కమనీయం కావ్యం

కమనీయం కావ్యం లోకోత్తర వర్ణనా నిపుణులైన కవి యొక్క కర్మయే కావ్యమని మమ్మటాచార్యుడు అన్నారు. కవి శబ్దం మొదట వేదములందు గోచరించుచున్నది. వేదాలలో కవి శబ్దమును పరమాత్ముని అర్థమున వాడబడును. ఆ తర్వాత అది పరమాత్ స్వరూపులైన ఋషులకు వాడబడును. వేదమంత్రములు దర్శించుట వల్ల మహాఋషులు వారే కవులు. నా కృషి కురుతే కావ్యమ్ అనే వాక్యాన్ని బట్టి ఋషికానివాడు కవి కాలేడు అని కవికానివాడు కావ్యం రచించలేడు. అంటే ఋషి కావ్య నిర్మాణం చేయగలడని తెలుస్తున్నది. వేదాలను, పురాణాలను బాగా నెరింగిన కవి కావ్యాన్ని అల్లుతాడు.
కావ్యములో వేదాలలో గల శాసన రూప శక్తిని పురాణాలలో హితవుతో కూడిన శక్తిని కావ్యంలో రసోచితంగా విషయాన్ని అందిస్తాడు కవి. లోకోత్తర ప్రాంగణానైపుణ్యం ప్రతిభ వలన సాధ్యమగుచున్నది. ప్రతిభ దేవతానుగ్రహం వలన సంప్రాప్తమగును. దేవతానుగ్రహం, తపస్సాం పద్యం, తపస్సు ఋషి వ్యాపారం అందుచేతనే ఋషి కానివాడు కావ్యం నిర్మింప జాలడన్న మాట కలిగినది.
కావ్యాంగము కాని, శబ్దము కాని, న్యాయం కాని, విద్యాకాని, కళ కానిది లేదు. క్రీ.శ. 5వ శతాబ్దా నికి చెందిన ‘భామహుడు’ శ్రవ్యకావ్య చర్చ గావించి సహితంలైన శబ్దార్ధమును కావ్యమని చెప్పిరి. భామహుని అభిప్రాయం అనుసరించి శబ్ధముగళమ కావ్య శరీరం, అలంకారలు సౌందర్యమును కలిగించు భూషణములు. క్రీ.శ. 6వ శతాబ్దికి చెందిన దండి అనేకవి ఇష్టార్థవ్యవ స్థితమైన పద సమూహమే కావ్యమని అన్నాడు. ఇష్టార్థ మనగా కమనీయమైన అర్థం ఇటువంటి శబ్దాలతో కూడుకొన్న సమూహమును కావ్యమని చెప్పారు.
క్రీ.శ. 6వ శతాబ్ది వాడయినటువంటి వామనుడు గుణములచే ఏర్పడురీతి కావ్యాత్మ అనీ, అలంకారమును తత్ సౌందర్య పోషక ముల నియు నుడివినారు. ఆనందవర్ధనుడు విశిష్టంగా చెప్పకపోయినా, అభి నవగుప్తుడు చెప్పిన రీతినే బలపరిచినాడు.
మహిమ భట్టు, కుంతకుడు మొదలగు వారు శతార్థయుగళము కావ్య శరీర మని సూచించిరి.
రస గంగాధర కర్తయైన జగన్నాథుడు దండి శబ్దమునకు ప్రాధాన్య మొసంగెను. శబ్ధార్థములు రెండూ అవినాభావ సంబం ధం కలిగి ఉండును. కాళిదాసు అర్థం, భావం, శబ్దమును ఆశ్రయించియే ఉండు నని చప్పి ఉన్నాడు.
సహితములైన శబ్దార్ధములు కావ్యమని భామహుడు, ఇష్టార్థ వ్యవశ్చిన్న మైన పదావళి కావ్యమని దండి, గుణాలంకార యుక్తములైన శబ్ధార్ధములు కావ్యమని వామ నుడు, అదోషములు, సుగుణములు, సాలం కార ములైన శబ్దార్ధములు కావ్య మని మమ్మటుడు, రసాత్మక వాక్యం కావ్యమని విశ్వనాథుడు, గుణాలంకార రీతి రసోపేతమైన సాదు శబ్ధార్థమ్ కావ్యమని పీయుషుడు, రమనీయార్థ, రమణీయార్థ ప్రతిపాదిక కావ్యమని జగన్నాథుడు, రసాలంకారయుక్తం అయినది కావ్యమని కేశవ మిశ్రుడు అన్నారు.
శబ్ద రత్నాకరముననుసరించి ప్రబోధం అంటే మేలు కొలుపుట అని అర్థం. ఈ ప్రబోధము రెండు విధాలుగా ఉండును. 1. మత పరమైనవి 2. సాంఘిక రాజకీయ పరమైనవి.
స్వాతంత్య్రం రాక పూర్వం మన భారతదేశ కవులు వివిధ భాషలల్లో ప్రబోధములు రచించారు. మత ప్రచారం కొరకు ఆయా మతాలవారు ప్రబోధ ప్రవచనాలు చేసారు. చేస్తూ ఉన్నారు.
జైన, బౌద్ధ మతాలవారు ఆయా మతాలవారు జనుల ప్రబోధార్థం జాతక కథలు, కొందరు కావ్యాలు రచించారు. శివవైష్ణవ మతాల వ్యాప్తికి ద్విప దలు, ప్రబంధాలు వెలి సాయి. పాలుకురికి సోమనాథుడు ప్రబోధాత్మక శతకం రచించాడు. ”బసవా బసవా బసవా వృషాధిప” అనే శతకం ద్వారా మత వ్యాప్తి నాశిం చాడు. అట్లాగే ఇతర మతాలవాళ్లు పాటలు మొదలైన సాహిత్యాన్ని ఉప యోగించు కున్నారు.
దాస్య తిమిరా వళిలో పడి పరాధీన శృంక లాల తగిలి కొట్టు మిట్టాడుతున్న జాతిని ఉద్ధరించ డానికి కవులు కలం పట్టారు. అట్ట డుగున పడి సమా జంచే వెలియేయ బడ్డ వారం తా ఒక్కు మ్మడిగా విజృం భించి జాతిని ఉత్తేజ పరి చారు. వారు రాసిం దంతా ప్రబోధ సాహి త్యమే.
దవులపల్లి వారు తన ”సారస్వత నవనీతం” లో అంటారు – నిద్రాణమై ఉన్న జాతిని మేలు కొలుపు టకు సాహిత్యం కన్న మహత్తరమైన సాధనం మరొక్కటి లేదనీ, రూజువెల్డు వాల్టేరు లు రచనల వలన ఫ్రెంచి విప్లవం వచ్చిందనీ.
ఇంతెందుకు టాలిస్టాయ్, మాక్సింగోర్కి డాసో వస్కీ ప్రభృతులు రష్యా వాఙ్మయం ద్వారా ఆదేశా లల్లో అద్భుతమైన ప్రబోధం కలిగించారు.
బ్రిటిష్ పరిపాలన కింద అణగారి పోయిన భారతీ యులను తమ విద్యుక్త ధర్మాలను పాలింప వలసినదిగ ప్రబోధించి, మేలు కొలిపినది వాఙ్మ యమేనని చెప్పవచ్చు. మన స్వాతంత్య్రోద్యమ చరిత్ర ఒక ఉద్యమంగా వ్యాప్తి చెందుటకు వాఙ్మయ ప్రాబ ల్యమే నని చెప్పవచ్చు. ప్రబుద్ధ భారతానికి తొలి వైతాళికులు రచ యితలేనని నిర్ధారణ చేయవచ్చు.
యం.వి. నరసింహారెడ్డి
