‘’జయ ‘’వసంత హే(ఈ)ల
శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి ఉగాదికిఒక రోజు ముందు నిర్వహించిందని మీకు తెలుసు .మా వివాహ యాభై వ వసంతోత్సవం కూడా కలిసి వచ్చినందున మాకు పెద్దగా దానిపై ఆసక్తి లేక పోయినా దానికోసం అమెరికా నుంచి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ముందుగానే బయల్దేరి మార్చి ఇరవై రెండుకల్లా ఇండియా రావటం తో మా అందరికీ, మా అబ్బాయిలకూ హుషారు వచ్చింది .సరస భారతి వేడుకలో ఇదొక భాగం గానే మేము చూశాం ప్రత్యేకతను చాటలేదు .కాని ప్రత్యేకత అందరూ రావటం తో వచ్చింది .ఇది ఊహించనే లేని పరిణామం .దీని కోసం ప్రత్యెకం గా మేం చేసిందేమీ లేదు .మా అమ్మాయి హడావిడితో దీనికి ‘’ముమెంటం వచ్చింది ‘’.అన్నలతో కలిసి కార్యక్రమాన్ని ఆలోచించి అమలు చేసింది .అదంతా వేదిక పై’’ క్లిక్ ‘’అయింది .మర్నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మరీ ఘనం అయింది .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆశీస్స్సుల తో ఇంతమంది పాలు పంచుకొంటే అభిమానం చూపిస్తే ,ఆత్మీయత ప్రదర్శిస్తే ,పెద్దలు ఆశీర్వ దిస్తే విజయ వంతమైంది .
ఈ ఉగాది వేడుకలను విభిన్నం గా జరపాలని భావించాను .ముఖ్య అతిధి గా శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో మా మనసులో మెదుల్తూనే ఉన్నారు .2012జూన్ లో అమెరికా లో మా అమ్మాయి గారింట్లో వారితో పరిచయమైనప్పటినుండి వారితో ఉయ్యూరు లో ఒక ఈల పాట సంగీత కచేరి చేయించాలని గట్టి సంకల్పం కలిగింది .వారి కచేరీల వివరాలను నాకు ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తూ ‘’మీ ఆశీర్వాదం కావాలి ‘’అని రా స్తూ ఉన్నారు .అక్టోబర్ లో ఇండియా కు మేము తిరిగి వచ్చిన తరువాత ఆ ఆలోచన కు కార్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాం .సరసభారతి ద్వారా చేస్తే అంత ఘనం గా ఉండదు అని అందర్నీ ఇందులో భాగ స్వాములను చేయాలని ఆలోచించాము .రోటరీ క్లబ్ నిర్వాహకులు శ్రీ కొండలు గారి తో మా అబ్బాయి రమణ ఒకటి రెండు సార్లు మాట్లాడాడు .ఆయన సరే నన్నారు .2013మే నెలలో చేద్దామని అన్నారు. కాని ముందుకు సాగలేదు .ఒకటి రెండు సార్లు మంగళ వారాలలో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఆయన వచ్చినప్పుడు జ్ఞాపకం చేశాను .చేద్దామనే అన్నారు కాని ఎందుకో బ్రేక్ పడింది .ఈ విషయాలన్నీ ఎప్పటి కప్పుడు శివ ప్రసాద్ గారికి మెయిల్ రాసి తెలియ జేస్తూనే ఉన్నాను మా వాడు కనిపించినప్పుడల్లా చెబుతూనే ఉన్నాడు సరే నంటున్నారు .కాని ప్రణాళిక సిద్ధం కాలేదు .అందుకని శ్రీ జయ ఉగాది వేడుకలకు శివప్రసాద్ గారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించి సత్కరించి కచేరీ చేయిడ్డామనే సంకల్పానికి మా కుటుంబం వచ్చింది .అన్నీ కలిసి వచ్చాయి. ఉగాది కవి సమ్మేళనం ,పుస్తకా విష్కరణ ,ఉగాది పురస్కార ప్రదానం తో ఈ ఆలోచన పరి పూర్ణ మైంది .రమణ కొండలు గారిని కెసీపి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ జి వెంకటేశ్వర రావు గారినీ కలిసి శివప్రసాద్ గారిని ఇక్కడికి తీసుకొస్తున్న సంగతి చెప్పాడు .వారిద్దరూ ఓకే చెప్పి అవసరమైన సహాయ సహకారాలు అందించటానికి ముందుకొచ్చారు .ఇంత విస్తృత వేదిక ఉంటేనే ‘’ప్రపంచ ప్రసిద్ధవిద్వాంసులు శ్రీ శివ ప్రసాద్ గారి ‘’గళ మురళీ విన్యాసానికి ‘’గొప్ప స్థాయి లభిస్తుందని నేను ఆశించినది సఫల మైంది .రోటరీ క్లబ్ ఆడిటోరియం అయితే విశాలం గా పెద్దగా అన్ని వసతులతో ఉంటుందని భావించి అడిగితె సరేనని బుక్ చేసేశారు .శివ ప్రసాద్ గారి బృందానికి కెసీపి గెస్ట్ ఔస్ లో రెండు ఎసి రూములు ఇస్తామన్నారు ఆయనబృందాన్నితీసుకు రావటానికి మళ్ళీ తీసుకు వెళ్ళటానికి వెహికిల్ ఏర్పాటు చేస్తామన్నారు .దీనితో ఒక గొప్ప ప్రాముఖ్యత కార్య క్రమానికి లభించింది .
మరి ఆ స్థాయి వ్యక్తీ తో వేదిక పంచుకొనే ఆత్మీయ అతిధులను గురించి ఆలోచించి వారికీ ఉగాది పురస్కారాలను అందించాలని వారిలో ఒకరితోమహిళా మాణిక్యాలు పుస్తకావిష్కరణ చేయించాలని అనుకొన్నాం .వెంటనే విజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకురాలు శ్రీమతి మున్జులూరి కృష్ణ కుమారి గారు నా దృష్టికి వచ్చారు. ఆమెతో చాలా సార్లు బెజవాడ సభల్లో వేదిక పై ఉన్నాను .చాలా సభల్లో చూశాను ,నేనెవరో ఆవిడకు తెలుసు .కనుక వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పి శివ ప్రసాద్ గారోస్తున్నారని ఈల పాట కచేరి చేస్తారని పుస్తకావిష్కరణ ఆమె చేయాలని మా ఆత్మీయ ఉగాది పురస్కారాన్ని స్వీకరించాలని చెప్పాను. వెంటనే అంగీకరించారు .ఇది కొంత ముందు అడుగు అని పించింది .అప్పటీ శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారిని సంప్రదిస్తే ఆయన మార్చి 20న అమెరికా బయల్దేరి వెళ్తున్నాని మే చివర్లో కాని రానని చెప్పి శుభా కాంక్షలు తెలిపారు.శ్రీ పూర్ణ చంద్ ఉంటె కృష్ణా జిల్లా రచయితల సభ నిర్వాహకులు ఒకరు ఉంటారు కనుక వేదిక సుసంపన్నం అవుతుందని పించి చెప్పగానే అంగీకరించి తప్పక వస్తానని అభయమిచ్చారు .తర్వాతఒక పత్రికా సంపాదకులు కూడా ఉంటె మంచి ప్రచారమూ వస్తుందని భావించి శ్రీ వల్లీశ్వర్ గారిని సంప్రదిస్తే నిమిషాల మీద అంగీకారం తెలిపారు .దీనితో పరి కొంత స్థాయి ఏర్పడింది .కెసీపి జి ఏం శ్రీ వెంకటేశ్వర రావు గారు పారిశ్రామిక రంగం లో ప్రసిద్ధులు కెసీపి కి అనేక ఎక్సలెన్సీ అవార్డులు సాధించిన వారూ కనుక వారికి ఆత్మీయ ఉగాది పురస్కారాన్నివ్వాలని భావించి కోరగా సమ్మతించారు .ఒక ఆయుర్వేద మహిళా డాక్టర్ కు కూడా పురస్కారం ఇద్దామనుకోన్నాను వెంటనే మామిత్రులు కోసూరు ఆదినారాయణ గారి కోడలుశ్రీమతి శ్రీవిద్య బందరులో ఆయుర్వేద డాక్టర్ అని గుర్తు చేసుకొని ఆమెను సంప్రదించగా సరేనన్నారు .ఇలా అర్హులైన వ్యక్తులు వేదిక పై ఉండటం గొప్ప శుభ పరిణామం అయింది .విజయవాడ రేడియో కేంద్రానికి నాలుగు ఆహ్వానాలు పంపాము .’ఉదయం’’వచ్చే వార్తా విపంచి ‘’లో చెపుతారని ఆశించాను చెప్పినట్లు లేదు .చెప్పినట్లు ఎవరూ ణా దృష్టికి తెలేడుకూడా .ఇది కొంత నిరాశ కలిగించింది .పూర్వం మేము చేసిన కార్యక్రమాలన్నిత్నీ రేడియో వారు వార్తా విపంచి ద్వారా శ్రోతలకు వారం రోజులు ముందునుంచే తెలియ జేసేవారు .ఆనవాయితీ తప్పటం ఆశ్చర్యమేసింది .
ఆహ్వాన పత్రాలను మామూలు’’ మూస ‘’పద్ధతిలో కాకుండా భిన్నం గా ఆకర్షనీయం గా ఉండాలని మా రమణ భావించి శ్రీ ప్రకాష్ చేత డిజైన్ చేయించి బెజవాడ లో ప్రింట్ చేయించాడు .బాగా వచ్చి అందరికీ నచ్చింది .దాదాపు అరవై మంది కవులను ఫోన్ లో సంప్రదించి ఆహ్వానించి ‘’వివాహం –దాంపత్యం ‘’పైన మాత్రమె కవిత ఉండాలని కోరాను అందరూ వస్తామనే చెప్పారు .వారం ముందు మళ్ళీ అందరికీ ఫోన్ చేసి గుర్తు చేశాను .ఇందులో కొందరికి ఎలక్షన్ డ్యూటీలు ఉండటం వలన రాలేక పోయారు .ఊరిలో కూడా ఆహ్వానాలను ప్రతి హైస్కూల్ కాలేజి ఆఫీసు బ్యాంకు లకు అభిరుచి ఉన్న వ్యక్తుఅలకు పంచాము .28 వ తేదీన రోటరీ ఆడిటోరియం లో ‘’ప్రెస్ మీట్ ‘’ఏర్పాటు చేసి నేనూ రోతరీక్లాబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారు కార్యక్రమాన్ని వివరించి ఆహ్వానాలు అందజేశాం .వారు బాగానే స్పందించి రాశారు ‘’మన చానల్’’లో 29 ,30 తేదీలలో స్క్రోలింగ్ చాలా సార్లు వేసి ప్రజల దృష్టికి ఉగాది వేడుకలను తెచ్చారు .ఊరంతా మునిసిపల్ ఎన్నికల కోలాహలం గా ఉండటం వారూ ఏదో ఒక పార్టీ తరఫున పని చేయటం వలన ఎక్కువ మంది రాలేక పోయారు .ఏమైనా దాదాపు రెండు వందమ మంది పాల్గొన్న సమావేశం గా గుర్తింపు పొందింది .శివ ప్రసాద్ గారు ఆ రోజు ఉదయం మా ఇంటికొచ్చినప్పుడు ‘’సార్ మీ వాళ్ళు ఒక యాభై మంది ఉంటారా?’’అని నన్ను అడిగారు .’’నూట యాభై మందికి తక్కువ ఉండరు .’’ఎలైట్ ఆడియెన్స్’’ కోసమే రోటరీ ఆడిటోరియం లో ఏర్పాటు చేశాం ‘’అని చెప్పాను సంతోషించారు . సంగీత సాహిత్య కళాభిమానులు విశేషం గా విచ్చేసి సరసభారతి నిర్వాహించినశ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను తిలకించారు .శ్రీ శివ ప్రసాద్ గారి ‘’గళ మురళీ విన్యాసం ‘’లో పులకించారు .శ్రీ జయ వసంత ఈలా హేలలో పరవశం చెంది సరసభారతిని ఆశీర్వదించారు .
8-4-14-మంగళ వారం శ్రీ రామ నవమి సందర్భం గా శుభా కాంక్షలు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14-ఉయ్యూరు
మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య
ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో
విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-
శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు
సశేషం
.

