ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1

మదన్ గోపాల్ రాసిన పుస్తకానికి శ్రీమతి ఎ.లక్ష్మీ రమణ చేసిన  అనువాదమే  ‘’ భారతే౦దు హరిశ్చంద్ర  ‘’.దీన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .

19వ శతాబ్ది మేధావి భారతే౦దు హరిశ్చంద్ర  .బహుముఖ ప్రజ్ఞాశాలి ,సంఘ సంస్కర్త .ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,తిరువనంతపురం యువరాజు కేరళ వర్మ ,కేశవ చంద్ర సేన్ ,మధుసూదన దత్ ఆయన సమకాలికులు .బెంగాల్లో వచ్చిన మార్పుల్ని హిందీలో ప్రవేశపెట్టాడు .ఆధునిక హిందీభాషకు నాంది పలికి ,వివిధ శాఖలకు అండగా నిలిఛి ‘’ఆధునిక హిందీ భాషా పితామహుడు ‘’అయ్యాడు  . .హిందీ పత్రికారంగం లో అగ్రస్థానం సాధించాడు .వివిధ ఛందస్సులలో 3వేల భక్తీ గీతాలు రాశాడు .ఖడీ బోలీ మాండలీకాన్ని ప్రచారంలోకి తెచ్చాడు భారత దేశ భాషలలో ఎంతో కృషి చేసిన విదేశీ రచయిత జార్జి గ్రీసన్  ‘’ఈ నాటి భారత దేశ కవులలో సుప్రసిద్ధుడు ,దేశ భాషా వ్యాప్తి చేసినవారూ మాన వేందు కంటే ఎవరూ లేరు ‘’అన్నాడు .ముప్ఫైనాలుగు  ఏళ్లకే 175రచనలు చేశాడు అని ఎఫ్. ఇ.పాయ్ అన్నాడు .

  వారణాసి లో వ్యాపార కుటుంబం లో జన్మించిన హరిశ్చంద్ర ముత్తాత వ్యాపారం లో మీర్జాఫర్ చేత మోసగ౦ప బడ్డాడు.దాన్ని తట్టుకోలేక దిగులుతో చనిపోయాడు .ఆయనకొడుకు సేత్  ఫతే చ౦ద్ సోదరుదడితోకలిసి వారణాసి వచ్చి వ్యాపారంలో బాగా సంపాదించి కాశీ రాజుకే పెట్టుబడులు పెట్టగల సమర్ధుడయ్యాడు .ఈయన మనవడు గోపాల్ చంద్ర వ్యాపారంలో దిట్ట .వ్యాపారంతోపాటు కవిత్వంలోనూ పట్టుసాధించి ‘’గిరిధరదాస్ ‘’కలం పేరుతొ  నలభై రచనలు చేశాడు .వైష్ణవ సంప్రదాయం వీరిది.బ్రిటిష్ వారు నిర్వహించే పుష్ప ప్రదర్శనలో ఎప్పుడూ మొదటి బహుమతి పొందేవాడు .గానం, సంగీతం అంటే మహా పిచ్చి .ప్రతి ఏడాదీ కాశీలో జరిగే బుడవా మంగళ –నౌకామహోత్సవం లో ఇతని కుటుంబ పాత్ర గొప్పగా ఉండేది .కాశీ రాజుకూడా పాల్గొనేవాడు .ఈ తెప్ప తిరునాళ్ళలో ఈ కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఉండేది .కళాకారులకు రచయితలకు గోపాల చంద్ర అండగా ఉండేవాడు .ఎప్పుడూ ఎవరినోఒకర్నిపిల్చిఆతిధ్యమిచ్చేవాడు బసంతు ఉత్సవానికి పిల్చేవారు వచ్చేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించేవారు .రంగురంగుల వసంతం చల్లుకొనేవారు .హోలీ అంటే కిర్రెక్కించే వారు .

  గోపాల్ చంద్ర గిరిధర్ దాస్ పెద్దకుమారుడే మన  హరిశ్చంద్ర 1950లో జన్మించగా తమ్ముడు గోకుల్ చంద్ర 15నెలల తర్వాత పుట్టాడు .హరిశ్చంద్ర సాహిత్య వృత్తికీ  గోకుల్ వ్యాపార వృత్తికీ అంకితమయ్యారు .రాజారామ మోహన్ రాయ్ బ్రహ్మ సమాజోద్యమం తో ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాలం అది .1848లో లార్డ్ డల్హౌసీ రాకతో ఒక శకం ముగిసింది .ఈస్ట్ ఇండియాకంపెనీ పంజాబ్ నుకూడాస్వాధీనం చీసుకొని ఆక్రమణలో అగ్రస్థానం పొందింది .కలకత్తానుంచి ఆగ్రాకు వైర్లెస్ వచ్చింది .కలకత్తా నుంచి ఢిల్లీ కి రైల్ మార్గమేర్పడింది  .నదులపై ఓడలు నడిచాయి. బాంబే మద్రాస్ కలకత్తాలలోయూని వర్సిటీలు ఏర్పడ్డాయి .హిందూ విధవా వివాహ చట్టం అమలైంది .పాశ్చాత్య పద్ధతుల ప్రభావం నెమ్మది నెమ్మదిగా పడుతోంది .

 పాశ్చాత్య నాగరకత వైపు గోపాల్ చంద్ర  కూడా ఆకర్షితుడయ్యాడు .తనతండ్రి ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా,అభ్యుదయభావాలు పొందాడని మతాచారం ఉన్నా ఆధునికతవైపు మొగ్గు చూపాడని ,ధాంప్సన్ గవర్నర్ గా  ఉన్నప్పుడు కాశీలో పెట్టిన బాలికా పాఠశాలలో తన సోదరిని చేర్చాడని ,ఆకాలం లో అది గొప్ప సాహస చర్య అనీ ,తమందరికి ఇంగ్లీష్ నేర్పించాడని చెప్పాడు .

 1857లో బ్రిటిష్ వారు ఎంతోఆపదలో ఉంటె ,వారిఅమూల్య వస్తువుల్ని గోపాల్ చంద్ర ఇంట్లో భద్రపరచారు .వీరికుటు౦బీకులకు బ్రిటిష్ వారు 48తుపాకీలు పిస్టల్స్ ఇచ్చారు .వీటితో బ్రిటిష్ వారికి రక్షణ కల్పించారు .ప్రథమ స్వాతంత్ర్య సమరానికి ఏడేళ్ళు ము౦దేపుట్టిన హరిశ్చంద్ర బాల్యంలో మహాతెలివి తేటలతో చిలిపితనం తో అందర్నీ ఆకర్షించేవాడు .చీకటిలో మెరిసే భాస్వరం తో గోడలపై బొమ్మలేసి రాత్రిళ్ళు తోటి వారిని భయపెట్టేవాడు .ఉర్దూ పార్శీ ఇంగ్లీష్  నేర్పే బడిలోనే చేరిచదివాడు .అతని జ్ఞాపక శక్తి అమోఘం .తండ్రి సాహితీ వాసనయీయనకూ అబ్బి  ఆనాటి  బ్రిజ్ భాషలో పద్యాలు రాయటం అందులోని కవిత్వాన్ని వివరించటం చేసేవాడు .పద్యాల్లో నవరసాలు ఒలకబోసి పండితులను మెప్పించేవాడు .భార్య చనిపోతే తండ్రి ద్వితీయం చేసుకొన్నాడు .ఇద్దరుకొడుకులకు ఉపనయనాలు చేశాడు .27ఏళ్ళు మాత్రమె ఉన్న గోపాల్ చంద్ర భ౦గ్ పానానికి బానిసయై మితిమీరి, వడుగు జరుగుండగానే అకస్మాత్తుగా చనిపోయాడు .దర్జాగా కుర్చీలో కూచున్నతండ్రికి ఏ అనారోగ్యలక్షణాలు కనపడలేదని అయితేహఠాత్తుగా ‘’శీతలాని బాగ్ మోడ్ దీహై –అచ్చా అబ్ లేజావ్ ‘’అంటూ చనిపోయాడని హరిశ్చంద్ర చెప్పాడు .

  తండ్రి చనిపోయేనాటికి కొడుకులు చాలా చిన్నవాళ్ళే .సవతి తల్లీ చిన్నదే .ఇంటి పెత్తనం ఒక బంధువు చేతిలో పడింది .క్వీన్స్ కాలేజీలోచదువుతున్న హరి స్థిమితం లేకుండా ,క్రమశిక్షణ లేకుండా ఉండేవాడు .తండ్రి మరణం తో బంధనాలు తెగాయనుకొన్నాడు .డబ్బు దుబారా చేసేవాడు. అందుకని ఇంట్లో అందరికీ దూరమయ్యాడు .సవతితల్లి పిసినిగొట్టుగా ఉండేది .నౌకామహోత్సవాలకు కూడా డబ్బు ఇచ్చేదికాదు .అప్పులే శరణ్యం అయ్యాయి  హరిశ్చంద్రకు .గోరంత అప్పు కొండ౦తై భారమైంది .దిగాలుగాఉండేవాడు .పెళ్ళికూడా చేసేశారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం .2వ భాగం.11.10.22 గ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18

· 52-జైన మత మహా చార్యుడు ,పంచాస్తికాయ కర్త -,ఆచార్య కుంద కుందా చార్యుడు

· కుందకుందాచార్యుడు, తెలుగు వాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది…సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది.ఇతను జైనమత సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..

· కొనకొండ్ల గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఇతనిని కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.ప్రాచీన జైన సంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.ఇతనికి వక్రగ్రీవుడు (ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు అనే పేర్ల ఉన్నాయి.

· సామన్యశకం 40 ప్రాంతంలో పుట్టాడని, సా.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తుంది.దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు.ఇతని శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.

రచనలు
కుందకుందాచార్యుడు మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.

ప్రాముఖ్యత
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.అతని శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలో అతని పేరు వినపడుతుంది.

మంగళం భగవాన్ వీరో

మంగళం గౌతమో గణిన్

మంగళం కుందకుందార్యో

జిన ధర్మోస్తు మంగళం….

మహావీరుడు, గౌతములతో పాటు ఒక్క కుందకుందార్యుణ్ణే స్మరిస్తూ స్తుతిస్తారు.కొనకొండ్లను కొండకుందేయ తీర్థం అని కూడా అంటారు.మూలసంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యులలో భద్రబాహుని అనంతరం నాలుగవ ఆచార్యుడు కొండకుంద…52 సంవత్సరాలు ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతుంది.ఇతను బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ (వక్రగచ్ఛ) లను స్థాపించారు..కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని పలు చోట్లలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు

· 53-బాలసాహిత్య,గేయ కర్త ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –శ్రీ కలువకొలను సదానంద

· కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్‌ పురస్కారం అందుకున్న వ్యక్తి.

జీవిత విశేషాలు
సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి చేసి టి.ఎస్‌.ఎల్‌.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.

రచయితగా
సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు.

సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా… మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి పురస్కారం లభించింది. వీరి “నవ్వే పెదవులు – ఏడ్చేకళ్ళు” కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ “తాత దిగిపోయిన బండి”కి స్థానం లభించింది. త్వరలో వీరి “పరాగభూమి కథలు” గ్రంథం వెలువడనుంది[1].

పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.

పురస్కారాలు
· ప్రతిభా పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం, 2013[2][3]

మరణం
ఈయన ఆగస్టు 25, 2020న పాకాలలోని తన స్వగృహంలో స్వర్గస్థులైనారు.

· 54-నవల కధలలో మానవ అంతరంగ కల్లోలాల ఆవిష్కర్త –శ్రీ కాశీభట్ల వేణు గోపాల్

· కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి, రచయిత. ఆయనకు సంగీతంతో కూడా పరిచయం ఉంది. ఆయన స్వస్థలం కర్నూలు.

జీవిత విశేషాలు
కాశీభట్ల వేణుగోపాల్ జనవరి 2, 1954 కర్నూలులో కాశీభట్ల యల్లప్ప శాస్త్రి, హనుమాంబ దంపతులకు పుత్రిడిగా జన్మించారు. వీరిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలూ. అందరికన్నా ఆఖర్న ఈయన జన్మించారు. తొమ్మిది నెలల బిడ్డగా వున్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతుంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాల్ని నేర్పించింది అమ్మ అని, అన్నలూ, అక్కలూ అంతా వెళుతుంటే వాళ్ళ వెంటపడి గ్రంథాలయానికి వెళ్తూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను అని, అమ్మకూ అక్కలకూ సాహిత్యం యిష్టం కాబట్టి నాకుకూడా వెళ్ళి కవి కావాలనుకున్నారు అని చెబుతారు. [1]

వేణుగోపాల్ మొదటి గురువు హనుమాంబ అని చెప్పుకుంటారు. కాలీజీల చదువు అబద్ధం అని నమ్మి కాసింత చదువులు చదివి వచ్చిన ధృవ పత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు. ఏవో నాలుగు అక్షరాలు పట్టుబడింది పాతికేళ్ళ తర్వాతే అని, డెబ్బైల నుండీ అతని అసలు సాహితీ ప్రస్థానం మొదలైంది. శ్రోత్రియ నియమాలను వ్యతిరేకించినట్టే అన్ని మానవ నిర్మితాలైన విలువల్నీ ఒప్పుకోలేను అందుకేనేమో మనసుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు అని చెప్పుకుంటారు. ఎవ్వరితోనీ పోల్చదగ్గ వాడిని కాను అని, ఈ చిన్న జీవిత ప్రస్థానంలో బాగా తెలుసుకున్నదొకటే నాకేమీ తెలియదు అంటారు. ఈయనకి వేణువు ప్రియమైన వాయిద్యం.

మల్లాది, బుచ్చిబాబు, ల ప్రభావం ఈయన మీద బాగా ఉంది.కానీ శ్రీశ్రీ ప్రభావం అంతగా లేదు చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మకి వీరు అభిమాని. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలుకు ఆకర్షించినా, విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుండి బయటపడ్డాను అని చెబుతారు. వీరు బ్రహ్మచారి అని, మంచి పద్యం, మద్యం రెండూ నాకు ప్రీతి అని చెబుతారు. కీర్తిశేషులు అమ్మ చిన్నప్పుడే వల్లె వేయించిన అమరకోశం, చదివించిన రఘువంశం ఈ రోజుకీ నాకు ఉపయోగపడుతాయి అంటారు. ఫ్రాంజ్ కాఫ్కా, గోగే, హరిప్రసాద్ చౌరాసియా వీరికి ఇష్టులు.

దేశాటన చేయడం వీరికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే మూడుసార్లు దేశాటన చేశారు. చదివే అలవాటుతో పాటు, అలా దేశాటన చేయడం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని వొడిసి పట్టుకోగలిగాడనుకుంటారు. నేను రచయిత కావడానికి అదే కారణమైందని అంటారు. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్‌ మీదా, స్కూటర్‌ మీదా మూడుసార్లు దేశాటన చేశారు. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే సంగీత సాధన చేశారు.

రచన శైలి
గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి, సాదా సీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన వాక్యాలు ఒక ఇమేజే మీద మరొక ఇమేజ్ ఏర్పడి form అయ్యే మాంటేజ్ లు. ఇంగ్లీషూ, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాషగా morph అవుతుంది. కథ ముందుకు సాగుతూండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తుంటాడు. [2]

అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలను కదిలిస్తాయి. అంతగా ఎవరూ స్రృశించడానికి సాహసించని స్త్రీ పురుష సంబంధాల్నీ, పురుషుని చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాల్నీ (ఇన్‌సిస్ట్‌) తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత (సిగ్నేచర్‌ ట్యూన్‌)ను ఏర్పాటు చేసుకున్న రచయిత.[3]

రచనలు
1974 లో ఆంధ్ర పత్రికలో రంగనాయకి లేచిపోయిందీ అనే కథతో వీరి సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు. ఆమె కష్టాల్లో వుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అన్నది ఈ కథలో కథావిశేషం. తర్వాత వీరు విస్తృతంగా కవిత్వం రాసినా, వైయుక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయారు. ‘నేను-చీకటి’ నవల చిత్తు ప్రతిగా వున్నప్పుడు దాన్ని చదివి, ఎత్తి రాసిన కథా రచయిత వెంకట కృష్ణ. అది అచ్చయ్యేంతదాకా వెంటపడటమే యిప్పటి నా సాహితీస్థితికి కారణం అని చెబుతారు. [4]

· ఘోష – కథల సంపుటి

· నేనూ – చీకటి నవల [5]

· దిగంతం – నవల

· నేనూ- చీకటి – నవల

· తపన – నవల

· రంగుల – నవలిక

· మంచు -పూవు – నవల

· తెరవని తలుపులు – నవల

· నికషం – నవల

· అసత్యానికి ఆవల – నవల

· అసంగత (త్వరలో) – నవల

· నాలుగు కథా సంకలనాలు

· మూడు కవిత్వం పుస్తకాలు

· నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం 

22 పుస్తకాలులైబ్రరీలో అందజేయటం 
-సాహితీ బంధువులకు శుభ కామనలు -ఇటీవల నాకు పంపిన వివిధ రచయితల పుస్తకాలు 22చదివి కొండను అద్దం లో చూపించినట్లు సంక్షిప్తంగా మీకు పరిచయం చేసి ,నిన్న ఆ పుస్తకాలన్నిటిని అందరి ఉపయోగం కోసం ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో అంద జేశాను -దుర్గాప్రసాద్-11-10-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

విజయ విలాసం.1వ భాగం.10.10.22

విజయ విలాసం.1వ భాగం.10.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం

శ్రీ చెముడుపాటి  వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన చేసుకొన్నాడు .ఆ మహిమతొ యీశతక౦ రాసి ,స్వానుభావాన్ని లోకానికి చాటాడు .బాల్యం నుంచి హూణ విద్య మాత్రమె నేర్చి ,రాజకీయోద్యోగంలోనే జీవితం గడుపుచూ ,సద్గురు కటాక్షం ,సాధనా బలం వలన సత్కవిగా పరిణమించటం దైవ బలాన్ని సూచిస్తోంది ‘’అని వెన్ను తట్టారు .శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ఈ శతక మకుటం –‘’సర్వేశ్వరా ‘’.

మొదటి మత్తేభం-‘’చదువా లేదు ,పురాణమన్న నెరుగన్ ,శాస్త్రం బదెట్లుండునో-పదమా  తోచదు శయ్య వృత్తియెరుగన్బద్యంబు లల్లంగా గో

విదుడన్ గానిక ,దప్పులన్ విడిచి తృప్తిన్ నాదుపద్యాళిలో –దుదిపాదంబున నొప్పు నామ సుధనెంతో గ్రోలి నాదండముల్ –పది వేల్ గైకొని  భక్తులార తరియి౦పన్ మిము వేడెదన్ ‘’అని ఆపద మొక్కులు మొక్కి దండం అంటే నమస్కారం దశ గుణం భజేత్ అన్నట్లు తనలో ఏమీ లేకున్నా ఓపికగా  చదివి తరియించమని గడుసుగా చెప్పి ,బోనస్ గా అయిదవ పంక్తి కూడా చేర్చాడు .తర్వాత శ్రీరామస్తుతి చేసి  శివ శివాలకు మొక్కి –‘’ఆధారంబు పయిన్ షడక్షరయుత ,ప్రాంచద్దళో పేతమై  -బోధ బ్రాహ్మి సకామ బీజములచే బొల్పోంది తానిత్యమున్

సాధిష్టాన విదాతయై రుధిర రమ్యంబౌ నుపస్థాశ్రిత –స్వాధిష్టాన నివాస మొందుజననిన్ బ్రార్ధింతు సర్వేశ్వరా ‘’అని గహన వేదాంతాన్ని అమ్మవారి నివాసాన్నీతన వేదాంత పరిజ్ఞానం జోడించి రాశాడు .’’శ్రీ కాంతా వల్లభ పాదుకాంచిత శిరున్ గా౦భీర్యయుక్తున్ గపిన్ ,ఉపనిషత్సంపూర్ణ పా౦డినత్యు దీమంతున్మారుతి మత్కృతిన్ సతతంబు మన్నింపగా ‘’స్వాంతంలో భజిస్తానన్నారు ..కపి అంటూనే ఆయనలో సర్వదిషణకు నీరాజనం పట్టారుకవి తర్వాత కవులందరికీ దండాలుపెట్టారు .

  అందరు కవుల్లాగానే తన పాపాల చిట్టా విప్పారు .అందరూపొందే లోభమోహ మదమాత్సర్యాలు తననూ పీడించాయన్నారు .సద్గురరు దర్శనం తో తనజీవితం గాడినపడి శస్త్రాలు తత్వాలు చదివి జ్ఞానం పొందానన్నారు .తల్లీ తండ్రీ కొడుకు బంధువులు అన్నీ నేవే అనే ఎరుక నిలిచి ఉంచమని సర్వేశ్వరుని వేడారు .’’నామనము నందు దుఃఖము లంటనీక సన్మార్గంబు నందుంచు ‘’అని వేడికోలు చేశారు .’’కామాంధులు కా౦తావాస మతిన్ ‘’త్రికూట’’ ముపయిన్ గన్గొందు సదా ‘’అని ఈసడించారు .

  బిందు నాదాల సౌభాగ్యోన్నత ప్రభావమైన కళ.దీన్ని చూస్తూ ప్రజ్ఞానియై నిర్వృతి తో ఉంటేనే సన్యాసం లభించి ముక్తిమార్గం కనిపిస్తుంది .తర్వాత ఉదయ  ప్రార్ధనం,జ్ఞాన ప్రభాతం ,రాత్రిధ్యానం ,మానసిక ధ్యానం ,ఉదయ సాయం సమయాలలో చేసే మానసికపూజ షోడశోప చారాలతో పద్యాలలో చెప్పారు .చివరగా –‘’వరదా! నే శత వందనంబులిడి నా వైరాగ్య పాత్రంబునన్ –భరమౌ కర్మ చయంబనా బరగు కప్ర౦బున్ వెలిగింతు భా-స్వర నీవారజ శూక సూక్ష్మమగు ప్రజ్ఞాన దీప్తిన్ విభూ –స్థిరమై మంగళ హారతి౦గొనుచు దృప్తిం బొందు సర్వేశ్వరా ‘’అని మంగళం పాడారు .

 విద్వన్నుత మండపాక కలశామ్భో రాశి చంద్రుడు ,సత్కవి వర్యుడైన పార్వతీశ్వరుడు విద్వాంసుడు నా మిత్రుడు ,నా కవిత్వంలో తప్పులు సవరించి ,నన్ను వివేకిగా లోకం ముందు నిలబెట్టాడు ఆమహనీయుని ఔదార్యం తో ‘’బ్రోవగా భవదీయాన్ఘ్రి సరోజముల్ గొలుతు నీ భక్తుండ సర్వేశ్వరా’’అన్నారు . .వెంకటార్య అనే ఆయన కొడవంటి అప్పలశర్మ గారి ద్వితీయ పుత్రులు ,రాజమండ్రి వీరభద్రపుర వాస్తవ్యులు .ప్రస్తుతం అంటే ఈ శతకం రాసే సమయం లో మహానంది పర్వతం పై తపస్సు చేస్తున్నారని మనకు తెలియని మరో విషయాన్ని తెలియజేశారు కవి .

  తనకేమీ తెలీదు అంటూనే తత్వాన్ని కవిత్వంలో అందంగా బహుకమ్మగా బంధించి మనకు అందించారు ,కవి .వారినీ వారి శతకాన్ని పరిచయం చేసే భాగ్యం ఆ ‘’సర్వేశ్వరుడు’’ నాకు ప్రసాదించాడు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ

శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్ర
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించే వారు. ఆమె నిజతత్త్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్ళిచేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్ళి జరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె యథాప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానినిగా భావించి ఆమెను రాళ్ళతో కొట్టి హింసించడం వంటి పనులు చేసినవారంతా ఆమెనొటినుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అట్టిది. ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఆమె కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిర పడింది.

ఆమె చూపిన మహిమలు
లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు కాన్సర్ వ్యాధి నయం చేసింది. ఆమె అవ్వకు ఒక్క అణా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసింది. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులైనారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ. కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతింస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వవారు చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియయనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపారు.

అమే నిజమహిమ తెలుసుకొన్నస్వర్గీయులు రాచోటి వీరన్నగారు, తుంబళంగుత్తిలక్ష్మయ్య గారు, బల్లేకల్లు నరసప్పగారు, మన్నే రాంసింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవలో తరించి సౌభాగ్యము, సంపదలు పొందినారు. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయొగి లక్ష్మమ్మవారు 16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతున్నది.ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్యగారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండిరథము, దేవాలయానికి వెండిరేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన మొదలైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వమందిరము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాలనుంచీ భక్తులను అశేషంగా ఆకర్షిస్తున్నది.

శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె, అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగుబంగారము, నమ్మినవారికి నమ్మినంత వరాలనిచ్చే అమృతస్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు.

11- ‘’రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవోణ్ణి’’అంటూ వేదికలేక్కిన బుర్రకధ నాయకుడు,నటుడు ,నాటక కధారచయిత డాక్టరేట్ ,కామధేను పత్రిక పులికంటి సత్కృతి స్థాపకుడు –శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి

పులికంటి కృష్ణారెడ్డి (జూలై 30, 1931 – నవంబర్ 19, 2007) కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా “రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవాణ్ణి” అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి[1].
జీవిత విశేషాలు
1931, జూలై 30 న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. పులికంటి గోవిందరెడ్డి, పాపమ్మ దంపతులు ఇతని తల్లిదండ్రులు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదోనలోనే సాగింది. ఉన్నతపాఠశాల విద్యకోసం తిరుపతిలోని తిరుపతి దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాల (నేటి ఎస్వీ ఉన్నత పాఠశాల) లో చేరాడు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు. నాటకాలు వ్రాయడంలో, వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమాలు నేర్పింది చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ.

రచనలు
ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు. రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. ఇతని కథలు ఇంగ్లీషు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ళ మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది. ఈయన రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి. ఇతడు ఎన్నో జాతీయ కవిసమ్మేళనాలలో పాల్గొని తన కవితాగానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవాడు.

నాటకరంగం, బుర్రకథలు
ఇతడు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. నాటకరచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందాడు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇతడిని నటనాగ్రేసరుడు అని కొనియాడాడు. ఇతడు బుర్రకథ గాయకుడు కూడా. కమ్మని గానంతో, చమత్కారవ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతడిని పొగడ్తలతో ముంచెత్తినారు. ఇతడు మంచి వక్త కూడా. జానపద వాజ్మయం మీద, నాటకరంగం మీద ఈయనకు మంచి పట్టు ఉంది.

కామధేను
ఇతడు తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్యపత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపాడు. ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా కవులకు, ఇతర రచయితలకు ప్రోత్సాహం కలిగించాడు. ఈ పత్రక చేసిన సాహిత్యసేవ గణనీయమైనది.

పురస్కారాలు
అగ్గిపుల్ల’ నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్‌ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించాడు. నటుడిగా, రచయితగా కవిగా పలుబిరుదులు, సన్మానాలు అందుకున్నాడు. ఈయన రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పీహెచ్‌డీ, ముగ్గురు ఎంఫిల్‌ పట్టాపొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఈయనను గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. తన సాహితీ, కళారంగాల కృషికిగాను ఎన్నో ఆవార్డులు, రివార్డులు పొందిన ఈయన పులికంటి సాహితీ సత్కృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించాడు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాలు పేరుతో పుస్తకంగా తెచ్చాడు.

మరణం
తిరుపతిలో 2007 నవంబరులో జరగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా సన్మాన గ్రహీతల్లో కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఈ లోపే, 2007, నవంబర్ 19 న పులికంటి కన్నుమూశాడు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316

316- బైజుబావరా హేందీ సినీ చాయాచిత్రదర్షక ఫేం ,ఇంటికి దీపం ఇల్లాలే దర్శకుడు –శ్రీ వి.ఎన్.రెడ్డి

వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు.[1] ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. వి.ఎన్.రెడ్డి 1907లో వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో జన్మించాడు. 20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయగ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఎస్.హర్‌దీప్ వద్ద సహాయకునిగా మడ్, చరణోంకీ దాసి, వసంతసేన సినిమాలలో పనిచేశాడు. ఐదేళ్లు కృషిచేసిన తర్వాత 1952లో ఛాయగ్రాహకునిగా పనిచేసే అవకాశం వచ్చింది.[2] రాజ్‌కపూర్ నటించిన ఆగ్ సినిమాకు వి.ఎన్.రెడ్డి కైయారొస్కూరో (Chiaroscuro) లైటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి అందించిన అత్యద్భుత ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలందుకున్నది[3] “వెలుగు నీడలను వెండితెరపై విభజించి వాటితో దాగుడు మూతలు ఆడుతూ ప్రేక్షకున్ని విస్మయంతో వినోదింపజేయగల ఘనత” వి.ఎస్. ది అని రూపవాణి పత్రికలో ఒక సినీ విలేఖరి అన్నాడు.[2]

రెడ్డి దర్శకత్వంలో కూడా ప్రవేశించి గంగా గౌరీ సంవాదం (1958),[4] సెంగొట్టయ్ సింగం (తమిళం – 1958)[5] ఇంటికి దీపం ఇల్లాలు (1961), ఆనంద జ్యోతి (తమిళం – 1963),[6], జహ్రీలీ (1977) తదితర సినిమాలు తీశాడు.[7]

ఈయన ఆరుగురు సంతానంలో ఒకడైన రవికాంత్ రెడ్డి 13-14 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద ఛాయాగ్రహణంలో అప్రెంటిసుగా శిక్షణ పొంది, ఆ తరువాత తనూ ఛాయాగ్రాహకుడయ్యాడు[8]

చిత్రసమాహారం
ఛాయాగ్రాహకుడిగా

· దిల్ కి రాణీ (1947)

· ఆగ్ (1948)

· హల్‌చల్ (1951)

· బైజూ భవరా (1952)

· చోరీచోరీ (1956)

· చిరంజీవులు (1956)

· కష్మీర్ కి కలీ (1964)

· ఉప్‌కార్ (1967)

· లాట్ సాహిబ్ (1967)

· యాద్‌గార్ (1970)

· పూరబ్ ఔర్ పశ్చిమ్ (1970)

· దో చోర్ (1972)

· ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే (1974)

· కాలిఘటా

· జాన్వర్

దర్శకునిగా

· సెంగొత్తయ్ సింగమ్ (తమిళం) (1958)

· గంగా గౌరీ సంవాదం (1958)

· ఇంటికి దీపం ఇల్లాలే (1961)

· మనప్పందనాళ్ (తమిళం) (1961)

· ఆనంద జ్యోతి (1963)

· జహ్రీలీ (1979)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం42- అజ్ఞోక్తి

హాస్యానందం
42- అజ్ఞోక్తి
అజ్ఞానం వలన అన్నమాటలు నవ్వుపుట్టి౦చటమే అజ్ఞోక్తిఅన్నారు మునిమాణిక్యంగారు .ఒకసారి ఆయనక్లాసుకు వెళ్లి ‘’నైషధం రాసింది ఎవరు ?’’అని అడిగితె ఆపద్యాలు వారి పాఠ్యగ్రంధం లో ఉన్నా ఒఖరూసమాధానం చెప్పకపోతే ,ఎక్కడోకాలింది మాస్టారికి .ఒక చిన్న కుర్రాడివంక ఉరుముతూ చూసి’’ఎవర్రా నైషధం రాసి౦దీ’’అని అడిగితె వాడు కంగారుతో భయపడి ‘’సార్ నేను రాయలేదండి మదర్ ప్రామిస్ ‘’అన్నాడు .పిల్లల తెలివి తేటలు ఇలా అఘోరించాయికదా అని హెడ్ మాస్టారి దగ్గరకి వెళ్లి చెప్పగా ఆయన తనతోపాటు నవ్వి ‘’చిన్న వెధవ భయపడి లేదన్నాడు కానీండి వాడేరాసి ఉంటాడు ‘’అన్నాడు ట .ఇదే అజ్ఞానోక్తి .ఇంకోక దాహరణ ఆయనే చెప్పారు .పూర్వం జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ లు ఉండేవారు. చదువులేకపోయిన ,ధనవంతులైన కారణంగా పలుకుబడితో వోట్లు పోగేసుకొని ప్రెసిడెంట్ అయ్యేవారు .అలాంటి ఒక జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ గురించి చెప్పిన కథ .జిల్లాలో కలరా వ్యాపించింది చావుల రిపోర్ట్ వచ్చింది .అందులో కలరాచావులు 12.5శాతం అని తేలింది .ఈ పాయింట్ ఫైవ్ సంగతి ఆయనకు అర్ధంకాక బుర్ర వేడెక్కింది .అందర్నీ అడిగి ఎవరూ చెప్పలేకపోతే చివరికి వైస్ ప్రెసిడెంట్ నుపిల్చి 12తర్వాత చుక్కపెట్టి 5ఎందుకు రాశారు అని అడిగాడు .ఆయన కాసేపు ఆలోచించి ‘’కలరావల్ల నూటికి 12మంది ,చనిపోయారు అని తెలుస్తోందికదా .ఇంకో అయిదుగురు చావటానికి సిద్ధంగా ఉన్నారని కాస్త చుక్క అడ్డం పెట్టారన్నమాట .ఇహనో రేపో ఆ అయిదుగురూ టపాకడతారన్నమాట ‘’అన్నాడు .
మూర్ఖోక్తి –అంటే మొండి యుక్తి అన్నారు ముని సార్.ఉదాహరణ ఆయనే చెప్పారు –నేను మద్రాస్ కు వెడుతుంటే మా ఆవిడ వచ్చి ‘’ఎలాగూ వెడుతున్నారుకనుక బెజవాడలో దిగి మా అన్నయ్యను చూసి రండి.ఈమధ్యనే జబ్బుపడి లేచాడు.చూడకపోతే బాగోదు ‘’అన్నారు .సరే అన్నారు మాస్టారుకానీ వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కుదరక బెజవాడలో దిగలేక ఆయన్ని చూడకుండానే వచ్చేశారు .ఇంటికిరాగానే అడిగితె ‘’శుక్రవారం సాయంత్రం 6.౩౦ కి చూశాను అని అబద్ధమాడి, దాన్ని నిలుపుకోటానికి మళ్ళీ అరడజలు అబ్దాలు ఆడాల్సి వచ్చింది .ఆవిడ ఆవలిస్తే పేగులు లేక్కేసే గడుసరి. గురూగారు అబద్ధం ఆడారని గ్రహించి ‘’ఎందుకండీ అబద్ధమాడుతారు “”?అంది .తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ .’’శుక్రవారం సాయంత్రం ఆరుకు మా అన్నయ్యను బెజవాడలో చూశామనే అంటారు కదా ?అనగా’’ఆరున్నరకు ‘’అని సవరించారీయన .’’వాళ్ళ ఇంట్లోనే చూశారా ?’’ఆమె ప్రశ్న .’’ఓ.నిక్షేపంగా వాళ్ళింట్లోనే బెజవాడలో చూశా ‘’మేస్టారి బుకాయింపు .ఆవిడ ‘’ఆ రోజు ఆ వేళప్పుడు మా అన్నయ్య బందర్లో మని౦ట్లోనే ఉన్నాడు .గురు వారం సాయంత్రం మీరు మద్రాస్ బయల్దేరితే ఆయన శుక్రవారం ఉదయం ఇక్కడికి వచ్చాడు .ఆ రొజ౦తా ఉండి శనివారం సాయంత్రం వెళ్ళాడు .ఆయన ఇక్కడే ఉంటె మీకు బెజవాడలో ఎలా కనపడ్డాడు ?’’అంది .ఈయన దబాయింపు సెక్షన్ జోరు చేసి ‘’ఆ జ్ఞానం మీ అన్నయ్యకు ఉండాలి. బందర్లో నీకు కనిపించిన రోజే ,బెజవాడలో నాకు కనుపించకూడదని .అయినా మీ అన్నయ్య ఎక్కడబడితే అక్కడ ఎవరికీ బడితే వాళ్లకు కనబడుతూనే ఉంటాడు ‘’అన్నారు ఈమొండి జవాబుకు ఆవిడ ఫకాల్న నవ్వి ఊరుకొంది.మూర్ఖోక్తి లేక మొండి యుక్తి అంటే ఇదే మహానుభావా అన్నారు మాస్టారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.14వ చివరిభాగం.9.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కంచివరద రాజ శతకం  

కంచివరద రాజ శతకం  

అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి ద్రవ్యసహాయం చేత ప్రచురించానని ,ఇంకా చాలాపుస్తకాలు తాను  రాసినవి ముద్రణ భాగ్యం పొందాల్సి ఉన్నాయని పరిటాల నుంచి తెలిపారు .

 ఈ శతకమకుటం –‘’భాను కోటితేజ వరద రాజ ‘’

‘’శ్రీశు గొలిచి కావ్య సిద్ధికి పలుకుల –వెలదిదలచి పొగడి విఘ్నరాజు

నమల చరిత శతక మారంభ మొనరింతు-భానుకోటి తేజ వరద రాజ ‘’అంటూ మొదటిపద్యంలో ముగ్గురు దేవతల్ని సూటిగా సుత్తి లేకు౦డా స్తుతించి  కవి శతకం ప్రారంభించాడు .లేతది అని దేన్నీ లెక్క చేయకపోతే లేతముదిరి ప్రాణఘాతమౌతుందని ,నిమిషమైనా మనసు కుదురు లేకపోతె బ్రహ్మవిద్య సాధ్యంకాదనీ ,.సుకృతం చేయకుండా మడి మైల అంటూ ప్రాకులాడితే ముక్తిరాదన్నాడు  .గుడిసె ,భవనం ఉంటాయికాని ‘’పాప పుణ్యములకు బట్టన మున్నె?’’మనసులోనే సకలం ఉంది అన్నాడు .కొత్తదేదీ లేదు అన్నీ జీవుడు అనుభవించి వదిలేసిందే .’’జన్మమేసకలార్తులకు కొంప-కష్టమైనా సుఖమైనా –‘’పారుడైన నేమి శ్వపచు డుగానేమి ‘’?అని తత్వరహస్యం చెప్పాడు .వేదాలు వల్లించినా జ్ఞానికాకపోతే ముక్తిరాదుకనుక వేదపఠనం మాలమాదుగులకు ఎందుకు ?అని ప్రశ్నించాడు .ధర్మం వల్లనే ఉన్నతస్థితి కలుగుతుంది .పారులు స్వకులధర్మ౦విసర్జిస్తుంటే బ్రాహ్మణవిధులపై మిగిలినవారికి ఆశ ఎందుకు ?’’బొమ్మ యగునే మూల పురుషుడు –బొమ్మగూర్చి వెలికి బొమ్మటంచు’’మాలను బాపడు తరమటం దేనికి అని భక్తనందనార్ లాంటి చరిత్ర గుర్తు చేశాడు –‘’సాగకపోతే సాధువై నంతమాత్రాన కుటిలబుద్ధిపోతుందా ‘’అన్నాడు  .నాబట్టే లోకం అనుకోరాదు .తానూ పరుల క్షేమం కోరేవాడే అయినా ‘’తనను జంపు దొంగ ధనము కోరి ‘’అనిలోక రీతి  చెప్పాడు ..దరిద్ర దేవత తలపై నర్తిస్తుంటే ,చెడుమనసుతో ఇంకోర్ని దోచుకుంటే ‘’వ్రాత పోనే ?గోచిపాతయే గతిగాక’’ ?అని జీవితరహస్యం చెప్పాడు .

  28వ పద్యం లో ‘’వెంకటాద్రి మీకు కై౦కర్యమును జేసి –నట్టి భక్తుడతని యన్వయుండ’’నేనుకొత్తకాదు దాసకోటిలోని వాడినే అని  చిరునామా చెప్పుకొన్నాడు వరదయ్యకు .’’తండ్రివైతి వీవు తల్లి పేరుందేవి –తల్లిదండ్రి బాల్యదశ గతింప-నున్న దంతియే స్థితి విన్నవి౦చిన దంతె’’అని తేల్చేశాడు .వెంకటాద్రి పాద పంకేరుహమే నౌకగా పాపసాగరం దాటి-అద్వయ కనుగొందు నీ ద్వీపమున నిన్ను ‘’అని తన అన్వేషణ చెప్పాడు .’’నాకు దొడ్డ కలిమికావాలి .మనుష్యుడు ఇవ్వగలడా “”అని ప్రశ్నిస్తాడు .’’విలవిల యన బట్టి పీకుకదిను –ప్రాణి బ్రాణి –సృజన పరచితేల –జీవ హి౦సయే విశేషమా ?’’అని హింసా విధానం పై బాధపడ్డాడు .

  ‘’భాగవతుల చెలిమి లేకుండా ఈశ్వర జ్ఞానం కలుగదన్నాడు కవి .మగాళ్ళను అన్నదమ్ముల్లా ,ఆడువారిని అక్క చెల్లెళ్ళు చూసే మంచి బుద్ధి ఇవ్వు. అదే పది వేలన్నాడు .స్థిర౦ కాని సృష్టి వైచిత్రికి భ్రమపడి చి౦తల్లోముంచి వినోదం చూస్తావు .’’ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాడో ,ఇక్కడ పుట్టి ఎక్కడికి వెడతాడో జీవుడు ?అన్ని ప్రాణులకు అసలు ఆట పట్టేది ?’’’’కరువు చేత డబ్బు కటువైన ,బోగము –ముండలకడ  ,కల్లు కుండలకడ –  నాటపట్టు దప్పదు అక్షయ లక్ష్మికి ‘’అని నిష్టూరం వేశాడు .మందులు అనేకం అయ్యాయి కాని రోగం కుదిర్చే వాడు దొరకటం లేదు. కనుక ‘’నీవుపూనుకొనుము నెమ్మది౦చును రుజ ‘’అని భక్తవరదుని పైనే భిషగ్వర భారం వేశాడు వ్యంగ్యంగా కవి .నీకరుణ ఉంటె చాలు ‘’దేవతల ఐరావతంకూడా ఎక్కను.నా వైద్యులు ఆశ్వినీదేవతలే ‘’.అనంత బాహుడివి ‘’నాతలపై పెట్టటానికి నాలుగు చేతులైనా లేవా సామీ ?పోనీ కనీసం ఒక్కచెయ్యి కూడా లేదా భగవాన్ అని చమత్కరించాడు.

‘’నన్ను గావురమ్మునా వినకు౦దువు –  కరిని గావ నైతె పరగినావు?దాని సేవ నీ కృతార్ధత కాబోలు ‘’అని మేలమాడాడు .జ్ఞానికి చావుపుట్టుకలు నిద్రపోయి లేచినట్లే ఉంటాయి .మరణభీతి లేశ మాత్రం ఉండదు .

చివర్లో ఆంగీరసనామ సంవత్సరం విజయదశమినాడు  వరద రాజస్వామికి అ౦కిత మిచ్చానని ‘’అందుకొని నిలువుమా కల్పము౦దాక ‘’అని సభక్తికంగా అంజలి ఘటించాడు .

106వ చివరిపద్యం లో –‘’అప్పగింప శతకమల్లి –యల్లూరిరా-జేశ్వరకవి ,దీని శాశ్వతముగ-నిలుపు మంకితంబు నీకిడు గడు బ్రీతి –భాను సమాన తేజ వరద రాజ ‘’అని శతకం ముగించాడు భక్తకవి .శతకం లో తనగురించి ఏమీ చెప్పుకోలేదు .ఆ ఒక్కటితప్ప మిగిలినవి  ఏమేమి రాశాడో కూడాలేదు .వరదరాజస్వామి గురించీ లేదు .ఆస్వామికే ఎందుకు అ౦కిత మిచ్చాడో కూడా లేదు .ఈ శతకం గురించి ఈకవి గురించి మనవారెవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .కవిని శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .లలితపదజాలం సూటి కవిత్వం ఆత్మవిశ్వాసం ,వరద రాజ పద భక్తీ ప్రతిపద్యంలో కనిపిస్తుంది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం.

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.15వ చివరి భాగం.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2
6-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడు
సా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. “ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా” అంటాడు. తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!
కాలము
గువ్వల చెన్న శతక కర్తృత్వం గురించి, కవికాలాదుల గురించి చరిత్రలో నిర్థిష్టమైన అభిప్రాయం లేదు. శతక కవుల చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు అభిప్రాయం ప్రకారం ఈ శతకం 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించాడు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. శతక నామావళి ననుసరించి గువ్వల చెన్నడు ఈ శతకాన్ని రాసినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఉదహరించబడిన పాశ్చాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావం పరిశీలించిన పిదప ఈ శతకం బహుశా 18వ శతాబ్దినాటిదని భావించవచ్చు.[
7-భారత దేశ రెండవ మహిళా చర్చి బిషప్ –రెవరెండ్ ఎగ్గోని పుష్పలత
రెవరెండ్ ఎగ్గోని పుష్పలత మహిళా బిషప్‌. నంద్యాల చర్చి బిషప్‌. పుష్పలలిత భారతదేశంలో చర్చి బిషప్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ[4].
పదవులు
ఐర్లాండ్ చర్చి బిషప్‌గా ఒక మహిళ రెవరెండ్ ప్యాట్రిక్ స్టోరేను నియమించిన తర్వాత రోజే పుష్పలలితను నంద్యాల చర్చి బిషప్ నియమించడం జరిగింది.సెప్టెంబర్ 30న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి బిషప్ జి. దేవకదాశం చేతులమీదుగా పుష్పలలిత బాధ్యతలు స్వీకరించారు[5] .
బాల్యం
.కర్నూలు జిల్లాలోని దిగువపాడు గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించింది[6] . నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్న ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ మిషనరీల ప్రభావాన్ని ఆమె గుర్తించింది మరియు ఆమె అలాంటి జీవితాన్ని గడపాలని చాలా కోరుకుంది మరియు CSI ఆర్డర్ ఆఫ్ సిస్టర్స్‌లో సభ్యురాలైంది . పుష్పలలిత 1984లో క్రైస్తవ మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు చర్చి సమాజాలకు పుష్పలలిత ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 2005 నుంచి రెండేళ్లపాటు నంద్యాల చర్చి ప్రాంతీయ పరిధిలో కోశాధికారిగా కూడా ఆమె విధులు నిర్వహించారు. 400 గ్రామాల్లోని ప్రజలకు విద్యా, ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించారు. దేశంలో రెండో బిషప్‌గా పుష్పలలిత నియామకం కాగా మొదటగా 1996లో రెవరెండ్ అలివేలి కాదక్షమ్మను గుడ్ సమరిటన్ ఎవంజిలికల్ లూథరన్ చర్చి తన బిషప్ గా నియమించుకుంది[7]
పుష్ప లలిత తన మినిస్ట్రీ ఏర్పాటు చేశారు .  ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ , హైదరాబాద్‌లో మొట్టమొదటి  యూనివర్శిటీకి అనుబంధంగా ఉంది , సెరాంపూర్ కాలేజ్ (యూనివర్శిటీ) యొక్క సెనేట్ పాత నిబంధన పండితులు , విక్టర్ ప్రేమసాగర్ కాలంలో ఆమె చదువుకుంది. సెల్లీ ఓక్ కాలేజీలు , బర్మింగ్‌హామ్ , యునైటెడ్ చర్చ్ ఆఫ్ జమైకా , కేమాన్ ఐలాండ్స్‌లో పరిచయం కలిగింది . ఆమె బెంగుళూరులోని విశ్రాంతి నిలయం డైరెక్టర్‌గా మరియు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్నారు . ఆమె డీనరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.ఎగ్గోని పుష్ప లలిత నంద్యాల డియోసెస్ బిషప్‌గా 25 సెప్టెంబర్ 2013న నియమితులయ్యారు. ఆమెను 29 సెప్టెంబర్ 2013న నంద్యాలలోని ఆంగ్లికన్ కేథడ్రల్‌లో మోడరేటర్ జి . దేవకాదశం డిప్యూటీ మోడరేటర్ జి. దైవాశీర్వాదం ద్వారా బిషప్‌గా నియమించారు[8]

8-భారత అగ్రగణ్య విప్లవకారుడు –శ్రీ చండ్ర పుల్లారెడ్డి
చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవకారులలో అగ్రగణ్యులు. సిపి అనే పేరుతో పిలవబడేవారు.
పుట్టుక-విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగోడు గ్రామంలో 1917 జనవరి 19 న జన్మించారు.[1] మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీపీ గారు ఐదవ తరగతి వరకు వెలుగోడులో, ఆపైన మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ విద్యను కర్నూలు ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్యకై మద్రాస్ గిండి ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు.
ఉద్యమ జీవితం
అక్కడ ఇంజనీరింగ్ చదువుతూవుండగా నాటి బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు.దాంతో కాలేజీ యాజమాన్యం ధర్నాకు ముఖ్య కారకులైన చండ్ర పుల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి గార్లను క్షమాపణ చెప్పాలనికోరగా వారు నిరాకరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వారిరువురిని కాలేజీ నుండి బహిష్కరించారు.అప్పటికే స్వతంత్ర భావాలు,నాటి మద్రాస్ కమ్యూనిస్టు నాయకులు కుమారమంగళం లాంటి వారి ప్రసంగాల వల్ల కమ్యూనిస్టు భావజాలం సీపీ గారిలో బలంగా ఉండేవి.1937 మే 1 వ తేదీన నాటి ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా కొత్తపట్నంలో 15 రోజులపాటు జరిగిన రాజకీయ పాఠశాలలో వెలుగోడు గ్రామం నుండి ఔత్సాహిక యువకులతో పాటు చండ్ర పుల్లారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.ఆ రాజకీయ పాఠశాలకు పుచ్చలపల్లి సుందరయ్య,చండ్ర రాజేశ్వరరావు వంటి ప్రభుతులు అధ్యాపకులుగా ఉండేవారు.1941 నాటికి పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారి కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడిగా వున్నారు.1946 లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1949 మధ్యకాలంలో డిటెన్యూ కింద అరెస్టు కాబడి 1951లో విడుదలయ్యారు.1952 మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి ,కాంగ్రెస్ అభ్యర్ధి, భూస్వామి అయిన మద్దూరు సుబ్బారెడ్డి మీద 10000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఎమ్మెల్యేగా మద్రాస్ అసెంబ్లీలో రాయలసీమ వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ సీపీ గారు చేసే ప్రసంగాలకు ముఖ్యమంత్రి రాజగోపాలచారి గారిచే ” రాయలసీమ తరుపున పోరాడడానికి గట్టివాడే దొరికాడే ” అని అనిపించుకున్నాడు.1953 రాష్ట్ర విభజన తరువాత 1955 లో పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ 1962 లో జరిగిన ఉప ఎన్నికల్లో మిడుతురు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అది మొదలు సీపీ గారు తన చివరి శ్వాస వరుకు ఎన్నడూ ప్రత్యక ఎన్నికల్లో పాల్గొనింది లేదు.1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు.1964 లో భారత కమ్యూనిస్టు పార్టీలో మొదలైన సైద్ధాంతిక విభేదాల్లో పుచ్చలపల్లి సుందరయ్య ,మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి గార్లతో కలిసి సీపీఎం వైపుకు వచ్చారు. జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.1975లో సి.పి., సీపీఐ (ఎం-ఎల్) కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 1979లో యస్.యన్.యస్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ కాగలిగారు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.[2]
మరణం
కార్మిక సంఘాల సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రైలులోనే కలకత్తా లో 1984 నవంబర్ 9 న తీవ్ర గుండెపోటుతో మరణించారు.[2]
రచనలు
• మానికొండ సుబ్బారావుతో కలిసి ‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం – దాని పరిణామం’
• వి.ఆర్.బొమ్మారెడ్డి తో కలిసి ‘ మావో సూక్తులు’ అనువాదం
• మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం – దాని గుణపాఠాలు.
• ఎన్నికల సంఘటనలు గుణపాఠాలు
• సీపీఐ, సీపీఎం, ఎపిసిసిసిఆర్ లలో వున్నప్పుడు ‘ జనశక్తి ‘ లో , సీపీఐ ( ఎం.ఎల్ ) లో తన పార్టీ పత్రిక విమోచన లోనూ అనేక సిద్ధాంత వ్యాసాలు రాసారు.
• సిద్ధాంత వ్యాసాలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి.
• 9- ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ స్థాపకుడు –శ్రీ తరిమెల నాగి రెడ్డి

జననం
అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917న రైతు కుటుంబములో జన్మించాడు.
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము, స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు జైలుకు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. [1] జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, సి.పి.ఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్ (ఎ.పి.సి.సి.ఆర్) – ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారతదేశం). నాగిరెడ్డి 1976, జులై 28న మరణించాడు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అరెస్టు చేశారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొండను అద్దం’’ లో -3శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు

’కొండను అద్దం’’ లో -3
శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు  
అమెరికాలో ఆస్టిన్ నగరం లో ఉంటున్న శ్రీ డొక్కా రాం గారు నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి ఇనిమనవడు –అంటే మునిమనవడిగారబ్బాయి .సాఫ్ట్ వేర్ ,సాహిత్యం అనే జోడు  గుర్రాల స్వారీ  చేయగల దిట్ట .కవిత్వం, విమర్శ చేయగల సవ్యసాచి .ఈ మధ్య ఇండియా వచ్చి నాకు పంపిన 9పుస్తకాలపై స్పంది౦చ మనికోరగా రాస్తున్ననాలుగు మాటలివి .ఈ తొమ్మిదీ 2022మార్చి నుంచి జులై లోపు వచ్చిన తాజా నవరత్నాలు .అంటే ఎంత వేగంగా పుస్తకరచన జరిపి ,ప్రచురించారో మనకు అర్ధమౌతుంది .ప్రతి పుస్తకం మంచి గెటప్ తో ఆకర్షణీయంగా ఉండటం మరీ ప్రత్యేకత నాణ్యతకు పట్టాభి షేకం జరిగిందన్నమాట .
1-పద్య సఫారీ ,పలుకు కచేరీ –సోదరులిద్దరూ ఆఫ్రికా పర్యటన చేసి పొందిన అనుభూతి .రాం గారు సఫారీ,ఫణి గారు కచేరీ చేశారు .కలర్ ఫోటోలతో వన్య మృగ దర్శనమూ చేయించారు .మొదటి దానిలో ‘’సఫారీ ‘’అనే అన్య దేశ్య పదాన్ని మకుటం చేసి రాయటం కొత్త .ఇందులో తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటన అనుభవ సారం చూసిన ప్రదేశాలు జంతువులూ వాటిపేర్లనుపద్యంలో ఇరికించటం ఒక పెద్ద సఫారీ .చక్కగానిర్వహించారు రాం .జంతుప్రపంచం చేరగా పిలిచిందట పరుగు లంఘిచు ప్లావి అంటే జింక ,చోరులబాధలేదు .తరుణము రానంతవరకూ వేటాదబోదు భారి అంటే సింహం .వినుటకు చేటల చెవులు ,కనుటకు లఘు నేత్రయుగలి తినుటకు గరికలే చాలు –మనిషికి ఆదర్శం ‘’కరియోగి ‘’ఖద్గంరుగాల ఖడ్గ మృగాల కొమ్ములు దోచే దొంగలు ‘’దొమ్ము వడ’’అంటే వాటి బలం క్షీణి ౦ చేదాకా కా తరిమి చంపి దొంగరవాణా చేస్తారు .ప్రకృతి సమతుల్యత నిలబెట్టే జంతుజన్మ ను చూసి మనిషి గుణపాఠం నేర్చుకోవాలి .’’నడి రాతిరి వినవచ్చెను –చిడిముడి తడబడు నటులుగసింహపు గర్జల్ ‘’వినిపించాయి .పోతన స్టైల్ కనిపించింది .కిలిమంజారోపర్వతాలు మెరుపులమధ్య వెలిగే మేరు నగంలా ఉందట తూర్పు టాంజనీయాకు తురగ౦ అంటే హృదయం జాంజిబార్ ‘’.వావలె ననుకొను నావలు –జీవనమిదే ఆటుపోటు చిట్టా అంటే ఆశ్చర్యం చిత్రం .ఇలా కందాల్లో సఫారీని బంధించారు రాం.
  మాటలకచేరీలో ఫణీంద్ర యాత్రా విశేషాలు రాశారు. ఆఫ్రికా అంటే నలుపు అన్నారు .అనిశ్చిత మనిషిని నడుపుతుందని జీవితం పై ఆసక్తి రేకెత్తిస్తుందన్నారు .
2-పాట వెలది –పలుకు నర్తనకుపద్య పరివర్తన –తెలుగు సినీ పాటలకు రాం గారి పద్య కూర్పు .ఆత్రేయ గీతం –తేట తేట తెలుగులా –తెల్ల వారి వెలుగులా –తేరులా సెలయేరులా కలకలాగలగలా –కదిలి వచ్చింది కన్నె అప్సరా –వచ్చి నిలిచింది కనులము౦దరా ‘’దీనికి పద్యాలు –తేట తేట తెలుగు తెల్లవారి వెలుగు –తేరు వలెను సాగి ఏరువలెను –కదిలి వచ్చి నిలిచే కన్నె అప్సర తానె –అందమంతా కనుల విందు చేసి ‘’అద్భుతపద్య పరివర్తనం .చివరి 21వ పాట దిలయన్ కింగ్ ఇంగ్లీష్ సినిమాలో –హుకూమా మటాటా –వాట్ ఎ వండర్ఫుల్ ఫ్రేజ్ –హుకుమా మటాటా –Aint nopassing craze ‘’కు అను వార్తన పద్యం –‘’అందరకు హాయి అంత మేలుజరుగు –దృష్టి శుభము గనిన సృష్టిశివమే –తల్లడిల్ల నేల తలపులందున చిక్కి –చింతలేల ?చిన్ని జీవితమున ?’’
  బహుశా ఇలాంటి పద్య పరివర్తన ఎవరూ చేసి ఉండరు. రాం గారి ఆలోచన పరిపక్వంగా నెరవేరి మార్గదర్శనం చేసింది .
3-అమెరికావాసి –తన ప్రవాస జీవిత గాథను శతకపద్యాలలో పడమటి సంధ్యారాగం గా వినిపించారు రాం.’’ప్రాచ్యం అప్రాచ్యం అనే ఏహ్యభావాన్ని మనసులోనుంచి తుడిచిపారేసి విశ్వ మానవతను ప్రతిబింబింప జేశారు .’’అమెరిక వాసి’’ అనేదిమకుటం.మచ్చుకు కొన్ని పద్యాలు –‘’ఎన్నారై మొనగాడని –ఎన్నో చానళ్ళు బొగడ నేమి ఫలంబో ?-నిన్నే నమ్మిన తమ్ముల –కన్నా చేయూతనిడక యమరిక వాసీ ‘’.పోలీసులే’’ కాపు’’లనగ –కాలొక్కటి చేసినంత కదనాశ్వములై –వాలుదురే క్షణమందున –నాలస్యము చేయకుండ’’అక్కడ పోలీస్ లను కాప్ అంటే అది రక్షణ అర్ధంగా కాపు ను వాడి వాళ్ళ డ్యూటీమైన్దేడ్ నెస్ ను బాగా చెప్పారు .ప్రతిశీర్షిక బాగుంది .ఉపసంహారం లోచివరగా –‘’వందల వేల ప్రవాసుల –కందువ జీవన గతులను కథగా జెప్పన్ – డెంద౦బులు మురిసినవా ?అందరికివే వందనంబు లమెరిక వాసీ ‘’అని ఫీడ్ బాక్ గా అడిగారు .ఇందులోనే శంకరాచార్య మాతృపంచకం దుఃఖ నివృత్తి ,గుర్వస్టకం మొదలైన శ్లోకాలకు తేట తెనుగు పద్యానువాదం చేసి జగద్గురువులను మనకు అతి సన్నిహితం చేశారు .
4-ప్రవాసి –ఆధునిక ప్రవాస జీవన పద్యకావ్యం –ఇది నవావరణ కావ్యం .మొదటిది వందనం లో సీతమ్మ మాయమ్మ అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ,గురు వందనం అందే వేదమాతరం శివపంచ రత్నాలు  అనే 17శీర్షికలు .రెండవది జ్ఞాపకం లో ప్రవాస భారతి విశ్వభారతి అజ్ఞాతవాసం గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ –మొదలైన 12శీర్షికలు మూడవది –ప్రవాసీ జీవనం –లో వీకేండోపాఖ్యానం ,ఆటవెలది ఎంకి ,సంసార వేదాంతం ,పేకాట వైరాగ్యం శారద నీరద కేళి వంటి 24శీర్షికలు నాల్గవది బంధనం లో లాక్ డౌన్ మాయాబజార్ ,కరోనా ,వర్క్ ఫ్రం హో౦,కు౦జరయూధం లాంటి 8,అయిదవది –పద్య నైవేద్యం లో పడగెత్తిన పద్యం ,పద్యం ఎలాఉండాలి?పద్యపాన ప్రియుడు ,సాహిత్య పెత్తందార్లు సన్మాన రహస్యం ,ఒహోహోం ఒహోహోం వంటి 14శీర్షికలు ,ఆరవ ది-అక్షర సేద్యం లో బంగారుతల్లీ ,భాష –బెత్తం,tellgoతెలుగు ,త్రీ చీర్స్ టుపద్యం తెలుగు బడి వంటి 18శీర్షికలు ,ఏడవది –సంబరం లో –ఉగాది అమెరికందాలు ,దీపావళి దసరా,సూపర్ బౌల్ ,సభాయైనమః వంటి 12శీర్షికలు ,ఎనిమిది-భోజనం లో-ఆరురుచులు ఆట వెలదులు ,కాఫీకాఫీ ,పచ్చడి పలుకులు ఆవకాయ డాట్ కాం ,హాచ్చి కందములు ,కవితా కన్జేక్టివై టిస్ వంటి 20 శీర్షికలు  ,నవమావరణం –నీరాజనం లో ఓమేధావికి పాఠం ,శ్రీశ్రీ ,మనాత్రేయ ,పివి శతజయంతి ,బాలగంధర్వుని కి పద్య నీరాజనం ,గరికి పాటికి పద్య పట్టాభిషేకం వంటి 8శీర్షికలు ఆల్ మొత్తం 133శీర్షిలతో కావ్యం పూర్తి చేశారు . మచ్చుకు కొన్ని పద్యాలు ఆస్వాదిద్దాం .
సీతమ్మగారిపై పద్యం –1-అన్నమా అది కాదు ,ఆప్యాయతల ముద్ద-లన్నపూర్ణ గ నోటి కందజేసె –మజ్జిగా అదికాదు మనసు కవ్వము జిల్కే –మానవత్వపు తేట మంచిమాట
పప్పు ధప్పళములు ,పచ్చడి ,వ్రతముగా –పరుల కడుపు నింపె –పరమ సాధ్వి –ఆకలి రక్కసి నంతమొందగా జేసే –నాత్మ చాపపు నారి అమ్మ సీత
వండి వాత్సల్యమే పంచె వంటగరిటె–కాశిగా కొనసీమాయే వాసి కెక్కె
ఖండములు దాటి నీఖ్యాతి గన్నవరపు –లంక మెరసిన భారత రత్నమీవు ‘’
2-లాక్డౌన్ చిత్రం –‘’మంచినీరు పాలు మరచిరి మనవారు-లాకు డౌను మంచి లాభ సాటి
లైనుకట్టే రయ్యోవైను షాపు లెదుట –మందు కొనుట యందె ముందు చూపు ‘’
3-అమ్మను మింగినదా౦గ్లము –క్రమ్మెను సంస్కృతికి మబ్బు ,కాలపు మహిమల్
నమ్మిన వారికి గలవిట-అమ్మకమునకాధరువులు నాప్యాయతలున్ ‘’
4-తెలుగు వాడి నీది తెలుగు వేడియు నీది –తెలుగు మరువ వలదు తెలుగు బిడ్డ ‘’5-‘’మన ఆత్మ గౌరవ౦బును –మనకారము చాటి జెప్పు మన పచ్చళ్ళున్
మన పెరటి కూరలందున –మనసెరిగిన ఆకు కూర మన గో౦గూరే ‘’
6-జబ్బలు చరుచుచు నిలిచెను-పబ్బపు వంటలను రాజు ,పందెము గెలిచెన్
‘’బొబ్బట్టే’’ నెగ్గెను పెడ –బొబ్బలు పెట్టగ నితరులు పోటీ ముగిసెన్’’
7-ఒటేల్ భోజనం –‘’ఉడుకు ఉడుకు అన్న ముడకనియ్యని కూర –ఉప్పుమిరియ౦పు పొడులున్న వచట ‘’.
శుచియే ముఖ్యమాయే రుచులు కానేకాదు –కడుపు నిండలేదు కనులవిందు ‘’
8-అమ్మ వంటి గ్రామ మనురాగ సంపదే –చూసిరండి మీరు సుఖముగాను ‘’
9-దీపావళి –‘’రేపన్న ప్రమిద చిత్తము –జ్ఞాపకమను చమురుపోసి ,జ్ఞానపు వత్తిన్
దీపము వలె వెలిగించు డి-దీపావళి దివ్యకాంతిదిక్కులు నిండన్ ‘’
  అక్షరలక్షలు చేసే పద్య రాజమిది .
10-‘’పండితుండు త్రాగు పలుకు సారాయినే –మాటలందు మత్తుమందుకలిపి
పరవశమ్ము జెంద భావ లాహిరులలో –మద్యమేల మనకు పద్య ముండ ‘’
ఇది మరో ఆణిముత్యం .
5-చిత్రపది-శతాధిక చిత్ర –పద్య లహరి –కొన్ని పద్య చిత్రాలు –
1-అమ్మకు సృష్టికి ,మూలపు –టమ్మకు,జగదేకమాతకా మువ్వురి జే –జమ్మకు వందన శతములుజయమెల్లరకున్ ‘’
2-వేల గోపికల కు వెలుగైన స్వామికి –గన్నులేల ?నెమలి కన్ను చాలు
మధురభక్తి నిండె మదిలోన కేశవా –స్థాణువైన నీకు వేణు వేల ?’’
3-కాస్త నిలువుమయ్య కాశీకిపోనేల ?పెళ్లి జేసి నీకు బిల్లనీయ
కన్ను విప్పు గలుగు గానబడు దైవంబు –తత్వమొదవి ,జన్మ ధన్యమగును ‘’
5-చిలికితి పద్యంబొక్కటి-చిలిపిగా స్ఫురియించే నటులే చిత్రము జూడన్
అలిగితివో బట్టతలలు ?-గలహము వలదయ్య నేను ఖర్వాటుడనే ‘’
ఈ పుస్తకంలోనూ ఒక కొత్తదనం ఉంది కనిపించిన బొమ్మపై చక్కని పద్యం అల్లటం .అంటే చిత్ర పద్యలహరి .ఇందులోనూ భేషని పించారు రాం.
6-తటిల్లతలు – రాంమనోఫలకం పైతళుక్కుమన్న భావకవితా దీపికలు.ఇవి .మనమూ కొన్ని అనుభవాలు పంచుకొందాం –
1-కాలచక్రపుదారి పరిగిది ,కఠిన మార్గపు గాడి తిరిగెడు – అనుభవమ్ములపుస్తకం నేనాలాపించే గీతం
2-హీరో వర్షిప్ –‘’అరవీసం సాధించిన వాడికి అర సున్నా భక్తులమౌదాం –ఆకాశానికి ఎత్తేద్దాం ఆ దేవుని గానే చేసేద్దాం ‘’
3-గుడిపాటి వెంకట చలం –శేష జీవితం అరుణా చలం ‘’
4-ఇరవయ్యోకటవ శతాబ్దం లోకి శరవేగంగా దూసుకుపోతున్నాడు –అయిష్టంగా నైనా అందరినీ మోసుకు పోతున్నాడు ‘’
5-సరంగు జీవితం –‘’నిత్యం నడి రేవు బ్రతుకు దరిజేరే దారిలేదు –అచంచల ఆత్మ విశ్వాసం ,ఆశల చుక్కాని తప్ప ‘’
6-బాపురే బాపు –‘’నాల్గుగీతలు గీసి –నవ్వించి కవ్వించి –హాస్య రసాయనము –నెక్కి౦చి పొక్కించి –నాలాంటి బుడుగులను –ఉర్రూతలూపావు –ముళ్ళపూడి జతను –ముత్యాల సరులు –అట్టమీది బొమ్మ –లెన్ని అల్లర్లు –కొంటె తెలుగు చూపు –లెక్కించు కైపు –వేదా౦త ముంది ఆ –చిలిపి గీతల్లో –గుండెలను కదిలించు –చింపి రాతల్లో (ఫాంట్ )-గీతాచార్యుడివే కదా –మహాబాపు
7-పెళ్లి –‘’అనురాగం ,అభిమానం పడుగుపేకల్లా –మనసు మగ్గం పై నేసిన మధుపర్కాలు –గారాల దారాలు ,నునుసిగ్గు సరిగంచు –మేనిపై జలతారు చీనా౦బరాలు ‘’అద్భుత భావగరిమ ఇది .బాపు ఉండిఉంటె ,ఈయన్ని కవిగా పెట్టుకొని పాటలు రాయి౦చేవారు.
8-కోనసీమ –గోదారిమాతకు గోమాత సేవకు –తొలికోడి కూతకు తొలిప్రొద్దు పొడుపుకు –తోలకరిజల్లుకు తెలిలి వెన్నెల  సొ౦పుకు –అందాల సీమ మా కోనసీమ ‘’
7-అవ్యక్తం –తానెవరో తెలుసుకొంటానని ,తన్ని తానె ప్రశ్నించుకొంటాననీ ,తనతో తాను  మాట్లాడుకొంటాననీ తనలోని అంతర్యామిని దర్శించే ప్రయత్నం చేస్తాననీ లోపలా బయటా ‘’ఆయన ‘’ ఉనికినిగుర్తిస్తాననే తపనతో రాం గారు రాసిన 50 కవితలివి .ఇందులోనూ కొన్ని తాకి చూద్దాం –
1-పదానికిపదానికి మధ్య తొంగి చూసేది –శబ్దానికి శబ్దానికి నడుమ ప్రవహించేది –భాష భావం ఏమీ అవసరం లేనిదీ –తన ఉనికేదో చెప్పకుండానే ఇద్దరినీ కలిపేది –అదే అసలు కవిత్వం –అదే అవ్యక్తం .’’
2-అడుగుకు మడుగు లోత్తుతూనే –నా అహంకారపు పుండును –చిదిమేశావ్ –ఆశల పర్వతాలనెక్కిస్తూనే అవసరాలలోయల లోకి త్రోసేశావ్ ‘’
3-ప్రవాసీయం –‘’నడి సంద్రం లో –ఈదడం నేర్చుకొన్నాను –ఏ తీరమైనా నాకొకటే –విశ్వమంతా నాయిల్లే అందరూ నా వాళ్ళే –సంస్కృతి నీకు వ్యాపారం కావచ్చు –నాకు సదాచారం –దేశభక్తి నీకొక ఎజెండా కావచ్చు –నేనే నాదేశపు జెండా –ఎక్కడ నాటినా రేపరెపలాడుతాను ‘’
  అద్భుతభావాలకు పరమాద్భుత పద చిత్రణ
8-ఆకు చుట్టిన ప్రకృతి 
సాహిత్యం లోసహజీవనం చేయాలంటే భావ సముద్రంలో మునకలు వేయటమేకాదు ,కొంతసారాన్ని అవపోసనపట్టటంమే చాలదు. అ బిందువు సుడులు అలలు ఆవిరి అందులో సమస్త జీవరాశి మనమే నని గుర్తించాలి నిత్యం మారుతున్న ఆనీటి స్వరూపం లో మమేకమై ,మనం ఆకాశానికి పర్వతాలకు పైకి అరణ్యాలలో అలవోకగా ప్రయాణం చేయాలి .అప్పుడే ప్రకృతి మనతో మాట్లాడుతుంది ‘’అని అర్ధం చేసుకొన్న రాం రాసిన 27అనుభవ గీతాలివి .దీనికి అనుబంధంగా ‘’ఐస్ ల్యాండ్ అందాలు ‘’అనే నైస్ గా చెప్పిన 13కవితలున్నాయి.మంచి బొమ్మలూ ఉన్నాయి .
1-అలా తలుపు తట్టిందెవరు ?అజ్ఞానమా .ఆత్మజ్ఞానమా –ఆపిలుపు నిచ్చిందెవరు –వీడేనా లోపలి వాడా?-అందరిలో ఆకు చుట్టిన ప్రకృతిని –అక్షరం సాక్షిగా –ఆస్వాదిస్తున్న –అడుగడుగునా ఆవిష్కరింప బడుతున్న అద్భుతాన్ని-అంతరంగం లోకి ఆహ్వానిస్తున్నాను ‘’
మిస్టిక్ పోయిట్రీ,టాగూర్ స్రవంతిలా ఉంది
2 ఒక్కటే సత్యం –ఎన్నిపరదాలను తప్పించినా –ఇప్పుడెవరికీ కాకు౦ డాపోయింది –కాళ్ళ ఎదుట ప్రత్యక్షమై ఉన్నా-ఒక్కరికీ కనపడకుండా పోయింది
3-  ఐస్ లాండ్ లో వేడి నీటి బుగ్గ –లోపల ఎంత కుతలాడితే –అ౦తెత్తు ఉబికి వస్తావ్ ?అరక్షణం లో –ఆకాశాన్ని చేరుకోవాలనే తహతహ –నిన్ను నిలువెల్లా దహించి వేస్తోంది కాబోలు ‘’చక్కని కవిత్వం. ఆయన అంతరంగంనుంచి ఉబికి ఉవ్వెత్తున ఎగసి వచ్చింది.
4-వజ్రాల్లా మెరిసిపోతూ –వారధి ఒడ్డున మురిసిపోతూ –వచ్చి పోయేవారిని –పలకరించటం కోసం –నిత్యమంగళ స్నానాలు చేస్తూ –వాయు భక్షణలు చేస్తున్న –వింత విగ్రహాలు –ఇదీ ఐస్ లాండ్ లోదే
5-తలుపులు లేని గుమ్మమ్ములు –వాస్తు విశేషములుకావు –వాస్తవామీ కట్టడములు –క్రైస్తవ మత చిహ్నమ్ములు ‘’
9-తొమ్మిదవ చివరిపుస్తకం –పలకరించే పద్యం ‘’-అని ‘’మాస్టారూ !ఒక్ఖపద్యం ‘’అని ఊరించారు రాం .ఇందులో పద్యలహరిలో 41,అవధానాలు సాహితీ సదస్సులలో చెప్పినపద్యాలు 42,ఆచార్యులతో పద్య సంభాషణ లో -20,పొడుపుకథలు –లో 20,బొమ్మ -బొరుసు పద్యాలు -6,సమస్యాపూరణక౦దాలు  -115,ఆటవెలదులు -56,తేటగీతులు 47,వృత్తపద్యాలు -15,ఉత్పలమాలలు -8,శార్దూల౦ -1మత్తేభాలు 3.ఉన్నాయి .పద్యమంటే చెవికోసుకొనే వారికి పసందైన పక్కా విందు భోజనం అందించారు రాం డొక్కా.ఇందులో వాచవికి ఒకటి రెండు .
1-మది మెచ్చెన్ మరి చందమామ గనుచున్ మా రాము డానాడితన్ –ఇది ‘’ఇస్రో ‘’జయకేతనంబు గనుడీ ఈ నాటి శాస్త్రజ్నులే –కదిలించన్ ఘన అంతరిక్ష పదమున్ ,కాలూన  సిద్ధంబిటన్ –ఉదయించెన్ రవి చంద్రమండలములో నొప్పారు మేఘాకృతిన్ .
2-కోవిదమ్మ నేర్ప కొత్త వ్యాపారముల్ –పాతమాస్కులిచ్చి పాత్రలడిగే –అసలు తెలివియున్న అమెజాను లోనైన –బలుసుకూరనమ్మి బ్రతకవచ్చు
3-దాసాను దాసులేకడ –ఊసులకే ఊరి పెద్ద లుత్త కబుర్లే –వేషాలే మగవారివి –మీసాలవి స్త్రీకే సొబగు మీరేమన్నన్ ‘’
ఇలాంటి పద్యాలసోబగులు ఎన్నెన్నో ఉన్నాయి .రాం గారి కవిత్వ ధార,ఆయనపుట్టిన రాజమహేంద్ర గోదావరీ ప్రవాహంలా ,తానున్న  నయాగరా జలపాతం లా సాగింది .అందులో తళుకులు బెళుకులు ఉరుకులు హోరు ,మానసిక ఆనందం మేధో పరిణతి గోచరిస్తాయి .నిజానికి ఆయన అవధానం చేయ గల సమర్దులే .ప్రాక్ తీరం నుంచి పడమటి తీరానికి చేరిన జ్ఞాన మార్తా౦డులే .ఆయన ఆప్యాయతకు ,మంచి మనసుకు ఈపద్య లహరి లేకకవితాలహరి తార్కాణం .మరిన్ని వన్నె వాసికల పుస్తకాలు వెలువరిస్తారని భావిస్తూ ,వెలువరించాలని కోర్తున్నాను .ఇప్పుడు వారి చరిత్ర తెలుసుకొందాం –
పేరు డొక్కా రామభద్రశర్మ అమ్మానాన్నలు-శ్రీమతి బాలాత్రిపురసుందరి శ్రీ సూర్యనారాయణ గార్లు .పుట్టింది-తూగోజి ధవళేశ్వరం .అక్షరాభ్యాసం –రాజమండ్రి ,విద్యాభ్యాసం –అమలాపురం హైదరాబాద్ .ఉన్నత విద్య –బెంగుళూరు, అమెరికా .మొదటిఉద్యొగ౦  –భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ –ఇస్రో  .ప్రస్తుత నివాసం –ఆస్టిన్ నగరం –టెక్సస్ అమెరికా  .వృత్తి –ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్ .ఐటి ప్రాజెక్ట్ మేనేజిమెంట్ .ప్రవృత్తులు –అక్షరారాధన ,సాహిత్యాధ్యయనం భాషా సాహచర్యం ,అధ్యాపకత్వం ఆధ్యాత్మిక తత్వ విచారణ .సాహిత్య ప్రక్రియలలో సేద్యం ,సాహితీ సదస్సులు నిర్వహించటం హాజరవటం అవధానాలకు  సంచాలకత్వం , నిర్వహన , మాతృభాష బోధన ,పాఠ్యప్రణాళిక ,అంతర్జాతీయ తెలుగు బడి నిర్వహణ .
ఇంతటి ప్రతిభా వంతుని అక్కడి సంస్థలు గుర్తించి సన్మానించాయి .మనదేశామూ,మన రాష్ట్రమూ ఆహ్వానించి  సత్కరించి మనం ధన్యులమవాలి .ఆ రోజు త్వరగా రావాలని ఆశిద్దాం .


.మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

మీ ఆత్మీయ స్పందనకు, ఆశీరక్షతలకు ధన్యవాదాంజలులండి.🙏

యాదేవీ సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు అర్థరూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు భావరూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు భాషారూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా,

యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా..

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః..🙏🕉️🙏

అమ్మ అపార కరుణాకటాక్షవీక్షణలు, 

అనంతభావధారలై, పద్య, వచన కవితా 

సంకలనాలుగా రూపొంది, 

అమ్మ-నాన్న చేతులమీదుగా,

జూలై 31వ తేదీ, 2022 నాడు,

ఎందరో పెద్దలు, ఆచార్యులు, 

పండితులు, సాహితీవేత్తలను  

సమాదరిస్తూ “అక్షరతాంబూలాలు”గా 

ఆవిష్కరింపబడ్డాయి.   

1.  మా ఆఫ్రికా యాత్ర (పద్య సఫారీ, పలుకు కచేరీ) 

2.  చిత్రపది (శతాధిక చిత్రపద్యలహరి) 

3.  పాటవెలది (పలుకునర్తనకు పద్య పరివర్తన) 

4.  అమెరిక వాసి శతకం 

5.  ప్రవాసి (ఆధునిక జీవన పద్యకావ్యం)

6.  పలకరించే పద్యం

7.  తటిల్లతలు

8.  అవ్యక్తం 

9.  ఆకుచుట్టిన ప్రకృతి 

10. ఆత్మారామం (ద్వితీయ ముద్రణ) 

11. ఆత్మానందం (అద్వైత జీవన కవితా మకరందం, 2017)

12. శ్రీ సాయి సురభి పద్యకావ్యం (తమ్ముడు చి. ఫణి డొక్కా రచన) 

వీటిని, అందరికీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని, చదువుకొనేందుకు వీలుగా క్రింది లంకెలో పొందుపరచాము.

https://acchamga-telugu-ebooks.blogspot.com/2022/09/?m=1

పుస్తకాలకు ముందుమాటలనందించిన పుంభావసరస్వతులకు, అందమైన ముఖచిత్రాలను అందించిన కుంచె సోదరుడు శ్రీ కూచి సాయిశంకర్ కు, లోపలిచిత్రాలను అపురూపంగా చెక్కిన శ్రీ ఉలి గారికి, పుస్తకాలను అనతికాలంలో, అతి చక్కగా ముద్రించి, ఆన్ లైన్ లో కూడా పొందుపరచిన “అచ్చంగా తెలుగు” ప్రచురణల అధినేత్రి, సోదరి శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గార్లకు అనేకానేక ధన్యవాదములు. 

పుస్తకములను చదివి మీ మీ అక్షరాశీస్సులు, ఆత్మీయస్పందనలు అందజేస్తారని ఆశిస్తున్నాను. 

ఈ జన్మలో ఇంతటి అపురూపమైన సాహితీబంధుత్వాన్ని  అద్భుతమైన వరంగా ప్రసాదించిన సరస్వతీమాతకు సహస్రకోటి ప్రణామములు. 

– రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.13వ భాగం.8.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.24వ భాగం.8.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు

1-కళంకారీకి అలంకారం తెచ్చిన తులసీ సమ్మాన్ గ్రహీత ,శిల్ప గురు ,పద్మశ్రీ-శ్రీ జొన్నల గడ్డ గురప్ప శెట్టి

జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) ఉత్తీర్ణులు అయ్యారు.

గుర్తింపులు :

· 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

· 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారము తో సత్కరించబడ్డారు.

· కలంకారీ కళకి ఆయన చేసిన విశిష్ఠసేవలకి గానూ ఆయనకి శిల్పగురు బిరుదు వరించింది.

2-తంజావూర్ శైలి చిత్రకారుడు ,శిల్ప గురు ,పద్మశ్రీ –శ్రీ పన్నూరు శ్రీపతి

పన్నూరు శ్రీపతి : చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గలదు. పలుభాషలలో వ్రాయగల దిట్ట. హైదరాబాదు లోని తెలుగు లలిత కళాతోరణంలో సభ్యుడు కూడానూ.

సత్కారాలు
· పద్మశ్రీ : ఇతని కళా తపస్సును గుర్తించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.

· శిల్పగురు : భారత ప్రభుత్వం ఇతనికి 2008 శిల్పగురు అవార్డు ప్రదానం చేసింది.[1]

ఇతని శిష్యగణం కూడా కళారంగంలో రాణిస్తోంది.

3-మహాదాత శ్రీ బుడ్డా వెంగళరెడ్డి

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి 1900 డిసెంబరు 31న శివసాయుజ్యాన్ని పొందాడు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం
ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, “అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది” అన్నారు. కానీ బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ, దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటే మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.

· ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి గురించి నాకు తెలిసిన పూర్వీకులు చెప్పిన మాటలు చివరి దాన ధర్మములు.

· ఒకానొక రోజు ఒక నిరుపేద బ్రాహ్మణుడు దూర ప్రాంతం నుండి తన కూతురి వివాహం కోసం కొంత డబ్బులు అవసరం పడ్డాయి అంటా, అప్పుడు దానకర్ణుడు మన బుడ్డా వెంగళరెడ్డి గురించి ఎవరో చెబుతుంటే విన్నారంటా, విని ఆయనను కలిసి తన బాధ తెలిపి ఆయనను దానం చేయమని అడగాలని నిశ్చయించుకున్నారు. పూర్వం బైకులు, కార్లు, మరియు ఏ ఇతర సౌకర్యాలు లేవు. ఆయన కాలినడకన వచ్చి తన బాధ చెప్పుకుని తనకు కొంత డబ్బులు సహాయం చేయమని చాలా బాధపడుతూ విన్నవించాడు ఆ నిరుపేద బ్రాహ్మణుడు. అప్పుడు మీ కూతురి వివాహానికి సంబంధించిన ఖర్చులు మొత్తం డబ్బులు నీకు సహాయం చేస్తాను అని బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఫలానా రోజు రమ్మని సెలవిచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి ఆ దేవుడు తనువు చాలించారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆ బ్రాహ్మణుడు కూతురి వివాహం నిశ్చయించుకున్నారు, ఆ నిరుపేద బ్రాహ్మణుడు కాలినడకన నడుస్తూ ఆ ఉయ్యాలవాడ గ్రామ సమీపానికి చేరుకున్నాడు, ఆ దారి మద్యలో ఆ దైవ స్వరుపుడూ ప్రత్యక్షం అయ్యాడు.

అప్పుడు ఏం స్వామి చాలా రోజులు తర్వాత వస్తున్నావు అని ఆ నిరుపేద బ్రాహ్మణుడిని అడిగారు , అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొద్దిగా వివాహానికి ఆటంకాలు ఎదురై ఆలస్యం అయ్యింది అయ్యా గారు అని జరిగినా విషయం తెలియజేశారు. సరేలే నీ డబ్బులు ఫలానా గదిలో మూటకట్టి దంతెల మద్యలో ఉంచాను , మా కుటుంబ సభ్యులకు నేను చెప్పినాను అని చెప్పండి మీ కోసం దాచినా డబ్బులు మీకు ఇస్తారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి సంతోషంగా మీ కుమార్తె వివాహం జరిపించండి అని తెలియజేస్తారు , ఆ దేవ దేవుడు బుడ్డా వెంగళరెడ్డి గారు.

ఆ బ్రాహ్మణుడికి ఆయన పరమాత్మను చేరుకున్న విషయం తెలియదు. బుడ్డా వెంగళరెడ్డి ఆస్థానంకు ( నివాసం ), వెళ్ళి దారి మద్యలో ఎదురై ఈ విధంగా చెప్పారు, మా కుటుంబ సభ్యులను అడగండి మీ డబ్బులు ఇస్తారు అని చెప్పారని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెబుతాడు ఆ బ్రాహ్మణుడు, ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పిండడు,కాని దారిలో ఆయన చివరి దాన ధర్మం విజయవంతం కావాలి, ఆ బ్రాహ్మణుడికి ఫలితం దక్కాలని ఆయన కైలాసం నుండి బ్రాహ్మణుడి కోసం భువి కి, దిగివస్తాడు ఆ దేవుడు. జరిగిన సన్నివేశం ఒక మిస్టరీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు డబ్బులు లేవు ఏం లేవు మాకు పోయేటప్పుడు మాకు చెప్పలేదు ,నీ మాటలు మేము నమ్మమము అని బదులిస్తారు. ఆ బ్రాహ్మణుడు చాలా బాధ పడుతూ కన్నీరు మున్నీరుగా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్ళక పోతే, మా కూతురి వివాహం ఆగిపోతుంది అని చాలా చాలా రోదిస్తాడు, అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పెది నిజమేనని భావించి మళ్ళీ ఒకసారి ఆయనను అడిగి విషయం తెలుసుకోని ఆ గదిలోకి వెళ్ళి ఫలానా దంతెను తొలగించి చూస్తారు, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఒక మూటలో భద్రపరిచిన డబ్బులు కనిపిస్తాయి, వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి బాధపడకు అని సానుభూతి తెలియజేసి అ డబ్బును అ బ్రాహ్మణుడికి అందజేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాకోసం ఆ పరమాత్మ స్వరూపుడైన బుడ్డా వెంగళరెడ్డి గారు నా కోసం అదేపనిగా వచ్చి నాకు దర్శన భాగ్యం కల్పించడూ అని చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.

అలా ఆ దానకర్ణుడు ఇచ్చిన మాట కోసం తన ఆయన కోసం దాచిపెట్టిన దానం వృథా కాకుండా ఆ బ్రాహ్మణుడి కోసం భూవికి వచ్చి తన మాటను నిలబెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు తెలిసి ఈ కలియుగం ఉన్నంతకాలం మన హృదయాలలో ఎప్పటికీ ఆ దైవ స్వరుపుడూ చిరకాలం కలకాలం బ్రతికే ఉంటారు.

· ఆయనను తలుచుకోని దానధర్మాలు చేస్తే చాలు ఆయన ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మనకు లభిస్తాయి.

4-ఆంధ్రా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి –శ్రీ చల్లా కొండయ్య

చల్లా కొండయ్య (Challa Kondaiah) (జ. జూలై 4, 1918 – ?) ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.[1]

వీరు అనంతపురం జిల్లాలోని చల్లావారిపల్లె గ్రామంలో చల్లా వెంకట కొండయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1918 సంవత్సరంలో జన్మించారు. వీరు తాడిపత్రిలో మెట్రిక్యులేషన్, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, చెన్నై లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. చెన్నైలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితికి ప్రధాన కార్యదర్శిగా కృషిచేశారు.

1944లో న్యాయవాదిగా నమోదుచేసుకొని కోకా సుబ్బారావు గారి వద్ద జూనియర్ గా చేరారు. 1948 నుండి సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. చెన్నై, గుంటూరు, హైదరాబాదు పట్టణాలలో తమ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారు. 1958లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సిల్ గా ఎనిమిది సంవత్సరాలు తమ విధి నిర్వహించారు.

1967లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1976లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, 1977లో తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. వీరు మార్చి 1979 నుండి జూలై 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి కాలంలో అనేక విజయాలు సాధించారు:

· హౌసింగ్ బార్డు జడ్జిమెంట్ ఆర్టికల్ 226 ని 151 ఐ.పి.సి.తో కొట్టేసి విజయం సాధించారు.

· భారత ఎమర్జన్సీ కాలంలో అక్రమ కేసులను కొట్టేయించారు.

· 12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శక సూత్రాలను సూచించారు.

· అర్బన్ లాండ్ సీలింగ్ ఛైర్మన్ గా ఆస్తుల పరిరక్షణకు న్యాయపరంగా సహాయం చేశారు.

· వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఛైర్మన్ గా ఉండి దేవాలయాలలో వారసత్వం హక్కును తీసేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి ఆధ్వర్యాన జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ను నియమించింది. దేవాలయాల ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం 1987 లో దేవాదాయ చట్టాన్ని చేసింది.[2]

· తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నిత్యాన్నదాన పథకాన్ని అమలుచేశారు.

· అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్సులోని ఆడిటోరియాన్ని ఇతని పేరుమీద జస్టిస్ చల్లా కొండయ్య ఆడిటోరియం గా నామకరణం చేశారు.[3]

5-పౌర మానవ హక్కుల ఉద్యమనేత –శ్రీ కె.బాలగోపాల్
కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.
జీవితచరిత్ర
విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి, వరంగల్‌లోని ఆర్ఈసీ నుంచి గణితంలో పీహెచ్‌డీ, 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిక, 1985లో ఉద్యోగానికి రాజీనామా, అప్పటినుంచి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు. మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రియాకాలనీలో నివసించారు. ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయురాలు. కుమారుడు ప్రభాత్. బాలగోపాల్ దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడ్డారు. 8.10.2009 గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

హక్కుల ఉద్యమ రంగం
పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాలగోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు. గణితశాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలువలకోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన నాయకుడాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తేవడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్‌గా ముద్రవేశారు. కొత్తగూడెంలో ఓసారి ఆయనపై దాడికి పాల్పడిన పోలీసులు చనిపోయాడని భావించి మురికికాల్వలో పడేసి వెళ్లగా పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆయన్ను కాపాడారు.

పౌరహక్కుల నుంచి మానవహక్కుల వైపు
రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. మార్క్సిజం నుంచి ఆయన పక్కకు పోవడంపై అప్పట్లో రచయిత్రి రంగనాయకమ్మ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ పుస్తకం రాశారు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం’, ‘చీకటి కోణం’ పుస్తకాలు సంచలనం సృష్టించాయి.

ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.

మేధోశక్తి, వ్యక్తిత్వం
26-27 సంవత్సరాలకే గణితశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అసమాన ప్రతిభా సంపన్నుడు. చదివింది గణితశాస్త్రం అయినా.. సామాజిక శాస్త్రాలు, పౌరహక్కులు, చరిత్ర, సాహిత్యం, రాజ్యాంగం.. ఇలా భిన్నరంగాల్లో లోతైన అవగాహన గల మేథావి. నిరాడంబరుడు. సామాజిక పరిస్థితుల అధ్యయనంలో భాగంగా వందలాది కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. విఖ్యాత రాజనీతిజ్ఞుడైన బెర్ట్రాండ్ రస్సెల్ దార్శనికత స్ఫూర్తిగా ప్రతి సామాజిక సంక్షోభంలోనూ ప్రజల తరఫున నిలబడటానికి ప్రయత్నించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలను, డీడీ కోశాంబి వంటి తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తకాలు రాశారు. హైకోర్టులో పేదలు, కార్మికులు, నిర్వాసితుల వంటి బాధితుల పక్షానే వాదించారు. నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి సంపదను కోట్లాది మంది జీవనోపాధికి ఉపయోగించాలి. సెజ్‌లు వంటి అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం స్థానిక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని, వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని నిర్భయంగా చెప్పే వాడు. ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.

రచనలు
· దళిత

· నిగాహ్

· మతతత్వం పై బాలగొపాల్

· రాజ్యం సంక్షేమం

· సాహిత్యం పై బాలగొపాల్

· హక్కుల ఉద్యమం

· ముస్లిం ఐడెంటిటీ : హిందుత్వ రాజకీయాలు

· కల్లొల లోయ

· జల పాఠాలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

హాస్యానందం 41- ప్రత్యుక్తి (రిపార్టీ-2

41- ప్రత్యుక్తి (రిపార్టీ-2
ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లగా అక్కడి పధ్ధతి నచ్చక డాక్టర్ పై ‘’ఏమయ్యా నువ్వు గొడ్ల డాక్టర్ వటగా ‘’అన్నాడు ఒక విసురు విసరాలని. ఆయన తక్కువవాడా ‘’అవునుకానీ,నీ జబ్బేమిటో చెప్పు .’’అన్నాడు పరమ ప్రశాంతంగా .’.మునిమానిక్యంగారు తనస్వంత అనుభవం ఒకటి చెప్పారు .’’నేను స్కౌట్ ట్రెయినింగ్ కు వెళ్లాను రావాల్సిన మాస్టర్లు ఇంకా రాలేదు .నాకంటే ముందుగా ఒక్కడ౦టే ఒక్కడే వచ్చాడు. ఆయన ఆస్కూల్ హెచ్ ఎం .ఆయనే ఆచంటసత్యనారాయణ .ఆయనే ముందు నన్ను పలకరించి తన ఊరుపేరూ వగైరా చెప్పాడు .’’నువ్వు ఎవరివిరా అబ్బాయీ ‘’అన్నాడు పుచ్చా పూర్ణా నందం గారిలాగా .’’నేను ‘’నా పేరు మునిమాణిక్యం నరసింహారావు ‘’ఆమాటకు బోల్డు ఆశ్చర్యపోయి వెనక్కి విరుచుకొని ‘’ఆ ! ఆ !అంటే నువ్వు ఆ కథలు గట్రా రాసేవాడివా ?’’అంటే అవునని ఒప్పెసుకొన్నాను .ఆయన కాసేపు గుడ్లు మిటకరించి చూస్తూ ‘’అయితే నువ్వు వాడి వే నన్నమాట .నీ కథలు చదివి నువ్వు ఎంతగొప్పవాడివో అనుకొన్నాను .ఓరి నీ దుంప తెగ నువ్వు వాడివేట్రా ?ఇట్లా అఘోరించావెం ?’’అన్నాడు .’’ఎట్లా ఉన్నాను ?’’అన్నాను .అమాయకం ఉట్టి పడుతూ .ఆయన నన్నో వింత మృగాన్ని చూసినట్లు చూసి ‘’ఎట్లా ఉన్నావా ?వెర్రి వెధవాయిలాఉన్నావు ‘’అన్నాడు .నాకు కోపం రాలేదు ఆయన మాట్లాడే పద్ధతిలో, ఆకంఠస్వరం లో ఏదో మాధుర్యం ఉంది ప్రేమ ఆప్యాయత కనిపించాయి .కాసేపు నవ్వుకొని ఇద్దరం స్నేహితులయ్యాం .
ఆచంట సత్యనారాయణ గారు అంటే మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడు 1954-55లో మా హెడ్ మాస్టారి పేరు ఆచంట సత్యనారాయణ గారే .ఇలాగే మాట్లాడేవారు ఆయనే ఈయనేమో !అయినా ఇలాంటి వారు చాలామంది ఉండిఉంటారు .
ట్రెయినింగ్ వారం రోజులూ ఇద్దరూ కలిసే తిరిగారు ఆయన వట్టి వెర్రి వాడిలాగా ప్రవర్తించాడు అందరూ ఇళ్ళకు వెళ్ళే రోజు వచ్చింది అప్పుడు నేను ఆయనతో ‘’ఏమయ్యా !మొదటి రోజున నన్ను వెర్రి వెంగళప్పలా ఉన్నావని అన్నావు .ఈ వారంరోజుల్నుంచి చూస్తున్నాను నువ్వూ వెర్రి వెధవాయి వే’’అన్నాను .మాటకు మాట అప్ప చెప్పాకదా అని సంబర పడ్డాను .ఆయన నన్ను మళ్ళీ వెర్రివాడుగా చూస్తూ ‘’ఈ సంగతి కనిపెట్టటానికి వారం రోజులు పట్టిందిరా సన్నాసీ!అనిఅనగా నా గూబ గు౦యి మన్నట్లయింది .అయితేనేం ఈ శబ్ద వ్యాపారం పరమ మనోహరంగా ఉంది ‘’అన్నారు మాస్టారు .
రిపార్టీలు రెండు రకాలు. ఒకసారి మనది అండర్ హాండ్ అవుతుంది దీన్ని డేరగోటరి రిపార్టీ అంటారు .మరోసారి మనదే పై చేయి అవుతుంది అప్పుడు దాన్ని కా౦ప్లి మెంటరి రిపార్టీ అంటారని మాస్టారు భాష్యం చెప్పారు .దీనికీ తనే ఉదాహరణ అంటూ ‘’హెడ్ మాస్టర్ కావాలని నాకు మహా ఉబలాటంగా ఉండేది .ఒక ప్రకటన చూసి మంగళగిరి జిల్లా పరిషత్ కు ఇంటర్వ్యు కు వెళ్లాను .ఏదో నామమాత్రపు ఇంటర్వ్యు .తమవాడికెవడికో దాన్ని కట్టబెట్టాలని కమిటీ ఆల్రేడి ననిర్ణ యించిందట .రోట్లో తలపెట్టాగా ?.వెళ్లి కమిటీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నా ..అది వాళ్లకు అవిధేయతగా తోచింది. నన్ను ఏడిపించాలనుకొన్నారు పరిషత్ అధ్యక్షుడు ముఖం చిట్లించి ‘’ఆకథలూ కాకరకాయలు రాసేవాడివి నువ్వేనన్నమాట ‘’అన్నాడు అవును అన్నాను .’’కథలు గీకేవాడివి హెడ్ మాస్టర్ గా ఎలా పనికొస్తావ్ ‘’అన్నాడు .నేను తలవంచుకొని అతి వినయంగా ‘’మాస్టారు గా పనికి రానని నాకూ తెలుసు కనీసం హెడ్ మాస్టర్ గానైనా పనికొస్తానని –అనీ ‘’అంటూ నసిగాను .ఇందులోనాదే పైచెయ్యి అయింది చివరికి .వాళ్ళ అహం దెబ్బతిని షాక్ అయ్యారు ‘’వెళ్ళండి మీ సంగతి మాకెందుకు?’అంటే ,’’’నేనూ అదే అనుకొన్నాను’’అంటే .మీ సంగతి నాకూ తెలుసు ‘’అంటూ బయటికి వచ్చేశాను .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-22-ఉయ్యూరు .

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.12వ భాగము.7.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.12వ భాగము.7.10.22

33

33

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )

తారాశంకర్ రాసిన ‘’నాగిని కన్యార్ కాహిని ‘’-నాగకన్య కథ అందరూమెచ్చినది .ఆయన ఆరోగ్య నికేతన్ నవలపై చర్చోపచర్చలు చాలా జరిగాయి .భారతీయ తత్వాన్ని ప్రతిబింబించే నవల ఇది .టాగూర్ తర్వాత వచన సాహిత్యంలో గోప్పస్థానం తారాశంకర్ దే.1930లో ఉత్తమ నవలారచయితగా పేరుపొందాడు .బిభూతి భూషణ్ ప్రతిభ నభూతో నభవిష్యతి .ఈయన ఏ రచయిత ప్రభావానికి లోనుకాని అరుదైన రచయిత .తారాశంకర్ సంప్రదాయబద్ధుడైన రచయిత .ఆయన ఎన్నుకొన్న ఇతి వృత్తాలే ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టాయి .తనకు బాగా తెలిసిన పల్లె సీమలనే ఆయన రాశాడు .వంగదేశంలో ఉత్తమ రచనలన్నీ గ్రామ సీమలకు చెందినవే .ఆయనది నిర్మోహమాటమైన కథాకథనం .భాషలో రామణీయకత ,పదును ఉంటాయి .ఆయన తన ప్రత్యక్ష అనుభావాలకుదూరంగా వెళ్లి రాసినవి ఆకట్టుకోలేకపోయాయి .వంగసీమ సాహిత్యకారులలో నిజమైన భారతీయత ఉన్న కొద్దిమందిలో ఆయన ఒకడు .అణువణువునా భారతీయత తొణికిసలాడే నూతనతర రచయితలుఆవిర్భవిస్తె, తారాశంకర్ బంధ్యోపాధ్యాయ కృషికి సంపూర్ణ సార్ధకత లభిస్తుంది .

తారాశంకర్ బందోపాధ్యాయ (23 జూలై 1898[1] – 14 సెప్టెంబర్ 1971) ప్రముఖ వంగ నవలా రచయిత. ఈయన 65 నవలలు, 53 కథా సంకలనాలు, 12 నాటకాలు, 4 వ్యాస సంకలనాలు, 4 ఆత్మకథలు, 2 యాత్రా వర్ణనలు వ్రాశాడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రబీంద్ర పురస్కార్, సాహిత్య అకాడెమీ పురస్కారం, జ్ఞానపీఠంతో పాటుగా పద్మభూషణ్ కూడా అందుకున్నాడు.

జాతీయోద్యమ సమయంలో ఆయన బీర్బూం స్థానిక కాంగ్రెస్ నాయకుడిగా పరిగణింపబడ్డారు.ఈ సందర్భంలో విదేశీ ప్రభుతవ ఆగ్రహకోపాలకు లోనయినారు. అందుఫలితంగా 1930లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం ఇతడు వలన జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అయితే సంవత్సర కాలం తరువాత విడుదలయ్యాడు. ఆ తరువాత ఇతడు పూర్తి స్థాయిలో సాహిత్యాన్ని వృత్తిగా చేపట్టాలనుకున్నాడు[3] . 1932లో రవీంద్రనాథ్ ఠాగూరుని శాంతినికేతన్ వద్ద మొదటి సారి కలిశాడు. ఇదే సంవత్సరంలో బందోపాధ్యాయ మొదటి నవల చైతాలి ఘుర్నీ వెలువడింది (వేసవి గాలిదుమారం) [2] దీనిలో ఆయన సృజన ఉత్తమ రచనా లక్షణాలు ఈ నవలలో కనిపిస్తాయి.

1940లో ఇతడు తన కుటుంబాన్ని కలకత్తాలోని బాగ్బజార్‌కు మార్చాడు. 1941లో ఇతడు బారానగర్‌కు మకాం మారాడు. 1942లో బీర్భూం జిల్లా సాహిత్య సదస్సును నిర్వహిస్తూ, కలకత్తా ఫాసిస్ట్-విరుద్ధ రచయితల, కళాకారుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1944లో కాన్పుర్ బెంగాలీ సాహిత్య కాన్ఫరెన్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1947లో ఇతడు ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనాన్ని కలకత్తా ప్రారంభించాడు. బొంబాయిలో జరిగిన ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనం రజతోత్సవానికి అధ్యక్షత వహించాడు. 1948లో కలకత్తా యూనివర్సిటీ ఇతనికి శరత్ స్మారక పతకం ప్రదానం చేసింది[2]. సాహిత్యంలో అకలుషితమైన, సహజమైన గ్రామసీమల సొగసును మునుపెన్నడూ లేని మౌలికతతో చిత్రించడానికి, సజీవమైనదాని కోసం, కొత్తదనం కోసం తహతహలాడే దేశవ్యాప్త ప్రజానీకానికి ఆసొగసును ఇంటింటికీ అందజేయటానికి తారాశంకర్ విస్తృతభూములు, వాని సంప్రదాయాలు, ప్రజల ఇతివృత్తాలను గాఢమైన ప్రేమతో చిత్రించటం ప్రారంభించారు.హసూల్ బకేర్ ఉపకధా , నాగినీ క్న్యార్ కహానీ అనే నవలలో ఆయన ఉపేక్షిత ప్రాంతాలను, నీల సఊందర్యాన్నీ, అడవి పూవులను, నాగరికతా విహీనమైన మానవదేహ సుగంధాన్నీ, నిర్మానుష్య, నిర్జనభూముల సొగసును, ప్రాచీనమైన మతాచారాలను, కొత్తవిధంగా వాస్తవ జీవితానికి తెచ్చారు.

1952లో ఇతడు పశ్చిమ బెంగాల్ శాసనమండలికి నామినేట్ చేయబడ్డాడు. 1952-60ల మధ్య ఇతడు పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తు (శాసన మండలి) సభ్యునిగా కొనసాగాడు. 1955లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇతనికి ఆ రాష్ట్రపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన రవీంద్ర పురస్కారాన్ని అందజేసింది. 1956లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇతడిని వరించింది. 1957లో ఇతడు ఆఫ్రో – ఆసియన్ రచయితల సంఘపు సన్నాహక కమిటీ సభ్యుడిగా సోవియట్ యూనియన్ దేశంలో పర్యటించాడు. తరువాత చైనా ప్రభుత్వం ఆహ్వానంపై భారతీయ రచయితల ప్రతినిధి వర్గ సభ్యుడిగా తాష్కెంట్ పర్యటించాడు[2].

1959లో ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి జగత్తరణి స్వర్ణపతకం పొందాడు. మద్రాసులో జరిగిన అఖిల భారత రచయితల సదస్సుకు అధ్యక్షత వహించాడు. 1960లో పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తులో సభ్యత్వం ముగిసిన తర్వాత రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నామినేట్ చేయబడి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగాడు. 1962లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1963లో శిశిర్‌కుమార్ పురస్కారాన్ని చేజిక్కించుకున్నాడు. 1966లో నాగపూర్‌లో జరిగిన బెంగాలీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. అదే సంవత్సరం భారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠంను గెలుచుకున్నాడు. 1969లో ఇతనికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. 1970లో వంగీయ సాహిత్యపరిషత్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఇతనికి కలకతా విశ్వవిద్యాలయం, జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించాయి. ఇతడు విశ్వభారతి విశ్వవిద్యాలయం, కలకతా విశ్వవిద్యాలయాలలో స్మారకోపన్యాసాలు చేశాడు[2].

ఇతడు 1916వ సంవత్సరంలో ఉమాశశీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతనికి సనత్‌కుమార్ బందోపాధ్యాయ, సరిత్‌కుమార్ బందోపాధ్యాయ అనే ఇద్దరు కుమారులు, గంగ, బులు, బని అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు[2].

ఆయనలోని ఆశ్చర్యకరమైన సర్జనశక్తి 70ఏండ్ల వార్దక్యంలోను తొణికిసలాడింది.ఆయన యత్రంలాగా పనిచేసి పలు రచనలు చేసారు.నాటకకర్తగా కూడా ఆయన విశేష కీర్తినిగాంచారు. అవి అప్పట్లో కలకత్తా నాటకరంగాలలో నిరంతరం ప్రదర్సించబడేవి. ఆయన రచన కవి మూలాధారంగా తీసిన సినిమా బహుప్రజాకర్షణ పొందింది.

అమృత అనే వారపత్రికలో ఆయన వ్రాసిన వ్యక్తి స్వభావచిత్రణలు మానవుని నాగరికత అస్తవ్యస్తతను తెలుపుతూ గీసారు.

బందోపాధ్యాయ తన స్వగృహంలో 1971 సెప్టెంబర్ 14న కన్నుమూసాడు. ఉత్తర కలకత్తాలోని నింతలా శ్మశానవాటికలో ఇతని అంతిమసంస్కారాలు జరిగాయి[2].

అవార్డులు
1955 – ఆరోగ్య నికేతన్ అనే నవలకు రవీంద్ర పురస్కారం 1956 – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1966 -గణదేవత నవలకు జ్ఞానపీఠ పురస్కారం.[4] 1962 – పద్మశ్రీ పురస్కారం 1969 – పద్మభూషణ్ పురస్కారం[5] 1948 – శరత్ స్మృతి పురస్కారం 1959 – కలకత్తా విశ్వవిద్యాలయంచేజగత్తరణి స్వర్ణపతకం

రచనలు]
ఇతడు అనేక నవలలను, కథలను రచించాడు. ఇతని కథలు బంగశ్రీ, ప్రబాసి పత్రికలలో ఎక్కువగా ప్రచురింపబడ్డాయి.[6]

ఇతని రచనల జాబితా

కవిత్వం
· త్రిపాత్ర (1926)

నవలలు
· చైతాలి ఘుర్ని (1928)

· పషన్‌పురి (1933)

· నీలకంఠ (1933)

· రాయ్‌కమల్ (1935)

· ప్రేమ్‌ ఓ ప్రయోజన్ (1936)

· ఆగన్ (1938)

· ధాత్రిదేవత (1939)

· కాళింది (1940)

· గణదేవత (1943) – మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించాడు.

· పంచగ్రామ్‌ (1944)

· మన్వంతర్ (1944)

· కవి (1944)

· బింగ్‌షో శతాబ్ది (1945)

· సాందీపన్ పాఠశాల (1946)

· ఝర్ ఓ ఝరాపాత (1946)

· అభిజన్ (1946)

· ఛోటోదర్ సాందీపన్ పాఠశాల (1948)

· పాదచిహ్న (1950)

· ఉత్తరాయణ్ (1950) – ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. మద్దిపట్ల సూరి తెలుగులోనికి అనువదించాడు.

· హంసులి బ్యాంకర్ ఉపకథ (1951)

· తమస్ తపస్య (1952)

· నాగిని కన్యార్ కహిని (1952)

· ఆరోగ్య నికేతన్ (1953)

· చంపదంగర్ బవ్ (1954)

· పంచపుత్తలి (1956)

· బిచారక్ (1957)

· సప్తపది (1958)

· బిపాష (1959)

· రాధ (1959)

· మనుషెర్ మాన్ (1959)

· డాక్ హర్కరా (1959)

· మహాశ్వేత (1961)

· యోగభ్రష్ట (1961)

· నా (1961)

· నాగరిక్ (1961)

· నిషిపద్మ (1962)

· యతిభంగ (1962)

· కన్నా (1962)

· కల్‌బాయిశాఖి (1963)

· ఏక్‌తి చరువై పాఖీ ఓ కలో మేయె

కథా సంపుటాలు
· చలనమొయి (1937)

· జల్‌సాగర్ (1938) – మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించాడు

· రాసకేళి (1939)

· తీన్ శూన్యొ (1942)

· ప్రతిధ్వని (1943)

· బెదెని (1943)

· ఢిల్లీ కా లడ్డు (1943)

· జాదూకారి (1944)

· స్థలపద్మ (1944)

· తెరొషొ పొంచాష్ (1944)

· ప్రసాద్‌మాల (1945)

· హరనో శూర్ (1945)

· ఇమారత్ (1947)

· రామ్‌ధను (1947)

· తారాశంకరెర్ శ్రేష్ఠ గల్ప (1947)

· శ్రీ పంచమి (1948)

· కామధేను (1949)

· తారాశంకర్ బందోపాధ్యాయయెర్ శ్రేష్ఠ గల్ప (1950)

· మాతి (1950)

· శిలాసన్ (1952)

· తారాశంకర్ బందోపాధ్యాయయెర్ ప్రియొ గల్పొ (1953)

· స్వ-నిర్బచితొ గల్పొ (1954)

· గల్ప-సంచయన్ (1955)

· బిస్ఫోరణ్ (1955)

· ఛోటోదర్ శ్రేష్ఠ గల్ప (1956)

· కాలాంతర్ (1956)

· బిష్పథర్ (1957)

· రబిబరెర్ ఆసర్ (1959)

· ప్రేమెర్ గల్ప (1961)

· పౌష్ – లక్ష్మి (1961)

· అలోకభిసర్

· చిరంతని (1962)

· ఆక్సిడెంట్ (1962)

· ఛోటోదర్ భలొ భలొ గల్పొ (1962)

· తమాషా (1963)

· గల్పొ పంచషట్ (1963)

· ఆయెన (1963)

· చిన్మయి (1964)

· ఏక్తి ప్రేమెర్ గల్పొ (1965)

· కిశోర్ సంచయన్ (1966)

· తపోభంగ

· దీపర్ ప్రేమ్ (1966)

· నారి రహస్యమయి (1967)

· పంచకన్య (1967)

· శిబనిర్ అదృష్ట (1967)

· గోబిన్ సింఘెర్ ఘోర (1968)

· జయ (1968)

· ఏక్ పష్ల బ్రిష్టి (1969)

· ఛోటోదర్ శ్రేష్ఠ గల్పొ (1969)

· మిచిల్ (1969)

· ఉనిష్ షో ఎకత్తర్ (1971)

నాటకాలు
· కాళింది (1942)

· దుయ్‌పురుష్ (1943)

· పథెర్ డాక్ (1943)

· ద్వీపాంతర్ (1945)

· యుగబిప్లబ్ (1951)

· కవి (1957)

· కాళరాత్రి (1957)

· సంఘట్ (1962)

· ఆరోగ్య నికేతన్ (1968)

ప్రహసనాలు
· చక్‌మకి (1945)

చరిత్ర గ్రంథాలు
· అమర్ కలేర్ కథ (1951)

· బిచిత్రొ స్మృతికహిని (1953)

· అమర్ సాహిత్య జీబన్, సంపుటం. I (1953)

· కొయిషొర్ స్మృతి (1956)

· అమర్ సాహిత్య జీబన్, సంపుటం. II (1962)

యాత్రాచరిత్రలు
· మాస్కో – తె – కోయెక్ దిన్ (1959)

వ్యాసాలు[మార్చు]
· సాహిత్యేర్ సత్య (1961)

· భరత్‌బర్ష ఓ చిన్ (1963)

· రబీంద్రనాథ్ ఓ బంగ్లర్ పాళి (1971)

సంకలనాలు[మార్చు]
· రచనా సంగ్రహ మొదటి భాగం (1959)

· రచనాబళి 25 భాగాలు

· గల్పగుచ్ఛ 3 భాగాలు

సినిమా రంగం]
ఇతని రచనల ఆధారంగా బెంగాలీ భాషలో బెదెని, అంతర్‌మహల్, జీవన్ మషాయ్, అగ్రదని, ఆంచల్, గణదేవత, దుయ్ పురుష్, హార్ మానా హార్, బిపాషా, హంసులి బాంకర్ ఉపకథ, సప్తపది, బిచారక్, జల్‌సాగర్, రాయ్‌కమల్, కవి మొదలైన సినిమాలు వెలువడ్డాయి. ఇతడు ఆమ్రపాలి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. గణదేవత, రాయ్‌కమల్ సినిమాలకు పాటలు కూడా రచించాడు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొండను అద్దంలో -2

కొండను అద్దంలో -2

మరో రెండు –ఇంకో నాలుగు  

మరోరెండులో -1-శ్రీ సరికొండ నరసింహ రాజు రాసిన ‘’నెత్తుటి పాదాలు ‘’కవితా సంపుటి –ఇందులో 77స్వీయకవితలున్నాయి .మనిషి ఎప్పుడూ అజేయుడే ,మనిషితనం దీపం చుట్టూ మాడే శలభాలుగా గోచరించాయి .కరోనాలేని లోకాన్ని ఆహ్వాని౦చాడు కవి .త్యాగాల పొద్దులో ఉదయించే మనిషి ఎప్పటికీ ఓఅఖండ సేవాగీతం,అరచేతులు అడ్డ౦ పెట్టి ,ఆకుపచ్చ దీపాలమై రైతన్న బతుకు భరోసాఇద్దామన్నాడు  .కన్నీటి పాదాలే తనకవితాపాదాలు. మనిషి ఎప్పటికీ కాలశిఖరం పై గెలుపు జండా ఎగరేస్తాడని ధీమా గా అన్నాడు .ప్రతిమనిషి అనురాగపు నేలలో ఆకుపచ్చని చెట్టై విస్తరించాలని హితవు చెప్పాడు .గానగంధర్వ బాలు అంటే ‘’పాటల చనుబాలు ‘’అంటాడు .ఆకలి మాట్లాడితే రహదారులపై నెత్తురు పులిమే వలసకూలీల పాదముద్రల్లా ఉందట. ఇంటితాళ౦ చెవి పారేసుకొని ‘’కాలమా కనిపిస్తే తెచ్చివ్వు ‘’అన్న అమాయకుడు .పీలికలై ఎగిరే జ౦డాలుకాదు.-ఎక్కుపెట్టినజండా కర్రలకే వందనం చేస్తాడుకవి .త్యాగాలపొద్దులో సరిహద్దు సైనికునిలా ఉంటాడు.’’అతడు మన ఎదుట లేకున్నా ,అతడు తీసిన ఛాయా చిత్రాలలో సజీవుడే అని ఫోటోగ్రాఫర్ ను ,మన టేబుల్ పై పేపర్ వెయిట్ లా ఉండాల్సిన పేపర్ బాయ్ –కరోనా గ్రస్తుడై ,పాతపేపరై ఎక్కడో అనాధగా పడి ఉన్నాడని బాధపడ్డ మనసున్నకవి సరికొండ నాగరాజు .

  నాగార్జున సాగర్ నీటి పారుదలశాఖలో సీనియర్ అసిస్టెంట్ అయిన ఈకవి ఒక విధ్వంసక ముఖచిత్రం ,వచన కవితా సంపుటి ,ఒకే ఒక సిరా చుక్క నానీల సంపుటి ,మిత్రశతకం పద్యకావ్యం వేకువ చెలమ గేయసంపుటి వంటివి రాసి లబ్ధ ప్రతిష్టితుడయ్యాడు .ఎక్స్ రే అవార్డ్ లు రంజని-కు౦దుర్తిఅవార్డ్ ,ఆంధ్ర సారస్వతసమితి అవార్డ్ ,అద్దేపల్లి పురస్కారం వంటివి ఎన్నో పొందాడు .ప్రతి అక్షరం లో కవిత్వాన్నిఒలక బోసిన కవి అనిపించాడు .

2-డాక్టర్ నూనె అ౦కమ్మారావు –రాసిన ‘’యోచన –లోచన ‘’వ్యాస సంపుటి .ఒంగోలు నాగార్జునడిగ్రీ కాలేజి ఆంధ్రోపన్యాసకుడు .మంతెన సూర్య నారాయణ రాజు కథలపై పరిశోధన చేశారు .తెలుగు సిరి ,వ్యాస సంపుటి ,తెలుగు జిలుగులు పద్య గద్య సంపుటి ,పదునెక్కినకవనం ,సాహితీ మూర్తులు వగైరా రచనలతో ప్రసిద్ధులైనారు .

  ఈ పుస్తకం లోతెలుగు సాహిత్యం లో పద్య మధురిమలు తో ప్రారంభించి బడుగు జీవుల బతుకుల్లోకరోనాకస్టాలు అనే 21వ్యాసం తో పూర్తి చేశాడు .తెలుగు సాహిత్యం లో సామాజిక దృక్పధం, హేతువాద ప్రశంస, గురజాడ దేశ భక్తీ జాషువా రచనా వైశిష్ట్యం ,చెంచులు –ఎరుకల జీవన విధానం ఇతర వ్యాసాలూ అన్నీ చాలా పకడ్బందీగా పూర్తి వివరాలతో ఉన్నాయి .ఆసక్తిగా చదివించే గుణం ఉన్న వ్యాసాలు .కాళ్లకూరివారి అద్భుత సృష్టి చి౦తామణినాటకం అని మెచ్చారు .ప్రాదుర్భావ కవితా మాండలీకాలను విపులంగా చర్చించారు .రచన హాయిగా మనసును తాకేట్లుంది .చదివి ఆనందించాల్సిన వ్యాసాలు.  . 

ఇంకోనాలుగు –లో శ్రీఅప్పాల శ్యామ ప్రణీత శర్మ అవధాని గారి 1-వ్యాస ప్రణీతం 2-సర్వ దేవతా ప్రవరమంజరి 3-జాతక కళా నిధి 4-జీర్ణోద్ధారణ విధి ఉన్నాయి .రచయిత వేదపండితులు .వీరు తెలంగాణాలో మంచిర్యాల్ జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ నివాసి .ఆయనకు నేను ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాననీ నా రచనలు మెయిల్స్ లో కూడా చదువుతున్నానని నాలుగైదేళ్ళ క్రితం ఫోన్ చేస్తే సరసభారతి పుస్తకాలు పంపాను సహృదయత మూర్తీభవించిన వారు పంపిన పుస్తకాలు నిన్ననే వ నాకు అందాయి .వెంటనే ఫోన్ చేసిచెప్పగా అభిప్రాయం రాయమన్నారు .చదివి రాస్తున్నాను .

1-వ్యాస ప్రణీతం –సనాతన ధర్మలో చెప్పబడిన అనేకా౦శాలను ప్రమాణ పూర్వకంగా ఈ తరానికి సామాన్య భాషలో రాసిన ఇరవై వ్యాసాల సంపుటి. 92వ పేజీలో QRకోడ్ ను స్కాన్ చేస్తే రుద్రాధ్యాయ విశిష్ట త అనే వ్యాసం టెక్స్ట్ రూపం లో వచ్చేట్లు ముద్రణలో సరికొత్త ప్రయోగం చేశారు .ఉమాశ౦కర సంవాదంగా గురుగీత ,అద్వైత దర్శన దీప్తి,దేశ సమైక్యతా స్పూర్తి గా ఆది శంకరాచార్య,యజ్ఞం పర్యావరణ హితం చేస్తుందనీ ,,సంస్కృతతగ్రామం మత్తూర్ సనాతన భారతీయ వైభవమని ,రాముని విలువల ప్రయాణమే రామాయణమని ,దేవతల వాహనాలు వైవిధ్యానికి ఆనవాళ్ళు అనీ ,కరపత్రస్వామి ధర్మ సామ్రాట్ అనీ ,విద్యాసిద్ధి సరస్వతి అనీ ,చెప్పి రుద్రాధ్యాయ ,శిమ మహిమ్నస్తోత్ర వైభవాలు వివరించి ,శివ నిర్మూల్యాన్ని సాలగ్రామ స్పర్శతో స్వీకరించవచ్చుననీ చెప్పారు .విష్ణుతత్వం విశ్వమంతా వ్యాపించి ఉందని ,,చివరగా సకల శ్రేయస్సులు మూర్తి ఆరాధన వలన కలుగుతాయని హామీ ఇచ్చారు .అన్నీ అన్నే .అమృత భాండం .ఆధ్యాత్మిక చి౦తన కలవారికి .

2-సర్వ దేవతా ప్రవర మంజరి-దేవ, దేవీలకళ్యాణ సమయాలలో పఠించే ప్రవలను సేకరించి దీన్ని అందించారు .ఇందులో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర  ,వల్లీ ,దేవసేనా ,సూర్యనారాయణ ,గో వృషభ ,కృష్ణ సత్యభామ రుక్మిణి రాధ ,వీరభద్ర ,శివ జ్ఞాన ప్రసూనాంబ ,సువర్చలా హనుమ ,మొదలైనవేకాక యాజ్ఞ్యవల్క్య మైత్రేయీ ప్రవరలుకూడా ఉన్నాయి. గొప్ప సేకరణ .అర్చకుల ,ఆలయ యజమానుల వద్ద ఉండాల్సిన పుస్తకం .

3-జాతక కళానిధి – ప్రాచీన జ్యోతిష గ్రంథాన్ని పరిష్కరించి రాసిన సిమ్ప్లి ఫైడ్ ఫలితాల పుస్తకం .నవగ్రహాలు జాతక చక్రంలో 1నుంచి 12 వ స్థానాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలను చక్కగా టూకీగా వివరించారు

4-జీర్ణోద్ధారణ విధి –దీన్ని ఆగమ ,పురాణ ప్రమాణాలతో సాధికారికంగా రాశారు శర్మగారు .ఇందులో జీర్ణమూర్తి పూజ ,అఘోర మంత్రజపం ,అగ్ని ప్రతిష్టాపనం ,కళాపకర్షణ ,పాదస్థానం ,నుంచి మూర్ధ స్థానం వరకు ,కళాపకర్షణ ఉన్నది .తర్వాత పాశుపతమంత్రహోమం ,బేర  జీర్ణోద్ధారణం అంటే ప్రతిమ లేక విగ్రహ జీర్ణోద్ధారణ విధానం ,సమంత్రకంగా సవివరంగా రచించారు .కావాల్సిన పదార్ధాల జాబితా కూడా చేర్చారు .ఆలయ అర్చకులకు ఈ గ్రంథం చేతిలో చింతామణి .అసక్తిఉన్నవారికి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి .

  ఇంతటి ఆధ్యాత్మిక సంపదను చక్కని ముఖ చిత్రాలతో ,చిత్రాలతో బోల్డ్ టైప్ లో సరసమైనధరలో అందించిన ప్రణీతశర్మగారికి, వారి  విద్వత్తుకు ప్రణామాలు .

 శర్మ గారి సెల్ నంబర్ -9440951366

ఇమెయిల్-aspsharma 84@gmail.com

Vaidikagrandhanidhi .blogspot .com

  అనుకోకుండా ఇవాళ పొద్దున్న 4,ఇప్పుడు 6పుస్తకాలను అంటే మొత్తం 10పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.23వ భాగం.7.10.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.23వ భాగం.7.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కొండను అద్దం లో

‘ ‘ కొండను అద్దం లో ‘’
ఇటీవల నాకు అందిన పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ పై శీర్షిక పెట్టాను .1-ఏదినిత్యం ?-బెజవాడ వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డా .మక్కేన శ్రీను గారు రాసిన కథా సంపుటి ఇది .ఇప్పటికే జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ,వెన్ను విరిగిన కంకులు ,గోరంతకవిత వగైరా రచనలతో ప్రసిద్ధి కెక్కారు .ఆయన రాసి ప్రచురించినవి నాకు ‘’గౌ.మాస్టారు గార్కి ‘’అని పంపటం వెంటనే చదివి నేను స్పందించి రాయటం జరుగుతూనే ఉంది .ఈ పుస్తకం జులై 26 అందినా నాదృష్టి పడలేదిప్పటివరకు .దీన్నిఆయన తోబుట్టువులకు అంకితమిచ్చారు .ఇందులో నిత్యజీవిత సత్యాలను ఆవిష్కరించారు .సాంగత్యం నుంచి దేశభుక్తిదాకా 10కథల బంగారమిందులో ఉంది .భార్యాభర్తలమధ్య ఉండాల్సిన సాహచర్యం ,కొడుకులు లేని అత్తామామాలకు అమెరికాలో అల్లుడే కొడుకుగా వ్యవహరించటం ,విద్య వినయంతో వికసిస్తు౦దనటం ,రిక్షా తొక్కే పెద్దాయనలో మార్గదర్శిని చూచే సంస్కారం ,వృత్తి దర్మం తప్పకుండా పేద వాళ్ళ శ్రేయస్సుకోసం హాస్పిటల్ నడపటం ,,అవస్య ప్రాప్యమైన విధిని ఎవరూ తప్పించ లేరనటం ,వృత్తిపరంగా ఇష్టమైనదాన్ని రిటైర్మెంట్ వలన కోల్పోయినదాన్ని,కొన్ని విషయాలకు ప్రకృతి చెక్ పెడుతు౦దను కోవటం ఓష్టోష్టమాలు తప్ప ఏమీ లేని కవితా ప్రహసనం,చర్మాన్ని వెర్నియర్ కాలిపర్స్ ద్వారా పరీక్షించి రాంక్ లిస్తే ,తాను తోలు మ౦ద౦ గాడిని కాదనననుకోవటం,పల్లెలు పరిపుష్టిగా పరిఢవిల్లడమే దేశ ప్రగతి, బడి వ్యవసాయం కంటే ఊరికి మనం తీర్చుకొనే ఋణం ఏదీ లేదు అన్న సత్యాల కతా కమామీషు ఈసంపుటి. డాక్టర్ గారి పదునైన రచనకు సాక్ష్యం .
2-డా నాగులపల్లి భాస్కరరావు గారి ‘’గ్రామాలు గర్వించే లా ఉండాలిగా –మా ఊరే ఒక ఉదాహరణ .తాము పుట్టి పెరిగిన కృష్ణాజిల్లా ముదునూరు గ్రామం గురించి రాసి తలిదండ్రులకు అంకితమిచ్చారు భాస్కరరాగారు .1962లో ఢిల్లీ వెళ్లి ,తర్వాత 28సార్లు ప్రతి సంవత్సరం ముదునూరు వస్తూ అక్కడి వారిపరిచయాలతోకోద్దోగోప్పో నేర్చుకొని ఢిల్లీ వెళ్ళేవారు .ముదునూరు అంటే అన్నిటా ముదిరినవూరే .1920లో సంస్కృత సాహిత్యంలో చొరవ,1930లో స్వాతంత్ర్యపోరాటంలో చేయికలపటం ,1940లో సాంఘిక విప్లవానికి నాంది ,1960లో గ్రామాభి వృద్ధికి కృషి ,1970లో రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికిన ఊరు ముదునూరు .సర్వశ్రీ అన్నే అంజయ్య ,కలాపాల సూర్యప్రకాశరావు ,కేశవాచార్య ,ముదునూరు చంద్ర శేఖరయ్య ఆనాటి తరం పెద్దలు అభి వృద్ధికి మార్గదర్శకులు .ఇక్కడి బూశమ్మ తిరుణాళ,పిల్లాకోటమ్మ పౌరుషం ,గోరాగారి సాంఘిక విప్లవం ఇక్కడే .కాకతి రుద్రమదేవి రాణీ కాకముందే ముదునూరు వచ్చింది ,ఇక్కడి శివాలయ రామాలయాలు రుద్రమకాలం నాటివే .ఆమెకు అక్కడి దేవాంగులు చీరలు బహూకరించారట .ఆమె మెచ్చి బహుమానాలిచ్చారట .ఇప్పటికీ ఆరేడు చెరువులున్నాయి .కొన్ని మఠాలుకూడా ఉండేవి .స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిపని చేశాయి .గ్రంధాలయం ,శ్రీమతి కొల్లి అ౦బమ్మ గారు కట్టించిన పాఠశాల,వందేళ్ళ నుంచి జరుగుతున్న బూసేమ్మ తిరుణాళ అనే ముగురమ్మల ముదునూరుగా ప్రసిద్ధి
భాస్కరరావు గారి తండ్రి సీతారామయ్య గారు కో ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేసిన హిందీ మాస్టారు . ఇలాంటి ఎన్నెన్నో గ్రామవిశేలతో ,గ్రామవికాసానికి రాష్ట్ర వికాసానికి తోడ్పడిన గ్రామ ప్రముఖుల విశేషాలతో ఇప్పుడు తాను గ్రామంలోన్ స్థాపించి నిర్వహిస్తున్న ‘’జీవిత చరిత్రల గ్రంథాలయం ‘’విషయాలు చెప్పారు .పేరుకే గ్రామంకానీ నగరాల కంటే అభివృద్ధి బాగా జరిగిందని గర్వంగా చెప్పారు డా భాస్కరరావు .కానీ ఆయన ఆగ్రామ చరిత్రలోఅక్కడ గ్రామ వికాసానికీ ,సాహిత్య సాంస్కృతిక వికాసానికి రాత్రి పాఠశాలలు పెట్టి హరిజనులకు విద్య నేర్పటానికి యువతలో వృత్తి విద్యా నైపుణ్యం పెంచటానికి కృషిచేసిన సోషల్ మాస్టార్ ఆతర్వాత నూజివీడులో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రిన్సిపాల్ అయిన శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి ఒక్కమాట కూడా రాయకపోవటం ఆశ్చర్యం కలిగించింది .’’మహాత్ముల బాటలో ‘’అనే ఆయన జీవిత చరిత్ర ఎందరికో మార్గదర్శనం చేసింది .బాలభారతి స్థాపించి ఎన్నోకార్యక్రమాలు చేసి,రేడియోలో ప్రదర్శనలిచ్చి ఇప్పించి మా ఉయ్యూరులో కూడా శ్రీ వంగల కృష్ణ దత్తు గారింట్లో బాలభారతిస్థాపించి మమ్మల్ని ఉత్తేజితులను చేశారు మాస్టారు .అలాంటి వెంకటేశ్వర రావు గారిగురించి భాస్కరరావుగారికి తెలీకా ,లేక కావాలనే వదిలేశారా ?వెంకటేశ్వరావు గారు మాలాంటి వారికి గొప్ప మార్గదర్శి ఆదర్శ ఉపాధ్యాయులు .అంటే కాదు అక్కడి హైస్కూల్ హెడ్ మాస్టర్లు శ్రీ ఘంట వెంకట్రామయ్యగారు ,శ్రీ సోమంచిరామం గారు చేసిన విద్యాభి వృద్ధి వీరి గ్రామ చరిత్రకు ఎక్కలేదు .
3-శ్రీ మహమ్మద్ సిలార్ గారు రాసిన ‘’కృష్ణా జిల్లా జమీందారులు –రైతాంగ ప్రజాపోరాటాలు ‘’. సిలార్ గారి ‘’పెరిప్లస్ యాత్ర ‘’గురించి ఇటీవలే చాలా విపులంగా రాశాను .ఇందులో చల్లపల్లి అనే దేవరకోట జమీన్ నుంచి మునగాల జమీన్ ల చరిత్ర అందులో జరిగిన రైతాంగ పోరాటాలు అత్యంత విస్తృతంగా పూసగుచ్చినట్లు వివరించారు .ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి .సిలార్ గారుకొండను తవ్వి ఎలుకను కాదు ఏనుగును ఎలుగుబంటిని పట్టుకొనే సాఃహసి . సతీసహగమన దురాచారన్నీ వివరించారు.బందర్లో సతీసహగమన ఉన్నట్లు ఇటాలియన్ యాత్రికుడు’’ పెట్రా డెల్లావల్లే ‘’రాశాడని చెప్పారు.ఒక మంగలి వానిభార్యమంగమ్మ భర్త చానిపోతే 19రోజులైతే తెల్ల చీరతో వంటినిండా నగలు ,తలనిండా పూలు పెట్టుకొని పెట్రో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పగా ‘’నాకు ఆమెకన్నా ఎక్కువ దుఖం కలిగింది ‘’అని రాశాడు 1623-1624 యాత్రికుడు పెట్రో .సహగమనం చేసే స్త్రీకి ఉమ్మేత్తరసం సారాయిలో కలిపి తాగిస్తారని ఆమె తెరుపు మరుపులో పదడి విమూఢా వస్తలో మంటల్లో దూకేస్తుందనీ ‘’ఫ్రయర్ ‘’రాశాడు .బందర్లో ఒక నేత పనివానిభార్య ,ఒకకాపువాని భార్య ,ఒక స్వర్ణకారుని భార్య సహగమనం చేయటం తాను కళ్ళారా చూశానని ‘’మెత్ వోల్డ్ ‘’రాశాడు .సహగమనం జరిగాక చితాభస్మం పోగేసే నెపంతో ఆమె వంటి బంగారం వెండి ఏరుకొని ,ఆమెపేర కట్టినపేరంటాలు దేవాలయం హుండీ సొమ్ము కాజేసి బ్రాహ్మణ వర్గం పంచుకుంటారని చెప్పారు .బెర్నియర్ స్వయంగా సహగమనాలు ఆపాడు .అరుదైన విషయాలతో అలవోకగా చెప్పెకథల్లాఆద్యంతం అలరిస్తూ , ఈ జమీందారీ లగురించి రాసిన సిలార్ గార్ని అభినందిస్తున్నాను .
4-లయన్ శ్రీ బందా వెంకటరామారావు గారు రచించిన ‘’పాండవ పట్టమహిషి ద్రౌపది ‘’ద్రౌపదిపై గొప్ప పరిశోధన ,విషయ సంకలనం చేసి రాయారావు గారు రాసిన పుస్తకం .ఇప్పటికే భరద్వాజ, రావణబ్రహ్మ ,మహాలక్ష్మీ పురాణం వగైరా రచనలతో లబ్ధ ప్రతిష్టులయ్యారు .అన్న కృష్ణుడి లాగా చెల్లి కృష్ణా కూడా జగత్కల్యాణ౦ కోసం ,శిష్ట రక్షణకు దుష్టశిక్షణకు అవతరించిన ఒక శక్తి అంశ .సృష్టి,వర్ణాశ్రమధర్మాలు, కాలగణనన ,జ్యోతిష్య౦ తో ప్రారంభించి జయం అనబడే మహాభారతం గురించి చెప్పి ,,భారతపాలక వంశ వృక్షాలను వర్ణించి ,ఇతిహాస పురాణాలనాటి వివాహ వ్యవస్థ వివరించి ,పాంచాలరాజు ద్రుపదుని చరిత్ర చెప్పి ,ద్రౌపది జననం ,వివాహం గృహిణిగా ఆమె నిర్వర్తి౦చినధర్మం ,,పొందిన పరాభవం ,అరణ్య అజ్ఞాతవాసాలు వర్ణించి ఆమె రాజనీతిగురించి వ్యాఖ్యానించి ,ఆమె రణతంత్ర కౌశలం అభి వర్ణించి ,ఆశ్వత్థామాదులపై ఆమె చూపిన క్షమాగుణం లో ఆమె ఔన్నత్యాన్ని వివరించి , పాండవ పట్టమహిషిగా యుధిష్ఠిరుని గౌరవం పెంచిన విధానాలు వర్ణించి,చివరగా ద్రౌపది మహాప్రస్థాన౦ తో ముగించారు .పౌరుష ప్రతాపాలు చూపిన ఆశక్తి స్వరూపిణి భారత స్త్రీలకూ ఆదర్శప్రాయులన్నారు .మానవజాతి ఉన్నంతవరకు భారతం, ద్రౌపది ఉంటారు అన్నారు లయన్ రామారావు గారు .మధ్యమధ్యలో ‘’మనలో మాట ‘’అంటూ మరిన్ని విషయాలు జోడించారు .వయసుమీద పడినా ఆయనలో రచనాపటిమా ,పరిశీలనా దృష్టీ తగ్గలేదని నిజంగా’’ లయన్’’ గా నే ఉన్నారని ఈ పుస్తకం రుజువు చేసింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం41-  ప్రత్యుక్తి (రిపార్టీ )

హాస్యానందం
41-  ప్రత్యుక్తి (రిపార్టీ )
హాస్యంగా అన్నమాటకు అవతలివాడు గోడకు బంతి తగిలి తిరిగి వచ్చినట్లు అంతకన్నా హాస్యంతో లాగి కొట్టటమే ప్రత్యుక్తి .రిపార్టీ అంటారు మ్లేచ్చులు .ఉదాహరణ –భార్య ఇంటిఖర్చులకోసం పది రూపాయలు అడిగితె ,ఇది వరకు ఇలా ఇస్తే నిమిషం లో హుష్ కాకి చేసిందని కోపమొచ్చి ‘’ఎప్పుడూ డబ్బు గోలే .డబ్బు డబ్బు డబ్బు అని కలవరిస్తావు.ముందూ వెనకా ఆలోచించవు .అసలు నీకు తెలివి తేటలు ఏడ్చి చచ్చాయా ?”’అన్నాడు అగ్గిరాముడై .’’భార్య ‘’అది మీదగ్గర దొరకదుకదండీ .అందుకే డబ్బు అడుగు తున్నాను ‘’.ఇది సరసంగా అంటించిన మాట. మేధా పౌష్కల్యం ఉన్న వారే ఇలా అంటించగలరు అన్నారు ముసిముసి నవ్వులతో మునిమాణిక్యం మాస్టారు .మరో కత –‘’ఒక సారికోపంతో మా కాంతాన్ని ‘’ఇలా స్టుపిడ్ లా మాట్లాడతావెం ?’’అన్నా ఎక్కడోకాలి .ఆవిడ పరమ శాంతంగా ‘’అలా మాట్లాడితేకానీ మీకు తెలియదాయె చచ్చి. మరేం చేద్దును మహానుభావా ?’’అంది .అందులో ఉన్న చమక్కు కాస్త ఆలోచిస్తేకాని నాకు బోధ పడలేదు. బల్బు వెలిగాక ఎంత దెబ్బకొట్టింది కాంతం ‘?’అనుకున్నాను అని మాస్టారు కథ చెప్పారు .
  ‘’టైమూర్ ది లంగ్’’ హాస్యం –టైమూర్ మనదేశం పైకి దండెత్తి వచ్చాడు అప్పుడొక నగరంలో ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతం .ఆ వూళ్ళో ఉన్న సంగీత విద్వా౦సురాల్ని పిలిపించి సంగీతంపాడమంటే అద్భుతంగా పాడింది .మెచ్చి పారితోషికమిచ్చి ‘’అమ్మా !నీగానం మనోహరం.కానీ నీ గాన దేవత గుడ్డిదై ఉండాలి .లేకపోతె నీలాంటి కురూపిని ఆశ్రయించి ఇంతటి ప్రజ్ఞావంతు రాలని చేస్తుందా ?’’అన్నాడు .ఆమెధైర్యంగా ‘’ నిజమే మీరన్నది .ఆమెఒక్కతే  గుడ్డిది కాదు జహాపనా .లక్ష్మీదేవి కూడా గుడ్డిదే .లేకపోతె ,మీ వంటి కుంటి వాడి ని వరించి ఇంతటి మహా దైశ్వర్యమిస్తుందా ??అని రిపార్టీతోకొడితే గురుడు అవాక్కై,గింగిరాలు తిరిగిపోయాట్ట .
అడిదం సూరకవి ఒకసారి వీధిలో వెడుతుంటే ,భయంకరమైన కుక్క ఒకటి కరవటానికి వచ్చింది .ఆయన పరుగు లంకించుకొన్నాడు .ఆ వీదిచివర గుమిగూడిన వాళ్ళు ‘’అంతభయ పడ్డావేం ?గాడిదలాగా పరిగెత్తుకోచ్చావు??’’అన్నారు ..ఆయన ‘’అవును కుక్క కరుస్తుందని పరిగెత్తుకొచ్చా .ఇక భయంలేదు స్వజనం లో పడ్డా.’’అని అందర్నీ గాడిదల్ని చేశాడు .అందరూ ఫకాల్న నవ్వారని మాస్తారువాచ ‘
  రిపార్టీ కత్తి యుద్ధం లాంటిది స్వోర్డ్ ప్లే అన్నారట .ఇందులోని వ్యక్తులు ఒకర్నొకరు మాటలతో గాయపరచాలను కొంటారు .మెరుపు మెరిస్తే కలిగే ఆనందం రిపార్టీలో పొందచ్చు నంటారు నరసింహారావు జీ .ఇద్దరు మాట్లాడుకొంటున్నారు .తీవ్రత పెంచారు ఒకాయనకు కోపం వచ్చివెళ్ళిపోతూ  ‘’నాకు తెలివి తక్కువ స్టుపిడ్ మనుషులతో  మాట్లాడే ఓపిక తీరికా లేవు ‘’అన్నాడు .రెండో వాడు అతి నిర్వికారంగా ‘’నాకు చాలా ఉంది రావయ్యా ‘’అన్నాట్ట .అని మాస్టారన్నారు .మరో పుంజీడు రిపార్టీలు ఈ సారి .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.11వ భాగం.6.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8

ద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8

రాయ్ కమల్ కథనే తారాశంకర్ ఆతర్వాత నవలగా రాశాడు .ఆనాటి వైష్ణవులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది వారి దృష్టిలో ప్రేమ వ్యక్తిగతమైనది భౌతికం కాదు .నిజమైన ప్రేమ శ్రీ కృష్ణునిపైన మాత్రమె ఉంటుంది.గీత గోవిందకర్త జయదేవుడు బెంగాల్ బీర్భం  లో  నివసించిన వాడే  .ఈయనకు ముందుకూడా వైష్ణవం ఉంది .చైతన్యప్రభువు విస్తృతం చేశాడు .వైష్ణవాదిక్యమున్న గ్రామం లోని కమలిని కథ ఆనవల .విశిష్ట ప్రేమకథ .ఉదాత్తనవల..సంగీత నాట్యాలలో ప్రవీణులైన వారకాంతల జీవితాలను ఆయన స్వయంగా పరిశీలించి ,వారు మానవ ప్రేమకు అధిక విలువనిస్తారని గ్రహించాడు .

  ‘’హన్సూలీ బంకర్’’ అనే తారాశంకర్  నవల అత్యుత్తమనవలగా పేరు పొందింది .బీర్భం జిల్లాలో కొపై నది వంపులు తిరిగి స్త్రీలు ధరించే హన్సూలీ అనే కొడవలి ఆకారంలో మెడలో దండలాగా ఉంటుంది .ఈ వంపు మధ్యప్రాంతం వెదురు పొదలనిలయం . వెదురును బంషి అంటార్ బెంగాలీలో .కనుక ఈ ప్రాంతం బంషీ బారి అయింది .జన్గాల్ జమీందార్లకు చెందింది .కహార్ జనం పోలాలను కౌలుకు సేద్యం చేస్తారు .సుచాంద్ అనే ముసలావిడ గడచిన తరానికి ప్రతినిధి .జమీందార్ల దోపిడీ నుంచి తప్పించుకొని విముక్తి కోసం రైల్వే ఫాక్టరీ లో పని వారు గా వెళ్లాలనుకొనే వారిని  కహార్లనాయకుడు బనోరి ప్రతిఘటిస్తూ ఉంటాడు .ఇక్కడే ఉండి సనాతన వ్యవస్థను వ్యతిరేకిస్తాడు .చివరికి అతడూ రైల్వే కార్ఖానాలో పని చేస్తాడు .వర్తమానం లో జీవించటానికి భయపడే తోటి వారిని హేళన చేస్తాడు .గ్రామ దేవత ‘’కర్తా ‘’కు అభిమాన పాత్రగా విశ్వసించే నల్లత్రాచును అతడు చంపుతాడు .దీనితోకరాలీకి ఇతనికి సంఘర్షణ ఏర్పడుతుంది .అతని సాహసానికి పోలీస్ ఇన్స్పెక్టర్ బహుమతి ఇస్తాడు .దీనితో గ్రామస్తులచేత అవమానం పొందుతాడు .గ్రామకట్టుబాట్లు లెక్క చేయకుండా కరాలీ ఒక వివాహితస్త్రీతో గ్రామం వదిలి వెళ్ళిపోతాడు .కరాలీ  తనకు విరోధిగా మారుతున్నాడని బనోరి భయపడతాడు .తనప్రజలు ఆవాస్తావిక జీవితంలో బతుకుతున్నారని కరాళి బాధపడతాడు .కొడవలి వంపు ప్రాంతం లో పూర్వం నీలి పంట బాగా పండించేవారు .జమీందార్లు కూలీలను రైతుల్ని వెట్టి చాకిరి తో బాధ పెట్టేవారు .ఈ విషయం కరాలీ ఒక్కడే గ్రహిస్తాడు .సుచాంద్ కు మరింతలోతుగా తెలుసు .బనోరి బలవంతం మీద అతడి జాతివారు బానిసలుగానే ఉండిపోతారు .తనవైపు కరాలీని టిప్పు కోవాలంటే   గ్రహించి బనోరి తనకు వారసులుకావాలని ఒక వితంతువును పెళ్లాడతాడు మొదటి భార్య చనిపోతుంది .రెండో భార్యను కరాలీ లేవదీసుకుపోతాడు ,బనోరీ కరలీద్వంద్వ యుద్ధం లో బనోరీ ఓడిపోయి మంచం పట్టి ,తను నమ్ముకొన్న పురాతన సాంఘిక వ్యవస్థ రూపుమారిందని గ్రహిస్తాడు .తాను  ప్రతిఘటించిన మార్పులన్నీ ప్రపంచ సంగ్రామం తర్వాత తన గ్రామం లో కూడా జరిగాయనితెలుస్తుంది .1942తుఫాను పంటలన్న్నీ  నాశనం చేసింది .జమీందార్లు రైతుల్ని ఆదుకోక పోవటంతో రైల్వే కార్ఖానపనులకు వెళ్ళిపోతారు .కరాలీ నాయకత్వంలో కాంట్రాక్టర్లు అక్కడి చెట్లను వెదురు పొదల్నీ నరకటం మొదలు పెట్టగా ,పవిత్ర బీల్ వృక్షంకూడా నరికి వేయబడగా బనోరి చనిపోతాడు .కరాలీకహార్ తెగ కొత్తనాయకుడవుతాడు .సుచాంద్ బిచ్చగత్తె గామారి కొడవలి వంపు గాథ చరమాంకాన్ని పట్నంలో చెబుతూ బతుకుతుంది .తుఫాను భీభత్సం కహార్లకు గుణపాఠం అంటుంది .వంగ సాహిత్యం లో ఇలాంటి స్త్రీ పాత్ర సృష్టింప బడలేదు .విప్లవవాదికరాలి భవిష్యత్ కు ప్రతీక .తానుపుట్టిన నేలపై అభిమానమున్నవాడు ,కహార్ల జీవితవిధానాన్ని అన్నికోణాలనుంచి బంద్యోపాధ్యాయ చిత్రించాడు .నిమ్న జాతిప్రజలు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తమ సంస్కృతిని నిల బెట్టుకొనే ప్రయత్నం చేస్తారు. వారి ముఖ్యపండుగలన్నీ వ్యవసాయానికి సంబంధించినవే .వారి నైతిక విలువలు మిగలిన వారికి భిన్నంగా ఉంటాయి .ఆంక్షలు లేని స్వేచ్చాప్రేమ కోరుకొంటారు ,గౌరవిస్తారు .స్త్రీ పురుషులు మద్యపానం చేస్తారు .తిండి దొరక్కపోతే మగవాళ్ళు దొంగతనాలు ,హత్యలు చేస్తారు.కళాకాంతీ లేని పేద రైతులమధ్యబతుకుతూ వారి ప్రత్యెక సంస్కృతి కాపాడుకొంటారు .దీనికోసం పాతవిదానాలనే అవలంబించాల్సి వస్తుంది .కొత్త విధానాలు అవలంబిస్తే తమ ప్రత్యెక వ్యక్తిత్వం సంస్కృతి నశిస్తాయని భావిస్తారు .ఈ విషమ పరిస్థితిని తారాశంకర్ మహా ప్రతిభా వంతంగా చిత్రించాడు .ప్రశ్నలు సంధించకుండా ఒకముఖ్య సమస్యను ఎత్తి చూపాడు .మనదేశంలో నిరుపేదలై దోపిడీ విధానానికి గురైన గిరిజనులున్నారు వారికి మంచి సంస్క్రుతీ సంపద ఉంది .పాత విధాన తెగలు అంతరిస్తున్నాయి .అలాకాకుండా ఉండాలంటే కొత్త సాంఘిక వ్యవస్థ లో వారులీనం కావాలి .ఇలాజరిగితే వారి సంస్కృతి శిదధిలమౌతుంది .కొత్తవిధానాలు అనుసరిస్తే ,తమ విశిష్టత చాటుకోలేరు .దీనికి పరిష్కారం ఎవరివద్దా లేదు .వెదురు పొదలమాటున మిలమిలలాడే కొడవలి వంపు ఒక చారిత్రిక పరిణామానికి ప్రతీక .ఈ ప్రకృతి విశిష్టత వలన ఆకహార్లు ఆధునికతకు దూరంగా ఉంటూ తమ స్వీయ వ్యక్తిత్వాన్ని కాపాడుకో గలుగు తారు .అందుకని సనాతన వ్యవస్థకు బందీలు కాక తప్పదు .వెదురు పొదల నరికి వేత  వలన కహార్లు పాతకాలపు సరిహద్దులు దాటి ,ఇరవైయవ శతాబ్ది చేదు ,నిజాల  ఆవరణలోకి ప్రవేశించారు .కహార్ల మా౦డలీకాన్నే తారాశంకర్ ఉపయోగించటం అద్భుతం .బీర్భూ లోని మిగిలిన మా౦డలీకాలకు ఇది భిన్నంగా ఉంటుంది .దీనితో తారాశంకర్ బంద్యోపాధ్యాయ వంగ సాహిత్యంలో ఒక జీవ భాషను ప్రవేశ పెట్టిన గౌరవం పొందాడు .అంతేకాక ఆ భాషా విషయ సమస్య కు పరిష్కారం కూడా చూపించాడు .వంగ సాహిత్యం లో అంతవరకూ కృషి చేసిన వారంతా మధ్య ,పైతరగతులకు చెందినవారు .పల్లెప్రజల్ని రైతుల్నిచిత్రించే టప్పుడు పరోక్షంగా వారి భాష తెలుసుకొని ,లేక నిఘంటువు ఆధారంగా భాషను వాడేవారు .’’పద్మ నాదిర్ మాఘి ‘’-పద్మానదిలో పడవవాడు రచిస్తున్నప్పుడు మాణిక్ బంద్యోపాధ్యాయ ,అనేక భాషలు ఉపయోగించినా ,పడవ వారు మాట్లాడే భాష రాయలేక పోయాడు .కనుక బెంగాలీ సాహిత్యం లో మొదటినుంచి జీవభాషా సంప్రదాయం లేదు .మాండలికం రాస్తే చాలదు వివిధ వృత్తుల వారు వాడె ప్రత్యెక భాషనూ పొందు పరచాలి .బెంగాలీ సాహిత్య భాష అర్ధ రహితంగా తయారైంది 19వ శతాబ్దిలో కాళీప్రసన్న సిన్హా ,ఇరవై వ శతాబ్దిలో దినేన్ద్రకుమార్ రాయ్ ,ఇటీవల అద్వైతమల్ల బర్మన్ వంటి వారు జీవ భాష వాడి కృత కృత్యులయ్యారు .కానీ వీరు పరిణతి చెందిన రచయితలు  కాదు కనుక వారి కృషి గుర్తింపు పొందలేదు .తారాశంకర్ జీవభాష వాడటం లో ఏ ప్రయొజనమూ ఆశించలేదు  .ఒక ప్రత్యెక వర్గం వారి గురించి రాసే టప్పుడు వారి భాష నే వాడటం న్యాయం అనుకోని రాశాడు .ఆయన ఉత్తమనవలలలో  ఈ నవల చివరిది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-6-10-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.22వ భాగం.6.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-

-ప్రపంచ సౌందర్య రాశి ,’’ఏ రాస్తా హాయ్ ప్యార్ ‘’సినీ ఫేం ,జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలైన మదనపల్లి నటి-శ్రీమతి లీలా నాయుడు

లీలా నాయుడు (1940 – జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. “యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది.

బాల్యము
లీల 1940 సంవత్సరములో జన్మించింది. మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).

జీవనగమనము
· 1954లో (పదిహేను సంవత్సరముల వయసు) Femina Miss India గా ఎన్నుకొన బడింది.

· వోగ్ పత్రిక (Vogue) లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.

· 1956లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ను పెళ్ళాడింది.

· మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్నపిదప తిలక్ రాజ్ తో విడిపోయింది.

· విడాకుల తరువాత జిడ్డు కృష్ణమూర్తి బోధలకు ఆకర్షితురాలయ్యింది.

· 1969లో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ ను వివాహమాడింది.

చిత్ర రంగము

1960లో విడుదలైన “అనూరాధ” లీల మొదటి చిత్రము. హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారము పొందింది. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు. 1962లో “ఉమ్మీద్” (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి “The Householder” (1963), శ్యామ్ బెనెగల్ “త్రికాల్” (1985) లలో నటించింది. కొద్ది చిత్రములలో నటించిననూ లీల వాటిద్వారా చిత్రరంగముపై చెరగని ముద్ర వేసింది. 1992లో నటించిన “Elctric Moon” లీల చివరి చిత్రం.

మరణము
లీల జులై 28, 2009 న ముంబాయిలో మరణించింది[3].

315-లోక్ సభ సభ్యుడు ,డేంజర్’’సినీ విలన్ ,నంది అవార్డీ,కొక్కొరోకో దర్శకుడు,విచిత్ర వేష దారి –డాక్టర్ నాగమల్లి శివ ప్రసాద్

నారమల్లి శివప్రసాద్ (జూలై 11, 1951 – సెప్టెంబరు 20, 2019) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.

తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.[1] కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 2019 సెప్టెంబర్ 21న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3

బాల్యము
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి లో, నాగయ్య, చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951న జన్మించాడు.

విద్య
శివప్రసాద్ తిరుపతిలోని వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.

కుటుంబము
శివప్రసాద్‌కి విజయలక్ష్మి తో 26 పిబ్రవరి 1972 లో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు మాధవీలత, నీలిమ.

సినిమారంగం
సాహిత్యం, కళలు, సినిమా నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి నాటకంపై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరో కో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2006 సంవత్సరంలో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నాడు.

నటించిన చిత్రాలు

  1. ఖైదీ
  2. యముడికి మొగుడు
  3. మాస్టర్ కాపురం
  4. ఆటాడిస్తా
  5. ఆదివారం ఆడవాల్లకు సెలవు
  6. సత్యభామ
  7. సుభాష్ చంద్రబోస్
  8. యమగోల మళ్లీ మొదలైంది
  9. ఆదిలక్ష్మి
  10. జై చిరంజీవా
  11. డేంజర్
  12. లక్ష్మి
  13. కితకితలు
  14. తులసి
  15. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
  16. ఒక్కమగాడు
  17. ఆటాడిస్తా
  18. బాలాదూర్
  19. కుబేరులు
  20. ద్రోణ
  21. మస్కా
  22. బ్రహ్మలోకం టు యమ లోకం వయా భూలోకం
  23. తకిట.. తకిట
  24. పిల్ల జమీందార్
  25. అయ్యారే
  26. దూసుకెళ్తా
  27. సై ఆట
  28. సౌఖ్యం (2015)[4]
  29. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)[5]

రాజకీయరంగం]
చంద్రబాబు నాయుడు , శివప్రసాద్ బాల్యస్నేహితులు, చంద్రబాబునాయుడి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయాడు.

మరణం
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 21న మరణించాడు.[2]

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 40- విపర్యోక్తి

హాస్యానందం

40- విపర్యోక్తి

కారణం వలన కార్యం జరుగుతుంది .ఆకాశంలో మేఘాలుంటే నెమళ్ళు నాట్యం చేస్తాయి .కాని నెమళ్ళు నాట్యం చేస్తే ఆకాశ౦ మేఘావృతం అవుతుంది అంటే విపర్యయం .కారణం అయింది కార్యంగా మారటం అన్నమాట .ఇది హాస్య హేతువవుతుంది ..చెరువులు ఎండితే ఎండలు మండిపోతాయి అంటే విపర్యోక్తి ,చెట్లు చిగిరిస్తే వసంతం వస్తుంది అన్నదీ విపర్యోక్తే అన్నారు మునిమాణిక్యం.కుక్కలు అరిస్తే దొంగలొస్తారు ,చంద్రుడు వస్తే చీకటిపోతుంది కూడా అలాటివే .ముందు చెప్పాల్సింది వెనకా వెనక చెప్పాల్సింది ముందు చెబితే విపర్యోక్తే నండి బాబూ అని అని మొత్తుకున్నారు మాస్టారు .

 మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

విజయదశమి శుభా కాంక్షలతో

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.10వ భాగం.5.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.10వ భాగం.5.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర

’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర

  ఒక కవి, రచయిత తన జీవితాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తాడు .ఎవరి అనుభూతివారిది .అయితే అది ఊహాలోకాల్లోకాక భూమి మీద ఉంటె రాణింపు ఎక్కువ .సరసభారతికి అత్యంత ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇటీవలే వెలువరించిన ‘’నా జీవన యాత్ర ‘’నిజంగానే ఆయన సాహితీజైత్రయాత్ర అంత సుదీర్ఘమైనది .ప్రతిమాట ,ప్రతి పంక్తి మనసును తాకుతుంది .తెచ్చిపెట్టుకొన్న కవిత్వంకాదు .మనోభావాలు గుండె పొరల్లోనుంచి తమకు తాము వెల్లువలాపైకి  ఉబికొచ్చిన కవితాదార .

  ప్రకాష్ కు యాత్ర అంటే ఒక కొత్త మార్పుకు చేర్పు ,కొత్తపాత్రలతో కరచాలన౦. అక్షరాలు  మొలిపించి ,మురిపించి స్పూర్తిని ప్రసాది౦చేదే .చిన్నప్పుడు డబ్బు ఇబ్బందితో స్కూల్ పిల్లల యాత్రకు పంపకపోతే చిట్టిమనసుల కోరికల్ని,సరదాను  చంపుకోవటం ప్రత్యక్షంగా చూపించటమే  .కొండపల్లి యాత్రానుభూతి అడ్డుకట్ట వేయలేనంత ప్రవాహ ఉధ్రుతితో ఆనంద సంద్రమయింది .నేరేడుపళ్లనుకొని ఇంకుడు కాయలు తిన్నప్పుడు అసలైన పరిశోధన విజ్ఞానం యాత్ర బోధించింది .పరీక్షలవలన కుటుంబ సభ్యులతో యాత్ర కు వెళ్ళక ఒంటరిగా ఇంట్లో ఉండటంతో కలిసి వెళ్ళే యాత్ర పాత్ర కలగానే మిగిలింది .అయితేనేం ఊహల యాత్రలో నానమ్మ కతలతో  తనపాత్ర ఎప్పుడూ విహరిస్తూనే ఉందనే ఊరట పొందాడు  .

   మనసు ఆల్బం లో భద్రాద్రిగోదారి గుత్తి చేపలు దృశ్యకావ్యంగా భద్రమైంది .వృత్తి బండీ లాగటానికి యాత్ర బండిని రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ లో బందీచేశాడు .పెళ్ళే ఒక తీర్ధయాత్రగా మజా యాత్రయై మధురోహల్ని నింపి ,జీవనయాత్రకు తోడు నిచ్చింది .జీవనసాగరంలో యాత్ర భాగమైపోయింది .సాహితీ తపస్సు కామారెడ్డి లో పండినప్పుడు సాహిత్యయాత్ర జీవన మజిలీలో ప్రధాన పాత్రే పోషించింది .యాత్ర అంటే సరదామాత్రమేకాదు,అన్నిరకాలా  నలిగిపోవటం కూడా .

  భావుకుడైన ప్రకాష్ కు యాత్ర సమస్త ప్రకృతిని పలకరించి తడిమి తురుముకోవటం .అనేక పాత్రల్ని కలుపుకొంటూ ,కొత్తపాఠాలు నేరుస్తూ ముందుకు సాగటం .అనేక వేదికలపై మెరుస్తూ ,అనేకానేక కవి, రచయితలతో మమేకమౌతూ ,అనేక ఆలోచనలపరవళ్ళతో మహా ప్రవాహంగా సాగిపోతూ సాహిత్య గుబాళింపు లెన్నో అఘ్రాణిస్తూ , తానూ అందజేసి, మహానుభూతి పొందాడు .’’ఉయ్యూరులో రాజాగారి కోట సాక్షిగా జరిగిన  కథా సదస్సులో కాలేజి విద్యార్ధులకు బ్రతుకు గాతలను కథలుగా చెప్పి ,ఆలోచనా బీజాలు నాటటం ఆయన మర్చిపోలేదు .

  ఎన్నెన్నో జ్ఞాపకాలు మరెన్నో జ్ఞాపికలు ఇంకెన్నో సత్కారాలు  ఈ సాహితీ యాత్రా ఫలితాలే అని పరమ సంతోషం వ్యక్తం చేశాడు ప్రకాష్ .జనకవనం వేదికపై కంపించేదేహంతో తొలికవిత చదివి అనూహ్యంగా వచ్చిన స్పందన చప్పట్ల రూపం లో వ్యక్తమైనప్పుడు ,ఫెలోషిప్ ఆర్దికప్రోత్సాహం లభించినప్పుడు ప్రత్యక్ష సాక్షి సాహితీ యాత్రాలే అని గుర్తు చేసుకొన్నాడు .అందుకే చలపాకకు యాత్ర అంటే జీవతం లో ఒక పాత్ర .అనేక అనుభూతుల అక్షయ పాత్ర .రమ్యభారతి పత్రిక,నిర్వహణ ,క్షణం తీరికలేని సాహితీ సభా నిర్వహణ దక్షత ,,రాష్ట్ర సభల నిర్వహణ, వ్యాస ,విశ్లేషణా విశ్వరూపం తో అమెరికా సాహిత్యపు అంచులు తాకినప్పుడు ఆయనపొందిన  ఆనందం అవధులు దాటింది .మనిషి బంగారం .మనసు బంగారం .వృత్తి బంగారం,ప్రవృత్తి బంగారం అయిన’’ ప్రకాశ’’ జీవనుడు ‘’చలపాక’’ అన్ని తరాలవారికీ ఆదర్శ మూర్తి . ఆయన యాత్రలో మనల్నీ యాత్రీకుల్ని చేసి మధురానుభూతుల్ని పంచాడు .

అందమైన ఫ్రంట్ ముఖ చిత్రంలో చలపాక జీవనయాత్రలో అలసి పోయిన ముఖంతో కనిపిస్తాడు కాని బాక్ చిత్రంలోనవయవ్వన స్పూర్తి తోయాత్రకు సిద్ధం అన్నట్లు  దర్శనమిస్తాడు .

  విజయదశమి శుభా కాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.21వభాగం.5.10.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.21వభాగం.5.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17

· 51-‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ ‘’గేయకర్త ,ఆత్మాభిమాని ,తేటగీతి కవి ,బలిదానకావ్యకర్త ,గాంధీ బిల్హణీయం,దీనబంధు సినీ గేయకర్త –శ్రీ శంకరంబాడి సుందరాచారి

· శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

జీవిత విశేషాలు
సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం[1]. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.

భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.

అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.[2] సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.

2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది[3]. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.[4]

సాహితీ వ్యాసంగం
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. “నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.

మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు[5].

సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.

రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.

సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి “మా తెలుగు తల్లికి” గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.

ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.

ఇతర కవుల అభిప్రాయాలు
స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారన్నారు- మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉంది.

కీ.శే.కవిసాంరాట్ విశ్వనధ సత్యనారాయణ అన్నారు- తెలుగు పలుకుబై, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించుచున్నట్లున్నది.ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవుచున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసములనుండియు, మారుమూల పదములనుండియు విడివడి సరళమైనది.

శ్రీగడియారం వేంకటశేషశాస్త్రి అంటారు: ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి.

శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు మాటలలో-సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత.

శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ గారు:తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట….కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత.

రచనల నుండి ఉదాహరణలు
సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మకు ఒక సందేహం కలిగి ఇతడిని “అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?” అని ప్రశ్నించాడు. ఆయన దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు.

తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్య. విగ్రహం పలకం

నల్లకొండల నుగ్గుగా నలగగొట్టి
చిమ్మచీకటిలోగల చేవబిండి
కాళసర్పాల విసమెల్ల గలిపినూరి
కాచిపోసిన రూపుగా గానుపించె

పచ్చి రక్కసి, నడగొండవలెను, వదన
గహ్వరము విచ్చి మంటలుగ్రక్కి,నాల్క
సాచి, కనులెఱ్ఱవార, చేయూచికొనుచు
నురము ముందుకునెట్టి, శిరమునెత్తి

కాలభైరవియై వల్లకాటికెల్ల
దానె గాపరి యనమించి తలల మాల
మెడను వ్రేలాడ, ద్రాచులు పడగలెత్తి
భూషలయి మేన బుసకొట్టి, ఘోషలిడుచు

హరులు,తరులును,గిరులును,దరువులొకట
వెంట బడిమూగ,నడుగులు,పిడుగులగుచు
నిడిన చోట్లెల్ల గోతులు వడుచునుండ
నచటి కరుదెంచె వికటాట్టహాసముగను

తేటతెనుగు తనము పుణికిపుచ్చుకుని ఎదుటపడిన సుందరాచారి తాటకిని చూసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ముక్కున వేలు వేసుకున్నాడు.

బిరుదులు
శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.

మా తెలుగు తల్లి గేయానికి రాష్ట్రం లో, దేశ విదేశాలలో గొప్ప గుర్తింపు తెచ్చినవారు మహాగాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి .ఆమెను మనం మర్చిపోకూడదు . శ్రీ సుందరాచారి శత జయంతి సందర్భంగా బందరుకు చెందిన శ్రీ యుటిఎఫ్ వెంకటేశ్వరరావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మగార్లు ఒక బృందంగా ఏర్పడి ఆయన జీవిత చరిత్రను అనేక చోట్ల రూపకంగా ప్రదర్శించారు .సరసభారతి తరఫున ఉయ్యూరులో కూడా ఫ్లోరా హైస్కూల్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయించాం .వారు చక్కగా నిర్వహించి విద్యార్ధులకు గొప్ప స్పూర్తి కలిగించారు .ఆమహాకవిపై మేమూ ఒక కార్యక్రమం నిర్వహించామన్న సంతృప్తి ,గౌరవం సరసభారతి కి దక్కింది .

సశేషం

విజయ దశమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

39-వ్యతిరేకార్ధోక్తి   హాస్యానందం

హాస్యానందం

39-వ్యతిరేకార్ధోక్తి   

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చెప్పేవాడు ఒక అర్ధాన్ని ఉద్దేశించి ,దానికి వ్యతిరేకార్ధం వచ్చేట్లు మాట్లాడటం వలన కలిగే చమత్కారం అన్నారు మునిమానిక్యంగారు .ఉదాహరణ –ఒక తండ్రి తన కొడుకుతో పరిహాసానికి ‘’ఒరే.ఇప్పుడు రాత్రి ఒంటిగంట అయింది ఇంకా ఏం పడుకొంటావులే .ఇంకాసేపు గడిపేస్తే హాయిగా తెల్లార్తుంది ‘’అన్నాడు .ఇందులో ‘’ఇక చాల్లేరా కుంకా పడుకొని ఏడు ‘’అని అర్ధం అన్నమాట .మరోటి .భార్య భర్తతో ‘’నన్ను ముద్దుపెట్టుకోకండి అలా చేస్తే నాకు తిక్కరేగుతుంది ‘’’’అన్నది అంటే ముద్దుకోసం తహతహ లాడుతో౦దన్నమాట .మూడోది –ఒకాయనకు భార్యమీద పిచ్చకోపం వచ్చింది .’’భోజనానికి లేస్తారా ?అంది భర్త బు౦గ మూతిపెట్టి’’లేవను ‘’అన్నాడు  .’’ఏం ఎందుకని’’ ?అని తేనెమనసులు సినీ పాటలాగా అంటే ‘’నాక్కోపం వచ్చింది ‘’అంటే ,’’ఎట్లాపోదో నేను చూస్తాగా ?’’అని ఆమె అంటే ‘’ఇది పోయేకోపం కాదు .నువ్వు లాగి వెనకనించితోసుకొంటూ  తీసుకు  వెడదామనుకోన్నావేమో  ?అదేమీ సాగదు .చక్కిలిగింతలు పెట్టి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మా అమ్మను కేకేస్తాను ‘’అన్నాడు .ఇవన్నీ చేస్తే భోజనానికి లేస్తాను అని అర్ధం .ఇందులో ఉన్న  చమత్కారం గ్రహించని ఆడది ఉండదన్నారు సార్.వ్యతిరేకార్ధ స్ఫురణ ఈ రకం గా ఒక చక్కని మనో వ్యాపారం అయింది .దీనివల్ల పుట్టే హాస్యమూ పరమ రమణీయంగా ఉంటుంది అని ఇలాంటి వాటిలో భార్య కా౦త౦గారితో తలపండిన మునిమాణిక్యం నరసింహారావు గారన్నారు .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మహర్నవమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

దసరా వేషం -ఇంటికొచ్చిన పిట్టల దొర

Posted in రచనలు | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6

సాధారణంగా తారాశంకర్ తన రచనతో సంతృప్తి పొందడు .దాన్ని మార్చిమార్చి మెరుగులు దిద్దుతూనే ఉంటాడు.1939లో ప్రచురించిన ధాత్రీ దేవతనవల ఆయన రచయితగా ప్రదర్శించిన లక్షణాలన్నీ బీజ ప్రాయంగా ఉన్నాయి .పాత ధనవంతుల నయా ధనవంతుల సమస్యలు ,రైతాంగ సమస్యలు ,సగటు మనిషి నిరంతర పోరాటం ,వ్యక్తిత్వంతో భాసించే స్త్రీ ,పురుషులు ,విభిన్న సిద్ధాంతాల కార్యకర్తలు ,వర్షాభావ పరిస్థితులు ఇందులో  దర్శన మౌతాయి . మనో వికారాలు లేకుండా నిస్సంగం గా ఆయన రాసిన తర్వాతనవలలకు ఇది నాంది .ఇవన్నీ విస్తృత ప్రాతిపదిక పై రాసినవే .సార్వకాలీనత సార్వజనీనత ఉన్నవే .తన అత్త మరణం ధాత్రీదేవత మరణం అంటాడు బంధ్యోపాధ్యాయ .నిష్కల్మష ప్రేమమూర్తి గౌరీ.హి౦సా విధానాలతో  స్వాతంత్ర్యం సంపాదిద్దామనుకొన్న కొందరు యువకులు అమెరికా మొదలైన దేశాలకు వెళ్లి అక్కడ కేంద్రాలు ప్రారంభించారు .అదే నిజమైన విప్లవంగా భావించారు .

  గణ దేవత ,పంచ గ్రామ నవలలో అయిదు గ్రామాల కథ ఉంది .పంచాయతీరాజ్ అస్తవ్యస్తం క్షీణదశ చూపించాడు .పాత నుంచి కొత్తకుకోత్తకు మారే దశ చూపాడు .ప్రాచీన ,మధ్యకాలాలలో బెంగాల్ లోగ్రామాలు 9,7,5 సంఖ్యలో సమూహాలుగా ఉన్నాయి .గ్రామ నిర్వహణ సంఘాలచే గ్రామస్తుల అంగీకారంతో పాలన జరిగేది .అందుకే వీటి నవగ్రామ, సప్తగ్రామ ,పంచాగ్రామ అనే పేర్లు వచ్చాయి .ఈ సంఘాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవి ,మన్ననలు పొందేవి .ఒకకమ్మరి గ్రామస్తుల పని చేయటానికి నిరాకరించటంతో ‘’గణ దేవత ‘’నవల మొదలౌతుంది .కులాల వృత్తులు చేసేవారికి గ్రామస్తులు  ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పేవారు .అది వారిఅవసరాలకు చాలేదికాదు .పైకుమ్మరి అందుకే ఆవూరు వెళ్లి పట్నం లో బతుకుదామనుకొన్నాడు .గ్రామ సంఘం అతడిని విమర్శించినా లక్ష్యపెట్టడు .ధనికుల్ని శాసించలేని ఆ సంఘాన్ని అతడూ లెక్క చేయలేదు .పట్నం నవనాగరకతకు ప్రతీక .పల్లె ఇంకా అలానే కునారిల్లుతోంది .గ్రామ సంఘాలకు మూలాలైన ఆయిదు గ్రామాలు క్షీణించిపోయాయి .పట్నం వెళ్ళిన ఆయువకుడు తిరిగివచ్చీ ఇంకా ఎక్కువమందిని తనతో తీసుకు వెళ్ళాలనుకొని వచ్చి గ్రామం ధనికుల హస్తాలలో నలిగిపోతుంటే భరించలేకపోతాడు .ఇందులో ఉన్నవారు వ్యక్తులు కారు సాంఘిక వ్యవస్తలు .ప్రధానపాత్రలు ఒకే ఆర్ధిక వ్యవస్తకుచెందినవి .నిరక్షరాస్యులమధ్య విద్యావంతుడు ఒకడు ఉండిమార్గదర్శనం చేయటం ఉంది .కార్మికులుగా వలస పోకుండా భూమిని ఇంకా తమ జీవనాధారంగా నిలబెట్టుకొనే వ్యక్తులు పెరుగుతారు .ఈ నవలలో ఉన్నత ఉత్తమ సాహిత్య విలువలు నెలకొల్పాడు .ఆకాలం లో అలాంటి రచయితలూ లేరు .ఆయన కృషి చేసిన సాహిత్య ప్రక్రియ విభిన్నమైనది .ఆయన సాహిత్యగౌరవం అసాదారణమైనది .

  సశేషం

మహర్నవమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.9వ భాగం.4.10.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.9వ భాగం.4.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మవైవర్తం ప్రకృతిఖండం తర్వాత ,బృందావన్ లాల్ పిమ్మట

బ్రహ్మవైవర్తం ప్రకృతిఖండం తర్వాత ,బృందావన్ లాల్ పిమ్మట ?

సాహితీ బంధువులకు శుభ కామనలు –

కొద్దిరోజుల్లో బ్రహ్మ వైవర్త పురాణం -ప్రకృతి ఖండం అయిపోతుంది .వెంటనే బాలవ్యాస ,వేదాంత కేసరి  బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ”మహాభారత తత్వ కధనం ”ప్రారంభిస్తాము .

 సాయంకాలం చేస్తున్న బృందావన్ లాల్ వర్మ కూడా త్వరలోనే అయిపోతుంది .వెంటనే చేమకూర వేంకట కవి విరచిత ”విజయ విలాస ప్రబంధం ”శ్రీ తాపీధర్మారావు గారి వ్యాఖ్యానం తో ప్రారంభిస్తామని మహర్నవమి ,విజయ దశమి శుభా కాంక్షలతో తెలియజేస్తున్నాము -గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-22-ఉయ్యూరు 

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి

శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి

Video link

శమీ పూజ ,శమీ అష్టోత్తర శతనామావళి

శమీపూజ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్‌ |

వందే సూర్యశాశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ||

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ||

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

 తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా; విజయదశమినాడు చేపట్టిన ఏకార్యము అయినా విజయముతధ్యము అని చతుర్వర్గ చింతామణిఅనే ఉద్గ్రంథము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే విజయంఅని తెలిపియున్నది. ఆ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని నమ్మకం..

మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి ,పదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు వాడిని సంహరించి విజయం సాధించింది. అందుకే ఆరోజుకు  విజయదశమి అనే పేరొచ్చింది.పూర్వం రాజులు ,జమీందార్లు లోక కల్యాణం కోసం ,వాళ్ళ విజయం కోసం ,వారి పాలనలో ఉన్న దేవాలయాలలోశమీ పూజోత్సవాలు చేసేవారు . సాయంకాలం పూజ తర్వాత స్వామిని గుర్రం పై ,వేదమంత్రోచ్చరణతో ,మేళ తాళాల ఛత్ర చామర మర్యాదలతో తో  ఊరేగించి ,,శమీ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ వృక్షానికి ,ఆయుధాలకు పూజ చేసి ,విజయం కోసం నాలుగు దిక్కులలో,వృక్షం పై అగ్రంపైనా  బాణాలు సంధించి వదిలే వారు. ఇది శత్రునాశనానికి చిహ్నం . ప్రస్తుత సంవత్సరం  విజయదశమినుంచి వచ్చే సంవత్సరం విజయ దశమి పర్యంతం  అష్ట దిక్కులా తనకు తన కుటుంబానికి దిగ్విజయం కలగాలని. “ విజయ పత్రం. “ రాసి శమీ వృక్షం మొదట్లో  ఉంచుతారు. ఇందులో గోత్రం ,పేరు రాయాలి. శమీ వృక్షానికి అందరూ ప్రదక్షిణాలు చేసి ,శమీ పత్రాలను కోసి భక్తితో కళ్ళకు అద్దుకొని శిరస్సున ఉంచుకొని  ఆలయానికి వస్తారు.

మనం ఒక తెల్లకాగితం మీద పైన శ్రీ రస్తు— శుభమస్తు —-అవిఘ్నమస్తు అని దూర దూరంగా రాసి దానికింద

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ

 అనే శ్లోకం రాసి ,దానికింద స్వస్తిశ్రీ చాంద్రమాన _________( శుభకృత్) నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి –విజయదశమినుంచి ,శోభకృత్ నామ సంవత్సర ఆశ్వ యుజ శుద్ధ దశమి విజయ దశమి పర్యంతం అని రాసి, తర్వాత(_______( గౌతమస) గోత్రం –తర్వాత________ ( గబ్బిట దుర్గాప్రసాద్) కు కుటుంబానికి అష్టదిక్కులా దిగ్విజయం కలుగుగాక  అనిరాసి శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీ  అని అయిదుసార్లు

  రాసి పసుపు ,కుంకుమ అంటించి శమీ వృక్షంలేక  కొమ్మ కింద ఉంచాలి. గుడిలో అయితే అర్చకస్వామి శమీ కొమ్మకు బియ్యాన్ని మూటలో కట్టి ,మనం రాసిన కాగితాలన్నీ కొమ్మ క్రింద పెట్టి అష్టోత్తర పూజ చేస్తాడు.  కాగితం బాణాలు తయారు చేసి ధర్మకర్త చేత నాలుగు దిక్కులకు బాణాలు వదిలిస్తాడు.

  జమ్మి చెట్టుకు ఇంతటి ప్రాధాన్యం రావటానికి కారణం ఆ వృక్షాధి దేవత అగ్ని దేవుడు అవటమే. అగ్నిదేవుని వలననే దేవతలకు హవిస్సులు అందిస్తాము. ఆయన ద్వారానే దేవతలను ఆహ్వానించటం సంప్రదాయం.. ‘హిరణ్య  వర్ణాంహరిణీ౦ సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ౦లక్ష్మీం జాత వేదో   మమావహః. “ అనే వేదవాక్యం లో. “ అగ్నిదేవా !లక్ష్మీదేవిని నేను పూజించటానికి ఆమెను ఆహ్వానించు. “ అని ఉంది. ఇ౦తటిప్రభావం కల అగ్ని శమీ వృక్షానికి అధి దేవుడు. అందుకే జమ్మికి అంతటి ప్రాధాన్యం. అంతేకాదు. “ శమీ కీర్తనా దేవపాపం నశ్యతి వాచికం-స్మరణాన్మానసం

పాపం ,స్పర్శనాత్కాయజం తదా –నిత్యం తత్పూజ నా ,ధ్యానా ద్వంద్వ నా చ్చైవభక్తితః-నిర్విఘ్న కరమాయుష్య౦,జ్ఞానం ,పాప క్షయోపిచ. “ . అంటే శమి అని నోటితో అంటే  నోటితోచేసినపాపాలు ,మనసులో శమీ అనుకొంటే ,మనసుతో చేసిన పాపాలు ,,శమీ అని తాకి నమస్కరిస్తే శారీరక పాపాలు పోవటమేకాక ప్రతిరోజూ పూజిస్తే దీర్ఘాయువు జ్ఞానం కలుగుతాయి. ఆనంద రామాయణం లో శ్రీ రాముడు రోజూ శుద్ధుడై నిత్యకర్మలు చేసి ,వట వృక్షం, బిల్వ ,శమీ, ఆశ్వత్ధం తులసీ మొదలైనవృక్షాలను పూజిస్తాడని ఉంది.

  కర్ణాటక లో విజయదశమి పండుగనాడు’’ జంబూ సవారీ’’ అనే ఉత్సవం చేస్తారు. సాయంకాలం అందరూ కొత్తబట్టలు కట్టుకొని గ్రామానికి వెలుపల దగ్గరలో ఉన్న మరో గ్రామానికి నడచిలేక  బళ్లమీద బస్సులమీద ఊరేగింపుగా వెళ్లి అక్కడి దేవాలయం లో దైవ దర్శనం చేసి తిరిగి ఇంటికి వస్తారు. మా చిన్నతనం లో హిందూ పురం లో ఇలానే చేసే వాళ్ళం. హిందూ పురంనుంచి బెంగుళూరు రోడ్డులో ఉన్న సూగూరు వెళ్లి అక్కడి ఆంజనేయస్వామిని దర్శించి తిరిగి వచ్చేవాళ్ళం.జట్కాబండి వాళ్ళు బస్సులవాళ్ళు అందర్నీ ఉచితంగా ఎక్కించుకొని జంబూ సవారీ సరదాగా జరిపేవారు. దీన్నే సీమోల్లంఘనం అంటారు.

  అలాగే రాజులు ,జమీందార్లు పార్వేట ఉత్సవం చేసేవారు ఇదే విధానం లో. మన తిరుమల,వరదరాజస్వామి  మొదలైన ప్రసిద్ధ ఆలయాలలో కూడా స్వామి ఉత్సవ విగ్రహానికి క్షత్రియ వేషం వేసి కనుమ పండుగనాడు  పార్వేట ఉత్సవం చేస్తారు ,.

 ఇంకా దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్త దినం ఈ విజయదశమి రోజునే అని తెలియజేయబడింది. “శ్రవణా” నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి “విజయా” అనే సంకేతము ఉన్నది. అందుకనే దీనికి “విజయదశమి” అను పేరు వచ్చినది.

ఈ విజయదశమినాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలుచుకుని పేరంటం పెట్టుకొని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.

అలాంటి విజయ దశమి రోజు మరింత ముఖ్యమైనది “శమీపూజ”. శమీవృక్షమంటే “జమ్మిచెట్టు” అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తిఅవగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న “అపరాజితా” దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు. తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారంకూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో;

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

అని ఆ చెట్టుకు ప్రదక్షణలుచేస్తూ పై శ్లోకము స్మరిస్తూ ఆ శ్లోకములు వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగ, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

ఇలా మానవులు అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలన్నా మనకు ఏర్పడిన దారిద్ర్యం తొలగిపోవాలన్నా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై. ఈ “శరన్నవరాత్రి” దసరావైభవంలో పాలుపంచుకుని సర్వులూ పునీతులు అవుదురుగాక…!

               ఇందులో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకొందాం. పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధిప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమిని’’ దశహరా’’ అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది.  పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమినాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైనది ‘శమీ వృక్షా’న్ని దుష్టఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.

శమీ శమయతే పాపం

శమీ నాశయతే రిపూన్‌

శమీ విత్తంచ పుత్రంచ

శమీ దిత్సతి సంపదమ్‌

అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని శమీవృక్షం వద్ద పఠించాలి. శమీవృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సం కేతం. మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.

మొత్తం మీద చెడు పై మంచి సాధించే విజయమే విజయదశమి అని గుర్తించాలి.

శమీ అష్టోత్తరం

ఈశాన్యైనమః

పాపశమన్యైనమః

వశన్యైనమః

శివాఫలాయైనమః

లోహిత కంకటాయైనమః

అర్జున బాణ సంరక్షకాయైనమః

రామస్య ప్రియ దర్శినిన్యైనమః

యాత్రాయాం సుఖ ప్రదాయైనమః

నిర్విఘ్న కర్త్రుకాయైనమ

10-శ్రీరామ పూజితాయైనమః

అగ్నికాంతిప్రతీకాయైనమః

విఘ్నేశ పూజా విధాయకాయైనమః

శని దోష నివారకాయైనమః

యుద్ధ విజయ సాధకాయైనమః

పాండవాయుధ రక్షకాయైనమ

కుష్ఠువ్యాధి నివారకాయైనమః

ఇభ వక్త్రాయనమః

గర్భ స్రావ నివారకాయైనమః

కఫ నివారకాయైనమః

20-శ్లేష్మధ్వ౦స కాయైనమః

ఏక వింశతి పత్రికా ముఖ్యైనమః

రోమనివారణాయైనమః

భూసార వృద్ధిదాయైనమః

పాంధఛాయా కల్పితాయైనమః

పోషకాహారాయైనమః

శాకపాక వినియోగాయైనమః

దంత వ్యాధి నివారిణ్యైనమః

సర్వ రోగనివారిణ్యైనమః

అపరాజితా దేవీ ప్రియాయైనమః

30-గోత్ర వంశాభి వృద్ధి దాయిన్యైనమః

క్షీర పక్షి ప్రియాయైనమః

కల్ప వృక్ష సమాయైనమః

పశు సంరక్షకాయైనమః

శ్రీ భద్రాయై నమః

పుణ్యదాయైనమః

పుణ్యరూపిణ్యైనమః

జానకీదుఃఖ శమన్యైనమః

సర్వ కల్మష సంహార్యై నమః

కామితార్ధ ప్రదాయై నమః

40-సత్య రూపాయయై నమః

శుభ ప్రదాయై నమః

శుద్ధాయై నమః

శక్త్యైనమః

పూతాత్మికాయై నమః

చతుర్వర్గ ఫలదాయైనమః

త్రిలోక జనన్యై నమః

మూల ప్రకృతిసంజ్నికాయైనమః

బ్రహ్మ రూపి ణ్యైనమః

అవాజ్మానస గోచరాయై నమః

50-పంచ భూతాత్మికాయైనమః

పంచ కలాత్మికాయైనమః

నిర్గుణాయై నమః

నిత్యాయైనమః

నిరాటంకాయనమః

దీన జన వత్సలాయై నమః

చతురానన సేవితాయైనమః

సిద్ధి ప్రదాయై నమః

అమలాయై నమః

కమలాయై నమః

60-లోక వందితాయై నమః

లక్ష్మైనమః

రామ ప్రియాయైనమః

విష్ణు ప్రియాయై నమః

తటిల్లతా౦గ్యై నమః

ప్రకృత్యై నమః

సర్వ భూత హిత ప్రదాయై నమః

విభూత్యై నమః

పరమాత్మికాయై నమః

శుచయే నమః

70-ధన్యాయై నమః

నిత్య పుష్టాయై నమః

దీప్తాయై నమః

రమాయై నమః

వసు ధారి ణ్యై నమః

క్రోధ సంభవాయై నమః

అనుగ్రహ ప్రదాయై నమః

అశోకాయై నమః

లోక శోక వినాశిన్యై నమః

అనఘాయై నమః

80-కరుణాయై నమః

ధర్మ నిలయాయై నమః

లోక మాత్రేనమః

దేవ్యై నమః

సుప్రసన్నాయైనమః

ప్రభాయై నమః

ఆహ్లాద జనన్యై నమః

విమలాయై నమః

విశ్వ జనన్యై నమః

వహ్ని ధరాయై నమః

90-యశస్విన్యై నమః

జయాయై నమః

మంగళ ప్రదాయై నమః

సర్వ దిక్ శుభ దాయకా యైనమః

వంశ ప్రవృద్ధయై నమః

గోత్రాభి వృద్యైనమః

ప్రసన్నాక్షాయై నమః

సర్వోపద్రవ వారి ణ్యైనమః

బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః

100-పూర్ణాయై నమః

అనంగాయై నమః

స్తవ్యాయై నమః

పరమాయై నమః

తరణాయై నమః

భగవత్యై నమః

తత్వ త్రయ్యై నమః

మత్యై నమః

మాత్రేనమః

హిత కారిణే నమః

110-మాన్యాయై నమః

రాజ్య లక్ష్మై నమః

సర్వ సంపత్తి దాయై నమః

భోగ లక్శ్మైనమః

మహా జయాయై నమః

మహా బోధాయై నమః

మహా బంధన సంహారి ణ్యై నమః

మహా వృక్షాయై నమః

మహా ఛాయాయై నమః

మహానఘాయై నమః

120-మహా శ్వాసాయై నమః

మహా సారాయై నమః

మహా క్షాన్త్యై నమః

యశస్విన్యై  నమః

మహారోగ వినాశిన్యై నమః

మహా క్షేమంకర్యై నమః

మహా విష నివారిణ్యై నమః

మహా శుభద్రాయై నమః

మహా సత్యై నమః

మహా నిత్యాయై నమః ‘

130-మహా శివ ప్రియాయైనమః

చిన్మయాకారాయై నమః

కాత్యాయిన్యై నమః

మాతృకాయై నమః

అజ్ఞాన శుధ్యైనమః

సృష్టి రూపాయైనమః

పురుషార్ధ ప్రదాయిన్యైనమః

వరదాయై నమః

భయ నాశిన్యైనమః

140-విశ్వ తోష్యణ్యైనమః

కుల సంపత్ప్రదాయై నమః

ప్రణవాత్మికాయై నమః

ఈశ్వర్యై నమః

చి౦తితార్ధ ఫల ప్రదాయి నమః

సర్వ మంత్ర మన్యైనమః

అమేయాయై నమః

అక్రూరాయై నమః

సర్వాస్త్ర ధారిణ్యై నమః

భూమిజాయై నమః

150-స్వ తేజసాయై నమః

బ్రాహ్మైనమః

జగద్ధితాయైనమః

మాన్యాయై నమః

నిరంజనాయై నమః

నిగమ గోచరాయై నమః

పూజ్యయైనమః

ధర్మ ప్రియాయై నమః

సర్వోపద్రవ వారిణ్యైనమః

లోకానంద దాయికాయైనమః

160-ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకృతి ఖండం .20.వ భాగం.4.10.22

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకృతి ఖండం .20.వ భాగం.4.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

స్త్రీ విముక్తి పై కధలు రాసిన ఇంగ్లీష్ లెక్చరర్ , రీడర్ ,’’సంపెంగలు సన్నజాజులు’’ నవలా ఫేం.సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –శ్రీ అవసరాల రామకృష్ణారావు

స్త్రీ విముక్తి పై కధలు రాసిన ఇంగ్లీష్ లెక్చరర్ , రీడర్ ,’’సంపెంగలు సన్నజాజులు’’ నవలా ఫేం.సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –శ్రీ అవసరాల రామకృష్ణారావు

అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 – నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత.

1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]

అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.

మరణం
2011, నవంబర్ 28 న హైదరాబాదులో స్వర్గస్థులయారు.

జీవితం
· ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు.

· తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.

· విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు.

· తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.

అందుకున్న కొన్ని పురస్కారాలు
· 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)

· 2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)[3]

· 3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)

· 4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)

· 5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)

· 6. ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)

ప్రచురించిన కొన్ని పుస్తకాలు
· 1. మనం మనుష్యులం

· 2. సహజీవన సౌభాగ్యం

· 3. ఇంకానా అంతరాలు?

· 4. అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ

· 5. సంపెంగలూ, సన్ంజాజులూ

· 6. మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?

· 7. అది ప్రశ్న, ఇది జవాబు

· 8. హెడ్మిస్ట్రెస్ హేమలత

· 9. పేకముక్కలు

· 10. కథావాహిన – 6

· 11. గణిత విశారద[4]

· 12. కేటూ, డూప్లికేటూ

· 13. అర్ధమున్న కథలు

· 14. రామచిలుక

· 15. మోహనరాగం

· 16. మేథమేట్రిక్స్-1

· 17. మేథమేట్రిక్స్-2

· 18. మేథమేట్రిక్స్-3

· 19. అంగ్రేజీ మేడీజీ

· 20-25. కథల సంపుటాలు

సమకాలీన రచయితలు
ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు

· 1. వేమూరి వేంకట సూర్యనారాయణ

· 2. ఈరంకి వేంకటరావు

· 3. వేమూరి వేంకటేశ్వరరావు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు

image.png

Posted in సేకరణలు | Leave a comment

జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి .

జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి .
  అది సుమారు 1930వ సంవత్సరం .ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో ఒకమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా తమ డాబా ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి సెల్యూట్ చేసింది .నిజానికి ఇదేమీ పెద్ద విషయం కాదు .,తప్పూకాదు.కానీ అప్పుడు రాజమండ్రిని తమ తీవ్ర దౌష్ట్యంతో కనికరం లేకుండా వణకిస్తున్న ఇద్దరు దుర్మార్గులైన పోలీసు ఆఫీసర్ ముస్తఫా ఆలీఖాన్ ,డప్పు  రాయుడు అనే సబ్ ఇన్స్పెక్టర్ లు ఎక్కడ బ్రిటిష్ వారికి అవమానం జరిగినా వచ్చి మీదపడి లాతీ చార్జి చేసి చేతులూ కాళ్ళూ విరగ్గొట్టే వారు .సబ్ ఇన్స్పెక్టర్ ఈవిషయం తెలుసుకొని పై ఆఫీసర్ ముస్తఫా కు తెలియజేశాడు .ఇంకేముంది అసలే కోతి,నిప్పుతోక్కితే ఎలా ఉంటుందో అలా అయ్యాడు ముస్తఫా .లారీలాతో పోలీసులను ఎక్కించుకొని ఆ ఇంటికి వచ్చాడు . మౌంటెడ్ పోలీసులను కూడా బయట పఎర్పాటు చేయించాడు హడలు పుట్టించటానికి .సరాసర ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి  జండా తీసేయ్యమని చెప్పాడు తియ్యను అందామె .తియ్యక పోతెతీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తు౦ది.అరెస్ట్ చేస్తాం అని హెచ్చరించాడు .
  ఇంతలో ఆమె తండ్రి బయటికి హడావిడి చూశాడు .కూతురుని అడిగి విషయం తెలుసు కొన్నాడు .ముస్తఫా ఖాన్ తో ‘’మా అమ్మాయి జండా తియ్యదు జండా ఎగరేసే హక్కు అందరికి ఉంది .నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ‘’అన్నాడు పెద్దాయన .
  ఆ పెద్దాయన పేరే దేవత శ్రీ రామమూర్తి .పేరుమోసిన లాయర్ .ఆ అమ్మాయిపేరు శ్రీమతి కోడూరి లీలావతి .చదువు కొంటో౦ది  .ఖాన్ తో ‘మా అమ్మాయిని అరెస్ట్ చేయటానికి పర్మిషన్ ఉందా ?వారంట్ తో వచ్చావా ?’’అని అడిగారు శ్రీరామమూర్తి .ఆ రోజుల్లో ఖాన్ పేరు చెపితేనే  ‘కార్చుకొనే వారే ‘’కాని  ఎదిరించిమాట్లాడే వారు లేరు అంత హడల్ పుట్టించేవాడు  .జనం విపరీతంగా పోగయ్యారు .ఇంతకీ ఖాన్ మన శ్రీరామ మూర్తి గారికి కాలేజిలో  క్లాస్ మేట్ .అయినా ఎవరి తీరు వారిదే .అప్పుడు అరెస్ట్ చేయాలంటే కాకినాడలో ఉన్న కలెక్టర్ దగ్గర్నుంచి పర్మిషన్ పొందాలి .ఇక చేసేదిలేక ఖాన్ బృందం తోకముడిచి వెళ్లి పోయింది .అప్పటినుంచి శ్రీరామ మూర్తిగారిని ‘’జండా ప్లీడర్ ‘’అని పిలిచేవారు .
  ఖాన్ కలెక్టర్ ను మేనేజ్ చేసి రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి అరెస్ట్ కు పర్మిషన్ తెచ్చాడు .మహా తెలివిగల మన లాయర్ గారు ఈ లోపే స్టే ఆర్డర్ తెచ్చేశారు .చేసేదేమీ లేక పోలీసులు కోర్టులో కేసు పెట్టారు .శ్రీరామ మూర్తిగారు కూతురు తరఫున వాదించారు .అప్పటిదాకా రావు గారు కాంగ్రెస్ భక్తుడుకాడు సాను భూతి పరుడు మాత్రమె . గాంధీ అభిమాని  .గాంధీకి ఈవిషయం తెలిసి అభినందనలు తెలియజేశాడు జండా ప్లీడర్ కు .రెండుచేతులా బాగా సంపాదిస్తున్న ప్లీడర్ .ఈ సంఘటన తో ఆయనలో మార్పు వచ్చింది .గాంధీ అనుయాయుడుయ్యారు .ఉచితంగా పేదలకు న్యాయ సేవ అందించేవారు .
బ్రిటిష్ ప్రభుత్వం కూడా జండా ఎగరేయటం తప్పు పని కాదనే అన్నది. అయితే ఆసమయం లో ఎలాంటి గొడవలు అల్లర్లు ,సత్యాగ్రహాలు చేయకూడదని చెప్పింది .అప్పటికే సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జండా ఎగరేయటం అందరి హక్కు అని కోర్ట్ లో కేసు వేసి గెలిచాడు .ఈ తీర్పులేవీ పట్టించుకోలేదు ఇక్కడి కోర్టు .కోర్ట్ తీర్పు ప్రభుత్వ పక్షాన వచ్చింది .న్యాయమైన హక్కును కాలరాస్తున్న స్థానిక కోర్టులు ,పోలీసు వ్యవస్థ పై తీవ్ర ఆగ్రహం చెందిన లాయర్ శ్రీరామ మూర్తిగారు ఆనాటి లండన్ లో ఉన్న అత్యున్నత న్యాయస్థానమైన ‘’ప్రీవీ కౌన్సిల్ ‘’లో కేసు దాఖలు చేసి న్యాయం చేయమని కోరారు .వాదోపవాదాలు సుదీర్ఘంగా సాగి, చివరికి తీర్పు శ్రీరామ మూర్తిగారికి అనుకూలంగా వచ్చి జండా ఎగరేసే హక్కు  అందరికి ఉన్నది అని  తేల్చి చెప్పింది  .నాటినుంచి శ్రీరామమూర్తిగారి పేరు దేశ విదేశాలలో మారు మోగింది .ఎందుకుజండాపై ఇంత అభిమానం ?అంటే ‘’ జండా జాతికి  జీవగర్ర ,సమతా చిహ్నమ్ము’’అన్నారు కరుణశ్రీ .మరో అడుగు ముందుకు వేసి ‘’నా జాతి జండా కున్న పొగరు, గర్వం నాకున్నాయి ‘’అని ప్రకటించాడు శేషేంద్ర .
  గాంధీ పిలుపుతో రాజకీయ ప్రవేశం చేశారు రావుగారు .వ్యక్తి సత్యాగ్రహం సహాయ నిరాకరణ,ఉప్పు సత్యాగ్రహం  ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు .రాజమండ్రిలో  లోని ఒక వీధి వీధి అంతా దేవత శ్రీరామమూర్తి గారి  భవనాలే .నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని ,సీతానగరం ఆశ్రమానికి విశేష సేవ లందించారు .గాంధీ గారు ఎప్పుడు వచ్చినా శ్రీరామమూర్తి గారింట్లోనే బస, ఆతిధ్యం .ఆయనకాంగ్రెస్  నిధికోసం వస్తే, రావుగారు భారిమొత్తంలో  నిధి అందజేయగా ,కుమార్తె తనమెడలో ఉన్న అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ తో సహా, నగలన్నీ నిలువుదోపిడిగా మహాత్మునికి అందజేసిన త్యాగమయి . కూతురు లీలావతి దేవి గారిని శ్రీ కోడూరి గున్నేశ్వరరావు గారు వివాహమాడారు .ఆమె పట్టభద్ర్రురాలు .కాంగ్రెస్ సేవా పరురాలు .సరోజినీ నాయుడికి అత్యంత ఆత్మీయురాలు .ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించినందుకు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ను  అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తే ఆయన రాజమండ్రి వచ్చి శ్రీరామ మూర్తిగారింటికీ వస్తే మన లాయరు గారు నేతాజీ ఎవరి కంటా పడకుండా అజ్ఞాతంలో దాచి ,అరెస్ట్ నుంచి తప్పింఛి పంపించేశారు అంతటి వీరాభిమాని నేతాజీకి .
   ఇవాళ ఉదయం శ్రీ దేవత శ్రీరామ మూర్తి గారి దౌహిత్రుడు అంటే కూతురు లీలావతిగారి కుమారులు శ్రీ కోడూరి శ్రీరామ మూర్తిగారి ఫోన్ నంబర్ మా అబ్బాయి శర్మ సేకరించి నాకు పంపితే వెంటనే రాజమండ్రి లో విశ్రాంతి తీసుకొంటున్న ఆ 93 ఏళ్ళ ఆ సాహితీ మూర్తి గారికి ఫోన్ చేసి తాతగారి వివరాలు అడిగితె చాలా ఓపికగా జవాబులు చెప్పారు .ఆ సారాంశమే పైన రాసిన విషయాలు .వారికి కృతజ్ఞతలు .

అహింసనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు గాంధీజీ. ప్రపంచవ్యాప్తంగా పరిమళించిన ఆయన కీర్తి ఎందరికో స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే తర్వాతి తరం నమ్మకపోవచ్చంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్నారంటే జాతిపిత కీర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వచ్చే  గాంధీజీ జయంతి సందర్భంగా గోదావరి తీరంతో ఆయనకున్న అనుబంధాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
స్వాతంత్రోద్యమకాలంలో అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహాత్మా గాంధీ ఎప్పటికీ మార్గదర్శే! ఉద్యమకాలంలో ఆ జాతిపిత పాదస్పర్శతో గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో గాంధీజీ 5 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారని చరిత్ర చెప్తోంది. కోటిపల్లి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, మెయిన్‌రోడ్డు, వంకాయలవారి వీధి ప్రాంతాల్లో బాపూజీ నడయాడారు. 1946 జనవరిలో చివరిసారి వచ్చిన గాంధీజీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రసంగించారు.

గాంధీజీ రాజమహేంద్రవరానికి వచ్చినప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పదిలంగా ఉన్నాయి. స్వరాజ్య నిధి కోసం 1930లో బాపూజీ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు దేవత శ్రీరామమూర్తి తన ఇంటికి ఆహ్వానించి డబ్బు, నగలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాలను దేవత శ్రీరామమూర్తి మనుమడు కోడూరు శ్రీరామమూర్తి ఈటీవీ భారతి తో  పంచుకున్నారు. మహాత్ముడి జీవిత చరిత్రపై అనేక రచనలు చేశారీయన.దాదాపు 100పుస్తకాలు రాశారు
రాజమహేంద్రవరంలోనే మరో కుటుంబానికి మధురానుభుతుల్ని మిగిల్చారు మహాత్ముడు. గాంధీజీ ఇచ్చిన విదేశీ వస్తు వినియోగ బహిష్కరణ స్పూర్తితో కేవీ రత్నం 1932లో పెన్నుల తయారీసంస్థ ప్రారంభించారు . 1933లో ఆలిండియా విలేజ్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జేసీ కుమారప్ప, రత్నం రూపొందించిన రెండు పెన్నులను తీసుకెళ్లి ఒకటి మహాత్ముడికి ఇచ్చారు. దేశంలోనే తొలిసారి పెన్నుల తయారీ సంస్థను స్థాపించిన కెవి.రత్నాన్ని అభినందిస్తూ మహాత్ముడు స్వయంగా ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేటికీ ఈ కుటుంబం వద్ద పదిలంగా ఉంది.
స్వాతంత్ర సమర ఉద్యమ సమయంలో ఈ ప్రాంత నుంచి అనేక మంది మహాత్ముడి ప్రసంగాలకు ఉత్తేజితులై పోరాటంలో పాల్గొన్నారు. ఆ జ్ఞాపకాలు గోదావరి తీరంలో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.
.స్వాతంత్ర్యోద్యమకాలంలో ( Freedom Struggle movement ) హింసే ఆయుధంగా సత్యమే మార్గంగా బ్రిటీషు తెల్లదొరల్నించి దేశానికి స్వాతంత్ర్యాన్ని( Independence ) తెచ్చిపెట్టిన గాంధీ (  Gandhiji ) ఎప్పటికీ మార్గదర్శకుడే. అందుకే జాతిపిత అయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ( October 2 Gandhi jayanti ) సందర్బంగా జాతిపిత మహాత్మాగాంధీకు గోదావరి తీరంతో ముఖ్యంగా రాజమహేంద్రవరం ( Rajamahendravaram ) తో ఉన్న అనుబంధాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఐదుసార్లు మహాత్ముడు రాజమహేంద్రవరానికి వచ్చారు.
1921–46 మధ్య కాలంలో ఐదుసార్లు రాజమహేంద్రవరం ( Gandhiji Visited Rajahmundy ) గడ్డపై అడుగెట్టారు. తొలిసారిగా 1921 మార్చి 30న రాజమహేంద్రవరాన్ని సందర్శించారు. అనంతరం అదే ఏడాది ఏప్రిల్‌ 4న, తిరిగి 1929 మే 6న, తరువాత 1933 డిసెంబర్‌ 25న, చివరిగా 1946 జనవరి 20వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలో ఉన్న గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. కస్తూరిబా ఆశ్రమంగా ( Kasthuriba Ashramam ) పిల్చుకునే ఆ ఆశ్రమంలో ఇప్పటికీ  నాడు గాంధీజీ ఉపయోగించిన రాట్నాన్ని భద్రపరిచారు.1929 మే 6వ తేదీన కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1929 పర్యటనల్లో పాల్‌ చౌక్‌ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ పాల్ చౌక్ నే ఇప్పుడు ఇన్నిస్ పేటగా పిలుస్తున్నారు.
మరోసారి 1946 జనవరి 20 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని గూడ్స్ యార్డ్ ప్రాంతంలో జరిగిన మహాత్మా గాంధీ ప్రసంగాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుంచుకుంటారు. నాటి ప్రసంగంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జాతినుద్దేశించి గాంధీజీ చేసిన ప్రసంగం అణువణువునా జాతీయోద్యమ భావాన్ని ఉత్తేజితం చేసింది. మహాత్మా గాంధీ చేసిన హిందీ ప్రసంగాన్ని స్వాతంత్ర్య సమరయోధుడైన కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. గోదావరి ప్రాంతంలో అదే గాంధీజీ చివరి పర్యటన.
ఇవీ మహాత్మునికి రాజమహేంద్ర వరంతో ఉన్న అమూల్య అనుబంధం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 38- వక్రోక్తి

హాస్యానందం

38- వక్రోక్తి

అంటే స్వభావ విరుద్ధమైన లోకోత్తర విచిత్రం అని నిర్వచించారు మునిమాణిక్యం .వక్రత లేని, హాస్యం లేని కావ్యం రాణించదు. శబ్దగత వక్రతవలన శబ్దాశ్రయ  హాస్యం పుడుతుంది .భావంలో ఉంటె భావగత హాస్యమౌతుంది .వక్రత అంటే వంకరతనం అది శ్లేషలో ఉంటె శ్లేష వక్రోక్తి ,కాకువు లో ఉంటె కాకు వక్రోక్తి అంటారు మాస్టారు .హాస్యగత వక్రోక్తి మూడురకాలు .1వైచిత్ర్యం 2హాస్య జనకంగా ఉండటం  3చమత్కారం ధ్వని గర్భంగా ఉండటం అన్నారు సార్.ఉదాహరణ –భార్య భర్త శీలాన్ని శంకించి నిష్టూరాలు ఆడుతూ ‘’అందమైన పిల్లకనిపిస్తే చాలు మీకు నాకు పెళ్లి అయి పెళ్ళాం కూడాఉంది అన్నదే మర్చిపోతారు ‘’అన్నది .భర్త వెంటనే ‘కాదు కాదు .చక్కని స్త్రీ కనిపిస్తే నాకు పెళ్లి అయిందనే సంగతి సూది పెట్టి గుచ్చినట్లు బాధతో జ్ఞాపకం వస్తుంది ‘’అన్నాడు .ఇందులో భార్య అంద గత్తె కాదనే బాధధ్వనిగా ఉంది .ఇదిచక్కని వక్రోక్తి అని కితాబిచ్చారు మునిమాణిక్యం జీ .

 మరోఉదాహరణ –ఒక అభిప్రాయంతో మాట్లాడినట్లు పైకి కనిపించినా వేరొక అభిప్రాయంకూడాస్ఫురించేది కూడా ఉంది .భార్య కొత్తగా కాపురానికి వచ్చింది వంట కమ్మగా చేయటం రాదు .ఆమాట ఆమెకు చెప్పలేడు.తనవంట బాగాలేదని ఆమెకు తెలీదు .పాపం ఒకరోజు ‘’నేను రోజూ ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారు ‘’అంది అమాయకంగా .వెంటనేభర్త ‘’నా జీవిత భీమా మొత్తం నీకే వస్తుంది ‘’అన్నాడు .తెలివిగలభార్యకు తేలిగ్గానే అర్ధమవుతుంది .ఇక్కడ రసం వ్యంగ్య రూపం లో ఉందని డిఫైన్ చేశారు గురూజీ .

 మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

దుర్గాష్టమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.8వ భాగం.3.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.8వ భాగం.3.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment