ఆలోచనామృతం
కాళీయ మర్దనం అంటే మనసు లోని దురాలోచనలను పోగొట్టుకోవటమే . విషం లేని పాములా మనసును శుద్ధి చేసుకోవటమే దీని లో ఉన్న పరమార్ధం .అందుకు మనస్సు అనే సరస్సు లోకి దూకాలి .
కళ్ళకు కన్ను అయిన అన్ని చూడాలి స్వప్రకాశాన్ని చూడ టానికి వేరే కన్ను అవసరం లేదు .
ప్రాణ మయ కోశ౦ మాట్లాడటం ,నడక ,విసర్జన మొదలైన సుఖ దుఖాలతో వున్న క్రియలతో ప్రాణం తో కలిసి వుంటుంది ఇది రజోగుణ ప్రభావానికి లోని పని చేస్తుంది .
జ్ఞానేంద్రియాలు లేక పోయినా స్వప్నం లో దృశ్యాలు కనిపించటం మనోమయ కోశం .ఇది సత్వ గుణ ప్రధానమైంది .
జ్ఞానేంద్రియాలు ,నిశ్చల మైన బుద్ధితో కూడినది విజ్ఞాన మయ కోశం .
జ్ఞాని కళ్ళున్న గుడ్డి .నోరున్న మూగ .చెవులున్న చెవిటి .ప్రహ్లాదుడు ,శబరి ఈ కోవకు చెందిన వారు .
man minus mind is God ..God plus mind is man .
”దృశ్య వారితం చిత్త మాత్మనః .చిత్త దర్శనం తత్వ దర్శనం ”అంది ఉపనిషత్ సారం
మనస్సు పై ఆత్మ కాంతి పడితే జగత్తు ప్రతిఫలించాడు అని రమణ మహర్షి అంటారు .”కామః ,సంకల్ప ,విచికిచ్చా ,శ్రద్ధా ,అస్రద్దా ,ధృతి ,అద్రుతి హరీ ,ఇతి సర్వం మనః ఏవ ” అంది బృహదారణ్యకం .అంతే కామం ,సంకల్పం ,సంశయం ,శ్రద్ధ ,అశ్రద్ధ ,ధైర్యం ,అధైర్యం ,లజ్జ ,ధీ ,భయం అన్నీ మనస్సు అంటేఅంతఃకరణ అని అర్ధం .
ఆనంద మయుడు ఆనంద స్వరూపుడు కాదు .మయ శబ్దం భోక్తగా చెప్పబడింది .జ్ఞాని ఆనందానికి ,సుషుప్తి ఆనందానికి ఇదే తేడా అన్నారు వివేకానంద .
ఈశ్వర అంటే ఈశ నశీలః అంటే నియంత్రించే వాడు అని అర్ధం .జనానా దేవతు కైవల్యం .
ధ్యానం నుంచి బయటకు రాగానే మనసు బహిర్ముఖం అవుతుంది .ఏ.సి .లోంచి బయటకు రాగానే ఎండ తగిలి నట్లు .
ఆత్మ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతః భవతి .అంటే ఆత్మ తెలిస్తే జగత్తు అంతా తెలిసినట్లే .
జ్ఞానం పొందాలను కోవటం లోనే అజ్ఞానం ఉందంటారు రమణులు .
ఆధ్యాత్మ విద్యా విద్యానాం అనగా ఆధ్యాత్మ విద్యే అసలు విద్య .
మనసును ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి .అదే చిత్త శుద్ధి .అంటే స్వార్ధాన్ని వదిలించు కోవటమే .
కామ క్రోధాదులు ఆరింటిని చంపి ,త్రికరణాలు వదిలి ,ద్వైత దృష్టిని వీడి సమస్తం ఎకత్వమనే ఆత్మ తత్వాన్ని తెలుసు కోవటమే మోక్షం .
research అంటే వున్నది తెలుసు కోవటమే .search కాదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -07 -11 క్యాంపు –బెంగళూర్
వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

