ప్రపంచ దేశాల సారస్వతం
77-మొనాకో దేశ సాహిత్యం
మొనాకో దేశం ప్రిన్సిపాలిటి ’సావరిన్ సిటీ స్టేట్ పశ్చిమ యూరప్ లో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు మిగిలినభాగం మధ్యధర సముద్ర తీరం లో ఉన్నది . కరెన్సీ –యూరో .భవ్య జీవన విధానానికి భేషైన దేశం .ఇన్కం టాక్స్ నామమాత్రమే .అందుకే వందకు పైగా దేశాలు దీనితో సంబంధాలు కలిగి ఉన్నాయి .ఇక్కడి ప్రజలు ప్రపంచం లోనే అత్యధిక ధనవంతులు .మూడో వంతు జనం మిలియనీర్లె .జిడిపి -165,420 డాలర్లు .ప్రపంచం లో రెండో స్థానం .
మొనాకో సాహిత్యం ను అక్కడి రచయితలు – ఫ్రెంచ్ ,ఇటాలియన్ ,మొనేగాస్క్ భాషలలో రాశారు .లూయీ నోటరి ఒక్కడే ఫ్రెంచ్ ,మొనేగాస్క్ భాషల్లో రాసి ఆదేశ సాహిత్యానికి ప్రేరణ కలిగించాడు .ఇతడు రాసిన లిరిక్స్ లో ఒకటి జాతీయ గీతంగా గౌరవి౦ప బడింది .అప్పటిదాకా మాట్లాడే భాషగా ఉన్న ఆదేశభాష ఇతనితో వ్రాతభాషగా రూపు దాల్చింది .లూయీ ఫ్రోల్లా ‘’పీస్ డిరెసిస్టన్స్’’ అనే మొదటి వ్యాకరణం రాశాడు .ఫ్రెంచ్- మొనేగాస్కో నిఘంటువు కూర్చాడు .స్థానిక రచయితలు తక్కువే .ఈ దేశ నేపధ్యంగా చాలామంది రాశారు .ప్రతి ఏడాది సాహిత్య బహుమతులు ఇస్తున్నారు .కాని ఏ పుస్తకమూ పబ్లిష్ కాకపోవటం ఆశ్చర్యమే .
కొందరు ప్రముఖ రచయితలు –రిచర్డ్ మొనాకో ‘’నైట్స్ టేల్స్’’,ఫైనల్ క్వెస్ట్ రాశాడు .ఇవి పులిట్జర్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాయి .ఎరిక్ రాబర్ట్ మోర్స్ –మొనాకో నవల రాశాడు .డఫ్నే డు మారియర్ –రెబెక్కా ,డోనాల్డ్ స్పోటో-హై సొసైటి,గ్రాహం గ్రీన్ –లూజర్ టేక్స్ ఆల్ ,క్రిస్టియాన డి మాస్టి-పాలస్ ,మైలైఫ్ ఇన్ ది రాయల్ ఫామిలి ,జియార్జియో ఫెలేట్టి-ఐవో ఉక్కిడో,అన్ని ఎడ్వర్డ్స్ –ది గ్రిమాల్డిస్ఆఫ్ మొనాకో ,లూయీ మాస్టర్స్ –ది బన్నీ అండ్ ది బిలియనీర్ వగైరా .
గ్రిమాల్డి రాజకుటుంబం శతాబ్దాలపాటు పాలించి కళలు ,వాటి సంబంధిత విషయాలను ప్రోత్సహించింది .’’ఇంటర్నేషనల్ కాంటే౦పరరి ఆర్ట్ ప్రైజ్ ‘’ఏర్పాటు చేసి నిపుణులకు ఇస్తోంది ,దేశం చిన్నదేకాని వీధులన్నీ దియేటర్ల ,మ్యూజియంలతో నిండి ఉంటాయి .మొనాకో ఫైన్ ఆర్ట్స్ ,మొనాకో మోడరన్ ఆర్ట్స్ లతో గాలరీలు నిండుగా ఉంటాయి
78-మా౦టెంగ్రో దేశ సాహిత్యం
మా౦టెంగ్రో దేశ౦ బాల్కన్ కంట్రీ.ఎగుడు దిగుడు పర్వత మయం .అడ్రియాటిక్ తీరంలో చిన్న బీచెస్ ఉంటాయి .రాజధాని –పొడిగోరికా .కరెన్సీ-యూరో .నేరాలుఎక్కువేకాని పటిష్టపోలీస్ భద్రతఉంది .కవి లార్డ్ బైరన్ దీన్ని ‘At the birth of the planet the most beautiful encounter between land and sea must have been on the Montenegrin అని వర్ణించాడు .గొప్ప టూరిస్ట్ స్పాట్ .ప్రజలు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతారు .క్రిస్టియానిటి మతస్తులు .జనాభా- 628,021 .జనాభాలో 20శాతం ముస్లిమ్స్ .,సేర్బులు అల్బెనియలు రోమాలు ఎక్కువగా ఉంటారు
మా౦టేగ్రోనియన్ సాహిత్యం అక్కడి విభిన్నభాషలలో ఉంటుంది .దేశభాష సౌత్ స్లావిక్ భాషాజన్యం .2006లో దేశం స్వాతంత్రం పొందాక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది .పావ్లె గోరోనోవికి రచయిత ఆ దేశానికి ఆపేరు రావటానికి కారణం దట్టమైన నల్లని అరణ్యాలు .దేశంలో సగం అడవులే .ప్రపంచంలో మొదటి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ యీ దేశంలోనే వచ్చింది .మా౦క్స్ దీన్ని నిర్వహించారు అని రాశాడు. ప్రకృతికవిగా గుర్తింపబడ్డాడు .వాట్ బుక్స్ స్మెల్ లైక్ లో తీవ్ర నాస్టాల్జియా ఉంటుంది .ఇతని మరో పుస్తకం –ఆర్నమెంట్స్ ఆఫ్ ది నైట్ -1997..మూడవది –బుక్ ఆఫ్ అపారిషన్స్- 2002.
టాంజా బాకిక్ –15వ ఏట మొదటి అయిదు భాగాల కవితా సంపుటి రాసి వెలువరించింది .కవిత్వంలో వైవిధ్యం ఉంటుంది .ఎన్నోపుస్తకాలకు ముందుమాటలు రాసింది. చాలావాటికి సంపాదకత్వం వహించింది .సైంటిఫిక్ పేపర్స్ రాసింది .మెటాఫిజికల్ ,రొమాంటిక్ కవుల సాహిత్యాన్ని అనువాదం చేసింది .ఆమె ఇమేజరీ మహా ఉన్నతం .ఆమె కవిత –సీడ్ అండ్ అదర్ పోయెమ్స్ -2012లో ‘A Black lace
On the white wall –
The ocean’s scent
The light is still
Falling on us,
Announcing,
The presence of the day’
కవిత హైలైట్ అంటారు .2008లో ఆమె రాసిన వ్యాసం –టు బి ఎ రైటర్ ఇన్ మంటే నెగ్రో’’లో ఆమెకూ ,జాతీయ సాహిత్యానికి ఉన్న అమూల్య బంధం తెలుస్తుంది .ఆమె ప్రతి రచన హృదయాన్ని తాకి ప్రభావితం చేస్తుంది .
ఒగ్నేజేన్ సాఫిక్ –పోడిగోర్సికాలో 1977లో పుట్టి ,ఫిలాసఫిలో గ్రాడ్యుయేట్ అయి ,2005లో మొదటి నవల ‘’హాన్సేన్స్ చిల్డ్ర న్ ‘’ తో ప్రసిద్ధుడయ్యాడు. ట్రాజిక్ ,సర్రియల్ రచనలేకాక షార్ట్ స్టోరీస్ తోనూ ప్రఖ్యాతుడయ్యాడు .రోమానియన్ ఓవిడ్ ఫెస్టివల్ ప్రైజ్ ,మేసాసేలిమోనిక్ ప్రైజ్ లు అందుకున్నాడు .మైక్రో బాక్టీరియం లేపేరే ను 1873లో వేరు చేశాక లెప్రసీ అదుపులోకి వచ్చింది .లేప్రసితోబాధపడే పిల్లల దయనీయ గాథలను తన కథలలో చిత్రించాడు .అతని ‘’ఆఫ్టర్మత్ ఆఫ్ దిక్లోత్స్ ఆఫ్ టెక్ష్ట్స్’’కత అప్పటికే చితికిపోయిన వివాహ బంధ ఆత్మహత్యలతో ఉన్న కుటుంబంలో పుట్టిన వాడి ది.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-20-ఉయ్యూరు
