ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2
ఈ నాటి నాటక ధియేటర్ చూసిన వారికి పాతకాలపు ఆరుబయలు నాటక శాల వింతగా అని పిస్తుంది .అప్పుడు శాలలో చాలాభాగం శి ల్పీ కరించటమో రంగులు వేయబడి మార్బుల్ లాగా అనిపించేట్లు చేయటమో ,స్టేజి మీద నక్షత్రమండలం ,గ్రహమండలం ఉండటమో జరిగేది ..నాటకానికి సన్నివేశాలకు తగిన కాన్వాస్ పెయింటింగులు వేలాడ దీయబడేవి .ట్రాజెడీ నాటకాలకు నల్లరంగు చిత్రాలు ,ముడుతలతోరణాలు వేలాడ దీసేవారు ..ఇవాళ్టి సీనరీ బదులు ,ఖైదీలు నిలబడే బార్ లు ,ప్రేమికులు విహరించే అందమైన ప్రదేశాలు ,రథం ,ఉరి ,టేబుళ్లు ,చెట్లు మంచాలు పరుపులు ,సింహాసనాలు వ్రాత బల్లలు మొదలైనవి అవసరాన్ని బట్టి వాడేవారు ..నాటకసన్నివేశం ఎక్కడ జరుగుందో తెలియ జేయటానికి సైన్ బోర్డు మీద ”ఎధేన్స్ ”మొదలైన పేర్లు ఉండేవి అంటే అక్కడ ఈ సన్నివేశం జరుగుతోందని ప్రేక్షకులు అర్ధం చేసుకొనేవారు … కాస్ట్యూమ్స్ చాలాఖరీదైనవి వాడేవారు .వీటికంటే ఖరీదైన యుద్ధసామగ్రి ఖడ్గాలు బల్లాలు షీల్డ్ లు ,గౌన్లు ,పొడవైన వస్త్రాలు (రోబ్స్)కిరీటాలు ఉపయోగించేవారు .
షేక్స్పియర్ కాలపు ప్రేక్షకులకు మాజిక్ బాగా నచ్చేది .ఇవాళ్టికీ అంతే ..కనుక నాటక శాలలో భ్రా0తిజనకాలు , అద్భుతాలనిపించేవి ఉండేవి .అటకపై వీల్ అండ్ ఆక్సిల్ అనే హెవెన్స్ ఉండేవి .వీటిని నటులు కిందకి దించేవారు .దానిలోనుంచి దేవుళ్ళు దేవతలు స్టేజిమీదకు దిగి నిజంగా ప్రత్యక్షమైన భ్రా0తి కలిపించేవారు ..స్టేజి కింద ప్రక్క ద్వారాలను ”హెల్స్ ”అనేవారు .నటులు విగ్గులు ,గడ్డాలు ,పేస్ పెయింట్ లతో సామాన్యమైన మేకప్ మాత్రమే వేసుకొనే వారు. గాయం నుంచి రక్తం కారుతున్నట్లు చూపటానికి పిగ్ బ్లాడర్స్ లో జంతువుల రక్తాన్ని నింపి నిజరక్తం భ్రమ కలిగించేవారు . స్టేజి పై ఉరితీసే ఏర్పాటుకూడా నిజమే అన్న భ్రమ కల్గించేది .లోహపు షీట్లను వేగంగా కదిలించి ఉములు ,మెరుపుల ధ్వని,కాంతి కలిపించేవారు.తేలికగా అంటుకొనే వాయువులను ట్యూబులలో నింపి మండించి కాంతి సృష్టించేవారు ..గాలిలో దెయ్యాలు భూతాలూ తిరుగుతున్న భ్రమను టపాకాయల పేలుళ్లతో కలిపించేవారు .తోకచుక్కలు ,షూటింగ్ స్టార్స్ అనేక మంది సూర్యుల్ని చూపటానికి ఫైర్ వర్క్స్ ను పెద్ద ఎత్తున వాడి ఎఫెక్ట్ కలిపించేవారు ..గుర్రాల డెక్కల చప్పుళ్ళు డ్రమ్ వాయిద్య ఘోష ,ఘాంటానాదం ,గడియారం ఫిరంగి ప్రేలుళ్ళు ,,తుపాకీ తూటాశబ్దాలతో అద్భుత సౌండ్ ఎఫెక్ట్ కలిపించేవారు .సంగీతానికి వయోలాలు ,కార్నేట్లు ,సన్నాయి ల రికార్డార్లు వాడేవారు . మన సురభి కంపెనీలూ ఇలాంటి గొప్ప ఎఫెక్ట్ లతో నాటకాలు రక్తి కట్టించిన సంగతి మనకు తెలుసు
1570-1590 ,1599-1614 మధ్య స్వల్ప వ్యవధికాలాలలో ఆరుబయలు రంగస్థల నాటక శాలలకు ప్రయివేట్ లేక ఇండోర్ నాటక శాలల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది ..ఇండోర్ శాలలో బాలబాలికల చదువు పాటలపై శిక్షణ జరిగేవి.వీరు రాజస్థానలో చర్చిలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు .వీటిలో రెండువిషయాలలో ఒకటి సిబ్బంది ,రెండు నాటక శాల విస్తీర్ణం లలో ఆరుబయలు నాటక రంగశాలల కంటే భిన్నంగా ఉండేవి . బహిరంగ నాటక శాలలలో వయోజన యువకులు మొగ వేషాలు ఆడ వేషాలూ వేసేవారు కానీ ప్రయివేట్ శాలల్లో చర్చి లో రాజదర్బార్ లో పాడే 8 నుంచి 16 ఏళ్ళ బాలురు ఉండేవారు .వృత్తినాటక కంపెనీలు స్ట్రీలను తీసుకొనే వారు కాదు .ఈ నాటి ఆధునిక శాలలలో విస్తీర్ణం పాత బయలు నాటకరంగ శాలల విస్తీర్ణం కంటే నూ ,తర్వాతి ఇండోర్ నాటక శాలలకంటే ఎక్కువే ..అవి దీర్ఘ చతురంగా ఒక వైపు స్టేజి తో మిగిలిన ప్రదేశం లో ప్రేక్షక స్థానాలతో నిండి ఉండేది .పబ్లిక్ ధియేటర్లకంటే ఇక్కడ ప్రదర్శనలు తక్కువే జరిగేవి ,దాదాపు వారానికి ఒకే ప్రదర్శన .వీరి ప్రేక్షకులు 200 నుంచి 600 వరకు మాత్రమే ఉంటె” ఆరుబయట ”బాగోతానికి ”ప్రేక్షకులు 2500 మించి వచ్చేవారు ..పోషకులు పాట్రన్స్ తక్కువైతే ఆదాయం తక్కువ ..దీనికి తోడు ప్రయివేట్ ధియేటర్ల వాళ్ళు టికెట్ రేటు ఎక్కువ పెట్టేవారు .. వీళ్ళు ఆరు పెన్నీలు పెడితే బయటివాళ్ళు ఒక పెన్నీయే వసూలు చేసేవారు .
గాలి, వాన ప్రభావం ఉండదుకనుక ఇండోర్ వాళ్ళు మధ్యాహ్నం దాటాక ప్రదర్శన పెట్టేవారు .కృత్రిమ కాంతి సీన్లలో కాండిల్స్ లేక కాండీలాబ్రా లు ఉపయోగించేవారు ..కాండిల్స్ కరిగిపోతే కొడి రాల్చి మళ్ళీ వెలిగించటానికికి సమయం పడుతుందికనుక నాటకం మధ్యలో విరామాలు ఎక్కువగా ఉండేవి ..ఇలాంటి విశ్రాంతి లేక బ్రేక్ లు నాటక అభిమానులకు బాగా నచ్చేవి పాకెట్ బుక్స్ తీసుకొని చదువుకొని కాలక్షేపం చేసేవారు .ఈ బ్రేక్ సమయాలలో లిక్కర్ ,ఆరంజ్ జ్యుస్ అమ్మి సొమ్ము చేసుకొనేవారు .ఎంజాయ్ చేస్తూ వీళ్లూ పుచ్చుకొనేవారు .అదే తర్వాత కూడా ఇంటర్మిషన్ కు దారి చూపింది .పుర్వాధునిక ప్రయివేట్ ధియేటర్ లలో బ్రేక్ సమయం లో సంగీత కచేరి నిర్వహించేవారు .స్టువర్ట్ ధియేటర్ లో ”జార్గాన్ ” లేక అర్ధం పర్ధం లేని వాగుడు కార్యక్రమం ఉండేది దీన్ని” యాక్ట్స్ ”అనేవారు .
17 వ శతాబ్ది మొదటి దశాబ్దం అంతం లో ఇండోర్ ,ఔ ట్ డోర్ ధియేటర్ల మధ్య విచక్షణ లేక వ్యత్యాసం లేకుండా పోయింది .అనేక సాంస్కృతిక ఆర్ధిక రాజకీయ కారణాలవలన వ్యక్తిగత కంపెనీలు ఇండోర్ అవుట్ డోర్ ధియేటర్ల పై పూర్తి ఆధిపత్యాన్ని పొంది ,వయోజనులు బాలురను ప్రయివేట్ వాళ్ళనుంచి తీసుకొన్నారు .బాయ్స్ కంపెనీల , వారి అత్యంత సృజనాత్మక ధియేటర్ ల (బెన్ జాన్సన్ ,జార్జి చాప్మన్ జాన్ మారుస్టా న్ వంటి నాటకకర్తలు )చావు జరిగినా వాటి ప్రభావం తర్వాత వచ్చిన వాటిపై విపరీతంగా పడింది ..బ్రేక్ సమయాలలోరాజకీయ ,సాంఘిక సెటైర్ లు వచ్చాయి . ట్రాజెడీలలో కూడా నటుల ప్రభావాలు ,వారు ప్లే స్పెస్ లలో హాయిగా తిరగటాలతో కొత్త జవ జీవాలుపొందాయి .
ఇప్పుడు మనం చెప్పుకొంటున్న షేక్స్పియర్ కాలపు ధియేటర్ ప్రపంచ ముచ్చట్లు సాంఘిక రాజకీయ పరిణామం నాటక రంగస్థల మార్పులను గురించి చెప్పక పొతే అసంపూర్ణం అవుతుంది .వారసత్వ ,ఉన్నత గౌరవ స్థితి మనోభావాలున్న ఆనాటి సమాజం లో వృతినటులకు ,వారి సాహసాలకు గౌరవం లభించేదికాదు ..చట్టం నుంచి కాపాడుకోవటానికి పోషణకు వీలులేక వాళ్ళు నోబుల్ మెన్ ల సేవకుల్లాగా ఉండాల్సి వచ్చేది . కనుక 1590 లో లార్డ్ చెంబర్లేన్ మెన్ కు షేక్స్ పియర్ రాసిన నాటకాలు ముందుగా రిహార్సల్స్ గా రాజ దర్బారులో ఉన్నతాధికారుల సమక్షం లో ప్రదర్శించి తర్వాత మాత్రమే పబ్లిక్ గా డబ్బుకోసం వేయాల్సి వచ్చేది . 1959 నుంచి
ప్రీవీ కౌన్సిల్ ధియేటర్ కంపెనీలకు లైసెన్స్ మంజూరు చేసి ,1603 తర్వాత మొదటి జేమ్స్ రాజు పట్టాభి షేకం తోకంపెనీలకు రాజ్యాంగ భద్రత ఎలిజబెత్ మహారాణి కాలం లో క్వీన్స్ మెన్ కు కలిగినట్లు కలిగి ఊపిరి పీల్చుకున్నాయి ..ఛాంబర్లేన్ మెన్ ఇక కింగ్స్ మెన్ అయ్యారు .మిగిలిన కంపెనీలకు మిగిలిన రాయల్ ఫామిలీ మెంబర్లు పేట్రన్లు అయ్యారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 1-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad

