రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -4
26-హైదరాబాదులోఖాళీ ఉన్నచోట్ల గుడిసె లేసిఆక్రమించి ,,రాష్ట్రపతిని చెయ్యలేదని కినిసే తండ్రి కొడుకు ‘’వివేక్ ‘’
ఖద్దరు గుడ్డలతో తానూ అన్నీపొంది ,జంప్ జిలానీ అయి గులాబీ ఖండువా వేసి’’ ఆంధ్రోళ్ళుమోసంసేసిండ్రు’’అనే’’అవివేక్
27- గులాబీ నవాబు ,దొర ఠీవి ఉన్న కే.సి.ఆర్
కక్కాలేక మింగా లేక బిక్క చచ్చిఅయ్యాడు విపరీత ‘’కోపధార్
28-తాతల వారసత్వం తో అయిన కేంద్ర ‘’రాజు పళ్ళం’’
,ప్రజా సంఘటనతో భయం తో స్పీడ్ కు వేసుకొన్నాడు ’’ కళ్ళెం ‘’
29-సమైక్యం లో స్పష్టత ఉన్న మంత్రి ‘’సాకే ‘’
అడ్డొచ్చిన వాళ్ళ పాలిట అయ్యాడు ‘’ఫార్టీ సెవెన్ ‘’ఏకే ‘’.
30-మిస్టర్ పెర్ఫెక్ట్ గా,ఈ కాలానికి మార్గ దర్శి గా కనిపించే ఆర్.కే గారి ‘’ఆంద్ర జ్యోతి ‘’
నిజాం సభను అక్కడి ఫ్రంట్ లో ,ఆంధ్రా సభను ఇక్కడి ఫ్రంట్ లో ఒకే రోజుఅచ్చోసి అయింది ‘’పక్ష పాతి ‘’.
ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-11-13-ఉయ్యూరు

