వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు -2(చివరి భాగం )

 కొన్ని సందర్భాలలో మల్లి నాధుని వ్యాఖ్యలలో చివర్ల పురాణ విషయ వివరణలు ఉంటాయి .కవులు తమ కావ్యాలలో రామాయణ ,మహా భారతాలనుండి ,కొన్ని పురాణాలనుండి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తారు .ఆ సంఘటనలను తమకావ్య సంఘటనలతో పోల్చి చెప్పటం పరిపాటి .ఆ ప్రత్యేక విషయాన్ని దానికి సామ్యమైన పై వాటి నుంచి గ్రహించి అక్కడ నిక్షిప్తం చేసి తమ కావ్యాలను ఉన్నతీకరించే ప్రయత్నం చేస్తారు ..వీటిని పురాణ ఆశ్రితాలు (మైథలాజికల్ కారె లేషన్స్ ) అంటారు .కవులు వాటిని తమకావ్యాలలో ఊరికే ప్రస్తావిస్తారు తప్ప వాటి గురించి వివరణ ఇవ్వరు ..మ ల్లినాథుడు ఆ సన్నివేశాలు లేక సంఘటనల పూర్వాపరాలను చర్చించి వివరించి సుబోధకమయ్యేట్లు చేశాడు .. వీటికి సంబంధిత పూర్వ ఆధారాలు లేక మూలలను కూడా తెలియ జేశాడు .

 రఘు వంశం లో కాళిదాసు చంద్రుడిని వర్ణించాడు .ప్రజలు రాజును చూశారు కానీ వారికీ సంతృప్తి  కలగక అసంతృప్తితో ఉన్నారు ..ఆయన్ను ప్రజలుఅప్పుడే పైకొస్తున్న  ఔషద్గీ  ప్రభువైన చంద్రుడుగా కనిపించాడు -’’నాధామివౌషధీనాం ‘’.దీనికి వివరణ  తప్పనిసరి .పాపుహ్ అనే క్రియ సోమ కు చంద్రునికి ఉన్న అభేదాన్ని,ఏకత్వాన్ని  తెలియ జేస్తుంది.దీనికి మల్లినాథుడు వ్యాసుడిని ఉదహరించారు -’’తమ్ చ సోమం పర్యయేణ నుపూర్వశహ్ -అంటూ ‘’అత్య శ్శాద దును రిత్యర్ధహ్ ‘’’అన్నాడు ..సోమకు  ఉన్న విశేషణాలు చంద్రునికి కూడా వర్తిస్తాయి ఉదాహరణకు అదృశ్యమవటం అంటే శరీరం ప్రజలకోసం క్షీణించటం  లో రెండిటి లక్షణాలు ఉన్నాయి అన్నాడు మల్లినాథుడు -’’ఆదర్శనం -ప్రజార్ధ  వ్రత కర్శితాంగ  ‘’

 మరో సందర్భం లో రాణి సుదక్షిణ గర్భాన్ని గంగానది అగ్ని హోత్రుని తనలో దాచుకొన్నట్లు ధరించింది అంటాడు కాళిదాసు ..ఈ సందర్భంకు తగినట్లు  మల్లినాథుడు హరి వంశం లోని ఒక శ్లోకాన్ని ఉదహరించారు .రెండవ సందర్భం లో రామాయణ శ్లోకం ఉటంకించాడు .లోకపాలుర ప్రకాశాన్ని వర్ణించే సందర్భం లో మనుస్మృతి నుంచి ఉదాహరణ చూపాడు .వ్యాఖ్యానం చివర మల్లినాథుడు వీటిని ఉదహరించడం ఆయన ప్రత్యేకత మాత్రమేకాక ఆయన ప్రత్యేక శైలి కూడా .మల్లినాథుని ప్రత్యేక వివరణ వ్యాఖ్యానం చదివిన వారెవరికైనా  హాయిగా తాజాగా ఊపిరి పీల్చుకున్నట్లు సంతోషిస్తారు .గహన విషయాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పీ ఆయన పద్ధతికి హేట్సాఫ్ . కొన్ని యెడల విషయం కూడా .ఒక చోట వేరెవరో వ్యాఖ్యాతల వ్యాఖ్యానాలను తిరస్కరించాడు సూరి మల్లినాథుడు   .రంగ రాజు వ్యాఖ్యానాలు కూడా సూరి చేతిరస్కరింపబడ్డాయి .-’’రంగ రాజస్టు ‘’న చక్ర మర్యక్రమతాధికం ఘరమ్ ‘’ఇత్యుప రిస్టదా ద న్వయఇత్యాహ -తదసత్ ‘’గుణానాం చ పదర్ద్త్వాత్ ఇతి న్యాయ దారుణ్యాదివ ప్రత్యేకం ప్రదాన్వయీనాం క్రియహ్ – సంబంధ యోగాది త్యలం  శాఖా చంక్రమణేన పురా కిల రావణః కామయే కా మ్యే కర్మాణి పశుపతి ప్రీణనాయ నవ శిరస్తా గ్రై హుత్వా దశమారంభే సంతుష్టత్వస్మాత్ త్రైలోక్యాధిపత్యం వప్రే ఇతి పౌరాణికీ కథా మాను సంధేయా  ‘’

 ఈ రంగరాజే మరొక చోట తీవ్ర విమర్శకు గురయ్యాడు .పూర్వ రంగం ను రాజు నిర్వచించాడు -’’పూర్వరాజ్యతే అస్మిన్నితి పూర్వ రేంగే నాట్యశాలా తస్త0 కర్మాపి పూర్వరంగ  ఇతి దశ రూపకే -అతః పూర్వరంగే నామ రంగ ప్రధానాఖ్యే రంగ విధ్న  శాంతికరీ నాందీ పాఠ  గీతి వాది త్రాధి నే కాంగ విశేషే నాప్యాదౌ కర్తవ్య విశేషహ్ ‘’అని శిశుపాల వద్ద వ్యాఖ్యానంలో స్పష్ట0  చేశాడు .దశరూపకకర్త రంగ రాజు నిర్వచనాన్ని అధిక్షేపించాడు .మల్లినాథుని నిర్వాకాహన వ్యాఖ్యానం దశరూపకం వంటి నాటక రంగ శాస్త్రాలకు  అను బ0ద్ధంగా సంతృప్తిగా స్పష్టంగా ఉంది  ..కొన్ని పురాతన కధలను ఉదహరిస్తూ వాటిని మల్లినాథుడు ‘’పౌరాణిక కథా ‘’అని పేర్కొన్నాడు … వీటికి సంబంధించిన ఖచ్చితమైన ప్రకరణాలను  మల్లినాథుడు పేర్కొనేవాడు .అదే పేరుతొ చెప్పేవాడు .రావణ శబ్దానికి అర్ధాన్ని రామాయణం లోని ఒక శ్లోకం ఆధారంగా శబ్దోత్పత్తి శాస్త్రమర్యాదతో తెలిపాడు -’విశ్వవసోత్పత్యం పుమాన్ రావణః -పౌరాణికాస్తు రావయతీతి వ్యుత్పా దయన్తి ’  ‘’విశ్రయ-శ్వ   ఆదేశా’’

 మల్లినాథుడు ప్రతిదానికి ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇస్తాడు ..ఆ శ్లోకాన్ని అందులోని భావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు .ఆయన వ్యాకరణ వివరణ సుదీర్ఘం  .కీలక భావనలు  సరళ స్పష్టాలు ..కొన్ని ఉదాహరణలు –

‘’మహా భూత సమాధినా ‘’అనే రఘువంశ వాక్యాన్ని ఒక వ్యాఖ్యతో చక్కగా విడగొట్టాడు .-’’తస్య రాజా సర్వే గుణాః రూపరసాది మహాభూతగుణా వదేవ పరార్ధహ్ పర  ప్రయోజన మీ వైకం ముఖ్యం ఫలం యేషాం తే తయాక్తా అసన్ ‘’

 బ్రహ్మ దేవుడు దిలీపుని పంచభూతాత్మకంగా సృష్టించాడు .అందువలన వాటి లక్షణాలు ఆయనకు జన్మతహా అలవడ్డాయి ..చివరలో ఒక సాధారణ సూత్రాన్ని కూడా చెప్పాడు -’’మహా భూత గుణోప మేన కారణగుణాః కార్యే సంక్రమన్తీ న్యాయహ్ సూచితః ‘’

 ఒక్కోసారి కీలక పదాన్ని పట్టుకొని దానిపై అద్భుత వ్యాఖ్యానం రాస్తాడు సూరి .రఘువంశం లో రాజరిక తేజం రఘు మహారాజుతో పూర్తిగా ప్రేమలోపడి ఆయన అనుమతి కోసం ఎదురు చూస్తోంది .ఇది ఎలా ఉందంటే తండ్రిఅనుమతికోసం కన్నె పిల్ల ఎదురుచూస్తున్నట్లు ఉందట . .ఇందులో క్రియాసంబంధలక్షణాలు  ఫలిత సంబంధ లక్షణాలుగా మార్పు చెందాయి ..ఇక్కడ అనుజ్ఞ అంటే వివాహానికి ఆమెకున్న అర్హత అని మల్లినాథుడు అర్ధం చెప్పాడు .-’’అనుజ్ఞా శబ్దాత్ పితృ పరతంత్య్ర ముపమామ్ సామర్ధ్యత్ పాణిగ్రహణం యోగ్యతా చ ధ్వన్యంతే ‘’

  రఘువంశం లో సీతా పరిత్యాగం సందర్భం లోలక్ష్మణునివలన  విషయం తెలిసి సీతాదేవి భూమిపై మూర్ఛపోయింది .తల్లి ఒడిలో పడుకున్నట్లున్నది .నిజంగానే భూమాత ఆమె తల్లియే .దీనిపై వ్యాఖ్యానిస్తూ సూరి -స్త్రీణామాపాది  మాతేవ శరణమితి భావః ‘’అని చక్కగా చెప్పాడు

రాజును ప్రస్తుతించే ఒక సందర్భం లో అజామహా రాజా !లక్ష్మీ దేవి  నువ్వు నిద్రలో ఉన్నా నీలో చేరి ఓదార్పు పొందింది .ఆ చంద్రుడు పడమట దిక్చక్రమ్ వైపుకు పరిగెత్తుతున్నాడు .నీ ముఖ సౌందర్యం వీడిపోతోంది -’’నిద్రావశేన భవతాప్యన వేక్షమాణ -పర్యుత్సు కత్వ మబలా నిశి ఖండితేవ -లక్ష్మీర్వినోదయతి యేన దిగంత  లంబీ -సోపి త్వదానన రుచిం విజహాతి చంద్రహ ‘’ఇక్కడ లక్ష్మిని అజుని భార్యగా కవి చెప్పాడు అని నన్దర్గికర్  వ్యాఖ్యానించాడు -’’చంద్రారవింద రాజ వదనాదయో లక్ష్మీ నివాస స్థానానీతి ప్రశిద్ధి మాశ్రిత్యో చ్యతే -స చంద్రేపి దిగంత లక్ష్మీ పశ్చిమాశామ్ గతః సన్ -అస్తం గచ్ఛన్నిత్యర్ధహ్ -ఆతో నిద్రాం విహాయతామ్ లక్ష్మీ మన్యన్య శరణో పరిగృహా ణో త్యర్ధః ‘’

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-17 కాంప్-షార్లెట్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.