జన వేమన -4 శైవ మతం

 జన వేమన -4
                                                                                   శైవ మతం 
హిందూ మతం లో ఉన్న లోపాల  పై స్పందించాడు వేమన .మరి ఆయన కు యే మతం ఇష్టం ?దేని పై అధిక ప్రేమ చూపాడు? క్రైస్తవ ,మహమ్మదీయ మతాల పై ఆయన అభి ప్రాయమేమిటి ?ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలే .వేమన పద్యా లను కొంచెం లోతు గా చదివి పరిశీలిస్తే ,ఆయనకు శివుడన్నా ,శైవ మతమన్నా మక్కువ ఎక్కువ అని పిస్తుంది .జన్మతహా అయన శైవుడే .అయితే దేన్నీ ఆయన మూధం గా ఆరాధించడు .అదీ వేమన్న ప్రత్యేకత .ముందుగా శైవం పై ఆయన భావాలేమిటో చూద్దాం .
”ప్రణవ మంత్ర మహిమ భావింప లింగంబు -మూడు మూర్తు లందు మొనసి యుండు -నతని నెరిగి ,కొలువ నన్యుల కశక్యము ”అని త్రిగునాత్మకుడు ,త్రిమూర్త్యాత్మకుడు ,త్రిగుణాతీతుడు గా పరమ శివుడిని భావించాడు .కంటి మంట లో కాముడిని దహించి ,కామ వంచాలో గౌరిని అర్దాన్గిని చేసుకొన్న శివుడిని చూస్తె అంటుకొన్న పూర్వ కర్మ ఫలం పోతుందని ధీమాగా చెప్పాడు .శివుడు ,గౌరీ తన శైవ గణం ,బంధువులు అనుకొన్నాడు .పంచాక్షరీ పూజలో అఖిలజ్నుడై వంచన లేకుండా తిరిగే వాడే శంభుడు అని తేల్చి చెప్పాడు .”శ్రీ మదుమాపతి యగునా –స్వామికి దాసున్దానంగా జగములు పోగడన్ -వేమన యని యేడు ధీరుడు ”అని తాను పరమ మాహేశ్వర భక్తుని గా చెప్పు కొన్నాడు .”హరి హరులకు ,రూప మవని లో శివ రూపే ”అని ఘంటా పధం గా చెప్పాడు .శివుని అనుభవాన్ని సృష్టి లో చూడక పోతే సంశయం తీరదు .దివ్వె లేకుండా చీకటి పోతుందా ?అని ప్రశ్నిస్తాడు .”శివ యను రెండక్షరములు -భువి లో నెవ డైన గాని ,పొలుపు దలిర్పన్ –శివ శివ యని శత వారము –ప్రవి మల మతి వల్లే వేయ ,బరుడౌ వేమా ?”అనే పద్యం లో శివ నామ మహాత్యాన్ని వర్ణించాడు .శివయోగి ,జ్ఞాన దీపం భువనా లన్నిటినీ వెలగజేస్తుందని నిస్సందేహం గా చెప్పాడు .శివుని పై ,శైవం పైనా ఇంత అభి మానం ఉన్నా ,అందులోని భావాన్ని గ్రహించ కుండా ,బాహ్యాడంబరం గా ప్రవర్తించే వారిని చూస్తె వేమన కు కోపమే .
”భూతి దేహమందు బూసిన నయ్యేనా –నిష్ఠ శివుని యందు నిల్వ వలయు -”అంటూ గాడిద బూడిద లో పోర్లాడితే దానికి పరమ పదం వస్తుందా అని ప్రశ్నించాడు .”భక్తీ లేని పూజ పత్రీ చేటు ”అన్నాడు .మెడ లో లింగాలు కట్టుకొని ,ఘంట వాయిస్తూ ,తిరిగే వారి కంటే ,దొంగలు నయం ”అని చెప్పాడు .ఆత్మా లింగాన్ని వదిలి ,ఎక్కడో వెదకటం మూధం అన్నాడు .జులపాల జడలు ,పులితోలు ,విభూతి ,రుద్రాక్ష మాలల తో వీర శైవులుగా తిరిగే వారంతా మోత గాళ్ళేకాని మోక్ష గాళ్ళు కాదు పొమ్మన్నాడు .లింగ ధారుల్లో గంజాయి తాగే వాళ్ళే ఎక్కువ దానికి వాళ్ళు పెట్టు కొన్న ముద్దు పేరు ”జ్ఞాన పత్రీ ”ఆది పీలుస్తూ ,ఇహ లోక స్పృహ కోల్పోయి ,ఊహా లోకం లో విహరిస్తూఉంటారు .ఏదో మాట్లాడతారు .పూనకం వచ్చి నట్లు ప్రవర్తిస్తారు .వీరు సాధించేదేమీ లేదంటాడు .దయ్యాలను వదిలిస్తామని ఇలాంటి వాళ్ళు జనాన్ని మోసం చేస్తారు .అట్లాంటి వారిని ”నిన్నే గాంచి భీతి నిలువక పారదా ? వీళ్ళను చూస్తె భయం పారి పోదా అని అని హేళన చేశాడు .యజ్న యాగాదులను నిరసించిన వీర శైవులు ”ఎద్దు నెక్కి ,దాన్ని తన్నుతూ ,కొడుతూ ప్రయాణం చేస్తూ ,మాంస భక్షణ చేస్తూ జీవ హింస చేయటం లేదా ?అని నిర్మోహ మాటం గా కడిగే శాడు . ..వీరిలో మింద జంగాలు ,బావిసేలు ,ఎక్కువై వ్యవస్థ భ్రష్ట మైందని బాధ పడ్డాడు .ఆచారం ,అనాచారం అయింది .బసివే కి ఎంత మంది జంగా లతో వ్యభి చరిస్తే ,అంత గొప్ప .ఆమెకు పుట్టిన వాడు జంగమ దేవ ర లలో గొప్ప వాడు .ఇలా భ్రష్టు పట్టి పోయిన శైవం ముస్లిముల చేతి లో ఒడి పోయిందని ”భ్రష్టస్య కావా గతిహ్ ”అన్న దాన్ని జ్ఞాపకం చేశాడు .
                                            వైష్ణవం 
కన్నడ దేశం లో బసవేశ్వర మతం ఆంద్ర దేశం లో వీర శైవం గా మారి విజ్రుమ్భించింది .పాల్కురికి సోమ నాధుడు వంటి కవులు ఆ మత వ్యాప్తికి కవిత్వావ లంబన తో బాసట గా నిలిచారు .ఇక వైష్ణవ మతం తమిళ దేశం నుండి ,ఉత్తర దేశం నుండి వచ్చి పాదుకోంది . .చైతన్య ప్రభువు ప్రభావం ఆంద్ర రాష్ట్రం మీద బాగానే పడింది .అన్నమయ్య పదాలు ,పోతన భాగవతం ,రామ దాసు కీర్తనలు ,క్షేత్రయ్య పదాలు ,తో ఆంద్ర దేశం వైష్ణవ భక్తికి ఆల వాల మైంది .తిరుపతి భద్రాచల క్షేత్రాలు ముక్తి దామా లైనాయి .భక్తీ ప్రపత్తు లకు నేలవైనాయి .గోదా దేవి పాశురాలు ,ధనుర్మాస ఉత్స వలతో సీతా రామ కల్యాణాలతో ,తిరుమల బ్రహ్మోత్స వాలతో వైష్ణవ భక్తీ ఏరులై ప్రవ హించింది .శివుడు అభి శేక ప్రియుడు అయితే ,విష్ణువు అలంకార ప్రియుడు .దైవం ఎలా ఉంటె ,భక్తులూ అదే వేష ధారణ చేయటం మామూలు అయింది .శైవం లో ఎలా వీర శైవం వచ్చి వీరంగం వేసిందో ,అలానే వైష్ణవం లోను వీర వైష్ణవం చేల రేగింది .నిలువు బోట్లు ,పంగనామాలు ,తులసి పేర్లు ,కస్తూరి పరిమళాలు ,చక్ర పొంగళ్ళు ,లడ్లు ,ధద్యోజనాలు ,తో భక్తులంతా విలాస పురుషు లైనారు .వేశ్యా సంపర్కం ఫాషన్అయిపోయింది . .హోదా కింద జమైంది .పూజలు ,సంకీర్తనలు భజనలు ,తిరునాళ్ళు పెరిగి పోయాయి .భక్తీ వరద లా పారింది .అడ్డు కట్ట వేసే వారే లేక పోయారు .విశృంఖలత పెరిగి నిస్సిగ్గు గా ప్రవర్తించటం సర్వ సాధారణం అయింది . ఇవన్నీ చూసి వేమన్న లాంటి వాడు చూస్తూ ఊరుకుంటాడా ?ఈయనకు స్వ ,పర భేదాలు లేవు .అందుకే ఎండ కట్టాడు
”ద్వాదశ పుండ్రాలు ,ద్రవిడ గ్రంధాలు ,అక్షయ పాత్రలతో ,వీధి లో భిక్షం ఎత్తు  తున్నారని అధిక్షేపించాడు .ప్రజల్ని పీడించి ,డబ్బు లావుగా సంపాదించి ,దీనుల్లా ,దరిద్రుల్లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశాడు .”పట్టు బట్ట గట్టి ,,పట్టి నామము బెట్టి –వట్టి భ్రాంతి జెంది ,వైష్ణవుడయి -లొట్టి ద్రావ నతడు ,లోకుల జేరచురా ”అని గోల పెట్టాడు .మధువు ,మాంసం రుచి మరిగి ,”వావి వరస ద్రవ్వి వర్తించి ,చేడుడురు ”అని వారి రంగుని బయట పడేశాడు .”పల్లాండు ,పల్లాండు ”అని ద్రావిడ పాశురాలను పాడుతూ ,అర్ధం కాని భాష లో అరవ పాటలను పాడే వాళ్ళ ను చూస్తె ,వాళ్ళ మూదా చారాలను చూస్తె ,ఆంద్ర దేశానికేదో చెడు మూడిం దని వ్యధ చెందాడు .శంఖ చక్రాన్కితాలతో ,ఒళ్లంతా వాతలు పెట్టు కొంటున్నందుకు దుయ్య బట్టాడు .”తనువున దావాగ్ని దరి కొని కాలంగ –కాల్చుకోనగ ఏమి కర్మమునకు ?”అని అలా చేస్తే వాడేమైనా ఘనుడౌతాడా అని నిల దీశాడు .ఇవన్నీ వికృత ,వింత వెర్రి చేష్టలు గా తలచాడు .ఇంతకీ యే మతం అయినా బాహ్య ఆడంబరం కంటే ,అంతస్సౌన్దర్యం ,భావనా ,చింతనా ,ప్రవర్తనా ,పరమ సాధనా ,పర హితం ,కావాలని వేమన ద్రుధం గాభావించాడు .అందుకే ,ఎక్కడ విప రీత భావన ఉంటె ,అక్కడ ఇది పద్ధతి కాదు ,మార్చుకోమని హితవు చెప్పాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.