అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

శంకర స్తోత్రాలు

శంకర స్తోత్ర గ్రంథాలలో చాలాభాగం సగుణ బ్రహ్మో పాసన ఉండటంవలన కొందరు ఆయన రాయలేదంటారు .కానీ శంకరులు సూత్ర భాష్య రచనలలో అనేక  సందర్భాలలో ఈశ్వరానుగ్రహ ప్రసక్తి ఉన్నది అనీ, అది లేనిదే అపరోక్షానుభూతి దుర్లభమనీ  చెప్పారు .స్తోత్రాలలో కొన్ని కొన్ని కవితా ధోరణిలో, ఛందస్సు ప్రధానంగా ,చిత్ర ఛందస్సులలోను ,అలంకారికంగా కూడా ఉన్నాయి కనుక అవి శంకరులు రాయలేదనే వాదం ఉంది .శాక్త తంత్ర భావాలను ప్రతిపాదించి వర్ణించే ,సౌందర్య లహరి ,ప్రపంచ సార లలో శృంగారం కూడా ఉండటం తో ఆయన రాయలేదన్నారు .’’though there is a tradition that Shiva was the family deity of Sankara ,it is also held he was by birth a Shakta ‘’శంకరుని కులదైవం శివుడనే వాడుక లోకం లో ఉందికనుక ఆయన జన్మతః శాక్తేయుడు ,’’అనే అభిప్రాయం ఉందని రాధాకృష్ణ పండితుడు భావించాడు .వాటిలోని తాంత్రిక భావం అద్వైత వేదాంతం లో ఉత్కృష్ట అనుభూతికి సహకారంగా ఉంది అన్నారు సూర్య నారాయణ శాస్త్రి .తాను స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో శంకరులు శ్రీ చక్ర ప్రతిష్ట కూడా చేశారు కనుక దేవీ పూజకు ప్రాదాన్యమూ కల్పించారు .అలాగే మధుర కంచి జంబుకేశ్వరం ,కాశ్మీర్ మొదలైన చోట్ల దేవీ మూర్తుల్ని ఉపాసించి ,ఆ మూర్తుల అనుగ్రహం సాధించారు .కనుక శంకరులు శాక్తేయ సూత్రాలు రాయలేదనటం అసంబద్ధం అన్నారు శ్రీ అనుభవాన౦దులు .అతిగా శృంగారం ఉన్నవి ఆయన రాయలేదనవచ్చు .బెల్వాల్కర్ శంకరులు రాయని 214 ఉంటాయన్నాడు .

  శంకర కృతాలుగా408స్తోత్ర రచనలలో 8భాష్యాలు 8ప్రకరణాలు ,8స్తోత్రాలు శంకరులే రాశారని ,మిగిలిన 384 లపై సందేహం ఉందన్నాడు బెల్వాల్కర్ .ఈ నిర్ణయం అంగీకార యోగ్య౦ కాదనీ ,పూర్తి ఆధారాలు లభించినప్పుడే అవి శంకర రచనలు కావు అని చెప్పాలనీ శ్రీ అనుభవానంద స్వామి ఉవాచ .

   సన్యాస ప్రాశస్త్యం

‘’Frend  that  is false  -which clings to love for selfish sweets of love –But ,,who love these more than the joys of mine –Yea, more than joys of theirs depart to save –Them and all flesh ,if utmost love avail ‘’స్వార్ధ ప్రేమ మాధుర్యం కోసం ప్రేమానుబంధంగా ఉండే ప్రేమ తత్త్వం వాస్తవం కాదు .కానీ నేను ,నా సుఖం కంటే వాటిని ప్రేమించి ,వారి సుఖాలకోసం వారిపై ప్రేమ చూపి౦చె ప్రేమ ప్రయోజనకరం అయితే ,వారినీ సర్వ ప్రాణికోటినీ రక్షించటానికి అన్నీ వదిలి వెళ్ళటం సర్వోత్క్రుష్ట త్యాగం ‘’అన్నారు స్వామి రామ తీర్ధ తమ ‘’లైట్ ఆఫ్ ఏసియా .ఇలాంటి త్యాగమే చేశాడు భగవాన్ గౌతమ బుద్ధుడు .సంసారం లో ఉన్నవారంతా తరించాలి ,సర్వ ప్రాణులు ఆనంద సుఖాలు పొందాలి .ప్రపంచమంతా సమ్యక్ జ్ఞానం పొందాలి ‘’అన్నది భారతీయ ఆర్ష సంస్కృతి .బృహదారణ్యకం లో బ్రహ్మవేత్తలు ఈషణ త్రయాన్ని త్యజించి ,సన్యాసం స్వీకరిస్తారు అని చెప్పబడింది .సన్యాసానికి ఇదే పరమోత్కృష్ట ఆదర్శం .’’The renunciation is only a process of growth preparing for the birth of a fuller life ‘’సమగ్ర జీవిత ఆవరణానికి సంసిద్ధం చెందించే పరిణామ క్రమమే సన్యాసం అని స్వామి రామతీర్ధ వాక్యం .మహాభారతం లో కూడా ‘’త్యేజేదేకం కులస్యార్దే ,గ్రామస్యార్దేకులం త్యజేత్ –గ్రామం జానపదస్యార్ధే,ఆత్మార్ధం పృధివీ త్యజేత్’’అంటే కులం కోసం స్వార్దాన్నీ ,గ్రామం కోసం కులాన్నీ ,దేశం కోసం గ్రామాన్నీ ,ఆత్మానుభూతి కోసం ప్రపంచాన్ని త్యజించాలి భారతం పేర్కొన్నది .’’కొద్దిగా నైనా త్యాగ లక్షణం ఉంటేకానీ ,సమగ్ర ఉన్నత ఉత్తమ సంస్కృతిఏర్పడదు .త్యాగమంటే నిస్వార్ధం .తనలో ఉన్న హేయ గుణాన్నినిరోధించి ,ఉన్నతస్థాయికి తన స్వభావాన్ని అభి వృద్ధి చేసుకోవటమే సన్యాసం అన్నారు అరవింద యోగి .కనుక ప్రపంచం లో త్యాగం లేని ఘట్టం ,ప్రదేశం లేదు .త్యాగం సర్వశ్రేష్ఠ ఆదర్శం .తలిదంద్రులిచ్చిన జన్మను సార్ధకం చేసుకొని నాలుగు ఆశ్రమాలలో హాయిగా జీవించి ,చివరికి సన్యాసం తీసుకోవాలని శాస్త్రాలన్నీ ఘోషించాయి.సన్యాసం ఆత్మోద్ధరణకు ,ఆత్మాదర్శానికి ,పవిత్రతకు దేశైక క్షేమానికి ఉద్దేశింపబడింది .’’సన్యాసం అనవసరం అనే వారికి మానవ ఉన్నత గమ్యం తెలియదు ‘’అన్నాడు రాధాకృష్ణ న్.’’ఉత్కృష్ట సన్యాస విధానం ఒక్క భారత దేశం లోనే పుట్టి వికసించి ఫలవంతమైంది ‘’అని వేదాంతం లోతులు తరచిన ప్రొఫెసర్ జి.ఎస్. ఘుర్యే    తన ‘’ఇండియన్ సాధూస్ ‘’లో రాశాడు .Asceticism  and monastic organization ,are two unique contributions which Indian civilization has made to the common stock of culture ‘’సన్యాసం ,సంప్రదాయం సామాన్య సంస్కృతికి భారతీయ విజ్ఞానం అందించిన అపూర్వ ప్రధానాలు ‘’అన్నాడు ప్రొఫెసర్ ఘుర్యే .’’అందుకే  నిస్సందేహంగా ‘’The mother of asceticism ‘’భారతి సన్యాసానికి తల్లి ‘’అనీ అన్నాడాయన ..ఈ సంగీత అమృత ధారను అతి పిన్నవయసులోనే స్వీకరించి రామకృష్ణ పరమహంస శిష్యుడై ,వేదాంత సింహమై ,ప్రపంచ పర్యటన చేసి ,అసంఖ్యాక ముముక్షలోకానికి తరుణోపాయాన్ని ప్రసాదించారు వివేకానంద స్వామి అన్నారు శ్రీ అనుభవానందులు .’’కంఠం ఎత్తి పాడు యతివరా –దీరా ఓం తత్సత్ అంటూ –అతిదూరం లో విషయ వాసనలకు అందని చోట ఈ గీతం పుట్టింది –కామ ధన కీర్తి కాంక్షలకు కలత పడని,శాంతిమయ కంరారణ్యం లో ఉద్భవించింది ఈ గీతం –చారుతర సచ్చిదానంద పూరం లో కంఠం విస్పష్టంగా ఎలుగెత్తి పాడు –యతివరా,దీరా ఓం సత్సత్ అంటూ ‘’అని రాసి గానం చేశాడు కానందుడైన వివేకానందుడు  .

  ఆధారం – శ్రీ అనుభవానంద స్వామి రచించిన –‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

   రేపు 26-5-21-బుధవారం వైశాఖ పౌర్ణమి -శ్రీ బుద్ధ జయంతి ,శ్రీ అన్నమాచార్య  జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-21-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.