ప్రపంచ దేశాలసారస్వతం
89-ఆర్మేనియాదేశ సాహిత్యం
ఆర్మేనియా దేశం ఆసియాలో ఆసియా –యూరప్ లను వేరు చేసే కాకస్ పర్వతాల సమీపం లో ఉన్నది .అతిప్రాచీన క్రిస్టియన్ నాగరకతకు నిలయం .గార్నిలోని గ్రీకో –రోమన్ దేవాలయం ,ఈ దేశ చర్చిహెడ్ క్వార్టర్ .4వ శతాబ్ది ఎచ్మియడిన్ కేధడ్రల్ ముఖ్య ఆకర్షణలు .రాజధాని –ఎరేవన్.జనాభా 30లక్షలు .కరెన్సీ –ఆర్మీనియన్ డ్రామ్.సేఫెస్ట్ కంట్రీ.ఆర్టిస్ట్ ,సింగర్స్ ,కంపోజర్స్ ,స్పోర్ట్స్ మెన్ లకు నిలయం .ప్రపంచ చెస్ చాంపియన్ -గారీ కాస్పరోవ్ ఇక్కడి వాడే .అధికారభాష ఆర్మీనియన్ .క్రిస్టియన్ మతస్తులు .50శాతం జనం పేదరికం లో ఉంటారు . ఆర్మేనియన్ సాహిత్యం 4వ శతాబ్దిలో పాగన్ సంప్రదాయాన్ని వదిలి క్రిస్టియానిటి కి వచ్చాక మేస్టాఫ్ ఆర్మేనియన్ ఆల్ఫబేట్ ఏర్పరచాక బైబిల్ రచనతో ప్రారంభమైంది .సెయింట్ గ్రెగరీ చరిత్ర పుస్తకం రాశాడు .కోర్యున్ ‘’హిస్టరీ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ సెయింట్ మిస్టోప్ రాశాడు .హీబ్రూ ,క్రిస్టియన్ సాహిత్యంతో అప్పుడు స్వర్ణయుగం ఏర్పడింది .చాలా సామ్రాజ్యాలు పాలించి అసలు భాషను ఎదగనివ్వలేదు .హోవాన్నెస్ టోమానియన్ 1902లో’’ది స్టోరి ఆఫ్ డేవిడ్ ‘’కావ్యం రాస్తే ఒక భాగమే లభ్యమైంది .ఫిలాసఫర్ గా పేరొందిన జాన్ ఒట్జే నేట్జి సినోడల్ డిస్కోర్స్ రాశాడు కాని అలభ్యం 16వ శాతాబ్ద౦ లోనూ విదేశీపాలనే .అట్టోమన్-సఫావిద్ సామ్రాజ్యాల మధ్యకాలం లో ఆర్మేనియా ‘’ట్రబడూర్’’సంప్రదాయం ఆచరించింది .దీనిప్రకారం గ్రామగ్రామాన ఆర్మేనియన్ సంస్కృతీ భాషా ప్రచారం పద్యాలు ,పాటలు ప్రజలకు వినిపించటం ద్వారా జరిగింది .సయత్ నోవా దీనికి ఆద్యుడు .19,20శతాబ్దాలలో సియమెంటో,అగాప్ ,గోస్తన్జరియన్ నిఘోల్ అఘాపెలిన్ లు ప్రసిద్ధులు .జట్రాక్ అంటే రివైవల్ కాలం లో ఆ దేశ సంస్కృతి విస్తృతంగా వికశించింది .ఆ దేశ జాతీయ ఉద్యమం ప్రారంభమైంది.
ఆధునిక ఆర్మేనియన్ సాహిత్యం లో కచటూరి ఆబో వియన్ సంప్రాదాయ కవిత్వం వదిలి ఆధునికకవిత్వం రాశాడు .అతని ‘’ఊన్డ్స్ ఆఫ్ ఆర్మేనియా ‘’లో ఆదేశం ఇతర దేశాల ఒత్తిడికి ఎలా నలిగిపోయిందో వివరించాడు .మైఖేల్ నేల్బాన్డియాస్ కవిత ‘’సాంగ్ ఆఫ్ ది ఇటాలియన్ గర్ల్ ‘’ఆ దేశ జాతీయ గీతం మెర్ హాయ్రేనిక్ రఫీ అనే రొమాంటిక్ కవి రాయటానికి ప్రేరణ అయింది .ఆ దేశ చారిత్రిక వైభవాన్ని అత్యంత విశిష్టంగా శ్లాఘించాడు .ఇతని నవల ‘’స్పార్క్స్ ‘’లో దేశవిముక్తికి ప్రజల పోరాటం కనిపిస్తుంది .అలాగే జేలడీన్ ,ఫూల్ నవలలో విదేశీపాలనలో ప్రజల అణచి వేత ఉంటుంది .1890తో రివైవల్ పీరియడ్ అయిపోయి ,దేశం కల్లోల స్థితులలో ఉన్నది .
తర్వాత రియలిజం వచ్చి ఓరిఎంట్ దినపత్రిక ఏర్పడింది .ఆర్పియర్ ఆర్పియరిన్ ,లెవాన్ పషాలినియాన్ ,కిజోర్జోహ్రాబ్ ,డిక్రాన్గామ్సరియన్ మొదలైనవారు ఆపత్రికద్వారా రచనలు అందించారు .ఈపత్రిక స్వాతంత్రానికి కూడా బాగా తోడ్పడింది .యదార్ధ జీవిత విషయాలను రాసే ఐడియాలజీ వచ్చి రాయటం ప్రారంభించారు .1960లియోనిడ్ బ్రెజ్నేవ్ నేతృత్వం లో యువరచయితలు వచ్చి 1920 ఆర్మేనియన్ హిస్టరీ ,జీనోసైడ్ లపై బహిరంగ చర్చలు జరిగాయి .పేరూర్ సేవక్ ,గేవోర్క్ ఎమిన్,సిల్వా కాప్తూలియన్,హావ్ హాన్నెస్షిరాజ్ లు కొత్త శకం సృష్టించారు .ఆధునికులతోపాటు అవ౦ట్ గార్డ్ కవులు రచయితలూ వచ్చారు .వీరిలో హెన్రిక్ ఇడోయన్ ,ఆర్టెం హరుత్యన్యన్ లు రైం,రిదంలేని సోషలిస్ట్ రియలిజం కాని కవిత్వం రాశారు .స్వతంత్రం వచ్చాక ఆర్మేన్ మేలికియన్ 2002లో మళ్ళీ వచ్చి అధికార అర్మేనియన్ భాషలో రచనలు చేశాడు .అతని ‘’జర్నీ టు వర్జిన్ లాండ్ ‘’అమెరికాలో 2010లో ముద్రించాడు .ఇందులో ఈదేశం ఎదుర్కొంటున్న మూల విషయాలు ,జెండర్ రిలేషన్స్ ,మతకేంద్రీకరణ ,రాజకీయ అవినీతి వంటివి నిర్మొహమాటంగా చర్చించాడు .
90-ఎమెన్ దేశ సాహిత్యం
ఎమెన్ దేశం ఆసియాలో అరేబియన్ పెనన్సులలో దక్షిణాగ్రాన ఉన్న రిపబ్లిక్ .యమన్ అనీ అంటారు .రెండవ పెద్ద ఆరబ్ సావరిన్ రిపబ్లిక్ .తీరభూమి 2000కిలోమీటర్లు పైగా ఉంటుంది.రాజధాని –సనా .జనాభా 3కోట్లు. ముస్లిం మతం. భాష అరబిక్ .2015అంతర్యుద్ధంలో 16వేలమంది చనిపోయి 13లక్షలమంది ఆకలితో అలమటించారు ప్రయాణం సేఫ్ కాదు .పుష్కలంగా ఆయిల్ నిల్వలున్నాయి .
యమన్ సాహిత్యం 1994లో దేశం ఐక్యం అయ్యాక ప్రారంభమైంది .నియంతృత్వ పాలన ,విపక్షాల చీలికలు ,సరైన ఎన్నిక విధానాలు లేకపోవటం ,ఆటవిక సమూహాల బెదరింపులు ఆదేశ అస్తవ్యస్తతకు కారణమై సాహిత్యం పై దృష్టి కలగలేదు .
యమన్ సాహిత్య చరిత్రలో ఆరుగురు రచయితలూ భాగస్వాములయ్యారు .’’దిపొలిటికల్ క్రైసిస్ అండ్ ఎమేన్స్ లిటరరీ రిసర్జెన్స్ ‘’పుస్తకం ఆ దేశ సాహిత్యాన్ని కొంతవరకు తెలియ జేస్తుంది ఇందులోని విషయాలు తెలుసుకొందాం .2014లో 20నవలలు యమన్ రచయితలు రాశారు .ఆక్రితం ఏడాది 8 వచ్చాయి .ఆ దేశ ప్రజలు తమ దేశం ,అక్కడి సమస్యలు పై రచనలు కోరుతున్నారు .కథా సాహిత్యమూ రావాలని కోరారు .కొన్ని రచనలు నవలలు యుద్దాలగురించి కొన్ని అక్కడి గతవైభవ కాస్మాపాలిటన్ జీవితం గురించి ఉన్నాయి.కొందరు రచయితలు సమాజ సంబంధాలు ,ఆడవారి అనాసక్తత పై రాశారు ఇవన్నీ రివల్యూషన్ అనే ప్రిజం నుంచి చూసి రాసినవే .కొందరు రాజకీయ ఆర్ధిక అస్థిరత పై దృష్టి పెట్టి రాశారు .రాయాలి అనేతపన ఇంకా ఎక్కువగా రావాలని అందరి అభిప్రాయం .ఇన్ని అనర్ధాలు జరిగినా సాహిత్య క్షేత్రానికి 2014గొప్ప ఆశాకిరణంగా భాసించింది .కొద్దిగా ఆధునికత తొంగి చూసింది .అనువాదాలపై దృష్టి పడలేదు .అయినా కొందరు రచయితలకు ప్రాంతీయ ,అంతర్జాతీయ గుర్తింపు లభించింది .
మొత్తం మీద 60మందిదాకా యమన్ రచయితలున్నారు .జయీద్ ముట్టి నవలా రచయిత.ది స్కార్పియన్ నవల ,దిబ్రిడ్జ్ –కథా సంపుటి తెచ్చాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20-ఉయ్యూరు
