర్లు, పద్ధతులు భిన్నమైనా, దేశదేశాల్లో మానవ నాగరికతలో వైవిధ్యభరితమై అలరారుతోంది ఈ ప్రకృతి పర్వం. ‘నామ్ ఫెస్టివల్’ అని ఈజిప్టులో ఈ సంక్రాంతి పండుగ ఉంది. నామ్ అంటే మకర రాశితో సాన్నిహిత్యంగల ఈజిప్టు వారి జల దేవత. ఈ సంక్రమణ సమయంలో నైలునది పొంగి, తమను సజీవులను చేస్తుందని వారి విశ్వాసం. జలదేవతారాధనం చేసిన నదికి ఫల పుష్పాలు సమర్పించి, వారు ఈ పండుగ సంబరాలు చేస్తారు. గ్రీకు దేశంలో మకర రాశి అనగా సగం చేప, సగం మేక ఆకారం వున్న జలదేవత. పైభాగం మేక, క్రింది భాగం చేప రూపున వుండే ఈ దేవత ఒక రాక్షసుని బారి నుండి రక్షించుకోవడానికి ఈ రూపం ధరించిందట. విచిత్ర రూపంగల ఈ జలదేవత ‘మకర రాశి’ అని గ్రీకుల విశ్వాసం. ఈ దేవతను వీరు ‘చౌకన్’ అంటారు. సంక్రమణ దినాన వారు ఈ దేవత ప్రీత్యర్థం ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. రోమ్‌లో ‘బేకన్’ పర్వంగా సంక్రాంతి చేస్తారు. సంతానార్థులు, అవివాహితులు మన్మధ పూజాపర్వంగా మన కాముని పున్నమ, వసంతోత్సవం రీతిలో కాలపురుషుడి ఆశీర్వాదంకై ఉత్సవం చేస్తారు. యూరప్‌లో మన భోగిమంట తరహాలో సంక్రాంతిని ‘అగ్ని ఉత్సవం’గా చేస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి, అంతా నృత్యగానాలు చేస్తారు. మనం ఎలా పితృకార్య పర్వంగా సంభావిస్తామో, అలాగే స్వీడన్‌లో దీనిని అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుతారు. ఖండఖండాంతరాలలోనూ మకర సంక్రమణ పండుగ – మనుష్యులు సర్వతోముఖాభివృద్ధి చెంది ఉత్తమ జీవన విలసితమైన ఉత్తరపథ మార్గులు కావాలనే సంకల్పంతోనే వివిధ రూపాలలో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ‘ఇది మా పండుగ కాదు’ అని మానవాళిలోని ఏ ఒక్కరూ అనుకోనవసరం లేని ప్రకృతి పర్వం సంక్రాంతి అని గ్రహించవలసిన విషయం. చపలచిత్తులైన మనుషుల్లో ధార్మిక ప్రవృత్తిని, దాన ధర్మాది సుగుణ సంపత్తిని, తమ పుట్టుకకు హేతువైన పితృ, మాతృగణం పట్ల కృతజ్ఞతాబద్ధతను పెంపొందింపచేయడానికి, సంక్రాంతి పర్వం సంకల్పించబడి నట్లుంటుంది. అలాగే పరిశ్రమోపజీవులైన మన పూర్వులు, తాము పండించుకున్న పంటలను, పెంపు చేసుకున్న పాడిని, సంతోషంతో పంచభూతాలకర్పించి, తామూ, తమపై ఆధారపడి జీవిస్తున్న వారూ, కలిసి చేసుకునే పర్వంగా రూపుదిద్దుకున్న పర్వం సంక్రాంతి. దక్షిణాయనపు జీవితపు క్లేశకాలం పరిసమాప్తి చెంది, దేవతలకు సైతం ప్రీతిపాత్రమైన ఉత్తరాయణ ఆగమనమైన సంక్రాంతి – నిజంగా సంతోషాల కాలం. పంటలు పండి, గాదుల నిండా ధాన్యం నిండి, ఆరోగ్యం ఐశ్వర్యం తాండవించే కాలం. ఉత్తరాయణంలో మార్గశిర మాసం మరీ శ్రేష్ఠమైనదిగా, మాసాలలో తాను మార్గశిర మాసాన్ని అని గీతాకారుడు చెప్పుకున్నాడు. ప్రకృతిలో విశేషమైన మార్పులు గోచరించే అభ్యుత్థాన కాలం ఇది. తొలకరిలో మొలకెత్తిన సజ్జ, జొన్న, నువ్వు, పెసర, కంది, సెనగ వంటి మెట్టపైర్లు, రాగి, వరి వంటి మాగాణి పంటలు, కార్తీక, మార్గశిర మాసాలకు పండి, భూమి పంట బరువుతో కళకళలాడుతూ, ఎటు చూసినా కాంతులీనుతూంటుంది. చేమంతి, బంతి నిండార పూలతో నేత్రపర్వంగా హేమంత కాంతులీనుతూంటాయి. జీవితం నవ్య భావోన్మీలనంగా ఉంటుంది. బ్రతుకంతా ఎలా వున్నా ‘మూడునాళ్ల ముచ్చట’ అన్న కారణం భోగి, సంక్రాంతి, కనుమల వైభోగ పర్వం వల్లనే. పంట రక్షణకై రాత్రిళ్లు కాపలాకాచి, వేసుకునే చలిమంటల జాగరూకత చిహ్నంగానే భోగిమంట వెలసిందని అనేవారున్నారు. రైతు బ్రతుకు ఆనంద రమణీయమయ్యే కాలం సంక్రాంతి. దేశానికి రైతు వెనె్నముక అయినట్లే. సకల పర్వాల ప్రకృతికి వెనె్నముక పండుగ, సంక్రాంతియే! ధనుర్మాసంలో ‘రంగడే దైవంగా – పొంగలే ప్రసాదం’గా స్వార్థం పరమార్థం రెండంచులుగా భాసిస్తాయి. కనుమ పండుగ పూర్తిగా కర్షక జీవిత సంబంధియే. పశు పూజ ప్రాధాన్యమానాడు. ‘పాల పొంగలి – పశువుల పొంగలి’ అనే నానుడి వచ్చింది అందుకే. పొంగలి ‘బలి’ చక్రవర్తి సంకేతంగా భావించేవారున్నారు. పొంగలిని దేవతలకు నైవేద్యం పెట్టాక, పొలానికి వెళ్లి పొంగలి మెతుకులు చల్లేవారు. ‘దీనినే ‘పొలి చల్లుట’ అనేవారు. అలా చేయడం వలన పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఎర్ర గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టేవారు. అది బలిపశువు శిరస్సుకి ప్రత్యామ్నాయం! అలా జీవహింసకూ దూరంగా వున్నారు. పశువుల సంబరంలో భాగమే గంగిరెద్దుల హంగులు డూడూడూడూ బసవన్నా డూడూడూడూ వెంకన్నా అయ్యగారికీ దండం పెట్టూ అమ్మగారికీ దండం పెట్టూ అని గంగిరెద్దుల వారు సన్నాయి మేళాల సవ్వడిలో అడుగగా, గంగిరెద్దులు తల ఆడించడం, వాని మూలాన భావి శుభాలను తెలియచెప్పడం, పశుగణం పట్ల గౌరవ బుద్ధికి తార్కాణాలు మరి! ప్రకృతికి, జానపదులకూ విడదీయలేని సంబంధం. అందుకే ప్రకృతిపర్వమైన సంక్రాంతిరోజుల్లో, ముఖ్యంగా పల్లెసీమల్లో జీరేనుగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, మలిపోని కాసులోళ్లు, బేరటోపిగాళ్లు, జంగమ దేవరలు, బారెమూరెండోళ్లు, శీర్లాశిల్పులు, హరిదాసులు అసంఖ్యాకంగా కనపడేవారు. పండుగ మూడు రోజులూ పనీపాటలకు సెలవిచ్చి, ఆనందించడమే ప్రధానంగా సంబరాలతో గడిపేవారు. సంక్రాంతి రోజు మన్నానికి అంటే పొలానికీ, గోవులకాయనూ పోరట! మన్నానికీ పోను మన్ననీ రోజూ నా వనె్నల వీరన్న బావా సంక్రాంతి పండుగా సరసరా వచ్చేరా సల్లంగా నేనైతే సూడాలోయి సంక్రాంతి వేళల్లో వెనె్నల సెంద్రున్ని సక్కగా ముద్దిడుచు మక్కువతో నుంటాను ఓ నా వనె్నల వీరన్న బావా.. అన్న జానపద గీతం – పల్లె పడుచులు తమతమ భర్తలతో సరస సల్లాపాల్లో మునిగి, సంక్రాంతి రోజుల్లో కాలక్షేపం చేస్తారని చెప్పకనే చెబుతోంది. క్రొత్తగా పండిన రాగులను కోడిపుంజులకు తినిపించి, సంక్రాంతి కనుమ వేళకు కోడిపందేలు ఆడేవారు. నా కోడి భీమన్నరా ఓహో నా కోడి హనుమన్నరా నా కోడి నీ కోడి ఏకమై కలబడితె సాకెండ్ల సిన్నదే సంకలే ఎగరేసి మ్రుక్కుపై వ్రేలిడి సక్కగా సూచురా అన్న గీతం రాయల కాలం నాటి నుంచి ప్రసిద్ధి. రాయల కాలంలో దివిటీల పట్టే చాకలి పిల్లయే సాకెండ్ల సిన్నది. సంక్రాంతి రోజు విరూపాక్ష స్వామి దేవాలయంలో, ప్రాంగణంలోనూ, మండప స్తంభశాలలోనూ, మూడు రోజులపాటు, వేయి వత్తులతో, అఖండ దీపాలను ఆరిపోనీక వెలిగించే వాడుక వుండేదట. అందుకు ఆ సిన్నది మూలకందంగా నిలిచేదట. ఉయ్యాలవాడ నివాసి, ధర్మదాత అయిన బుడ్డా వెంగళరెడ్డి – సంక్రాంతినాడు పండి, అప్పుడే తన ఇంటికి చేరిన ధాన్యరాశిలో – సగానికి పైగా దానంగా పంచిపెట్టేవాడట. బ్రాహ్మణులందరికీ గోదానం చేసేవాడట. ఇప్పటికీ మహాదాతగా వెంగళరెడ్డిని తలచేవారున్నారు. జానపద గీతాలూ వున్నాయి. ఇలా సంక్రాంతి పర్వం ప్రకృతితో, జనపదాలతో భౌతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలతో పెనవేసుకున్న అసలు సిసలు పెద్ద పండుగ. ఒక విధంగా సంక్రాంతియే నవహర్షారంభం. నవ వత్సరారంభం! కీ.శే.బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారన్నట్లు- చేరువైన సంక్రాంతి గూర్చిన తలంపు చాలుననె తోచు రమ్య దృశ్యములు వేలు హృదయమున పూలజల్లులై, ఇంద్రచాప శబల వర్ణమ్ములై, నవాశలను పెంచె! ఆశావహ అభ్యుదయ అభ్యుత్థాన మానవాళి సర్వం – సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!! * ………. ** …………….** ……………… నీరు చల్లిన ముంగిట్లో -ప న్నీరు చల్లిన వాకిట్లో దారి పొడుగునా ముగ్గుల్లు! ము త్యాలు పోసినా ముగ్గుల్లు నారుపోసిన ముంగిట్లో గ నే్నరు పూచిన వాకిట్లో జారు జడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా జారు జడలా కనె్నలుంచినా గొబ్బిళ్లూ -కృష్ణశాస్ర్తీ ‘వేయి పాదముల్ మకర ప్రవిష్టము లయి తడబడుట లేక చక్కగా నడువు పూష అవ్యయమ్మైన యుత్తరాయణము వెలయ నవ్య మార్తాండకేళీ సనాథమగుచు’ -నాయని సుబ్బారావు చెలి చూపులు చలిమంటలుగా చెలి నవ్వులు తొలి పంటలుగా అరుదెంచెను నవసంక్రాంతి విరబూసెను చిరు చేమంతి ఈ ధాన్యపు రాసుల మాటున ఈ వాగుల వరదల చాటున ఏదో ఒక నవ చైతన్యం ఎదలో చిలికించును హర్షం పులకించిన తొలి సంక్రాంతివి దిగి వచ్చిన తీయని శాంతివి ఈ చలిలో నీ కౌగిలిలో ఇమిడిపోయె లోకాలన్నీ పాత సంప్రదాయపు గోడలు పడద్రోసెద వెలుతురు కోసం తరుణత్వం మెచ్చకపోతే తిరుగబడెద దేవుని మీద నవచేతన కాలంబనగా అవతరించినావే నీవు రవికరముల రాగిల్లెడు నీ నవహృదయం నాదైపోనీ -దాశరథి జీవితంలో కళాభిజ్ఞత చేర్చి కూర్చిన పాటగా కాలం మార్పు సూచించే సూర్యదేవుని కొత్త బాటగా అందంగా హాయిగా ఆనందానికి స్థాయిగా సాగిపోతుంది సంక్రాంతి! -కుందుర్తి ఆంజనేయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరికీ శుభం…శుభం

అందరికీ శుభం…శుభం
మకర సంక్రాంతి చాలా పెద్ద పండగ. మన పెద్దలు పండగలను చాలా గొప్పగా ఆచరిస్తారు. ఆ పండగలలో అంతరార్ధం ఉంది. అంతేగాని రకరకాల పిండివంటలు చేసుకుని తినడానికి కాదు. ‘పండుగ’ అనే శబ్దం కాలక్రమంగా పండగ అయింది. ‘పండా ఆత్మ విషయ బుద్ధిః’ అని శ్రీ శంకరులు చెప్పారు. ఆత్మ విషయమైన బుద్ధియే పండా. ‘గ’ అంటే పొందడం. అది దేనివలన పొందబడుతుందో అదే పండగ. ఆత్మ ఙ్ఞానాన్ని పొందడమే మన పండగల ముఖ్య లక్ష్యం.
ఇంకొక దృష్టితో చూస్తే సంక్రాంతి పండగ అనేది ప్రకృతిలో కలిగే మార్పును సూచించేది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభదినం. సంక్రాంతి పర్వదినంనాడే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో చనిపోయిన వారికి ఉత్తమ జన్మగాని, ఉత్తమ లోకాలుకానీ లభిస్తాయి అని పురాణం. భీష్మాచార్యులు అంపశయ్యపై ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ ఆ పుణ్యకాలంలోనే బ్రహ్మైక్యమైనట్లు మహాభారతం చెబుతుంది.
వేదాల్లో, పురాణాల్లో సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించాలని చూపాయి. భారతీయులు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆర్ఘ్యం వదిలి సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడే లేకపోతే ఎవరికీ అన్నం, నీరు లేదు కదా? కాబట్టి సూర్యుడు సకల జీవులకు ప్రాణదాత. అందుకే సూర్యుడని సూర్యనారాయణుడని ఆరాధిస్తున్నాం. ‘భా’ అంటే ప్రకాశం లేక సూర్యుడు. ‘రతం’ అంటే క్రీడ. సూర్యపాసనలో క్రీడించే దేశం కాబట్టి మనది భారతదేశం. ఈ సూర్యోపాసనయే క్రమంగా ఆత్మోపాసనకు ఆత్మక్రీడకు దారితీస్తుంది.
దక్షిణాయనం కంటే ఉత్తరాయణం శ్రేష్టం. ఎందుకంటే దేవతలకు దక్షిణాయణం రాత్రి. ఉత్తరాయణం పగలు. సామాన్యంగా శుభకార్యాలను ఉత్తరాయణంలో ప్రారంభిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి కాబట్టి వాళ్లు నిద్రపోతూ ఉంటారు. ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారు. కాబట్టి మనం చేసిన శుభ కర్మలు, యఙ్ఞయాగాదులు, వ్రతాలు, వివాహాలు, ఉపనయనాలను దేవతలు చూస్తారు. వారి అనుగ్రహం, ఆశీస్సుల వల్ల మన కార్యాలు సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఉత్తరాయణం శ్రేష్ఠకాలం. దీని ప్రారంభదినం కాబట్టి సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా గీతలో (8- 25,24) దక్షిణాయన మార్గాన్ని భగవంతుడిలా ఉపదేశించాడు. ధూమోరాత్రిః తథాకృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ఃతత్ర చాస్ద్రమసం జ్యోతిర్యోగీపాప్య నివర్తతేః. ధూమం, రాత్రి, కృష్ణపక్షం, ఆరునెలలు గల దక్షిణాయనం – ఈ మార్గంలో వెళ్లిన జీవుడు స్వర్గంలో పుణ్యఫలాన్ని అనుభవించి మరల జన్మ ఎత్తుతాడు. కానీ అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్యాసా ఉత్తరాయణమ్‌ః తత్రప్రయాతాగచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదోజనాః! అనగా అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం ఆరునెలలు గల ఉత్తరాయణం. ఇలాంటి అర్చిరాదిమార్గంలో బ్రహ్మలోకం చేరుకున్నవాడు బ్రహ్మమును పొందుతాడని భావం. ఈ ఉత్తరాయణ మార్గంలో పయనించినవాడు బ్రహ్మలోకంలో బ్రహ్మతో ఉపదిష్టుడై క్రమముకిని పొందగలడు. కాబట్టి ఈ మార్గమే శ్రేష్ఠం. భీష్ముడు లోకసంగ్రహబుద్ధితో ఉత్తరాయణం శ్రేష్ఠమైన మార్గమని చూపించడానికై ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. కానీ ఙ్ఞాని ఎప్పుడైనా చనిపోవచ్చు. అతడు దేశకాలాతీతుడు కదా! ఇక్కడ ఉత్తరాయణం చనిపోయిన తర్వాత జీవులు వెళ్లే ఇతర మార్గాలకు ఉపలక్షణంగా ఉంది. జీవులు శరీరం వదిలాక వారు పాపాత్ములైతే అధోమార్గంలో – పాయువు, ఉపస్థలం ద్వారా ప్రాణం వదిలి అథోలోకాలను, నీచ జన్మలను పొందుతున్నారు. పుణ్యకర్మలు చేసినవారు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి (వైకుంఠానికి, కైలాసానికి) వెళ్లి అక్కడ బ్రహ్మతో ఉపదేశం పొంది క్రమముక్తిని పొందుతారు. ఇక బ్రహ్మైకమార్గంలో అంటే నేతినేతిమార్గంలో (ఇది ఒక మార్గం కాదు, విచార విధానం మాత్రమే) పయనించినవారు ఇక్కడే, ఇప్పుడే స్వరూపంలో ఉండిపోతారు. వీరే జీవన్ముక్తులు. ఉత్తరాయణం అంటే ఉన్నతోన్నతంగా (సాధనమార్గంలో సాగిపోయి) స్వరూపనిష్ఠ పొందటం. ఇదే సంక్రాంతి. క్రాంతి అంటే మార్పు. సం అంటే సమ్యక్‌ అంటే గొప్ప క్రాంతియే సంక్రాంతి. మన పాపాలు, ఈర్ష్య, అసూయ, అవిద్య, వివిధ వికల్పాలు, జన్మజన్మాంతరాల నుంచి మన హృదయంలో తిష్ఠ వేసినాయి. కర్మ, ఉపాసన, ఆత్మవిచారం అనే సాధనాలను అనుష్టించి వాటిని తరిమి మహాక్రాంతిని కలుగజేసి మన జీవితంలో మహాశాంతిని నెలకొల్పడం మన విధి. ఇదే సంక్రాంతి. పండుగ మొదటిరోజు భోగి. తెల్లవారుఝామున భోగిమంటలు వేస్తారు. ఈర్ష్య, ద్వేషం, వికల్పాలు మొదలైనవాటిని ఙ్ఞానాఙ్ఞిలో దగ్ధం చేయటం ముముక్షువు కర్తవ్యం. ఙ్ఞానాఙ్ఞి సర్వకర్మాణి భస్మసాత్కురుతేర్జున అని కదా గీత. రెండో దినం సంక్రాంతి. ఆనాడు త్రివేణీసంగమంలో స్నానం చేయడం విధి. గీతయే గంగ. ఉపనిషత్తే సరస్వతి. బ్రహ్మసూత్రాలే యమున. ఈ ప్రస్థాతత్రయ బోధవాహినిలో స్నానం చేయటమే త్రివేణిసంగమస్నానం. ఆడపిల్లలు ఆనాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గుల మధ్య అందంగా అమరుస్తారు. గంగిరెద్దుల మేళతాళాలు, గుమ్మడి, నువ్వులు, సజ్జల దానం, పిండివంటలు బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని బంధుమిత్రులకు పంచుతారు. నాల్గోరోజు ముక్కనుమ. ఆరోజు సీ్త్రలు బంకమట్టితో గౌరీదేవి విగ్రహం చేసి పూజించి, ఊరేగించి, నదిలో కలపటం – ఇదంతా మూర్తి పూజ, దానం, గోపూజ, భగవర్తణం, వ్రతం మొదలైన ప్రవృత్తిధర్మాన్ని తెలుపుతుంది. సంక్రాంతినాడు వేలమంది భక్తులు శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లెక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుని వెనుదిరిగి వచ్చేవేళ వెనక్కితిరిగి చూడకుండా కిందికి దిగివస్తారు. తర్వాత సాయంత్రం ఆకాశంలో కనిపించే జ్యోతిని చూస్తారు. శరీరం ఒకటి, ఙ్ఞానేంద్రియాలు ఐదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణం, దేశం, కాలం – ఈ పదునెనిమిది తత్వాలే సోపానాలు. వీటిని అవస్థలో వినుదిరగకుండా అంటే నేరుగా నిలవటమే పదునెనిమిది మెట్లు దాటి పోవటంలో జ్యోతిని దర్శించుకోవడంలోగల ఆంతర్యం. ఇదే సంక్రాంతిలోని నివృత్తిధర్మ రహస్యం!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్రాంతి జ్ఞాపకాల్లో -ఆంధ్రజ్యోతి

సంక్రాంతి… ఓ జ్ఞాపకం

జ్ఞాపకాల్లో జీవించేవారికి జరామరణాలు ఉండవు.
దీపావళికి చలి దివ్వెల దగ్గరకు వస్తుంది. సంక్రాంతికి చంకల్లోకి వస్తుంది. శివరాత్రికి శివశివా అని పోతుందనేది అమ్మ. ఆ మాట నిజం. సంక్రాంతి రోజులు కావడంతో చలి బాగా ఉంది. చేతుల్ని గుండెల చుట్టూబిగించుకుని నడుస్తున్నాడతను. స్వెట్టర్‌ వేసుకున్నాడు. మఫ్లర్‌ చుట్టుకున్నాడు. అయినా చలి వణికించేస్తోంది. సిగరెట్‌ తాగితే బాగుణ్ణనిపించింది. రాత్రి పన్నెండు దాటింది, సిగరెట్లు ఇప్పుడెక్కడ దొరుకుతాయి? సినిమా థియెటర్ల దగ్గర దొరుకుతాయి. అటుగా నడిచాడతను. తెల్లారితే బోగి. త్వరగా మంటలు వేస్తే బాగుణ్ణు. వెచ్చగా కాచుకోవచ్చనిపించింది. 
‘‘అత్తారింటికా? అలా పరిగెడుతున్నావు?’’

‘‘అవును గురూ! అదృష్టం బాగుంది, పాసింజర్‌ లేటట! వస్తాను.’’ ఎవరో ఎవరినో అడిగితే, ఆ ఎవరో ఎవరికో సమాధానం చెప్పి, పరుగుదీస్తున్నాడు. పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి, అతనికీ పరిగెత్తాలనిపించింది. పరుగుదీశాడు. కొద్దిదూరం పరిగెత్తాడో లేదో అలసిపోయాడు. ఆగిపోయాడు. గబగబా శ్వాసించసాగాడు. ఒళ్ళంతా వేడెక్కినట్టనిపించింది. తల మీది మఫ్లర్‌ను తొలగించాడు. తేరుకున్నాడు కాస్సేపటికి. అప్పుడు అనుకున్నాడు.
అనుమానం లేదు! తను ముసలివాడే! 
గత నెల డిసెంబర్‌ పద్నాలుగు వరకూ ముసలితనం, ముసలివాడు అన్న మాటల్ని పెద్దగా పట్టించుకోలేదతను. వాటి ఊసేలేదు. డిసెంబర్‌ పద్నాలుగు, ఆఫీసులో పని చేసుకుంటున్నాడు. హెచ్‌.ఆర్‌. దగ్గర నుంచి ఓ లెటర్‌ వచ్చింది. తెరిచి చూశాడు. నేటితో మీకు అరవై ఏళ్ళు నిండుకున్నాయి. మీరు రిటైరయ్యారంటూ…ఏదేదో ఉంది అందులో. దిగ్ర్భాంతి చెందాడు. లెటర్ని మడచి జేబులో పెట్టుకున్నాడు. బాత్‌రూంలోకి పరుగుదీశాడు. అక్కడ అద్దంలో తన ముఖాన్ని ఆత్రంగా చూసుకున్నాడు. ఈ ముఖానికి అప్పుడే అరవై ఏళ్ళా అనుకున్నాడు. ముఖాన్ని ప్రేమగా నిమురుకున్నాడు. చేతికి ఎలాంటి ముడతలూ తగల్లేదుగాని, ఎందుకో బాధనిపించింది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు.
‘‘ఇవాళ్టికి సరిగ్గా నెలరోజులుంది సంక్రాంతి.’’ వినవచ్చింది. కిటికీ దగ్గరగా నిలబడి ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
కాలం కరిగిపోతోంది. అప్పుడే తనకి అరవై ఏళ్ళు. మిగిలేది కొద్దికాలమే! ఈ కాలాన్ని సద్వియోగం చేసుకోవాలి. అంటే… జ్ఞాపకాలని ఒడిసి పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. రేపు అవే తనని రక్షిస్తాయి అనుకున్నాడతను. పరుగుదీశాడు. అయిదువందల కిలోమీటర్ల దూరంలో గల పుట్టి పెరిగిన ఊరికి చేరుకున్నాడు. అక్కడ అమ్మలేదు, నాన్నలేడు, ఎప్పుడో పోయారు. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళు కూడా లేరు. చెదరిపోయారంతా. మరి ఎవరికోసం, ఎందుకోసం అంటే గుప్పెడు జ్ఞాపకాలకోసం, పట్టెడు అనుభూతులకోసం పరిగెత్తుకుని వచ్చాడు. చిన్న హోటల్లో దిగాడు. దిగి, ఇదిగో ఇలా రోడ్డున పడ్డాడు.
థియెటర్ల దగ్గరకు చేరుకున్నాడతను. పాన్‌షాప్‌లో సిగరెట్‌ అడిగి తీసుకున్నాడు. ముట్టించేందుకు ప్రయత్నిస్తుంటే…
‘‘బోగిమంట అప్పుడే ఏసీశారేట్రా? ఒంటి గంట కూడా కాలేదు.’’
‘‘చలి బాబాయ్‌! తట్టుకోలేకపోతున్నాం.’’

అంతెత్తున లేస్తూ ఎర్రగా కనిపించింది మంట. పాన్‌షాప్‌కి వెనుకగా వేశారు. అతనటుగా నడిచాడు. కాచుకుని వెచ్చనయ్యాడు. సిగరెట్‌ ముట్టించాడు. గుండెనిండుగా పొగపీల్చి, వదిలాడు. ముక్కులోంచి వచ్చింది పొగ. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దగ్గు వచ్చింది. గట్టిగా దగ్గాడు. కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఆ నీళ్ళలో సుభద్ర అస్పష్టంగా కనిపించింది. గుర్తు వచ్చిందామె.
ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు తను. దొంగతనంగా సిగరెట్లు కాల్చడం అలవాటైంది. అలాగే సుభద్రను చాటుగా ముద్దు అడగడం కూడా అలవాటు చేసుకున్నాడు. సుభద్ర తన క్లాస్‌మేటే! ఇద్దరూ ‘ప్రేమించుకుంటున్నాం’ అనుకుంటున్న రోజులవి. ప్రేమంటే ముద్దులూ, కౌగిలింతలనుకున్నారు. బోగిరోజు ముద్దు కావాలన్నాడతను. లంగా ఓణీకొత్తబట్టల్లో కావాలన్నాడు. ముందు ఒప్పుకోలేదు, బత్రిమలాడగా…ఆడగా సరేనంది సుభద్ర. సెలవులు కదా, కాలేజీ వెనుకనున్న గుబురుల్లో కలుసుకుందామంది. కలుసుకున్నారిద్దరూ. ముద్దు పెట్టుకోడానికి ముందు ధైర్యం కోసం సిగరెట్‌ తాగాడు. ఆతృత. తెలియని ఒత్తిడి. పొగ గుండెల్ని ఎగదన్నింది. ముక్కులోంచి బయటికి వచ్చింది. ఒకటే దగ్గు. కళ్ళంట గిర్రున నీళ్ళు తిరిగాయి. పెద్దగా దగ్గాడు.
‘‘ఎవరక్కడ? ఎవరదీ?’’ కేకేసుకుంటూ, చేత్రికర్రను నేలకు కొడుతూ వాచ్‌మాన్‌ పరిగెత్తుకొస్తోంటే, భయంతో గోడదూకి పారిపోయింది సుభద్ర. అలా పారిపోయిన సుభద్ర ఏదీ? ఎక్కడ? ఎవరికి తెలుసు?
తెల్లారిపోయింది. హోటల్‌కి చేరుకున్నాడతను. తలంటుపోసుకున్నాడు. కొత్తబట్టలు వేసుకున్నాడు. టిఫిన్‌ చేసి, ఊరికి అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? అని ఆలోచనలో పడ్డాడు. అటు వెళ్తే కోడిపందాలు ఆడవచ్చు. ఇటు అయితే లాటరీ, పేకాటలూ ఆడుకోవచ్చు. కోడిపందాలు తర్వాత, ముందు పేకాడుదాం అనుకున్నాడతను. ఇటుగా నడిచాడు. కొబ్బరితోటలో గుంపులు గుంపులుగా పేకాడుతున్నారంతా. పిల్లలు లాటరీలు ఆడుతున్నారు.
‘‘పెద్దబజార్‌! చిన్నబజార్‌! లక్కీసెవెన్‌’’ అరుస్తున్నారు. 
అతను లక్కీ సెవెన్‌ మీద వందరూపాయలు కట్టాడు. ఓడిపోయాడు. నవ్వుకుని ఆనందించాడు. ఓడిపోవడం ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోందతనికి. ఆ ఆనందం కోసం అతను వెయ్యి రూపాయలు వరకూ ఓడిపోయి వెను తిరిగాడు. రాత్రి నిద్రలేదేమో! నిద్ర ముంచుకొచ్చింది. భోజనం చేసి పడుకున్నాడు. లేచేసరికి సాయంత్రం అయింది. ఫస్ట్‌షో సినిమా వేళయిందంటే థియెటర్‌కి పరిగెత్తాడు. పెద్దహీరో సినిమా. దిగువ తరగతి టిక్కెట్లకోసం కొట్టుకుంటున్నారక్కడ. బాల్కనీ టిక్కెట్ల కౌంటర్‌ దగ్గర పెద్దగా జనం లేరు. అయినా అక్కడ టిక్కెట్టు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు. దిగువతరగతి టిక్కెట్టే కావాలి. చూస్తే అభిమానులతోనే, అభిమానుల మధ్యనే సినిమా చూడాలి. ఆ థ్రిల్లే వేరు. వయసు మరచి కౌంటర్‌లోకి దూసుకుపోయాడు. ముందు వెనుకలయ్యాడు. కిందు మీదులయ్యాడు. గింజులాడాడు. ఆఖరికి టిక్కెట్టు సాధించాడు. చేతిలోని టిక్కెట్టును ఆనందంగా చూసుకుంటూ, చిరిగిన షర్టును పట్టించుకోలేదతను. సినిమా బాగా లేదు. కాని, అభిమానుల కేరింతలు బాగున్నాయి. ఈలలూ, చప్పట్లూ బాగున్నాయి. ఇంటర్వెల్‌లో సోడా తాగుతోంటే, పద్మనాభం దగ్గరగా వచ్చాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు.
‘‘నువ్వు మా కృష్ణమూర్తివి కదూ? హైదరాబాద్‌లో ఉంటున్నావు కదూ?’’ అడిగాడు. తను పద్మనాభాన్ని గుర్తుపట్టాడుగాని, వాడు తనని గుర్తుపట్టలేదు. అనుమానంతో చూస్తున్నాడు.
‘‘రారా! ఈయన కృష్ణమూర్తేంటి? వాడేంటీ? వాడి హోదా ఏంటీ? ఇలా చిరిగిన షర్టూ, నేలక్లాసు టిక్కెట్టూ…’’ అంటూ పద్మనాభాన్ని లాక్కుపోయాడు వాళ్ళ బావమరిది. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి సన్నగా నవ్వుకున్నాడతను. పద్మనాభం ఇంటర్లో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. కాకపోతే బొజ్జ పెంచేశాడు. జుత్తు పూర్తిగా నెరసిపోయింది. తనలా రంగు వేసుకోవడం లేదనుకున్నాడతను.
సంక్రాంతి. సరికొత్త దుస్తులు వేసుకున్నాడు మళ్ళీ. రామాలయానికి వెళ్ళాడు. చిన్పప్పుడు అదే రాముడు బొమ్మ చాలా పెద్దదిగా అనిపించేది, ఇప్పుడదే బొమ్మ చిన్నదిగా అనిపిస్తే, ఏదోలా అయిపోయాడు. పులిహోర ప్రసాదం అందుకుని స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అప్పట్లో పండగపూటా అమ్మా, తనూ వచ్చేవారు ఆలయానికి. ఇలాగే ప్రసాదం తీసుకునేవారు. అమ్మ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంటే, తానేమో స్తంభం చుట్టూ పరిగెడుతూ తిరిగేవాడు. అది గుర్తు రావడం ఆలస్యం, ప్రసాదాన్ని పిడికెట బిగించి, స్తంభం చుట్టూ పరుగుదీశాడతను.
‘‘ఏంటండీ చిన్నపిల్లాడిలా?’’ నవ్వాడు పూజారి. సిగ్గుపడ్డాడతను. సంక్రాంతి పూటా పెరుగుగారెలు తినాలనేది అమ్మ. వెళ్ళి హోటల్లో మూడు ప్లేట్లు పెరుగుగారెలే తిన్నాడు. భోజనం చెయ్యలేదు. అమ్మ గుర్తు రావడంతో ఊరిలో ఇల్లు గుర్తు వచ్చింది. అమ్మేశారప్పట్లో. పుట్టి పెరిగిన ఇల్లు చూడాలనిపించింది. నడిచాడటు. ఊరు వదలిపెట్టి, నలభై ఏళ్ళయింది. సినిమా ధియోటర్లలోనూ, దుకాణాల్లోనూ మార్పు వచ్చిందిగాని, వీధుల్లోనూ, అక్కడి ఇళ్ళల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. పైగా శిథిలమైపోతున్నాయి. శిథిలమవ్వడం మార్పు కాదుకదా? అనుకున్నాడతను. నాలుగైదు వీధులు తిరిగాడు. అయిదారు మలుపులు తిరిగాడు. ఇంటికి చేరుకున్నాడు. అప్పట్లో పెంకుటిల్లు. కొన్నవాళ్ళు దాన్ని డాబా చేశారు. నిలబడి చూస్తోంటే, తనని గమనించిన, ఆ ఇంటాయన-
‘‘రండి, లోపలికి వచ్చి చూడండి.’’ అన్నాడు.
‘‘మీకు మా బావమరిది చెప్పినట్టున్నాడు, ఇల్లు అమ్మకానికి పెట్టాను. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. మా ఆవిడపోయి మూడేళ్ళయ్యింది. ఒంటరిగా నేనిక్కడ ఉండడం పద్ధతి కాదంటున్నారు పిల్లలు, అక్కడికి రమ్మని ఒకటే గోల. వెళ్ళిపోదామనుకుంటున్నాను, ఇల్లు చూడండి.’’
ఇల్లు కొనుగోలు చేసేందుకు వచ్చాననుకుంటున్నాడు. అనుకోనీ, అవకాశం దొరికిందని ఇంట్లోకి ప్రవేశించాడతను. చూడసాగాడు. అంతా అయోమయంగా ఉంది. అప్పట్లో పెద్దహాలు ఉండేది. హాల్లో వాలుకుర్చీలో నాన్న కూర్చుని ఉత్తరరామాయణం పారాయణం చేసేవారు. రామాయణం పారాయణం చేస్తే వర్షాలు కురుస్తాయనేవారు. కురిశాయో లేదో గుర్తు లేదుగాని, నాన్న చదివిన వాక్యాలూ, వర్ణనలూ బాగా గుర్తున్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ నడుస్తున్నాడతను. అటు చావిడిని అలాగే ఉంచారు. చావిడిలో నేలలో పాతినరోలు అలాగే ఉంది. వాడుతున్నట్టు లేరు. మట్టికూరుకుపోయి నల్లగా ఉందది. కూర్చున్నాడక్కడ. దగ్గరగా ఉన్న కర్ర ముక్క అందుకున్నాడు. దానితో పొడిచి పొడిచి రోటిలోని మట్టిని పెళ్ళగించసాగాడు. రోటిని తవ్వుతోంటే ఎగిరి వచ్చి పడిందో నాణెం. వాలులోకి అది పరుగుదీస్తోంటే అందుకుని చూశాడు. 1975నాటి రూపాయినాణెం. అక్క కూతురికి బోగిపళ్ళుపోసినప్పటి నాణెం. పళ్ళతోపాటు నాణెలు కలిపి పోశారిక్కడే! అప్పట్లో దొరకలేదు పిల్లలకి. ఇప్పుడు దొరికిందనుకున్నాడు. రూపాయినాణెన్ని తేరిపారజూస్తూంటే ఇంటాయన వచ్చాడు. అతన్నీ, రోటి నుంచి తవ్వి తీసిన మట్టినీ, అతని చేతిలోని నాణె న్నీ చూసి భయాందోళనలు చెందాడు.
‘‘ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎవరు మీరు? లేవండి, లేవండిక్కణ్ణుంచి. నడవండి, బయటకు నడవండి.’’ కసిరాడు. అతను రూపాయినాణెన్ని పట్టుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటికి వచ్చాడు. మలుపు తిరిగి, తప్పించుకున్నాడక్కణ్ణుంచి. రాత్రంతా ఆ
నాణెన్ని చూస్తూ గడిపేశాడు. 
తెల్లారింది. కనుము. ఒళ్ళంతా నొప్పులనిపించాయి. జ్వరం వచ్చినట్టనిపించింది. హోటల్‌ ఖాళీ చేసి వెళ్ళిపోదామనిపించింది. ఆ మాటే అంటే…హోటల్‌ కుర్రాడు నవ్వాడు. అన్నాడిలా.
‘‘కనుముపూటా కాకికూడా బయల్దేరదు సార్‌! రేపెళ్ళండి.’’ అన్నాడు. ఉండిపోయాడతను. సాయంత్రం రూంలో ఉండలేక బయటపడ్డాడు. పశువులన్నీ పచ్చని ముఖాలతో, బొట్లతో చూడముచ్చటనిపించాయి. పరిగెత్తుకుని వెళ్ళి, వాటిని చేత్తో నిమిరి వచ్చాడు. రోడ్డు మీద రథం ముగ్గు వేస్తున్నారు అమ్మాయిలు. చూసుకోలేదు, తొక్కబోయాడు.
‘‘చూసుకుని నడవండిసార్‌.’’ హెచ్చరించారు.
‘‘సారీ’’ చెప్పాడతను. 

చేతులు వెనక్కి కట్టుకుని, గతంలోకీ, భవిష్యత్తులోకీ తొంగి చూస్తూ నడవసాగాడు. జ్ఞాపకాల చిరుగంటలు గుండెల్లో మోగుతోంటే, వాటికి అనుగుణంగా చిందేయాలనిపించింది. వేశాడతను, సిగ్గుపడలేదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడలో మంగళం పల్లి ,అన్నవరపు కామ్ష్య విగ్రహాల ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకాలు లేని,అడ్రస్ లేని కాంగ్రెస్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తినలో వెంకయ్య ఇంట మోడీసంక్రాంతి సందడే సందడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనవరి 11వతేదీ ఆదివారం నాడు సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

జనవరి 11వతేదీ ఆదివారం నాడు సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంక్రాతి సందడి ఉయ్యురులో

సంక్రాతి సందడి ఉయ్యురులో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు -భోగి మకర సంక్రాంతి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

క్షేత్రాలు -ఆవిష్కరణ సభ – ఈ నాడు వార్తా కధనం

sarasabharathieenadu 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ ఇక లేరు

నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ ఇక లేరు
అస్వస్థతతో కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లారు: జగపతిబాబు

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సినీ ప్రముఖుడు వీబీ రాజేంద్ర ప్రసాద్‌ (82) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అభిమానుల సందర్శనార్థం రాజేంద్ర ప్రసాద్‌ భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఫిలిమ్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎర్రగడ్డ శ్మశాన వాటికలో తమ తండ్రి అంత్యక్రియలు జరుగుతాయని రాజేంద్ర ప్రసాద్‌ కుమారుడు, సినీ నటుడు జగపతిబాబు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌ మృతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, మురళీ మోహన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తదితరులు తమ సంతాపం తెలిపారు.
నటుడు కావాలని వచ్చి…
రాజేంద్ర ప్రసాద్‌ పూర్తి పేరు వీరమాచినేని బాబూ రాజేంద్ర ప్రసాద్‌. ఆయనను సన్నిహితులు ‘వీబీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కృష్ణా జిల్లా డోకిపర్రులో జన్మించారు. రంగస్థల నటుడిగా తన ప్రతిభ చాటిన వీబీ సినిమాల్లోనూ నటుడిగా తన సత్తా చాటాలనుకున్నారు. కానీ… అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల నిర్మాతగా మారారు. 1960లో ‘అన్నపూర్ణ’ నుంచి 1998లో ‘పెళ్లి పీటలు’ వరకు మొత్తం 25 చిత్రాలను ఆయన నిర్మించారు. వీటిలో… అంతస్తులు, ఆత్మబలం, ఆరాధన (ఏఎన్నార్‌), దసరా బుల్లోడు వంటి 16 సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించారు. ‘దసరా బుల్లోడు’తోపాటు మొత్తం 9 చిత్రాలకు వీబీ స్వయంగా దర్శకత్వం వహించారు. రెండు చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరించారు.తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ‘సింహస్వప్నం’ సినిమాతో కుమారుడు జగపతి బాబును వెండితెరకు పరిచయం చేశారు. ఫిలింనగర్‌లోని ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేవస్థానంలోనే అధిక సమయం గడిపేవారు. రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం సహా అనేక అవార్డులు వీబీ సొంతమయ్యాయి.
రాజులా బతికారు: జగపతి బాబు

‘‘ఆయన బతికినంత కాలం రాజులా బతికారు. ఎవరినీ బాధపెట్టలేదు. తను కూడా ఎలాంటి బాధ పడకుండా ప్రశాంతంగా కన్ను మూశారు’’ అని జగపతిబాబు తన తండ్రికి నివాళులు అర్పించారు. సినిమాల్లో తన కెరీర్‌ బాగలేదని చివరిలో కొంత బాధపడేవారని ఆ తర్వాత తనకూ మంచి సినిమాలు రావడంతో సంతోషించారని తెలిపారు. ‘‘నా కూతురికి పెళ్లి కావాలని అనుకునే వారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. మా సోదరుడి కుమార్తె పెళ్లి కూడా ఖాయమైంది. ఇలా ఆయన చివరి రోజుల్లోనూ అన్నీ మంచి వార్తలను విన్నారు. మాకూ మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయారు’’ అని జగపతిబాబు తెలిపారు.
దసరా బుల్లోడు
జగమెరిగిన నిర్మాతగా, జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ అధినేతగా వీబీ రాజేంద్రప్రసాద్‌ది ఒక ప్రత్యేక శకం. ఆయన నిర్మించిన చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. కథకు న్యాయం చెయ్యడం కోసం నిర్మాణ పరంగా ఏనాడు ఆయన రాజీపడలేదు. దసరా బుల్లోడుగా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. అక్కినేని, ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణ ఇలా మూడుతరాల హీరోలతో చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. సినిమా హీరో కావాలనే కోరికతో పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నిర్మాత అయ్యారు. తరువాత దర్శకుడిగా మారారు. జనరంజకమైన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రముఖ తారాగణంతో భారీ సెట్‌లతో లావిష్‌గా సినిమాలు తీసి తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
బాల్య మంతా గ్రామీణ ప్రాంతంలో గడిపినందున ఆయన తన చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే దృశ్యాలను చూపే వారు. అలాగే తను పుట్టి, పెరిగిన ఊళ్లనే ఎక్కువగా తన చిత్రాల్లో చూపేవారు. దసరాబుల్లోడు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించిన క్రమంలో గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో అప్పటి ప్రజల ఆప్యాయతలు, బంధుత్వాలను తెరకెక్కించిన విజయవంతమైనట్టు కూడా ఆయన సన్నిహితులు చెబుతారు. కృష్ణాజిల్లాలోని భట్లపెనమర్రును దసరాబుల్లోడు సినిమాకు లోకేషన్‌గా ఎంచుకుని జనరంజకంగా చిత్రీకరించారు. పలు సినిమాల్లో ఆయన సగటు రైతు, శ్రామికుడు పడుతున్న కష్టాలను, ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యాన్ని కూడా చూపించారు. కాకినాడ పి.ఆర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు నాట్యాలు వేసేవారాయన. ఇంటర్‌ కాలేజీలో ‘కప్పలు’ నాటకంతో తొలిసారి ఆడవేషం వేసి నాటక ప్రియులను అలరించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఉత్తమ హీరోయిన్‌గా ప్రశంసలందుకున్నారు. ఈయన నాటకాల్లో ఉన్నప్పటి నుంచే అక్కినేని నాగేశ్వరరావుగారితో పరిచయముంది. ‘దేవదాసు’ చిత్రం షూటింగ్‌కి అక్కినేని కాకినాడ వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్‌ తన రూమ్‌కి ఆహ్వానించారు. నాక్కుడా సినిమా హీరో కావాలనుందని ఆయన మనసులో కోరికను అక్కినేని ముందుంచారు. నటుడు కావడం తప్పు కాదు. డిగ్రీ లేక సినిమాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. సరే డిగ్రీ పూర్తి చేసి నువ్వు ఇందులోకి రా.. నేను చేయగలిగిన సాయం చేస్తానని ఆయనిచ్చిన మాటతో వీబీకి కాస్త ధైర్యం వచ్చింది. చదువు పూర్తి చెయ్యగానే వీబీ తండ్రి కొంతకాలం వ్యవసాయం చెయ్యమని ఆదేశించారు. ఈయనకు పుట్టుకతోనే ఉబ్బసం. పొలం పనులు, కుప్ప నూర్పుళ్లు అక్కడి ధూళి ఈయనకు పడలేదు. దాంతో వ్యవసాయానికి పనికిరాడని బందరులో రైస్‌మిల్‌కి ఇన్‌ఛార్జ్‌ని చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి కావడంతో తనకి ఇష్టమైనది చేసుకోమని తల్లిదండ్రులు పర్మిషన్‌ ఇచ్చారు.

ఆ రోజుల్లో సినిమాల్లోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. అయినాగానీ ఏం చెయ్యలో తోచని పరిస్థితిలో కొంత డబ్బు ఇచ్చి వీబీ తండ్రి సినిమాల్లోకి పంపారు. పరిశ్రమలో అడుగుపెట్టిన కొంత కాలానికే ఆయన తెచ్చిన డబ్బు సగం ఖర్చయిపోయింది. కానీ ఛాన్స్‌ రాలేదు. డబ్బింగ్‌ సినిమాలు తీద్దామని పూనె వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది. మిగిలిన డబ్బుతో ఏం చెయ్యాలో తెలియక, ఇంటికి తిరిగి వెళ్లడం ఇష్టం లేక జెమిని స్టూడి యోస్‌లో సౌండ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రంగారావుని కలిసి సమస్యను వివరించారు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఖాళీ లేకపోవడంతో వి.మధుసూధనరావు దర్శకత్వంలో జగ్గయ్య, జమున నటీనటులుగా ‘అన్నపూర్ణ’(1960) సినిమాతో నిర్మాతగా మారారు వీబీ. ఆ సినిమాల్లో ఆ రోజుల్లో పెద్ద హిట్‌ కావడంతో నిర్మాతగా నిలబడి 16 సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా ‘దసరాబుల్లోడు’ సినిమాతో మెగా ఫోన్‌ పట్టి 14 సినిమాల కు దర్శకత్వం వహించారు. హిందీ, తమిళంలో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. 1965లో వచ్చిన ‘అంతస్థులు’ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ఠ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2003లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
అక్కినేనితో, ఆయన తనయుడు నాగార్జునతో, అలాగే ఎన్టీఆర్‌తో ఆయన తనయుడు బాలకృష్ణతో సినిమాలు నిర్మించిన ఘనత రాజేంద్రప్రసాద్‌ది. సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానే కాకుండా మంచి వ్యక్తిగా రాజేంద్రప్రసాద్‌ పేరు సంపాదించుకున్నారు. హీరో దగ్గర నుంచీ బాయ్‌ వరకు అందరినీ ఒకే రీతితో ఆదరించి గౌరవించిన మంచి మనస్తత్వం ఆయనది. అలాగే తన దగ్గర పనిచేసే వర్కర్స్‌ కోసం ఒక సినిమా నిర్మించిన ఖ్యాతి రాజేంద్రప్రసాద్‌కి దక్కుతుంది. ఆ చిత్రం ‘పిచ్చిమారాజు’. ఇందులో వచ్చిన లాభాలను వర్కర్స్‌కే పంచిపెట్టి తన విశాలహృదయాన్ని చాటుకున్నారు. తన కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. అయితే ఎంతోమంది హీరోలకు హిట్లు ఇచ్చిన తను కుమారుడికి మాత్రం హిట్‌ ఇవ్వలేకపోయాననే బాధ ఆయనలో చివరి వరకూ ఉండేది.

‘పెళ్లిపీటలు’ చిత్రం తర్వాత ఆయన చిత్రనిర్మాణరంగానికి దూరంగా జరిగి ఆధ్యాత్మిక రంగంవైపు మళ్లారు. ఫిలింనగర్‌లో ధైవ సన్నిధానం ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. తన శేష జీవితాన్ని భగవంతుని సేవకే అంకితం చేశారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తిరుపతిలో భాగవత ఆణిముత్యాల ఆవిష్కరణ కార్యక్రమానికి సాదర ఆహ్వానం

http://bhagavatamanimutyalu.org/IBamC1.html

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో

తిరుపతిలో

పవిత్రమైన అఖండ ఆవిష్కరణ కార్యక్రమానికి సాదర ఆహ్వానం

(January 15,16, 17, 2015 సంక్రాంతి పండుగ రోజులు)

మన చరిత్రలో, తెలుగు సాహిత్య పురోగతిలో, హిందూ మత సంస్కృతిలో మొదటి సారిగా ఒక నూతన ప్రక్రియ కు ఈ సంక్రాంతి పండుగ పుణ్యక్షేత్రమైన తిరుపతి లో  శ్రీకారం చుట్టనున్నది.  పోతనామాత్యులవారి భాగవతం నుండి కొన్ని ఆణిముత్యాలని ఏరి, వాటిని రాగ యుక్తంగా పాడించి, అర్థం వివరిస్తూ అటు ప్రాచీన , ఇటు అత్యానుధిక ఆధునిక సాంకేతిక పరికరాలు, అంతర్జాల మాధ్యమాలలో కొద్ది క్షణాలలోనే అందుబాటులో ఉండే ఒక సమగ్ర ప్రణాళిక పూర్తి అయిన సందర్భంగా ఆ పర్వదినాలలో ఆయా ఉత్పత్తులని యావత్ ప్రపంచానికి అందించే ఒక పవిత్రమైన ఆవిష్కరణ కార్యక్రమానికి, మూడు రోజుల భాగవత ప్రవచనానికి అందరూ ఆహ్వానితులే.

సంధాన కర్త, నిర్వాహకులు:

iBAM Org (భాగవత ఆణిముత్యాల పేరిట నెలకొల్పబడ్డ లాభాపేక్ష లేని అమెరికా సంస్థ)

ప్రత్యేక సహకారం:

హిందూ ధర్మ ప్రచార పరిషత్ (తిరుమల తిరుపతి దేవస్థానం) & వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

తేదీలు: జనవరి 15, 16 & 17, 2015 (సంక్రాంతి పండుగ రోజులు)

మొదటి రోజు: (జనవరి 15):

సూర్యోదయం సమయం:  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలకు పోతన భాగవత ఆణిముత్యాల నూతన తాళపత్ర గ్రంధ సమర్పణ, ప్రత్యేక పూజ

సాయంకాలం: సుమారు 4: 00 నుండి 5:00 వరకూ:  తిరుపతి నగర వీధులలో గజేంద్రుడి అంబారీ పై స్వామి ఆశీర్వదించిన పోతన తాళ పాత్ర గ్రంధాల ఊరేగింపు.

VenueTirumala Tirupati Devasthanams Administrative Building Pranganam, Tirupati.

కార్యక్రమం

(5:30 నుండి 9:00 వరకూ)

“పోతన ఆణి ముత్యాల ఉత్పత్తులు” ఆవిష్కరణ.   (తాళ పత్ర గ్రంధం, వెబ్ సైట్, ఐ ఫోన్, ఐ పాడ్ వంటి పరికరాలలోకి డౌన్ లోడ్ చేసుకునే డిజిటల్ టెక్నాలజీ అప్లికేషన్స్, జి MP 3 సీడీ మొదలైనవి) మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే మూడు రోజుల భాగవత ప్రవచన ప్రారంభం.

ప్రధాన అతిథులు:  Dr. D. Sambasiva Rao Garu, IAS, Chief Executive Officer, TTD

శ్రీ బి.వి. పాపారావు (తెలంగాణా ప్రభుత్వ సలహాదారు)

ప్రత్యేక అతిథులు: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, శలాక రఘునాథ శర్మ గారు, ఊళపల్లి సాంబశివ రావు గారు, ఎల్.వి. సుబ్రమణ్యం గారు, నేమాని పార్థ సారధి గారు, డా. చొదిమెళ్ళ చంద్ర శేఖర్,  TTD  అధికార బృందం,  భాగవతుల ఆనంద మోహన్ (హ్యూస్టన్), దువ్వూరి అరుణ్ కాంత్ (హ్యూస్టన్), రమణి విష్ణుభొట్ల (ఆస్టిన్)

పూర్తి వివరాలకు iBAM సంస్థ అధ్యక్షులు పుచ్చా మల్లిక్ (ఇండియా ఫోన్ నెంబర్  82206-30540) ని పిలవండి.

(రాజమండ్రి లో జరిగిన తొలి విడత ఆవిష్కరణ సభ)- మల్లిక్ పుచ్చా గారు, jజొన్నవిత్తుల గారు, శలాక రఘునాథ శర్మ గారు, సాంబశివ రావు గారు, నేమాని పార్థు తదితరులు

సంకల్ప ప్రేరణలు: “ఐ – భాగవతం ఆణి ముత్యాలు” కి ముఖ్య ప్రేరణ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలలో తరచూ ప్రస్తావించే “పోతనామాత్యుల పద్యాలు ముత్యాలు. వాటిలో కొన్నైనా రోజూ పఠించడం ఎంతో మంచి అలవాటు. అంతే కాకుండా జీవితంలో వచ్చే ఒడుదుడుకులను తట్టుకునే మానసిక బలాన్ని , రక్షణను ఇస్తాయి. ఆ ఒడుదుడుకులను దాటే చక్కటి దారిని, దైవ బలాన్ని అందిస్తాయి. ఇది తథ్యం “ అనే హిత వాక్యాలు. ఆ భావ వీచికపోతన భాగవతం లోని 7012  పద్యాలలో అతి చక్కని 324  పద్యాలని ఆని ముత్యాలుగా ఎంచుకునే మా సత్సంకల్పాన్ని ప్రేరేపించాయి.

మా ముఖ్యోద్దేశ్యం:  324 పోతన భాగవత ఆణి ముత్యాలను సుప్రసిద్ధ పండితుల చేత  ఎంపిక చేయించి, టీకా , తాత్పర్యాలతో సహా తరతరానికి పెరుగుతున్న అనంత అద్భుత జ్ఞాన పిపాస సామర్ధ్యాలతో అలరారుతున్న మన నవతరానికి అందించడమే కాక, అత్యాధునిక విభిన్న బహుళ సాంకేతిక సంచారణులు మొదలైన అంతర్జాల సాధనాలతో అలవోకగా ఆడేసుకుంటున్న ఈ నాటి , భావి తరాల పిల్లల చురుకుతనం స్థాయికి దీటుగా ఈ క్రింది నాలుగు విధాలుగా సర్వులకు, సర్వవేళలా,  సర్వేత్రా సర్వ సిద్దంగా పోతన భాగవత ఆణిముత్యాలను …..ముఖ్యంగా వీనుల విందైన ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉంచడం.

మా ఉత్పత్తులు

  • iBAL : భాగవత ఆణి ముత్యాలు పట్టిక (ప్రత్యేకంగా ఎంపిక చేసిన 324 పద్యాలు)
  • iBAP: వెబ్ సైట్ లో భాగవత ఆణి ముత్యాలు తెలుగు యూనికోడ్ లిపి లో పొందు పరచడం.
  • iBAPP: వెబ్ సైట్ లో ఆణి ముత్యాల ప్రతి పదార్ధం యూనికోడ్ తెలుగు  లిపి లో పొందు పరచడం.
  • iBAT వెబ్ సైట్ లో ఆణి ముత్యాల తాత్పర్యం  యూనికోడ్ తెలుగు లిపి లో పొందు పరచడం.
  • iBAA: 324 భాగవత ఆణి ముత్యాలు పద్యాలు  భావ గర్భితంగా గానం చేసి ఆడియో రూపొందించడం
  • iBAB:  ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” గ్రంధ ప్రచురణ.
  • iBATP: ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” తాళ పత్ర గ్రంధ విశిష్ట ప్రచురణ

 

సాధించిన ప్రగతి: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, శలాక రఘునాథ శర్మ గారు మొదలైన  పండితులు ఆధ్యాత్మిక సౌరభాలు, భక్తీ తత్త్వం, నీటి బోధలు, ఋజు మార్గ నిర్దేశం , భగవత్ లీలల ఔన్నత్యాన్ని ప్రమాణంగా తీసుకుని 324  ఆణి ముత్యాల ఎంపిక, ప్రతి పదార్థము, తాత్పర్య రచన పూర్తీ అయింది.  సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థ సారధి ప్రధాన గాయకుడిగా ఆయన సంగీత నిర్దేశకత్వంలో అనేక మంది సహా గాయనీ గాయకులూ, వాద్య సహకారాలతో రికార్డింగ్ ఇంచుమించు పూర్తి అయింది.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015  ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు . శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.
గ్రంధకర్త : గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు . గ్రందావిష్కర్ణ  శ్రీ జలదంకి ప్రభాకర్, ఆత్మీయ అతిధులు చలపాక ప్రకాష్, రామినేని భాస్కరేంద్ర -శ్రీదేవి దంపతులు ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ – పుష్పవతి , కోగంటి కుటుంబ సభ్యులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా గబ్బిటవారి రామారావు గూడెం అగ్రహారం ,ద్వారకా తిరుమల దర్శన 12-1-15 సోమవారం -మా కుటుంబం తో చిత్ర మాలిక 

12-1-15 సోమవారం -మా కుటుంబం తో మా గబ్బిటవారి రామారావు గూడెం అగ్రహారం ,ద్వారకా తిరుమల దర్శన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015 ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015  ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు . శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.
గ్రంధకర్త : గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు . గ్రందావిష్కర్ణ  శ్రీ జలదంకి ప్రభాకర్, ఆత్మీయ అతిధులు చలపాక ప్రకాష్, రామినేని భాస్కరేంద్ర -శ్రీదేవి దంపతులు ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ – పుష్పవతి , కోగంటి కుటుంబ సభ్యులుDSCN6089 DSCN6090 DSCN6091 DSCN6092 DSCN6093 DSCN6095 DSCN6097 DSCN6098 DSCN6099 DSCN6100 DSCN6101 DSCN6102 DSCN6103 DSCN6106 DSCN6107 DSCN6108 DSCN6109 DSCN6111 DSCN6112 DSCN6113 DSCN6114 DSCN6115 DSCN6116 DSCN6117

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

క్షేత్రాలు లో కోగంటి వారిపై మైనేనిగారి వ్యాసం

క్షేత్రాలు లో కోగంటి వారిపై మైనేనిగారి వ్యాసంmyneni1 001 myneni2 001 myneni3 001 myneni4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు – అంకిత వ్యాసం

దర్శనీయ దైవ క్షేత్రాలు – అంకిత వ్యాసంkoganti1 001 koganti2 001 koganti3 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి గారి 80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు 

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి  80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు

సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ  దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద  జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..

 మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో 140 మంది సంస్క్రుతకవులపై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”ను ఆన్ లైన్ లో శ్రీ గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చిన సంగతి మీకు తెలిసిందే . దాని సి డి ని రేపు  అంటే 11-1-15 ఆదివారం సరసభారతి 74 వ సమావేశం గా నిర్వహిస్తున్న ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”గ్రంధా విష్కరణ సందర్భం గా మైనేని వారి మెంటార్ ,మార్గ దర్శి సచివులు సన్నిహితులు సారధి ప్రియ నేస్తం,  కపటమెరుగని సౌశీల్య సౌజన్య మూర్తి శ్రీ కోగంటి సుబ్బారావు గారు  ఆవిష్కరిస్తారు
 మరొక  శుభ వార్త”గీర్వాణ కవుల కవితా గీర్వాణం  ”గ్రంధానికి స్పాన్సర్ గా ఉండి ముద్రణ ఖర్చులు  భరించి సరసభారతి తరఫున  పుస్తకం  ముద్రించటానికి సౌజన్యం తో స్వచ్చందం గా ముందుకొచ్చి, మేనమామ శ్రీ గోపాలకృష్ణ గారిపై ఉన్న ఆదరాభిమానాలకు  నిదర్శనం గా నిలిచిన డాక్టర్ శ్రీమతి జ్యోతి (అమెరికా)గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తూ అభినందనలను అంద  జేస్తోంది
ఇంకొక శుభవార్త -ఈ గ్రంధాన్ని సరసభారతి15-3-15 బుధవారం సాయంత్రం  నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆవిష్కరింప జేస్తామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం  మేము కోరిన వెంటనేముద్రణ బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన  శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు న్నాం .
 అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
            మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -ఉయ్యూరు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment