మన కాలపు రాజనీతిజ్ఞుడు – డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.

‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!

నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!

ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.

 

ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.

‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!

నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!

ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.

ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. కూడా ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.
ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించాలి. పి.వి. ప్రధానిగా వుండగానే -అమెరికాకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ, అణ్వస్త్ర పరీక్షకు భారతదేశం సర్వసన్నధమైనది. అణ్వస్త్ర పరీక్షను జరపరాదని అమెరికా భారతదేశాన్ని హెచ్చరించింది. అయినా, పి.వి. లెక్క చేయలేదు! పరీక్ష జరపడానికి ఉద్యుక్తుడైనారు. అంతకు పూర్వం ఇందిరాగాంధీ హయాంలో 1974 మేలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణ్వస్త్రపాటవ పరీక్ష జరిపారు. 22 ఏళ్ళ తరువాత భారత అణు పాటవం ఎలా వున్నదో ప్రపంచానికి తెలియడానికి అణ్వస్త్ర పరీక్షను ఉద్దేశించారు. అయితే, ఇంతలో జనరల్ ఎన్నికలు రావడంతో అణ్వస్త్ర పరీక్షకు అంతరాయం కలిగింది. ఆ తరువాత వచ్చిన వాజపేయి ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది! పి.వి., వాజపేయిలు పరస్పరం తమ ‘గురువు’ అని చెప్పుకునేవారు!
పి.వి.నరసింహారావు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఆయన స్వస్థలం వంగర. ఆయన లాయర్. మహా మేధావి. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో పి.వి.మంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి వస్తూనే ‘ఏడీ? మన బృహస్పతి వచ్చాడా?’ అని పి.వి.ని గురించి ఆరా తీసేవారు! ఒకానొక దశలో ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఏఐసీసీ తీర్మానాలను, ఎన్నికల ప్రణాళికలను పి.వి.యే రూపొందించేవారు.

చాలామందిని అంత అర్హత లేకపోయినా ‘బహుముఖ ప్రజ్ఞానిధి’ అని అంటూ వుంటారు. అయితే పి.వి.కి ఆ పదంలోని ప్రత్యక్షరం వర్తిస్తుంది. ఆయన కవి, రచయిత, జర్నలిస్టు, సంగీత ప్రియుడు, నటుడు, కంప్యూటర్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతుడు.

అన్నింటినీ మించి ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. మరాఠీ భాష నుంచి తెలుగులోకి ఒక గ్రంథాన్ని అనువదించారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు’ నవలను ఆయన హిందీలోకి ‘సహస్రఫణ్’ అన్న పేరుతో అనువదించారు. భారతీయ సంస్కృతి, తత్వచింతన పట్ల ఆయనకు ఎనలేని ఆసక్తి. ఆయన ఆధ్యాత్మికవేత్త. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ పలుకులలో ‘పి.వి. సంస్కృత పండితులను మించిన సంస్కృత భాషా నిష్ణాతుడు’. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత జటిల సమస్య వచ్చినా, ఆయన స్థితప్రజ్ఞుడు. అందువల్లనే ఆయనకు స్వామి రామానంద తీర్థ అధ్యయన సమితి ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చింది. ఇంతటి మహామహుని చరమదశలో, ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఎంతగానే సేవలు చేసిన జాతీయసంస్థ సరిగా గుర్తించలేదు! ఇప్పటికైనా ఆయనకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలి. ఎందువల్లనో, ఆనాడు ఢిల్లీ పెద్దలకు ఆయన పేరుచెబితే ఉలికిపాటు! తనపై వచ్చిన అసత్యారోపణలన్నీ వీగిపోయిన తరువాత -తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆయన ఈ రచయితకు లేఖ రాస్తే, ఢిల్లీ పెద్దలు ఎంతగా ఉలిక్కిపడ్డారు! ఏమైనా ఆయన జయంతిని ఆ మహనీయునికి జన్మనిచ్చిన తెలంగాణ, అక్కడి ప్రభుత్వం ‘ప్రభుత్వ వేడుక’గా ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించడం ముదావహం. ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ సలహా యిచ్చిన కె.వి. రమణాచారి ఎంతైనా అభినందనీయులు.

– డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
(నేడు పి.వి.నరసింహారావు జయంతి)

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.