అమెరికా ఆది వాసీలు –చేరోకీలు
1492 లో కొలబాస్ రాక కు ముందు ఇక్కడి స్థానిక అమెరికన్ల సంఖ్య 25 మిలియన్లు ఉండేదట .వారికి మూడొందలకు పైగా భాషలున్దేవి .క్రమంగా ఆ జనాభా అంతా వ్యాధులు ,ప్రకృతి వైపరీత్యాలుయుద్ధాలు ,ఆకలి చావులతో ఇప్పుడు 567తెగలతో రెండు మిలియన్లు మాత్రమే మిగిలి ఉన్నారు .వీరిని అమెరికా రాజ్యాంగం గుర్తించి హక్కుల్ని కల్పించింది .ప్రభుత్వం తో వాళ్ళు కొన్ని ఒప్పందాలను చేసుకొన్నారు .అందువల్ల వీరు తమ స్వాధీనం లో ఉన్న మిలియన్ల కొద్దీ ఎకరాల భూభాగాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు .ప్రభుత్వం వారి ఆరోగ్యం ,చదువు మత స్వేచ్ఛ లను కాపాడుతోంది .వారితో ప్రభుత్వం 377 ఒడంబడికలు చేసుకొన్నా దాదాపు అన్నిటినీ తున్గలో తొక్కేసింది .అయితే అవి ఒప్పందాలు చట్టాలే నని సుప్రీం తీర్పు ..వందేళ్ళ క్రితం చేసుకొన్నా ఒడంబడికలకు చట్ట భద్రత కల్పించాలని స్పష్టం ..వనవాసుల సార్వ భౌమత్వాన్ని ధ్రువీకరించింది ..ప్రభుత్వాల మద్య సంబంధాలనుద్రుధంచేసుకొన్నారు . గిరిజన తెగలను ‘’స్థానిక ఆధార రాజ్యాలు ‘’గా గుర్తింపు నిచ్చారు .తమ హక్కుల్ని కాపాడు కోవా టానికి అటార్నీ లను నియమించుకొన్నారు .పిల్లల చదువు ,వనవాసీ బడు లు ,కాలేజీలు ఏర్పాటు చేసుకొనే హక్కు సంపాదించారు ..వారి మతాలను ,నియమాలను పాటించు కొనే వెసులు బాటు పొందారు ..వారి పూర్వీకుల’’ ఆస్తులన(ఎముకలు )పొంది జాగ్రత్త చేసుకొన్నారు .వారి జీవన ప్రమాణాన్ని వృద్ధి చేసుకొంటున్నారు .అమెరికా ప్రజల్లో తామూ భాగా స్వాములమనే ధీమా వారికి వచ్చిన్దిప్పుడు .
చేరోకీల సంస్కృతి –సంప్రదాయాలు
చేరోకీలు అని పిలువబడే వీరంతా ఎత్తైన పర్వత ప్రాంత వాసులు .తామే ముఖ్యమైన పౌరులం అని ,నిజమైన జనం అని అంటారు వాళ్ళు .వారి భాషలో దాన్నే ani-yun-wiya’’అంటారు .వీరంతా ఎత్తైన పర్వత ప్రాంత జనులే .వారి భూభాగమే ప్రపంచానికి నాభి లేక మధ్యభాగం అని వీరి నమ్మకం ..వారి దృష్టిలో భూమి నాలుగు త్రాళ్ళతో ఆకాశం నుండి వేలాడుతోంది .ఈ భూమి ఏర్పడటానికి ముందు అందరు ఆకాశం లో పెద్ద శిల మీద ఉండే వాళ్ళు .జనాభాతో కిక్కిరిసి పోతే నీరు భూమి కిందకు చేరింది .ఆ తర్వాత మట్టి అడుసు తో భూమి ఏర్పడి క్రమంగా గట్టి పడింది ..తర్వాత నీరు మళ్ళీ ఆకాశం చేరింది .భూమి మీద క్రమంగా జీవ రాశి ఆవిర్భావం చెందింది .
వారి జాతి లో మొదటి మానవుని పేరు కనాతి ,మొదటి స్త్రీ సేలు ..వారికి ఒకే ఒక మొగ సంతానం ..అతన్ని ‘’వైల్డ్ బాయ్’’అంటారు .వీరి సంతానం క్రమంగా పెరిగిందని అభిప్రాయం .చేరోకీలు నార్త్ కరోలినా ,కాన్సాస్ పర్వత ప్రాంతాలలో ,అపలేశియన్ పర్వత ప్రాంతాలలో దట్టం గా ఉన్నారు .వీరు చిన్న గ్రామాల్లో ఉంటారు ..అక్కడ ఒక సమావేశ మందిరం ఉంటుంది .అక్కడ ప్రార్ధన ,ఆరాధనా చేసుకొంటారు .దానికి చుట్టూ వారి ఇల్లుంటాయి ..ఒక్కో ఇంట్లో అనేక తరాల వారు ఉంటారు .అందరు కలిసి జీవించటం వీరి ప్రత్యేకత ..చలి కాలం లో ‘’అసి ‘’అనే వెచ్చని ఇళ్ళల్లో నివశిస్తారు .వేసవి ఇల్లు విశాల మైన చ దీర్ఘ చతురశ్రకార .క్లాప్ బోర్డ్ తో చేసిన ఇళ్ళల్లో ఉంటారు .సీతాకాలపు ఇల్లు చిన్నవి ,ఒకే దర్వాజా ఉంది ,మధ్యలో నిత్యం మండే పొయ్యి ఉంది వెచ్చదనాన్నిస్తుంది ..నిలవ చేసుకొనే గదులుంటాయి .
వ్యవసాయం ,వేట ,చేపలు పట్టటం వ్రుత్తి .ఎక్కువ గా జలాధారం ఉన్న నదీ తీర ప్రాంతాలే వారి ఆవాస భూములు .సారవంత మైన నేలలను చూసుకొని మొక్క జొన్న పండిస్తారు .దానితో పాటు బీన్స్ కూడా పండిస్తారు .బీన్స్ మొక్కల వేళ్ళల్లో నత్రజని స్తాపక శూక్ష్మ జీవులున్డటం వల్ల మొక్క జోన్నకు బలం చేకూరుతుంది .ఆడవారు కాయ గూరలు పండిస్తారు .ముసలి స్త్రీలు పొలాల్లో ఓడిసేలా రాళ్ళతో పక్షులను పారద్రోలుతూ పంట చేలను కాపాడుతూ ఉంటారు .చిరోకీలు పిల్లలను అతి చనువు గా చూస్తారు .దండిన్చాల్సి వస్తే చిన్న ముళ్ళు తో గిచ్చటం తప్ప పెద్ద గా శ్క్షించారు .ఆడవారు అడవుల్లోకి వెళ్లి వంట చెరుకు తెస్తారు ..నీరు మోసుకొని వస్తారు ..అందరికి వంట చేయటం వారి విధి .వెన్న వాడకం తెలీదు ..ఇళ్లను అందం గా అలంకరించటం ఆడవాళ్ళ పని .వెదురు తో ,లేక నదీ తీరం లో దొరికే ఒక రకమైన చెట్టు భాగాలతో బుట్టలు అల్లుతారు .దాన్ని’’ రివర్ కేన్ ‘’అంటారు .మన పేము లాంటిది .స్థానికం గా దొరికే మట్టితో కుండలు చేస్తారు .వాటిని ఆరబెట్టటం ,కాల్చటం నగిషీలు చెక్కటం చేస్తారు .జింక చర్మంతో మగ వాళ్ల బట్టలు కుడతారు .ఎముకల తో చేసిన సూదులను కుట్ట టానికి ఉపయోగిస్తారు .సాధారణం గా వారికి చాలా తక్కువ బట్టలే ఉంటాయి .చలికాలం లో వింటర్ హౌస్ లోనే అందరు గడుపుతారు .పిల్లలు బట్టలు వేసుకోరు .ఆడ వాళ్ళు మగ వారి లానే డ్రెస్ వేసుకొంటారు .
మగ వారు వేటాడి ఆహారం తెస్తారు .ఆడవారు దానితో వండి వడ్డిస్తారు .జింక ,ఎలుగు బంటి లను ఎక్కువగా వేటాడి తెస్తారు .వేటకోసం మిస్సి సిపి నది ని కూడా దాటి చాలా దూరం పోతారు .వారికిజింక చాలా ఇష్టమైన జంతవు .కల్ప వృక్షం లా అది వారి పాలిటి కల్ప ధేనువు .దాని శరీరం లో అన్ని భాగాలను ఉపయోగించు కొంటారు .వాటి ఎముకలతో పని ముట్లు అలంకరణ సామాను ,చర్మాన్ని ధరించ టానికి ,వాటి నరాలను దారాలుగా,వాటి మెదడు ను ఔషధాలు తయారు చేయటానికి ఉపయోగిస్తారు .వాటి మాసం తో స్నాయువులతో జిగురు తయారు చేసు కొంటారు .దాని శరీరం లో ప్రతిది వారికి ఉపకరించేదే ..అలాగే ఎలుగు బంటీ అంతే .వాటి చర్మం ఫర్ కోట్లకు ,వాటి కొవ్వు ను గ్రీజు తయారు చేయటానికి వాడుతారు .టర్కీ కోడి వారికి బాగా ఇష్టం .ఎలుగు గోళ్ళతో ,దంతాలతో ఆభరణాలు చేస్తారు .పక్షుల ఈకలతో అలంకరించు కొంటారు ..మాటు పెట్టి వేటాడి బొరియలు పెట్టి జంతువులను చం పుతారు .చేపలు పట్టటానికి గాలం ,వల, వెదురు ముక్కల ‘’మావు ‘’లు ఉపయోగిస్తారు .నీటి ప్రవాహం ఉన్న చోట చిన్న డాం కడతారు అడ్డం గా .అక్కడ చెస్ట్నట్ నుంచి తీసిన విషాన్ని ప్రవాహపునీటి లో కలుపు తా రు ..అది చేపల నరాలపై దెబ్బతీస్తుంది ..ఆ చేపలను తింటే మనుష్యులకు ప్రమాదం ఉండదు .కాని చేపలను అచేతనం గా మారుస్తుంది ..చేపల్ని పట్టిన తర్వాతా ఆడ్డు తీసేస్తారు ..విషం ప్రభావం తగ్గి మళ్ళీ మామూలవుతుంది .
వారి ఆటలు సరదా గా ఉంటాయి .ఆరోగ్యానికి ఆటలు ముఖ్యం అని భావిస్తారు .బాణాల ఆట ,రాయిని బంతిగా చేసి ఆట ఆడటం వారికి ఇష్టం .దీన్ని రోలింగ్ రాక్ అంటారు .
. మాతృస్వామ్య వ్యవస్థ
వారి కుటుంబ వ్యవస్థ అంతా తల్లి మీద ఆధారం గా ఉంటుంది .సంతానాని తల్లిని బట్టే తప్ప తండ్రిని బట్టి గుర్తించరు ..తల్లి సంతానం గానే పిల్లల్ని భావిస్తారు .వీరికి ప్రాచీన తర స్త్రీల నుండి ఇది వచ్చింది .తల్లి తరఫు వారే అసలైన బంధువులు ..తల్లి ,అమ్మమ్మ ,అక్క చెల్లెళ్ళు ,వాళ్ల సంతానం ,బంధువులు గా భావిస్తారు .అమ్మ సోదరులు వాళ్ల పిల్లలకు బంధుత్వం లేదు .తండ్రి ,నాయనమ్మ ఆయన ,అక్కచెల్లెళ్ళు ,సోదరుల రక్తాన్ని బట్టి కాక తల్లి తరఫున రక్తాన్ని బట్టి మాత్రమే నిర్ణ యిస్తారు .కుటుంబం తల్లి దగ్గరే ఉంటుంది .భర్త కూడా ఆమెతో ఉంటాడు ..ఆ కుటుంబం అంటే భార్యా ,భర్తా ,పిల్లలు భార్య తల్లి ,భార్య అక్కచెల్లెళ్ళు ,,వాళ్ల సంతానం ,వాళ్ల భర్తలు ,ఆమె కున్న పెళ్లి కాని సోదరులు ..భార్యా భర్తా విడి పోతే భర్త భార్యను వదిలి వేరే వెళ్లి పోవాలిసిందే. ..సాధారణం గా విడాకులు ఉండవు ..అప్పుడు భర్త తన తల్లి చెల్లీ అక్క ల దగ్గరకు చేరాలి .పిల్లలు మాత్రం తల్లి తోనే ఉంటారు .కారణం వాళ్ళు తండ్రి వంశం వారు గా పరిగణింప బడరు కనుక ..అయితే పిల్లలకు తండ్రి ఎవరో తెలుస్తుంది .వేటకు తండ్రి శిక్షణ నివ్వడు .మేనమామ శిక్షణ నిస్తాడు .అతన్నే గురువు గా భావిస్తాడు ..మొత్తం మీద తేలేది ఏమిటంటే తల్లి తరం వారే సంతానం మీద పెత్తనం కలిగి ఉంటారు ..తగాదాలు గ్రామ సభల్లో పరిష్కరించు కొంటారు .
హత్య- నేరం
చిరోకీ లలో హత్య ను తీవ్ర నేరం గా భావిస్తారు .శత్రువు కాని ,లేక వేరొక తెగ వారు కాని ఒక చెరోకీ ని చంపితే వారి పై పగ తీర్చుకొని వాడిని చంపే స్తారు .వీటినే ‘’వార్ పార్టీలు ‘’అంటారు .ఇందులో వందమంది వరకు సభ్యులుంటారు .హత్య చేసిన వాడిని చంపక పోతే హత్య గావింప బడ్డ వాడు ఉన్నత లోకాలకు వెళ్ళలేడు అని వీరి సిద్ధాంతం .లెక్కలు బాలన్సు తప్పుతాయట .కనుక బద్లా తప్పదు .అప్పుడే సామరస్యం ,సమతూకం ఉంటుందని నమ్మకం .
వీరు ప్రకృతిని ఆరాధిస్తారు .ఒక జింకను చంపాలను కొంటె ఒక ప్రత్యెక విధి చేసి , తనకు తన కుటుంబానికి ఆహారం అవసర మవటం వల్ల చంప వలసి వస్తోందని దాని జీవుడిని వేడు కొని వేటాడి చంపుతారు .విలాసం కోసం వేట ఆడరు .పవిత్రమైన భావనలను అతిక్రమిస్తే ఉపద్రవాలు కలుగుతాయని నమ్మకం వారిది .జంతు వధ వల్ల మారణ వ్యాధులు కల్గుతాయని నమ్ముతారు .దీనితో జీవావరణం సమతుల్యత దెబ్బ తింటుందిఅనే గొప్ప సిద్ధాంతం ఉంది .
చిరోకీల మతం కూడా సామరస్య జీవనాన్నే బోధిస్తుంది .’’గ్రీన్ ఆర్డర్ సేరిమని ‘’అనే కొత్త సంవత్సరం పండుగ జరుపుతా రు .ఆరోజున పాత తప్పిదాల నన్నిటిని మన్నించి కొత్త జీవితం లోకి అడుగు పెట్ట టానికి అవకాశం కల్గిస్తారు ..వివాహాలు విచ్చిన్నం అయితే వాటినీ క్షమించి మళ్ళీ దగ్గరవటానికి దారి ఏర్పరుస్తారు .హంతకుడిని మాత్రం క్షమిచరు .అతిధులను గౌరవించి మంచి ఆతిధ్యం ఇచ్చే సాంప్రదాయం వారిది వీరిలో ఏడు తెగలున్నాయి .తమ జాతి మూల పురుషుడు స్త్రీ అయిన ‘’కనాతి ‘’,;;సేలు ‘’’’ల పవిత్ర వారసులం అని గర్వం గా చెప్పు కొంటారు .వారి జీవితాలను పరికిస్తే ఎంత నిబద్ధత గా వారు జీవనం సాగిస్తున్నారో మనకు తెలుస్తోంది .ఆధునికులం, నాగరకులం అని మిడిసి పడుతున్న మనం అనాగరికులు అని వారిని భావించటం మన అనాగారకత ను తెలియ జేస్తోంది .సామరస్యం ,సహజీవనం ,ప్రక్రుతి ఆరాధనం ,హింసను విడనాడటం వారి నుంచి మనం నేర్చు కోవాలి .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ —6-6-12.—కాంప్—అమెరికా
