మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్

మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్

నాలు గేళ్ళ పరిచయం మాత్రమేఆయనతో  .కాని అది ఎన్నో ఏళ్ళ పరిచయం గా మారింది .మనసున్న సాహితీ జీవి .పెద్దల యెడ అత్యంత భక్తీ ఉన్నవారు .నిరంతరం స్వంత వ్యవహారాల్లో మునిగి తేలుతూ కూడా సాహిత్య వ్యాసంగం ఏ మాత్రం తగ్గకుండా చేస్తుంటారు .సాహిత్య సభలు దిగ్విజయం గా నిర్వహిస్తారు .పుస్తక ప్రచురణ తో క్షణం ఖాళీ గా ఉండరు .వీటన్నిటికంటే ఆయన ఆరో ప్రాణం ‘’రమ్య భారతి ‘’ద్విమాస పత్రిక .అందులో ఎన్నెన్నో విషయాలు విశేషాలు నింపుతారు .పుస్తక పరిచయం చేస్తారు .సమీక్షలు రాస్తారు .కవిత్వం కధలు తో తీర్చి దిద్దుతారు ఎన్నో బహుమతులు సాధించారు .సోమేపల్లి అవార్డుల ప్రదానం లో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారు .విజయ వాడలో జరిగే ఏ ముఖ్య సాహితీ కార్యక్రమమైనా ఆయన లేనిదే నిండుగా ఉండదు .శోభ రాదు .ఆయనే శ్రీ చలపాక ప్రకాష్ .100_1630

ఆయన సాహితీ సేవను గుర్తించి సరసభారతి ప్రకాష్ గారికి మూడేళ్ళ  క్రితం ఉగాది పురస్కారాన్ని అందించింది .అది చంద్రుడికో నూలు పోగు మాత్రమె .అప్పుడే ప్రకాష్ తో పరిచయం గాఢమైంది .ఉగాది కవితలను ‘’ఆదిత్య హృదయం ‘’పేరు తో తీసుకు రావాలను కొన్నాం .సభలోనే ఈ విషయం ప్రకాష్ గారికి చెప్పి సహకరించి ఆ కవితలను ముద్రించే బాధ్యత తీసుకోమని కోరాం క్షణం కూడా ఆలోచించకుండా సరేనన్నారు .ఆ నెల లోనే మేము అమెరికా వెళ్లాం .విజయ వాడ ఆకాశవాణి కేంద్ర ముఖ్య సంచాలకులు సరసభారతికి ఆప్తులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు హైదరా బాద్ కు బదిలీ అవుతున్నట్లు చెప్పారు .అందుకని పుస్తక ముద్రణ బాధ్యత మా అబ్బాయి రమణ ,ప్రకాష్ లపై పెట్టి నిశ్చింతగా మేము అమెరికా వెళ్లాం .ఆదిత్య ప్రసాద్ గారి బదిలీ మే నెల లోనే జరగటం తో ప్రకాష్ గారు చాలా త్వరలో ఆ పుస్తకాన్ని ముద్రించి మే నెలలో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఆదిత్య ప్రసాద్ గుత్తికొండ సుబ్బారావు పూర్ణ చంద్ ప్రకాష్ గార్ల సమక్షం లో పుస్తకావిష్కరణ జరిపించాడు మా రమణ .పుస్తకం ముఖ చిత్రం అదిరి పోయింది .క్వాలిటీ బాగుంది అని అందరూ మెచ్చుకొన్నారు అని రమణ మాకు అమెరికా కు ఫోన్ చేసి చెప్పాడు .ప్రకాష్ గారి కృషి, అంకిత భావం అప్పుడు అర్ధమయ్యాయి .

‘’విజయ వాడ’’ పై ప్రకాష్ విజయ వాడలో’’ కవి సమ్మేళనాన్ని’’ నిర్వహించి నన్ను ఆత్మీయ అతిధి గా ఆహ్వానిస్తే వెళ్లి పాల్గొన్నాను .శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదికి ’’సిద్ధ యోగి పుంగవులు ‘’.పుస్తక ముద్రణకూడా ప్రకాష్ గారిపైనే వేశాను .దానినీ సమర్ధం గా నిర్వహించి తక్కువ సమయం లో తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన పేపర్ ,ఆకర్షణీయ ముఖ చిత్రం తో తీర్చి దిద్దారు .ఈ పుస్తకాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తల్లి గారుస్వర్గీయ  సౌభాగ్యమ్మ గారికి మైనేని వారి కోరిక పై  అంకితమిచ్చిన సంగతి అందరికి తెలుసు .అందరూ ఏంతో సంతోషించారు .అందులో ఆయన చేసిన సహాయం విషయం రాస్తే అటువంటి మాటలు తనకు సరిపడవని తొలగించిన సుమనస్కుడు .సభా ముఖం గా ఆయన గురించి చెప్పటమే తప్ప అచ్చులో దాన్ని రానివ్వరాయన .ఆలాగే శ్రీ హనుమజ్జయంటికి ‘’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’పుస్తక ముద్రణ కూడా చలపాక గారి పైనే మోపాను .దానికీ సంసిద్ధులై చక్కని పుస్తకాన్ని తయారు చేయించి సకాలాని కి అంద జేశారు .అదీ ప్రకాష్ తీసుకొనే శ్రద్ధ .ఈ సారి కూడా వారికి క్రుతజ్ఞత చెబుతూపుస్తకం లో  రాస్తే తీసేయించారు .ఈ పుస్తకం లో అనేక సంస్కృత పదాలు శ్లోకాలు ఉన్నాయి .వాటిలో ఎక్కడా తప్పు దొరల కుండా ఏంతో జాగ్రత్త తీసుకొని పుస్తకం తెచ్చారు. ఏమిచ్చి వారి ఋణం నేను ,సరసభారతి తీర్చు కో గలం ?

ఇప్పుడీ ‘’మహిళా మాణిక్యాలు ‘’కూడా ప్రకాష్ గారి భుజస్కంధాల పైనే ఉంచాను .ఆనందం గా స్వీకరించి అత్యద్భుతం గా గొప్ప క్వాలిటీ తో అర్ధ వంతమైన ముఖ చిత్రం తో స్పాన్సర్ అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి అర్ధాంగి సౌ శ్రీమతి సత్య వతి ,గారి కి గోపాల కృష్ణ గారి కోరిక పై అంకితమిచ్చిన సంగతి మీరు ఎరిగినదే .సత్యవతి గారి ఫోటో ,గోపాల కృష్ణసత్యవతి  గార్ల దంపతుల ఫోటో ,వారి పెద్దబ్బాయి శ్రీ కృష్ణ ,చిన్నబ్బాయి శ్రీ రవి కుటుంబ ఫోటోలు  చేర్చి గొప్ప నిండుదనాన్ని తెచ్చారు .మంచి  మిసమిస లాడే తెల్లని స్వచ్చమైన పేపరు అందమైన ముద్రణ తో ‘’మహిళా మాణిక్యాలు ‘’ను ‘మాణిక్య సమూహం ‘’గా మాల గా కూర్చి అంద జేశారు .అందులోని మహిళా మాణిక్యాల ఫొటోలనూ చక్కగా జత చేసి మరింత వన్నె తెచ్చారు  శ్రీ ప్రకాష్ .ఆవిష్కరణ లో ఈ విషయాల న్నీ సభా ముఖం గా చెప్పాను .ఈ సారి కూడా తనను  గురించి రాస్తానంటే ఒద్దన్నారు .పుస్తక సమీక్ష చేయమని కోరాను .దాన్నీ తిరస్కరించారు ‘’.మీకు, ,మైనేని గారికి మధ్య నేను ఎందుకు సార్’’అని చెప్పి తప్పించుకొన్న సంస్కారి .ఇలాంటి ‘’మాణిక్యాన్ని’’ గురించి నేను రాయక పొతే సంస్కారం అని పించు కోదు. అందుకే ఇంత రాయాల్సి వచ్చింది .అంటే ప్రకాష్ గారు సరస భారతి కి నాలుగు పుస్తకాలు ముద్రించి ఇచ్చారు .ఎక్కడా క్వాలిటీలో రాజీ పడలేదు .సమయాన్ని దాటి పోనివ్వలేదు డబ్బు ఖర్చు చాలా సరళం గా ఉండేట్లు చేశారు .అంతా అనుకొన్న సమయానికే అనుకొన్న విధం గా ముద్రణ చేయించి అంద జేసిన సాహితీ బాంధవుడు  .వారి అమ్మాయి డి.టి.పి కి చాలా సహకరించింది. ఎక్కడో బాగా పట్టి చూస్తె తప్ప తప్పులు దొరల లేదు .అంత పకడ్బందీ గా చేసింది ఆ చిన్నారి .ఆమెకూ ఆయన ద్వారా అభినందనలు ఆశీస్సులు ..ముఖ చిత్రాని శ్రీ ఎల్లపు కళా సాగర్ తో తయారు చేయించారు .అన్నీ సమపాళం లో కుదిరాయి . మాణిక్యాలు పుస్తకాన్ని చూసి స్వర్గీయ రావి శాస్త్రి గారి సోదరులు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారు (మైనేని వారి బావ గారు ) విశాఖ నుండి ఫోన్ చేసి పుస్తకం క్వాలిటీని గూర్చి ఏంతో మెచ్చుకొన్నారు .’’యెంత అయింది ?’’అని అడిగితె చెప్పాను .’’విశాఖ లో యాభై పేజీల పుస్తకనికే బోలెడు అవుతోందని మంచి వ్యక్తీ మీకు దొరికి నందుకు సంతోషంగా  ఉంది అతనికి ధన్యవాదాలు చెప్పండి ‘’అని కొనియాడారు ప్రకాష్ గారిని .మా ఇద్దరిది జననాంతర సౌహృదం అని పిస్తుంది నాకు .అంతటి ఆత్మీయులు దొరకటం నా అదృష్టం .

ఇంతటి సహృదయులు శ్రీ చల పాక ప్రకాష్ గారు.  ఆప్తులవటం సరసభారతి చేసుకొన్న పుణ్యం అదృష్టం .పుస్తకం లో ఎలానూ నన్ను తనను గురించి రాయనివ్వని ప్రకాష్ గారికి ఇది నా’’అభినందన మాణిక్య మాల ‘’.

రేపు శ్రీరామ నవమి సందర్భంగా శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14- ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.