మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328
328-కర్తవ్యమ్ సినీ నిర్మాత –ఎ.ఎం.రత్నం
ఏ.ఎం.రత్నం (ఆంగ్లం: A. M. Rathnam) దక్షిణ భారతదేశానికి చెందిన సినీనిర్మాత. ఇతడు మొదట సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి తరువాత నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇతను శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇతని మొదటి సినిమా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇతని కుమారులు జ్యోతి కృష్ణ, రవికృష్ణలు కూడా సినీరంగంలోనే ఉన్నారు.
తెలుగు సినిమాలు
• ధర్మ యుద్ధం (1989)
• కర్తవ్యం (1990)
• పెద్దరికం (1992) – దర్శకత్వం
• సంకల్పం (1995) – దర్శకత్వం
• భారతీయుడు (1996)
• ఒకే ఒక్కడు (1999)
• ప్రేమికులరోజు (1999)
• స్నేహం కోసం (1999)
• ఖుషి (2001)
• నాగ (2003)
• 7G బృందావన్ కాలనీ (2004)
• బంగారం (2006)
• నీ మనసు నాకు తెలుసు
329–శ్రీరంజని కుమారుడు స్క్రీన్ ప్లే రచయితా సహాయ దర్శకుడు ,,ప్రమీలార్జు నీయం దర్శకుడు –ఎం.మల్లికార్జున రావు
ఎం.మల్లికార్జునరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖనటి శ్రీరంజని (సీనియర్) కుమారుడు.29-
జీవిత విశేషాలు
ఎం.మల్లికార్జునరావు 1923లో గుంటూరు జిల్లా, మురికిపూడి గ్రామంలో శ్రీరంజని, కె.నాగమణి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను నరసారావుపేటలో ఉన్నత విద్యను గుంటూరులో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేశాడు. ఇతడు గుంటూరు హిందూ కాలేజీలో చదివినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఇతని సహాధ్యాయి. అదే సమయంలో ఎ.సి.కాలేజీలో నందమూరి తారకరామారావు, కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్‌.శర్మ మొదలైన వారు చదివేవారు. ప్రతి యేటా జరిగే అంతర్ కళాశాల నాటకపోటీలలో ఈ యువకళాకారులు అందరూ కలిసి నాటకాలు వేసేవారు. “నాయకురాలు” నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు పాత్ర ధరించగా, ఇతడు బాలచంద్రుని వేషం వేశాడు. ఈ నాటకాన్ని మాధవపెద్ది గోఖలే దర్శకత్వం వహించాడు. ఇంకా ఇతడు విద్యార్థి దశలోనే వసంతసేన, పిచ్చిరాజు, విప్లవం వంటి నాటకాలలో అనేక పాత్రలను ధరించాడు. హిస్ట్రానిక్స్ సొసైటీ సెక్రెటరీగా అనేక సేవలను అందజేశాడు[1].
సినీరంగ ప్రస్థానం
తన తల్లి శ్రీరంజని (సీనియర్) ను సినిమా రంగానికి పరిచయం చేసిన పి.పుల్లయ్యనే ఇతడిని గొల్లభామ సినిమాలో కథానాయకి కొడుకు పాత్రలో నటుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. కె.వి.రెడ్డి ఇతడిని నాగిరెడ్డి, చక్రపాణిలకు పరిచయం చేయడంతో విజయా సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా తీసుకోబడ్డాడు. పెళ్ళిచేసిచూడు సినిమాలో ఎల్.వి.ప్రసాద్ క్రింద సహాయదర్శకునిగా ఇతనికి తొలి అవకాశం వచ్చింది. తరువాత ఆ సంస్థలో చంద్రహారం సినిమా వరకూ అన్ని చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలాగే అమరసందేశం సినిమాలో ఆదుర్తి సుబ్బారావు వద్ద, పెంకి పెళ్ళాం సినిమాలో కమలాకర కామేశ్వరరావు వద్ద, సతీ అనసూయ చిత్రంలో కడారు నాగభూషణం వద్ద, రక్త సంబంధం సినిమాలో వి.మధుసూధనరావు వద్ద పనిచేశాడు. చిత్రపరిశ్రమలోని అన్ని శాఖలలోను పనిచేసి మెలకువలను తెలుసుకున్నాడు. తన తల్లి పేరుమీద స్థాపించిన ఎస్.ఆర్.మూవీస్ పతాకం మీద నిర్మించిన ప్రమీలార్జునీయం సినిమా ద్వారా ఇతడు దర్శకునిగా పరిచయమయ్యాడు.
చిత్రాల జాబితా
• దర్శకుడిగా:
1. తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987)
2. రగిలే హృదయాలు (1980)
3. దొంగల దోపిడీ (1978)
4. మనుషులు చేసిన దొంగలు (1977)
5. బంధంగల్ బంధంగల్ (1976) (మలయాళం)
6. రక్త సంబంధాలు (1975)
7. పట్టాభిషేకం (1974)
8. కండవరుండో (1972) (మలయాళం)
9. కోడలు పిల్ల (1972)
10. బందిపోటు భీమన్న (1969)
11. చెల్లెలి కోసం (1968)
12. గూఢచారి 116 (1967)
13. అందరికి మొనగాడు (1971)
14. ముహూర్త బలం (1969)
15. ప్రమీలార్జునీయం (1965)
• నిర్మాతగా:
1. సితార (1980)
• రచయితగా:
1. చెల్లెలి కోసం (రచయిత)
2. ప్రమీలార్జునీయం (స్క్రీన్ ప్లే)
330-పార్లమెంట్ మెంబర్ ,నటుడు ,గీతాంజలి కరణం మల్లేశ్వరి సినీ నిర్మాత-ఎం.వి వి సత్యనారాయణ
ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సినీ నిర్మాత.[2] అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుండి ఎంపీగా గెలిచాడు.[3][4
జననం, విద్యాభాస్యం
సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో 1966 జూన్ 25న రఘునాయకులు ముళ్ళపూడి, పర్వతా యర్ధనమ్మ దంపతులకు జన్మించాడు. అతను ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. 1997లో ఎంవీవీ బిల్డర్స్ సంస్థను స్థాపించాడు. అతను విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించాడు.[5][6]
సినీ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై తెలుగు, కన్నడలో పలు సినిమాలను నిర్మించాడు. [7]
నిర్మించిన సినిమాలు
1. గీతాంజలి (2014) [8]
2. అభినేత్రి (2015)
3. శంకరాభరణం (2015)
4. లక్కున్నోడు (2017)
5. నీవెవరో (2018)
6. కవచ (కన్నడ – 2019)
7. కరణం మల్లేశ్వరి బయోపిక్ (2021)
నటుడిగా
1. శంకరాభరణం (2015)
2. లక్కున్నోడు (2017)
రాజకీయ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విశాఖ లోక్‌సభ కో ఆర్డినేటర్‌గా నియమితుడయ్యాడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.భరత్ పై 4414 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[9] అతనిని 2019 సెప్టెంబరు 15న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించాడు.[10]
సశేషం
దీపావళి శుభ కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.