ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9
5- ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2
అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked from all decent society as below the level of the brute ‘’అన్నారు .విదేశాలలో సైతం ఇదే విమర్శలోచ్చాయి ‘’ది లండన్ క్రిటిక్ ‘’ఇంత అమర్యాద కవిని అమెరికా ఎలా భరిస్తోందో ?’’అని ఛీత్కరించింది .న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ‘’గడ్డిపరకల రచయిత సగం మనిషి సగం మృగం .అతని మూలాలు పంది దొర్లే బురద గుంటలో ఉన్నాయి ‘’అన్నది .వీటికి అతీతం గా మొదటి గుర్తింపు ,ప్రశంసా న్యు ఇంగ్లాండ్ ప్యూరిటన్ చార్లెస్ ఇలియట్ నార్టాన్ ‘’నుంచి లభించింది ‘’whitman is a new light in poetry ‘’అంటే ,ఎడ్వార్డ్ ఎవెరెట్ హేల్ అనే బోస్టన్ క్లేర్జిమన్ ‘’కొత్తదనం తో కవిత్వం వచ్చింది .తాజాగా ఉంది .చాలా సాధారణం గా ఉంది .మనసులోని భావాలను మాటల్లో ఎలా చేబుతామో కవిత్వం లో అలాచేప్పి కొత్త దారి తొక్కాడు ‘’అన్నాడు .
వీటన్నిటికి మించి గొప్ప కవి రచయితా దార్శనికుడు ఎమర్సన్ ‘’Dear sir ,I am not blind to the worth of the wonderful gift of ‘’Leaves of Grass ‘’.I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy – I give you joy of your free and brave thought .I agree you at the beginning of a great career ‘’అని ఆ కొత్త గొంతుకను మెచ్చి వెన్ను తట్టాడు .ఆ దార్శనికుని అభినందన కోటి ఏనుగులబలమైంది విట్మన్ కు .అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగ లేదు .ఈ భవిష్యత్ దీవన ఫలించటానికి మరికొంతకాలం పట్టింది .మధ్యలో అనేక అవాంతరాలు అడ్డంకులు కల్లోలాలు ఎదురు దెబ్బలు వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చింది
విట్మన్ దృష్టిలో సెక్స్ అనేది మనిషి జీవితం నుంచి దూరంపెట్టాల్సిన విషయం కాదు జీవితం లో భాగమే .ఇప్పటి మన’’ జగన్’’ లాగా అందర్నీ కౌగలించుకొని ఓదార్చేవాడు .సానుభూతి చూపేవాడు .నుదురు మెడ వక్షోజాలు అన్నీ తాకి ఆడా మగా తేడా లేకుండా హత్తుకొని వారితో కలిసిపో యేవాడు .అందరు అతని ఒడార్పులో కరిగి నీరయ్యేవారు .దుఖోపశమానం పొందేవారు. హృదయం లో ఉన్న బాదాగ్ని ని అతని చల్లని స్పర్శ చేత పోగొట్టుకోనేవారు .అంటే అతనిది ‘’హీలింగ్ టచ్ ‘’అన్న మాట .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో తన మనోభావాన్ని ‘’I celebrate my self ,and sing my self –And what I assume you shall assume –For every atom belonging to me ,as good belongs to you ‘’అని వారితో అభేదాన్ని పొందాడు .తాదాత్మ్యత చెందాడు. సహ వేదన చూపాడు. సాను భూతి ప్రదర్శించాడు .మమేకం అయ్యాడు . అమెరికా చరిత్రలో ఒక కవి ఇంతగా ప్రజా సన్నిహితుడు అవటం ఇంతకూ ముందెన్నడూ లేదు .ఇదే మొదలు అందుకే ఆరాధనీయుడయ్యాడు .దీనజన బా౦ధ వుడయ్యాడు .అదో జగత్ సహోదరులకు ఆప్తుడయ్యాడు .శ్రీ శ్రీ లాగా కవిత్వం రాసి వారి మానాన వారిని వదిలేయ లేదు .వారిలో ఒకడయ్యాడు .అదీ విట్మన్ ప్రత్యేకత .
గడ్డిపరకల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి .కొత్తవి చేర్చి ప్రచురిస్తూనే ఉన్నాడు .మూడవ ముద్రణ తర్వాత 456 పేజీలతో 124 కొత్త కవితలను చేర్చి ప్రచురించాడు .1891 విట్మన్ కంటి తో చూసుకొన్న తొమ్మిదవ ప్రచురణ వచ్చింది .పేజీలు ముద్రణ సంఖ్యా పెరుగుతోన్దేకాని ఆదాయం దానిపైన ఏమీ పెద్దగా రాలేదు .దాదాపు రెండేళ్ళు నిరాహారం గా ఉండిపోయాడు అంటే ముక్కున వేలేసుకొంటాం .లాభం లేదని మళ్ళీ జర్నలిజం గడప తొక్కాడు .బ్రూక్లిన్ డైలీ టైమ్స్ ఎడిటర్ అయ్యాడు .బాగా రాసి దూసుకుపోతుండగా అమెరికన్ రాష్ట్రాల మధ్య అంతర్ యుద్ధం వచ్చి సోదరుడు జార్జి ఫ్రెడరిక్ బర్గ్ యుద్ధం లో తీవ్రం గా గాయపడితే అతనికోసం బ్రూక్లిన్ వదిలి వెళ్ళాల్సోచ్చింది .
అప్పటికే నలభై రెండేళ్ళు వచ్చిన విట్మన్ ముసలాడినని భావించటం క్వేకర్ భావాలున్డటం వలన ఆయుధం పట్టకూడని సైనికుడుగా నమోదు కాలేదు .గాయాలపాలైన జార్జికి కట్టు కడుతూ వాషింగ్టన్లోనే 12ఏళ్ళు ఉండిపోయాడు .అంతకు ముందే బ్రూక్లిన్ ,న్యు యార్క్ లలో సైనికుల గాయాలకు సేవ చేసిన అనుభవం ఉంది .దీనితో వాషింగ్టన్ హాస్పిటల్ లో మానవత్వం తో అసహాయుల పాలిటి సేవకుడై సేవలందించాడు .’’హాస్పిటల్ విజిట్స్ ‘’అనేదానిలో రాస్తూ ‘’there is something in personal love ,caresses ,and the magnetic flood of sympathy ‘’అని రాసుకొన్నాడు .దీనివలన మందులకంటే సైనికులకు విట్మన్ చూపిన ఆదరణ ఆత్మీయతలే గోప్పమందుగా పని చేసి కోలుకొన్నారు .అధికారుల పత్రాలను కాపీ చేసిపెట్టాడు ,పత్రికలకు ఏదో విషయం పై రాసి వచ్చేడబ్బును గాయపడి కోలుకొంటున్న సైనికులకు పళ్ళు , పొగాకు ,స్టాంపులు ,చేతి అవసరాలకు డబ్బు పండ్ల రసాలు ,పుస్తకాలకోసం ఖర్చుచేసి అందించి వారికి మానసిక సంతృప్తి కలిగించి తానూ ఆనందం పొందేవాడు మానవీయ విట్మన్ .క్షతగాత్రుల ప్రక్కలో కూచుని చక్కగా సంభాషించి ఊరటకల్గిన్చేవాడు .వారు రాయమన్న ఉత్తరాలు బంధువులకు రాసిపంపెవాడు .ఇవన్నీ చాలా హృదయ విదారకం గా ఉండేవి .వీటిని అక్షరబద్ధం చేసి సీరియల్ గా రాసి పత్రికలకు పంపుతూ గడిపాడు .ఇదంతా దయనీయమైన బాధామయమైన అనుభవమే .ఇతరులకోసం జీవించటం అనే గొప్ప మానవీయ కోణాన్ని విట్మన్ ఆవిష్కరింప జేసుకొన్నాడు .జీవితం లో టెర్రర్ ను, ప్రేమను అనుభవైక వేద్యం గా ‘’’డ్రం-టాప్స్ ‘’(మద్దెల దరువులు )రాసి చలించేట్లు చేయగలిగాడు .ఏదో దేశ భక్తీ రచనలు చేసి చేతులు దులుపుకోలేదు .యదార్ధ సంఘటనలకు మానవీయతను జోడించి రాసి స్పందింప జేశాడు .తోటివారితో సహజీవనం చేసిన మహా మనిషిగా మార్పు చెంది మాననీయుడనిపించుకొన్నాడు .
ఇప్పటికి పత్రికలూ కళ్ళు తెరచి అతని లోని మానవత్వాన్ని అర్ధం చేసుకొన్నాయి .లెంపలేసుకొన్న ‘’టైమ్స్ ‘’తన కధనం లో Whitman s devotion to the most painful of duties in the hospitals at Washinton during the war will confer honor on the memory when ‘’leaves of grass ‘’are withered and when the drum –taps have ceased to vibrate ‘’అన్నది .ప్రభుత్వమూ అతన్ని గుర్తించి ‘’ఇండియన్ బ్యూరో ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లోప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కేబినేట్ లో గుమాస్తా ఉద్యోగం ఇచ్చింది .కొంతకాలానికి ఇంటీరియర్ కు సెక్రెటరి గా ఉన్న జేమ్స్ హార్లాండ్ ఒక ప్రైవేట్ డ్రాయర్ సొరుగు లో విట్మన్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకం చూసి కొంపలు మునుగుతాయేమోనన్న భయం తో ఎవరికీ చెప్పకుండా విట్మన్ ఉద్యోగం నుంచి తప్పించాడు .దీన్ని జీర్ణించుకోలేని విట్మన్ కవి అభిమానులు విలియం డగ్లాస్ కానేరీ నాయకత్వం లో ‘’ది గుడ్ గ్రే పోయెట్ ‘’అనే పేర ఒక కరపత్రం ముద్రించి పంచారు .తప్పు తెలుసుకొన్న అధికారులు విట్మన్ ను అటార్నీ జెనరల్ ఆఫీస్ కు బదిలీ చేశారు .యాభై మూడవ ఏడు వచ్చేదాకా ఇక్కడే హాయిగా విట్మన్ ఉద్యోగం చేశాడు కాని జీతం చాలకు తన పుస్తకాలు స్వయం గా అమ్ముకొని బతికాడు కవి .
తలలో నొప్పుల బాధలు అనుభవించాడు .రోగులకు సేవ చేసినప్పుడు కొన్ని క్రిములు చేరి ఉంటాయని భావించాడు . వాషింగ్టన్ నగరమంటే చెప్పరాని మక్కువ ఏర్పడింది .సైనిలను ఒక తల్లిలాగా పలరించేవాడు ఆదరించేవాడు .అతనిలోని ఆ మాత్రు భావనకు వాళ్ళ హృదయాలు కరిగిపోయేవి .మరింత సన్నిహితులయ్యేవారు .’’I think to be a woman is greater than to be a man ‘’అని మహిళా శ్రేస్టతను, మాతృత్వ గరిమను చెప్పాడు విట్మన్ .పీటర్ డయోల్ అనే బాలుడికి తల్లి వాత్సల్యం తో ఉత్తరాలు రాసి అతనికి జీవితేచ్చ కల్గించి ఆదుకొన్నాడు .అతనితో పన్నెండేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మాతృ వాత్సల్యం పంచిన మహా మానవీయకవి వాల్ట్ విట్మన్ .
![]()
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు
