ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31
14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3
కరేనిన ప్రాముఖ్యత
వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . నైతికతపై ఆలోచనలున్నాయి .రష్యా ఉన్నత వంశానికి చెందిన ఒక మహిళ విషాద గాధ ఇది .యవ్వనంలో అందంగా ఉన్న సున్నితమనస్కతకల ఒక అమ్మాయికి తనకంటే చాలా పెద్ద వయస్కుడైన వాడితో పెళ్లి జరిగింది .పరిస్తితుల ప్రాబల్యం వలన ఆమె ఒక యువ ఆఫీసర్ ను ప్రేమించింది .ఇటు ప్రేమ అటు భర్త తో సంసారం .ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది .తేల్చుకోలేక ,ముందుకు సాగలేక ,సమాజాన్ని ఎదిరించలేక నిరాశా నిస్పృహలతో రగిలిపోయే కేరేనినా పాత్రను చిరస్థాయిగా నిలిచేట్లు మలచిన తీరు అసదృశం గా కనిపిస్తుంది .’’Anna Karenina is all encompassing stern and compassionate ,understanding ,yet merciless ,one of the supreme novels of the century ‘’.
టాల్ స్టాయ్ కొత్త మతం
నిజ జీవితం లోకూడా టాల్ స్టాయ్ అంతసంఘర్షణ కు లోనయ్యాడు .తప్పు చేస్తున్నానేమోనని చింతించాడు చావు భయం వెన్నాడుతోంది .మానసులోని భావాలను అణచుకోలేక పోతున్నాడు .జీవించటానికి ఆధారమూ గోచరి౦చటం లేదు .సమైక్యత,కనీస న్యాయం ,నైతికతస్తిరత్వం వైపు మొగ్గు పైనే ద్రుష్టి పెట్టాడు .మతం లో సామాన్య రైతుకు అభయం ,మరణానికి సంసిద్ద మయ్యే ప్రశాంతత ఉన్నాయనుకొన్నాడు .దీనికి తనకు పూర్తీ ఆధ్యాత్మిక భావాలే శరణ్యమని పించింది .మొదట సంప్రదాయ చర్చి పై ఆధార పడాలనుకొన్నాడు .కాని వారిలోని చాందస భావాలు ,కర్మకాండలు నచ్చలేదు .చివరికి తన ధోరణిలో ఒక కొత్త మతాన్ని గురించి ఆలోచించాడు .ఈ విషయాలన్నీ ‘’కన్ఫెషన్స్ఆఫ్ సెయింట్ ఆగష్టిన్ ‘’లో చర్చించి రాశాడు.ఆయన మతం లో దేవుడు అంటే దేవుడు అంటే అన్నిరకాల నమ్మకలున్నవారికీ చెందినవాడు .ఏదో ఒక భావానికి మాత్రమె చెందినవాడుకాదు .అంటే ‘’యూని వర్సల్ గాడ్ ‘’ .. జీసస్ అంటే ఒక లిజే౦డరి ఫిగర్ మాత్రమె .అన్నికాలాలకు గొప్ప బోధకుడు .విజ్ఞానానికి పరాకాష్ట .ఆయన చెప్పిన’’ సేర్మాన్ ఆన్ ది మౌంట్ ‘’ లో ఉత్తమజీవికా విధానాలున్నాయి .అందులో చెప్పిన ‘’resist not him that is evil ‘’అనేది శాంతికి ప్రవచనం గా భావించాడు
టాల్ స్టాయ్ ని రూసో తోపోల్చటం ఉంది ఇద్దరి జీవన విధానాలు వేరే . ‘’మనిషి లోని దైవానికి’’సేవ చేయాలనే తత్త్వం లియో ది .వ్యక్తిగతమైన ఇష్టం బలహీనత అన్నాడు .పనిలో మనమెవరమో మర్చిపోవాలి .కళ మానవ సహోదరత్వానికి మాధ్యమంగా ఉండాలి అన్నాడు .ప్రతిదీ కళాత్మకం గా ఉండాలని అంటాడు .చదువులో ,పనిలో ,వ్యక్తిగత భావాలలో ,ప్రభుత్వం లో పబ్లిక్ సెంటిమెంట్ అన్నిటిలో కళ కనపడాలి .కళతోనే అన్నిటినీ కొలిచేవాడు .వీటినే దిలివింగ్ కార్ప్స్’’,దిపవర్, ఆఫ్ డార్క్ నెస్ మొదలైన నాటకాలలో నిక్షిప్తం చేశాడు .ప్రసిద్ధమైన కధలు’’ దిడెత్ ఆఫ్ ఇవాన్’’’’ ఇల్యోవిచ్ ,ది క్రాత్రడ్జ్ర్ సోనాటా ‘’లలో కూడా పోదిగాడు ‘’.రిసరేక్షన్ ‘’అనే నవల ‘’వాట్ ఈజ్ ఆర్ట్ ‘’లు పూర్తిగా నైతికతను సంర్ది౦చేవే .
మారిన మనిషి
టాల్ స్టాయ్ లో అంతులేని మార్పులు వచ్చాయి .వస్త్రదారణా మారింది ముతక బట్టలు కట్టటం మొదలు పెట్టాడు .పాద రక్షలు లేకుండా నడిచాడు .ఇతరుల శ్రమ మీద జీవించటం నేరంగా భావించాడు .అన్నిరకాల వ్యసనాలకు ,’’ఆకళ్ళ’’కు దూరంగా ఉన్నాడు .పొగ తాగటం మానేశాడు .శాకాహారం పైనా,తీవ్ర శిక్షల రద్దు పైనా పుస్తకాలు రాశాడు .డబ్బు బంధాలనుండి ,ఆస్తి సంకెళ్ళ నుండి విడిపడాలని ఆలోచించాడు .ఇవన్నీ ‘’అయ్యవారికి’’ బాగున్నా ‘’అమ్మవారు సోన్యా’’ కు నచ్చలేదు .వీటిపై ఆలోచించటానికే ఆమె ఇష్ట పడలేదు .భార్య పూర్తిగా మతాన్ని చర్చిని సమర్ధించే వ్యక్తీ .అందువల్ల టాల్ స్టాయ్ ఊగిసలాట ధోరణి భార్యకు అసలు నచ్చలేదు .ఆమె స్వతహాగా రైతు కాకపోవటం ‘’ కౌం టేస్’’’’కావటం ,ఆస్తిని విస్త్రుతపరచాలనే ఆలోచనలో ఉండటం ,ఎస్టేట్ ను సంపన్నం చేయటానికి ,పిల్లలకోసం ఎస్టేట్ రాబడి ,సంపద వృద్ధి చేయాలనే ఆలోచనా ఆమెది .స్వచమైన తల్లిగా ఉండటమే ఆమె ఆదర్శం .ఆమెకు విరుద్దం గా ప్రవర్తించలేక తన భావాలను ఒదులుకోలేక సతమతమవుతున్నాడు .నిర్ణయాలను వాయిదాలపై వాయిదాలు వేస్తున్నాడు .తన ఆస్తినంతా ఆమె పేరున రాసేశాడు .తన పుస్తకాలపై వచ్చే ఆదాయం హక్కులు జనానికి ఇవ్వటానికి బదులు ,ఆమెకే చెందేట్లు రాయటంచేసేశాడు .సోన్యా స్వంతం గా పబ్లిషింగ్ హౌస్ ఏర్పాటు చేసి భర్త రచనలను స్పెషల్ ఎడిషన్స్ గా ముద్రించింది .వ్యాపార ధోరణి బాగా ఉన్న ఆమె దీనితో డబ్బు బాగా గడించి లాభాలు తీసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-15 –ఉయ్యూరు
