బెంగళూర్ రౌండ్స్

                                          బెంగళూర్ రౌండ్స్
                      జూలై పన్నెండవ తేది మంగళ వారం బెంగళూర్ sight సీఇంగ్ కు మా అబ్బాయి శర్మ కర్నాటక tourismవాళ్ల బస్సు లో నేను వెళ్ళటానికి టికెట్ బుక్ చేశాడు .ఖరీదు 270 రూపాయలు
ఏ.సి.బస్ .ఇది మజేస్తిక్ లో కెనర బ్యాంకు ఏ.టి.ఏం .దగ్గర నుంచి బయల్దేరుతుంది .నేను శర్మ కార్ లో మున్నె కొలాల్ నుంచి మార్త హళ్లి వెళ్ళా.అక్కడ సిటీ బస్ లో majestic లో వున్న కెంపే గౌడ బస్సు స్టేషన్ కు వెళ్ళా.రిజర్వేషన్ టికెట్ వుంటే సిటిబస్ లో ఫ్రీ గా ప్రయాణం .ఉదయం ఏడున్నరకు మెజెస్టిక్  చేరా.బస్సు స్టాండ్ చాలా పరిశుభ్రం గా నిర్వహ్హిస్తున్నారు .నెంబర్ ను బట్టి బస్ ఆగే స్థలాలు వున్నాయి .మనం ప్రయాణం చేసే బస్సు నె౦బర్ తెలిస్తే బస్ ఎక్కడ ఆగుతుందో తేలిగ్గా తెలుసుకోవచ్చు .ఇక్కడ పోలీసులు కూడా చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పటం బాగుంది .సహాయం కావాలా అనే స్థితి లో ఇక్కడి జనం వుండటం ఆశ్చర్యమేస్తుంది .అక్కడే రాఘవేందర్ కాంటీన్ లో కాఫీ తాగాను .పది రూపాయలు .ఇంటి దగ్గరే ఇడ్లీ టిఫిన్ చేసి రెండు సార్లు కాఫీ తాగే బయల్దేరా.కోడలు ఇందిరా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా ఇచ్చింది,మంచినీళ్ళ బాటిల్ తో సహా .sight సీఇంగ్ ను వీళ్ళు బెంగళూర్ రౌండ్స్ అంటారు .దీనికి దగ్గరే సిటీ రైల్వే స్టేషన్ వుంది .ఈ మొత్తాన్ని కేమ్పగౌడ సర్కిల్ అంటారు ఇక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే బస్సులు కూడా వున్నాయి
                       బెంగళూర్ రౌండ్స్ బస్ ఎనిమిదిన్నరకు వచ్చింది .బస్ చాలా బాగా వుంది ఇందులో రెండు రకాల క్లాస్సేస్ వున్నాయి ముందుగా సీట్స్ వుంటే సిల్వర్ క్లాస్స్ .వెనక సీట్లు ఇంకొంచెం సదుపాయం గా వుంటాయి .ఇది గోల్డెన్ క్లాసు .చార్జీ లో తేడా కూడా వుంటుంది గోల్డెన్ చార్జి ఎక్కువ .బస్ లో సగం మందే నిండారు .ఇందులో మార్త హళ్లి నుంచి వచ్చిన తెలుగు ఫ్యామిలీ వుండటం కాలక్షేపానికి కలిసి వచ్చింది తొమ్మిది గంటల పడి నిముషాలకు బస్ బయల్దేరింది .guide  కూడా వున్నాడు .డ్రైవర్ కు guide కు తెలుగు బాగా నే వచ్చ్చు .     
                           ముందుగా ఇస్కాన్ వాళ్ల రాధ కృష్ణ గుడికి వెళ్లాం .ఇది మూడు అంతస్తులు గా కొండ మీద వుంది .ఎక్కాసికి అక్కడ చక్కని సూచనలు మనల్ని గమ్య స్థానానికి తేలిగ్గా చేరుస్తాయి .ఇది యాభై కోట్ల ప్రాజెక్ట్ .ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది .చాలా వైభవం తో ఉంటాడు స్వామి .ఆ పైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వుంది .ఆయనా వెండి వెలుగులతో మెరిసి పోతున్నాడు .ఆ పైన అసలు దేవాలయం వుంది .అదే శ్రీ రాధాకృష్ణ దేవాలయం .మూర్తులు మనోహరం గా వున్నాయి .గొప్ప అలంకరణ .పూలా హారాలు నిండుగా ,మెండుగా వుంది చూడటానికి రెండు కళ్ళు చాలవు .రాదా కృష్ణ ,కృష్ణ బలరామ దేవతా మూర్తులు దివ్యం గా వున్నాయి అనుక్షణం దివ్యనామ  హరేకృష్ణ సంకీర్తనం మానషిక ప్రశాంతినీ ,ఆనందాన్ని ఇస్తుంది .భక్తి తో కనులు అనుకోకుండా మూసుకు పోతాయి .అదొక దివ్య ధామం  దివ్యానుభూతి .తీర్ధం ఇస్తారు .దిగి వస్తూంటే ఇంకో చోట ప్రసాదం పెడతారు .చాలా రుచిగా వుంటుంది .అదే దారిలో కిందకు దిగి మళ్ళీ బస్ ఎక్కాం .
                అక్కడినుంచి గవి గంగాధర దేవాలయం కు ప్రయాణం మొదలు పెట్టాం .దారిలో గైడు  బెంగళూర్ విశేషాలు వివరించాడు .ఆ విషయాలు మీకు అందిస్తున్నాను .బెంగళూర్ కు అసలు పేరు బెంత కాలూర్  .అంటే ఉడకపెట్టిన పప్పు పల్లె దీనికి ఒక కధ వుంది. వీర భల్ల మహారాజు ఒక సారి ఈ ప్రాంతానికి అడవికి వేటకు వచ్చి దారి తప్పి ఒక ప్రాంతం చేరాడు .ఆకలి గా వుంది .తినటానికి ఎవరైనా ఏదైనా పెడతారేమోనని ఎదురు చూశాడు .అప్పుడు ఒక అవ్వ కన బడింది .ఆమెను అడిగాడు తినటానికి ఏదైనా పెట్టమని .ఆమె దగ్గర పచ్చి శెనగలున్నాయి .వాటిని ఉడికించి పెట్టింది .రాజు పరమానందం గా తిన్నాడు .మైసూర్ చేరి కధంతా మిగతా వారికి చెప్పాడు .ఆ వూరి పేరేమిటి అని వాళ్ళు అడిగితే బెంత కాలూర్  అన్నాడట పప్పులు తిన్నది జ్ఞాపకం చేసుకొని .
                    ఒకానొక కాలమ్ లో మైసూర్ మహారాజు తన సామంత రాజు ,సైన్యాధిపతి అయిన కెంపే గౌడ ను ఇప్పుడున్న బెంగళూర్ ప్రాంతం లో ఒక గ్రామాన్ని నిర్మించమని ఆదేశించాడట .ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న కెంపే గౌడ సర్కిల్ దగ్గర నుంచి నాలుగు వైపులకు నాలుగు ఎద్దులను వదిలాడట .అవి యెంత వరకు వెళ్లి ఆగి పోతాయో అంతవరకూ గ్రామాన్ని విస్తరింప జేయాలని నిర్ణయించుకొన్నాడు .ఆ ఎద్దులు ఒక్కొక్కటి బయలు దేరిన చోటు నుంచి నలభై కిలోమీటర్లు వెళ్లి ఆగి పోయాయి ..అంతవరకూ నాలుగు వైపులా హద్దులు ఏర్పరచి గ్రామాన్ని విస్తరించాడు .ఇప్పుడు ఈ నగరం పరిధి 180kilometers .కెంపెగౌడ కుమారుడు ఇమ్మిడి కేమ్పరాయలు నాలుగు వైపులా సరిహద్దుల దగ్గర ఎత్తైన గుట్టలపై గోపురాలు కట్టించాడు .నగరం అంతవరకూ విస్తరించింది .ఈ నగర నిర్మాణం కేమ్పెరాయలు మొదటగా  1535  లో మొదలు పెట్టాడు   గంగా ధర దేవాలయం లో శిలాశాశనం వుంది దీనిలో ఈ నగరానికి బెంగళూర్ అనే పేరు వున్నట్లు తెలిసింది .అందుకే బంగాలూర్ ,bengloor    అనే ఆంగ్లేయ పేర్లను తొలగించి శాసనం లో వున్న పేరునే ఇప్పుడు పెట్టారు .అదే బెంగళూర్ . ,
                        దారిలో గవి గంగాధర స్వామి గుడీ వుంది .ఇదిt త్రేతా  యుగం నాటి దేవాలయం .గౌతమ మహర్షిస్వామి ప్రతిష్ట చేసారని స్థల పురాణం లో వుంది .ఒక గుహలో ఉంటాడు శివుడు .గవి అంటె గుహ అని పేరు .నంది ముందు శివ లింగం వుంటుంది .దక్షిణ దిశగా ఉంటాడు దేవుడు .మకర సంక్రాంతి నాడు సాయంత్రం అయిదు గంటల పది నిముషాలకు సూర్యుని వెలుగు కిరణాలు నంది కొమ్ముల మీద పడి అక్కడి నుంచి శివలింగం మీద పడతాయి .ఆ సమయం  లో జనం విపరీతం వస్తారు చూడటానికి .టి.వి .లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి .ఇక్కడ ఒక సొరంగ మార్గం వుంది .గౌతమ మహర్షి ఇక్కడి ఈ గుహనుంచి కాశీ దాకా వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేసి వచ్చేవారట .ఇప్పుడు సొరంగ మార్గ ప్రవేశానికి అనుమతి లేదు .స్వామి దర్శనం చేసుకొని జన్మ చరితార్ధం చేసుకోన్నాము.ఇక్కడే వున్న శాసనం మీద బెంగళూర్ పేరు వుంది .
                            దీనికి దగ్గర లో దొడ్డ గణపతి దేవాలయం వుంది .దొడ్డ అంటె పెద్ద .విరాట్ స్వరూపుడు గా గణపతి దర్శనమిస్తాడు .ఈయన్నే గం గణపతి అంటారు .గణపతి దర్శనం సర్వ శుభ ప్రదం
                  దొడ్డ గణపతి ఆలయం దగ్గరే దొడ్డ నంది గుడి వుంది .దీనిని ఇక్కడి వాళ్ళునంది బుల్ టెంపుల్ అంటారు ..దీనికీ ఒక కధ వుంది .ఈ ప్రాంతం లో ఒక శివాలయం ఉండేదట .అందులో నంది రాత్రి పూట ఇక్కడి వేరుశనగ పంటను రాత్రి పూట గుడిలోంచి బయటకు వచ్చి తినేసేదట .ఆశ్చర్యం గా వుండేది రైతులకు .ఒక రోజూ అందరు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపలా కాశారు .దేవాలయం నుంచి ఒక ఎద్దు వచ్చి పంటను తినేయటం గమనించారు రైతులు .చేతిలోని బల్లెం తో దాన్ని కొట్టారు .కాలికి గాయమై,నెత్తురు ధార పాతం గ కారింది .ఎద్దు అదృశ్యమైంది .అంతే అప్పటినుంచి పంటలు అన్నీ నాశనం అయాయి కరువు కాటకాలతో జనం అలమటించారు .  ,నీటికి తిండికి నోచుకోలేదు .అప్పుడు ఒక మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారు .ఆయన కాళ్ళపై పడి ఈ సంక్షోభం నుంచి బయట పడేయమని వేడుకొన్నారు రైతులు .ఆయన దివ్య ద్రుష్టి తో అన్నీ తెలుసుకొని ,వారు గాయం చేసింది సామాన్యమైన ఎద్దుకు కాదని ,శివుని వాహన మైన నందీశ్వరునికీ నని ,ఆయన శాపం వల్లనే ఈ ఇబ్బందులని చెప్పాడు .తరుణోపాయం కోరారు వారు .అప్పుడు ముంఫలి అనే ఈ ప్రాంతం కొండ మీద నందీశ్వర విగ్రహం ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తే మళ్ళీ నంది అనుగ్రహం కలుగుతుందని హితవు చెప్పాడు .వాళ్ళు చాలా పెద్ద నందీశ్వర విగ్రహం చెక్కించి ,ప్రతిష్టించి ,నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ నందీశ్వరుని అనుగ్రహానికి పాత్రులయారు .అప్పటినుంచి పంటలు బాగా పండుతున్నాయి .కృతజ్ఞతా పూర్వకం గా కార్తీక మాసం చివరి శని వారం నాడు రైతులందరూ తమకు పండిన వేరుశనగ పంటనుతెచ్చి నందీశ్వరునికి నైవేద్యం పెట్టటం విశేషం .ఇదీ ఈ క్షేత్ర మహిమ .నంది చాలా పెద్దది .నల్లరాతితో సర్వాంగ సుందరం గా నిర్మింకాబడింది .శిల్పవైభావం అపూర్వం గా వుంది .లేపాక్షినంది ,యాగంటి నంది జ్ఞాపకం వస్తాయి .గంగాధర గుడీ  పక్కనే  సూపర్ స్టార్ రజని కాంత్ చదివిన elemntary స్కూల్ వుంది .దీన్ని ఫోటో తీశాను .
.శివ దర్శనానికి ముందు నంది దర్శనం చేయాలి .అసలు శివుని ముందు నంది ఎందుకు ?శివుడు అగిహోత్రుని వంటి వాడు .ఆయన తీక్షణాన్ని నంది తన ఉచ్చ్వాస నిస్స్వాశాలతో తగ్గిస్తుందట .
                         తరువాత టిప్పుసుల్తాన్ వేసవి విడిది చూశాం .అంతా చెక్కతో నిర్మించబడింది.’నాణ్యత కోసం వీటిని కావేరి నదిలో మూడు సంవత్చారాలు నాన బెట్టిన తర్వాతే వుపయోగించారట .ఈ భవననిర్మాణం హైదరాలి ప్రారంభించాడు .అతని కొడుకు టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు .రంగులు చెక్కు చెదర లేదు .టిప్పు బ్రిటిష్ వారినేదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మైసూర్ మహారాజు .బ్రిటిష్ వాళ్ల కుయుక్తుల వల్ల ఓడి పోయాడు .టిప్పు అంటె ఒక ధైర్యం ,ఒక విశ్వాసం ,ఒక సాహసం ..ఇందులో అతని చిత్ర పటం వుంది .దాని ముందు నుంచుని మనం ఎటు కదిలినా అతను ,మనవైపే చూస్తున్నట్లున్డటం విశేషం .అలాగే బ్రిటిష్ సైనికుడిపై కి ఉరికే పులిలాగా వుండే చిత్రం భయంకరంగా టిప్పు అంటె ఏమిటో చూపిస్తుంది .అందులో పులి టిప్పు నే .అతని జండా పై పులి బొమ్మ వుంటుంది
మిస్సైల్స్ కు ,ప్లాస్టిక్ సర్జెరీ కి టిప్పు రాజ్యం లో మంచి పేరుంది .ఇక్కడినుంచే అవి ఇతరదేశాలకు చేరాయట ..వేసవిలో టిప్పు ఇక్కడే మకాం ..
                       తర్వాత లాల్ baagh చేరాం .లంచ్ break  .నేను లోపలి వెళ్లి తెచ్చుకొన్న భోజనం చేశాను .మిగిలిన వాళ్ళు కామత్ హోటెల్ కు వెళ్ళారు .ఒకటవ నెంబర్ gate నుంచి లోపలి వెళ్లాం .పదిరూపాయలు టికెట్ .నేను టికెట్ లేకుండానే లోపలి వెళ్లాను .నన్నెవరు అడగ లేదు కూడా .నడిచి అంతా చూశా. పావురాయిలు బాగా వున్నాయి .వాటికీ ఆహారం వేస్తున్నారు యాత్రీకులు ..నెమ్మదిగా చూసుకొంటూ గుట్టమీద వున్న గోపురం చూశా .ఇట్లాంటివి ఇంకా మూడు ,మూడు వైపులా వున్నాయి .గ్లాస్స్ హుసే వుంది .ఫ్లవర్ క్లోక్ నేలమీద వుంది .నేను చూడ లేదు .రెండవ నెంబర్ gate కు చేరాలి అక్కడికి బస్ వస్తుంది రెండు గంటలకు ..baagh విస్తీర్ణం 240 ఎకరాలు .ఒక రోజూ లో చూడటం కుదరదు .నాలుగు వైపులా దారులున్నాయి .ఇది కేంగెల్ హనుమంతయ్య రోడ్ లో వుంది .ఆయన కర్నాటకకు రెండవ ముఖ్య మంత్రి ..
రెండు గంటలకు వచ్చిన బస్ లో కూర్చున్నాం .సిల్క్ పాలసు కు తీసుకు వెళ్ళాడు .నేను సిల్క్ పైజమా ,లాల్చి 350rs కు కొన్నా,.అక్కడినుంచి విధాన సౌధ ,చిన్నస్వామి క్రికెట్  స్టేడియం ,highcourt ,ఫీల్డ్ మార్షల్ మానెక్షా  పోలీసు పరదే గ్రౌండ్స్ ,కన్నడ రాజకుమార్ ఇళ్ళు ,రామకృష్ణ హెగ్డే , ఎద్యురప్ప ఇళ్ళు వగైరాలన్నీ బస్ నుంచే చూశాం ..ఇక్కడ అనిల్ కుంబ్లే సర్కిల్ ద్రావిడ్ రోడ్ అమితాబ్ సర్కిల్ ,ప్రముఖ violin , విద్వాంసుడు చౌడప్ప స్ట్రీట్ ,చూశాం .ఇక్కడి ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రముఖుల పేర వీధులు ,సెంటర్లు భవనాలు stadiumlu నిర్మించి వారికి ఘన నివాళు లర్పించటం ఆనందం గా వుంది .మన రాష్ట్రం లో రాజీవ్ ,ఇందిరా పేర్లు తప్ప ఇంకోటి పెట్టక పోవటం చరిత్ర క్షమించదు .సిగ్గుతో తల వంచుకోవాలి మనం . ఒక కవి పేర ఒక కళా కారునీ పేర మనం ఏమీ స్మారకాలు పెట్టటం లేదు .వున్నా  చాలా తక్కువే ..వీళ్ళను చూసి మనం నేర్చుకోవాలి ..రాహుల్ ద్రావిడ్ చదివిన సెయింట్ జోసెఫ్ కాలేజి  చూశాం .నూట యాభై ఏళ్ళ చరిత్ర గల కాట్టన్ హై స్కూల్ ,బ్రిగాదియర్ రోడ్ ,ఇమ్పెరియాల్ రోడ్ చూసాము .తర్వాత విశ్వేశ్వరయ్య సైన్సు ,టెక్నాలజీ మ్యూజియం దీని పక్కనే పురా వస్తు ముసియం లను చూసాం .రెండు చూడ తగినవి .పక్కనే కబ్బన్ పార్క్ .చూడలేదు .ఇక్కడ నుంచి మార్త హల్లికి సిటీ బస్ లో వెళ్లాను అక్కడినుంచి ఇంటికి ఆరు గంటలకు చేరా. రోజంతా సరదాగా ,గడిచింది  .ఇదే బెంగళూర్ రౌండ్స్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -07 -11 .–క్యాంపు—bengalur
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.