ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి
శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా అర్హుడు .కవిగారి కవితా సంస్థానం లో విందు వసిస్టమహర్షి విశ్వామిత్ర పరివారానికీ ,,భరద్వాజ మహర్షి ససైన్యంగా వచ్చిన భరతుడు ఆతర్వాత వానర రాక్షసుల అశేష జనాలతో వచ్చిన శ్రీరామాదులకు ఇచ్చిన విందు లాగా ఉండేది .కవిగారుమాత్రం పడకకుర్చీలో మందహాసంతో మహావేగంగా కవితాగానం చేసేవారు .అయినా ఎవరికి తగ్గ గౌరవ మర్యాదలు జరిగి పోయేవి .ప్రతినెలా ఒకటవ తేదీ ఒక మహా కవికి ఒక మహా పండితునికి అక్కడ మహా సత్కారం .ఏ రాజాస్థానం లోనూ జరగనంత వైభవంగా జరిపించేవాడు వేదా౦త కవి .దైన్యం నైరాశ్యం లేని రాజకవిత ఆయనది ‘’ అన్నారు సరస్వతీ కంఠా భరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ .’’పట్టాభి గారి వలన ఈ కవి కావ్యభావాలు విన్న నెహ్రు పండితుడు ‘’ఆంద్ర బెర్నార్డ్ షా ‘’బిరుదు అందించాడు .కవితా రాజ్య పట్టాభి షిక్తుడు వేదా౦తకవి .’’అనికీర్తించారు ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య .’’మహతీ నాదా౦చిత వాణి,ఆంధ్రనాటక కావ్య ప్రాదుర్భూతి నిదాన విభాదీపిత మతి ‘’అన్నారు తెనుగు లెంక శ్రీ తుమ్మల .’’జగజ్జననీ వరప్రసాద కవితా ప్రపంచ సామ్రాట్ ‘’అని మెచ్చారు కిరణ్ కవులు .’’దారాళ వాగ్గు౦ఫి తారమ్య రచనా ,ప్రవచనాతిచాతుర్య పాటవుడు ‘’అన్నారు రాళ్ళభండిసుబ్బయ్య .ఇంతమంది చేత కీర్తింపబడిన వేదాంత కవి గారికి విజయవాడలో గజారోహణ ,సువర్ణాభి షేకం జరిగితే కవిమాత్రం ‘’చదివిన వాడ గాను ,మిము సన్నుతి జేసిన వాడనుగాను ,సంపదలు గడించినట్టి ధనవంతుడను గాను –సమస్త విశ్వముల్ బ్రతికెడి తల్లి చల్వ తమపై వెద జల్లెడివాడ నేను ‘’అని అత్య౦త వినయంగా చెప్పుకొన్నారు .తన గురువు తిరుపతి కవి గురించి గర్వంగా ‘’తిరుపతి వేంకటేశ్వరుడు –పరపతి గల గురు దేవుడు –ధరలో అతనికన్న మొనగాడూ –తరువాత ధాత వ్రాతకు లేడూ’’.’’అతడు వడ్డికాసులవాడూ –ప్రతిభ కేడు కొండలవాడూ ‘’అని చెప్పుకొన్నాడు జగజ్జనని ,ఆంద్ర బెర్నార్డ్ షా ,మహాకవి ,మహావక్త ,మనోహర్ ,వేదా౦త కవి . అన్నారు రాయప్రోలు .
అనిమెచ్చారు శ్రీమతి కాంచనపల్లి కనకాంబ
అంటూ కీర్తించారు జాషువా .
అంటారు శ్రీ మందరపు సత్యాచార్య కవి .
వేదా౦త కవికి ఘన సన్మానం విజయవాడ రామనగర్ ఈశ్వర మహల్ లో 26-10-1955 విజయ దశమి పండుగనాడు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది .సభాధ్యక్షత వహించాల్సినరెవిన్యు మంత్రి శ్రీ కల్లూరి చంద్ర మౌళి అని వార్యకారణాల వల్ల రాలేకపోతే ,జాతీయనాయకులు,శాసన సభ్యులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరావు పంతులుగారు అధ్యక్షత వహించారు .శ్రీ నార్లబదులు తెనాలి పురపాలక సంఘా ధ్యక్షులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి సభా ప్రారంభం చేయగా ,జనాబ్ షేక్ చిన పీర్ సాహెబ్ ,షేక్ ఆదం సాహెబ్ గార్లు మంగళవాద్యం వాయించగా వేద శీర్వచనం జరిగింది .ఆంద్ర భోజ ,శాసన సభ సభ్యులు శ్రీ సి హెచ్ వి మూర్తి రాజు ,అధ్యక్ష ,ప్రారంభకుల ప్రసంగాల తర్వాత శ్రీ వేదాంత కవికి ఆహ్వాన సంఘం స్వాగతం పలికి 16నవరసులతో కనకాభి షేకం చేసి ,వెయ్యిన్నూట పదహార్లు నగదుకానుక అందించి , ‘’వేదా౦త కవి కాంతులు ‘’ప్రత్యేక సంచిక ఆవిష్కరింఛి ఈ విలువైన గ్రంథం ,పట్టు పీతాంబరాలు ,చందన తా౦బూలాదులు బహూకరించి పుష్పమాలా౦ కృతులను చేసి ఘన సన్మానం చేశారు .
సాహిత్యాచార్య శ్రీ జమ్మలమడక మాధవరాయ శర్మ ,కవిసామ్రాట్ శ్రీ వేదాంతం లక్ష్మీ కా౦త కవి ,సరస్వతీ కంఠాభరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ ,ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య ,మాట్లాడారు .కవిగారి ‘’తెలుగు తల్లి ‘’నాటకం అంకితం పొందిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ,కవి గారు ప్రసంగించారు .పెద్దలు పంపిన అభిమాన ఆశీర్వచనాలు ,అభినందనలు శ్రీ శ్రీ రాయని రాములు చదువగా ,శ్రీ బిఏ రాజు మనోహర శైలిలో తాము రాసిన పద్యాలు ‘’మనోహరాలు ‘’గానం చేసి కరతాళధ్వనులు అందుకొన్నారు .
మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రా బిస్మిల్లాఖాన్ జనాబ్ షేక్ ఆదం సాహెబ్ గారి నాదస్వర వాద్యం బాండు మేళం తో ,పౌరుల ఆన౦దాతి రేక పుష్ప వృష్టితో గజారోహణ మహోత్సవం శ్రీ వేదా౦త కవి గారికి జగన్మోహనంగా పురవీధుల గుండా జరిగింది .
మరునాడు సభకు సహకారమంత్రి శ్రీడి సంజీవయ్య రాలేకపోగా ,ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి అధ్యక్షతన, మహాదాత శ్రీ చుండూరి వెంకట రెడ్డి సభా ప్రారంభోపన్యాసాలు చేశారు .తరువాత అభినవ తిక్కన శ్రీ తుమ్మల ,శ్రీ వేదుల ,నవయుగ కవి చక్రవర్తి శ్రీ జాషువా ,కుమారుడు శ్రీ వలరాజు ప్రసంగించారు అందరికి శాలువాలతో సత్కారం చేశారు ‘.
జీవిత విశేషాలు
వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి “వేదాంతకవి”గా ప్రసిద్ధుడు. ఈయన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యుడు. తండ్రి శంభుశాస్త్రి, అన్న లక్ష్మీకాంతం జాతీయోద్యమాలలో పాల్గొని ఉద్యమగీతాలను గొంతెత్తి పాడేవారు[1]. వారి ప్రభావంతో ఈయన దేశసేవ, కవిత్వసేవ విడదీయలేని అనుబంధంగా ఏర్పరచుకుని కవితావేశానికి గురిఅయ్యారు . భార్య పార్వతీ దేవి .1928-1931ల మధ్య వివిధ జైళ్ళలో శిక్ష అనుభవించిన దేశభక్తుడు . 1928లో జైలుకు వెళ్లినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్యతో కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఆ శిక్షాకాలంలో పోలీసుల లాఠీదెబ్బలవల్ల కుడిచేతి ఉంగరం వేలు విరిగింది. తలకు బలమైన దెబ్బలు తగలడం వల్ల ఎడమకన్నుకు అంధత్వం ఏర్పడింది. కవిగారి రచనలు శాంతి సంగ్రామం, స్వతంత్ర గర్జన, జమీన్ రైతు, రాజకోట ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధానికి గురి అయ్యాయి. రాజకోట నాటకాన్ని పేరుమార్చి కాంగ్రెస్ భారతం పేరుతో ముద్రింప బడినాయి .
రచనలు –
1. ఆకలిమంట (నాటకం)
2. తెనుఁగుతల్లి (నాటకం)
3. ఛలో హైదరాబాద్ (నాటకం)
4. విశ్వస్వరాజ్యం (నాటకం)
5. జమీన్ రైతు (నాటకం)
6. పంజాదెబ్బ
7. కవితా సంస్థానము (విమర్శ)
8. కష్టకాలం (నాటకం)
9. గడుగ్గాయి
10. కెరటాలు
11. దండయాత్ర
12. భగవన్మతభాష్యం
13. వీర భారతము
14. మహారథి కర్ణ (నాటకం)
15. కల్పతరువు
16. పట్టాభిషేకం
17. బ్రిటీష్ గయోపాఖ్యానం (నాటకం)
18. రాజకోట (నాటకం)
19. శాంతి సంగ్రామము
20. స్వతంత్ర గర్జన
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు
—