ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.43 వ భాగం.31.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.43 వ భాగం.31.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.59 వ భాగం.31.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.59 వ భాగం.31.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.59 వ భాగం.31.7.25.

Posted in రచనలు | Leave a comment

కందుకూరి వారి రెండు పుస్తకాలు

కందుకూరి వారి రెండు పుస్తకాలు

విజయవాడ శ్రీ కామాక్షీ దేవీ పీఠ౦ కు చెందినఆగమ విద్వాన్ ,శిల్ప శాస్త్ర ప్రవీణ  శ్రీ కందుకూరి సత్యబ్రహ్మాచార్య గారు ఈ నెల 27ఆదివారం బెజవాడ రామ్మోహన లైబ్రరీలో శ్రీ  తుమ్మోజు వారి ‘’సృష్టికర్త ‘’శతకం ఆవిష్కరణ నాడు నాకు ‘’ఆది విజ్ఞానులు’’ ,’’బాలప్రభ ‘’అనే తమ రెండు రచనలు ఇచ్చారు .వాటి గురించి క్లుప్త పరిచయం .

1-ఆది విజ్ఞానులు -ముందుమాటలో తాము శిల్ప కళాభారతి తరఫున ఇప్పటికి 25 గ్రంథాలు వెలువరించామని ,అవి బహుళ జనాదరణ పొందాయని ,త్వరలోనే విశ్వ కర్మీయం ,మౌన సారం ,అయాది లక్షణం ,ఆత్రేయ తిలకం ,ప్రసాద మండపం ,అగస్త్య సకళాదికార శిల్పశాస్త్రం ,బ్రాహ్మీయ చిత్రకళ శాస్త్రం ,సారస్వతీయ చిత్ర కర్మ శాస్త్రం వంటి అపూర్వ గ్రంథాలను వెలువరింప బోతున్నామని చెప్పారు .వేదం లోని 25మండి శిల్పాచార్యుల గురించి సంక్షిప్త చరిత్ర గల పుస్తకం ఇదీ .స్వయంభూ విశ్వ కర్మతో ప్రారంభించి ,భౌవన విశ్వకర్మ ,అంగీరస బృహస్పతి వగైరా మహానుభావుల గురించి రాసి చివరగా ‘’సుపర్ణ రుషి ‘’తొ పూర్తి చేశారు .రచయిత గారి తీవ్ర అధ్యయనం ప్రతి పదం లో కనిపిస్తుంది .మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఆధార సహితంగా ఉటంకించి ,మనసుకు హత్తుకోనేట్లు రాశారు .అభినందనీయులు .శిల్పా చార్యుల చిత్రపటాలున్నాయి .ముచ్చటైన ముద్రణ .

2-బాలప్రభ -18 ఆధ్యాత్మిక బాలకథల సంపుటి .బాల గణపతి తొ ప్రారంభించి బాల స్కంద ,బాల సంబంధ మొదలియార్ ,మాండవ్య మొదలైన వారి చరిత్ర బాలలకు   అందుబాటైన భాషలో బాలానందంగా రాశారు .అన్నం మహిమ వివరించారు .మేఘ సందేశం లో ‘’దదద ‘’శబ్ద వివరణ ఇచ్చారు .ద అంటే దమనం అంటే దుర్గుణాలకు దూరం గా ఉండటం ,ద అంటే దత్త అంటే దానం చేయటం ,మూడవ ద అంటే దయ కలిగి ఉండటం .ప్రతికథకు అర్ధవంతమైన చిత్రాలున్నాయి .ముద్రణ ఆకర్షణీయంగా ఉంది . ఈ శబ్దాన్నే ప్ర ముఖ ఆంగ్లకవి నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత   టి.ఎస్ ,ఇలియట్ తన అజరామర కావ్యం ‘’వేస్ట్ లాండ్ ‘’లో ఉదాహరించాడు .

చక్కటి రంగుల ముఖ చిత్రాలు అరుదైన లోపలి చిత్రాలు ఉన్న ఈ రెండు పుస్తకాలు ఒక్కొక్కటి వంద రూపాయలు .ఆసక్తి ఉన్నవారు -కందుకూరి  వేంకట సత్య బ్రహ్మా చార్య -9491411090కు సంప్రదించవచ్చు

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.8 వ చివరి భాగం.30.7.25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.8 వ చివరి భాగం.30.7.25.

Posted in రచనలు | Leave a comment

డా.సి హెచ్. సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు. సమగ్ర పరిశీలన. 19 వ భాగం.30.7.25.

డా.సి హెచ్. సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు. సమగ్ర పరిశీలన. 19 వ భాగం.30.7.25.

డా.సి హెచ్. సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు. సమగ్ర పరిశీలన. 19 వ భాగం.30.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.58 వ భాగం.30.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.42 వ భాగం.30.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.42 వ భాగం.30.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.7 వ భాగం.29.7.25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరి మింగిన వెలగ పండు.7 వ భాగం.29.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్ సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.18 వ భాగం.29.7.25.

డా. సీహెచ్ సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.18 వ భాగం.29.7.25.

డా. సీహెచ్ సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.18 వ భాగం.29.7.25. youtu.be/dD0_v_oISrc

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.41 వ భాగం.29.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.41 వ భాగం.29.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.57 వ భాగం.29.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.57 వ భాగం.29.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.57 వ భాగం.29.7.25.

Posted in రచనలు | Leave a comment

త్రేతాయుగం లో ఋష్యశృంగుడు -ద్వాపరం లో అక్రూరుడు

త్రేతాయుగం లో ఋష్యశృంగుడు -ద్వాపరం లో అక్రూరుడు

ఏమిటి ఈ లింకు ?

ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.

ఋష్యశృంగుడి జననము – విద్యాబుద్ధులు

కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.

అంగరాజ్యములో క్షామము

ఇలా ఉండగా, అంగ రాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.

వేశ్యల ఉపాయము

రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా విభాండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.

మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభాండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.

వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.

ఋష్యశృంగుడు – శాంత ల వివాహము

ఋష్యశృంగుడిని ఆహ్యానించుటకు అంగ దేశము వెళుతున్న ధశరథుడు- పర్షియన్ రామాయణం నుండి ఒక దృశ్యం

కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడుశృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో రుష్య శృంగ ఆశ్రమం ఉన్నది ఉంది.. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.

అక్రూరుడు

అక్రూరుడు (సంస్కృతం:, అక్షరాలా ‘క్రూరుడు కాదు’) హిందూ మతంలో యాదవ యువరాజు, కృష్ణుడికి మామగా ప్రసిద్ధి చెందాడు. కాశీ రాజు కుమార్తె అయిన శ్వఫల్క మరియు గాండినిల కుమారుడు, కంసుడు తన మేనల్లుళ్ళు కృష్ణుడు మరియు బలరాముడిని మధురలోని ధనుర్యాగ (ఆయుధాల ఉత్సవం) కు తీసుకెళ్లమని ఆదేశించాడు, అక్కడ వారు వధించబడతారు. ఈ ప్రయాణంలో అతను కృష్ణుడి విశ్వరూప (దివ్యదర్శనం) కి సాక్ష్యమిస్తాడు. దాని మునుపటి యజమాని సత్రాజిత్తు మరణం తరువాత అక్రూరుడు స్యమంతక రత్నానికి యజమాని అవుతాడు. ప్రభాస వద్ద జరిగిన అంతర్గత యదువుల వధ సమయంలో అతను చంపబడతాడు.

కృష్ణుడు మరియు బలరాముడి రథసారథి

అక్రూరుడి బంధువు కంసుడు, తన రాజధాని మధురలో నివసించి, యాదుల రాజుగా పరిపాలించాడు. తన మేనల్లుడు కృష్ణుడు చంపబడతాడని ప్రవచించబడిన విష్ణు పురాణంలో, కృష్ణుడిని మరియు బలరాముడిని తన రథంపై మధురకు పిలిపించమని అక్రూరుడిని ఆదేశించాడు. చాంద్రమాన మాసం పద్నాలుగో రోజున జరిగే ధనుర్యాగ ఉత్సవానికి వారిని ఆహ్వానించే నెపంతో ఆహ్వానం జారీ చేయవలసి ఉంది, అక్కడ వారిని హత్య చేయాలని అతను కుట్ర పన్నాడు. తన మేనల్లుళ్ల మరణం తరువాత, గోపాలకుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, తనతో కలిసి పరిపాలించాలని కోరుకుంటున్నానని కంసుడు అక్రూరుడికి తెలియజేశాడు. విష్ణు భక్తుడిగా, అక్రూరుడు కృష్ణుడిని కలిసే అవకాశం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. గోకులానికి వచ్చిన తర్వాత, అతను కృష్ణుడిని మరియు అతని సోదరుడిని పశువుల మధ్య చూశాడు, కంసుడితో తనకున్న అనుబంధాన్ని వారు తృణీకరిస్తారా అని ఆశ్చర్యపోయాడు. అయితే, సోదరులు తమ మామను ఆతిథ్యంతో చూసుకున్నారు, మరియు అతను కంసుడి నిరంకుశత్వంలో వాసుదేవుడు, దేవకి మరియు ఉగ్రసేనుడి పట్ల జరిగిన దుర్వినియోగం గురించి మరియు అతను పంపబడటానికి గల కారణాన్ని వారికి చెప్పడం ప్రారంభించాడు. మరుసటి రోజు అక్రూరుడితో పాటు మధురకు వెళ్లడానికి సోదరులు అంగీకరించారు. కృష్ణుడు వ్రజ నుండి బయలుదేరినందుకు పాలపిట్టలు విలపించాయి, అక్రూరుడిని తమ నుండి తీసుకెళ్లినందుకు క్రూరంగా వ్యవహరించాయి. వారి ప్రయాణంలో, అక్రూరుడు యమునా నది నీటిలో స్నానం చేశాడు, అక్కడ బలరాముడు శేషుడిగా, కృష్ణుడు విష్ణువుగా కనిపించి, వారిని స్తుతించాడు. మధురకు చేరుకున్న అతను, ఆ సమయం నుండి వారు రాజ మార్గంలో నడవవలసి ఉంటుందని వారికి తెలియజేసి, తన రథంలో ఒంటరిగా ముందుకు సాగాడు.

స్యమంతక స్వాధీనత

శతధన్వుడు స్యమంతక అనే పురాణ రత్నాన్ని తనకు భద్రంగా ఇచ్చిన తర్వాత అక్రూరుడు పొందాడని హరివంశం పేర్కొంది. శతధన్వుడు ఆ రత్నం యొక్క మునుపటి యజమాని అయిన సత్రాజిత్తును చంపి, గతంలో దానిని పొందాలనే కోరికను వ్యక్తం చేసినందున, దానిని అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు ఆ రత్నాన్ని తాను విడిచిపెట్టనని శతధన్వుడికి వాగ్దానం చేశాడు. కృష్ణుడు తనపై దాడి చేస్తే తన రక్షణ గురించి శతధన్వుడు అక్రూరుడికి హామీ ఇచ్చాడు. శతధన్వుడు కృష్ణుడి చేతిలో హతమైనప్పటికీ, అక్రూరుడు అక్రూర యజ్ఞం అనే గొప్ప యాగం ప్రారంభించాడు, అక్కడ అతను ఆ రత్నం నుండి అరవై వేల సంవత్సరాలు కొనసాగేంత ఆభరణాలు మరియు సంపదను అర్పించాడు. ఈ సంఘటనల గాలిని కృష్ణుడు గ్రహించి, ద్వారకలో అక్రూరుడు స్యమంతకను తనకు తిరిగి ఇవ్వాలని కోరుకున్నాడు. అక్రూరుడు స్యమంతకను, అలాగే తన సోదరి సుశీలను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సంతోషించిన కృష్ణుడు అక్రూరుడు ఆ రత్నాన్ని ఉంచుకోవడానికి అనుమతించాడు.

ధృతరాష్ట్రుడిని కలవడం

భాగవత పురాణంలో, కృష్ణుడు కురుల రాజు ధృతరాష్ట్రుడిని కలవడానికి, రాజు తన కుమారుడు దుర్యోధనుడిచే ప్రభావితమయ్యాడో లేదో తెలుసుకోవడానికి అక్రూరుడిని హస్తినాపురానికి పంపాడు. హస్తినాపురానికి చేరుకున్న అక్రూరుడు తన బంధువు కుంతిని కలిశాడు, ఆమె కృష్ణుడు ఇంకా ఆమెను గుర్తుంచుకున్నాడా అని కన్నీళ్లతో విచారించింది మరియు ఆమె దేవతలో మోక్షాన్ని కోరుకుందని అతనికి చెప్పింది. అక్రూరుడు కురు రాజును కలిసి, కౌరవుల పట్ల అతని పక్షపాతం గురించి, యుధిష్ఠిరుడిని సరైన రాజుగా ప్రతిష్టించడం కంటే సింహాసనాన్ని ఆక్రమించడంలో అతని ప్రవర్తన గురించి మాట్లాడాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని దేవుడిగా భావించినప్పటికీ, తన కుమారుల పట్ల పక్షపాతంతో ఉన్నానని అంగీకరించాడు. రాజు ఆలోచనలను సేకరించిన తరువాత, అక్రూరుడు కృష్ణుడికి తన సందర్శన గురించి తెలియజేయడానికి హస్తినాపురానికి బయలుదేరాడు.

ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే లేక విన్నవీ చదివినవీ .ఎందుకు రుష్యశృంగుడిని క్రూరునితో లింకు చేశానో ఇప్పుడు చెబుతా .ఈ రహస్యం భాగవతం దశమ స్కంధం లో ఉంది

శ్యమంతక మణి ని సాధించి తెచ్చి శ్రీ కృష్ణుడు ద్వారక చేరాడు .సత్రాజిత్తు కు మణి అప్పగించాడు .అన్నగారితో తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు కృష్ణుడు .ఈలోపే అక్రూరుడు ,కృతవర్మా ,ఇద్దరు శతధన్వుడి మరణ వార్త విని ,సత్రాజిత్తు తమల్ని చంపుతాడనే భయంతో ఎన్నో యోజనాల దూరం పారిపోయారు .అక్రూర మహాత్ముడు ద్వారకలో లేక పోవటం వలన ద్వారకలో వానలు కురవక విపరీతమైన క్షామం ఏర్పడి అనేక అనర్ధాలు కలిగాయి .ద్వారక ప్రజలు కరువు కాటకాలతో నానా అవస్థలు పడుతున్నారు .అప్పుడు ద్వారక వృద్ధులందరూ కలిసి తమలో తాము సంప్రదించుకొని శ్రీ కృష్ణుని దగ్గరకు వెళ్లి ‘’పరమాత్మా !ఒకప్పుడు కాశీ రాజు పాలించే కాశీ రాజ్యం లో వానలుకురవక క్షామం ఏర్పడింది.అప్పుడు కాశీ రాజు అక్రూరుని తండ్రి ‘’శ్వఫల్కుడు ‘’ను తీసుకొని వెళ్లి తనకూతురు ‘’ గాందిని’’ని ఇచ్చి పెళ్ళి చేసి తన దగ్గరే ఉంచుకొన్నాడు .శ్వఫల్కుని మహిమ వలన కాశీలో బాగా వర్షాలు .పంటలు పుష్కలంగా పండి క్షామం మటుమాయమైంది అతని కొడుకు అక్రూరుడు కూడా అంతటి మహిమ కలవాడే .ఆమహా తపస్వి మళ్లీ ద్వారకలో అడుగు పెడితేనే వానలు కురిసి సస్యశ్యామల౦ అవుతుంది .అతడిని వెంటనే రప్పించు .ప్రజల కష్టాలు తొలగించు ‘’ఆని ప్రాధేయ పడ్డారు .కృష్ణుడు తగిన పెద్దలను పంపించి అక్రూర మహాశయుని పిలిపించి గౌరవించాడు .వెంటనే విపరీత వర్షాలు కురిసి పాడి పంటలతో ద్వారక కళకళ లాడింది .కృష్ణుడు చేయలేక పోయిన పనిని అక్రూరుడు చేశాడు .

పెద్దలందరినీ పిలిపించి అక్రూరుడు జాగ్రత్త చేసిన ‘’శ్యమంతక మణి ‘’ని అందరికి చూపించి మళ్లీ అక్రూరునికే ఇచ్చేశాడు .ఈ కథ విన్నా చదివినా సకల సౌభాగ్యాలు కలుగుతాయని పరీక్షిన్మహారాజుకు శుక యోగీంద్రుడు చెప్పాడు .ఈ కధ ఎందుకో మనకు ప్రచారం లో లేదు.

మధుర జిల్లాలోని బృందావనంలో ఉన్న స్నాన ఘాట్‌లలో అక్రూర ఘాట్ ఒకటి. కృష్ణుడు మరియు బలరాముడు తమ విష్ణు మరియు శేష రూపాలను అక్రూరుడికి వెల్లడించారని నమ్ముతున్న ప్రదేశం ఇది. ఆది వరాహ పురాణం అక్రూర ఘాట్‌ను అన్ని పవిత్ర స్థలాలకు రాజుగా వివరిస్తుంది.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’భాగవత నవనీతం -దశమ స్కంధం ‘’ఆధారం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.6 వ భాగం.28.7.25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.6 వ భాగం.28.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.17 వ భాగం.28.7.25.

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.17 వ భాగం.28.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.50 వ భాగం.28.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.50 వ భాగం.28.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.50 వ భాగం.28.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.56 వ భాగం.28.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.56 వ భాగం.28.7.25.

Posted in రచనలు | Leave a comment

‘’సృష్టికర్త ‘’శతక సృష్టికర్త మిత్రుడు శ్రీ తుమ్మోజు వారి శతకం ఆవిష్కరణ

‘’సృష్టికర్త ‘’శతక సృష్టికర్త మిత్రుడు శ్రీ తుమ్మోజు వారి శతకం ఆవిష్కరణ

నిన్న27-7-25-ఆదివారం సాయంత్రం  విజయవాడ  రామ్మోహన గ్రంధాలయం లో సృష్టికర్త శతకం ఆవిష్కరణ నా చేతులు మీదుగా జరిగింది . నేను చెప్పాలనుకొన్న మాటలు ,చెప్పినవి  చెప్పాలనుకోన్నవి తెలియ జేస్తున్నాను .సభకు ముందు రామ్మోహన్ లైబ్రరీకి పుస్తకాలు చలపాక గారిద్వారా సరసభారతి పుస్తకాలు అంద జేశాము .అక్కడి లైబ్రేరియన్ గారిని శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు రాసిన ‘’త్యాగరాజు ఆత్మ విచారం ‘’పుస్తకం ఉంటే ప్రకాష్ గారికిస్తే దాన్ని ఫోటో స్టాట్ తీయించి నాకు పంపిస్తారని చెప్పాను .చూసి చెబుతామన్నారు .

‘’సభాధ్యక్షులు, అనేకానేక పురస్కార ‘’పూర్ణ సింధు’’ డాశ్రీ పూర్ణచందు గారు ,పుస్తకపరిచయకర్త తన చేతులమీదుగా ఎంతోమందికి డాక్టరేట్ ప్రదానం చేయించిన ‘’డాక్టరేట్ చక్రవర్తి’’ డా.గుమ్మా సాంబశివరావు గారు ,రామ్మోహన్ లైబ్రరీకి ఎన్నో వసతులు కల్పించి ఆధునిక సొబగులు సంతరిస్తున్న శ్రీ పొట్లూరి నరసింహారావుగారు ,సృష్టికర్త శతక సృష్టికర్త ఆప్తులు శ్రీ తుమ్మోజు  రామ లక్ష్మణా చార్యులుగారు,రమ్యభారతి సాహితీ వేదిక ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ,పుస్తక ప్రచురణ కూడా చేసిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి రమ్యభారతి సంపాదకులు  ‘’సాహితీ చలమ,సాహిత్య ప్రకాశకులు’’  శ్రీ చలపాక ప్రకాష్ గారు  ఈ సభా ప్రాంగణం లో ఉన్న అశేష సరస్వతీ మూర్తులకు  వందనం .   

  సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ సరస్వతీ నిలయం లో ఒక సాయం వేళ కరీం నగర్ కు చెందిన సాహితీ మూర్తి ,అచ్చంగా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి లా పద్యాలు గానం చేసే వారు, ఆయన్ను కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ గా ఆహ్వానించి తీసుకు వెళ్ళిన వారు శ్రీ జువ్వాడి గౌతమరావు గారు రామాయణ కల్ప వృక్షం లోని ముఖ్యఘట్టాలలోని పద్యాలను  అత్యంత శ్రావ్యంగా ,రెండు గంటలు.పాటు గానం చేసి తన్మయం చెందించారు .ఆ సభలో విశాలాంధ్ర పత్రిక సంపాదకులు శ్రీ రాఘవాచారి గారుఆచార్య  శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు  మొదలైన వాళ్ళం ఉన్నాం .నేను హాయిని అనుభవిస్తూనే రాఘవాచారి తన్మయత్వాన్ని గమనిస్తున్నా..సభఅయ్యాక ఆయన్ను ‘సార్ ! మీరేమో కమ్యూనిస్ట్ పత్రిక సంపాదకులు ,కానీ విశ్వనాథ వారి పద్యాలకు అంతలా పరవశం చెందు తున్నారేమిటి ‘’?ఆని అడిగితె ఆయన నవ్వుతూ’’అది వృత్తీ ,ఇదీ ప్రవృత్తి ‘’ అన్నారు .అప్పటినుంచి నాకు ఆయన ఆప్తులైపోయారు బెజవాడలో ఎక్కడ సభల్లో కలిసినా పలకరించి మాట్లాడేవారు .గౌతమ రావు గారితో ‘’అయ్యా !మీరు కరీం నగర్లో మీ ఇంట్లో తరచుగా విశ్వనాథ వారి పద్యాలు గానం చేస్తారని తెలిసింది .ఈ సారి అలాంటి కార్యక్రమం ఉంటే తెలియజేస్తే వచ్చి ఆస్వాదిస్తా’’అన్నాను ఆయన చాలా సంతోషించి ఒక కార్యక్రమానికిఆహ్వానం పంపారు నేను వెళ్ళలేక పోయాను .

 శతకకర్త శ్రీ రామ లక్ష్మణాచార్యులు గారితో నాకు సుమారు 35 ఏళ్లనుంచి పరిచయం ఉంది .ఉయ్యూరులో మా గురువు గారు శ్రీ లంకా బసవాచార్యులు గారు  నేనూ ,వీరు పీసపాటి కోటేశ్వరరావు ,మునసబు కోటేశ్వర రావు మొదలైన వాళ్ళం కలిసి గురువు గారి ఆధ్వర్యం లో ‘’ఉయ్యూరుసాహితీ మండలి ‘’స్థాపించి ప్రతి నెలా మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలు సుమారు ముప్ఫై ఏళ్ళు నిర్వహించాం ..అందులో తుమ్మోజు వారి సాహిత్య ప్రసంగాలు అత్య౦త ఆహ్లాదంగా ఉండేవి .లోతులు ఎరిగిన పండితోత్తముడు ఆయన .ఉపాధ్యక్షులుగా కూడా పని చేశారు .ఆముక్తమాల్యదకలాపూర్ణోదయం ,మనుచరిత్ర ప్రస౦గాలు ఇప్పటికీ చెవుల్లో రంగు మంటూనే ఉంటాయి  నేను కన్వీనర్ గాఉన్నాను .మూడో నాలుగో వ్రాతప్రతులు సంతరించాం .ప్రతి సంక్రాంతికి ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించేవాళ్ళం .కార్యక్రమాలు కొంతకాలం విష్ణ్వాలయం లో కొంతకాలం మా ఆంజనేయ దేవాలయం లో కొంతకాలం కాలేజి పచ్చికమీద  మరికొంతకాలం హైస్కూల్ లోఆతర్వాత శాఖా గ్రంథాలయం లో జరిపెవాళ్ళం .తర్వాత నేను సరసభారతి ఏర్పాటు చేసి 16 సంవత్సరాలనుంచి నిర్వహిస్తున్నాను .మా ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి తుమ్మోజు వారు రావటం ,పద్యాలతో మత్తేక్కించటం జరిగేది .

  మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామిపై మూడు శతకాలు ముగ్గురు కవులతో రాయి౦చాలను కొని మా  ఆస్థాన  కవులైన  తుమ్మోజు వారు ఒకటి ,రెండోది శ్రీమతి ముదిగొండ సీతా రామమ్మ గారు ,  ,మూడోది డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారి సలహాపై అమలాపురంకవి మధురకవి శ్రీ మంకు శ్రీను గారి చేత రాయి౦చా౦  . .’’రాస్తే నాకేంటి ?”’ఆని కోట శ్రీనివాసరావు లాగా ఈ ముగ్గురు అనకపోవటం ఆశ్చర్యం .పుస్తకాలు మూడూ సరసభారతి తరఫున ముద్రించి శతకకర్తకు ఒక్కొరికి పది వేల రూపాయలు కానుక ,నూత్నపట్టు వస్త్రాలు దంపతులకు   సమర్పించి ఒక మాఘ ఆదివారం మా గుడిలో జరిగే సామూహిక  ఉచిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నాడు పొన్నూరు సంస్కృతకాలేజి రిటైర్ద్ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి చేత ఆవిష్కరి౦ప జేసి  విందు కూడా ఇచ్చాం తుమ్మోజుదంపతులు వ్రతం లో పాల్గొన్న జ్ఞాపకం .మంకువారు భార్యాసమేతంగా వస్తే సీతారామమ్మగారు వారబ్బాయి అమ్మాయి అల్లుడు తొ వచ్చారు  .తుమ్మోజు వారు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు మెచ్చిన కవి శ్రేష్టులు .

 ఇక ఈశతకం లో తుమ్మోజువారి అద్వితీయ ప్రతిభ  ప్రతి పద్యంలో ద్యోతకమౌతుంది .వేద వేదాంగాల పురాణాల లో ని సారమంతా పద్యాలలో గుప్పించారు .సృష్టించేవాడు, వాడి శతకం కనుక సృష్టికి మగాడితోపాటు ఆడదీ అంటే వెలది అవసరం కనుక ఆటవెలదులతో ఆడుకొన్నారు తుమ్మోజీ .ఇదీ నాకు బాగా నచ్చింది’’’’విశ్వ సృష్టి కర్త విశ్వ కర్మ ‘’ మకుటం మకుటాయ మానంగా ఉన్నది .  ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాలన్నిటికి ఆధారం వేదాలు స్మృతులు పురాణాలే .ఈ విశ్వ కర్మ అంటే సృష్టికర్త కు కూడా అవే ఆధారాలు .యద్భావం తద్భవతి .విశ్వ కర్మ కు త్వష్ట అనే పేరున్నది . నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః.ప్రజాపతి విశ్వకర్మ మనసు .ఈశ్వరుడికి లాగా అయిడుముఖాలు .సృష్టికి పూర్వమే విశ్వకర్మ భగవాన్ తన సంకల్ప ప్రభావంతో అవతరించాడు .విశ్వకర్మాయే ప్రజాపతి బ్రహ్మ అన్నది కృష్ణ యజుర్వేదం .తూర్పు ముఖం సానగ మహర్షి ,దక్షిణముఖం సనాతన మహర్షి ,పశ్చిమాన ఆహభూన రుషి ,ఉత్తరాన బ్రత్నరుషి ,ఊర్ధ్వంలో సుపర్ణ ఋషులు ఉద్భవించారు విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మనుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన బ్రహ్మర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ బ్రహ్మర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్నస బ్రహ్మర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినదివిశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం ఆని గురు పరంపర శ్లోకం ఉంది

  ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 న భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు .విశ్వకర్మ సత్యయుగం లో దేవతలకు స్వర్గలోకం ,త్రేతాయుగం లో శివుడికోసం సువర్నలంక ,ద్వాపరం లో ద్వారకా నగరం కలియుగం లో హస్తినా పురం ఇంద్రప్రస్థం ,మయసభ నిర్మించాడు .

 విశ్వకర్మ దేవాలయం  బెజవాడలో లేడు కాని బందరులో శ్రీ పాండురంగస్వామి దేవాలయం లో ఉంది .అందులో పాలరాతి విగ్రహం ,ఆలయ నిర్మాత శ్రీ నరసింహదాసు విగ్రహం ఉన్నాయి .ఉగాండా దేశం లో ‘’జింజు ‘’అనే చోట విశ్వకర్మ ఆలయం ఉంది

  సృష్టి సౌందర్యం అనిర్వాచ్యం .అన్నాడు జర్మనీ వేదా౦తి కవి దార్శనికుడు గోదే ..హెగెల్ ‘’The beauty of art is higher than the beauty of nature ‘’ఆని కళకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. కళా భారతి క్రీడా భారతి వంటిదే  .భౌతిక ప్రయోజనం లేకపోయినా ,మానసిక ఉల్లాసం కలిగిస్తుంది .విన తగిన క్రీడ మాకు కావాలని దేవతలు బ్రహ్మను కోరితే ఆయన సమాహార కళ అయిన నాట్యన్ని వాళ్లకు ఇచ్చాడని భరత మహర్షి చెప్పాడు .Play is the art of child .Art is the play of man ‘’ఇంతటి ఉత్కృష్టమైన స్తుష్టి కళ ను సంకుచిత్వం స్వార్ధం దెబ్బతీస్తున్నాయి వీటన్నిటి నుంచి ముక్తినిచ్చేదే కళ .మనీషి అయిన మానవుడు మనస్వి కావాలంటే ‘’Beauty is the hand writing of God ఆని భావించి భద్రపరచుకోవాలి .సౌందర్య దేవతకు గుండెలో గుడికట్టుకోవాలి అన్నాడు ప్రఖ్యాత అమెరికన్ రచయిత తత్వవేత్త ఎమర్సన్ ..ఇంకో అడుగు ముందుకు వేసి సోక్రటీస్ ‘’What ever is beautiful is for the same reason GOD ‘’అన్నాడు .’’The course of nature is the art of GOD ‘’అన్నాడు యంగ్ .కనుక సృష్టి యే రూపంలో ఉన్నా దాన్ని ఆస్వాదించాలి అనుసరించాలి కాపాడాలి కాని ధ్వంసం చేయరాదు .ఆని సృష్టికర్త శతకం మనకు ఇచ్చే సందేశం .అందుకే ఆచార్య ఎస్వి జోగారావు గారు ‘’సౌందర్య,మాధుర్య సౌకుమార్యాల సాహిత్యమే లాలిత్యం ‘’అన్నారు ఈమటలన్నీ ఈ శతక సృష్టికర్త తుమ్మోజు వారికి సరిగ్గా సరిపోతాయి .నిన్నసభలో ఎవరో రామ లక్ష్మణాచార్యులు అంటే రాముడికి లక్ష్మణుడికి ఆచార్యుడైన విశ్వా మిత్రుడు అన్నారు ,విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడు .త్రిశంకుడికి భూమి ఆకాశాల మధ్య ఒక స్వర్గం నిర్మించాడు .గాయత్రి మంత్ర ద్రష్ట .కాని నేను రామ అంటే విగ్రహవాన్ ధర్మః .లక్ష్మణ అంటే ఆదిశేషుని అవతారం సకల విద్యలకు నిలయమైన వాడు .కనుక ధార్మిక ,విద్యా దులకుఆచార్యుడు అంటాను .

సరిగమలు

డా పూర్ణ చందు ‘’ఇక్కడే ఈ లైబ్రరి లోనే కృష్ణాజిల్లా రచయితల సంఘం మొదటి సమావేశం జరిగిందన ,ఇదే ఆసంఘానికి పురుడు పోసిన పుట్టినిల్లు అన్నారు .

సుమారు పది హేను రోజుల ముందరే తుమ్మోజు వారు బెజవాడ నుంచి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి ఆవిష్కరణ చేయాలని కోరి శతకం నాకు అంద జేసిన సౌజన్యశీలి .ఫోన్ లో చెబితే సరిపోయేదిగా అన్నా వినకుండా ఉయ్యూరు వచ్చారు  .ఆ రోజే చదివేశాను .

 మర్నాడే చెన్నై నుంచి నన్ను ‘’బాబాయి గారు ‘’ఆని గౌరవంగా పిలిచే శ్రీమతి శ్రీదేవి దంపతులు మా ఇంటికి వస్తే ఆశతకాన్ని నేనే ఆవిష్కరిస్తున్నాను ఆని చెప్పి దాన్ని వారికిచ్చేశాను. అంటే శతకం అప్పుడే మరో రాష్ట్రానికి పరచయం అయిందన్న మాట .

 ఉయ్యూరు నుంచి నాతోపాటు సరసభారతి కార్యవర్గ సభ్యులు గబ్బిట రామనాధ బాబు ,శ్రీ గంగాధర రావు గార్లు వచ్చారు .మేము ముగ్గురం రామలక్ష్మణాచార్యులకు నూతన వస్త్రాలు  ,నగదు కానుక అందించి ఆదంపతులకుశాలువా కప్పి సరసభారతి తరఫున సత్కరించాము .

ఆచార్య దంపతులు  కూడా అతిధులకు అందరికి శాలువా ,విశ్వకర్మ ఫోటో అందించి సన్మానించారు .

మధ్యలో కమ్మని టీ,చివర అందరికి ఇడ్లీ గారే ఉప్మా స్వీట్ మూడు చట్నీలతో ఉపాహారం ఇచ్చి తృప్తి చెందించారు .అందులో కారం పొడి కర్నటక రుచి ,మా అమ్మగారు చేసే కారప్పొడి రుచి తలపిస్తూ మహా బాగా ఉంటే ఆయన్ను ఎక్కడనుంచి టిఫిన్లు ఆని అడిగితె ‘’అరటాకులో భోజనం ‘’అనే దగ్గరే ఉన్న హోటల్ నుంచి ఆని చెప్పారు .

అంతేకాక ‘’డబ్బు ఎందుకు ఇచ్చారండీ ‘’ఆని అడిగారు .మీరు మా ఆస్థానకవి కవికి సత్కారం అన్ని రకాలుగా జరగాలి అన్నాను నవ్వారు .

బెజ వాడ లో ఈ మధ్య ఇంత మందితో సాహిత్య సభ జరగలేదు .రికార్డ్ సంఖ్యలో సాహితీ మూర్తులు బందరు గుడివాడ  బెజవాడ లనుంచి వచ్చి శాలువాలతో ముంచి ,మాటలతో అభినందించి తమ అభిమానం వర్షించి దిగ్విజయం చేశారు .హాట్స్ ఆఫ్ టు ఆడియెన్స్ .

పదనిసలు

 సభ రాత్రి తొమ్మిదింటి దాకా సా—-గింది .

 శతకం ముఖచిత్రం  సృష్టి కర్త విశ్వ కర్మ ను తలపించేదిగా’’ డివైన్’’ గాలేదు హిరణ్యాక్షుడు గా ‘’డేమోనిష్ ‘’గా ఉంది .ఈ మాట సభా ముఖంగా చెబుదామనుకొన్నా కాని సభ్యత కాదని ఆగిపోయాను .కొంచెం జాగ్రత్త తీసుకొంటే మరింత సుందరంగా రమ్యంగా వచ్చి ఉండేది .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల.కరిమింగిన వెలగ పండు.5 వ భాగం.27.7.25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల.కరిమింగిన వెలగ పండు.5 వ భాగం.27.7.25.

Posted in రచనలు | Leave a comment

డా.సీహెచ్.సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు _సమగ్ర పరిశీలన.16 వ భాగం.27.7.25.

డా.సీహెచ్.సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు _సమగ్ర పరిశీలన.16 వ భాగం.27.7.25. https://youtu.be/uWA2ET2VIaw

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.39 వ భాగం.27.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.39 వ భాగం.27.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.55 వ భాగం.27.7.25.

శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.55 వ భాగం.27.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.4 వ భాగం.26.7.25.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల. కరిమింగిన వెలగ పండు.4 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25.

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25.

డా. సి.హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.15 వ భాగం.26.7.25. https://youtu.be/w7KSZTPdKjo

Posted in రచనలు | Leave a comment

స్విట్జర్ లాండ్ లో తెలుగు వెలుగు ,వైద్య ఆర్ధిక శాస్త్ర నిపుణుడు ,బహుభాషావేత్త ,కవి -శ్రీవేగె నాగేశ్వరరావు

స్విట్జర్ లాండ్ లో తెలుగు వెలుగు ,వైద్య ఆర్ధిక శాస్త్ర నిపుణుడు ,బహుభాషావేత్త ,కవి -శ్రీవేగె నాగేశ్వరరావు

కృష్ణాజిల్లా గన్నవరంతాలూకా ఉంగుటూరుమండలం పెదవుటపల్లి లో శ్రీవేగె నాగేశ్వరరావుగారు  శ్రీ వేగె తాతయ్య వెంకట్రామ్మ దంపతులకు 27-2-1932 న ఆఖరి సంతానంగా సామాన్య రైతు కుటుంబలో జన్మించారు . పుట్టిన ఏడాదిన్నరకే తల్లి చనిపోయింది .తండ్రి తీవ్ర దుఃఖ భారం తొ కొడుకులో భార్య రూపు రేఖలు చూసుకొంటూ జాగ్రత్త గా పెంచారు .అక్కలు సుబ్బాయమ్మ ,రంగమ్మ అన్న కృష్ణారావు గార్లు ఈ చిట్టి తమ్ముడిని అల్లారు ముద్దుగా చూసుకొన్నారు .ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తిచేసి గన్నవరం జిల్లాపరిషత్ హైస్కూల్ లో ధర్డ్ ఫారం చదివిపాసయ్యారు అన్న కృష్ణారావు దగ్గర నెల్లూరు వి ఆర్ కాలేజి లో ఇంటర్ ఎకనామిక్స్ లో బిఏ చదివి ఉత్తీర్ణులయ్యారు .

  నాగేశ్వరరావు గారు 1957లోఇటలీ వెళ్లి పాడువాఅండ్ ఫార్మసి  యూని వర్సిటిలో  చేరి మెడిసిన్ అండ్ సర్జరి లో ఎం .డి.చేశారు .చదువుపూర్తి అయ్యాక ‘’కర్నీలియా ‘’అనే స్వస్ దేశ అమ్మాయిని పెళ్ళాడి’’ శాంతిప్రియ’’  కూతుర్ని కని, ‘’శాంతిప్రియ ‘’పేరు పెట్టి తమ దేశ సంప్రదాయం ఔన్నత్యాన్ని నిలబెట్టుకొన్నారు .శాంతిప్తియ ఆర్కిటేక్చరాల్ ఇంజనీరింగ్ చదివి  అదే విభాగంలో ఇంజనీర్ అయిన ‘’బాలాజీ’’ని వివాహమాడి జ్యూరిచ్ లో సెటిల్ అయ్యారు .

  ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ, వైద్యంలో ఎం డి పొందిన నాగేశ్వరావు గారు విశిష్ట వ్యక్తి మేధా సంపన్నులు .సోషలిస్ట్ మేధావి .పార్లమెంట్ లో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా కొంతకాలమున్నారు .ఇండియా వచ్చినప్పుడల్లా పాత తెలుగు సినిమాలు చూడటం ఆయనకు అలవాటు .భారత రామాయణకాల విలువలను గురించి చర్చించేవారు .ఆరాధించే వారు .విదేశాలలో మంచి కవిగా ప్రసిద్ధి చెందారు .ఇంగ్లిష్ ఇటాలియన్ భాషలలో వైదుష్యంతో హృదయాలను ఆకట్టుకొనేలా ఉపన్యసించే వారు .ఆయన రచనలకు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది ..న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ యూరోపియన్ ఎడిషన్ లో వీరి కవితలు ప్రచురితమై ,యూరోపియన్ పాఠకులకు దగ్గరయ్యారు .వీరి కవితల పుస్తకం ‘’పీస్ అండ్ లవ్ ‘’కు బెర్ట్రాండ్ రస్సెల్ ముందుమాట రాశారు .రావు గారి కవిత్వాన్ని మెచ్చుకొంటూ ‘’మీ కవితలు అద్భుతం ..శాంతిని గురించి మీరు రాసిన కవితలు సజీవంగా ,ఉన్నత ప్రమాణాలతో ,గొప్ప ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి .అన్నికవితలు మెచ్చదగినవే పేర్కొన దగినవే ‘’ఆని కితాబిచ్చాడు రస్సెల్ .

  ఈ కవితా సంపుటిలో ‘’త్రీ మదర్స్ ‘’కవితలో తనకు జన్మనిచ్చిన తల్లి ,మాతృభాష ,మాతృభూమి ముగ్గురు తల్లులు ఆని అత్యంత గౌరవప్రదంగా వినయంతో పేర్కొన్నారు రావు గారు .ఇటాలియన్ భాషలో ‘’ ఆరోరా ,సేనేవిటా,శాంతిప్రియ ,సోషియాలిస్మోపుస్తకాలు రాశారు .ఇంగ్లీష్ లో లైఫ్ అండ్ లవ్ ,పీస్ అండ్ లైఫ్ ,సోషలిజం అనే నాటకం ,లేస్లిబిచ్ ,పోయిసేస్ బి.ఎన్ .కె .  దాస్ ,పోయిసేస్ క్లియిసిస్ ,రాశారు .

శ్రీ వేగె నాగేశ్వరరావు తమ భాషా వైద్య ఆర్ధిక సేవలకు బహు విశిష్ట పురస్కారాలు అందుకొన్నారు .అందులో ముఖ్యమైనవి -కొలంబియన్ ట్రోఫీ ,సెయింట్ లూయీ ,రోమా ,తివోర్నో క్రిటేకాలిటరేరియా,రోమా ప్రియో ,జూరిక్ ప్రిమియో ,ప్రిమియో .

  27-2-1997న 65ఏళ్ల వయసులో కవి డాక్టర్ ,రచయిత ,మాతృభాషా మాతృదేశాభిమాని శ్రీ వేగె నాగేశ్వరరావు మరణించారు .

 వీరి గురించి ఎవరికీ తెలియదనిపిస్తోంది .వీరి జీవితం చూస్తుంటే మా  ఉయ్యూరుకు చెందిన ‘’కేమోటాలజి పిత ‘’శ్రీ కొలచల సీతారామయ్య గారు జ్ఞాపకం వస్తున్నారు .ఇద్దరూ కృష్ణాజిల్లా మహోన్నతులే .

ఆధారం -కృష్ణాజిల్లా కోలవెన్నుకు చెందిన శ్రీ పరుచూరి శ్రీనివాసరావు గారి వ్యాసం     

.మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.38 వ భాగం.26.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.38 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.54 వ భాగం.26.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల _ కరిమింగిన వెలగ పండు.3 వ భాగం.25.7..25.

Posted in రచనలు | Leave a comment

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.14. వభాగం.25.7.25.

డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.14. వభాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.37 వ భాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.53 వ భాగం.25.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.53 వ భాగం.25.7.25.

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెలగ పండు.2 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు

శ్రీ కపిల చిన వెంకటరావు గారు  పశ్చిమగోదావరిజిల్లా ‘’మంచిలి ‘’గ్రామం లో 1906లో శ్రీకపిల కృష్ణారావు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .మద్రాస్ లా కాలేజిలో చదివి బి. ఎల్. పట్టా పొందారు.విజయవాడలో న్యాయవాదిగా 50 ఏళ్ళు వృత్తిలో ఉండి మంచి పేరు తెచ్చుకొన్నారు .కొంతకాలం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు .

 బెజవాడ రెడ్ క్రాస్ సంఘానికి మూడు దశాబ్దాలు గౌరవకార్యదర్శి రావుగారు .ఆయన రాసినవ్యాసాలు కథలు నాటికలు ఆనాటి ప్రముఖ పత్రికలలో వచ్చేవి .’’ఇనప్పెట్టె ‘’,’’కొత్తపూస ‘’,’’దేవి ఇచ్చిన వరం’’ ,’’దొంగ ఎవరు ‘’,’’అల్ప సంతోషి ఆచార్లు ‘’కథలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి .వెంకటరావు గారి నాటికలు రేడియో లోనూ ,రంగస్థలం పైనా ప్రదర్శింప బడ్డాయి .’’1984లో 76ఏళ్ల వయసులో శ్రీ కపిల చిన వెంకటరావు మరణించారు ‘’ఆని శ్రీ కపిల లక్ష్మీ నరసింహారావు గారు రాశారు .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి

తెల్లదొరలకోసం తెలుగులో పాఠ్య గ్రంధాలు రాసిన వారిలో ప్రధములు శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు1770లో పుట్టారు 72ఏళ్ళు జీవించి 1836లో మరణించారు . .బారసాల నాడు పెట్టిన పేరు ‘’గురుమూర్తి .’’ఆరువేల నియోగి కుటుంబం వాడు కనుక శాస్త్రి పదం మొదటి నుంచీ లేదు . .

1819 సెయింట్ జార్జికోట కాలేజి వారు ప్రచురించిన ‘’విక్రమార్కుని కథలు ‘’పుస్తకం లో ‘’ఆరువేల నియోగి యగు రావిపాటి గురుమూర్తి ‘’అనే ఉన్నది .ఆకాలేజీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఈయనను తెలుగు ఉపాధ్యాయునిగా నియమించారు .శ్రీ వేదం పట్టాభి రామ శాస్త్రి గారు ప్రథాన సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులు .గురుమూర్తిగారు డిప్యూటీ తెలుగు మాస్టారు .

  తెల్లదొరలకు పాఠ్యగ్రంథంగా గురుమూర్తిగారు 104పేజీల’’ విక్రమార్క కథలు’’ రాశారు .కాలేజివారు 1819లో అచ్చు వేశారు .అదొక్కటే ఆనాటికి ప్రామాణిక పాఠ్యగ్రంధం .1828,1850 ,1858లలో మూడు సార్లు పునర్ముద్రణ జరిగింది .ఈ పుస్తకాలను మద్రాస్ లోని సివిల్ ఉద్యోగులేకాక ఇంగ్లాండ్ లోని వారు కూడా చదువుకోవటానికి పంపించారు .గురుమూర్తి గారి జీతం పెంచి’’ బంగారు కడియాల జత’’ కూడా బహూకరించారు .

  1820 లో వేదం పట్టాభిరామ శాస్త్రిగారు చనిపోగా ,హెడ్ మాస్టర్ గా గురుమూర్తి గారిని నియమించి హోదా సూచించే పదంగా ‘’గురుమూర్తిశాస్త్రి ‘’ఆని గౌరవంగా పిలిచారు .విద్యా విధాన విషయాలలో ప్రభుత్వం ఆయన సలహాలను తీసుకొన్నది .1833లో కలక్టరేట్ స్కూళ్ళలో బోధించాల్సిన పుస్తకాలను గురుమూర్తిగారు నిర్దేశించారు .ప్రభవల పుస్తకం ,సులభమాటల పుస్తకాలు ,వచన వ్యాకరణం ,కొంచెం ఛందస్సు ,సులభ పద్యాల పుస్తకం ,అకారాది శబ్ద పుస్తకం ,జాబులు ,భారతం లో ఆదిపర్వం లను అర్దాలతో సహా స్కూళ్ళలో బోధించాలని చెప్పారు .

  సివిల్ సర్వెంట్లకు తెలుగు నేర్పటమేకాక ,శాస్త్రిగారు వారి విద్యాభి వృద్ధి ఎలాఉన్నదో నిర్ణీత సమయాలలో పరీక్షలు కూడా సీనియర్ కాలేజి బోర్డు సభ్యులతో జరిపించేవారు .తన వద్ద చదువుకొన్న తెల్లదొరలు పెద్ద పెద్ద హోదాలలో పని చేస్తున్నా ,భాషా విషయంలో వాళ్లకు వచ్చే సందేహాలను గురుమూర్తి శాస్త్రిగారు లేఖలద్వారా తెలిపి అనుమానాల నివృత్తి చేసేవారు .1827లో సిపి బ్రౌన్ దొర ‘’అలమోక ‘’,’’డాబాలు ‘’మాటల అర్ధాలు రాసిపంపమంటే ఒక ఉత్తరం లో సమాధానాలు రాసి బ్రౌన్ కు పంపారు .

 1834లో గురుమూర్తిగారు ‘’పంచ తంత్ర కథలు ‘’అనే మరో వచన గ్రంధం రాశారు .ఇదికూడా బాగా ప్రాచుర్యం పొంది నాలుగు సార్లు 1842 ,48 ,64,1869లలో పునర్ముద్రణ పొందింది.తెలుగు మాటలకు ఇంగ్లీష్ అర్ధాలు ఇచ్చే,నిఘంటువు,తెలుగును ఇంగ్లీష్ లో బోధించే వ్యాకరణాలు ,పాఠ్యగ్రంథాలు  రాస్తే ,ఆమోదింపబడిన వాటికి నగదు పారితోషికం ఇస్తామని బోర్డ్ ప్రకటించింది .చాలామంది సివిల్ ఉద్యోగులు ఆపనిలో పడగా గురుమూర్తిగారు వారి వెన్నంటి నిలిచారు .జె.సి మారిస్ దొరరాసిన నిఘంటువులో గురుమూర్తి గారి పాత్ర చాలా ఉంది .1835లోఇది అచ్చయినప్పుడుదొర తన గురువుకు పీఠిక లో కృతజ్ఞతలు ప్రకటించుకొన్నాడు .

  తెలుగు వారికి తెలుగులోనే వ్యాకరణం బోధించాలని గురుమూర్తి గారు భావించి 1836లో ‘’తెలుగు వ్యాకరణం ‘’అనే పేరుతొ 5ప్రకరణాలతో 316లక్షణ వాక్యాలతో రాశారు .సంస్కృత వ్యాకరణం బట్టి సూత్రాలతోకాకుండా ఇంగ్లీష్ విధానాలతో ‘’వాక్య పధ్ధతి ‘’లో చెప్పటం గురుమూర్ర్తి గారి గురుత్వ విశేషం .ఇందులోఅక్షర లక్షణ ,సంధి ,విశేష్య ,విశేషణ ,క్రియాపద ప్రకరణాలున్నాయి .

  శాస్త్రిగారి పాండిత్యం,ప్రామాణికత మీద బ్రౌన్ దొరు అపూర్వ గౌరవం ఉండేది .తన రచనలను ఆయన  ఆమోదించి నందుకు  బ్రౌన్ ‘’I mention his name because his talents and good sence always entitled  his judgement and respect ‘’ఆని 1839లో ప్రశంసించాడు .

 1850లో బ్రౌన్ దొర గురుమూర్తిగారి రచనలు ఇతరులురాసిన ఆంధ్రభాషా సంగ్రహం అరేబియన్ నైట్స్ పుస్తకాలను పాఠశాలలో బోధించటం నిష్ప్రయోజనం ఆని ఆదేశించాడు .బ్రిటీష వారికి కావలసింది తక్షణ ప్రయోజనాలే .శాస్త్రిగారు 1836లో రిటైరయ్యారు .సముచిత పారితోషికాన్ని కంపెని ప్రభుత్వం ఇచ్చింది .ఆయన శిష్యులు ఆయనకు కడపజిల్లా కదిరిలో డిస్ట్రిక్ట్ మునసబు గా ఉద్యోగం ఇప్పించారు .కనుక ఆయనకు ఇచ్చిన ‘’గ్రాట్యు టి’’డబ్బు మొత్తాన్ని వాపసు చేయమని అధికారులు ఆదేశించారు .కంపెనీ వారి విశ్వాసాలు ఇలాఉంటాయి .రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు 1836  లో మరణించారు .ఆయనకొడుకు గురవయ్యను మాత్రం కాలేజీలో ఉపాధ్యాయునిగా నియమించారు గుడ్డ్డిలో మెల్ల లాగ ‘’అన్నారు ఆరుద్ర .

ఆధారం -ఆరుద్ర ‘’సమగ్ర ఆంధ్ర సాహిత్యం -కు౦ఫిణియుగం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల_ కరిమింగిన వెలగ పండు. 1 వ భాగం.23.7.25.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల_ కరిమింగిన వెలగ పండు. 1 వ భాగం.23.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన12 వ భాగం.23.7.25..

డా. సి హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన12 వ భాగం.23.7.25..

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.35 వ భాగం.23.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.35 వ భాగం.23.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.51 వ భాగం.23.7.25

Posted in రచనలు | Leave a comment

డా. సి. హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.11 వ భాగం.22.7.25.

డా. సి. హెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.11 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.22.7.25./

డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.34 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.50 వ భాగం.22.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.50 వ భాగం.22.7.25.

Posted in రచనలు | Leave a comment

డా.సి. హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన

.10 వ భాగం.21.7.25.

డా.సి. హెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన

.10 వ భాగం.21.7.25.

Posted in రచనలు | Leave a comment