
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
154—శివ స్వామి
‘’కప్ఫానాభ్యుదయం ‘’ అనే ఒకే ఒక కావ్యం రాసిన శివ స్వామి కవి కాశ్మీర్ రాజు అవంతి వర్మ వర్మ ఆస్థానం లో ఉండేవాడు .కాలం క్రీ శ 855-884. బౌద్ధ ధర్మావలంబి.బౌద్ధం అంటే వీరాభిమానం .పైన పేర్కొనబడిన కావ్యం బుద్ధుని స్తుతి తో ఆరంభ మవుతుంది .ఇరవై కాండలున్న ఈ కావ్యం లో దక్షిణా పద రాజు కప్ఫాన చేసిన దండయాత్రల వర్ణనలున్నాయి .శ్రావస్తి రాజు ప్రసేన జిత్తు రాజ్యం పై సాగిన దండ యాత్ర ఇది ..ఈ యాత్ర మలయ పర్వతాల ద్వారా జరుగుతుంది .యాత్రమధ్యలో అనేక ఋతువులు గడిచి పోతాయి .సిల్వన్ అందాలు ప్రేమికుల సరసాలు అన్నీ ఇందు లో కవి వర్ణించాడు .యుద్ధం లో విజయం సాధించినా ,కప్ఫాన వేదాంత ధోరణిలో పడిపోయాడు .ప్రపంచ బంధాల నుండి విముక్తుడై ప్రశాంత పవిత్ర జీవితం గడిపాడు .బుద్ధ భగవానుని శిష్యునిగా మారి నిర్వాణ సుఖం పొందాడు .
శివ స్వామి కావ్యం మాఘుని శిశుపాల వధ కావ్యాన్ని , కిరాతార్జునీయాన్ని పోలి ఉంది .యమకాల గమకాల సొగసు చూపించాడు .బంధ కవిత్వం లోనూ ప్రజ్ఞ చూపాడు . కాని కావ్యం పూర్తిగా లభ్యం గా లేదు ‘
155-జిన సేన కవి
జినసేనకవి వీరాచార్య శిష్యుడు . వీరాచార్య సుభాద్రుడు ,లోహార్యుల కాలం లో ఉన్న పవిత్ర గ్రందాల కు అధిపతి .శ్వేతాంబర జైన మతానికి ఆచరణాంగాల్లో నిష్ణాతుడు .వీరాచార్యుడు,శిష్యుడు జిన సేన కవి ఇద్దరు కలిసి రాష్ట్ర కూట రాజు అమోఘ వర్మను జైన మతం లోకి మార్చారు . రాజు సర్వ సంగ పరిత్యాగం చేసి రాజ్యాన్ని కుమారుడికి 875 లో పట్టాభి షేకం చేశాడు .వీరాచార్యుడు రాజుకు సన్నిహితుడై ‘’గణిత సార సంగ్రహం ‘’లో ప్రశస్తి చేశాడు
గుణ సేనుడి శిష్యుడు గుణ భద్రుడు అకాల వర్ష కు చెందిన రెండవ కృష్ణ రాజు కు ఆచార్యుడు. జిన సేనుడు అమోఘ వర్మ మనవడు మొదటి కృష్ణ రాజు కాలం లో ‘’పార్శ్వాభ్యుదయం ‘’ను 814లో రాశాడు .ఆది పురాణం లో జినసేనుడు 42 అధ్యాయాలు రాశాడు .చివరి అయిదు అధ్యాయాలను శిష్యుడు గుణ భద్రుడు పూర్తీ చేశాడు .ఈ విషయాన్ని ఉత్తర పురాణం లో చెప్పాడు .దీన్ని లోక సేన కవి రాష్ట్ర కూట రాజు రెండవ కృష్ణుడి కాలం అకాల వర్ష లో 897 జూన్ లో రాశాడు .పార్శ్వాభ్యుదయం కాళిదాసమేఘ సందేశానికి అనుకరణ.కాళిదాసు శ్లోకం లోని చివరి పాదాన్ని గ్రహించి మిగిలిన మూడు పాదాలు తాను కూర్చాడు .23 వ జైన తీర్ధ౦కరుడైన పార్శ్వనాధుని చరిత్రే ఇది .జిన సేనుని కవిత్వం ఉన్నత సంప్రదాయం లో ఉందడి విశిష్ట గుణ గరిష్టంగా ఉంటుంది .కాళిదాసు కవిత్వానికి సరి సమానంగా ఉంటుంది .కాని కాళిదాసును మించి మాత్రం కవిత్వం ఉండదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో
గురు పూజోత్సవ ఆహ్వానం
సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ దంపతులకు , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా అందజేయ బడుతుంది ..పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ లో అంద జేస్తాము .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –మరియు పి.ఆర్ ఎస్ ఏం .కాలేజ్ –ఉయ్యూరు
26-6-15 –ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53
21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్ -2(చివరిభాగం )
ప్రకృతికి పరవశం
ముప్ఫైలలో రేనార్ పట్టుదలతో మరింత శక్తి యుక్తులతో రంగుల వైభవం చూపించాడు .ఇప్పుడు విమర్శకులు ఆ రంగుల ప్రపంచాన్ని ఆహ్వానించి ఆరాధించారు .మిగిలిన సహచరుల కన్నా కాంతి సమ్మేళనం లో చిత్రాలకు వృత్తాకార నిర్మాణం చేసి ముందుకు దూకాడు .వారు ఇతన్ని చేరుకోలేక పోయారు .నలభై లలో ఆ గ్రూప్ తో సంబంధాలు వదిలేసుకొన్నాడు . ఇంప్రెష నిజం బాగా పెరిగిపోయి ,బాగా అనిశ్చితమై ,రంగుల విషయం లో స్పష్టత లేకుండా ,చిత్ర నిర్మాణం లో శ్రద్ద లేకుండా తయారై పోయిందని గ్రహించాడు .కనుక ముందు తనను తానూ కరెక్ట్ చేసుకొన్నాడు. తన వర్ణాలు చాలా మృదువుగా డిజైన్లు మరీ ప్రకాశ వంతంగా ,పరమ శాంతంగా ఉన్నట్లు అనిపించింది .ఇంతకంటే బలీయంగా రంగులు ఉండాలని శక్తి వంతంగా కనిపించాలని నిర్ణయించాడు .అవి ‘’solid and enduring ‘’గా ఉండాలనుకొన్నాడు .దీనికోసం దక్షిణ దేశమంతా తిరిగాడు .అల్జీరియా లో సమ శీతోష్ణ స్థితి కి అబ్బురపడ్డాడు .క్రీస్తుకు ముందున్న రోమన్ ఫ్రేస్కోలను పామ్పే లో చూశాడు . .మైకేలాన్జేలో , రాఫెల్ వర్ణ సరస్సులో రోమ్ ఫ్లారెన్స్ లలో మునక లేశాడు .ఎక్కడ ప్రకృతి పరవశం గా కనిపిస్తే దాన్ని అంతటినీ మనసులో భద్ర పరచుకొన్నాడు .చూడటమే కాదు వాటిని అధ్యయనం చేశాడు .వాటికి అబ్బురపడ్డాడు .’’nothing can be taken for granted ,nothing is stereotyped ‘’అన్న ఎరుక కలిగింది .’’the sections of an orange ,the leaves of a tree ,,the petals of a flower ,are never identical .It would seem that beauty derives its charm from this very diversity ‘’అన్నాడు రేనార్ .
మోడల్ తోనే పెళ్లి
యువకుడిగా రేనార్ బక్కగా బలహీనం గా విశాలమైన కను బోమలతో చిన్న మీసం తో కనిపించేవాడు. జట్టు వెనక్కి దువ్వేవాడు .మిగిలిన చిత్రకారులకంటే నెమ్మది స్వభావి .ఏదిచ్చినా సంతృప్తి పొందే మనస్తత్వం .వయసు మీద కొచ్చాక మనిషిలో గాంభీర్యం ,హుందాతనం వచ్చాయి .తన దగ్గర మొడల్స్ గా ఉన్నవారిలో మరీ అందగత్తె ఎలీన్ చారిగాట్ ను ఎంచుకొని పెళ్లి చేసుకొన్నాడు .హాయిగా ఆనందంగా ఇద్దరూసామరస్యం తో గడిపారు .ముగ్గురు కుమారులు పుట్టారు .అందులో జీన్ సినీ దర్శకుడిగా గొప్ప విజయాలు సాధించాడు .
ఆర్దిటిస్ తో ఆర్టిస్ట్
యాభై లలో రేనార్ ను కీళ్ళ నెప్పులు బాగా బాధించాయి .అరవైలలో ఇవి పెరిగి మరీ బాధ పడ్డాడు .ఆర్దిటిక్ బాధ అనంత వేదనే అయింది .నడవ లేక పోయేవాడు .చివరికి చక్రాల బండీ యేశరణ్యం అయింది .చేతులు మరీ దెబ్బ తిన్నాయి .బొటన వ్రేలు తో ,చూపుడు వేలును కలప లేక పోయేవాడు .కాని పేయింగ్ ను మాత్రం మాన లేదు .చిత్రాలు ఇదివరకు లాగానే తేజో వంతం గా వేస్తున్నాడు .ఒక క్లాంప్ ఆధారం గా వ్రేళ్ళను కదిలించి చిత్ర రచన చేశాడు తన తండ్రి అని కొడుకు చెప్పాడు .కాని చరిత్రకారుడు రేనార్ వ్రేళ్ళు బ్రష్ పట్టుకోలేనంత బలహీనం గా ఏమీ లేవు చాలా స్పష్టంగా గీసేవాడు అన్నారు .ఆ రంగులు చర్మానికి తగిలి ఇరిటేషన్ కలిగించేవి .తర్వాత అవే కండరాల నెప్పులు గా మారాయి .తన ‘’పక్క’’ను చూసి .’’this ridiculous invention ‘’ అన్నాడు .ఎందుకు ఆధునిక సైన్స్ ఈ వృద్ధ జ౦బు కాలను ‘’ జాడీలో ఊరగాయ ‘’లాగా భద్ర పరుస్తోందో అర్ధం కావటం లేదన్నాడు .
రేనార్ విధానం
ఆ తర్వాత కాలం లో వేసిన కాన్వాస్ లు మరింత బలీయంగా ,సంపన్నంగా ఉండేవి .ముదురు ఊదా రంగు బాగా ఇష్ట పడేవాడు. బర్గండి ఎరుపు రోజ్- పర్పుల్ కలర్లు ఎక్కువ గా వాడేవాడు .65 వ ఏట రేనార్ ను అమెరికన్ పెయింటర్ క్రిటిక్ వాల్టర్ పాష్ అతని విధానం ఏమిటి అని ప్రశ్నించాడు .దానికి రేనార్ ‘’I want red to be sonorous to sound like a bell .If it does not turn out that way ,I put on more reds or other colors till I get it .I have no rules and no methods .I look at a nude ,there are myriads of tiny tints .I must find the ones that will make the flesh on my canvass live and quiver .Shall I tell you what I think are the two qualities of art?i must be indescribable and it must be inimitable ‘’అని స్పష్టంగా చెప్పాడు
కీళ్ళ నొప్పులు పెరిగిన కొద్దీ రేనార్ చిత్రకళా పెరిగింది .ఒక సహాయకుడిని పెట్టుకొని శిల్పాలనూ తయారు చేశాడు .వాటిని అత్యున్నతంగా ప్రతిభా వంతంగా శిల్పీకరించాడు .ఎవరూ అతని శిల్పకళ ను విమర్శించలేదు .అజాగ్రత్త ,నిస్తేజలను దూరం చేసుకొన్నాడు .1919లో కూడా ఇంకా కొత్త విషయాలు నేర్చుకొన్నాడు .’’నేనింకా అభి వ్రుద్ధిలోనే ఉన్నాను ‘’అన్నాడు 78 వ ఏట .ఆ మర్నాడే 1919 డిసెంబర్ 3 న చిత్రాకారుడు శిల్పి అగస్టీ రేనార్ చనిపోయాడు .
జీవితం చివర్లో రూపొందించిన పెద్ద నగ్న శిల్పాలు వెచ్చని స్ట్రా బెర్రీ జూస్ లో స్నానించి నట్లున్నాయి అన్నారు .అతని స్త్రీలు ‘’warm and lush ‘’కాని పసి మనస్తత్వం తో అమాయకం గా ఉంటారు అన్నారు .అతను దేన్నీ బ్రష్ తో ముట్టుకొంటే అది ఒక కళా ఖండమే అయింది అతని శైలి బాగా ప్రాముఖ్యత ప్రాచుర్యం పొందింది . ఇమ్ప్రేషనిజం ఆ తర్వాత ఉధృతమైన ఉద్యమగా మారింది .అవసాన దశలో మాటిస్సా వచ్చి రేనార్ ను చూసి ‘’అతని ప్రతి స్ట్రోకు ఎక్కువ నొప్పుల్ని కలిగిస్తోంది ‘’అన్నాడు .’’ఎందుకు ఇంకా పని చేస్తున్నావు ?’’అని ఆయన అడిగితే రేనార్ ‘’నెప్పులు మాయమవటానికే .’’అని చెప్పి ‘’the pleasure –the creation of beauty remains ‘’అన్నాడు రేనార్ .
‘’ ఫెమినైన్ సేన్సుయాలిటీ ‘’రేనార్ ప్రత్యేకత . “Renoir is the final representative of a tradition which runs directly from Rubens to Wattea రేనార్ చిత్రాల అమ్మకం70 మిలియన్ డాలర్లు దాటింది . Renoir mastered the ability to convey his immediate visual impressions, and his paintings showed great vitality, emphasizing the pleasures of life despite the financial worries that troubled him. Several of his masterpieces date from this period: La Loge (1874; “The Theatre Box”), Le Moulin de la galette (1876), The Luncheon of the Boating Party (1881), and Mme Charpentier and Her Children (1878). Charpentier organized a personal exposition for the works of Renoir in 1879 in the gallery La Vie Moderne.
అతని పెయింటింగ్స్ లో ‘’డాన్స్ ఎట్ లీ మోలిన్ డీ లా గెలేట్ ‘’ప్రసిద్ధమైనది ఇందులో ఒక డాన్స్ గార్డెన్ లో ఆరుబయట క్రిక్కిరిసిన జనం కనిపిస్తారు .ఇక్కడే రేనార్ నివసించేవాడు .వేలాది చిత్రాలు గీశాడు
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52
21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్
చిత్రం వినోదం
20 ఏళ్ళ వయసులో ఆగస్టీరేనార్ తాను గీసిన కొన్ని చిత్రాలను ‘’గ్లేయిర్ ‘’అనే పెయింటర్ కు చూపించాడు .ఒక సారి చూసి ‘’చేతకాని పని చేసి పెయింట్ తో నిన్ను నువ్వే వినోద పరచుకోన్నట్లున్నాయి ‘’అన్నాడు .కుర్రాడు వెంటనే ‘’నాచిత్రం నాకు వినోదం కలిగించక పోయిన రోజు పెయింటింగ్ వేయటం ఆపేస్తాను ‘’అన్నాడు .చిత్రాలలో వినోదానికి అంత ప్రాధాన్యత నిచ్చాడు రేనార్ .అన్ని రకాల చిత్రాలు గీశాడు .అవి వినోదాన్నే కాదు ఆశ్చర్యాన్నీ కలిగించాయి .అనేక శైలులలో చిత్రించాడు వైవిధ్యం అతని ఊపిరి .పాలెట్ నైఫ్ టెక్నిక్ దగ్గర్నుంచి,ఎకడమిక్ డ్రాయింగ్ లదాకా అన్నీ చేశాడు .సాధారణం నుంచి సంక్లిష్టం దాకా ప్రయాణించాడు .నగ్న చిత్రాలు కుటుంబ చిత్రాలు కూడా గీశాడు .సూర్య కాంతిలో మెరిసే ప్రక్రుతి దృశ్యాలు ,స్నాన ఘట్టాలలో విషయాలు ,చిన్నారుల నవ్వుల అందాలు అన్నీ అతని చిత్రాలలో జీవం పోసుకోన్నాయి .
సంగీతం నుంచి చిత్రలేఖనానికి
మొదటిసారిగా రేనార్ కాన్వాస్ మీద చిత్రం గీయ లేదు .పోర్సేలీన్ తో చేశాడు ఫ్రాన్స్ దేశం లో లిమోజేస్ అనే చోట రేనార్ 24-2-1841 జన్మించాడు. అసలు పేరు పియరీ అగస్టే రేనార్ .కూలి పని చేసుకొనే అతని తలిదండ్రులు పారిస్ కు మారారు .కొడుకు సంగీత విద్వా౦సుడవుటాడని ఆశించారు .గురువు సంగీతంమేస్తారు .కాని రేనా ర్ చేతులకు పియానో వాయించటం కంటే పెన్ను తీసుకొని రాయటానికే ఇష్టం గా ఉండేది .14 వ ఏట పారిస్ లోని చైనా ఫాక్టరీలో అప్ర౦ టిస్ గా చేరాడు .కుండలు జాడీలపై చేతి తో పెయింటింగ్ వేసేవాడు .కాని ఇది ఎక్కువ కాలం సాగలేదు .వాణిజ్యపరమైన డిజైన్లు రూపొందించాడు .ఫాన్ లకు ,ట్రేలకు డిజైన్లు వేసి బాగానే డబ్బు కూడ బెట్టి గ్లేయర్ ఆర్ట్ క్లాసుల్లో చేరాడు .ఇక్కడే సిసిలీ మొనేట్ అనే అతనితో పరిచయమై స్నేహితుడయ్యాడు .అతను ఇతన్ని కళా ప్రపంచపు ద్వారాలు తెరిచి చూపించాడు .కేధలిక్ అయినా కనిపించిన ప్రతిదానిలో అందాన్ని చూసేవాడు .స్టూడియోలకు సెలూన్ లకు వెళ్లి విషయాలు అర్ధం చేసుకొనేవాడు .తాను లోవర్ మధ్య ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. నిజానికి అతను ఉన్నది మౌంటెన్ బ్లీన్ ఫారెస్ట్ దగ్గర .ఆ అరణ్యం అతన్ని బాగా ఆకర్షించింది .
యువ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
24 వయసులో రేనార్ గీసిన రెండు చిత్రాలను సెలూన్ మెచ్చి ఆహ్వానించింది ..కాని తన విధానం లో తానూ వేసి చిత్రాలను పంపిస్తే తిరస్కరించింది సెలూన్ .కానీ అది వైఫల్యం కాదు .పోర్త్రైట్లకు కమీషన్ వచ్చేది .మురికి కూపం లోంచి మకాం రూ సెయింట్ జార్జ్ కి మార్చాడు .ఒంటి మీదకు 33 వచ్చాయి .స్వంత కాళ్ళ మీద నిలబడే సత్తా వచ్చింది. ఇరవై మంది ప్రయోగకులతో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేశాడు .ఇందులో డేగస్ ,పిస్సరొ ,మొనేట్ ,సిజన్నే ,కూడా సభ్యులే .వీరందరూకలిసి మొదటి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు .చూసినవాళ్ళు పిల్లికూతలు అరుపులు కేకలతో నిరుత్సాహ పరచారు .మళ్ళీ రెండో ప్రదర్శన పెడితే మొదటిదానికంటే భీభత్సం జరిగింది .రేనార్ చిత్రాలను చూసి మొనేట్ అతనికి ప్రతిభ లేదని ఆ విషయం అతనితో చెప్పమని రేనార్ స్నేహితుడికి చెప్పి ఇంక పెయింటింగ్ జోలికి రేనార్ ను వెళ్ళ నీయ వద్దు అనిఒక ఉచిత సలహా పారేశాడు . ,
ఇంప్రెష నిస్టులు
ఈ కొత్త ఆర్టిస్ట్ గ్రూప్ ను చీదరించుకొన్నారు, అవహేళన చేశారు అందరూ .మొనేట్ ఒక కాన్వాస్ పై ‘’ఇంప్రెషన్- సన్ రైజ్ ‘’చిత్రించాడు .దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ గ్రూపు కు ‘’ఇంప్రెష నిస్టులు ‘’అని ముద్ర వేశారు .ఈ పేరును ఈ గ్రూపు తిరస్కరించలేదు .ఆహ్వానించారు .’’treating a subject in terms of the tone and not of the subject itself is what distinguishes the Impressionists from other painters ‘’అని తమ భాష్యం చెప్పుకొన్నారు .వాస్తవానికి ప్రతిబింబం కాదుకాని దాన్ని మరో రకం గా ఆవిష్కరించటమే వారు చేసిన పని .జ్ఞానేంద్రియ జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి ,ప్రకాశవంతమైన చిత్రాలు గీటమే ధ్యేయంగా పని చేశారు .పెయింట్ స్ట్రోక్ లతో ఫలితాలు రాబట్టారు ‘’they succeeded in in blurring the out lines of objects and merging them with the surroundings .This method permitted the introduction of one color into the area of another without degrading or losing it –thus enriching the color effects .The technic of vivid strokes seemed best to their efforts at retaining rapidly changing aspects ‘’అని ‘’the history of impressionism ‘’లో రేవాల్ద్ రాశాడు కాంతికి చాయకు ఉన్న అనంతమైన మార్పుల్ని గుర్తించటం వాటిని కొత్తగా పిగ్ మెంట్ భాషలో చూపటం ఇందులో ప్రత్యేకత .దీనితో స్టూడియోలకే పరిమిత మైనచిత్రకళ బాహ్య ప్రపంచం లోకి వచ్చి పొలాలు అడవులు సరసులు ,సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహాలు చిత్రాలలో దర్శన మిచ్చాయి .మొనేట్ ఏకంగా ఒక పడవ మీదే స్టూడియో నిర్మించుకొన్నాడు .చీకటి వెలుగుల చిందు లాట దర్శించి చిత్రించాడు .సిజన్నే లాగా రేనార్ కూడా ‘’దిఆర్ట్ ఆఫ్ ఇమ్మీడిఎట్ ‘’ను అభినందించాడు .ఇదే సెన్సిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నారు .ఒక ఆకు అంతర్నిర్మాణం ఎలా ఉందొ చెప్పటానికి దాన్ని చిత్రవధ చేయక్కరలేదు స్పాంటేనియస్ విజన్ ఉంటె చాలు అంటాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
దశమ వార్షికోత్సవ చినుకు సంచిక
‘’ఇక చినుకు రాదు .అయిపొయింది ,ఆగిపోయింది ‘’అని కొందరు సంబర పడుతున్న కాలం లో చినుకు సాహిత్యపు వానై ,వరదై, పదవ వార్షిక ప్రత్యేక సంచికగా రెండు రోజుల క్రితమే వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది . రావు అనుకొన్న వర్షాలు ఈ మధ్య విపరీతంగా కురిసి హర్షాన్ని తెచ్చాయి ఆంద్ర దేశానికి .ఇప్పుడు ‘’ఈ చినుకూ’’ అంతే .
ముచటైన ముఖ చిత్రం ముందుగా మనల్ని ఆకట్టు కొంటుంది .’’అక్షరాలూ సేకరిస్తూ చల్లుకుంటూ సాహితీ సేద్యం చేస్తున్న నండూరి మాటలు ఎంకిపాటల్లా కమ్మగా ఉన్నాయి.ఎండ్లూరి వారి అష్ట విధనాయికలు సంచికకు ఒక హైలైట్ అయితే, పన్నాల వారు అబ్బూరివారితో చేసిన ఇంటర్వ్యు మరో హెవీ లైట్ .’’సహన ద్రుష్టి తో సమీక్షించ గలిగే వ్యక్తిత్వాలే –సముదాత్త జీవన గమనానికి ‘’పధ సూచికలు అన్న సి నా రే కవిత అందరికి గణపాఠమే .’’అత్యాధునిక జీవన శైలిలో –అంతర్గతంగా దాగిన తృష్ణ ‘’వావి వరసలు విస్మరించే పశుకామ తృష్ణ అని నిఖిలేశ్వర్ సమాజ పోకడను చిత్రించారు .భండారు వారి మనం మరచిన’’ హరికధ’’ను బాగానే ‘’గానం’’ చేశారు .ఎందుకో నరేంద్ర కద మధురాంతకం గా లేదు .సినీకవుల గేయాలు చర్విత చర్వణాలే అయినా ‘’ఆపాత మధురాలే ‘’.జాన్సన్ గారీమధ్య ఏదిరాసినా ‘’చోమన దడి ‘’గా కొత్తగా ఉంటోంది .కవన శర్మ కధకు హాట్సాఫ్ .రాంబాబు గారికద నిజం గా ఆయన ‘’కధా వేదగిరి ‘’అనిపించింది .చలపాక కద కరెంట్ టాపిక్ .పండుముసలి వింజమూరి గారు గోప దంపతులకు గౌరవం తెచ్చారు .’’రాయ్ ‘’గారు రాయాల్సింది పొందికగా రాశారు .
30 కధలు ,20 కవితలు ,8 సమీక్షలు ,10 విశ్లేషణలు ,ఒక ముఖా ముఖం వగైరాలతో బృహత్తర అక్షర వాహినిగా ఏప్రిల్ –మే కలగలపు ప్రత్యెక సంచికగా చినుకు దర్శనమిచ్చింది .కొని చదివి పదిల పరచుకోవలసిన సంచిక ఇది .
గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 –ఉయ్యూరు .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5
20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -3(చివరిభాగం)
అసాధారణ శిల్ప నైపుణ్యం
మిగిలిన కళాకారులు రోడిన్ శక్తి సామర్ధ్యాల లతోపాటు అతని విధానాలను ఇప్పుడు బాగా అర్ధం చేసుకొన్నారు .విమర్శకులు రోడిన్ ను పొగడ్తాలతో మున్చేస్తున్నారు .కాని అందులోనూ కొంత జాగ్రత్తా పాటించారు .అతని సాహిత్య ప్రజన తక్కువ అన్నారు అతని సూటి నిజాయితీ తనాన్ని మెచ్చ కుండా ఉండలేక పోయారు .’’కళాకద ‘’అనే పుస్తకం లో ఎస్ రీనాక్ ‘’రోడిన్ చేసిన వ్యక్తిగత సామూహిక శిల్పాలు’’ డోనటేల్లో ‘’శిల్పాల స్పూర్తి నిస్తున్నాయి .మార్బుల్ లో రోడిన్ తన మనోభావాలన్నీ గొప్పగా ప్రదర్శించాడు .భారీతనం ఆకారాలలోనే కాదు అందం లో భావ వ్యక్తీకరణలో అసాధారణం గా ఉంది ‘’అని రాశాడు .
న్యూడ్ హ్యూగో
ఈ అసాధారణం అనే పదం రోడిన్ కు యాభై ఆరేళ్ళు వచ్చిన తర్వాతవిక్టర్ హ్యూగో శిల్ప ప్రదర్శన నాడు మళ్ళీ బయటికొచ్చింది .పాన్దియన్ లు ఆర్డర్ చేస్తే దీన్ని శిల్పీకరించాడు రోడిన్ . ఇందులో నేటివ్ సెన్స్ ను చూపించాడు .కవి నవలా రచయిత అయిన హ్యూగో ను భారీ శిల్పంగా నగ్నంగా వదులైన బట్టతో చూపించాడు .కానని వాళ్ళు కోరింది ఫ్రాక్ వేసుకొని దర్జాగా కనిపించే హ్యూగో .ఇది చూసి వాళ్ళు అ రోడిన్ అభి రుచిని తిట్టిపోశారు .శిల్ప సౌందర్యం తెలియని ఎద్దు మొద్దు అన్నారు .జుగుప్స కలిగించే భంగిమలకు ఆకర్షితుడు అని దుయ్య బట్టారు
సాంస్కృతిక ఇంప్రెష నిజం –తిరస్కరింప బడిన బాల్జాక్ శిల్పం .
మరో రెండేళ్ళ తర్వాతనాటక కర్త బాల్జాక్ భారీ శిల్పాన్ని1898లో న్యు సెలూన్ లో ప్రదర్శించాడు .దీన్ని ‘’సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్ ‘’సంస్థ ఆర్డర్ చేసింది .రోడిన్ గీసిన బాల్జాక్ శిరసు స్కెచ్ ను చూడగానే వాళ్ళు అగ్గిమీద గుగ్గిలమై తిరాస్కరించారు .ఆ విగ్రహం మెట్రో పాలిటన్ మ్యూజియం లో ఇప్పుడు ఉంది .కాని రోడిన్ ఇందులో సాంస్కృతిక ఇంప్రెష నిజం ‘’ను ప్రవేశ పెట్టాడు .అందువల్ల పురాతన గ్రీకు శిల్పం ళా కనిపించింది.కొందరికి ప్రాధమిక గోథిక్ శిల్పం ళా తోచింది .మరికొందరికి చరిత్రకు పూర్వం ఉండే నిలబడ్డ పొడవైన శిలలాగా (మెన్హిర్స్) అనిపించింది .నిరాశ చెంది రోడిన్ బాల్జాక్ శిల్పాన్ని ఏమీ మార్చ లేదు తన ధోరణిలోనే చెక్కాడు .పొట్టిగా లావుగా ఉండేఅసలైన బాల్జాక్ ను శిల్పీకరించలేదు .కాని సింహ శిరసు చైతన్యం తో చెక్కాడు దీన్ని అర్ధం చేసుకొన్నా విశ్లేషకుడు ‘’లామేన్ టైన్ ‘’’’thi figure of an element ‘’అన్నాడు .పేపరు వాళ్ళు కాకిగోల చేశారు .మునిసిపాలితీవాళ్ళు క్షమించరాని అవమానం అన్నారు .దీనీపై ఎన్నో కధనాలు అల్లి ,దూషించారు .ఒకప్పుడు చాలా రియలిస్టిక్ గా చేస్తున్నాడు రోడిన్ అన్న వాళ్ళే ఇప్పుడు అతనికి నేచురల్ గా ఉండటం అంటే ఏమీ తెలియదు అని అన్నారు .ఈరకమైన వ్యతిరేక ప్రదర్శన రోడిన్ ను మనస్తాపానికి గురి చేయతమేకాడు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది .
చైతన్య పరాకాస్ట
రోడిన్ చేతిలో ఇంకా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరింప బడాలి ..ఎన్నో చిరకాలం గుర్తుంచుకోదగిన చిత్రాలు ,శిరస్సులు ఆయన చేయాలి అందులో ముఖ్యం గా జార్జి బెర్నార్డ్ షా ,గుస్టేవ్ మాలర్ ,చార్లెస్ బాడర్లె ,జోసెఫ్ పులిట్జర్ మొదలైనవి .ఇవన్నీ సజీవ చైతన్యం తోణికిస లాదేట్లు నిర్మించాడు .చివరగా’’పోప్ బెనడిక్ట్ -15 ‘’పరమాద్భుత శిల్పం ,ఇవికాక 1909-11 మధ్య కాలం లో ఎన్నో చిన్న చిన్న కంచు విగ్రహాలు ,నాట్యం చేసేవారిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేశాడు .ఇంతగోప్పగా ధైర్యం గా చురుగ్గా అంతకు ముందెప్పుడూ దూసుకు వెళ్ళలేదు .న్యు యార్క్ ట్రిబ్యూన్ పత్రికలో ఎమిలి జేనార్ రివ్యు రాస్తూ ‘’they reach far out into space ,so they delineate not so much a specific dance in motion or a pair of acrobats as they do a flowering –out of dynamic energy expressed through the metal forms and the space they measure ‘’అని కీర్తించారు .
గౌరవ ఆదరాలు
అరవైలలో రోడిన్ ను పారిస్ లోని గ్రేట్ ఎక్సి బిషన్ లో సత్కరించటం ప్రారంభించారు . అప్పటికి ఇంకా ఆయన శిల్పిస్తున్న ‘’నరక ద్వారం ‘’పూర్తికానేలేదు .తిరస్కరింప బడ్డ బాల్జాక్ శిల్పం తో బాటు వందలాది శిల్పాలు చిత్రాలను ఒక ప్రత్యెక భవనం లో పెట్టి దానికి’’రోడిన్ పెవిలియన్ ‘’అని పేరు పెట్టారు .తాను చేస్తున్న మాధ్యమానికి రోడిన్ కొన్ని సూత్రాలు రాశాడు .అసలైన శిల్పి బాహ్య సౌందర్య ప్రదర్శనలో తృప్తి చెందడు .అందులో దూసుకు వచ్చే పదార్ధాన్ని ఆస్వాదిన్చేట్లు చేయాలి అన్నాడు .’’నేనేదీ కొత్తగా సృష్టించలేదు సృష్టిలో ఉన్నదానినే మళ్ళీ కనుక్కొన్నాను .ప్రతిదీ ప్రకృతిలోనే ఉంది .కళాకారుడు ప్రకృతిని అనుసరిస్తే అన్నీ అందుకోగలదు .మనవ శరీరం దేవాలయ యాత్రలాంటిది .దేవాలయం లో ఉన్నట్లే ఒక మధ్య బిందువు ఉంటుంది .దాని చుట్టూ అంతా అల్లుకు పోయి విస్తరిస్తుంది .ఆధునికులు చాయను అనుసరించారు పూర్వీకులు కాంతిని దర్శించారు .మనకు మైకేలాన్జేలో లోని ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెలిస్తే గ్రీకులలాగా ప్రవర్తిస్తే అతని శిల్పాలలో అవిశ్రాంత చైతన్యాన్ని దర్శించగలం .
ఫలితం ఆశించకుండా చేసే కృషిని మనసును అర్ధం చేసుకో గలం ‘’అన్నాడు రోడిన్ .చివరగా ‘’the martyrdom of the creature tormented by un reliable aspirations ‘’అన్నాడు .
హద్దులు మీరిన అభిమానం
తాను భావించిన విషయాలన్నిటినీ జీవితకాలం లో ముసలితనం లోనే సాధించాడు రోడిన్ .తన శిల్పాలు తనకాలపు ఆధ్యాత్మిక భావనలకు ప్రకటనలే అంటాడు .మొదటి ప్రపంచ యుద్ధప్రారంభం రోడిన్ ను నిరాశ్ పరచింది .అది అతని జీవా శక్తికి విఘాతం కలిగించి చావుకు కారణం అయింది .ఫ్రాన్స్ దేశం లో ఇంధనం కొరత బాగా ఏర్పడింది .రోజ్ రోడిన్ దంపతులు చలికి వనికిపోఎవారు .1916జులై 10 నరోడిన్ కు తల తిరిగినట్లు అనిపించింది .మేడ మెట్ల నుంచి జారి పడ్డాడు .మంచం మీదనే ఉండిపోయాడు .ఎందరెందరో మహిళలు ఆయన అభిమానులు ,వచ్చి విపరీతంగా అయన చుట్టూ మూగారు .ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కబుర్లతో కాల క్షేపం చేశారు .భార్య రోజ్ వీళ్ళను చూసి కొంత అసూయ కొంత జుగుప్స కోపం తో భర్తకు దూరంగా ఉంది .వాళ్ళ కోలాహలం భరించలేక పోయింది వాళ్ళ అభిమాన శిల్పి మరణ శయ్యమీద ఉన్నాడని వాళ్లకు స్పృహ లేకుండా పోయినందుకు విచారించింది కాని ఆ విషయం ‘’మాస్టర్ ‘’కు చెప్పే సాహసం చేయ లేక పోయింది ,నిస్సహాయం గా నిస్చేస్తం గా ఉండిపోయింది .రోడిన్ చుట్టూ చేరిన ఆడవాళ్ళు తమలో తాము కలహించుకొని జుత్తూ జుట్టూ పట్టుకొని పోట్లాడుకొన్నారు .తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .చాలా అసభ్యంగా ప్రవర్తించారు .చివరికి జూడిత్ క్లాడ్ వచ్చి పరిస్తితిని చక్క బరచాల్సోచ్చింది .
యాభై ఏళ్ళ కాపురం తర్వాత రోజ్ ను పెళ్ళాడిన రోడిన్
సెప్టెంబర్ లో రోడిన్ కు ప్రభుత్వ పెన్షన్ ఇచ్చారు ,ఈ పెన్షన్ తో రోజ్ జీవితం గడవటం కష్టం అనిపించింది రోడిన్ కు .ఆమె ను వివాహమాడి భార్య అని తెలియ జేస్తేనే ఆమెకు న్యాయం చేసిన వాడిని అవుతాననుకొన్నాడు.అప్పుడే చట్టప్రకారం తనకున్నదంతా ఆమెకు దక్కుతుందని భావించాడు .1917 జనవరి లో రోజ్ ను రోడిన్ పెళ్ళాడాడు యాభై ఏళ్ళు ఆమెతో కలిసి జీవించి తన 68వ ఏట రోజ ను పెళ్లి చేసుకొని ఆమెకు చట్టా భద్రత కల్పించాడు .ఈ వివాహ వేడుక ముగియగానే రోజ్ కు విపరీతమైన దగ్గు వచ్చి ,గదులను వెచ్చ చేసుకోవటానికి బొగ్గు కూడా లేకుండా గడిపి కొన్ని వారాల తర్వాతా రోజ్ మరణించింది .
మహా శిల్పి మహాభి నిష్క్రమణం
భార్య రోజ్ మరణం తర్వాత రోడిన్ ఎనిమిది నెలలు మాత్రమె జీవించాడు .వాతావరణం తట్టుకోలేనిదిగా ఉండేది .విపరీతంగా దగ్గు తెరలు తెరలుగా వచ్చేది .చలి మరీ విజ్రుమ్భించింది .గడ్డకట్టే చలి బాధించింది .వేడి చేసుకొనే బొగ్గు లేదు .ఈ నరక యాతన భరిస్తూ చివరికి 17-11-1917న 77 ఏళ్ళ వయసులోఅమరశిల్పి రోడిన్ మరణించాడు .మాదన్ లో రోజ్ సమాధి దగ్గరే రోడిన్ సమాధిని కూడా ఏర్పాటు చేశారు .వారి సమాదులమీద కంచు శిల్పం ‘’ది దింకర్’’ను ఉంచారు
. రోడిన్ ‘’సర్ఫేస్ మోడలింగ్ కళ’’
1870లో ఇటలీ యాత్ర తర్వాతా అనుకోకుండా రియలిజం కు మారాడు . 1900 నాటికి రోడిన్ ఫ్రాన్స్ దేశపు మహా శిల్పి అని పించుకొన్నాడు .తర్వాత ప్రపంచ మహా శిల్పులలో ఒకడై ప్రపంచ వ్యాప్త కీర్తిని పొందాడు .ధన సంపన్నులేందరో ఆయనకు మహా శిల్పాలు తయారు చేసే బాధ్యతలు అప్పగించారు దాన్ని సార్ధకం చేసుకొన్నాడు .
నేచరిస్ట్ అయిన రోడిన్ భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత నివ్వకుండా ,వ్యక్తిత్వానికి ఎమోషన్ లకు మాత్రమె విలువ నిచ్చాడు .తరతరాల సంప్రదాయాన్ని ,గ్రీకుల ఆదర్శ వాదాన్ని వదిలేసి ,బోరోక్ నియో బోరోక్ ల డేకరేటివ్ కళను కూడా దూరం చేసుకొని తనదైన రీతిలో వృద్ధి చేశాడు ,ప్రతి శిల్పం రక్త మాంసాలతో వ్యవహరిస్తున్నట్లు గా తీర్చి దిద్దాడు .భావోద్రేకాలను అతి స్పష్టంగా వ్యక్త పరచాడు .మనిషి మానసిక స్వభావాలు అతని భౌతిక స్వరూపాలకు ప్రతి బింబాలు అని భావించాడు .రోడిన్ ది ’’సర్ఫేస్ మోడలింగ్ కళ’’అంటారు .అతను సృష్టించిన ‘’దింకర్ ‘’శిల్పాన్ని గురించి రోడిన్ ‘’అందులోని మనిషి మెదడు తో నేకాక నుదురు ,ముక్కు పుటాలు ,బిగ బట్టిన పెదిమలు ,చేతులు కాళ్ళ లోని ప్రతి కండరం ,ముడిచిన పిడికిలి బిగ పట్టిన మడమలు అన్నీ ఆలోచిస్తాయి అంటాడు .
శిల్పం లో సర్వ సత్తాక స్వేచ్చ
రోడిన్ శిల్పాలే కాదు శిల్ప ఖండాలు కూడా సర్వ సత్తాక స్వేచ్చను వ్యక్తం చేస్తాయి .శిల్ప ఖండాలైన బాహువులు లేకుండా కాళ్ళు లేకుండా ,తలలేకుండా ,చేసినవి అనూచానంగా వస్తున్న సంప్రదాయానికి తిరస్కరణలే .ఒకే మాదిరి మూస పోకడ నుండి తమకు తాము వ్యక్తిత్వం తో ప్రకాశించేట్లు చేశాడు .వీటికి ఉదాహరణలే వాకింగ్ మాన్ ,మెడిటేషన్ వితౌట్ ఆర్మ్స్ ,ఐరిస్ ,మెసెం జర్ఆఫ్ ది గాడ్స్ శిల్పాలు.
బాధ ,సంఘర్షణ ఆధునిక కళకు ‘’హాల్ మార్క్ ‘’అన్నాడు రోడిన్ . ‘’Nothing, really, is more moving than the maddened beast, dying from unfulfilled desire and asking in vain for grace to quell its passion.”’’అన్నాడు రోడిన్ .
సంగీత కళాభిమానం
రోడిన్ కు వీర ఆరాధకుడు కవి బాడరెల్ . రోడిన్ కు సంగీతం ఇష్టం .గ్లాక్ చేసిన ఒపేరా మ్యూజిక్ అంటే అభిమానం .ఫ్రెంచ్ కేతడ్రిల్స్ .పై గ్రంధం రాశాడు రోడిన్ .అందరూ మర్చిపోయిన’’ ఎల్ గ్ర్రీకో ‘’ ,అప్పటికి ఇంకా ప్రాధాన్యం పొందని ‘’వాన్ వొఘ్ ‘’ల సంగీతాన్ని స్వంతం చేసుకొన్నాడు రోడిన్ .
రోడిన్ శిల్పకళలో పరిణామం
తన శిల్పాన్ని తయారు చేయించుకొంటూ జార్జి బెర్నార్డ్ షా రోడిన్ ముందు కూర్చున్నాడు .అప్పుడు రోడిన్ ను బాగా గమనించిన ఆయన ‘’రోడిన్ అనేక అద్భుతాలను ఆవిష్కరించాడు’’అన్నాడు . .తన బస్ట్ శిల్పం తయారీలోని వివిధ దశలను గమనించిన షా ‘’ కళావిర్భావ పరిణామ దశలన్నీ చూపించాడు రోడిన్ ‘’అని శ్లాఘించాడు ‘’మొదటగా బైజాంటిన్ మాస్టర్ పీస్ లాగా ,బెర్నిని ని లాగ ,తర్వాత గొప్ప హూడన్ ల కళా సంవిధానం దర్శింప జేశాడు .అతని చేతులు ఒక శిల్పి శిల్పించే చేతుల్లా ఉండవు .’’ఎలాన్ వైటల్ ‘’చేత లాగా అంటే అంతరాత్మ చేత లాగా ఉంటుంది అన్నాడు .’’ది గాడ్ ఆఫ్ హాండ్ ‘’అనేది రోడిన్ చేతి పనే .
రోడిన్ వర్కింగ్ మోడల్
ఏ శిల్పం చేసినా మొదట మట్టి తోనే చేసేవాడు దీనికి అతి నిపుణులైన సహాయకులను పెట్టుకొనేవాడు .తర్వాత ప్లాస్టర్ తో చివరికి కంచు తో చేసేవాడు .అదీ అతని పని తీరు .ఈ విధం గా 19 వ శతాబ్దపు శిల్ప కళ దానికి ప్లాస్టర్ ను వాడే తీరుకు నాంది పలికాడు రోడిన్ .
రోడిన్ ప్రత్యేకత
శిల్ప కళను సంప్రదాయ విధానానికి భిన్నంగా తీర్చి దిద్దాడు రోడిన్ .రిపిటీషన్ నుంచి దాన్ని తప్పించాడు .20 వ శతాబ్దపు శిల్పకళకు దారి చూపాడు . His popularity is ascribed to his emotion-laden representations of ordinary men and women – to his ability to find the beauty and pathos in the human animal.
రోడిన్ జీవితకాలం లో అతన్ని మైకేల్ ఆంజేలో తో పోల్చేవారు .ఆ యుగపు గొప్ప శిల్పి అని భావించారు .రోడిన్ చనిపోయిన మూడు దశాబ్దాలకాలం లో ఆయన్ను అందరూ మర్చిపోయారు .1950 నుంచి రోడిన్ ఆరాధన మళ్ళీ ఊపు అందుకొన్నది .ఆధునికకాలపు మహా శిల్పి అని గుర్తించారు .రోడిన్ చేసిన’’ వాకింగ్ మాన్ ‘’శిల్పం 20 వ శతాబ్దపు ‘’ఆముక్త కళ’’ అంటే ఆబ్ స్ట్రాక్ట్ స్కల్ ప్చర్ ఆర్ట్ కు మార్గ దర్శకమైంది .
![]()
![]()
![]()
![]()
![]()
బాల్జాక్ శిల్పం
![]()
![]()
జాన్ బాప్టిస్ట్
![]()
the thinker
మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం
![]()
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 –ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50
20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2
మానవ శరీరం సర్వం సుందరమే
వాల్ట్ విట్మన్ మహాకవి కి లాగానే రోడిన్ కు కూడా మానవ శరీర భాగాలలో అందంగా ఉండనిది ఏదీ లేదనే భావం ఉంది .జీవితం లోని అతి సూక్ష్మ విషయాల పరిశీలన కూడా అవసరం అనేవాడు .రోడిన్ కు సెక్రెటరి గా పని చేసిన రైనర్ మారియా రిల్కే ‘’Rodin grasped life in its smallest details –he observed it and it followed him –he awaited it at the cross roads where it lingered ,he over took it as it ran before him –he found it in all places equally great ,equally powerful ,and over whelming ‘’అని అతని తత్వాన్ని బాగా అధ్యయనం చేసి చెప్పాడు .రోడిన్ శరీరం అనేక పరీక్షలకు లోనైంది .ఎడారులు అందులో ప్రాకాశించాయి .ఆకలి దాన్ని బాధగా చూపింది .దప్పిక కూడా వదలలేదు .ఇవన్నీ తట్టుకొని నిలబడి గట్టి వాడయ్యాడు .అతను వంగితే పటకార లాగా కనిపిస్తాడు. నడుస్తుంటే ప్రపంచ దూరాలన్నీ అతని తోనే ఉన్నాయని పిస్తుంది .అతని అడుగు బలంగా ద్రుఢం గా పడేది .అటూ ఇటూ ఊగుతుంటే అతనిబాహువులు అతని అడుగులను గురించి మాట్లాడుతున్నట్లుండేది .గాలిలో తేలిపోయినట్లు నడిచేవాడు .
మార్బుల్ మాస్టర్
కళలో ఎదుగుతున్న కొద్దీ రోడిన్ సున్నితత్వాన్ని శిల్పాలలో తెచ్చాడు .ఇ౦ ప్రెషనిస్ట్ చిత్రకారుడు గా అనిపించేవాడు .అతని తీరును నిశితంగా పరిశీలించిన అమెరికా విమర్శకుడు జేమ్స్ హన్కర్ ‘’the edges of certain parts were amplified ,deformed ,and falsified to ensure the undulating appearance of life ‘’అని చెప్పాడు .అతని ఆలోచన అస్పష్టం అనిపిస్తుంది .శిల్పం లో ఒక ధ్యాన యోగం ఉంటుంది. అదే అతని గొప్ప చిత్ర నిర్మాణ విధానం .అతనికి పాలరాయి అంటే మార్బుల్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే అతడిని శిల్ప నిర్మాణం లో పరాకాష్టకు చేర్చింది .అతను రూపొందించిన శిల్పాల శిరస్సులు , శరీర భాగాలు పుష్ప సౌందర్యాన్ని సున్నితత్వాన్ని గుర్తుకు తెచ్చి మార్బుల్ అతని చేతిలో మట్టి, మైనం అయి అనేక రూపాలు దాల్చి౦దే మోనని పిస్తుంది .అంత లావణ్యం గా రోడిన్ శిల్పాలుంటాయి .
శిలా మహా కావ్యం
నలభై ఏళ్ళ వయసులో రోడిన్ పొట్టిగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండేవాడు .అతని గడ్డం మాత్రం భలే తమాషాగా ఉండేది .అది నెరసిన తర్వాత ఓల్డ్ టెస్ట్ మెంట్ ప్రాఫెట్ లాగా కనిపించేవాడు .ఇంకా బాగా చెప్పాలంటే ‘’గాలిక్ హాన్స్ సాచ్’’ లా ఉండేవాడు .అద్భుత కళాఖండాలు సృష్టించాలని భావించాడు రోడిన్ .అందుకోసం మొదట ‘’గేట్ ఆఫ్ హెల్ ‘’అనే భారీ ప్రాజెక్ట్ తీసుకొని ఇరవై ఏళ్ళు దానిపైనే పని చేశాడు .ఆ శిల్పం లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చనవారు దాన్ని ‘’ఎపిక్ ఇన్ స్టోన్ ‘’అన్నారు .అంటే ‘’శిలా మహాకావ్యం’’ అని వేనోళ్ళ కీర్తించారు .డాంటే కలగన్న అన్ని భావాలకు ఈ శిల్పం ప్రతీకగా ఉందని మెచ్చుకొన్నారు .విషయ స్పృహ లో నుంచి అలౌకిక స్పృహకు దారి తీసింది ఆ శిల్ప చాతుర్యం .దీని తర్వాత అనేక అద్భుత శిల్ప రచన చేశాడు రోడిన్ .అందులో ‘’ఆడం అండ్ ఈవ్ ‘’,పోలో అండ్ ఫ్రాన్సిస్కా ‘’,ఉగాలినో ‘’,వరుస శిల్పాలను మిగిలినవాటిలో ముద్దు వంటివి –(కిస్ అమాంగ్ అదర్స్) అంటారు .దీనినే రోడిన్ ‘నోవాస్ ఆర్క్ ‘’అన్నాడు .కొందరు మాత్రం లాస్ట్ జడ్జి మెంట్ కు భయంకర రూపం అన్నారు .మరికొందరు మైకెలాంజిలో –మెడిసి కోసం డిజైన్ చేసి రూపొందించిన అసంపూర్తి సమాధులు అన్నారు .
త్యాగధనుల శిల్ప సృష్టి
యాభైలలో రోడిన్ కాలం బహు ఫలవంత మైన కాలం .పోర్ట్రైట్ ,కంచు విగ్రహాలు ,స్మృతి చిహ్నాలు తయారు చేయటానికి చాలా ఆర్డర్లు వచ్చాయి .నగరాలు అక్కడి హీరోల ,చారిత్రిక పురుషుల విగ్రహాలు తయారు చేసి వారికీర్తిని ఇనుమడింప చేయమని కోరాయి .అలాంటి వాటిలో నాన్సీ టౌన్ క్లాడ్ లోర్ర్రైన్ స్మృతి చిహ్నం ఒకటి .డాం విల్లర్స్ కోసం బాస్తిన్ లేపెజ్ విగ్రహం ,కలైస్ కోసం ‘’దిబర్గర్స్ ఆఫ్ కలైస్’’శిల్పించి అమోఘం అని పించుకొన్నాడు .వీళ్ళందరూ కూడా చారిత్రాత్మక మహా పురుషులే .వీరు పద్నాలుగో శతాబ్దం లో నగరం ఆకలి బారిన పడకుండా మూడవ ఎడ్వర్డ్ రాజుకు తమల్ని తాము బలి చేగా ఆత్మ త్యాగం చే సుకొన్న వీరులు ధీరులు దీరోదాత్తులు త్యాగ దనులు మహా పురుషులు .ఈ ఆరుగురిని ఒక బృందంగా ముందు శిల్పించి ఆ తర్వాత విడివిడిగా ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దాడు .వారి త్యాగాలను అజరామరం చేశాడు రోడిన్ .అందర్నీ ఒకే వరుసలో కాకుండా రెండు నాటకీయ వరుసలలో ఉంచి అందులో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప ప్రదర్శనలో పాల్గొని తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ సామూహిక౦ గా కదులుతున్నట్లు చేశాడు ఈ ప్రతిభకే అందరూ జేజేలు పలికారు .చిరస్మరణీయం చేశాడు వారి జీవితాలను రోడిన్ . శిల్ప విషయమై చెబుతూ రోడిన్ ‘’sculpture is the heart of hole and the lump .’’అన్నాడు ఈ హోల్ మరియు ల౦ప్ అనే పదాలను మొదటిసారిగా సృష్టించి,ప్రయోగాలు చేసి శాశ్వత కీర్తి పొందారు . శిల్పించి వాటి ప్రభావం ఎలాంటిదో చూపించాడు రోడిన్ .రోడిన్ సిజాన్నే లు అలౌకిక కాంతి నిర్మాణం లో అజరామరంయ్యారు .ఈ ఇద్దరు శిల్ప మేధావులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నారు విశ్లేషకులు .రాబిన్ ‘’క్యూబిక్ ట్రూత్ ‘’కు ప్రాధాన్యత నిచ్చాడు .ఇదే స్థల దేశాలకు గణిత పరమైన గౌరవం అత్యంత ఉత్కృష్టమైన సమతుల్యతః తెచ్చాయి .రోడిన్ గొప్పతనాన్ని ‘’he carved the air as well as the surface of the stone to bring out ‘’the latent heroic in every natural movement ‘’ అని గొప్పగా అభి వర్ణించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 -ఉయ్యూరు
హైదరాబాద్, జూన్ 24: ప్రముఖ సాహితీవేత్త, సంస్కృత భాషలో నిష్ణాతుడు పుల్లెల శ్రీరామచంద్రుడికి నగరంతో విడదీయలేని బంధం ఉంది. తూర్పు గోదావరి జిల్లా హిందూపల్లి వాస్తవ్యులైన ఆయన కొంతకాలం స్వస్థలంలో పనిచేసినా, ఆ తర్వాత నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో లెక్చరర్గా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ సేవలందిస్తూ క్రమంగా ప్రొఫెసర్గా, ఆ తర్వాత సంస్కృత విభాగానికి అధిపతిగా ఎదిగి మరువలేని సేవలందిస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. జి.పుల్లారెడ్డి ట్రస్టు తరపున భాషా వికాసం, సాహితీ, సంస్కృతి పరిరక్షణల కోసం నగరం వేదికగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దీంతో పాటు సంస్కృత భాష ప్రచారం, దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుల్లో పుల్లెల ఒకరు. బుధవారం సాయంత్రం ఆయన కనుమూశారన్న సమాచారం తెలవటంతో ఐఏఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్తో పాటు పలువురు సాహితీప్రముఖులు జూబ్లీహిల్స్ ఐటికాలనీ సమీపంలో ఉన్న ‘నందనవనం’ భవన సముదాయంలోని ఆయన నివాసానికి చేరుకోవటంతో అక్కడ విషాదం అలముకుంది. పలువురు ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. సంస్కృతాంధ్ర భాషలో ఆయన చేసిన రచనలు, భాష వికాసం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మొత్తం 25 రచనలు చేసి, అందులో ఓ రచనకు రాష్టప్రతి పురస్కారాన్ని పొందారు. రచనల్లో ఎక్కువ అనువాదాలు చేశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అంతేగాక, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించిన గొప్ప సాహితీవేత్త పుల్లెల శ్రీరామచంద్రుడు.
పాలగుమ్మి పద్మరాజు ఆదర్శనీయుడు
కాచిగూడ, జూన్ 24: ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవ సమాపన సభ తెలుగు రథం, శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సిక్కిం మాజీ గవర్నర్ వి.రామరావు విచ్చేశారు. పాలగుమ్మి పద్మరాజు మానవీయ విలువలు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచనలు నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉందని అన్నారు. కవిగా, చిత్ర రచయితగా, నవల నాటకకర్తగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. ‘బంగారుపాప’, ‘అంతర్జాతీయ కథకుడు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వసాహితి అధ్యక్షుడు డా.పోతుకూచి సాంబశివరావు, లేఖిని మహళ చైతన్య సాహితీ సంస్థ అధ్యక్షురాలు డా.వాసా ప్రభావతి, రచయిత విహారి, పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్న, సంస్థ అధ్యక్షుడు కొంపెల్లి శర్మ, డా.వేదగిరి రాంబాబు పాల్గొన్నారు.
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49
20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్
అగస్టీ రోడిన్ శిల్పాలను మొదట తిరస్కరించిన వారే ఆ తర్వాత మహా గొప్ప శిల్పి అని ఆరాధించారు .గౌరవించారు సత్కరించారు .మళ్ళీ అతి తక్కువ చేసి మాట్లాడారు .దూషణ భూషణలు ఆయన జీవిత సముద్రం లో కెరటాలయ్యాయి .పావు శాతాబ్దికాలం ఆయన సృజన అంతా పెద్దగా ఆమోదం పొందలేదు .పై పెచ్చు అలక్ష్యం చేశారు కూడా .కొన్నేళ్ళ తర్వాత ప్రతిభను గుర్తించి అగ్రాసనం మీద కూర్చో బెట్టారు .అంతే కాదు 19 వ శతాబ్దపు అత్యుత్తమ శిల్పి అని ,అన్నికాలాలలోని మహా శిల్పుల లో ఒకడు అని వీర తాళ్ళు వేశారు .ఇదీ లోక రీతి .
మట్టి బొమ్మల శిల్పి
12-11-1840 లో పుట్టిన ఫ్రాన్కోస్ అగస్టీ రెనో రోడిన్ ఫ్రాన్స్ లోని పారిస్ లో పురాతన గోధిక్ లక్షణాలున్న జన సమూహం ఉన్న ప్రాంతం లో పుట్టాడు . తల్లి లోరైనీ నుండి తండ్రి నార్మన్ జాతికి చెందిన పని వారి కుటుంబం లోంచి వచ్చారు .ఆ జిల్లాలో రోడీన్లు అతి పేదవారుగా గుర్తింపు పొందారు .రోడిన్ కు అందువల్లనే 13 వ ఏట నుండి సరైన స్కూల్ విద్య నేర్చుకొనే అవకాశం లేక పోయింది .చిన్నతనం నుండి డ్రాయింగ్ బొమ్మలు గీయటం అతనికి అంది వచ్చిన వరం అయింది .తల్లి గ్రోసరీ షాప్ నుండి తెచ్చే సరుకుల పొట్లాల పేపర్ల పై ఉన్న కామిక్ బొమ్మలను చూసి రోడిన్ కాపీ చేసేవాడు .తర్వాత వాటిని తన స్వయం కృషి తో బాగా గీసేవాడు .ఇది గమనించిన తలి దండ్రులు రోడిన్ మాంచి కమర్షియల్ ఆర్టిస్ట్ అవుతాడని సంబర పడ్డారు .ఇంటి దగ్గర స్పెషల్ టీచర్స్ ను పెట్టి అతని చిత్ర నైపుణ్యాన్ని పెంచే స్తోమత వారికి లేదు .అందుకని అతని ఆసక్తికి ఊతం గా డేకరేటివ్ ఆర్ట్ లో శిక్షణ నిచ్చే’’ పెటైట్ ఈకోల్ ‘’లో చేర్పించారు .పెన్సిల్ డ్రాయింగ్ అంటే అసలు ఇష్ట పడని రోడిన్ మట్టి బొమ్మలు చేయటం లో ఆసక్తి చూపించి అదే తన జీవిత గమ్యం అనుకొన్నాడు .
పోర్సిలీన్ శిల్పి
18 వ ఏట ఈకోల్ బీక్స్ ఆర్ట్స్ లో చేరటానికి ప్రయత్నింఛి పరీక్ష రాశాడుకాని ఫలితాలు దారుణం గా ఉన్నాయి .మూడు సార్లుప్రవేశ పరీక్షరాసి తప్పాడు .ఇది చూసిన తలిదండ్రులు నీరు కారిపోయారు .అరకొర సంపాదనతో బతుకు బండీ ఈడుస్తున్న తండ్రి కొడుకును ఆ సంస్థకు పంపటం మానేశాడు .రోడిన్ తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్తితి వచ్చింది .ఏదో ఉద్యోగం చేసి పొట్టపోసుకోవాలి .మట్టి బొమ్మల తయారీలో అప్ర౦టిస్ గా ,జర్నీమాన్ గా, ఆర్నమెంట్ వర్కర్ గా పని చేశాడు .కాపీయిస్ట్ గా ,స్పైరల్ స్క్రోల్స్ తయారీలో అనేక చోట్ల పని చేశాడు .ప్రముఖ జంతు శిల్పి ఆటోయిన్ లూయీ బారీ దగ్గర పని చేసి తాను బారీ శిష్యుడిని అని చెప్పుకోనేవాడు .తర్వాత’’మోల్డర్ ‘’అవతారం ఎత్తాడు .తర్వాత సెవ్రెస్ లో ఉండే పోర్సేలీన్ ఫాక్టరీకి డిజైన్లు తయారు చేసే కారియర్ బెల్లీస్ దగ్గర చేరాడు .ఇక్కడే చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయటం ,జంతు భాగాలు కూర్చటం ,బొమ్మలకు అలంకరణ చేయటం నేర్చుకొన్నాడు .తర్వాత మూస పని(మోల్దింగ్) అలవాటు అయింది .ఈయన దగ్గరే అయిదేళ్ళు ఉన్నాడు .రెండు డాలర్ల నెల అద్దె ఇచ్చి ఒక గుర్రపు శాలలో గడిపాడు .అది చీకటి గుయ్యారం .దానికి ఒక చివర పెద్ద బావి ఉంది .తాను ఇక్కడే ఉండి పని చేయాల్సిన వాడు కనుక తానే ఆ నూతిని పూడ్చేశాడు రోడిన్ .
ముక్కు తెగిన మనిషి బొమ్మ
వయసు ఇరవై అయిదు వచ్చింది .నాగలి పట్టి దున్నే వాడుగా మొరటుగా కనిపించేవాడు .ముక్కు ఫ్లాట్ గా ఉండేది .ఒక బస్ట్ విగ్రహాన్ని చేసి ‘’ముక్కు తెగిన మనిషి ‘’అని పేరు పెట్టి1864 లో సెలూన్ కు తీసుకెళ్ళాడు .దాన్ని వాళ్ళు తిరస్కరించటమే కాదు తిట్టి పంపించారు .యదార్ధాన్ని ప్రతి బించి చేసిన శిల్పాన్ని వాళ్ళు మెచ్చుకోలేక పోయారు .అతను ‘’far too naturalistic and that he had mistaken the medium ‘’ అన్నారు విమర్శకులు .నిరాశ తోమళ్ళీ గురువు గారి దగ్గర చేరి కొన్నేళ్ళు పని చేశాడు .తన ప్రజ్ఞను కనబరుస్తూ లలితమైన ,అనుకరణాత్మకమైన చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్మి జీవనోపాధి పొండాడు .1870లోపర్షియన్ వాళ్ళు పారిస్ ఆక్రమణ కోసం చేసిన దాడిలో నేషనల్ గార్డ్ గా పని చేశాడు .ఫ్రాంకో పర్షియన్ యుద్ధం ముగియ గానే బెల్జియం వెళ్ళాడు .అక్కడ బెల్జియన్ శిల్పి వాన్ రాస్ బోర్గ్ దగ్గర శిల్ప నిర్మాణం లో మెళకువలు నేర్చాడు .
మోడల్ భార్య
ఒక సారి పారిస్ అవతల ఒక బిల్డింగ్ వర్క్ చేస్తుంటే అందమైన కళ్ళున్న అమ్మాయి కనిపించింది .ఆమెకు 19 .పేరు రోజ్ బ్యూరేట్ .’’రోజ్ అంత బ్యూటీ’’అనుకొన్నాడు . ఆమె కుటుంబం వారు చా౦పేన్ లో రైతులు .పారిస్ లో సీస్మిస్త్రేస్ గా పని చేయటానికి వచ్చింది . ఆమెను మోడల్ గ పెట్టుకొని బొమ్మలు తయారు చేస్తూ ఇద్దరూ ప్రేమలో పడగా ఆమె అతనికో పిల్లాడిని’’ కని ‘’ పెట్టింది .ఈమెను అతని తలిదండ్రులు ఆదరించారు. అందరూ కలిసి బతికారు .ఆమె సైనికులకు చొక్కాలు కుట్టి సంపాదించేది .ఆ డబ్బుతో కొడుకు ను సాకేది .అప్పుడప్పుడు మొగుడు పెళ్ళాలు పోట్లాడుకోనేవారు. ఆమెలో సహనం ఎక్కువ .రోడిన్ మాత్రం బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించేవాడు. అతని తలిదండ్రులు ఆమె పక్షంగా మాట్లాడేవారు .కాలం గడిచిన కొద్దీ తాను ‘’ప్రకాశించే సూర్యుని కి ఛాయ మాత్రమె ‘’అని గ్రహించింది .అతను ఆమెను మంచీ చెడు తెలిసిన ఇల్లాలు అని కోపం అసూయ ,అనుమానం ఉన్నా ప్రేమ గుణం ఉందని ,సత్యాసత్య వివేకం తెలిసిన దొడ్డ ఇల్లాలని చెప్పాడు .వారిద్దరిది అలౌకిక ఆత్మీయ ప్రేమ అంటారు .మోడల్ గా వచ్చిన అమ్మాయి మోడల్ భార్య అయింది రోడిన్ కు .
సహజం నుండి అసహజానికి
1877లో సలూన్ రోడిన్ శిల్పాన్ని ప్రదర్శించటానికి అనుమతి నిచ్చింది .దానిపై 18 నెలలు తీవ్రం గా ద్రుష్టి పెట్టి పని చేశాడు .దీనికి ‘’కంచు యుగం ‘’(ఏజ్ ఆఫ్ బ్రాంజ్ )అని మొదట పేరు పెట్టి తర్వాత’’ప్రక్రుతికి మానవుడి జాగృతి ‘’(మాన్ ఎవేకేనింగ్ టు నేచర్ )అని మార్చాడు .దీన్ని చూసిన నిర్వాహకులు పెదవి విరిచారు .వారికి కావాల్సిన లలిత సుందర నగ్న శిల్పం కాదు అది .వెంటనే తిరస్కరించి ‘’too precise ,too realistic ‘’ అని వ్యాఖ్యానించారు .అది సృజనాత్మక శిల్పం కాదని అన్నారు .ఆ రోజుల్లో ఇవి సాధారణమే . .నకిలీ శిల్పాలు చేస్తున్నకాలమే అది . ఈ ఆరోపణను చాలెంజ్ గా తీసుకొన్నాడు రోడిన్ .ఒక నాయకుడి శిల్పాన్ని తయారు చేసి మామూలు గా జీవితం లో కనిపించే నగ్నత్వం కన్నా ఇంకా ఎక్కువ నగ్నం గా తీర్చిదిద్ది ‘’నడుస్తున్న మనిషి ‘’అని పేరు పెట్టాడు .కాని శిల్ప విశ్లేషకుడు అక్టేవియాన్ మిరాబూ కు ఇది ‘’సెయింట్ జాన్ ‘’పోలికలున్న శిల్పం అని పించింది .ఈ జాన్ గారే తర్వాత ‘’సెయింట్ జాన్ బాప్టిస్ట్ ‘’గా ప్రసిద్ధుడయ్యాడు .సుప్త స్థితిలో ఉన్న శీలా సజీవ చైతన్య రూపం దాల్చింది రోడిన్ చేతిలో .రోడిన్ లో ఆత్మ స్థైర్యం ఒక్కసారిగా పెల్లుబికింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-15 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .
భర్త్రు మెంద గా ప్రసిద్ధుడైన ఈ కవిని కొందరు కాళిదాసు కంటే ఘనుడు అని తమకావ్యాలలో పేర్కొన్నారు .మెంద అనే పదానికి అర్ధం ఏనుగును నడిపే మావటి వాడు అని .జల్హనుడు తన సూక్తి ముక్తావళి లో రాజ శేఖరుడు ఈ విషయం పై రాసిన శ్లోకాన్ని ఉదాహరించాడు .మిగిలిన చరిత్రకారులు కూడా ఈకవిని మెంద అనే పేరుతోనే పిలిచారు .’అతని ’హస్తి పాల ‘’మొదలైన వాటిలో అడవి ఏనుగులను ఏ విధం గా మాటు పెట్టి గోతులలో పడేట్లు చేస్తారో వివరింప బడి ఉంది .దీన్ని బట్టి మెంద కు కు ఈ విద్య తో సంబంధం ఉన్నట్లు తోస్తుంది .
కల్హణుడు మెంద ను కాశ్మీర్ రాజు మాతృ గుప్తుని ఆస్థానం లో ఉన్నట్లు రాశాడు .మాతృ గుప్తునికాలం క్రీ శ.430 గా భావిస్తే ఈకవి ఆ కాలం లో జీవించాడని చెప్పచ్చు . మృచ్చ కటికం ‘’లి౦ఫ తీయ తమొంగూని ‘’అనే ప్రసిద్ధ శ్లోకం లో ను ,అవిమారకుని బాల చరితం లోను ,కావ్యాదర్శం లోను ,సారంగ ధర పద్ధతిలోను విక్రమాదిత్యుడు ,మెంధతో కలిసి కావ్యం అల్లినట్లు ఉంది .దీనితో మళ్ళీ కాలానికి గొళ్ళెం పెట్టాల్సోస్తోంది .ఏతా వాతా తేలిందేమిటంటే మెందకవి విక్రమాదిత్యుని కాలం వాడే నని .మంఖ కవి ‘’శ్రీ కంఠ చరిత్ర ‘’లో మెందను సుబందు ,భారవి, బాణులతో తో ముడిపెట్టాడు.రాజ శేఖరుడు మాత్రం ఆయన్ను వాల్మీకి అవతారం ఆ తర్వాత భవ భూతి అవతారమని చివరికి తాను కూడా మెంద అవతారాన్నే అని మెచ్చుకొని చెప్పుకొన్నాడు .దీన్ని బట్టి మెంద కవి 100 అధ్యాయాల ‘’రామ చరిత్ర ‘’రాశాడని తేల్చారు .దీని వ్రాత ప్రతి నకలు ఇప్పటికీ బెనారస్ విశ్వ విద్యాలయం లో భద్రం గా ఉందని క్రిష్ణమాచారియార్ రాశారు . .
153-సరస్వతీ పుత్ర-భట్టార హరిశ్చంద్ర
హర్ష చరిత లో బాణ కవి భట్టార హరిశ్చంద్ర కవి ని మెచ్చుకొన్నాడు .హరిశ్చంద్రకవి ‘’మాలతి ‘’అనే ప్రేమ కావ్యం రాశాడు .కనుక ఇతను ఐదవ శతాబ్ది కవి అని అనుకోవచ్చు .’’సదుక్తి కర్ణామృతం’’ లో ఈకవి మహాద్భుత కవిగా పేర్కొన బడ్డాడు .మహా కవుల సరసన చేర్చారు .చాటు పద్యాలలో ఈ కవి శ్లోకాలు విశేషం గా కనిపిస్తాయి .ఈ భట్టార హరిశ్చంద్ర కవి దిగంబర జైన మతానికి చెందినవాడు .తండ్రి ఆర్ద్ర దేవుడు .తల్లి రాధ .సోదరుడు లక్ష్మణ .వీరిది కాయస్తకులం లోని సనోముఖ కుటుంబం .ఈ కవి పాండిత్య ప్రకర్షకు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం అందుకొన్నాడు .ఈకవిని రాజశేఖరుడు ‘’కర్పూర మంజరి ‘’లో పేర్కొన్నాడు .ఇతను ‘’ధర్మ సార మహాభ్యుదయం ‘’అనే 21 ఖండాల కావ్యాన్ని పదిహేనవ తీర్ధ౦కరుడైన ధర్మ నాధుని జీవిత చరిత్రగా రాశాడు .ఇందులో ధర్మపాలుని జననం నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .నాయకుడైన ధర్మనాధుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రత్న పుర రాజు మహాసేనుడు భార్య సువ్రతి ల కుమారుడు .హరిశ్చంద్ర కవి కవిత్వం మాధుర్యానికి నిలయం .స్వచ్చమైన తేట యైనకవిత్వం రాశాడు .
భట్టార హరిశ్చంద్ర కవి ‘’జీవనాధార చంపు ‘’ను కూడా 13 లంభాలలో జైన రాజు జీవనాదారుని జీవిత చరిత్ర గా రాశాడు.ఈ జీవనాధరుడు సత్య౦ధర రాజు కుమారుడు .ఇందులో కవి ఉపయోగించిన భాష ఆకర్షణీయం గా ,అత్యుత్తమంగా ఉందని విమర్శకులు కీర్తించారు .టి ఎస్ .కుప్పుసామి గారు ఈకవి ‘’జీవనాధార చరిత్రం ‘’అనే నాటకం కూడా రాశాడని తెలియ జేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-15 –ఉయ్యూరు
1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ”
—
|

జైన తీర్థంకరుల స్ఫూర్తితో ఒరిస్సాలోని ఉదయగిరిలో రూపుదిద్దుకున్న రాతి కట్టడాలు కాలక్రమంలో 20 హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. గుప్తుల కాలంలో మహావిష్ణు దశావతారాలను ఉదయగిరి గుహల్లో చెక్కారు. దశావతారాలతోపాటు విఘ్నేశ్వరుడు, శివుడు, దుర్గామాత పది చేతులున్న విగ్రహాలు ఒకే భారీ రాతిపై మలిచారు.
అతిలోతైన చెరువు
అమెరికాలోని అతి లోతైన సరస్సు క్రేటర్ సరస్సు. ఓరెగాన్ రాష్ట్రంలోని ఈ సరస్సు లోతు 1,932 అడుగులు (589 మీటర్లు) అంటే ఈఫిల్ టవర్ లాంటి ఎతె్తైన నిర్మాణాలను రెండింటిని ఈ సరస్సులో నిలువునా ముంచవచ్చునన్నమాట.
ఎస్కిమోలు, ఇన్యూట్లు
రష్యా ఈశాన్యపు కొసన అలాస్కాలో ఎస్కిమోలు జీవిస్తున్నారు. ఇన్యూట్ తెగ ప్రజలు ఉత్తర కెనడా ప్రాంతమైన నునావుట్, గ్రీన్లాండ్లలో ఉంటారు. నునావుట్ అంటే వారి భాషలో ‘మా భూమి’ అని అర్థం.
|

ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు 70 కి.మీ. దూరంలో యమునానదీ తీరానగల బటేశ్వర్లో దాదాపు 40 దేవాలయాలున్నాయి. ఇక్కడ ఏటా శీతాకాలంలో జరిగే క్యాటిల్ ఫెయిర్కు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఇవన్నీ శివాలయాలే. ఈ దేవాలయాల సముదాయం 1300 సంవత్సరాల కాలం నాటిది కావడం విశేషం.
నలంద
ఆనాడు ప్రపంచానికి విద్య, విజ్ఞానం అంటే ఏమిటో సరిగా తెలీని రోజుల్లోనే ఒక మహా విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద. వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రదేశాల నుండి వచ్చి అధ్యయనం చేసేవారు. ఇది పూర్తిగా గురుకుల తరహాగా ఉండేది. వేల సంవత్సరాల క్రితమే దాదాపు వంద రకాల విభిన్న శాస్త్రాలను అక్కడ బోధించేవారు. గౌతమ బుద్ధుడు పలు పర్యాయాలు నలందను సందర్శించాడు.
వైశాలి
గంగాతీరంలో ఉన్న బీహార్ సారవంతమైన భూమి. ఎటు చూసినా పచ్చని చెట్లు, తోటలు. ఇక్కడే గౌతముడు రత్నసూత్రాన్ని బోధించాడు. మహిళలకు సన్యాస దీక్షను తొలిసారిగా బుద్ధుడు ప్రసాదించింది ఇక్కడే. తన పెంపుడు తల్లి గౌతమిని తొలి సన్యాసినిగా, శిష్యురాలిగా స్వీకరించడం విశేషం.
కపిలవస్తు
ఇది నేటి ఉత్తరప్రదేశ్లో ఉంది. బుద్ధుడు తన జీవితంలోని మొదటి 30 సంవత్సరాలు గడిపింది ఇక్కడే. నాటి సిద్దార్థుని సౌధం, శిథిలాలు నేటికీ కనిపిస్తుంటాయి. ఆ శిథిల సౌందర్యాలనుబట్టి ఆనాడు ఆ రాజసౌధాలు ఎంతటి అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
కందిరీగ
పెప్సిన్ అనే ఆడ కందిరీగ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టే ముందు అది ఒక సాలెపురుగును వెదుకుతూ వెళుతుంది. బాగా లావైన టరాంటురా సాలె పురుగు కనిపించగానే దాని మీద వాలి కాటేస్తుంది. ఆ విష కాటుకు సాలె పురుగు చనిపోగానే దానిని గొయ్యి తవ్వి పాతి పెడుతుంది. పాతిపెట్టిన చోట గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి పెరిగి వచ్చే లార్వా సాలెపురుగు అవశేషాలను భుజించి కందిరీగగా పరిణామం చెందుతుంది.
టొబాగో ద్వీపం
వెస్టిండీస్ ద్వీపాల్లో ఒకటైన టొబాగో ద్వీపం, బ్రిటీష్, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ పరిపాలనలలో ఒకరి నుండి మరొకరికి 31సార్లు మారి రికార్డు సృష్టించింది. కరేబియన్ సముద్రంలో నౌకాదళానికి టొబాగో ద్వీపం ఒక కీలక స్థావరం కావడం మూలాన ఈ దేశాలు ఆ ద్వీపం మీద ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. 1819లో బ్రిటన్ ఈ ద్వీపాన్ని ట్రినిడాడ్ ద్వీపంతోపాటు మత సామ్రాజ్యంలోకి చేర్చుకుంది. 1962 దాకా ఈ ద్వీపానికి స్వాతంత్య్రం లభించలేదు.
|

ఎంతో అందమైన స్విట్జర్లాండ్లోని మరింత అందమైన రియాస్ నది ప్రకృతి సంపదకు నిలయం. అంతేకాదు! ఇక్కడ గల ఒక విచిత్రమైన వంతెన గురించి వినిపించే కథలు భయాన్నీ, ఆసక్తినీ కలిగిస్తాయి.
ఎందుకంటే ఈ ప్రాంతంలోని షాలొనెన్ జార్జ్ అనే చోట గల టిఫెల్స్బ్రక్ అనే వంతెన చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి అక్కడి రియాస్ నది ఉన్న ప్రాంతాన్నీ, దగ్గరలోని సెయింట్ గోట్జర్డ్ను కలుపుతూ ఊళ్లోకి వెళుతుంది.
రియాస్ నది దగ్గర నుండి ఊర్లోకి వెళ్లాలంటే ఈ బ్రిడ్జే ఆధారం. అక్కడ వంతెన నిర్మించాలని 1230లో అప్పటి అధికారులు భావించారు. నిర్మాణ పని వారిని పిలిచారు. వారు వచ్చి ఎంతో దిగువగా ఉన్న ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించడం అసాధ్యం అని తేల్చేశారు.
ఎందుకంటే రియాస్ నదిని ఆనుకుని ఉన్న కొండని తొలిచి రహదారి వేశారు. ఆ రహదారి కొనసాగింపుగా బ్రిడ్జి నిర్మించి, ఊర్లోకి వెళ్లేలా వంతెన ఉండాలని ప్లాన్. అయితే నిట్టనిలువునా ఉండే కొండని కలుపుతూ, నది మీదుగా బ్రిడ్జి నిర్మించడం అసాధ్యమని పెద్దగా సాంకేతిక సౌకర్యాలు లేని అప్పటి నిర్మాణరంగ పనివారు చెప్పారు.
అక్కడ బ్రిడ్జి నిర్మించడం కేవలం దెయ్యాలకే సాధ్యమని వారు పెదవి విరిచారు. అది విని అధికారులకు ఏం చేయాలో బోధపడలేదు.
సరిగ్గా అప్పుడే అక్కడొక దెయ్యం ప్రత్యక్షమయిందట. ‘మీకు కావలసిన వంతెనని నేను నిర్మించి ఇస్తాను. కానీ ఒక్క షరతు’ అని చెప్పిందట.
జరిగిన సంఘటనతో అప్పటికే బిత్తరపోయిన అధికారులు కొంతసేపటికి తేరుకుని ‘ఏమిటా షరతు?’ అని ప్రశ్నించారు.
దానికా దెయ్యం ‘నేను వంతెన నిర్మించిన తర్వాత దీనిపై నడిచే మొదటి జీవిని నేను ఆహారంగా స్వీకరిస్తాను’ అని చెప్పింది.
దానికి సరేనన్నారు అధికారులు.
అప్పుడు ఆ దెయ్యం అతి ప్రమాదకరమైన రియాస్ నదిపై అతి చాకచక్యంగా మూడు రోజుల్లో వంతెన నిర్మించి ఇచ్చిందట.
‘నేను వంతెన నిర్మించి ఇచ్చి ఇచ్చాను. మాటకు కట్టుబడి ఈ వంతెనపై నడిచే మొదటి జీవిని నాకు ఆహారంగా ఇవ్వండి’ అని చెప్పి బ్రిడ్జికి అటు చివరికి వెళ్లి కూర్చుందట.
అప్పుడు బాగా ఆలోచించిన అధికారులు, అక్కడి పెద్దలు దెయ్యం అనుకున్నట్లు మనిషిని కాకుండా ఒక మేకపిల్లని ఆ వంతెన మీదికి వదిలారట.
దానికి ఆగ్రహించిన దెయ్యం తాను కట్టిన వంతెనని తునాతునకలు చేయడానికి అక్కడున్న అతిపెద్ద బండరాయిని పైకెత్తి ఉగ్రంగా ముందుకొచ్చిందట.
అధికారులు, గ్రామస్థులు భయంతో అక్కడి నుండి పరుగులు పెట్టారు. అయితే ఎంతసేపైనా అక్కడెలాంటి బీభత్సం జరుగుతున్న అలికిడి వినిపించకపోవడంతో వెనుదిరిగి చూశారట. అప్పుడు వారికొక విచిత్రమైన దృశ్యం కనిపించింది. అప్పుడే కట్టిన వంతెనని నాశనం చేయడానికి దెయ్యం బండరాయితో వస్తుండగా, ఒక వృద్ధురాలు చేతిలో శిలువ తీసుకుని ఆ దెయ్యానికి ఎదురుగా వెళుతూ కనిపించిందట.
వృద్ధురాలి చేతిలోని శిలువని చూసిన దెయ్యం భయంతో అరుస్తూ వంతెనని నాశనం చేయడానికి పైకెత్తిన బండరాయిని పడేసి అక్కడ నుండి పారిపోయిందట.
దెయ్యం వదిలేసి పోయిన బండరాయి ఆ తర్వాత చాలా సంవత్సరాలు టిఫెల్స్బ్రక్ వంతెన వద్ద కనిపించేది. ఆధునిక కాలంలో ఆ బండరాయిని పరీక్షించి చూస్తే దాని బరువు 220 టన్నులని తేలింది. ఆ బండరాయిని 1977లో అక్కడికి దగ్గరలో మోటారు వాహనాలు వెళ్లే దారి నిర్మాణం కోసం తరలించారు. 1230లో దెయ్యం కట్టినట్లు చెప్పబడుతున్న ఆ వంతెనను ఆధునీకరించారు. ఈ బ్రిడ్జి మీద నడిస్తే అవతలికి చేరుకోవడానికి అరగంట పడుతుంది. దీని మీదుగా నడుస్తూ కిందనున్న రియాస్ నదిని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. దెయ్యం కట్టిన వంతెన గురించి తెలుసుకున్న ఎంతోమంది టూరిస్టులు ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.
|

సింగపూర్ రోడ్లపై అంతవరకు ప్రశాంతంగా పర్యటిస్తూంటే.. ఒక్కసారిగా హైదరాబాద్లోని కోఠి లేదా చెన్నైలోని పాండీబజార్కి వెళ్లినట్లు అనిపిస్తే కచ్చితంగా అది సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతమని చెప్పవచ్చు. ఢిల్లీ వాసులైతే ఇది చాందినీ చౌకా అనీ, ముంబై వారు ఝవేరీ బజారుకొచ్చామా? అని ఆశ్చర్యపోతారు.
సింగపూర్ వెళ్లిన ఏ భారతీయుడైనా మెర్లైన్ (సగం సింహం సగం చేప బొమ్మ) పర్యాటక ప్రదేశాన్ని చూడటం ఎంత సహజమో ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాన్ని చూడటం అంతే సహజం.
ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ ఇండియా ప్రాంతాన్ని ‘మోడల్ ఇండియా’ అని పిలిస్తే బాగుంటుందేమో. లిటిల్ ఇండియా బజార్కి వెళ్లగానే హిందీ, తమిళం, తెలుగు భాషలు గుప్పుమంటాయి. మన దేశంలోలాగే ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్లటం కనిపిస్తుంది. కార్ల హారన్లతోపాటు సైకిల్ గంటల శబ్దాలు వినిపిస్తాయి. ప్లాట్ఫారాలు రకరకాల వస్తువులతో నిండిపోయి ఉంటాయి. ఇంకా కొనుగోళ్ల కోసం రాతపూర్వక ఆహ్వాన బోర్డులే కాదు రండి – ఆవోబాయ్ అంటూ ప్రార్థనాపూర్వకమైన గొంతులు వినిపిస్తాయి.
సింగపూర్లోని సెరంగూన్ ప్రాంతంలో లిటిల్ ఇండియా ఉంది. ఇది సింగపూర్లోని ఇతర ప్రాంతాలకంటే సందడిగా ఉండటమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉట్టి పడుతుంది. షార్టులు, జీన్సులే కాదు లుంగీలు, ధోవతీలు, చీరలు ధరించిన వారు కనిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడి వంటశాలల ఘుమఘుమలు ఆఘ్రాణించి తీరాల్సిందే. మల్లెలు, సంపెంగలు, అరటి ఆకులు, వేరుశెనగ గంపలు, కిళ్లీలు, అటుకుల మిక్చర్ తోపుడు బండ్లు, దినపత్రికలు అమ్మే కుర్రాళ్లు, రోడ్డు పక్కన చౌకరకం రెడీమేడ్ వస్త్రాలు అమ్మేవాళ్లు, చివరకు తాయత్తులు కట్టేవారు, వాచీలు, తాళాలు రిపేరు చేసేవారు కనిపిస్తారు. కూరగాయల్లో ములక్కాడలే కాదు ములగ ఆకు, కరివేపాకు, చింత చిగురు కూడా కనిపిస్తాయి. వెండి, రోల్డ్గోల్డ్ ఆభరణాలు, మసాలా దినుసులు అమ్మకం గురించి చెప్పనే అక్కర్లేదు. అగరబత్తులు, సెంట్లు సువాసనలు ముక్కులను తాకుతూ ఉంటాయి. ఖర్జూరం బళ్లు కూడా కనిపిస్తాయి. ఈ లిటిల్ ఇండియాలో అన్ని రకాల భారతీయ వస్తువులు దొరుకుతాయి. చౌక భోజనాలు, టిఫినే్ల కాదు కాస్త ఖరీదైన భారతీయ వంటకాలు లభించే ఇండియన్ రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి. వాటి ముందు డిస్ప్లే బోర్డులు దర్శనమిస్తాయి. ఇక టేకా మార్కెట్ ఫుడ్ సెంటర్లోని తోపుడుబండ్లపై భారతీయ భోజనం, ముఖ్యంగా మటన్, చికెన్, రొయ్యల బిర్యానీలు దొరుకుతాయి. సింగపూర్లో పెద్ద సంఖ్యలో ఉండే అల్పాదాయ కార్మికులకు చౌక భోజనాలు దొరికేది ఇక్కడే. కాస్త ధర ఎక్కువైనా జోజీఆవో ఫుడ్ సెంటర్కి తప్పక వెళ్లాలి. అచ్చమైన భారతీయ సంప్రదాయ భోజనం కావాలంటే కోమలా విలాస్ రెస్టారెంట్కి వెళ్లాల్సిందే. లోయర్ సెరెంగూన్ రోడ్డు నుండి కిచనేర్ రోడ్డు వరకు ఎన్నో ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బఫైల్లో రోడ్, కెరంబూరోడ్, బలీలియా రోడ్, కరైకొడి సెంటర్, డన్లప్ స్ట్రీట్, క్యాంప్ బెల్ లైన్, హెండ్సన్ రోడ్, చందర్రోడ్, కాంసోగ్కాపూర్ రోడ్లలో షాపింగ్ చేయవచ్చు. 1950లో నెహ్రూ శంకుస్థాపన చేసిన గాంధీ మెమోరియల్ హాల్ కూడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని శ్రీలక్ష్మి మందిరం, కలియమ్మన్ మందిరం, శ్రీనివాస్ పెరుమాళ్ అనే వేంకటేశ్వర స్వామి ఆలయాల వల్ల కూడా లిటిల్ ఇండియా రద్దీ ప్రాంతంగా మారిందని చెప్పవచ్చు. లిటిల్ ఇండియా ప్రాంతానికి అండర్గ్రౌండ్ రైలు మార్గం ఉంది. స్టేషన్ నుండి బయటికి రాగానే సెంటర్ కనిపిస్తుంది. ఇది చాలా రద్దీ ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక లిటిల్ ఇండియాకి అతి సమీపంలోని ముస్త్ఫా సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది 24 గంటలూ తెరిచి ఉండే అతి పెద్ద షాపింగ్ మాల్. సింగపూర్ టూర్లో గైడ్లు ఈ షాపింగ్ కోసమే పది పనె్నండు గంటలు కేటాయిస్తారు. ఇక్కడ గుండుసూది మొదలుకొని దొరకని వస్తువంటూ ఉండదు.
సింగపూర్లో సుందరమైన భవనంగా కీర్తించే లినోంగ్సేన్ బౌద్ధ మందిరం లిటిల్ ఇండియా ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది. సింగపూర్ వెళితే మెరలైన్ సింహాన్ని, కేబుల్ కార్లనే కాదు ‘లిటిల్ ఇండియా’ను కూడా తప్పక చూడాలి.

వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన యోగా వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. గతంలో యోగాను విశ్వసించేవారు, సాధన చేసే వారు, ఆచరించేవారు ఎంతో మంది ఉన్నా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా గుర్తించడంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా సంబరాలు మొదలయ్యాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే యోగాను ఇపుడు ప్రపంచం యావత్తూ అక్కున చేర్చుకుంటోంది. యోగా ఐదువేల ఏళ్లుగా భారత్లో ప్రాచుర్యంలో ఉంది. గెలుపు స్థిరం కాదు, ఓటమితో అంతా అయిపోదు. కానీ- ప్రతి మలుపులో గెలుపును చూడాలి. ఎందుకంటే విజేతల జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిలకడ లేని పరిణామాల మీద హృదయాన్ని నిలబెట్టి విజయానికి అదే దారి అనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అలా మనసుకు అలవాటు చేసుకోవాలి. మనసును నియంత్రించి, అది మనం చెప్పినట్టు వినాలంటే దానికి ఏకైక మార్గం యోగాభ్యాసం. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్యం విషయంలో మాత్రం తీవ్రమైన అలసత్వాన్ని పాటిస్తుంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం మానేసి, తీరా రోగాలు వచ్చిన తర్వాత వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటాం. అసలు రోగమే రాకుండా నిరోధించే దివ్య ఔషధం అరచేతిలోనే ఉన్నా మనం పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధమే- యోగా. భారతీయ సనాతన ధర్మం నుండి ఆవిర్భవించి నేటికీ కొనసాగుతున్న ఆరోగ్య సూత్రమే యోగా. సనాతన ధర్మానికి ఆనవాలుగా నిలుస్తూ, సత్కర్మలు భోధించి సన్మార్గంలో నడిపించే వేదభూమిగా భారతదేశానికి మంచి పేరుంది. ఉపనిషత్తుల్లోని ఎన్నో అద్భుత మార్గాలతో జీవన విధానాన్ని అందించిన నేల మనది. ఈ జీవన విధానానే్న నేడు ప్రపంచం మార్గదర్శకంగా తీసుకుంటోంది. ఆ మార్గదర్శకమే యోగా రూపం. ప్రకృతిపరమైన సౌందర్యం, కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి కూడా యోగా యోగదాయకమైంది. యోగా కారణంగా శరీరంలో కాంతి పెరుగుతుంది. ముఖవర్ఛస్సుతో కళ పెరుగుతుంది. శరీరంలో అవసరంలేని కొవ్వు కరిగిపోతుంది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా భావిస్తున్నా, వేల ఏళ్ల సంవత్సరాల నుండి యోగా పలురూపాల్లో ఆచరణలో ఉంది. అన్ని మతాల వారు, కులాల వారూ యోగాను సాధన చేస్తున్నారు. దాన్ని తెలుసుకుని సరైన రీతిలో సాధన చేస్తే ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. యోగా సాధనకు, ఆంతరంగిక శిక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంతోమంది యోగులు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిర్వచించారు. వేల ఏళ్ల చరిత్ర… క్రీస్తుపూర్వం వంద శకం నుండి 500 శకం మధ్య కాలంలో పతంజలి యోగా శాస్త్రాన్ని రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగా సూత్రాలుగా క్రోడీకరించాడు. సూత్రం అంటే దారం. దారంలో మణులను చేర్చినట్టు యోగాశాస్త్రాన్ని పతంజలి ఒక చోట కూర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివసంహిత అందులో ప్రధాన భాగాలు, వీటిలో కర్మయోగ, జ్ఞాన యోగ, రాజయోగ, భక్తియోగ అంతర్భాగాలు. వ్యాసుడు రచించిన భగవద్గీతలో కూడా యోగాసనాలపై 18 భాగాలుగా వివరణ ఉంది. అసలు యోగా అంటే ఏమిటి? యోగం అంటే సాధన, యోగం అంటే అదృష్టం, భగవద్గీతలో అధ్యాయాలకు యోగాలు అని పేరు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగా దర్శనం కూడా ఒకటి. యోగాదర్శనానికి ప్రామాణికం పతంజలి యోగాశాస్త్రం. యుజ్ అంటే కలయిక అని అర్థం. ఇది సంస్కృతం నుండి వచ్చింది. యోగ లేదా యోగం అనే పదం యుజ్ నుండే ఉత్పన్నమైంది. యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకుని, చిత్తాన్ని ఈశ్వరునిపై లగ్నం చేసుకుని మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి సామాన్య స్థితికి చేరడం లేదా పరమార్థతత్వం అర్థం చేసుకుని ఏకాగ్రతను సాధించడమే యోగా. యోగా అంటే చిత్తవృద్ధి విరోధం. స్థిరంగా ఉండి సుఖాన్ని అనుభవించడమే యోగా. యోగాభ్యాసంతో వైరాగ్యం పోతుంది, చిత్తవృత్తులు నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా మనసును మన ఆధీనంలోకి తెచ్చుకునే యోగా సాధననే పతంజలి అష్టాంగ యోగా అన్నారు. దీనినే రాజయోగం అని అలవాటుగా చెప్పుకుంటున్నాం. పతంజలి యోగా సూత్రాలు నాలుగు అధ్యాయాలు. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అని అంటారు. మానసిక శుద్ధికి కావల్సిన యోగాలు అవి. శారీరక దారుఢ్యానికీ, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగ కూడా వివరిస్తుంది. సమాధి పద అంటే ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించడం, సాధన పద అంటే రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో తెలుసుకోవడం, విభూతి యోగ అంటే యోగ సాధనలో నైపుణ్యాన్ని సాధించడం, మోక్ష సాధన ఎలా పొందాలో తెలుసుకోవడమే కైవల్యపద. వీటన్నింటికీ ఉదాత్తమమైన మరో మార్గం అష్టాంగపద యోగం. దీనిని సాధన చేయాలంటే అనేక కఠినమైన నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఈ యోగంలో భాగంగా ఉంటాయి. అసత్యం పలకరాదు, హింసకు పాల్పడరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం తాకరాదు వంటి పలు కఠినమైన నిబంధనలు ఉంటాయి. శుభ్రత పాటించడం, సంతోషంగా, ఆనందంగా ఉండటం కూడా ఈ యోగా చేయాలంటే అనివార్యం. మనిషికి జ్ఞానం, విజ్ఞానం, అర్థం తెలియజెప్పే మహత్తర సూత్రం యోగం. ప్రతి మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీ మండలాలు 6 ప్రధానంగా ఉంటాయి. మానవుడిలో ఉండే ప్రాణశక్తి కారణంగా అతడు సజీవంగా ఉండగలుగుతాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించడం వల్ల శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. వెలువడే ఆ శక్తి పేరే కుండలినీ శక్తి. ఆ శక్తిని ప్రేరేపించడం వల్ల మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే గాక, ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడు. ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాలుగా యోగాభ్యాస ప్రక్రియలను, యోగాసనాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధునిక సమాజం దీని వల్ల ఎంతో ప్రశాంతత పొందుతోందని పరిశోధనల్లో, స్వానుభవాలతో తేటతెల్లమైంది. ఇతర వ్యాయామాలు శారీరక దారుఢ్యాన్ని మాత్రమే మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. యోగాభ్యాసం మాత్రం ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మానసిక ప్రశాంతతకు, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక వత్తిడులు తగ్గించడం, హృద్రోగం, రక్తపోటును అదుపు చేయడం, వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది. మనం దేవుళ్లను గమనించినపుడు వారు ఏదో ఒక యోగాసనంలోనే మనకు దర్శనం ఇస్తారు. యోగాపై పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రస్తావన ఉంది. దేవదేవుడైన ఈశ్వరుడు తపస్సు చేస్తున్నపుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్టు పురాణాల్లో వర్ణించారు. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే, మహావిష్ణువు నిద్రను యోగనిద్ర అంటారు. బౌద్ధ సంప్రదాయంలోనూ, జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధానపాద్ర పోషిస్తోంది. ఆశ్చర్యకరం ఏమంటే సింధు నాగరికతలో కూడా యోగా చిత్రాలను మనం గమనిస్తాం. ఇతర వ్యాయామాల కంటే భిన్నమైనది, నిబిడీకృతంగా ఆధ్యాత్మిక భావం ఉన్నది యోగాభ్యాసం. ఇదే కారణంతో దేశవిదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యం లభించింది. తేలికగా ఆచరించదగింది కావడంతో పాశ్చాత్యదేశాల్లో కూడా యోగాకు మక్కువ పెరిగింది. దీంతో భారతీయ సంప్రదాయక యోగా నిపుణులు ఇతర దేశాల్లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యోగా హిందువుల ధ్యానమార్గంగా భావించడం కూడా ఇటీవల వివాదాలకు దారితీస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యనమస్కారాలకు ఇటు క్రైస్తవుల నుండి అటు ముస్లింల నుండి అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. యోగా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించే కార్యక్రమంలో ఐక్యతను చాటుకునేలా ముస్లింలు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వివాదం లేకుండా చూడటానికి అధికారికంగా యోగా కార్యక్రమం నుండి సూర్య నమస్కారాలను తొలగించామని, నిజానికి వాటికి మతంతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం కార్యక్రమం సజావుగా జరగాలన్నదే తమ సంకల్పమని పేర్కొంది. శ్లోకాలు తప్పనిసరేమీ కాదని, వాటికి బదులు అల్లా అని ముస్లిం మతస్థులు వల్లించుకోవచ్చని కూడా సూచించింది. యోగా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడంపై కూడా కొన్ని మైనార్టీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింలు ఆచరించే నమాజ్- యోగా కాకున్నా, అందులోనూ యోగా ఉందని, నిజానికి యోగాను వ్యతిరేకించేవారు మానవాళికే శత్రువులని, యోగాకు మతానికి అస్సలు సంబంధమే లేదని మజ్లిస్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు వౌలానా సయ్యద్ కౌకబ్ మఖ్తాబా అంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలిపిన 177 దేశాల్లో 47 దేశాలు ఇస్లామిక్ దేశాలేనని గుర్తుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాల విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మతాలకు, వివాదాలకు అతీతంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావించింది. ఈ సందర్భంగా నిర్వహించే రెండు కార్యక్రమాలు ప్రపంచ రికార్డును నమోదు చేయబోతున్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థకు కూడా ప్రభుత్వం ఈ విషయమై సమాచారాన్ని పంపించింది. ఆయుష్ సంస్థ ఈ మేరకు రెండు రికార్డులను నమోదుచేయాల్సిందిగా గిన్నీస్ రికార్డ్సు సంస్థను కోరింది. 651 జిల్లాల్లో… అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ నెల 21న దేశ రాజధానిలో యోగా ప్రదర్శనలు భారీ ఎత్తున జరుగుతాయి. రాజ్పథ్లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో 45 వేల మంది పాల్గొంటారు. మొత్తం 15 ఆసనాలను 35 నిమిషాల పాటు వేస్తారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరై యోగా విశిష్టతను వివరిస్తారు. దేశ వ్యాప్తంగా 651 జిల్లాలతో పాటు దిల్లీ నగరంలోనూ పెద్ద సంఖ్యలో యోగా శిబిరాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్యనమస్కారాలు అభ్యంతరమైతే హిందూయేతర మతస్థులు వారి మతాలకు చెందిన బోధనలను చదువుకోవచ్చు. రాజ్పథ్లో యోగా దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. టైమ్ స్క్వేర్లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ మన్హట్టన్లోని టైమ్స్క్వేర్లో యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ప్రధాన కార్యక్రమం ఇది. సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ అధ్యక్షత వహిస్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్యాంకుటిసా కూడా దీనికి హాజరవుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారు. టైమ్ స్క్వేర్ నుండి అనేక కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న ఐరాసలో ఆయన చేసిన ప్రతిపాదనను 177 దేశాలు బలపరిచాయి. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే, సమితిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం. గత అక్టోబర్ 22న తీర్మానం ఆమోదించారు. మొదటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికాలోని వంద నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుకొచ్చిన కార్పొరేట్లు.. యోగా పట్ల అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మొబైల్ అప్లికేషన్లు రూపొందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు బ్లాగ్లు, పోర్టళ్లు ప్రారంభించాయి. సమయ పరిమితి మినహాయింపు.. రోజా ఇఫ్తార్ తర్వాత కూడా యోగా చేయాలని భారత్లోని ముస్లిం వర్గాలు భావిస్తే అలాగే చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాము నిర్దేశించిన సమయం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర సంస్థలకు మాత్రమేనని మిగిలిన వారు తమకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చని పేర్కొంది. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు తమ మతానికి చెందిన ప్రవచనాలను మననం చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ముస్లిం మతస్థులు నమాజ్ చేయడం అంటే యోగా చేయడం వంటిదేనని యోగా, ఏ ఒక్క మతానికో పరిమితం అయింది మాత్రం కాదని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్ను విడుదల చేస్తుంది. 10 రూపాయలు, వంద రూపాయలు విలువ చేసే నాణాలను కూడా ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ యోగా కార్యక్రమం ఉదయం 7.00 నుండి 7.35 గంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆసనం ప్రధానం.. యోగాలో ఆసనం అనేది ఒక కీలక ఘట్టం. ఆసనం అంటే ఒక భంగిమ. మానవ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలుగుతుంది. అందుకు తగ్గట్టు శరీర నిర్మాణం ఉంటుంది. క్రమపద్ధతిలో హృదయానికి, శరీరానికి ఉపయోగపడే భంగిమలను ఆసనాలుగా గుర్తించారు. జీవితాన్ని ఒక ఉన్నతమైన పార్శ్వానికి తీసుకువెళ్లేది లేదా ఉన్నతమైన అవగాహనను అందించేది యోగా. అందువల్ల ఎలాంటి భంగిమ అయితే మనల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళ్తుందో దానినే మనం యోగాసనం అంటున్నాం. మనకు తెలిసి, అలవాటుగా చేసుకుంటున్న యోగాసనాలు చాలా తక్కువ. తెలియనివి చాలా ఉన్నాయి. శరీర వ్యాయామ విధానాలే యోగాసనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి కావడానికి ఇవి దోహదపడతాయి. ముక్తికి మార్గం.. దైనందిన జీవితంలో శరీరం సహజంగానే ఒక భంగిమను ఎంచుకుంటుంది. అపుడే మనం ఆనందంగా ఒక విధంగా కూర్చోగలుగుతాం. ప్రశాంతంగా లేనప్పుడో, కోపంగా ఉన్నపుడో మనం మరో విధంగా కూర్చుంటాం. ఎవరైనా ఎలా కూర్చున్నారన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని వారి మనసు లోపల ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు. అయతే, యోగాసన శాస్త్రం ఇందుకు భిన్నమైన సూచన చేస్తుంది. చేతనంగా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం ద్వారా ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవచ్చు. యోగాసనాల్లో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. అవి 84 శరీర భంగిమలని మాత్రం కాదు. ఇవి ముక్తి సాధించడానికి తగిన వ్యవస్థలు లేదా సరైన మార్గాలు. యోగాసనంలో ప్రావీణ్యం ఉంటే చాలు ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు. యోగాసనాలు కేవలం వ్యాయామ ప్రక్రియలు మాత్రమే కాదు. ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుకతో చేయాల్సి ఉంటుంది. యోగా సూత్రాల్లో పతంజలి ‘సుఖం స్థిరం ఆసనం’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యవంతమైనదో, అత్యంత స్థిరమైనదో అదే మీ ఆసనం. మానవ శరీరం పూర్తి ఉత్తేజంతో, సమతుల్యతతో ఉంటే అప్పుడు ఎవరైనా ఊరికే కూర్చున్నా ధ్యానంలోనే ఉంటారు. ఆసనం అనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందుకే ఆసనాలు చురుకైన ధ్యానమార్గాలు. యోగా సాధనతో శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేడు మనిషి జీవనకాలం పెరిగినా, బతికినన్ని రోజులూ అనేక రోగాలతో బాధపడుతూ ఎంతోమంది రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం యోగా సాధనే. రోగం వచ్చిన తర్వాత పరుగులు తీసేకంటే రాకుండానే శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా తోడ్పడుతుంది. ఎక్కువ మంది ప్రాణాయామం, శవాసనం చేస్తుంటారు. వీటివల్ల చాలా లాభాలు ఉన్నా, ఆచరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యోగులు చెబుతున్నారు. యోగా ఇపుడు భారతీయులకో పెద్ద పండగ. సగటు భారతీయుడి ఆరోగ్యమే భారతదేశ ఆరోగ్యం. అదే దేశ సమర్థతకు, సామర్థ్యానికి చుక్కాని అవుతుంది. *** ప్రచారకర్తలు యోగాపై ప్రచారం కోసం ఇప్పటికే సినిమా, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీల సేవలను ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయంచింది. యోగా దినం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు ఇప్పటికే మీడియాలో ప్రచారం ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, నటి శిల్పాశెట్టి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ లాంటి వారిని యోగాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. మోదీ ప్రత్యేకత ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని ఈ నెల 21న భారీ కార్యక్రమం జరుగుతున్నా, తొలి నుండి ప్రధాని నరేంద్రమోదీకి యోగాసనాలపై మక్కువ ఎక్కువ. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున విధిగా యోగాసనాలు వేసేవారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తప్పకుండా యోగాసనాలు వేయాలని, తద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ఆయన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మనుషులంతా ఒక్కటే అనే భావన కూడా యోగా కారణంగా కలుగుతుందని మోదీ విశ్వసిస్తారు. యోగా శారీరక, మానసిక వికాసానికి, సమాజ శాంతికి దోహదం చేస్తుందని, ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ఆయన నమ్ముతారు.
|
రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ వర్షాలతో వాతావరణం చల్లబడింది. విచిత్రంగా గత కొద్ది రోజులుగా సెగలు పుట్టించిన రాజకీయ వాతావరణం కూడా రెండు రోజులుగా కొంత చల్లబడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని కాలు దువ్వుకున్న ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత చానల్కు ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసు వ్యవహారంతో విషయం మళ్లీ మొదటికి వచ్చిందనే అభిప్రాయం కలిగినప్పటికీ… అందులో నిజం లేదనే చెప్పవచ్చు. గడచిన మూడు వారాలుగా తెలుగు రాష్ర్టాలను సలుపుతూ వచ్చిన టేపులు, ట్యాపింగ్ వ్యవహారం హఠాత్తుగా ప్రాధాన్యం కోల్పోవడానికి కారణం ఏమిటి? అసలు ఏమి జరిగింది? అన్న కుతూహలం ప్రజల్లో నెలకొంది. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారనీ, ఇక ఆయన పదవీ త్యాగం చేయక తప్పదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భలే దెబ్బకొట్టారనీ చంద్రబాబు వ్యతిరేకులు సంబరపడిపోయారు. రాజకీయ పార్టీల అధీనంలో ఉన్న మీడియాల్లో చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఒక్కటే మిగిలిందని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకు తెచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఏపీ మంత్రులు జబ్బలు చరచుకున్నారు. ఇద్దరు చంద్రుల మద్దతుదారులు సోషల్ మీడియాలో హైరానా పడిపోయారు. సొంత సమస్యల గురించి ఆలోచించకుండా తమ సృజనాత్మకతను ప్రయోగించి ఫేస్బుక్ తదితర మాధ్యమాలలో పోస్టింగులు పెడుతూ అలౌకిక ఆనందం పొందారు. మొత్తంమీద మద్దతుదారుల ఉన్మత్త ప్రేలాపనలు కొనసాగుతూ ఉండగానే ఇరువురు ముఖ్యమంత్రులు తెల్ల జెండా ఎగురవేయబోతున్నారన్న సమాచారం అందుతోంది. అంతవరకు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ రెచ్చిపోయిన కేసీఆర్ మీడియా కూడా గురువారం నుంచి కొంత వెనక్కు తగ్గింది. ఆయన సొంత పత్రికలో మొదటి పేజీలో ఓటుకు నోటు అంశంపై ఒక్క వార్త కూడా కనిపించలేదు. అంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యం అన్న అనుమానాలు సహజంగానే పొడచూపుతాయి. దీంతో చంద్రబాబు సేఫ్ కదా అని ఆయన మద్దతుదారులు అనునయించుకోవడం మొదలుపెట్టారు. ఓటుకు నోటుతో మొదలై ఎన్నో మలుపులు, సుడులు తిరిగి టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గరకు చేరి… రెండు రాష్ర్టాల ప్రజల మధ్య అంతరం సృష్టించిన ఈ వ్యవహారంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత తాత్కాలికమా? శాశ్వతమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, రాజకీయ నాయకుల ఎత్తుగడలు తెలియని వారికి మాత్రమే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నేను క్రితం వారం పేర్కొన్నట్టుగానే రాజకీయ నాయకులు ఒక హద్దు దాటి ముందుకు వెళ్లరు. వెళితే ఏమవుతుందో వారికి తెలుసుగానీ, వారిని గుడ్డిగా సమర్థించేవారికి తెలియదు. మొత్తం ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ పైచేయికాగా, వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నవాళ్లు, ఏదో జరుగుతుందని భ్రమించినవాళ్లు మాత్రం చిత్తు అయ్యారు.
ఎత్తుకు పైఎత్తు
ఇంతకీ ఇద్దరు చంద్రుల మధ్య కాల్పుల విరమణ ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమయంలో ఈ వ్యవహారంతో లాభపడింది ఎవరు? భంగపడింది ఎవరు? కూడా తెలుసుకుందాం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చిక్కుకున్ననాటి నుంచి రెండు రోజుల క్రితం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలోనే ఉన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల తెలుగు ప్రజల మధ్య మరింత అంతరం ఏర్పడి అది ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడినా, ఈ వ్యవహారం మాత్రం జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ఠను మసకబారేట్టు చేసింది. దీంతో రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్కు ఏమాత్రం తీసిపోని చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టడంతో పాటు, తన పలుకుబడిని అంతా ఉపయోగించి టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆధారాలు సేకరించారు. అంతే, అందుబాటులో ఉన్న మంత్రులను, ఇతర పార్టీ ముఖ్యులను పిలిపించుకుని జరిగినదంతా వివరించి టేపుల వ్యవహారం వల్ల తాను రాజీనామా చేసే పరిస్థితి ఉండదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రయోగించడానికి తనకు బ్రహ్మాస్త్రం లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందీ లేనిదీ 24 గంటలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రులు అల్టిమేటం జారీ చేశారు. దీనికి కౌంటర్గా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఇంటికి రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులను కేసీఆర్ పంపారు. పనిలో పనిగా మరో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటికి కూడా పంపి నోటీసులు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించలేదని నమ్మడం వల్లనే కేసీఆర్ ఈ చర్యకు పూనుకుని ఉండవచ్చు. అయితే, గురువారం సాయంత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రికి తత్త్వం బోధపడింది. ఈ దశలో మనం ఒక అడుగు ముందుకు వేస్తే చంద్రబాబు రెండు అడుగులు ముందుకు వేస్తారు. అందరం మునిగిపోతామని అధికారులు కూడా ఆయనను హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో అదే రోజు ఆయన గవర్నర్ నరసింహన్ను కూడా కలిశారు. అప్పటికే ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించాయని తెలుసుకున్న గవర్నర్ కూడా ఓటుకు నోటు వ్యవహారంలో ఇక తగ్గండి అని కేసీఆర్కు గట్టిగా సూచించారని వార్తలు వచ్చాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటూ ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహారం ఇంతటితో ఆగకపోతే కొంపలు మునుగుతాయని గుర్తించి గవర్నర్ను హెచ్చరించింది. అంతే, వాతావరణం చల్లబడటం మొదలైంది. టేపుల వ్యవహారంలో ఒకరు, ట్యాపింగ్ వ్యవహారంలో మరొకరు ఇరుక్కుపోయినట్టు గుర్తించిన ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణకు మానసికంగా సిద్ధమయ్యారు. ఫలితంగానే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గురు, శుక్ర, శనివారాల్లో ఎటువంటి హడావుడి చేయలేదు. ఏపీ మంత్రులు కూడా తాము ఇచ్చిన గడువు దాటిపోయినా ట్యాపింగ్ వ్యవహారం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదు. ఇదంతా చూసి నిన్నటి వరకు కొట్టుకున్నవాళ్ల మధ్య ఇంత సామరస్యం, అవగాహన ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం వస్తే అది వారి అమాయకత్వమే అవుతుంది. రాజ్యం పదిలంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నంత వరకు మాత్రమే రాజులుగానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగానీ ఎంత దూరమైనా వెళతారు. ఎన్ని ప్రకటనలైనా చేస్తారు. ఈ క్రమంలో సైనికులు లేదా అభిమానులు కొట్టుకు చచ్చినా పట్టించుకోరు. తమ సీటుకు ఎసరు వస్తుందనుకున్నప్పుడే జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రాంత ప్రయోజనాలు, ఆత్మగౌరవం వంటివి ఏమి గుర్తుకురావు. ఇంతకీ చంద్రబాబు సేకరించిన ఆధారాలు ఏమిటి? ఈ ఎపిసోడ్లో ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బకరాలు అయ్యారో ఇప్పుడు చర్చించుకుందాం.
ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడానికి పది రోజుల ముందునుంచే తెలంగాణ ప్రభుత్వం తన వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్రెడ్డి ఎంతకైనా తెగిస్తారనీ, అందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తాము విజయం సాధిస్తామనీ, ఫలితంగా ఏపీ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందనీ, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవలసిందిగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సూచించినట్టు తెలిసింది. ఈ అంశంపై వివరంగా మాట్లాడుకోవడానికి మంత్రి హరీశ్ రావు, జగన్మోహన్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ గత నెల 21వ తేదీన సమావేశమైనట్టుగా తెలుగుదేశం పార్టీ వారికి ఆధారాలు లభించాయి. ఆ రోజు నుంచి తెలంగాణ అధికార పక్ష నేతలు వ్యవహారాన్ని గుట్టుగా మొదలు పెట్టారు. అత్యుత్సాహవంతులైన కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు ఈ వ్యూహం అమలులో సహకరించడానికి ముందుకొచ్చారు. ఆ వెంటనే ఫలానా ఫలానా వారి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేయాలని సర్వీసు ప్రొవైడర్లకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు పంపారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, సెబాస్టియన్ నంబర్లతోపాటు కొంతమంది ఉగ్రవాదులు, నక్సలైట్ల నంబర్లు చేర్చారు. అధికారికంగా రిక్విజేషన్ రావడంతో సెల్ఫోన్ సర్వీసు ప్రొవైడర్లు గత నెల 23వ తేదీ నుంచి ట్యాపింగ్ మొదలు పెట్టారు. అధికారికంగా నిర్వహించిన ఈ ట్యాపింగ్తోపాటు ప్రయివేటు సంస్థల ద్వారా కూడా మరికొంత మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఏపీ సీఎం చంద్రబాబు సేకరించి పెట్టుకున్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోన్ నంబర్లు ట్యాప్ చేయడానికి పోలీసు అధికారులు అధికారికంగా రాసిన లేఖ ప్రతిని కూడా సంపాదించారు. ఈ లేఖపై తెలంగాణ ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోం సెక్రటరీ బి.వెంకటేశం సంతకాలు చేసినట్టు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ లేఖతోపాటు ఇతర ఆధారాలను చంద్రబాబు అండ్ కో బయటపెడితే సర్వీసు ప్రొవైడర్లకు రాసిన లేఖపై సంతకాలు చేసిన అధికారుల ఉద్యోగాలు పోవడమే కాకుండా, జైలుకు కూడా వెళ్లవలసి వస్తుంది. అప్పుడు వ్యవహారం అక్కడితో ఆగదు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఆ పని చేశామని పోలీసు అధికారులు విచారణలో చెబితే కేసీఆర్ చిక్కుల్లో పడతారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఉదంతం కేసీఆర్కు గుర్తుకు రాకుండా ఉంటుందా? నెపాన్ని అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించే పక్షంలో పోలీసు శాఖలో తీవ్ర అలజడి ఏర్పడుతుంది. ఇకపై, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులెవ్వరూ అమలు చేయబోరు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణను ఎదుర్కోవలసి వస్తుంది.
![]() ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లను నేరుగా ట్యాపింగ్ చేయకపోయినా, తమ ట్యాపింగ్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబుకు వెళ్లిన కాల్స్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీకి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్కు మధ్య జరిగిన సంభాషణను కూడా పోలీసు అధికారులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద టెలిఫోన్ సంభాషణల టేపులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. జరిగింది ఇది! ఓటుకు నోటు వ్యవహారంలో న్యాయస్థానంలో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుందో లేదో తెలియదుగానీ చంద్రబాబు మాత్రం తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయన స్టీఫెన్సన్తో మాట్లాడినప్పుడు డబ్బు గురించిగానీ, తమ అభ్యర్థికి ఓటు వేయమనిగానీ కోరలేదు. పైగా సంభాషణ చివరిలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని సూచించారు. ఈ కారణంగా చంద్రబాబును దోషిగా నిరూపితం చేయలేరని న్యాయవాది కూడా అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వంటివాళ్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో ఏసీబీని మరింత ఎగదోస్తే, చంద్రబాబుకు జరిగే నష్టం కన్నా కేసీఆర్కు జరిగే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబుకు జరగాల్సిన నష్టం ఇదివరకే జరిగింది. కేసీఆర్కు మాత్రం కొత్త కష్టాలు ప్రారంభమవుతాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడం మొదలైంది. కేసీఆర్ మీడియా స్వరాన్ని తగ్గించుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటుకు నోటు కేసు కథ కంచికి చేరినా ఆశ్చర్యపోవలసింది లేదు. అదే విధంగా ట్యాపింగ్కు సంబంధించి చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలు కూడా వెలుగు చూడకపోవచ్చు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రుల జుట్టు మాత్రం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఇద్దరు ముఖ్యమంత్రుల హితులు రంగంలోకి దిగారు. ‘చేసింది చాలు. ఇక సరిపెట్టండి’ అని హితవు చెబుతున్నారు. అయినా ముందుకు వెళితే ఏం జరుగుతుందో తెలియనంత అమాయకులుకారు మన చంద్రులు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇంతకీ… ఎవరు చిత్తు?
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఆటలో అరటిపండు అయిందెవరో చూద్దాం. ఈ జాబితాలో ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నమ్మిన ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంతటితో ఆగకుండా తనను కలిసిన ఏపీ మంత్రుల వద్ద కూడా ట్యాపింగ్ ఎవరు చేశారంటూ దబాయించారు. ట్యాపింగ్ జరిగిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు చంద్రబాబుకు లభించడంతో, ఇప్పుడు గవర్నర్ కేంద్రం వద్ద తలదించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంతిమంగా ఆయన పదవికే ఎసరు తేవచ్చు. వాస్తవానికి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టగానే ఉమ్మడి గవర్నర్గా ఎవరిని నియమించ మంటారంటూ చంద్రబాబును అడిగారు. అప్పట్లో ఆయన ఏ కారణం వల్లనోగానీ నరసింహన్నే కొనసాగించవలసిందిగా సూచించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబుకు, నరసింహన్కు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు అన్నట్టుగా నడుస్తోంది. ఏపీ మంత్రులు నేరుగా గవర్నర్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెడితే తెలుగు ప్రజల ముందు తాను తలదించుకోవలసి వస్తుంది కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్ను నిలువరించడం ఒక్కటే మార్గమన్న ఉద్దేశంతో బుధవారం నాడు తనను కలిసిన కేసీఆర్కు గవర్నర్ ఉపదేశం చేసినట్టు చెబుతున్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండవ బకరాగా మిగిలారు. ఇద్దరు చంద్రుల మధ్య సాగుతున్న రాజకీయ క్రీడలో చివరకు జగన్ ఆటలో అరటిపండుగా మిగులుతారని నేను గతవారమే పేర్కొన్నాను. ఇప్పుడు అదే జరిగింది. కేసీఆర్ అండ్ కో మాటలు నమ్మి చంద్రబాబు నిజంగానే జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారనీ, ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనతో చేతులు కలిపే అవకాశం ఉందనీ, తాను ముఖ్యమంత్రి కావచ్చుననీ జగన్మోహన్ రెడ్డి కలలు కని ఉండవచ్చు. లేదా కేసీఆర్ అండ్ కో అలా భ్రమింపచేసి ఉండవచ్చు. ఈ కారణంగానే కాబోలు గడచిన మూడు వారాలుగా చంద్రబాబుకు శిక్ష తప్పదంటూ పుంఖానుపుంఖాలుగా తన పత్రికలో వార్తలు అచ్చేశారు. చంద్రబాబు స్థానంలో ఫలానా వారు ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలను ప్రజల్లోకి వదిలారు. ఊహల్లో విహరించిన జగన్కు బుధవారంనాటి పరిణామాలతో తత్త్వం బోధపడింది.
కేసీఆర్ మాటలు నమ్మి ఆయనకు భుజం కాయడం వల్ల ఏపీలో తనపై వ్యతిరేకత ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో పార్టీ ముఖ్యులను సమావేశపరచి ఓటుకు నోటు వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుని, కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లిపోయారు. దీన్ని బట్టి రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అనిపిస్తోంది కదా! ఇక మూడవ బకరాగా మీడియాను పేర్కొనవచ్చు. కేసీఆర్కు భయపడిగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ అటు పత్రికలు, ఇటు చానెళ్లు గాలి వార్తలను పోగేసి ప్రచురించి, ప్రసారం చేశాయి. అవినీతి నిరోధక శాఖ సోర్స్ పేరిట ఇదిగో పులి, అదిగో తోక అంటూ కథనాలను ప్రజల్లోకి వదిలాయి. చంద్రబాబును అరెస్ట్ చేయడమే మిగిలి ఉందంటూ ప్రచారం చేశాయి. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు లభించి ఉండకపోతే ఏమి జరిగేదో తెలియదుగానీ… ఇప్పుడు మాత్రం ఏమీ జరగకపోవచ్చునని చెప్పవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా! అని అనుకుంటే అలా నమ్మిన వారిదే అమాయకత్వమే అవుతుంది. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడం గతంలో కూడా జరిగింది. ఇకపై కూడా జరుగుతుంది. అయితే, ఈ కేసులో వలె మీడియా ఇంత బాధ్యతారహితంగా గతంలో ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. తాము ప్రచారం చేస్తున్న గాలి వార్తలను ప్రచురించి, ప్రసారం చేయకపోతే ‘ఆంధ్రా మీడియా’ అని కేసీఆర్ సొంత మీడియా ఎక్కడ నిందిస్తుందోనన్న భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇక నాలుగవ బకరాగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారిని పేర్కొనవచ్చు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు తమలోని సృజనాత్మకతను సొంతానికి ఉపయోగించుకుంటే వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆట ముగింపు దశకు చేరుకుంది. కేంద్రం నుంచి కూడా ఆ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులకు సూచనతో కూడిన హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేసీఆర్, చంద్రబాబు పదవులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే… ఒక రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్లను ట్యాప్ చేయడం, అది బయటకు వెల్లడవడం తెలంగాణ క్షేమం దృష్ట్యా కూడా మంచిది కాదు. గుట్టుగా ఉండవలసిన చోట అత్యుత్సాహం ప్రదర్శిస్తే అంతిమంగా ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వాధినేతల ప్రోత్సాహంతోనే విచ్చలవిడిగా ట్యాపింగ్ చేయడం, ఆ టేపులను బయటపెట్టడం వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కూడా భయపడే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నందుకు సోకాల్డ్ తెలంగాణవాదులు నన్ను విమర్శించవచ్చుగానీ రోజులు గడిచేకొద్దీ వారికి వాస్తవం తెలిసివస్తుంది. నిజానికి, దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తకాదు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిత్యం ఆ పని చేస్తూనే ఉంటాయి. గుట్టుగా అది సాగిపోతుంటుంది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న వివరాలను తదుపరి వ్యూహాల రచనకో, లేక విరుగుడు చర్యలకో వాడుకుంటాయి. అంతే తప్ప నేరుగా బయటపెట్టవు. కానీ, తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ‘ట్యాపింగ్ టేపులను’ బయటపెట్టడం కొత్త అనుభవం. మొుత్తంమీద కథ కంచికి చేరుకునే దశకు చేరుకున్నట్లే అని భావించవచ్చు. కనుక ఏదో జరుగుతుందని ఆశించి భంగపడిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎటొచ్చీ చట్టాల పట్ల నమ్మకం పెట్టుకున్నవాళ్లు మాత్రం ఇదంతా చూసి ‘నీ యవ్వ. అంతా తొండి’ అని ఉడుక్కోవచ్చు! |
ఉయ్యూరు లో 21-6-15 అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఉదయం 7 గం లకు శాంతి నేకేతన్ హైస్కూల్ లో ,ఉదయం 11 గం లకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో
https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6162708660116406785?cfem=1
|
యోగం అంటే శరీరానికి, మనసుకు ఉన్న సంబంధాన్ని చెప్పే శాస్త్రమనీ
ఇదివరలో తెలుసుకున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపు కుంటున్న సందర్భంగా యోగ చరిత్ర గురించి తెలుసుకుందాం. భగవద్గీతతో సహా సమానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పుస్తకం పతంజలి యోగసూత్రలు. ఇది ఏ దేవుడి సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది కాదు. అందువల్ల అన్ని సంస్కృతుల వారూ దీన్ని గ్రహించారు. ప్రస్తుతం మనదేశంలో కన్నా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో దీనిపై శాసీ్త్రయమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎడ్విన్ బ్రైయాంట్ పతంజలి యోగసూత్రాలపై ఉన్న వ్యాఖ్యలన్నిటినీ పరిశీలించి ప్రామాణికమైన వ్యాఖ్యను రాశారు. వందలాది మానసిక శాస్త్రవేత్తలు యోగాపై అధ్యయనం చేశారు.
మంత్రయోగం..
వేదాల మొదటి భాగాల్లో యోగ ప్రస్తావన కనిపించదు. ఉపనిషత్తుల్లో యోగం ప్రస్తావన వివరంగా ఉంది. సింధునది నాగరికత నాటి ముద్రల్లో ధ్యానం, యోగ ముద్రలు కనిపిస్తాయి. వైదిక సంప్రదాయం, సింధు నది నాగరికత రెండూ ఒకటా..? వేర్వేరా..? అనే విషయంపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మొదట్లో ఇది వైదిక సంస్కృతిలో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే వైదిక సంస్కృతితో పాటు సమాంతరంగా వచ్చిన సంప్రదాయం ఇదని మరికొందరి అభిప్రాయం. వేదాల మొదటి భాగాల్లో యజ్ఞాలు మొదలైనవి చెప్పారు. ఇవన్నీ మానవ స్వభావమైన కోరికలకు సంబంధించినవి. దీని నుంచి క్రమక్రమంగా ఎదిగి తత్వచింతన చేయడానికై మనసుకు నిలకడ, శిక్షణ అవసరం. అందుకే మనసును అదుపులో పెట్టే సాధనంగా యోగా పద్ధతులను ఉపనిషత్తుల్లో అంగీకరించారు. భారతంలో, ముఖ్యంగా మోక్షధర్మ పర్వంలో భీష్ముడు యోగా పద్ధతులను చాలా వివరంగా చెబుతాడు. పురాణ కాలానికి పతంజలిని పూర్తిగా హిందూ సంప్రదాయంలోని వ్యక్తిగా చూడగలం. ఆయన ఆదిశేషుడి అవతారమని మన సంప్రదాయం. ఆదిశేషుడు గానీ, శివుడి కంఠంలో ఉన్న నాగరాజు గానీ, అనేక దేవతలకు గొడుగు పడుతున్న సర్పాలు గానీ, ఆయా దేవతల యోగశక్తులను సూచిస్తాయని పండితుల అభిప్రాయం. సర్పాలకు వాయుభక్షకులు, గాలిని పీల్చి బతికే జీవులు అని కూడా పేరు. ప్రాణాయామంలో.. ముఖ్యమైంది ప్రాణవాయువే. ప్రాణాయామం యోగంలో ఒక ముఖ్యమైన మెట్టు. తర్వాతి కాలంలో అనేక పూజా విధానాల్లో భాగంగా కొంత యోగా పద్ధతులను ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు సూర్య నమస్కారాలు. వీటిలో ఉన్న ఆసనాలను కొన్ని మంత్రాలు మననం చేస్తూ చేయాలి. అలాగే సంధ్యావందనంలోని అనేక ముద్రలు యోగ నుంచి గ్రహించినవే.
ముద్రయోగం
తూర్పు ఆసియా దేశాలన్నింటిలో యోగ సంప్రదాయం ఉంది. ఇది బౌద్ధమతం ద్వారా వ్యాపించిందని పండితుల అభిప్రాయం. ఆ దేశాల్లోని కొన్ని యుద్ధపద్ధతులు కూడా బౌద్ధబిక్షువులు వ్యాపింపజేసినవే అని ఒక వాదన. కొన్నేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సినిమా ‘blood sport’ లో హీరో కొన్ని విన్యాసాలు చేస్తాడు. వాటిలో చేతులకు, వేళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వేళ్లకు సంబంధించిన ముద్రలు కొన్ని మన పూజా విధానాల్లో ఉన్నవే. కుంగ్ ఫూ చిత్రాల్లో కూడా ఇలాంటి ముద్రలు చూస్తాం. ఇవన్నీ హఠయోగానికి సంబంధించినవే. గాలిని పీల్చుకుని శరీరాన్ని బిగించే పద్ధతులు హఠయోగంలో కనిపిస్తాయి.
పాశ్యాత్య దేశాల్లో యోగా బోధించేటప్పుడు మన సంప్రదాయంలో చెప్పే మంత్రాలను తీసివేసి వారి సంస్కృతికి అనుగుణంగా బోధిస్తారు. దీనిపై ఆందోళన అనవసరం. మన మంత్రాలకు బదులుగా వారి దేవుడి పేరు చెప్పుకోవడం సహజమే. అర్థచంద్రాసనాన్ని ‘half moon posture’ అని, భుజంగాసనాన్ని ‘cobra posture’ అని ఈ విధంగా పేర్లు మార్చి చెప్పినా వారు కూడా మనం సాధించిన ఫలితాలనే సాధిస్తారు. ఇటీవల కేరళలో క్రైస్తవులు ఈ యోగా పద్ధతులను జీసస్ నమస్కారాలు అంటూ బోధిస్తున్నారు. దీనికి మనమేం ఆందోళన చెందాల్సిన పని లేదు.
విద్యాయోగం..
యోగాభ్యాసాన్ని స్కూల్ సిలబ్సలో భాగంగా పెట్టడం తమ సంస్కృతికి విరుద్ధమని ఇతర మతాల వారు భావించవచ్చు. విషయం ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా.. స్వచ్ఛందంగా అందరికీ ఆమోదకరంగా ఉన్నప్పుడే దాన్ని ప్రవేశపెట్టడం సరైన విధానం. పదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ప్రఖ్యాత అరబ్ యాత్రికుడు అల్ బెరూనీ పతంజలి యోగ సూత్రాలను అరబిక్ భాషలో ‘కితాబ్ బతంజల్ అల్ హిందీ’ పేరిట గురుశిష్యుల సంభాషణ రూపంలో తర్జుమా చేశాడు. దీని అంగ్ల అనువాదం వివరాలను ఇంటర్నెట్లో చూడగలం. ‘ఈ పుస్తకం ప్రతి అక్షరం విని అర్థం చేసుకున్న తర్వాత నా ప్రజలకు దీన్ని ఇవ్వకుండా ఉండటానికి నా అంతరాత్మ అంగీకరించలేదు’ అని అల్ బెరూనీ రాసుకున్నాడు. ఇలాంటి పుస్తకాలను భారతీయ భాషల్లోకి తేవడం కూడా అవసరమేమో..! ![]() డాక్టర్ కె. అరవిందరావు,
రిటైర్డు డీజీపీ
|
|
ప్రపంచంలోని అనేక మతాలకూ, భారతీయ మతాలకూ ఒక ముఖ్య భేదం ఉంది. దీన్ని వివరిస్తూ మ్యాక్స్ ముల్లర్ ఇలా అన్నాడు. what distinguises the vedanta philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy. ఇతర మతాల్లో ముఖ్యంగా ఒకే మతగ్రంథం ఉంటుంది. దాని ఆధారంగా మిగతా గ్రంథాలు వస్తాయి. ముఖ్యమైన మతగ్రంథం ఒకానొక వ్యక్తి, ఒకానొక చారిత్రకసమయంలో దేవుడి సాక్షాత్కారాన్ని పొంది దేవుడి ఆజ్ఞగా తన ప్రజలకు చెప్పిన విషయాలకు సంబంధించినది. ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు. శాస్త్రీయంగా సమర్థించలేనివి. ఒక మతం వారు మా విశ్వాసం సరైనది అంటే మరొక మతం మా విశ్వాసం సరైనది అనవచ్చు. భారతీయ (హిందూ, బౌద్ధ, జైన) మతాల్లో తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మత సంబంధమైన పుస్తకాలు సమన్వయం చేయబడి ఉంటాయి. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు తత్త్వశాస్త్రంలోనూ భాగమే, మతగ్రంథాల్లోనూ భాగమే. అందుకే హింద మతగ్రంథాలు రెండు స్థాయిల్లో విషయాన్ని బోధిస్తాయని మునుపటి ఒక వ్యాసంలో ప్రస్తావించాను. తత్త్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాడికి ఆ స్థాయిలోనూ, ఆ శక్తి లేనివాడికి పురాణాలు మొదలైన స్థాయిలోనే విషయాన్ని చెబుతాయి.
పరమాత్మ అంటే విశ్వమంతా వ్యాపించిన శుద్ధచైతన్యం అనీ, సృష్టి అనేది ఆ చైతన్యం నుండి వచ్చిందే అనీ, ఆ చైతన్యంలోని క్రియాశక్తి వల్ల ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, చెట్లు చేమలు, చిట్ట చివరిగా ప్రాణులు వచ్చాయనీ, పంచభూతాల మరో రూపంగానే ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అని విశ్లేషించి చెప్పడం శాసీ్త్రయమైన విచారం. ఇది తత్త్వశాస్త్రం అనే కోవకు వస్తుంది. ఉపనిషత్తులు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు పై విషయాల్ని అనేక కోణాల్లో వివరించి చెబుతాయి. వీటిని తెలుసుకోవడానికి కొంత శ్రద్ధ, కొంత విషయజ్ఞానం ఉండాలి. పురాణాలలో త్రిమూర్తులు, సృష్టి, స్వర్గం, నరకం మొదలైన విషయాలు, విశ్వాసానికి చెందినవి, ఎవరూ నిరూపించలేనివి ఉంటాయి. వీటిని కూడా మన సంప్రదాయం అంగీకరించింది.
పై రెంటిలో ఏది నిజం? ఆకాశంలో చేతిలో కర్రపట్టుకుని ఒకానొక దేవుడు ఉన్నాడు అనేది ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించేవాడికి మొదట చెప్పింది నిజం. కానీ మన చుట్టూ సమాజంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని తోసివేయాలంటే బలాత్కారంతో, రక్తపాతంతో ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అలా జరిగింది కానీ మనదేశంలో అలా జరగలేదు. ఒక బాలుడు బొమ్మ ట్రైన్ను నడుపుతూ తాను నిజంగా ట్రైన్ నడుపుతున్నానని భావిస్తాడు. తండ్రి దాన్ని నవ్వుతూ అంగీకరిస్తాడు. పెద్దవాడయ్యాక ఎట్లూ ఆ బొమ్మతో ఆడుకోడని అతనికి తెలుసు. అలాగే ఆలోచనాశక్తి పెరగనంత వరకూ ఏదో ఒక స్థాయిలో మనిషి క్రమశిక్షణతో ఉండడం మంచిది కనుక ఆ సంప్రదాయాల్ని కూడా సరే నిజమే అన్నారు. పై స్థాయిలో చెప్పినదాన్ని పారమార్థిక సత్యం అన్నారు. కేవలం విశ్వాసంపై ఆధారపడి వ్యవహారాల్లో ఉన్నదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు.
అలాగే రెండింటినీ ఒప్పుకోవడం వల్ల ఒకానొక కాలంలో లాభంపడి ఉండవచ్చు కాని మతాల మధ్య ప్రస్తుత పోటీ వాతావరణంలో కొత్త సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ చర్చలు చేస్తూ పండితులు ఒకవైపు, రామాయణం, భాగవతం కథలు వింటూ నిరక్ష్యరాస్యులు మరొకవైపు ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో తెలుసుకుంటూ వచ్చారు. ఒకవైపు సత్యం ఏమిటి అంటూ నిష్పక్షపాతంగా, శాసీ్త్రయంగా కొనసాగించే ఆలోచన. మరొకవైపు సమాజంలో ఇదివరకే ఉన్న సంప్రదాయాల్ని(విష్ణువు, శివుడు మొదలైనవి) అంగీకరించడం మొదటి స్థాయిలో విశ్లేషణ శాస్త్రీయమైనది కావున ఎలాంటి వివాదం ఉండదు. రెండవ స్థాయిలోని విషయాలు విశ్వాసానికి సంబంధించినవి. ఒకవైపు వైష్ణవ సంప్రదాయం, మరోవైపు శైవం, ఇంకొకచోట శక్తిపూజ మొదలైనవి. వీటి మధ్య పరస్పర వాదాలు తలెత్తకుండా శ్రీ శంకరాచార్యులు వీటన్నింటినీ ఉపనిషత్తులు అనే గొడుగు కిందకు తెచ్చారని ఇది వరలో గమనించాం. ఇలాంటి సంప్రదాయాలు అనేకం కావున అనేక దేవుళ్ళను అంగీకరించారు. ఏ సంప్రదాయం ప్రకారం పూజించినా ఒకే పరమాత్మను పూజిస్తున్నారని ఈయన సమన్వయం చేశారు. వేదాంత స్థాయిలో చెప్పిన బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రపంచ సృష్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణలాంటి డ్యూటీలు లేవు. సంప్రదాయం, లేదా మతంలో చెప్పిన దేవుడికి ఇలాంటి డ్యూటీలున్నాయి. డ్యూటీని ఉపాధి అంటారని మనకు తెలుసు. ఈ ఉపాధి అన్న దేవుణ్ణి సోపాధిక బ్రహ్మ అన్నారు. ఇది కింది స్థాయికి చెందింది. ఉపాధిలేని సత్యము, చైతన్యం అనే దాన్ని నిరుపాధికం అన్నారు. అందువల్లే మొదటి స్థాయిలో మాట్లాడేవారు ఎప్పటికప్పుడు కింది తరగతి వారిని హెచ్చరిస్తూ మీరు సత్యం అనుకుంటున్నది పాక్షిక సత్యం మాత్రమే, ఆ స్థాయి నుంచి మీరు పైకి ఎదగాలి అంటూ చెబుతూ వచ్చారు. ఇలాంటి హెచ్చరికలు ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు కేనోపనిషత్తులో ‘‘నేదం యదిదముపాసతే’’-‘‘ప్రజలు ఇది దేవుడు అని పూజిస్తున్నది సంపూర్ణసత్యం కాదు’’ అంటూ నాలుగు మంత్రాలున్నాయి. ఇదం అంటే ఇది అని నిర్ధారించి చెప్పిన విషయం. కొందరు మతపెద్దలు కూడి ఇది దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఇతన్నే పూజించాలి అని చెబితే అది ‘ఇదం’ అనే దాని పరిధిలోకి వస్తుంది. సృష్టి మొదలైన డ్యూటీలు ఉన్న దేవుణ్ణి ఏ మతం చెప్పినా అది ‘ఇదం’ అనే స్థాయికే వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలుండవచ్చు. ఇది పూజాపునస్కారాలకు పనికివస్తుంది. మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దానం, ధర్మం, అహింస మొదలైన గుణాల్ని ఇవ్వడానికి పనికివస్తుంది. అయితే ఇది వ్యవహార దశలో సత్యమే కానీ పరమార్థ దశలో కాదు. అందువల్లే వేదాంతం మాటిమాటికీ మనిషిని హెచ్చరిస్తూ నీవు మతం స్థాయిలో దేన్ని ఆరాధించినా తప్పులేదు కానీ అదే పరమసత్యం కాదు అని చెప్పింది. అసలైన శుద్ధ చైతన్యాన్ని ఇది అంటూ నిర్దేశించలేం. ఒక టార్చిలైటు వెలుగులో చీకటి గదిలోని వస్తువుల్ని చూడవచ్చు కానీ సూర్యుడువైపు టార్చిలైటు వేసి ఎవరూ చూపరు. చైతన్యం కారణంగా మనం వస్తువుల్ని చూడగలుగుతున్నామే కానీ ఆ చైతన్యాన్నే మనం చూడలేం. Consciousness cannot be objectified అని ఇవాళ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్నే చెబుతున్నారు. కావున నీవు పూజిస్తున్నది పరమసత్యంకాదు అని ఉపనిషత్తులు చెబితే ఒక నమ్మకాన్ని వదిలి మరొక నమ్మకాన్ని అంగీకరించమనీ, ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని తీసుకోమని కాదు. ఏ నమ్మకమైనా ఒకే స్థాయిలోనిదే, ఉపాధి ఉన్న దేవుడే. ఇది దాటి అసలైన సత్యాన్ని, తెలుసుకోమని వాటి ఉద్దేశం.
దీన్ని వక్రీకరించి కొందరు మీ ఉపనిషత్తుల్లోనే మీరు పూజిస్తున్నది దేవుడు కాదని చెప్పారు కదా, మా మతంలోకి రండి అనడం, ఆధునిక సాధనాలైన వాట్సప్ లాంటి ద్వారా ప్రచారం చేయడం అజ్ఞానంతో కూడిన పని. దీనివల్ల అమాయకుల్ని మతమార్పిడి చేయవచ్చు. కానీ సత్యానికి మరింత దూరంగా వెళ్లడమే అవుతుంది. మరికొందరు మీ ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించే చెప్పారు అనడం మరొక మానసిక బలహీనత. సంస్కృత పండితులు నోరు మెదపకున్నంత కాలం ఇలాంటి వాదనలు ఇంకా అనేకం వస్తాయి.
‘ఇదం’ అని చెప్పబడింది పూర్తిగా వ్యర్థంకాదు. డిగ్రీకి వెళ్ళడానికి హైస్కూలు ఎలా అవసరమో ఇదీ అలా అవసరం. అసలైన దాన్ని తెలుసుకోవడానికి అదొక గొప్ప సాధనం.
మన సంప్రదాయంలో చెప్పిన ఉసాసనలన్నీ ఇలాంటివే. అంతేగాని ‘ఇదం’లో ఉన్న ఒకటి సరైనది, మరొకటి తప్పు అనడం దురుద్దేశంతో కూడిన వాదం.
(రచయిత ప్రసంగాల్ని www.advaitaacademy.org అనే వెబ్సైట్లో చూడవచ్చు)
|
ఆదివారం-జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతున్న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ మానవాళి చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం…సమన్వయసాధన పథంలో మరో ప్రగతి పదం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దాదాపు అన్ని దేశాలూ మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘యోగ దినోత్సవ నిర్వహణ’ ప్రతిపాదనను ఆమోదించడం మన దేశానికి లభించిన సాంస్కృతిక విజయం. శరీరం, మనస్సు, బుద్ధి కలసి మెలసి ఎకోన్ముఖ స్థితి ఏర్పడడం యోగం. ఈ ఏకోన్ముఖ స్థితి మంచి నడవడి. మంచి నడవడిని మానవాళికి నేర్పిం చే సంస్కారాల సమన్వయతత్త్వం యోగం. యోగ విద్య మనదేశంలో అంకురించింది, పల్లవించింది, వికసించింది, పరిమళించింది. ఈ పరిమళం ప్రపంచ మానవాళికి మాధుర్యాన్ని పంచిపెట్టడం చరిత్ర. ఆ మాధుర్యం మానవులను నిజమైన మానవులుగా దిద్దడానికి దోహదం చేసిన చరిత్ర. జంతు ప్రవృత్తి నుంచి పైశాచికమైన వికృతులనుంచి తప్పించి మానవుడిని సంస్కృతి నిబద్ధుడిని చేసిన మాధ్యమం యోగం. యోగవిద్య మనదేశలో పుట్టినప్పటికీ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడడం తరాల చరిత్ర. ఈ సంస్కారబద్ధులైన సమయంలో మానవులు ఇతర మానవులను పీడించలేదు. ఈ సంస్కారానికి దూరమైన సమయంలో మానవులు దురాక్రమణ దారులుగా మారారు. కలయిక-యోగం-ఆయా జాతుల మనస్సులలో వికసించకపోవడమే ఇందుకు కారణం… యోగం వికసించడమంటే శరీరం, మనస్సు, బుద్ధి ఒకే లక్ష్యం వైపు ఏకోన్ముఖంగా కేంద్రీకృతం కావ డం. ఈ ఏకోన్ముఖ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. ఒకే ఆత్మ అద్వితీయమైన ఆత్మ. అనంతకోటి బ్ర హ్మాండాలుగా, అసంఖ్యాక జీవాత్మలుగా ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థలోని వ్యవహార వాస్తవం. ఈ జీవన వాస్తవం, యోగం ద్వారా యోగ విన్యాసాల ద్వారా ధ్రువపడడం సమన్వయం. అసంఖ్యాక రూపాల, వైవిధ్యాల స్వభావం ఒక్కటే…వైవిధ్యాలన్నీ అద్వితీయమైన సత్యంలో ఆత్మతో సమన్వయమై ఉండడం యోగం-కలయిక! ఈ జీవన వాస్తవాన్ని ‘ప్రపంచం’ ఆచరించగలిగినప్పుడు వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. మతాల మధ్య, భాషల మధ్య, వర్గాల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, జీవజాలం మధ్య, చరాచర విశ్వ స్వరూపాల మధ్య విరోధం లేదు. ఈ సంస్కార మాధ్యమం భారతీయ జీవన యోగం! కలిసి ఉండడమే విలీనమై ఉండడమే యోగ స్వభావం. శరీరం బుద్ధి మనస్సు ఆత్మతో కలసి ఉండాలి. మానవాళి కలసిమెలసి ఉండాలి. ఇదే వసుధైక కుటుంబం…ప్రపంచ మంతా ఒకే కుటుంబం, ఒకే ఇల్లు! అలాగే మన పుడమి విశ్వవ్యవస్థలోని అసంఖ్యాక గ్రహాలతో నక్షత్రాలతో బ్రహ్మాండాలతో కలసి ఉండడం సహజమైన యోగం. మహా మేళనం యోగం. అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ సహజ సమన్వయ తత్వానికి చిహ్నం..
యోగవిద్య, యోగాభ్యాసం, యోగాచరణ, యోగ ప్రబోధం అందువల్ల అనాదిగా ఉన్న సహజ జీవన విన్యాసాలు, సహజత్వానికి తప్పిపోకపోవడం, కృత్రిమత్వానికి గురికాకపోవడం యోగం. అనాది యోగశాస్త్రాన్ని దాదాపు మూడువేల మూడువందల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి మరోసారి వివరించాడు. యోగశాస్త్రం ఆరు వేద దర్శన శాస్త్రాలలో ఒకటి. మానవాళికి మార్గదర్శనం చేసేది దర్శనాలు. పతంజలి హఠయోగం అని రాజయోగం అని యోగాభ్యాస పద్ధతులను వర్గీకరించాడు. హఠయోగం ప్రధానంగా శరీరానికి పుష్టిని కలిగించే వ్యాయామం. రాజయోగం శరీరానికి మనస్సునకు బుద్ధికీ కూడ సౌష్టవం కలిగించే ప్రక్రియ మాత్రమే కాదు. నైతికనిష్ఠను పెంపొందించే జీవనరీతి కూడ. అందువల్లనే యోగం కేవలం ఆసనాలకు, ప్రాణాయామానికి ధ్యానానికి పరిమితమైనది కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ యోగంలోని ఎనిమిది విభాగాలు. ఇవన్నీ మానవులు ఇరవైనాలుగు గంటల దినంలో సహజంగా పాటించదగిన జీవన సూత్రాలు. హింస చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. అత్యాశతో యాచించరాదు, దోచుకోరాదు, శుభ్రతను పెంపొందించుకోవాలి వంటి నైతిక సూత్రాలు యోగంలో భాగం. ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ్భారత కార్యక్రమం యోగం నిర్దేశించే స్వచ్ఛతలో భాగం. ఈ స్వచ్ఛత మానసిక పరిశుభ్రత, శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, పరిసరాల పరిరక్షణ కూడ.
యోగసూత్రాలకు దూరమైన జాతులు ఇతర జాతులను దోపిడీ చేయడం చరిత్ర. శక్తిని గాయాలను మాన్పడానికి-క్షతత్రాణ కార్యక్రమానికి-వినియోగించకుండా గాయాలను కలిగించడాన్ని ‘క్షతికారులు’ ఉపయోగించడం వల్ల ప్రపంచ సమాజం అల్లకల్లోలమైంది. సంతృప్తి చెందని జాతులు ఇతర దేశాలను దురాక్రమించడం ఇతర దేశాల ప్రజలను అణచివేతకు ఆర్థిక శోషణకు గురి చేయడం శతాబ్దుల చరిత్ర. కలసి జీవించడమన్న యోగం నష్టమై కలహించడమే ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజల సమష్టి స్వభావంగా మారింది. ఈ కలహించే ప్రవృత్తి మానసిక వికృతి. ఈ వికృతులు అంతర్గత సమాజంలో, అంతర్జాతీయ సమాజంలోను, వైరుధ్యాలను వ్యవస్థీకరించడం కొనసాగుతున్న వైపరీత్యం. మానసిక సంతులనం, మానసిక ప్రశాంతిని కోల్పోయిన వారు రకరకాల ఒత్తడికి గురి అవుతున్నారన్నది దాదాపు అన్ని దేశాలలోను ప్రచారమవుతున్న మనోవైజ్ఞానిక వాస్తవం. అందువల్లనే ప్రశాంతిని వెతుక్కుంటూ వివిధ దేశాలవారు యోగభూమి అయిన మనదేశానికి తరలిరావడం ఆధునిక పరిణామం. అలాగే ఈ దేశంనుండి తమ దేశానకి వచ్చిన వివేకానందస్వామి వారి నుండి మానసిక ప్రశాంతిని, నైతిక జీవనాన్ని నేర్చుకొనడానికి అనేక దేశాల ప్రజలు తపించడం కూడ ఆధునిక పరిణామం. యోగం, నేర్పడానికి నేర్చుకొనడానకి భారతీయ ధర్మాచార్యుల నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు, సంస్థలు, మందిరాలు, విశ్వవిద్యాలయాలు నెలకొంటుండడం కూడ ఆధునిక పరిణామం. ఈ ఆధునిక పరిణామం అతి ప్రాచీన పరిణామ క్రమానికి పునరావృత్తి. ఈ దేశానికి వచ్చి, ఈ దేశం నుండి పృథివీ తలంలోని సర్వమానవులూ జీవన సంస్కారాలను నేర్చుకొని వెళ్లడం అతిప్రాచీన చరిత్ర. ఈ జీవన యోగం మధ్యకాలంలో మరుగున పడింది. వివేకానందుని వంటివారి కృషి ఫలించి చరిత్ర మళ్లీ పునరావృత్తవౌతోంది. నైతిక నిష్ఠను జీవన సంస్కారాలను నేర్చుకొనడానికై ప్రపంచ ప్రజలు మళ్లీ భారతదేశం వైపు చూస్తున్నారు. భారత్ విశ్వ విజేత కావాలని ఆహంకరించడం లేదు. ఇదీ వౌలికమైన యోగం…ఈ యోగం వల్లనే భారతదేశం విశ్వగురువైంది.
యోగం పెరగడం వల్ల రోగం నశిస్తుంది. సృష్టి, ప్రకృతి, సమాజం, మానవుడు, పరస్పరం విభేదించే విరుద్ధ అంశాలు కాదు. పరస్పరం పరిపోషకమైన సహజ స్వభావ రూపాలు. ప్రకృతి తానేనని మానవుడు భావించినప్పుడు యోగం వికసిస్తుంది. ప్రకృతి తనకంటె భిన్నమని భావించిన మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. భౌతికమైన, మానసికమైన రోగాలకు ఇదీ కారణం. సమాజం తనకంటె భిన్నమని భావించడం వల్లనే మానవుడు ఆర్థిక రోగాన్ని విస్తరింపచేశాడు. ఈ రోగం దోచుకొనడం. ప్రకృతిని సామాజాన్ని పరిరక్షించడం వల్ల మాత్రమే తనకు సర్వాంగీణ వికాసం కలుగుతుందన్న సృష్టిగత సత్యాన్ని వ్యక్తి వ్యక్తిలో చిగురింపచేసే జీవన మాధ్యమం యోగం… యోగం సృష్టిక్రమం..


ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48
19- పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ-2
మరణం దాకా కవే
మళ్ళీ కవిత్వ ప్రవేశం చేసిన హార్డీ కొత్త శక్తీ ఉత్సాహ ప్రోత్సాహాలతో జీవిత చరమకం వరకూ రాస్తూనే ఉన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాక ఆయన అతి విలువైనకవితా సంపుటులు విడుదలయ్యాయి .కవిత్వ రచన కొనసాగిస్తూనే ఉన్నాడు .చాలా అర్ధవంతమైన వివాద రహితమైన అద్భుతమైన కవితలు రాశాడు దాదాపు తొంభై ఏళ్ళు వచ్చేదాకా .88 వ సంవత్సరం లో గొంతు బాగా బొంగురు పోయింది .శీతలం కమ్మింది .11-1-1928న88 వ ఏట థామస్ హార్డీ చనిపోయాడు .ఆయన చితా భస్మాన్ని వెస్ట్ మినిస్టర్ ఆబే లో భద్ర పరచారు ..కాని ఆయన రాసుకొన్న విల్లు ప్రకారం ఆయన గుండెను మాత్రం స్వగ్రామం డార్ చెస్టర్ లో ఖననం చేశారు .
హార్డీ మనసులోని భావనలు
తను చూస్తున్న సత్యాన్ని ,తన చుట్టూ ఉన్న హీన పరిస్తితులను అర్ధం చేసుకొన్నాడు హార్డీ .విక్టోరియన్ కాలానికి చెందిన విలువలు ,మాధుర్య ప్రకాశ వంతమైన జీవితం ఉన్నది అన్నదాని ఒప్పుకోలేదు .ఆ కాలపు కవిత్వాన్నీ పెద్దగా మెచ్చ లేదు. మరణ శయ్య పై ఉండి కూడా భార్యను తనకు అత్యంత ఇష్టమైన రుబాయత్ ను చదవమని కోరాడు .డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించిన హార్డీ మానవుడు ఈ విశ్వానికి ఆధారం అన్నమాటను తిరస్కరించి సైన్స్ ను కవిత్వం లో పోదిగాడు .పంచభూతాలు మనిషికి శత్రువులూ కారు ,మిత్రులూ కారు అన్నాడు .వ్యత్యాసం అనేది సృష్టిలో ఉన్న లక్షణం అన్నాడు .వర్డ్స్ వర్త్ మహా కవి చెప్పిన ప్రక్రుతి ప్రేమకు బ్రౌనింగ్ ఆశావాదానికి ,స్విన్ బరన్ విశ్వం దైవం తో ముడిపడిలేదు అన్నదానికి జవాబుగా ఫాటలిజం ను చెప్పాడు హార్డీ . కర్షకుని కష్టాలకు మనిషిని జంతువుగా చూసే విధానాన్ని తప్పు పట్టాడు . విశ్వాన్ని ఎవరో పాలిస్తున్నారు అన్నదానికి బదులు దాన్ని అనుకోని సంఘటనలే పాలిస్తున్నాయన్నాడు .దేవుడికి మానవుల మీద ఉన్న మమకారాన్ని మర్చి పోయాడన్నాడు .దైవం యొక్క అపజయాలలో ఇదొకటి అంటాడు .క్రూరత్వామో కారుణ్యమో ప్రపంచాన్ని పాలించటం లేదు .చాన్స్ అంటే అవకాశాలే పాలిస్తున్నాయి .’’grass casualty obstructs the sun and rain ‘’ అని భావించాడు హార్డీ .’’Hardy accepted the stern realities without joy .’’
కుంచించుకు పోతున్న ప్రపంచాన్ని గురించే హార్డీ రాశాడు .మానవ నాటకం మీద పెద్దగా ఆసక్తి చూపలేదు .సాను భూతిలేని ప్రపంచాన్ని అసహ్యించాడు .గౌరవం గా జీవించాల్సిన మానవుడు బతుకు పోరాటం లో ఒక నేరస్తుడి విషాదం పాలౌతున్నాడని అంటాడు . Hardy realized that the true satisfaction of life lies in imaginative conflict .What ever their ultimate purpose ,men are alive only while they struggle .. When they grow aware of the futility of their effort ,and yet strive to fashion some thing from it ,they become noble ‘’అని సీగ్ ఫ్రీడ్ ససూన్ అన్నాడు .డబ్ల్యు ఆడెన్ ‘’his hawk’s vision ,his way of looking at life from a great height ‘’అని విశ్లేషించాడు
హార్డీ రాసిన ‘’ the dark eyed gentleman ‘’ కవిత జానపద సాహిత్యాన్ని పోలి ధారా పాతంగా ఉంటుంది .కవిత్వం లో వాడి వేడి సంభాషణాత్మక జాతీయాలు వాడి ఆధునిక కవిత్వానికి దారి చూపాడు హార్డీ .కవిత్వాన్ని కొత్త రక్త మాంసాలు ఇచ్చాడు .జార్జి ఇలియట్ కు చెందిన విక్టోరియన్ రియలిస్ట్ హార్డీ .నవలలో కవిత్వం లోవర్డ్స్ వర్త్ రోమాంటిజం ప్రభావం ఉంది .హార్డీ పై చార్లెస్ డికెన్స్ ప్రభావమూ ఎక్కువే .డికెన్స్ లాగే విక్టోరియ సమాజపు అవశేషాలను ఏవ గించాడు .
డి.హెచ్ లారెన్స్ ను అత్యంత ప్రభావితం చేసిన వాడు హార్డీ .హార్డీ భావనలనే పెంచి లారెన్స్ తన పాత్రలను సృష్టించాడు .అమెరికా నాటక కర్త క్రిస్టఫర్ దురాంగ్ నాటక పాత్రలపై హార్డీ ప్రభావం అధికం .సుమారు 18 నవలలు ,రాశాడు .14 కవితా సంపుటులు తెచ్చాడు .మూడుభాగాల ది డైనాస్టి అనే బృహన్నాటకం రాశాడు .30 కి పైగా కధలూ రాశాడు .
The irony and struggles of life and a curious mind led him to question the traditional Christian view of God:
The Christian god – the external personality – has been replaced by the intelligence of the First Cause…the replacement of the old concept of God as all-powerful by a new concept of universal consciousness. The ‘tribal god, man-shaped, fiery-faced and tyrannous’ is replaced by the ‘unconscious will of the Universe’ which progressively grows aware of itself and ‘ultimately, it is to be hoped, sympathetic’.[41]
![]()
| Signature |
|---|
సశేషం
మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47
19- పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ
నెల తక్కువ పిల్లాడు
19 20 శతాబ్దాలకు వారధి వంటి కవి థామస్ హార్డీ –అతనికవిత్వం లో సగం రొమాంటిక్ గా మిగిలిన సగం రియలిస్టిక్ గా ఉండటానికి ఇదే కారణం .ఇదే విక్టోరియా యుగపు ఆఖరి లక్షణం. హార్డీ రాసిన చురుకైన ,చిక్కని కవిత్వమే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసింది .2-6-1840లో ఇంగ్లాండ్ లోని డార్ చెస్టర్ లో పుట్టిన హార్డీ గ్రామం గొప్ప లాండ్ స్కేప్ లకు నిలయం .దీనికే తర్వాత వేస్సేక్స్ అనే పేరొచ్చింది .అతని కవిత్వానికి నేపధ్యం ఈ ప్రదేశమే .అతని కుటుంబ వృక్షపు వ్రేళ్ళు ఇక్కడే బలం గా పాతుకు పోయి ఉన్నాయి .తల్లి తరఫు వారిది వ్యవసాయ వ్రుత్తి .తండ్రిది రాతి పని చేసే తాపీ వ్రుత్తి .హార్డీకి తలి దండ్రుల నుండి మొరటు తనం అబ్బలేదు . నెలలల కంటే ముందే పుట్టటం తో ఒక నర్సు అతడిని బతికించింది. రోగిష్టి అవటం తో స్కూల్ కు పంపలేదు .ఇంటిదగ్గరే తల్లి రక్షణలో ఉండి ఆమె చెప్పిందే నేర్చాడు .ఈ ‘’నెల తక్కువ వాడు ‘’ఆరేళ్ళ కంటే బతకడు అని అందరూ ‘’దీవిస్తే ‘’ సుబ్భరం గా 88 ఏళ్ళు జీవించి అందరినీ ఆశ్చర్య పరచాడు . భూమ్మీద పడిన నాటి నుండి సంచలనమే సృష్టించాడు హార్డీ .
భవన నిర్మాణం-పెళ్లి
ఎనిమిదో ఏడు రాగానే అయిష్టంగానే బడికి పంపారు .ఏది నేర్చినా తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకొన్నాడు హార్డీ .16 ఏళ్ళకు మామూలు విద్య పూర్తీ చేశాడు .కొడుకును ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తండ్రి పనిలో కుదిర్చాడు . ఆతర్వాత ఆర్కిటెక్చర్ లో నిపుణుడైన మరో వ్యక్తీ వద్ద చేర్చాడు .20 వ ఏట రాయల్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ నుంచి ఒక అవార్డ్ వచ్చింది .ఇది అతని విద్య ను చూసి ఇచ్చిన్దేకాని ఆర్కిటెక్చర్ పనికి మెచ్చి ఇచ్చి౦ది కాదు . బిల్డింగ్ లు నిర్మించటం కన్నా బుక్స్ మీద ఆసక్తి ఉండేది కాని 27 వ ఏట ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు .30 వ ఏట కారన్ వాలిస్ వెళ్లి ఒక చర్చి ని పునర్నిర్మించాడు .అక్కడ వికార్ వదిన ఏమ్మా గిల్ ఫోర్డ్ తో ప్రేమలో పడి పెళ్ళాడాడు .
కవిత్వం నుంచి నవలకు జంప్
అప్పటికే హార్డీ కవిత్వం రాస్తున్నాడు .కాని పత్రికలూ మాత్రం ప్రచురించలేదు .రాళ్ళల్లో సూక్తుల సరస్వతీ కటాక్షం ఉన్నా కడుపుకు తిండి పెట్టె లక్ష్మీ కటాక్షం లేదని గ్రహించి. ఆర్కి టేక్చర్ కు గుడ్ బై చెప్పేశాడు .రచనలతోనే సంపాదన పొందాలని భావించాడు .కవిత్వం డబ్బేమీ చేపటం లేదని గ్రహించి ఫిక్షను కు ఫిక్స్ అయ్యాడు .’’ది పూర్ మాన్ అండ్ ది లేడి ‘’అనే మొదటి నవల రాశాడు .కాని ఇందులో ప్లాట్ ఏమీ లేదని పబ్లిషర్ ప్రచురించ లేదు .కోపం వచ్చి రాసిన దాన్ని తగల బెట్టి మరోనవల ‘’డేస్పెరేట్ రేమిడీస్ ‘’రాశాడు .ఇందులో వస్తువు పాత్రల్ని డామినేట్ చేసింది .స్వంత చిలుం వదిలించుకొని అచ్చేసి వదిలాడు .కాని వ్యతిరేకమైన సమీక్షలు మరీ నీరు గార్చాయి .లెక్కచేయకుండా ‘’అండర్ ది గ్రీన్ వుడ్ ట్రీ ‘’,’’ఏ పైర్ ఆఫ్ బ్లూ ఐస్ ‘’అనే రెండు నవలలలు రాసి వదిలాడు .దీనితో తాను ఒక రచయితను అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఒక మేగజైన్ నవల రాయమని హార్దీని కోరింది .ఇప్పటికి తానేమిటో లోకం అర్ధం చేసుకోన్నదనుకొన్నాడు .దీని ఫలితమే ‘’ఫార్ ఫ్రం ది మాడేనింగ్ క్రౌడ్ ‘’నవల .ఈ నవల ఆర్ధికం గా విజయాన్నిచ్చి సాహిత్యం లోనూ పేరును నిల బెట్టింది .జార్జి ఇలియట్ కు ఘోస్ట్ రచయిత హార్డీ అని ఒకడు బాంబు పేల్చాడు .హార్డీ నవలలో వేస్సేక్స్ గ్రామీణ వాతావరణాన్ని మనుష్యుల తీరు తెన్నులను చాలా శక్తి వంతం గా ప్రదర్శించాడు .కాని సబ్జెక్ట్ మీదపూర్తీ అధారిటీ రాలేదు .
ముప్ఫై ఏళ్ళ వయసులో చూడటానికి పెద్దగా ఆకర్షణీయం గా ఉండేవాడు కాదు .సాధారణ పొడవుతో ,నీలి కళ్ళతో ,పల్లెటూరి రై(బై )తు లాగా కనిపించేవాడు . భార్య తో కొంతకాలం లండన్ లో కాపురమున్నాడు .నలభై లలో వరుసగా గుండె పోట్లు రావటం ప్రారంభించి బతుకే ప్రమాదం అనే స్థితికి వచ్చింది .అయినా మరో నవల చాలా తీవ్రంగా రాస్తూనే ఉన్నాడు .
బాక్ టు పెవిలియన్
. ఈ నవల తో ఆపేసి తాను మొదటి నుంచి మక్కువ పెంచుకొన్న కవిత్వం తోనే కాలం గడపాలని నిర్ణయానికి వచ్చాడు .రెండేళ్ళ తర్వాత లండన్ వదిలి తన స్వగ్రామం డార్చేస్టర్ చేరి మళ్ళీ ఆర్కిటెక్ట్ అవతారం ఎత్తి స్వంత ఇల్లు’’మాక్స్ గేట్’’ నిర్మించుకొన్నాడు . దీన్ని చూడటానికి ఎందరో సందర్శకులు వస్తూంటారు .కొంచెం సిగ్గూ ,ఒంటరితనం ఇష్టపడే హార్డీ లండన్ లోని పబ్లిక్ జీవితం కంటే ప్రైవేట్ జీవితం లోనే ఆనందం ఉందని భావించి డార్చేస్టార్ కు వచ్చానని చెప్పుకున్నాడు
బెడిసి కొట్టిన నవలలు .
1874-1890 మధ్య పదహారేళ్ళకాలం లో ఎనిమిది నవలలు 30 చిన్నకధలు రాశాడు .అన్నీ డబ్బును వర్షించాయి .యాభై వ ఏట ‘’టేస్స్ ఆఫ్ దిడి అర్బేర్ విల్లీస్ ‘’నవల రాసి ప్రచురించాడు .దీనిపై విమర్శకులు విరుచుకు పడ్డారు .మేగజైన్ లో ప్రచురణార్హం కాదన్నారు .దీనికి సమాధానం గా ‘’జూడే ది అబ్ స్క్యూర్ ‘’రాశాడు .ప్రకృతి ధర్మాలకు విరుద్ధం గా రాశాడని అనైతికతను ప్రోత్సహించాడని ఈస డించారు .మనిషి అంతర్ స౦ఘర్షణకు ,బాహ్య క్రూరత్వానికి బలై చనిపోవటం ఇందులోకద .దీన్నే అమెరికాలో’’ జూడే ది అబ్ సీన్ ‘’గా ప్రచురించినా విమర్శల జడివాన తప్పలేదు .దాన్ని నిరసించారు అవహేళన చేశారు .’’ఫిల్ది నావెల్ ‘’అన్నారు ఒకాయన ఆ నవలను తగల బెట్టి దాని బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపి కోపం తీర్చుకొన్నాడు .దీనితో ఇక నవలల జోలికి వెళ్ళ కూడదనే నిర్ణయానికొచ్చాడు .ఈ విషయాన్నే హార్డీ ‘’I have to give up verse for prose in order to make a living –in later life referred to my novels as’’ pot boilers ‘’ and ‘’wretched stuff ‘’and I returned with joy as well as relief to poetry ‘’అని చెప్పుకొన్నాడు .
బాక్ టు పెవిలియన్ –మహత్తర బృహన్నాటకం
సుమారు అరవైవ వసంతం లో హార్డీ మొదటి కవితా సంపుటి ‘’వేస్సేక్స్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఇందులో 30 ఏళ్ళుగా రాసిన లిరిక్కులు బాలడ్లూ కలిసి ఉన్నాయి .జనానికెవరికీ పట్టనే లేదు .నాలుగేళ్ల తర్వాత’’పోయెమ్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’సంపుటి వెలువరిస్తే కొంత మెరుగైన ప్రోత్సాహం లభించింది .ఇక ఈ ముసలాడి పని అయి అయిపొయింది ఇక రాసే దమ్ము లేదు అని అందరూ అను కొంటూ ఉండగా ఆశ్చర్య పరుస్తూ ‘’ది డైనాస్త్స్ ‘’అనే నాటకం మొదటి భాగాన్ని వదిలి , నాలుగేళ్ళ తర్వాతా దాన్నిమూడు భాగాలతో పూర్తీ చేశాడు .ఇందులో నెపోలియన్ యుద్ధాలకు సంబంధించిన విష యాలు పరమనాటకీయం గా ఉన్నాయి 19 అ౦కాలతో ,130 సీన్లతో బృహత్తరంగా ఉన్న నాటకం ఇది ..విమర్శకుల నోళ్ళు మూసుకు పోయాయి .అప్పటిదాకా హార్డీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొన్నారు .లండన్ టైమ్స్‘’the dynasts combines ,as only a work of genius could combine ,a poetic philosophy with minute historical knowledge and a shrewd eye for the tragical and comical ways of men and women ‘’అని అభి వర్ణించింది .లాసేల్లెస్ ఆబెర్ క్రోమ్బీ అనే ప్రముఖ విమర్శకుడు ‘’the biggest and most consistent exhibition of fatalism in literature ‘’అని కీర్తించాడు ‘’ఫాటలిజం’’ అంటే జీవితం లో జరిగే సంఘటనలు ముందే దైవ నిర్ణయాలై ఉంటాయి వాటిని మనం మార్చలేము అని అర్ధం .ఫేట్ కు సంబంధించింది ఫాటలిజం మన భాషలో ‘’విధి లిఖితం ‘’.
దూషణలకు బదులు భూషణలు-పురస్కారాలు
ఇప్పటిదాకా అంటీ ముట్టనట్టు ఉన్న సమాజం ఒక్కసారి హార్డీ ని గుర్తించింది. కేర్తి కిరీటం పెట్టింది .విమర్శల జడివాన పోయి పొగడ్తల పూల వాన కురిపించారు. అభినందనల వెల్లువ సాగింది .సన్మాన పరంపర ,సత్కార హోరూ పెరిగాయి .లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారి స్వర్ణ తకం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకొన్నాడు హార్డీ .ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ ,బ్రిస్టల్ యూని వర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించి సత్కరించాయి .రాయల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ వారు హార్డీకి ఫెలో షిప్ అందజేశారు .తన డార్ చెస్టర్ స్వగ్రామం ఇంతటి ఘన విజయాలను సాధించి ఇచ్చింది అనుకొన్నాడు .72 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది .ఎంతోకాలం గా తన దగ్గర సేక్రటరిగా పని చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు హార్డీ .ప్రఖ్యాత రచయిత సోమర్ సెట్ మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఏల్ ‘’నవల హార్డీ కుటుంబ జీవితమే అని విశ్లేషకుల భావన .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు
జననం –విద్య
శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళవరదాచార్యుల వారు అంటే ఎవరికీ తెలియదుకాని ఎస్. టి .జి .వరదాచార్యులు అంటే యిట్టె అందరికి తెలిసి పోతుంది .ఆ పేరుతో అంత ప్రాచుర్యం పొందారు .కృష్ణా జిల్లా బందరు దగ్గరున్న చిట్టి గూడూరు లో విద్యా వైదుష్యాలకు నెలవైన సంపన్న వైష్ణవ కుటుంబం లో వరదా చార్యుల వారు 4-8-1892జన్మించారు .మచిలీ పట్నం హిందూ హై స్కూల్ లోను , అక్కడి నోబుల్ కళాశాలలో ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజి లోను విద్య నభ్యసించి సంస్కృతం లో ఏం. ఏ .ఆనర్స్ డిగ్రీ పొందారు .
గీర్వాణ సేవ
డిగ్రీ పొందిన తర్వాత విజయనగరం మహా రాజా వారి సంస్కృత కళాశాలలో కొంతకాలం ,ప్రదానాధ్యాపకులుగా పని చేశారు .తర్వాత ప్రాచ్య పాఠశాలల (ఓరియెంటల్ స్కూల్స్ )పాలనా వ్యవహారాలను పర్య పర్య వేక్షించే అధికారిగా వ్యవహరించారు .
స్వంత గ్రామం లో ప్రాచ్య కళాశాల స్థాపన
ఆ తర్వాత స్వగ్రామం చిట్టి గూడూరు చేరి తమ తండ్రి గారి పేరిట ప్రాచ్య కళాశాలను ప్రారంభించారు .నిర్వాహక సమితికి అధ్యక్షులుగా ఉన్నారు .ఉవ్వెత్తున ఎగసిన భారత జాతీయోద్యమ కాలం లో జాతీయ విద్యను బోధించాలనే సంకల్పం తో జాతీయ విద్యా పరిషత్తును ఏర్పరచి కార్య దర్శిగా ఉండి జాతీయ కళాశాల ను మచిలీ పట్నం లో ఏర్పాటు చేశారు .దీన్ని తీర్చి దిద్దటం లో ఆచార్యులవారు తీసుకొన్న శ్రద్ధా చొరవ మాటల తో వర్ణించ లేనంత గొప్పది .
భద్రాచల రామాలయ జీర్ణోద్ధరణ
వరదాచార్యుల వారు ఆగమ శాస్త్రం లోను నిష్ణాతులు .భద్రాచలం లోని శ్రీ సీతా రామ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కమిటీ ఉపాధ్యక్షులై అహరహం శ్రమించి నిర్మించారు .
ఆచార్యుల వారి గీర్వాణ రచన
వరదాచార్యుల వారు తెలుగు శతకాలను ఏడింటిని సంస్కృతం లోకి అనువదించారు .వీటిని ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి ముద్రించిం వెలువరించింది .’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’అనే తులనాత్మక భాషా శాస్త్ర గ్రంధాన్ని ఆచార్యుల వారు సంస్కృతం లో రచించి అనన్య కీర్తి సాధించారు .అది పరమ ప్రామాణిక గ్రంధం గా పేరు పొందింది .
గౌరవ పురస్కారాలు
రాష్ట్ర, రాష్ట్రేతర విశ్వ విద్యాలయాలలో ‘’పాఠ్య గ్రంధ నిర్ణయ పరిషత్తు’’ లో సభ్యులుగా అధ్యక్షులుగా వరదాచార్యుల వారు పని చేశారు .వీరి సమర్ధతకు తగిన పదవి .ఇది ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమి వరదా చార్యుల వారికి 1969 విశిష్ట సభ్యత్వం అందజేసి గౌరవించింది . ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది 90 ఏళ్ళు సార్ధక జీవనం గడిపిన విద్యా వరదు లైన శ్రీ వరదాచార్యుల వారు 2-11-1982న శ్రీ వైకుంఠ౦ చేరుకొన్నారు. ..

సశేషం
150- కామ ప్రబంధం రాసిన రాజయోగి –దక్షణా మూర్తి పరమ హంసస్వామి
ఒక అనామక మంగయ్య పరమ హంసగా మారాడు అంటే ఆశ్చర్యం వేస్తు౦ది కాని ఇది పక్కా నిజం .అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చరిత్ర .
బాల్యం
విజయనగరం దగ్గర మెట్ట లో న్యాయ వాది సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 మంగయ్య గారు జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు కనిపించి ఏమికావాలని ఆయన కోరితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని మంగయ్య కోరితే బలవంతం గా సిద్ధుడు హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దాన్ని అనుస్టించటం వల్ల మంగయ్యకు వాక్సుద్ధి కలిగింది .ఊరవతల గుట్టలలపై ఏకాంతం గా ఎప్పుడూ కూర్చునే వాడు .ఒక రోజున ఎవరిదో బంగారు నగ పోతే మంగయ్యను అడిగితే నగ ఇక్కడికే వస్తుందని చెప్పాడు .ఇంతలో ఒక కాకి ఆ నగను ముక్కుతో కరచుకొని తీసుకొచ్చి ఆయన ఉన్న చెట్టుపై చేరి కిందికి జార విడిచింది .ఈ విషయం తెలుసుకొన్న ఊరి జనం మంగయ్య కారణ జన్ముడు మహాత్ముడు అని భావించారు .
ఉపనయనం –విద్య
మంగయ్యకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు .పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ,తెలుగు ,ఆంగ్లం నేర్చుకొన్నాడు .ఒక సారి ఇంటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన మీద పడింది .అందులో ఉన్న పదార్ధాన్ని ఒళ్లంతా రాసుకొన్నాడు .ఆ కాయను బొడ్డులో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం వెళ్లి హైస్కూల్ లో చేరి సెకండరీ విద్య పూర్తీ చేసి ,ఇంటికి వచ్చి తండ్రి దగ్గర శైవ మంత్రాలను ఉప దేశం పొందాడు .
పెళ్లి –రాజయోగ ,హఠయోగ విద్య
పదహారవ ఏట మంగయ్యకు పెళ్లి అయింది .రైల్వే లో పని చేసే ఒకాయన రాజ యోగం క్షున్నం గా నేర్పాడు .యోగ ప్రభావాన్ని చూపించమని స్నేహితులు బలవంతం చేశారు ..అదే సమయం లో ఒక బండీవస్తుంటే దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమని సవాలు చేశారు .మంగయ్య యోగ శక్తితో ఆ బండీని అనేక సార్లు ముందు, వెనకలకు నడిపించి ఆశ్చర్య పరచాడు .కొంతకాలం తర్వాత బాలానంద పరమ హంస అనేసిద్దేశ్వర బ్రహ్మ చారి అనే ఉత్తర దేశీయుని వద్ద రాజ ,హఠయోగ రహస్యాలు ఆకళింపు చేసుకొన్నాడు .
గణితం నుంచి వేదాంతం లోకి
మద్రాస్ వెళ్లి క్రిస్టియన్ కాలేజి లో చేరి గణితం లో బి .ఏ. చదివాడు .ఒక సారి కాలేజి లో జరిగిన డిబేటింగ్ పోటీలో గణిత ఉపన్యాసకుడు ‘’సైకాలజీ లో ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్ ‘’ అని వాదిస్తే ,కోపం తో లెక్కల సబ్జెక్ట్ ను వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొని చదివాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ‘’ఘట్టాన్ని పేరులో ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .ముఖ్య శిష్యుడయ్యాడు .గురు శిష్యులిద్దరూ తరచుగా కావ్య గోష్టితో కాల క్షేపం చేసేవారు .ఒకసారి ప్రయోగం కోసం ఈ గురు శిష్యులు గంజాయి దమ్ము కొట్టారు .గురువు శాస్త్రి గారు దిమ్మ తిరిగి పడిపోయారు .శిష్యుడు నిమ్మకాయ నీళ్ళు తాగించి పైత్యం వదిలించాడు .ఇద్ద్దరూ ఒక సారి శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి అందులో దుష్యంతుడు శకుంతలకు చేసిన అన్యాయాన్ని సహించలేక పూర్తిగా చూడ కుండా లేచోచ్చారు .బి ఏ .పూర్తి అయ్యే సరికి మంగయ్య లోని తర్క శక్తి పట్ట పగ్గాలు లేకుండా శిఖరారోహణం చేసింది .
లౌకిక ఉద్యోగాలు –అలౌకిక సాధన
నాడీ శుద్ధి, కుంభక ప్రాణాయామం సాధిస్తూ మంగయ్య ఒంటి పూట భోజనం మాత్రమె చేస్తుంటే క్షయ రోగం పట్టుకుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని కొడుకు రోగం తగ్గించాడు .మంగయ్యకు తండ్రి మేధా దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేశాడు .మంగయ్య పర్లాకిమిడిలో పోలీస్ హెడ్ క్లార్క్ గా కొద్దికాలం పని చేశాడు .ఉద్యోగం వదిలేసి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శిగా పని చేశాడు .ఒక సిద్ధుడు మంగయ్యకు శ్రీ స్వప్నాన్జనేయ ,శ్రీ వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియ జేశాడు .
స్కూల్ మేష్టారు మంగయ్య
భార్య ,పిల్లల్ని మామ గారింట్లో వదిలేసి మంగయ్య మద్రాస్ వెళ్లి ఎల్. టి . ట్రెయినింగ్ (ఉపాధ్యాయ శిక్షణ ) లో చేరాడు .మంగయ్య రాసిన ఇంగ్లీష్ రచనలు చూసి అతని ప్రతిభకు సంమోహితుడై ‘’ఈరాక్ ద్రు’’అనే ఆంగ్ల దొర గుండెలు బాదుకొన్నాడు .తర్వాత నిజాం రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరి పని చేశాడు .ప్రభుత్వం మంగయ్య ప్రతిభను గుర్తించి బి .ఎడ్. జిల్లా కేంద్ర ఉన్నత విద్యాలయానికి హెడ్ మాస్టర్ గా నియమించింది .
శ్రీ కృష్ణ సాక్షాత్కారం –మహిమా ప్రదర్శన
మంగయ్య నిజామాబాదు లో ఉన్నప్పుడు గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ఈయన వద్ద ‘’సమాధి భేదాలు ‘’నేర్చుకొన్నారు .మంగయ్య ఋగ్వేద ,యజుర్వేదాలను గురుముఖతా అభ్యసించారు .రామస్వామి అయ్యర్ ‘’వాసు దేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దీని వలన మంగయ్య గారికి శ్రీ కృష్ణ సాక్షాత్కారం కలిగింది .హైదరాబాద్ గౌలి గూడా లో కాపురమున్నారు .ఇద్దరు స్నేహితులకు వేర్వేరు చోట్ల ఒకే సారి కనిపించి ఆశ్చర్య పరచారు .హరిహత్ దంపతులు శివ జపం చేస్స్తుంటే అనుకోకుండా ప్రత్యక్షమై మంగయ్యగారు రుద్రాభి షేకం చేసి మై మరపించారు .శిష్యుడు ఒకడికి మంగయ్య గారు అగ్ని జ్వాలల మధ్య కనిపించారు. భయ పడి వాడు పారి పోతుంటే మళ్ళీ యధాస్థితికి వచ్చారు .పశు సంవర్ధక శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివ లింగం ఇచ్చి ఆ తర్వాత వరుసగా పదకొండు లింగాలు ఇచ్చారు. గృహస్తాశ్రమ జీవనం గడుపుతున్నా మంగయ్యగారు శ్రీ రామ శ్రీ కృష్ణులు లాగా బ్రహ్మ చారులే. విదేశీ డాక్టర్లు ఈ విషయం పై పరి శోధన చేసి నిర్ధారించారు .
వశ్య వాక్కు మంగయ్య
మంగయ్య గారి పెద్ద కుమారుడి వివాహముహూర్తాన్ని తానె నిర్ణయించి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు ,పండితులు ఈ ముహూర్తానికి కేతు ,కుజ వేధలు ఉన్నాయని ఆ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు ..ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని మంగయ్య గారు వాదించారు .పెళ్ళికొడుకుని రామాలయానికి తీసుకు వెడుతుంటే పాము అడ్డమొచ్చినది .కదలటానికి వీల్లేదన్నారు స్థానిక పండితులు .’’ఇదే నయ్యా కేతు వేద అంటే ‘’ అని మంగయ్య గారు చెప్పారు .పాము మాయ మై పోయింది .పెళ్లి కొడుకును కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వెళ్ళారు . పీటల మీద వధూ వరులను కూర్చో బెట్టారు .ముహూర్తం కోసం పండితులు జుట్టు పీక్కుంటూ గడియారాలను తదేకం గా చూస్తూ ఉండిపోయారు.ఒకళ్ళ టైం నాలుగు ,అని, ఒకళ్ళ గడియారం ఏడు అని ,మరొకరిది ఆగి పోయిందనీ చెప్పారు .మంగయ్య గారు ‘’ఇదేరా బాబూ కుజ వేద అంటే ‘’అని చెప్పి అక్షింతలు తాను తీసుకొని ,అందరికీ ఇప్పించి అందరి చేత అక్షింతలు వేయించి తాను పెట్టిన శుభ లగ్నానికే కుమారుని వివాహం జరిపించారు ‘’ఇప్పుడు మీ గడియారాలు చోసుకోండి ‘’అన్నారు మంగయ్య .అందరి గడియారాలు మంగయ్య గారు పెట్టిన ముహూర్త సమయాన్నే చూపించాయి . అందరూ ముక్కు మీద వేలేసుకొన్నారు దట్ ఈజ్ మంగయ్య .వశ్య వాక్కు మంగయ్య అయ్యారు .మంగయ్య గారి మహా శక్తికి అఘటన ఘటనా సామర్ధ్యానికి నివ్వెర పోయారందరూ .
మరిన్ని మంగయ్యగారి మహిమలు
దేవీ దాసు అనే వాడికి ఏ .బి. సి. డి. లు కూడా రావు .వాడితో కొన్ని గంటల సేపు ఇంగ్లీష్ లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్యగారు .తనకు’’ షోడశీ’’ మంత్రాన్ని ‘’దేవుజీ మహా రాజు ‘’గారే వచ్చి ఇస్తారని మంగయ్య గారు ముందే చెప్పారు .అందరూ గణం జయ మహారాజు తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .సమయానికి గణం జయుడు రాలేదు .దేవూజీయే వచ్చి మంత్రం దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత అమోఘమైనది .
మంగయ్య గారి విద్యా వైదుష్యం –గీర్వాణ రచన
మంగయ్యగారి విద్యా వైదుష్యం నిరుపమానమైనది .ఆంగ్లం లో అయిదు పద్యకావ్యాలు రాశారు .పదహారు ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు .సంస్కృతం లో ‘’కామ ప్రబంధం ‘’,’’దక్షిణ గీత ‘’’’సౌభాగ్య రత్నాకరం ‘’’’అద్వైత పారిజాతం ‘’,’’వ్యావహారిక దర్పణం ‘’వంటి అలౌకిక గ్రందాలనేన్నిటినో రాశారు .సంస్కృతం లో స్తుతి స్తోత్ర రచనా చేశారు .’’ధర్మాస్టకం ‘’వంటి అస్టకాలూ రాశారు .
కాలచక్ర గమనాన్ని ప్రత్యక్షం గా దర్శింప జేసిన మహాత్ముడు మంగయ్యగారు
ఒక శిష్యుడు కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూడాలని ఉందని మంగయ్యగారిని వేడుకొంటే అతనికి కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లు వైఖరీ వాక్కు తో జపించే మంత్రాన్ని మంగయ్యగారు పశ్యన్తీ వాక్కు తో ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో తన మేడ మెట్లు దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్యగారు వైఖరీ వాక్కులో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు.అంటే మంగయ్య గారికి సమస్త జీవ రాశుల జన్మ వృత్తాంతాలు పూర్తిగా తెలుసు అని అర్ధమౌతుంది మనకు .
మంగయ్య గారి ప్రముఖ శిష్యులు
మంగయ్య గారికి జాతి మత భేదాలు లేకుండా ఎందరో శిష్యులైనారు .అలాంటి వారిలో జర్మన్ విద్వాంసుడు ‘’స్పర్జ్ ‘’, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ‘’బర్నెట్ ‘’,విద్యా మంత్రి ‘’నవాబ్ ఆజం యార్ జంగ్ ‘’,ఇంజనీరింగ్ మంత్రి ‘’మొహిదీ నవాబ్ జంగ్ ‘’,గణితా చార్యుడు ‘’సయ్యద్ సిరజుల్ హసన్ ‘’మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు .
మంగయ్య గారి స్పెషాలిటీ
మంగయ్య గారికి ఒక విచిత్రమైన అలవాటు ఒకటి ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షింతలు ఉంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంటూ ఉండేవారు .నడుస్తున్న ,కూర్చున్నా తమలో తాము మాట్లాడుకొంటూ ఉండేవారు ఇవి పరమహంస లక్షణాలు .మంగయ్యగారురాసిన ఒక ఇంగ్లీష్ పుస్తకానికి పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంవారు ‘’ఈ గ్రంధం లోని అభిప్రాయాలను గ్రహించటానికి ౩౦౦ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు .అంత క్లిష్టమైన లోతైన రచన అన్నమాట .
మంగయ్యే దక్షిణా మూర్తి పరమ హంస స్వామి
బాల బ్రహ్మ చారి అని పేరు పొందిన ‘’చిన్మయా నంద స్వామి ‘’మంగయ్య గారికి సన్యాస దీక్షనిచ్చి ‘’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమనామాన్ని ఇచ్చారు .స్వామి ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .ఎందుకోకాని అక్కడ మంచి ఫలితం రాలేదు .విశాఖ పట్నం వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసుకొని శ్రీ లలితా దేవి ని ప్రతిష్టించారు .ఆ ప్రాంతం లలితానగర్ గా పేరు పొందింది .
పరమ హంస సిద్ధి
దక్షిణామూర్తి పరమ హంస స్వామి 1954లో 92 వ ఏట సిద్ధిపొందారు .స్వామి ముఖ్య శిష్యులు ‘’వాల్వేకర్ ‘’ఆశ్రమాదికారి అయి అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేసి 1995లో సిద్ధి పొందారు .వీరిని గురువుగారి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు ఈ లలితాశ్రమాన్ని కుర్తాళం పీఠాదిపతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )28-6-1998 లో దత్తత తీసుకొని శ్రీ రామానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలు అప్ప గించారు .
(ఆధారం –నేను రాసిన ‘’సిద్ధ యోగి పుంగవులు’’పుస్తకం )
మనవి- ఆధునిక సంస్కృత రచయితలైన సర్వశ్రీ కోగంటి సీతా రామాచార్యులు ,కొలచల యజ్న నారాయణ దీక్షితులు అనే క్షేమేంద్ర , ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి , ల గురించి నాకు వివరాలు ఏవీ దొరక లేదు .ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటె ,నాకు తెలియ జేస్తే వారి గురించి కూడా రాస్తాను .నేను మరచి పోయిన ఇంకా ఎవరైనా ఆధునిక సంస్కృత రచయితలు ఉంటె కూడా నాకు తెలియ జేస్తూ వారి వివరాలూ మీకు అందుబాటులోఉంటే నాకు తెలిపి నా గీర్వాణ సేవకు చేయూత నివ్వమని అర్ధిస్తున్నాను .దుర్గాప్రసాద్ -18-6-15-
మరో మనవి – నా గీర్వాణ కవుల కవితా గీర్వాణం గ్రంధం చదివి ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు (హైదరాబాద్ ) నేను మరింత సమాచారం తెలుసుకోవటానికి వీలుగా శ్రీ ఏం.కృష్ణ మాచారియార్ గారుఆంగ్లం లో రచించి 1937లో ప్రచురించ బడిన ‘’History of classical Sanskrit Liiterature ‘’ గ్రంధాన్ని చదవమని సలహా ఇచ్చారు .ఈ విషయం తెలుసుకొని వెయ్యి పేజీల ఈ మహా గ్రంధాన్ని నాకు, సరసభారాతికి అత్యంత ఆప్తులైన శ్రీ మైనేని గోపాల కృష్ణగారు దాన్ని కొని ,దానితోపాటు మరికొన్ని సంస్కృత గ్రంధాలను కూడా నాకు మే నెలలోనే అందేట్లు పంపారు. వారి సుహ్రుదయతకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .
పై గ్రంధం ఆధారం గా మిగిలిన పూర్వ గీర్వాణ కవుల కవితా గీర్వాణ వైభవాన్ని ‘ఈ రెండవ భాగం లో 150 వ కవిగా ‘’వత్స భట్టి ‘’తో ప్రారంభించి వీలు కుదిరినప్పుడల్లా రాస్తానని మనవి చేసుకొంటూ ,శ్రీ గోపాల కృష్ణగారికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-15 –ఉయ్యూరు
151— ‘’ ప్రశస్తి ‘’రచించిన వత్స భట్టి
మందసార్ సూర్య దేవాలయం లో శిలా ఫలకాలపై ఉన్న ‘’ప్రశస్తి ‘’శ్లోకాలను వత్స భట్టికవి మాళవ సంవత్సరం లో అంటే 529లో రాశాడని భావిస్తున్నారు . బూలర్ లెక్క ప్రకారం ఇది క్రీ .శ.473-74 అవుతుంది .ప్రశస్తి లో 44 పద్యాలున్నాయి .మొదలు చివర మంగళా శాసనంలు వచనం లో ఉన్నాయి .చక్ర వర్తి కుమార గుప్తుని గురించి రాజులు విశ్వ వర్మ ,బంధు వర్మల గురించి సూర్య దేవాలయ నిర్మాణాన్ని గురించి శీతాకాల వర్ణన అందులో కవి రాశాడు .అనేక ఛందస్సులను ప్రయోగించాడు .ఈ రకమైన రచనలు తూర్పు దేశ కవులే చేస్తారని దండి వివరించాడు .మొత్తం కవిత్వం చాలా ధారా శుద్ధితో ఉంటుంది .
నాలుగో శతాబ్దం రెండవ భాగం లో దశ పురా –మందసోర్ లోని సూర్య దేవాలయ ప్రశస్తి గౌడీయ విధానం లో ఉన్నట్లు కనిపిస్తుంది .ఈగౌడకవులు తూర్పు భారతానికి చెందిన వారుగా భావిస్తారు .వత్సభట్టి రాసిన ప్రశస్తి లో కవిత్వాన్ని అధ్యయనం చేస్తే కవి మహా కావ్య పరిచయం బాగా ఉన్నవాడని తెలుస్తుంది .ఛందస్సులో గొప్ప పాండిత్యం ఉన్నవాడుగా తోస్తుంది .అతనిలో గొప్ప కవిత్వం ఉందని మహా కావ్య నిర్మాణం చేసే సమర్ధత ఉందని అనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు .కాని నిరర్ధక పాదపూరక ప్రయోగాలు ,అసందర్భ పదాలు కొన్ని వాడాడు .ఒక్కో చోట వ్యాకరణ మూల విషయాలనే వదిలేశాడు .సంప్రదాయ కవులు పాటించిన నియమాలను కాదని స్వేచ్చ తో కూడా రాశాడు .కొత్త పోలికలనూ చెప్పాడు .మేఘాలకు ఇళ్ళకూ పోలిక చూపాడుకాని అది ఆకర్షించ లేదు .ఇవన్నీ చూస్తె వత్స భట్టి ,ఆనాటి సమాజం లో ఉన్న యదార్ద స్థితికే అద్దం పట్టాడని పిస్తుంది .
దీన్ని బట్టి చూస్తె 472 నాటికే గొప్ప ప్రశస్తమైన కావ్య సాహిత్యం ఉందని తెలుస్తోంది .ప్రశస్తిలోని పదవ పద్యం పునరావృత్తమైంది .కాళిదాసు మేఘ దూతం లోని 65 వ శ్లోకం ను భట్టి కవి వాడుకున్నాడని ,కాళిదాసులాగానే ఈతనికీ ‘’శుభగ ‘’పదం ఇస్టమని తెలుస్తుంది 11 వ పద్యం కూడా కూడా కాలిదాసుకు కాపీ యేననిపిస్తుంది .కాళిదాసు రఘు మహా రాజును వర్ణించి నట్లే వత్స భట్టి రఘు వర్మను వర్ణించాడు .కనుక వత్సభట్టికి కాళిదాసమహాకవి కావ్య రచనలన్నీ పరిచయమే నని అనిపిస్తుంది .ప్రశస్తిలో కాళిదాస ఋతు సంహారం లోని అయిదవ సర్గ లోని రెండు మూడు శ్లోకాలను శబ్ద ప్రయోగం భావం లలో పూర్తిగా పోలి ఉన్నాయని ప్రొఫెసర్ కీల్హాన్ అన్నాడు కాని అది అసంబద్ధం అని ఈ గ్రంధ రచయిత క్రిష్ణమాచారియార్ అభిప్రాయ పడ్డారు .ఇవన్నీ గమనిస్తే కాళిదాసు క్రీ శ 472కు పూర్వం వాడే అని నిర్ధారణగా చెప్పవచ్చునంటారు ఆచార్య .
వత్స భట్టి రాసిన గ్రంధాలేవీ లభ్యం కాలేదు .మందశౌర ప్రశస్తి అనేది మాత్రమె శిలాఫలక రూపం లో దొరికింది .ఇందులో అక్కడి సూర్య దేవాలయాన్ని చేనేత పనివారు క్రీ.శ 437 లో నిర్మించిన వైనాన్ని వర్ణించాడు .మొదట శివుని గూర్చి ప్రార్ధన ఉంటుంది .తర్వాత మంద సౌర ప్రశస్తిని చెప్పాడు .సమకాలీన రాజు అయిదవ శతాబ్దానికి చెందిన నరపతి వర్మ ను వర్ణించాడు .వత్సభట్టి కవిత్వం పై కాళిదాసమహాకవి ప్రభావం బాగా కనిపిస్తుంది .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15-ఉయ్యూరు