ఇది విన్నారా కన్నారా ! 17
34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సోమేశ్వర రావు
231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు శ్రీ పప్పు సోమేశ్వర రావు .’’సోమేశ్వర కృతి కదంబం ‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు .’’కృతి కదంబం ‘’పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు .నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత భాషా సంగీత పాండిత్యానికిప్రాతీకలు .
232-పప్పు వారు విజయనగర పద్ధతిలో తానం వాయించి ప్రత్యేకత సృష్టించారు .విజయవాడ రేడియోలో 14 వ ఏట మొదటి కచేరీ చేశారు బావగారు అయ్యగారి సోమేశ్వర రావు గారే గురువు .ఎన్నో రేడియో కేంద్రాలలో కచేరీ చేశారు .వీరి రాగం,తానం పల్లవి లకు ప్రత్యేకత ఉంది .100 పల్లవులను విభిన్న తాళాలలో వాయించే అరుదైన నేర్పున్నవారు అలా హైదరాబాద్ కేంద్రం లో వాయించి చూపారుకూడా .
233 -ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ సికందరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలలో వీణా చార్యులయ్యారు .వైణికుని కి పరీక్ష పెట్టె తోడి ,ఆనంద భైరవి ,శహన ,కేదార గౌళ ,కాపీ ,నీలాంబర రాగాలను సాధికారంగా వాయించే నైపుణ్యం వారిది .
234 –మరీ చిన్నతనం లో వాయించిన కచేరీలకు పారితోషిక ధనాన్ని తండ్రిగారి పేర చెక్ ఇచ్చేవారట .వీరికుమారుడు పప్పు చంద్ర శేఖర్ కూడా తండ్రికి తగ్గ వారే –‘’వీణానాద సుధార్ణవ ‘’,వైణిక సార్వ భౌమ ‘’బిరుదాంకితులు .12-9-2002 వైణిక సార్వభౌమ ,వైణికశిరోమణి పప్పు సోమేశ్వర రావు గారు పరలోక గతులయ్యారు .
35-వైణిక శిరోమణి –శ్రీ వాసా కృష్ణ మూర్తి
235 –వాసా వారి కుటుంబమంతావీణా వాదన సంగీతం లో ధన్యమైనవారే .వాసా పెద జగ్గన్న గారి నుంచి రామ దాసు ,దాసన్న ,చిన జగ్గన్న,పెద కామయ్య ,నర్సయ్య ,అప్పయ్య ,చిన కామయ్య ,సాంబయ్య ,కృష్ణ మూర్తి ,వెంకటరావు సాంబ మూర్తి ,కృష్ణ మూర్తి గారి దాకా పది తరాల వరకూ అందరూ వైణిక విద్వాంసులే అవటం అబ్బుర పరచే విషయం.
236- వాసా కృష్ణ మూర్తిగారు తయారు చేసిన శిష్యులు అనేకులున్నారు వీరి బాణీకి విశిష్టత ఉంది .హిందూ స్థానీ రీతిని కూడా మేళవించి వాయించే సామర్ధ్యం వారిది .వీరికుమారుడు వెంకటరావు గారుకూడా గొప్ప విద్వాంసులే .రెండు చేతులతోనూ వీణ మీటే ప్రత్యేకత కృష్ణ మూర్తిగారిది .కుడి చేతి వ్రేళ్ళతో మీటు ,ఎడమ చేతి వ్రేళ్ళతో వాదనమూచేసేవారు .రోజుకు కనీసం 10 గంటల సాధన చేసేవారు .
237 –తానం విషయం లో గొప్ప ప్రయోగ శీలి .తాళం తీగలను మీట కుండానే కృష్ణ మూర్తిగారు అప్పుడప్పుడు కొంతకాలం తానం వాయించి ,ఆ వెంటనే తాళం తీగల్ని మీటి దానితో కలిపేవారు .ఇదీ ప్రత్యేకత .ఆయన తానం పరవళ్ళు తొక్కే ప్రవాహం లాగా స్రవించేది .ఈవిధంగా స్పురిత ,ప్రత్యాహత ,సుళువులతో కూడిన మేళ రాగ పంచక తానం దురితం లో విజ్రు౦భించి వాయిస్తుంటే ‘’నాసామిరంగా’’- వినే వాళ్లకు సితార్ ,సరోద్ లు విన్నంతమదురాను భూతి కలిగేది
238 –నిర్మొహమాటి కృష్ణ మూర్తిగారు .ఎంత గొప్ప సంగీత విద్వా౦సుడైనా తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా విమర్శించేవారు .1944 లో శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు కృష్ణ మూర్తిగారి వీణా వాదన విని ‘’శిరోమణి ‘’బిరుదునిచ్చారు .తర్వాత ‘’వైణిక శిరోమణి ‘’అయ్యారు .వీరి శిష్యులలో ప్రముఖులు –శ్రీ మంగు వెంకట రావు ,శ్రీ బి జగన్నాధం ,శ్రీ మతులు వసు౦ధరాదేవి,జోగులాంబ ,అ౦బుజవల్లి ,సుభాషిణి శాస్త్రి .కృష్ణమూర్తిగారిని ‘’వీణా వాదన పధ నిర్దేశికులు’’గా భావిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్