సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరస భారతి నివేదిక

ఉయ్యూరు లో  సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ 24-11-2009 న ప్రారంభమైంది .’’అక్షరం లోక రక్షకం ‘’అనేఆశయం  తో ప్రారంభించిన ఈ సంస్థ నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తీ చేసుకొని అయిదవ ఏడాది లోకి దిగ్విజయం గా ప్రవేశించింది .ఎన్నో విభినమైన కార్య క్రమాలను నిర్వహించింది .ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలను  నిర్వహించి ,పుస్తక రూపం లో అ కవితలను ప్రచురించింది  .సంగీత కచేరీ లు నిర్వహించింది .ఇప్పటికి యాభై తొమ్మిది సమావేశాలు నిర్వహించింది .ఈ శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది కి ముందు రోజు న 60 వ సమావేశం గా  నిర్వహిస్తోంది .ప్రారంభం నుండి 7-4-13  వరకు జరిగిన సరస భారతి  ప్రగతిని   ‘సిద్ధ యోగ పుంగవులు ‘’పుస్తకం లో సవివరం గా వివరించి అందజేశాం ..అప్పటి నుండి జరిగిన కార్యక్రమ విశేషాలను ఇప్పుడు అంద జేస్తున్నాము .100_1428

శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా 1-6-13న శ్రీమతి కే. కనక దుర్గా మహాలక్ష్మి తో ధార్మిక ప్రసంగాన్ని ఏర్పాటు చేశాము .2-6-13-న మధుర గాయకులూ శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ చేత ‘’భక్తీ సంగీత విభావరి ‘’ని నిర్వహించాము .శ్రీ చంద్ర శేఖర్ స్వర్గీయ ఘంటసాల  గారికి మేనల్లుడు .అద్భుతం గా గానం చేసి శ్రోతలను మై మరపించారు .3-6-13-న  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసిన’’ శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’ ‘’పుస్తకాన్ని శ్రీ స్వామివారల శాంతి కల్యాణం సందర్భం గా ఆవిష్కరింప జేశాము. కాలని మహిళా మండలి వారి చే సాయంత్రం  శ్రీ హనుమాన్ చాలీసా ‘’పారాయణ ఏర్పాటు చేశాము .22-7-13 న వ్యాస జయంతి సందర్భం గా శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ గారి చేత వ్యాస మహర్షి జీవితం, రచనల పై ప్రసంగం చేయించాము .27-8-13శ్రీ కృష్ణాష్టమి రోజున’’ శ్రీ కృష్ణ తత్వ వైభవం’’ పై శ్రీ ఏ .త్రినాధ శర్మ అద్భుతం గా ప్రసంగించారు .29-8-13 న శ్రీ గిడుగురామ మూర్తి పంతులు గారి  150 వ జయంతి ని ఉయ్యూరు సెంటర్ లో సమైక్య వేదిక మీద  నిర్వహించి ‘’సమైక్య శంఖారావం ‘’పేరిట సెంటర్ లోనే కవి సమ్మేళనాన్ని జరిపాం .ఎందరో విద్యార్ధినీ విద్యార్ధులు చక్కని చిక్కని కవిత్వం రాసి  వినిపించి తమ సృజనాత్మకత ను వ్యక్తం చేశారు .వందలాది జనం మధ్య జరిగిన ఈ కార్యక్రమం హై లైట్ గా నిలిచి అందరిని అలరించి ప్ర శంసలను  కురిపించింది .

ఏ సాహితీ సంస్థా నిర్వహించని అపూర్వ మైన  కార్యక్రమాన్ని51 వ సమా వేశం గా 17-9-13న సరస భారతి నిర్వహించింది .’’అపర అన్న పూర్ణ ,నిరతాన ప్రదాత ‘’అయిన స్వర్గీయ  శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితం పై మూడు పాఠ శాలల విద్యార్ధులకు వ్యాస రచన, వక్తృత్వ ,కవితల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్ధులకు బహుమతి ప్రదానం చేశాము .దీన్ని గుర్తించిన సీతమ్మ గారి ముని వనవడు గారి అబ్బాయి అమెరికా లో ఉంటున్న శ్రీ డొక్కా రామ భద్ర సీతమ్మ గారి పేర  ప్రతిభగల పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్ధులకు 10 000 రూపాయలను సరసభారతి కి పంపారు .దానిని మూడు స్కూళ్ళ లోని ముగ్గురు విద్యార్ధులకు ,ముగ్గురు విద్యార్ధినులకు అర్హత ప్రాతి పదిక మీద ఒక్కొక్కరికి 1668రూపాయలను స్కాలర్ షిప్ గా సీతమ్మ గారి ముని మనవడు శ్రీ సూర్య నారాయణ ,వారి సతీ మణిన శ్రీమతి త్రిపుర సుందరి దంపతుల చేతుల మీదుగా 52వ సమా వేశం లో22-10-13 న అంద జేశాము .ఈ సమా వేశం లోనే తెలుగు లెక్చరర్  శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి ‘’పాను గంటి వారి సాక్షి వ్యాసాల విశిష్టత’’ పై మహా ఆసక్తిగా ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు  .ఇలా వరుసగా రెండు కార్య క్రమాలను సీతమ్మ గారి పై నిర్వహించి సెహభాష్ అని పించుకోన్నాము .53వ సమా వేశం లో కార్తీక మాస వైశిస్ట్యాన్నివ్యాఖ్యాన చక్ర వర్తి  శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి వివరించారు .54 వ సమా వేశం గా శ్రీ గీతా జయంతిని నిర్వహించి శ్రీ మధుసూదన పిళ్లే దంపతుల చేత గీతా మాహాత్మ్యం పై ప్రసంగం ఏర్పాటు చేసి విద్యార్ధుల చే గీతా పారాయణ చేయించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలు అంద జేశాం .55వ సమావేశం 24-12-13-న జరిపి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి చేత ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యత ‘’పై ఉపన్యాసాన్ని అందించాం . .

56వ సమా వేశం విశిష్టతను సంతరించు కొన్నది .ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42,వ వర్ధంతి (జనవరి 10)ని పింగళి వారి స్వగ్రామం చిట్టూర్పు లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో కలిసి సంయుక్తం గా నిర్వహించి అందరి మన్ననలను అందుకోన్నాం .పింగళి వారి జీవితం రచనల పై పరిశోధన చేసిన డాక్టర్ శ్రీ పింగళి వెంకట కృష్ణా రావు గారు ముఖ్య అతిధి గా విచ్చేసి కీలక ఉపన్యాసాన్ని చేసి  పింగళి వారిని అందరికి  పరిచయం చేశారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్య దర్శులు శ్రీ  గుత్తి కొండ సుబ్బారావు ,శ్రీ డా. జి వి.పూర్ణ చంద్ .శ్రీ మాదిరాజు రామ లింగేశ్వర రావు ,శ్రీ రావి రంగా రావు చింతల పాటి సోదరులు శ్రీ మద్దూరి విశ్వం శ్రీ కోసూరి ఆదినారాయణ శ్రీ గొట్టి పాటి రామ కృష్ణ ,గ్రామ పెద్దలు శ్రీ యల్లా ప్రగడ శ్రీ రామ మూర్తి,శ్రీ నాదెళ్ళ వెంకట గోపాల రావు ,శ్రీ వెలివెల వీర రాఘవయ్య ,శ్రీ దాసరి బసవ కుటుంబ రావు ,శ్రీ జి .జి .ఎస్ .ఎస్ .ఎస్. వి .ప్రసాద్,శ్రీ పరుచూరి రామ కృష్ణ ,శ్రీ శ్రీ పరుచూరి జగన్మోహన రావు   వంటి గ్రామ పెద్దలు పాల్గొన్న ఈ సభ వందమందికి పైగా శ్రోతల తో దిగ్విజయమైంది .గ్రామస్తులు అందించిన అపూర్వ సహకారం మరువ లేనిది .గ్రామీణ ప్రాంతం లో ఇలాంటి సభ నిర్వహించటం ఇదే ప్రధమం .దీని దిగ్విజయానికి అందరూ అభినందనీయులే .ముఖ్యంగా ఆగ్రామ స్తురాలు శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,వారి కుటుంబం నిర్వ హించిన  పాత్ర చిరస్మరణీయం .ఇలాంటి సభలే తొలి జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్   శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి  ‘’స్వగ్రామం నందమూరు’’ లోను,సినీ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి స్వగ్రామం కాటూరు లోను నిర్వహించాలని సరసభారతి భావిస్తోంది . 57వ సమా వేశం గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి  ఆరాధనోత్సవాన్ని పుష్య బహుళ పంచమి నాడు 21-1-2014న నిర్వహించి త్యాగరాజ స్వామికి అష్టోత్తర పూజ చేసి   పంచ రత్న కీర్తనలను విని పించాం. శ్రీ సీతా రామాంజనేయ  భక్త సమాజం చేత భజన ఏర్పాటు చేశాం .

58వ సమా వేశం  గా ప్రముఖ చలన చిత్ర నటీమణి శ్రీమతి అంజలీ దేవి ,నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు ల మరణానికి శాఖా  గ్రంధాలయం లో సభ జరిపి నివాలులర్పించాం .                                                                           ఈసంవత్సరం విద్యార్ధుల కోసం ఇంత వరకు ఏ పాఠ శాలలోను కార్య క్రమాన్ని నిర్వహించ లేక పోయాం .ఆ లోటు ను 59వ సమావేశం తీర్చింది స్థానిక అమర వాణి హైస్కూల్ లో 22-2-14శనివారం ఉదయం 11 గంటలకు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ’’ రావూరి భరద్వాజ గారి ‘జీవితం రచనలు’’ పై విద్యార్ధులకు అవగాహన కల్పించటానికి ప్రముఖ కవి ,రచయిత్రి ,విమర్శకురాలు శ్రీమతి మందరపు హైమ వతి  ,ప్రఖ్యాత కవి శ్రీ ఆంజనేయ కుమార్ గారల చేత చక్కటి ప్రసంగాన్ని ఏర్పరఛి విద్యార్ధులకు గొప్ప అవగాహన కలిగించాం. ఉత్సాహం గా వారు పాల్గొని శ్రద్ధగా విని స్పందించారు .అమరవాణి విద్యార్ధులకు’’ భరద్వాజ జీవితం’’ పై వ్యాస రచన ,’’రచనల లో మానవ సంబంధాలు’’ పై వక్తృత్వ పోటీలు నిర్వ హించి బహుమతి ప్రదానం చేశాము .శ్రీ చల పాక ప్రకాష్ ఈ కార్యక్రమానికి రూప కల్పన చేసి అమరావాణి స్కూల్ గ్రంధాలయానికి  పుస్తకాలను బహూకరించి సహక రించారు .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా అమర వాణి ప్రిన్సిపాల్ శ్రీ పి.వి.నాగ రాజు సభా నిర్వహణ చేసి అతిధులకు విందు నిచ్చారు .

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందు రోజు 30-3-14ఆదివారం మధ్యాహ్నం రోటరీ క్లబ్ ఆడిటోరియం స్థానిక కే.సి.పి. మరియు రోటరీ క్లబ్ వారల సౌజన్య సహాయ సహకారాలతోరోటరీ క్లబ్ ఆడిటోరియం లో  నిర్వ హిస్తున్నాం .ఈ సభలో జిల్లా నలు మూలల నుండి వచ్చిన కవులు ‘’ వివాహం –దాంపత్యం ‘’అనే అంశం పై తమ కవితలను విని పించి అలరిస్తారు .ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈలపాట సంగీత కచేరి ) విద్వాంసులు శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి సరసభారతి ఉగాది పురస్కారాన్ని గ్రహిస్తారు .ఆ తర్వాత వారి’’ గళ మురళీ విన్యాసం (ఈల పాట సంగీత కచేరి)  ‘’తో తన్మయులను చేస్తారు ,కే.సి.పి.సి.ఒ.ఒ.శ్రీ జి వెంకటేశ్వర రావు ,ఆంద్ర ప్రదేశ్ మాస పత్రిక సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ ,విజయ వాడ ఆకాశ వాణిసంచాలకులు శ్రీమతి ముంజు లూరి కృష్ణ కుమారి ,ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు    శ్రీమతి డాక్టర్ కే .శ్రీ విద్య (ఏం డి),కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి డా.జి వి.పూర్ణ చంద్ లు ఆత్మీయ అతిధులుగా విచ్చేసి మా పురస్కారాలను అందుకొంటారు  .ఈ ఉగాది కార్యక్రమానికిఅన్నివిధాల సహరించి  ,ఆడిటోరియం లో జరపటానికి అనుమతి నిచ్చి న కే సి పి .సి ఒ.ఒ.శ్రీ ఏం వెంకటేశ్వర రావు గారికి ,వారి సిబ్బందికి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్య దర్శులకు కార్య వర్గానికి క్రుతజ్నతలు తెలియ జేసుకొంటున్నాం .

వివిధ రంగాలలో  ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల గురించిసరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అంతర్జాలం లో సీరియల్ గా  రాసిన వ్యాసాలను ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం గా   సరసభారతి  12వ ప్రచురణ గా ముద్రించి ఈ రోజున శ్రీ మతి మున్జులూరిక్రిష్ణ కుమారి గారి చేత ఆవిష్క రింప జేస్తోందని తెలియ జేయ టానికి సంతోషిస్తున్నాం . .ఇది దుర్గా ప్రసాద్ గారు రాసిన ఏడవ పుస్తకం . ఈ పుస్తకం ముద్రణ ఖర్చులన్నీ  ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లో హాంట్స్ విల్ లో  ఉంటున్న సరసభారతికి అత్యంత ఆప్తులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు భరించి పుస్తకం వెలువడటానికి తోడ్పడ్డారు .వారికి సరస భారతి  కృతజ్ఞత తెలియ జేస్తోంది .వారి కోరిక పై ‘’మహిళా మాణిక్యాలు ‘’  ‘’పుస్తకాన్ని ‘’మహిళా మాణిక్యం,సహధర్మ చారిణి అయిన మైనేని వారి  ధర్మ పత్ని సౌ. శ్రీమతి మైనేని సత్య వతి గారికి అంకిత మిస్తున్నాం .అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగే ఈ మార్చి నెలలో ఈ పుస్తకం ఆవిష్కరింప బడటం అత్యంత సమంజసమని భావిస్తున్నాము .

సరస భారతి అంతర్జాలం లోను గణనీయ మైన ప్రగతి సాధించిందని  మనకందరికీ తెలిసిన విషయమే .సరసభారతి ,,సువర్చలాన్జనేయ అనే రెండు బ్లాగులను , నిర్వహిస్తూ అందరి ప్రశంసలను  అందు కొంటున్నాం . .ఇప్పటికి ఈ రెండు బ్లాగుల వీక్షకుల సంఖ్య ‘’రెండు లక్షల పన్నెండు వేల ‘’ను దాటిందని సంతోషం గా తెలియ జేస్తున్నాము .ఉయ్యూరు కు ప్రాధాన్యత నిచ్చే ‘’ఉయ్యూరు టైమ్స్ ‘’అనే బ్లాగును కూడా నిర్వహిస్తున్నాం .సరసభారతికి  ఇప్పటి వరకు సహాయ సహకారాలందించిన వారందరికీ వినయం తో క్రుతజ్ఞతలను తెలుపు కొంటున్నాము. ఇక ముందుకూడా ఇదే ఆదరణ, అభిమానం ,ఆత్మీయత , సహాయ సహకారాలను అందించాలని కోరుతూ, అందిస్తారని ఆశి స్తున్నాము .

మాది రాజు శివ లక్ష్మి

కార్య దర్శి –సరస భారతి

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.