మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్

మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్

— పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఏ.జె. జాన్ మరణించడంతో హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా ఉన్న రాజమన్నారు 1957 నుండి 1958 వరకు మద్రాసు రాష్ట్ర ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు[2][3]

జననం
రాజమన్నార్ 1901లో మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి వెంకట రమణారావు నాయుడు అప్పటికే ప్రముఖ న్యాయవాది. ఆ తర్వాత మద్రాసు హైకోర్టులో న్యాయధిపతిగానూ, ప్రధానన్యాయాధిపతిగానూ పనిచేశాడు. రాజమన్నార్ కూడా తండ్రిబాటలోనే న్యాయవాదిగా 1924లో బార్ లో చేరాడు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ 1944లో అత్యున్నత పదవైన అడ్వకేటు జనరల్ అయ్యాడు.[4]

రాజమన్నార్ తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించాడు. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశాడు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నాడు. కొంతకాలం లలితకళకు సంబంధించిన తమిళ మాసపత్రిక “కళ”కు సంపాదకత్వం వహించాడు.[5] ఈయన ఫోటోగ్రఫీ ఒక హాబీ. రాజమన్నార్ వ్రాసిన నాటకాలెన్నో రేడియోలో ప్రసారమయ్యాయి. వాటిలో చాలా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఈయన బళ్ళారి రాఘవతో కలిసి “తెగని సమస్య” అనే నాటకాన్ని రచించాడు. తెలుగులో ఏకాంకికలు వ్రాసిన ఆద్యులలో ముద్దుకృష్ణ, చలంలతో పాటు రాజమన్నారు కూడా ఒకడు.[6] ఈయన వ్రాసిన నాటకాలలో తప్పెవరిది?,[7] ఏమి మగవాళ్లు, నిష్ఫలం, విముక్తి, వైకుంఠాచార్యులు, దెయ్యాలలంక, నాగుపాము, వృథాయానం, సంకల్పం, కఠినమార్గం, పరకీయ, నందిని, వెర్రిముండ, బంధాలు, భార్యాభర్తలు ముఖ్యమైనవి. “శృతితప్పిన సజీవన రాగం” అనే నవలను కూడా రచించాడు. నీడలేని ఆడది అనే సినిమాకు కథను అందించాడు[8]. ఇతడు ఈయన కళలకు, సాహిత్యానికి చేసిన సేవకు తగ్గట్టుగా భారతీయ సంగీత నాటక అకాడెమీకి అధ్యక్షునిగా నియమితుడయ్యాడు.

రాజ్‌మన్నార్ కమిటీ
1969లో అప్పటి తమిళనాడు డి.ఎం.కె ప్రభుత్వం కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షకు పి.వి.రాజమన్నార్ అధ్యక్షతన ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఇది రాజ్‌మన్నార్ కమిటీగా ప్రసిద్ధిచెందినది. రాజ్‌మన్నార్‌తో పాటు మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఏ.లక్ష్మణస్వామి ముదలియార్, ఆంధ్రరాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులు.[9] సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షించి విలువైన సూచనలిచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన సూచనలలో ముఖ్యమైనది “అంతర్రాష్ట్ర మండలి”ని ఏర్పాటుచేయడం.i

మరణం
రాజమన్నారు 1979, అక్టోబర్ 1 న 78 వ ఏట మద్రాసులో మరణించాడు.

మీ గబ్బిట దుర్గాప్రసాద్-14-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

భాషా కోవిదుడు ,స్వయంగా సంస్కృతం నేర్చివచన గ్రంధాలు నవలలు, బాలసాహిత్యం ,డిటెక్టివ్ నవలలు రాసిన -గుంటి సుబ్రహ్మణ్య శర్మ

జీవిత విశేషాలు
సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల ‘భూతగృహము’ ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.

రచనలు
భూతగృహము (అపరాధపరిశోధక నవల)
రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
మాధవాశ్రమము (నవల)
విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
జయాపజయములు
కాసులదండ
కాలభ్రమణం
కన్నీటికాపురం
ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
తనయుడనై నీయొడిలో
దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
(విశ్వజ్యోతి నుండి)
మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
(విశ్వప్రేమ నుండి)
బిరుదులు/సత్కారాలు
అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Leave a comment

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవిసెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు. ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు.

”జీవులకు పుట్టుట, గిట్టుట స్వభావ ధర్మాలు.. పుట్టుకకు కారణం కాముడు, అంటే మన్మథుడు. గిట్టుటకు కారణం కాలుడు, అంటే యముడు. ఈ ఇద్దరి బాధా లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి. జననం లేకుండా చేసుకోవాలంటే మన్మథుణ్ణి నిగ్రహించినవాని నాశ్రయించాలి. మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాని దగ్గరకు పోవాలి. ఈ రెండు పనులూ చేసిన పెద్దమనిషి ఒకరే. ఆయనే స్మరహరుడు, మృత్యుంజయుడు అయిన శివుడు. శ్రీకాంతుడంత సులభంగా దొరకడుగాని శివుడుమాత్రం సులభసాధ్యుడు. ఆయనను ఆశ్రయిద్దాం…నమః పార్వతీ పతయే హరహర మహాదేవ!” అందరితోపాటే నేనూ గొంతు కలిపాను. శ్రీవారు మరో ఘట్టం ఎత్తుకున్నారు.

ఉపన్యాసం ముగిసిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో డాబామీద విశ్రమించాను. క్రింద పారా ఇస్తున్నారు. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటింది. నాక నిద్రపట్టలేదు. ఆ యింటి అరుగుమీద కూర్చొని శ్రీవారి దర్శనంకోసం తహతహలాడుతున్నాను. ధైర్యంచేసి లోనికి వెళ్ళబోయాను. పారా ఇస్తున్న బ్రాహ్మణుడు ”పెరియవాళ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పైకి పోవద్దు” అన్నాడు. నిరాశతో తిరిగి వెళ్ళి, గోపికలు కృష్ణపరమాత్మను గురించి విరహంతో అన్నమాటలు- పోతనగారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాను. అంతలో ఏదో ప్రేరణచేత మళ్ళీలేచి డాబామెట్లు సమీపించి చటాలున అయిదుమెట్లు ఎక్కేశాను. పారాయిచ్చే బ్రాహ్మణుడు పరధ్యానంలో ఉన్నాడు. పైకిరమ్మని ఎవరో పిలిచినట్లయింది. పైకి దూకాను.

అక్కడ శ్రీవారు చేతిమీద తల ఆనించి ఓప్రక్కకు ఒదిగి పడుకొన్నారు. సడిచేయకుండా అడుగులు వేసి దూరంగా నిలిచాను. సంస్కృతంలో ‘కః?’ (ఎవరు) అని ప్రశ్నించారు.

”నేను, కల్లూరిని” అన్నాను.

వెంటనే-

”నిద్రా నాయాతా కిం? నైదాఘస్తాపో బాధతేవా?” (నిద్ర పట్టలేదా? ఎండ ఉడుకు బాధవల్లనా?) అని మళ్ళీ ప్రశ్నించారు.

”న నైదాఘస్తాపః – ఎండ ఉడుకు కాదు. నేటి ఉదయం మొదలు అయిదు నిముషాలైనా శ్రీవారి సన్నిధానం, దర్శనభాగ్యం దొరకలేదు. అందుకు తపిస్తున్నాను. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు అయిదు నిముషాలైనా నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి” అన్నాను.

”త్వయి గోపికాత్వ మతి దిశ్య మయి కృష్ణత్వం సంభావ్య కిమపి సంభావితం ఖలు-” నీయందు గోపికాభావం, నాయందు కృష్ణత్వం భావించి ఏదో అనుకొంటున్నావా? – అని అడిగారు శ్రీవారు. ఎలా తెలిసిందో!

ఆ తర్వాత, ”అద్య అస్మాభి స్తమిళ భాషాయాం ప్రసంగః కృతః. త్వం భాషానభిజ్ఞః. కిం జానాసి మదుక్తం” – మేము తమిళంలో మాట్లాడాము. నీకు అర్థమైందా? అని ప్రశ్నించారు.

”శ్రీవారు నా కర్థం కావాలని సంకల్పించారు. అందుచేత అర్థమైంది” అన్నాను. శ్రీవారి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా అరవదేశం వెడుతూ వస్తున్నా. నాకు అరవభాష కొంచెంకూడా పట్టుబడలేదు. ఆరోజు… అత్యాశ్చర్యం, శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది. అది వారి సంకల్పం. ఉపన్యాస సారాంశం చెప్పమన్నారు. చెప్పాను. దానిని ఈ చిన్ని శ్లోకంలో ఇమిడ్చాను.

జనిమృతి విరతిర్భవేదితిత్వాం రతిపతి శాసకమీశ కాలకాలమ్‌

హిమగిరి తనయా ద్వితీయ మీడే పరమ దయారస మీశ మద్వితీయమ్‌.

తెలుగు వివరణం-

జనన కారణం మన్మథుడు. మరణకారణం కాలుడు. ఆ యిద్దరిని నిగ్రహించిన ప్రభువు ఒక్కడే. కామవైరి మృత్యుంజయుడు. చంద్రశేఖరుడు శివుడు. ఆయన హిమగిరి, మంచుకొండ కూతురికి సగము శరీర మిచ్చిన వాడు, చల్లనివాడు, దయామూర్తి. ఆయనను ఒక్కని ఆశ్రయిస్తే రెండు లాభాలు కలుగుతాయి అనివారి ఉపన్యాస సారాంశం ఈ శ్లోకంలో ఇమిడించికొన్నాను.

శ్రీవారు చిరునవ్వుతో విన్నారు. ఆ మందహాసం నాకు వెన్నెలై తోచింది.

”నా సన్నిధి రోజు మొత్తం మీద అయిదు నిముషాలైనా కావాలన్నావు కదా! ఇప్పుడెన్ని నిముషాలైంది? ప్రశ్నించారు శ్రీవారు.

”పదిహేను నిముషాలు అయుంటుం”దన్నాను.

అటుపైన, ప్రాకృతదృష్టితో వారిపై జాలితోను, శ్రీవారు కటికనేల మీద పడుకొన్నారు. హృదయం ద్రవించిపోతోంది” అన్నాను.

వెంటనే, ”కిం నశ్రుతమ్‌” – వినలేదా?

క్షితితల శయనం తరుతలవాసః

కరతలభిక్షాకౌపీనవంతః ఖలు భాగ్యవంతః

కౌపీన ధారులు, పరివ్రాజకులు భాగ్యవంతులు. కటికనేలపై పడక, చెట్టుక్రింద నివాసము, అరచేతిలోఅన్నపుముద్ద- అంతకంటె భాగ్యవంతులెవ్వరు? అన్నీ ఉన్న సంసారుల దేమి భాగ్యం – అని నన్ను ఊరడించి విశ్రమించమని పంపించారు.

పద్యపాద స్ఫురణ

నావల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కలుగుతుంటాయి అన్నాడు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, అర్జునుడితో. కృష్ణావతారం తరువాత జ్ఞానావతారంగా వచ్చిన ఆదిశంకరుల అనంతరం, వారి సంపూర్ణాంశంతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది నాకు స్పష్టంగా రుజువైంది. అదొక అద్భుత ఘట్టం.

శ్రీధరవారు ఆంధ్రులు. పశ్చిమ గోదావరిజిల్లా కానూరు అగ్రహారీకులు. ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞాలు చేసినవారు, బ్రహ్మణ్యులు, గొప్ప అనుష్ఠాతలు, శివభక్తులు. మహా పండితుడు, మహాకవీ కూడా. ‘అయ్యవాళ్‌’ అనేది వారి గౌరవనామం. ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీవారే కొన్ని కథలు నాకు చెప్పారు.

వారు సిద్ధిపొందిన తర్వాత వారి గృహం శంకరమఠంగా మారింది. శ్రీవారు ఆ ఇంటిలో మకాం చేసినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను. ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాలను సందర్శించడానికి శ్రీవారు బయలుదేరారు. వారివెంట నేనూ ఉన్నాను.

ప్రదక్షిణం చేస్తూ, ‘ఇది శివాలయం. శివుని మీద నీవు చెప్పిన పద్యం చదువు’ అన్నారు. అప్పుడొక శ్లోకం చదివాను. మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారు, అదే ప్రాకారంలో ఉన్న విష్ణ్వాలయానికి దారి తీశారు. అక్కడ, విష్ణువుమీద పద్యమొకటి చదవ మన్నారు. మా ఊరిలోని మా కులదైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవడం ప్రారంభించాను. మొదటి మూడు పాదాలు చదివానుగానీ నాలుగవ పాదం ఎంతకూ జ్ఞాపకం రాలేదు. గిలగిల లాడాను.

శ్రీవారు వెంటనే ”అస్య పద్యస్య కతిపాదాః” – ఈ పద్యానికి ఎన్ని పాదాలు? అని అడిగారు.

”చత్వారః” – నాలుగు పాదాలు అన్నాను. ”అయం మదనగోపాలః – ఉత వేణుగోపాలః?” అని అడిగారు మళ్ళీ.

”వేణు గోపాలః”

”వేణుః కుత్ర?” – వేణువేదీ?

”దానికోసమే వెతుకుతున్నాను. మరచి పోయాను” – అన్నాను. వెంటనే స్మృతికి తగిలింది. ఆ పిల్లనగ్రోవి –

మధుర బింబాధర సుధ దోగి తోగి యింపొలసి వేణువు దివ్యకళలు గురియ” ఇదీ ఆ పద్యపాదం. చదివాను. మొన్నమొన్న ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు, ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి నాకు కలిగింది. ఆ మీద నా ‘గురుకృపాలహరి’లో శ్రీవారిని శివుడుగా శివలీలా తరంగంలోనూ, కృష్ణుడుగా హరిలీలాతరంగంలోనూ – వట్టి కవిత్వంతో గాదు – ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో పెక్కు శ్లోకాలలో కీర్తించుకొన్నాను.

ప్రారబ్ధశేషం

అది నా జాతకంలో క్లిష్టమైన ఘట్టం. జీవన్మరణ సమస్య. మహాప్రస్థాన సమయం. కాలదర్శనం అయింది. దక్షిణాధీశుడు నాకై వచ్చాడు. శ్రీవారు ప్రత్యక్షమై ‘ఇప్పుడే పంపము’ అన్నారు. ఇద్దరూ ఏమో మాట్లాడుకొన్నారు. యమవాహనం గోడదూకి వెళ్ళిపోయింది. ధర్మప్రభువు నిటలాక్షుని చూసి వెనుకడుగు వేసుకొంటూ తన దిశగా వెళ్ళిపోయారు. శ్రీగురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి నాకు మార్కండేయునితో సామ్యం అనుగ్రహించారు. ఈ ఘట్టం నా ‘గురుకృపాలహరి’లో ఉంది. అందులో లేని తరువాతి ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తాను.

చిదంబరానికి అవతలి మజిలీ అయిన ఆనందతాండవపురంలో శ్రీవారు బసచేసి ఉన్నారు. మృత్యుముఖం నుంచి బయటపడిన నేను అక్కడకు ధర్మపత్నితో శ్రీవారి దర్శనానికి పరుగెత్తాను. పూర్తిగా కోలుకోకుండానే రైలులో దక్షిణాదికి దీర్ఘప్రయాణం చేశాను. స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెడుతున్నాను. శ్రీవారు స్వయంగా నాకు ఎదురు వచ్చారు. రైలు బట్టలు, స్నానంలేదు. రాత్రి నిద్రలేదు. ఈ స్థితిలో శ్రీవారికి ఎదురవడ మెట్లా అనుకొంటూ ఒక ఇంట్లోకి వెళ్ళాను. నా వెంటే వారూ అక్కడకు చొచ్చుకొని వచ్చారు. ఇక చేసేదిలేక వెనుదిరిగి సాష్టాంగ పడ్డాను.

తర్వాత కోనేటికి స్నానార్థం బయలుదేరారు. నేనూ వెంట నడిచాను. అది వేసవికాలం. నా శరీరంలో రక్తంలేదు. కాళ్ళు అంటుకుపోతున్నాయి. శ్రీవారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెరువుకు తీసుకొని వెళ్ళారు. వారు నీటిలో దిగారు. నేను మెట్లమీద నిలబడ్డాను. కాళ్ళు అంటుకుపోతున్నాయి. వెళ్ళిపోదామా అంటే శ్రీవారు ఏవో మాటలు ప్రారంభించారు. ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక కాలు ఆనించి ఇంకో కాలు ఎత్తుతూ, అతికష్టంమీద ఆ వేడిని తట్టుకొంటూ వారికి జవాబులు చెబుతున్నాను.

స్నానమై వారు మఠానికి దారితీశారు. నేనూ వెంట నడుస్తున్నాను. నేను బసచేసిన ఇంటివద్ద వారు ఆగారు.

”శ్రాంతోసి. విశ్రమస్య. స్నానాదికం కురు” – చాలా అలసిపోయావు. ప్రయాణం బడలిక..విశ్రమించు. స్నానాదికం చేసుకో – అన్నారు.

బ్రతుకుజీవుడా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. అంతవరకు ఉడికిపోయిన నా పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చలువదనం పొందాయి. ఆ వేడి అంతా ఏమైందో! హాయి అనిపించింది.

అప్పుడు నాకు అర్థమైంది. రోగరూపంలో నేను అనుభవించవలసిన ప్రారబ్థశేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట. ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు. ఆ కర్మ శేషాన్ని నైదాఘతాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రంచేశారు. ఈ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు.

లీలా తాండవ పండితః

ఆనందతాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం. శ్రీవారు సంధ్యా వందనానంతరం ఒక దేవాలయ ప్రాంగణంలో పండితులతో పేరోలగం చేశారు.

శ్రీవారు ధార్మిక విషయాలుగాని, వేదాంత విషయాలుగాని బహిరంగ సభలలో ముచ్చటించడం ఎన్నడూ నేను ఎరుగను. కాని ఆనాడు అద్వైతం మీద, దాని గురించిన భిన్నభిన్న ప్రస్థానములు, వాటిలోని సామరస్యం మీద వాదోపవాద సిద్ధాంత సమ్మర్ధంతో శ్రీవారు సంస్కృతభాషలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాధుడు, నటరాజమూర్తి చేసిన ప్రదోష తాండవమే నని నాకు అనిపించింది. మైమరచి నాలో నేను,

”లీలా తాండవ పండితః”

అని శ్రీవారిని చిదంబరేశ్వరునితో పోల్చుకొని మురిసిపోతున్నాను. వేయిమందిలో నేనుండి, నాలో నేను అనుకొంటున్న మాట ఇది. కానీ, శ్రీవారు ఆలయం గోడకు జేర్లబడి, అటూ ఇటూ ఊగుతూ ”లీలా తాండవ పండితః” అని మూడుసార్లు అన్నారు. దానితో నాకు మతిపోయింది. పరుగు పరుగున వారి సన్నిధి చేరి, ఆనందబాష్పాలు కురుస్తుండగా సాష్టాంగపడ్డాను. శ్రీవారు గంభీరంగా నవ్వారు. ”ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం” అన్న గీతాశ్లోకం స్ఫురణకు వచ్చింది.

ఆ మరునాడు సోమవారం, ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది. శ్రీవారు ఆ సభకు నడిచి వెడుతున్నారు. వెనుక నేను ఉన్నాను. వారు నాకేసి తిరిగి ”అస్మిన్‌ దినే సంస్కృత భాషాయాం త్వయా ప్రసంగః కర్తవ్యః” (ఈరోజు నీవు సంస్కృత భాషలో మాట్లాడాలి) అన్నారు. ముందురోజే దాక్షిణాత్యపండితులు సంస్కృతభాషలో వీరవిహారం చేశారు. వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు. ”మీ అనుగ్రహంతో లభించిన వాక్కుతో, మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను” అని వారితో అన్నాను.

సభలో దిగ్దంతులైన పండితులున్నారు. శ్రీవారు అగ్రాసనం అలంకరించారు. ఒకరిద్దరు మాట్లాడిని తర్వాత నన్ను పిలిచారు.

అప్పుడు నేను, ”ఏ బ్రహ్మవస్తువు నుండి వాక్కులు (శ్రుతులు) మరలునో, వాచామ గోచరమైన ఆ వస్తువును నిరూపించలేక వెనుదిరుగునో, అలాంటి ఒకానొక సచ్చిదానందాత్మకమైన చంద్రిక (జ్ఞాన ప్రకాశము), మౌళిగాగల (తలమానికముగా గల) పరబ్రహ్మకు, తద్రూపులైన శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం” అనే అర్థం కలిగిన శ్లోకంతో నా ప్రసంగం ప్రారంభించాను.

ఆ మీదట,

అభయం దత్త మేవాస్తి మృత్యుంజయ కుతో భయమ్‌

తాండవే స్థలనం క్వాపి శిశోస్తదపి మండనమ్‌

శ్రీవారు యముని తరిమినప్పుడే ”మృత్యుంజయులు”గా ఈ శిశువుకి అభయ మిచ్చారు. ఇప్పుడు సంస్కృతభాషలో మాట్లాడటమనే ఈ గెంతులలో స్థలనం (తప్పటడుగు) పడితీరుతుంది. ఇది శిశువుచేసే తప్పటడుగు గనుక లయానుగుణంగా ఉంటే అందమే లేదు. తప్పటడుగు పడితేనే అందం” – అన్నాను.

తదుపరి ”నటరాజౌ స్థితే సాక్షాద్గురు వానంద తాండవే, తండుర్యది భ##వేయంమే లీలా తాండవ మస్తుతత్‌” అనే శ్లోకం చదివాను. దీని భావం – సాక్షాద్గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనందతాండవంలో ఉండగా, నేను శివపరివారంలోని తండువు అనే పరిచారకుడనైతే, నా యీ ఉపన్యాస రూపమైన లీల నిజంగా తాండవమే అవుగాక!

వెంటనే శ్రీవారు ”సుబ్బు శాస్త్రి! శ్రుతంవా అనేన తాండవ శబ్దస్య పరిష్కారః కృతః” – తాండవశబ్దం వ్యుత్పత్తి ఇచ్చాడు, విన్నావా?! — అన్నారు. సుబ్బుశాస్త్రిగారు సర్వశాస్త్ర పారంగతులు. ఆనందంతో తలవూపారు.

ఆపైన సుబ్బుశాస్త్రిగారు ”మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుతఘట్టం స్ఫురిస్తోంది. మీ కవిత్వం సార్థకం” అంటూ, అదే ఊళ్ళో అంతకు పదిరోజుల క్రితమే ఒక మూగ కుర్రవానికి స్వామి వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించాను.

శ్రీవారు చిరునవ్వుతో అనుగ్రహించారు. సభ్యులు ఆనంద భరితులయ్యారు.

ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధానప్రశ్న. ఉండదు. అక్కడసలు సంకల్పమే ఉండదు. నిస్సంకల్పస్థితి వారిది. అయితే ఇవి మనకెందుకు కనిపించాయి? ఇది మన మనోవిలాసమే. దృశ్యమంతా మనస్సే. ఈ విషయాన్ని నా ”గురు కృపాలహరి”లో ”నసంకల్ప వేశోభ##వేద్వా వికల్పః” అనే శ్లోకంలో పేర్కొన్నాను.

మనకు చరిత్ర లేదా?

మనదేశానికి లిఖితపూర్వకమైన చరిత్రలేదని సామాన్యంగా అందరూ అనేమాటలు. మన పురాణాలు చరిత్ర కాదని వీరి అభిప్రాయం. క్రీస్తుశకం అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే ఆధునిక విద్యావంతులు చరిత్రగా పరిగణిస్తారు. అంతకు పూర్వం జరిగినదంతా వారి దృష్టిలో చరిత్రకాదు! ఒకవేళ పూర్వ వృత్తాంతాన్ని చరిత్రకింద అంగీకరించవలసివచ్చినా, తమ చారిత్రక పరిశోధనల ప్రకారం పురాణగాధలలో గల సత్యం అత్యల్పం. తమకు నచ్చిన సిద్ధాంతాలకు, తాము నమ్మిన సూత్రాలకు అనుగుణమైన విషయాలు మాత్రమే వారికి విశ్వసనీయాలు.

అప్రాకృతిక సంఘటన లేవైనా వారి దృష్టిలో కేవలం కట్టుకథలు. సాధారణ మానవుని అనుభవానికి, గ్రహణశక్తికి మించినదంతావారు అసత్యంగా కొట్టివేస్తారు. పురాణాల్లో మహిమలూ, అణిమాది సిద్దులూ ఉండడంచేత వాటిని ‘చరిత్ర’గా అంగీకరించరు.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-22

Posted in సేకరణలు | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2

      దేవేంద్ర జననం,విద్యాభ్యాస౦

 ద్వారకానాథుడు తన  కుటుంబం లోనిస్త్రీలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు .అందరిలో ఒకకొత్త వెలుగు ఆశాజ్యోతి కలిగించాడు రామమోహనుడు తన సకలకళా పా౦డిత్యాలచేత .ఈ కుటుంబం లోని  వారంతా అన్నిటా అద్వితీయ పండితులయ్యారు .ద్వారకానథుని భార్య గర్భం దాల్చింది .ఆమెకు పుట్టేబిడ్డ మహా మహిమాన్వితుడు అవుతాడని రాయ్ చెప్పేవాడు .1818 మే నెలలో ఆమెకు దేవెంద్రనాథుడు జన్మించాడు .అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు ముఖం లో దివ్య తేజస్సు ఉట్టి పడేది .రాయ్ కు ఈ బాలుడు దైవాంశ సంభూతుడు అనిపించాడు. ఆయన దృష్టి అంతా దేవేంద్రునిపైనే ఉండేది.ఇంట్లో వారంతా ఆయన్ను ఎందుకు ఈబాలుడిపై అంత ఆపేక్ష అని అడిగితె ‘’యితడు అపూర్వ శిశువు .నాకార్యక్రమాలన్నిటికి తోడ్పడే మహానుభావుడు అవుతాడు ‘’అని చెప్పాడు .’

 దేవేంద్రనాథ ఠాకూర్ బాల్యం నుంచి శాంతచిత్తుడే .ప్రసన్న స్వభావుడే .అతనిది స్థిర చిత్తం .దేనినీ కోరేవాడుకాడు .దేన్నీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు .పూజలో కూర్చుంటే ఐహిక స్మృతి ఉండేదికాదు .విద్యలలో నేర్పరి .రాయ్ గారి విద్యాలయం లో చేర్పించారు .14వ ఏట అన్ని విద్యలలో ఆరితేరి హిందూ కాలేజిలో చేరాడు .రామమోహనుడు విదేశాలకు వెడుతూ దేవేంద్రుని దగ్గరకు పిలిచి అతని చెవిలో యేవో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయాడు .ఆమాటలతో అతడు ధర్మ పిపాసి అయి నడవటం ప్రారంభించాడు .బ్రహ్మ సమాజ వ్యాప్తికోసమే తహతహలాడేవాడు .తనకు కనిపించిన వారందరి బ్రహ్మజ్ఞానం బోధించేవాడు .ఎక్కడైనా అశాంతి ,కల్లోలాలు ఏర్పడితే వెంటనే వెళ్లి శాంతి నెలకొల్పేవాడు .ఏవిషయం లోనైనా అనుమానం వస్తే బ్రహ్మ సమాజ ఆచార్యుడుపండిత రామచంద్ర విద్యా వాగీశుని దగ్గరకు వెళ్లి సందేహ నివృత్తి చేసుకొనే వాడు .ఆనాటి దార్మికపండితులు కూడా ఆయన ప్రజ్ఞా పాటవాలకు అబ్బురపడుతూ ఆశ్చర్యపొయెవారు .ఎంతజటిల మీమాంసా విషయమైనా యిట్టె పరిష్కరించేవాడు .పండితుల వాచాలత కు అడ్డు కట్ట వేసేవాడు. సూక్ష్మ దృష్టి అతని ప్రత్యేకత .గడ్డాలు మీసాలు పెంచి ఘోరతపస్సు చేసే మహర్షులకు లభించే విజ్ఞానం కంటే దేవేంద్రుని విజ్ఞానం సహస్ర రెట్లు ఎక్కువ అనే వారు .అతని ఆచార్యులు ప్రకృతి దేవి ,అనంత విశ్వ క్షేత్రాలే .

 ఉపనిషత్తులు అధ్యయనం చేసేటప్పుడు సర్వభూతాతీత పరమాత్మను లోపల జ్వాజ్వల్యమానంగా దర్శించేవాడు .అప్పుడు పిచ్చివాడులాగా పరిగేట్టేవాడు .ధర్మశాస్త్రాలు తర్కమీమా౦సలు చెవి ఒగ్గి వినేవాడు .తాను అజ్ఞాని అని తనకేమీ తెలియదని అనేవాడు .చీకటిలో తిరిగేవాడు .భేదభావం అతనికి లేనేలేదు పరమహంస ప్రవర్తన లాగా ఉండేది అతిని తీరు .అనుకోకుండా ఆయనకు ఒక ఉపనిషత్ గ్రంథం లోని ఒక చికి కాగితం కంట పడింది .అది చదివి అర్ధం చేసుకొన్నాడు .వెంటనే ఆయన హృదయం లో ఒక అపూర్వ తేజస్సు ప్రాడుర్భవించింది .మధుర రస తరంగిణి గట్లను ఒరుసుకొంటూ ప్రవహించింది .ఆకాగితాన్ని తీసుకొని వెళ్లి తనగురువు వాగీశుని అందులోని భావతాత్పర్యాలు పూర్తిగా తెలియజేయమని కోరాడు .అప్పటి నుండి ఆయన బ్రహ్మ విద్యోపాసకుడు అయ్యాడు .

  హిందూ కాలేజిలో చేరిన దేవేంద్రుడు విద్యలో అఖండుడు అయ్యాడు .అధ్యాపకులు అతడు మహా పండితుడు అవుతాడని భావించి దీవించారు .ఎంత చదివినా తృప్తి తీరటం లేదు .కొత్త విషయాలు తెలుసుకోవాలనే తహ తహ ఎక్కువైంది .కాలేజిలోధర్మ విషయ చర్చకు అధికారులు అంగీకరించకపోవటం ఆయన్ను బాధించింది .తోటి విద్యార్ధులతో ఈవిషయం పైన మాట్లాడుతుంటే వారిలోకూడా ధర్మ జిజ్ఞాస ఉన్నట్లు తెలిసింది .కాలేజి విద్యార్ధులు 200మంది కలిసి ‘’సాధారణ జ్ఞానోపార్జని ‘’సభ ఏర్పరిస్తే , అందులో దేవేంద్రుడు కూడా చేరాడు .కానీ వీరుదార్మిక విషయాలు చర్చించరాదని యాజమాన్యం షరతు పెట్టింది .కాలేజిలో ఏదో ఒక రూమ్ లో సభజరిపి ఎవరికీ అభిమాన విషయం పై వారు మాట్లాడేవారు .కానీ దేవేంద్రునికి ఇది నచ్చలేదు .లోకజ్ఞానం వారికి లేదని బాధ పడ్డాడు .పుస్తక జ్ఞానం తో పురోభి వృద్ధి ఉండదని భావించాడు .తీవ్ర  అసం తృప్తిలోనే కాలేజి జీవితం గడిపాడు .

  హిందూకాలేజీ చదువు పూర్తీ చెసి ,ఇంటికి వచ్చి తమ జోరా సంకో గృహం లో ఖాళీ ఉన్న ఏకాంతమైన చోట కొంతమంది సాధారణ వ్యక్తులతో కలిసి ‘’తత్వ బోధినీ ‘’సభ స్థాపించాడు .దీనిలో విద్యావంతులు పట్టభద్రులు ఎవరూ లేరు .నిరాశ పడక ప్రతినెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ,ఎవరో ఒకరు  తనకు తెలిసిన తత్వ విషయం పై రాసిన వ్యాసం చదివటం దానిపై మిగిలినవారు చర్చాప చర్చలు  జరిపేవారు  .సంఘం పేరు సార్ధకం చేసేవారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చేతిలో 5 మహత్తర గ్రంధాలు

చేతిలో 5 మహత్తర గ్రంధాలు

 కిందటివారం  సికందరాబాద్ లో తిరుమలగిరి లో నాగార్జున యూని వర్సిటి రిటైర్డ్ లైబ్రేరియన్ ,సరస భారతి కి అత్యంత ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వర రావు గారిని కలిసినప్పుడు వారు ఎంతో ఆత్మీయంగా శ్రీ కొత్త వెంకటేశ్వర రావు గారు అత్యంత శ్రద్ధా నిష్టలతో రచించిన -ఆముక్తమాల్యద -సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష అనే 330పేజీల ఉద్గ్రంధాన్ని బహూకరించారు .ఉయ్యూరు వచ్చి ఒకసారి దాన్ని త్రిప్పి చూస్తె కొత్త కోణం లో రాయల వారి హృదయాన్ని ఆవిష్కరించారు రచయిత అని పించింది .దీన్ని సరసభారతి సాహితీబందువులకు ప్రత్యక్ష ప్రసారంగా అందించాలనే ఊహ ఇప్పుడే కలిగింది .

 అలాగే ఆకాశవాణి మాజీ సంచాలకులు శ్రీ నాగసూరి వేణు గోపాల్ ‘నాగ సూరి అకాడెమి ఆఫ్ మీడియా అండ్ సైన్స్ ”ద్వారా ఆయన సంపాదకత్వం లోప్రచురించిన  లబ్ధ ప్రతిష్టితులైన వివిధ రంగాలకు చెందిన వ్తక్తులు రాసిన వ్యాసాల సంకలనం  ”గాంధీయే మార్గం ”అనే రెండు భాగాల పుస్తకాలు , వేణుగోపాల్   స్వయంగా రాసిన -అసలైన విప్లవవాది ,సిసలైన సిద్ధాంత కర్త -గాంధీజీ ,తోపాటు ఆయనే   చలన చిత్ర పోకడలను విశ్లేషిస్తూ  రాసిన -అల్లాఉద్దీన్ సినిమాద్భుతం పుస్తకం  నాకు ఆదరంగా పోస్ట్ లో పంపారు .అన్నీ విలువైనవే .ఓపికగా ఎప్పుడో చదివి అభిప్రాయం రాయాలి -దుర్గా ప్రసాద్ -14-9-22,

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బహు ముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.2వ భాగం.13.9.22

బహు ముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.2వ భాగం.13.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్

ఆధారం -దేవేంద్ర నాద భట్టాచార్య రచి౦చిన వంగమాతృకకు శ్రీ ఆకురాతి చలమయ్య గారు ఆంధ్రీకరణ పుస్తకం ‘’మహర్షి దేవేంద్ర నాద ఠాకూర్ చరిత్రము ‘’.పిఠాపురం శాంతికుటీరం .ప్రచురణ .శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాల చేత ముద్రితం   .1937 తృతీయ ముద్రణం .బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారికి అంకితం .

  పరిచయం

పశ్చిమ బెంగాల్ లో కలకత్తా లో ని జోరా సంకో –అంటే కలకత్తా లోని అప్పర్ చిత్ పూర్ రోడ్డులో ఉన్న ఒక ప్రదేశం లోని ఠాకూర్ వంశం లో  మహా పుణ్యపురుషులు నిత్య ప్రాతః స్మరణీయులైన వారెందరో జన్మించారు .ఈ వంశంలో లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ నిత్యం కొలువై ఉండటం మరొక విశేషం .సదాచారాలు సద్ధర్మా చరణ వలన వీరి వంశం వారెప్పుడూ ధనం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలతో   విరాజిల్లారు .అన్ని విధాల ఉన్నత గుణ ,ఉత్తమ ప్రవర్తనలతో ఈ వంశీయులు బెంగాల్ లోనే కాక యావద్భారతం లోనూ విదేశాలలోనూ ప్రఖ్యాతులయ్యారు .ఈ వంశ స్త్రీలు కూడా మహా యశస్సు సాధించారు .కవిసమ్రాట్ రవీంద్ర నాథుడు ,ద్విజేంద్ర నాథ టాగూర్ , సత్యేంద్రనాథ ఠాకూర్ లు ఆణిముత్యాలుగా గుర్తింపు పొందారు .మహిళలలో స్వర్ణకుమారీదేవి ,సరళాదేవి వంటి వారు ఆవంశం లో పురుషులతో సమానంగా అన్నిటా రాణించారు .

  ఈ వంశం లో ద్వారకా నాథ ఠాకూర్ ‘’ప్రిన్స్ ‘’బిరుదు పొంది ,మొట్టమొదటి సారిగా ఆవంశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు .ద్వారకా నాథుని జ్యేష్ట  కుమారుడే మహర్షి ద్దేవెంద్రనాథ ఠాకూర్ .

  పరిస్థితులు

వంగ దేశ కీర్తి ప్రతిష్టలను వృద్ధి చేసినవారిలో విద్యాసాగర్ ,రామమోహన రాయ్ బంకిం చంద్ర చటర్జీ ,కృష్ణ దాసు, రమేష్ చంద్ర వంటి ప్రముఖులున్నారు .ఆంగ్లేయుల పాలనాకాలం లో క్రిస్టియన్ స్కూళ్ళు ఉండేవి అక్కడే అందరూ ఆంగ్ల విద్యనేర్చేవారు .దీనితో అక్కడ చదివిన వారికి భారతీయ సంస్కృతీ పై అభిలాష గౌరవాలు బాగా తగ్గిపోయాయి .నీతి నియమాలు దూరమయ్యాయి .కాలక్రమేణా పెద్దలు ఈ వైపరీత్యాన్ని గమనించి ,మేల్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు .హిందూ ధర్మం నీతినిజాయితీడైవభక్తి భారతీయ విద్య నేర్పటానికి,నాస్తికత నశింప చేయటానికి  ప్రత్యెక హిందూ విద్యాలయాలు స్థాపించాలనే సంకల్పం కలిగి ,కార్యరంగం లోకి దూకారు .ఆంగ్లేయ విద్యతోపాటు ధార్మిక  విప్లవం కూడా తీసుకురావాలని రాజా రామ మోహన రాయ్ సంకల్పింఛి ‘’బ్రహ్మ సమాజం ‘’స్థాపించాడు. కానీ ఆయననుధర్మద్రోహి అనీ ,సంఘద్రోహి అని పెద్దలు నిరాకరించారు .ఆయన చిత్తశుద్ధిని అర్ధం చేసుకోలేకపోయారు ఆయన బోధించిన ఏకేశ్వరోపాసన ఆనాడు పెద్దగా ఫలించలేదు .కానీ కొత్త ఆలోచనలకు దారి చూపిన మహాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు .

  ద్వారకా నాథఠాకూర్  కు రామమోహన రాయ్ దగ్గర బంధువే .ఆయన హృదయాన్ని అర్ధం చేసుకొని భావాలకు ఆకర్షితుడై నాడు.,రాయ్ కలకత్తా హిందూ కళాశాల స్థాపించి ,సాధారణ విద్యతోపాటు ,నీతి,ధర్మాలపై శిక్షణ ఇస్తూ విద్యార్ధుల భవిష్యత్తును తీర్చి దిద్దారు .కొంతకాలం తర్వాత హిందూకాలేజీ అధికారులు రామమోహన రాయ్ ను తమ సంఘం నుంచి ,బాధ్యతనుంచి దూరం చేసి ,కాలేజి ని నడపటం ప్రారంభించారు .దీనివలన యువక విద్యార్ధులు హిందువులు కాక ,క్రైస్తవులూ కాకుండా తమాషా వ్యక్తులయ్యారు .దీన్ని గుర్తించిన రాయ్ సాధారణ విద్యతోపాటు ,ధర్మ విద్య కూడా నేర్పటానికి స్వంత ఖర్చు తో అనేక విద్యాలయాలు నెలకొల్పాడు .

  దేవేంద్ర జననం

  రామమోహన రాయ్ ని లోకం దూరం చేసినా ఆయనపై అనేక ముద్రలు వేసినా  ప్రిన్స్ ద్వారకా నాథ ఠాకూర్ మాత్రం ఆయనకు అన్ని విధాలా సహకరించి ఆయన ఆశయాలను ప్రచారం చేయటానికి తోడ్పడ్డాడు .తనకున్న విశాల స్థలం లో బ్రహ్మసమాజ ప్రచారానికి మొట్టమొదటిసారిగా ఒక మందిరం కట్టించి ‘’ఆది బ్రహ్మ సమాజం ‘’అని పేరు పెట్టాడు .ఈ మందిరం నుంచే రామమోహనుడు తన ధర్మ ప్రచారాన్ని విజయవంతంగా సాగించాడు .ద్వారకానాథుడు రోజూ తానూ వచ్చి పాల్గొంటూ తన పరివారాన్ని కూడా పాల్గోనేట్లుచేసేవాడు .దీనితో జోరాసంకో ఠాకూర్ వంశం బ్రహ్మసమాజ ధర్మాలను ఆచరిస్తూ’’బ్రహ్మ ధర్మ అవలంబులు ‘’అనే ఖ్యాతి పొందారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.10వ చివరి భాగం.

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.10వ చివరి భాగం.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అడివి బాపిరాజు గారి బహు ముఖీన వ్యక్తిత్వం.1వ భాగం.12.9.22

అడివి బాపిరాజు గారి బహు ముఖీన వ్యక్తిత్వం.1వ భాగం.12.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.9వ భాగం.12.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.9వ భాగం.12.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు

ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు

ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 – జనవరి 15, 1941) స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి అనధికార ఛైర్మన్,రాజమండ్రి కి కరెంట్ తెప్పించిన రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.

బాల్యం, విద్యాభ్యాసం

సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది.[1] బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.

రాజమండ్రిలో

ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.

1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.

సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. 1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించాడు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే. 1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు.

1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత, సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించాడు.[1]

1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు.

సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన 85వ యేట మరణించాడు.[2]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-22-కాంప్ -మల్లాపూర్-హైదారాబాద్

Posted in రచనలు | Leave a comment

నీలకంఠేశ్వర శతకం

నీలకంఠేశ్వర శతకం
తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం కోటయ్య ,శ్రీ సోమన బసవ రాజు గార్లు .వెల-రెండు అణాలు.పుస్తక ముద్రణకు ద్రవ్యసాయం చేసిన వారు శ్రీ దగ్గులూరి వాస్తవ్యులు సామంత పూడి పెద వెంకట నృపాలుని ప్రియ సుతుడు శ్రీమతి బంగారాయాంబ దంపతుల ప్రియపుత్రుడు శ్రీ సత్యనారాయణ .పీఠిక లో కవి గారు తాను అప్పుడప్పుడు భక్తి గ్రంధాలను చదివి వినిపిస్తున్నప్పుడు తనమిత్రుడు దగ్గులూరి వాస్తవ్యుడు కర్ణ వంశానికి చెందిన శ్రీ వాసా సూర్య సోమ లింగం గారు ,ఆగ్రామ పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వరస్వామి పై ఒక శతకం రాయమని కోరితే,రాసి, తనగురువు శ్రీ చింతా వీరభద్రయ్య కవికి చూపించగా తప్పులు సరిచేసి ,శుద్ధ ప్రతి తయారు చేసి ఇచ్చారు .ఈ శతకం పై పెన్నాడ అగ్ర్హహార వాసి శ్రీ మల్లిపూడి వీరయ్య సిద్ధాంతి తన అభిప్రాయం రాస్తూ -కవి మృదుమధుర లలితా పదజాలంతో శతక రచన చేశాడని అన్నారు .పాలకొల్లు వాస్తవ్యులు ఉభయ భాషాప్రవీణ శ్రీ ధర్మపురి తిరుమల లక్ష్మీ కుమార వేదాంత తిరుమలాచార్యులు అభిప్రాయం తెలియజేస్తూ -సుధీ జన చిత్త రంజకంగా ,శబ్దాలంకార శోభితంగా కవిత్వం ఉందని మెచ్చారు .దగ్గులూరి వాస్తవ్యుడు శ్రీ పూడి భోగ లింగకవి ‘’సుధారసం తో ,మృదూక్తులతో ,గంగాలహరీ ప్రవాహంగా శతకం ఉన్నది ‘’అన్నారు .పాలకొల్లుకవి శ్రీ కడియం తమ్మన్న ‘’నీతి దాయకం భక్తి ముక్తి ప్రద౦గా ప్రాచీనకవుల ధోరణిలో శతకం నడిచింది .సర్వపాప సంహారకంగా ఉంది ‘’అని శ్లాఘించారు . లంకల కోడేరు వాసి పండిత బొండాడ లక్ష్మణ కవి ‘’బాలకవి బిరుదున్న ఈకవి రాసిన శతకం చదివి ముక్తిపొందాలి ‘’అని అభిప్రాయం రాశారు .వీరందరికి కవి కృతజ్నతలు తెలిపారు .ఇది సీస పద్య శతకం .’’దగ్గులూరి నివేశ ,పాతక వినాశ – నీలకంఠేశ నన్నేలు నిరతమీశ’’అనేది శతక మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీమన్మహేశ్వరా శ్రీతాజన మందార -శంకర పాహిమాం -పాహి శరణు-భోగీశా వరాభూష ,ముని మనోంబుజ పూషా -సర్వేషా పాహిమాం పాహి శరణు శరణు
గజచర్మ పరీధాన కైవల్య సంధాన -సర్వజ్న పాహిమాం పాహి శరణు -లింగ ,సుచారిత్ర ,లేఖర్షభ స్తోత్ర -పరశివ పాహిమాం పాహి శరణు
గరీమతో సీసా శతకమను కమలములను -మాలగా గూర్చి యర్పింతు మది నుతింతు- దగ్గులూరి నివేశ పాతక వినాశ -నీలకంఠేశ-నన్నెలు నిరతమీశ’’. తర్వాత పద్యంలో శ్రీ వీరభద్రదేశికునికి నమస్కరించాడు .తనది దేవల బ్రహ్మ వంశమని ,ఇంటిపేరు బళ్ళ ఆశ్వాలాయన సూత్రులమని ,గౌరమాంబ మల్లికార్జునుల తనయుడు ,అచ్చమాంబ కు భర్త అయినకనకయ్య తన తండ్రి అని వారి ప్రధమకుమారుడైన తనపేరు మల్లయ అని తెలిపాడు.తనతలిదండ్రులు తన్ను ‘’శివ దత్తకుమారుడు ‘’అని పిలిచేవారని ,కనుక శివుడు తనకు అన్నయ్య ,అంబికా గంగలు అమ్మలు .గణపతి కుమారస్వామి వీరభద్రుడు అన్నలు .వాళ్ళ అర్ధ శరీరులు తనకు వదినెలు అని చమత్కరించాడు .ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం లోని మొదటి అక్షరాలతో మరో సీసం అల్లాడు .అక్షరాలకు ఆద్యుడు ,బిందుయుత ప్రణవం , వర్ణత్రయంలో వాక్ సతీ,మా ఉమాకాంత లై పతులు నై శోభించాడు .పంచభూతాలు ,పగలు రాత్రి ,లోపల బయటివాడై ,సకల చరాచరమ్బై సర్వం శూన్యమై ,ఎంచటానికి అశక్తమై ,ఆది మధ్యాంతరహితుడవు నువ్వు అన్నాడు ,ఊపిరి వదిలేలోపు నిన్ను ఎన్నగలనో లేనో అని సందేహపడ్డాడు .
పౌలస్త్యుడు ఆర్టీతో ఆర్ధిస్తే నవనిధులు ,ఆగరాజసుత ఆర్చిస్తే అరమేను ,ఫల్గుణుడు తపిస్తే పాశుపతం ,ఇచ్చిన భక్త సులభుడవు అన్నాడు .మైదున రాముడిని కోర్కె తీర్చాడు .సంధ్యా నృత్యం చేసి అందర్నీ అలరిస్తావు .’’అత్యంత భారమౌ యవనీ తలంబొక శేషు౦డు శిరమున జెర్చి యుండే-నా భోగి కులనాధు నవలీలగా నొక కమతంబు వెన్నున గదలకుంచే -నా కచ్ఛపాంబును నతి సూక్ష్మముగా-నొక క్రోడంబు మునిపంట కూర్మి నుంచె-నా వరాహంబును అణుమాత్రముగనెంచి-జలధి మోయుచు నుండే గలత లేక – యోగ్యులగు ధీరులోరులకు నోపినంత -సాయమొనరింతురది వారి సఃజ గుణము ‘’అని చాలా చమత్కారంగా పద్యం అల్లి సూక్తి తో ముక్తాయింపు ఇచ్చాడు కవి .కోపం వదలటం ఘనం .శక్తిలేక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులను కాపాడాలి .డబ్బుమదం గర్వం పతన హేతువు అని సూక్తి ముక్తావళి కూర్చాడు .’’ఏరననుబ్రోవ విదినీకు మేర యటర ‘’అని ఆర్తిగా ప్రార్థించాడు .శ్రీ ధాత్రు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఈశతకాన్ని స్వామికి ఆర్పణం చేసి ముగించాడు 101వ సీసం లో .తర్వాత గద్యంలో –‘’ఇది శ్రీ మదుమా రమణ పాదారవింద మకరంద పానేందిందిర,బాలపరమేశ్వరీకరుణా కటాక్ష వీక్షణ సమాలబ్ధ ,సరస కవిత వైభవ ,మన్మహారుషిగోత్ర పవిత్ర ,అశ్వలాయన సూత్ర ,బళ్ళవంశపయఃపారావార కైరవ మిత్ర ,కనకాభి దేయ సత్పుత్ర ,మల్లయ నామ ధేయ ప్రణీతంబగు నీలకంఠేశ్వరశతకము సర్వ౦బును సంపూర్ణము ‘’అని ముగించాడుకవి .
భక్తి ముక్తి దాయకమైన శతకం కవి ప్రతిభ ప్రతిపద్యం లోనూ కనిపిస్తుంది .లోకరీతి, జన ప్రవృత్తి,ధర్మ సూక్షాలు ,నీతులు,నిష్టూరాలు కలబోసి రచించిన శతకం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి జీవితం.18వ భాగం

గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి జీవితం.18వ భాగం

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )

అనువాదకుల అవస్థలు

అనువాదకుడు కవి ఆత్మను నూటికి నూరు శాతం ఆవిష్కరించటం అసాధ్యం.అందుకే అనువాదకుడు కుందుర్తి ఆ యదార్ధాన్ని చెప్పి బెంగాలీ కవి అయిన జీవనానంద దాస్ కవితలను బెత్తెడు ఎడంగా అనువాదం చేసి తెలుగు దనం తేవటానికి కృషి చేశానని చెప్పాడు .బెంగాలీనుంచి ఇంగ్లీష్ అనువాదం పొందిన కవితలను ఆధారంగా తెలుగు అనువాదం చేశాడు .ఆధునిక భాషకు దగ్గరగా ఉండేట్లు జాగ్రత్త పడ్డాడు .కానీ బెంగాలీలో ఉన్న ఛందస్సౌన్దర్యం శబ్దలయ తూగు ఊపు భావాలపోహలింపు ఇంగ్లీష్ లోనూ ,అలానే తెలుగులోనూ  వచ్చి ఉండక పొవచ్చు  అని నిజాయితీగా చెప్పాడు కుందుర్తి .

‘’సముద్రపు తీరాన ఉప్పు కుప్పలమీద –కోరికల కన్నీళ్లు దళసరి మంచు కార్చటం ‘’,’’చెట్లకు వ్రేలాడుతున్న అరుణ ఫలజాతుల ప్రతిబింబాలు –ఏటి నీటిలో చూసుకొంటూ పొలాలు మురిసిపోవటం ‘’-‘రుత్వంతాల లో నదుల నీటిప్రవాహాల గుసగుసల సాంకేతికాలు –పుడమితల్లి పంట కూతురు పెరగటం ‘’. ఇలాటివి అనువాదాలకు లోన్గానివే  అయినా ,మాతృకకు దగ్గర గా ఉండేట్లు తెలిగీకరించాడు .’’దేశ దేశాల సరిహద్దు రేఖలు కలిసే చోట –రాబందులు రాజ్యం చేస్తూ ఎగురు తున్నాయి ‘’-‘మృత్యువంటే బెదిరి పారిపోయే అల్పజాతి పక్షులు  -తెల్లమొగాలతో దిగాలుగా ఉంటె –ఎత్తైన గుడి గోపురాలమీద రాబందులు ప్రదక్షిణాలు చేస్తూ –మృత్యువుతో రెక్కల కరచాలనం చేస్తూ ఆకాశమంతా ఆవరించాయి .’’’’మరణ శయ్య ప్రక్క టేబుల్ మీద –సగం తిని శల్యావశిష్టమైన –నారింజ పండులా నన్ను మళ్ళీ భూమ్మీదకు రానివ్వండి ‘’,’’పగలల్లా రైళ్ళు కార్లుట్రాములు సరీ సృపాల్లా జరజరా పాకి –అలసిపోయి బడలిపోయి నిద్రాలోక నిశీధంలో కలిసిపోతాయి ‘’,’’చంద్రబింబం రాలిపడి నీటిలో మునిగి పోయి౦దిక్కడే ‘’,

‘’పంచమిచంద్రుడు అస్తమించగానే –నిశ్శబ్దకాంత పరిగెత్తుకొచ్చి –ఒంటెలాపొడుగ్గా కిటికీలోంచి తలదూర్చి –ఒంటరిగా ఉన్న తాతగారిని ‘’మళ్ళీ లేవద్దు జీవితాన్ని తెలుసుకొనే బాధ తీరిపోయింది ‘’అని మెల్లగా చెవిలో ఊదింది ‘’,’’జీవితం ఒక పొడుగాటి వస్త్రం –మధ్యలో అతుకుల్లేవు –కాలం మాత్రం పందెంలో పరిగెత్తుకొంటూ వచ్చి –తేనే తుట్టేపట్టిన చోటే వాలింది-దారిద్ర్యబాధకు లొంగని దేహం పై వాలింది –ఆ ఏనుగు బతికినా చచ్చినా పది వేలే ‘’

  తిలక్ అమృతం కురిసిన రాత్రికవిత రాస్తే దాస్ ‘’వానకురిసిన రాత్రి ‘’కవిత రాశాడు .కుందుర్తి నగరంలో వానకవిత రాసినట్లు నాకు గుర్తు .నింగిలో ఎగిరే గాలిపటం సందడి కవికి ‘’ఆమెకండ్లు గుర్తుకు వస్తాయట ‘’.’’ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగ దేశానికి వస్తాను –నదీతీరాల విశ్రమిస్తూ ,వరిపోలాలుపర్యటిస్తూ పక్షిగా వస్తానేమో –మనిషిగా రాకపోవచ్చు ‘’అని ఆశాభావం వ్యక్తం చేశాడు జీవనానంద దాస్ .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణంగణపతిఖండం.8వ భాగం.8.9.22

బ్రహ్మ వైవర్త పురాణంగణపతిఖండం.8వ భాగం.8.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -312

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -312

312-మధ్యే వాద సినిమా మార్గదర్శి ,అంకూర్ సినీ ఫేం,పద్మభూషణ్  –శ్యాం బెనెగల్

1934లో డిసెంబర్ 14 న సికందరాబాద్ లో ప్రముఖ సిని ఫోటోగ్రాఫర్ బి.శ్రీధర్ దంపతులకు పుట్టిన శ్యాం బెనెగల్ ,చిత్రరచయిత ,దూరదర్శన్ సీరియల్స్ దర్శకుడు .నిజాం కాలేజిలోచదివి డిగ్రీ పాసయ్యాడు .ఉస్మానియా యూనివర్సిటి లో ఫిలిం సొసైటీ స్థాపించాడు .నీరా బెనెగల్ ను వివాహమాడాడు .అనేక పురస్కారాలు అందుకొన్న సృజన శీలి .అంకుర్ సినిమాతో సినీ వినీలాకాశంలో ధ్రువ నక్షత్రంగా మెరిశాడు .నిశాంత్ ,మంథన్,భూమిక చిత్రాలకు దర్శకత్వం వహించాడు .ఈ సినిమాలతో భారతీయ సినీ రంగం లో ‘మధ్యే వాద౦ ‘’ప్రవేశపెట్టిన మార్గదర్శి అంటే ‘పారలల్ సినీ పయనీర్ ‘’1940 తారవాత వచ్చిన ఫిలిం డైరెక్టర్ లలో అత్యుత్తమ దర్శకుడుగా పేరుపొందాడు .ఈ పేరు పెట్టింది సత్యజిత్ రే .1960-70లమధ్య వచ్చిన తన సినిమాలను ,తన సమకాలీనుల సినిమాలను పారలల్ సినిమాలు అని పేరు పెట్టాడు రే.మృణాల్ సేన్ డైరెక్ట్ చేసిన ‘’భువన్ షో౦,బెనెగల్ డైరెక్ట్ చేసిన అంకుర్ ఆ కోవ సినిమాలు . భారత్ ఏక్ ఖోజ్ అనే ఆయన తీసిన సీరియల్ విపరీతంగా పేరుపొందింది .

  ప్రముఖ నిర్మాతదర్శకుడు గురు దత్ కు శ్యాం బెనెగల్ కజిన్ .ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు సత్యజిత్ రే కు వీరాభిమాని .సత్యజిత్ రే,రిత్విక్ ఘటక్ ,బిమల్ రాయ్ ,మృణాల్ సేన్ ,తపన్ సిన్హా,క్వాజా అహ్మద్ అబ్బాస్ ,బుద్దదేవ దాస్ గుప్త ,,చేతనానంద్ ,గురుదత్,శాంతారాం లు పారలల్ సినిమా  పయనీర్స్ .ఈకాలాన్ని భారతీయ సినీ యుగంలో స్వర్ణయుగం అంటారు .

  శ్యాం బెనెగల్ 18 జాతీయ ఫిలిం అవార్డ్ లు ,ఒక ఫిలింఫేర్ అవార్డ్ ,ఒక నంది అవార్డ్ పొందాడు .2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకొన్నాడు .1976లో పద్మశ్రీ గ్రహీత. 1991లో పద్మభూషణ్ పొందాడు . ,

  బంగ్లా దేశ్ ప్రభుత్వం బంగ్లా పిత షేక్ ముజిబుల్ రెహ్మాన్ జీవిత చరిత్ర- ముజీబ్ బయోపిక్ తీయటానికి శ్యాం బెనెగల్ కు అప్పగించింది . ఈఏడాది అది విడుదల అవుతుంది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగుకన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావుదుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహం పెంపొందించుకున్నాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశాడు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈయన్ను జైలుపట్టభద్రుడుఅని కొనియాడాడు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973, డిసెంబరు 21న[1] మరణించాడు.

 మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు హిందూపురం లో తెలుగు పండిట్ గా పని చేసినపుడు కల్లూరి వారు తరచుగా కలిసేవారు సాహిత్యసభలకు నాన్నగారు వెళ్ళేవారు .ఆయన రాసిన పుస్తకాలపై సమీక్ష చేసేవారు .కానీ ఆయన్ను ఎప్పుడూ నేను చూడలేదు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 – మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకరు .

2022 మార్చి 21న పప్పూరు రామాచార్యులు 50వ వర్ధంతి జరుపుకోనున్నారు.[2]

జీవిత విశేషాలు
నరసింహాచార్యులు, కొండమ్మ దంపతులకు 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి ఇతని కుటుంబాన్ని పప్పూరువారని అనటం ఆనవాయితీ అయింది. ఇతని తండ్రి నరసింహాచార్యులు పేరు మోసిన పౌరాణికుడు. హరికథలు చెప్పడంలో సిద్ధహస్తుడు. అతడి పురాణప్రసంగాలలో హాస్యధోరణి అధికం. ఆ లక్షణాలే కుమారునిలో కూడా పొడచూపాయి. పప్పూరు రామాచార్యులు తండ్రివద్దే సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు. ప్రాథమిక విద్య అనంతపురం మునిసిపల్ హైస్కూలులో సాగింది. రాజమండ్రిలో అతని బావ కుంటిమద్ది రంగాచార్యుల వద్ద చేరి స్కూలు ఫైనల్ పాసయ్యాడు.[3] రాజమండ్రి పాఠశాలలో వడ్డాది సుబ్బారాయుడు ఇతనికి ఆంధ్రభాషను బోధించే గురువు. అక్కడే కందుకూరి వీరేశలింగంతో పరిచయం ఏర్పడింది. 1914-16లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే రాజకీయాలంటే మక్కువ ఏర్పడింది. 1917లో అనంతపురం లోని దత్తమండల కళాశాలలో బి.ఏ.చేరారు. రామాచార్యులు 1917-1918లలో బి.ఏ. చదువుకుంటున్న సమయంలో సహాధ్యాయి కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులతో కలిసి పదిహేను రోజులకొకసారి ‘వదరుబోతు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవారు. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో రెండు సంవత్సరాల పాటు యాభైకి పైగా వ్యాసాలను వెలువరించారు. వీటిలో ఒక వ్యాసం మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. వీటిని అనాటి అనంతపురంలోని స్వామి విలాస ప్రెస్సు లో ముద్రించారు. ఆంగ్ల సాహిత్యంలో టాట్లర్ పేరుతో వ్యాసాలు రాసిన స్టీలు ప్రేరణతో వీరు ఈ వ్యాసాలు రాశారు[4]. యాబై వ్యాసాలలో ఇరవై రెండు వ్యాసాలను వ్యాసపాఠకుడైన హిందూపురానికి చెందిన పక్కా గురురాయాచార్యుల నుండి సేకరించి, 1932న పుస్తకరూపంలో ముద్రించారు. ఈ పుస్తకానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ముందుమాట రాశాడు. 1920లో బి.ఏ. పూర్తికాగానే కలెక్టర్ ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరారు.

స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో 1921లో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. ఆ సమయంలో కైప సుబ్రహ్మణ్యశర్మతో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో ఇల్లూరులో నీలం సంజీవరెడ్డికి మరికొందరు పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పేవారు. కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని సోదరుడు మహానందయ్య, ఐతరాజు నరసప్ప, పాలకొండ రామచంధ్ర శర్మ, ఆత్మారామప్ప మొదలైన వారితో కలిసి 1922లో పినాకిని అనే వారపత్రికను ప్రారంభించారు. 1925 వరకు ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆ పత్రిక భాగస్వాములతో భేదాభిప్రాయాలు ఏర్పడి బయటకు వచ్చి 1926లో శ్రీ సాధన అనే పత్రికను స్థాపించి, స్వంత ప్రెస్సు సాధన ముద్రణాలయంలో ప్రచురించారు. ఈ పత్రికను 1972 మార్చిలో మరణించే వరకూ ఒక్క చేతితో నిరాఘాటంగా నడిపారు.

గ్రంథాలయోద్యమంలో పాత్ర
అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమంతో పాటు సాహిత్య సాంన్కృతిక రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో పప్పూరు రామాచార్యులు ఒకరు. నిరంతరం గ్రంథపఠన చేస్తూ అనేక విషయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన సంస్కృతాంధ్ర పాండిత్యాలు భారతదేశ సంస్కృతి మూలసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోవ డానికి దోహదం చేసింది. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించినారాయణ. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.

అనంతపురం చుట్టుప్రక్కలున్న తాలూకా, గ్రామస్థాయి గ్రంథాలయాలకు సైతం చేర్చేవారు. 1947-52 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పడు ఆ మునిసిపాలిటి ఆదాయం పెరిగి 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్ స్థాయికి చేరుకుంది. ఇందులో గ్రంథాలయా లకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయమని మద్రాస్ మెయిల్ అనే పత్రిక 4.11.1950 తేదీన సంపాదకీయంలో పేర్కొంది. ఆ సంపాదకీయం చదివిన నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు.

1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడినప్పడు తొలి అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చివేశారు. సొంత పత్రిక శ్రీసాధనను జిల్లాలోని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. వీరు జిల్లాలోని గ్రంథాలయాలకు చేసిన కృషి మరువరానిది. అనంతవురం జిల్లా కేంద్ర గ్రంథా లయానికి భవనం కావల్సి వచ్చింది. స్థానిక మ్యూజియం వారిని ఒప్పించి ఆ భవనాన్ని రూ.46,000/- లకు గ్రంథాలయ సంస్థకు విక్రయింపచేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాలో కంటే ముందుగా అనంతపురంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చుకుంది. ముందుచూపుతో కేంద్ర గ్రంథాలయ భవన సమీపంలో దాతలతో 30వేలకు పైగా నిధిని, 50 సెంట్ల స్థలాన్ని సేకరించి మహిళా, బాలల గ్రంథాలయాలను ఏర్పరచారు. వీటి ప్రారంభోత్సవానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు విచ్చేయడం విశేషం. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 1969లో ఆరుబైలు రంగస్థలం భువనవిజయం మంటపం నిర్మాణంలో కీలకపాత్ర వహించి దీని ప్రారంభించడానికి వావిలాల గోపాలకృష్ణయ్య, నీలం సంజీవరెడ్డి, పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మొదలైన ప్రముఖులు విచ్చేశారు. ఇలా అన్ని సదుపాయాలు చేకూరడంతో 1969లో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథా లయోద్యమ ప్రముఖులు డా.ఎస్.ఆర్.రంగనాథన్ ప్రశంసలకు పాత్రమైనది. జిల్లా గ్రంథాలయ సంస్థ రావూచార్యులను ఘనంగా సన్మానించింది. 1970లో ఆయన ఛాయాచిత్రాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు. 1930లో జరిగిన ఒక సంఘటన పప్పూరి వారికి గ్రంథాలయోద్యమం పట్ల గల అభిమానానికి సేవానిరతికి మచ్చుతునక.

స్వాతంత్రోద్యమంలో పాత్ర
ఈయనా , కల్లూరు సుబ్బారావు కలిసి గ్రామగ్రామాలకూ తిరిగి అక్కడి ప్రజలలో స్వాతంత్ర్య సమూపార్జనా కాంక్షను రేకెత్తించారు. మద్యపాన నిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామ పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. 1921లో గాంధీని తాడిపత్రిలో సందర్శించారు. ఆ సమయంలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. 1928 నవంబరులో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొని దత్తమండలాలకు బదులు రాయలసీమ అని వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప జేశారు. 1932లో ఒక సంవత్సరం పాటు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా జైలుశిక్షను అనుభవించారు.1937 నవంబర్ 17న శ్రీబాగ్‌ ఒడంబడికలో క్రియాశీలక పాత్రవహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈయన అరెస్టయ్యి తంజావూరు, వేలూరు జైళ్ళలో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఇతడు తనకున్న సహజ పౌరాణిక ప్రవచనాలతో తోటి డిటెన్యూలకు భారత, కాళిదాస కావ్యములలోని రమ్యభావాలను వినిపిస్తూ, సత్కాలక్షేపం చేసేవారు. వీరి ప్రవచనాపాండిత్యానికి రాజకీయఖైదీలు సంతోషించి జైలులోనే ఇతనికి పండిత సత్కారాలను నెరవేర్చేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా పురాణ కాలక్షేపాన్ని కొనసాగించారు. బళ్ళారిలో చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ బంగారుపతకంతో సత్కరించాడు. 1947నుండి 1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1952 నుండి 1955 వరకు జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1955 నుండి1962 వరకు ధర్మవరం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.[5] వీరి రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. రామయ్య పదాలుపేరుతో ‘విశ్వవినుత నామ వినుము రామ’ అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశారు. పినాకిని, సాధన పత్రికలతో పాటుగా సహకార పత్రికకు కుడా సంపాదకత్వం నెరపారు. దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి పత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. 1972 మార్చి21 వతేదీ తన 76వ యేట మరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -311311-’కుదిరితే ఒక కప్పు కాఫీ ‘’డైలాగ్ ఫేం ,ఎయిర్లైన్స్ ఉద్యోగి సినీనటుడు –రాజా

రాజా ఒక తెలుగు సినీ నటుడు. రాజా స్వస్థలం విశాఖపట్నం.[1] తల్లి క్రిష్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇరువైపులా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళింటికి బంధువులు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఆయనకు ఇద్దరు అక్కలు. రాజాకు ఎనిమిదేళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది. ఆ సంఘటన వారి జీవితంలో పెద్ద విషాధాన్ని నింపింది. తరువాత వాళ్ళు హైదరాబాదుకి వచ్చేశారు. వ్యాపార రీత్యా వాళ్ళ నాన్న విదేశానికి వెళ్ళాడు. కొద్ది కాలం అక్కడ గడిపిన తర్వాత ఆయన స్వదేశానికి వచ్చేశారు. అయితే వారికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. స్వదేశానికి వచ్చిన ఏడాదికే ఆయన గుండెపోటుతో చనిపోయాడు.

వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి రాజాకు పద్నాలుగేళ్ళు. రాజాతో పాటు వారి అక్క వాళ్ళు కూడా పెద్ద దిక్కులేకుండా ఉండడాన్ని భరించలేక పోయారు. ఒకానొక దశలో బాగా డిప్రెషన్ కు లోనై ఆత్మ హత్య చేసుకుందామని నిర్ణయించుకుని పురుగుల మందు తాగేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాళ్ళ స్నేహితులు కొంతమంది వచ్చి ఆసుపత్రిలో చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక వాళ్ళు శ్రేయోభిలాషులు కొంతమంది కౌన్సెలింగ్ చేశారు. అన్నింటికీ చావే పరిష్కారం కాదని ధైర్యం చెప్పారు.

తర్వాత రాజా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ అయిపోయాక లుఫ్థాన్సా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి 3500 మంది పోటీ పడగా ఎంపికైన నలుగురిలో రాజా ఒకడు. ఉద్యోగం రావడంతో వారి కుటుంబ కష్టాలు దాదాపు తీరిపోయాయి. శిక్షణలో ఉండగానే దాదాపు 40,000 జీతం వచ్చేది. తరువాత అది 60000 కి పెరిగింది. అక్కకి పెళ్ళి చేశాడు.

చదువైపోయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. డబ్బు కూడా వెనుకేసుకున్నాడు. అప్పుడు రాజా మనసులో ఏ మూలనో ఉన్న నటుడు కావాలనే కోరిక బయటపడింది. రెండున్నరేళ్ళుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగివచ్చాడు. ఫోటోలను, సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. అవకాశాలు మాత్రం రాలేదు. కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళ్ళి మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు.

అలా ఒకసారి సికింద్రాబాద్ క్లబ్‌లో నాటకం వేయడానికి వచ్చి పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు. వారు తమ సమీక్షల్లో రాజా గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ రివ్యూలు చూసిన దగ్గుబాటి రామానాయుడు నుంచి అందుకున్న ఫోన్‌కాల్ సినీ పరిశ్రమలో రాజా తొలివిజయం అని చెప్పవచ్చు. నటుడిగా రాజా మొదటి సినిమా ఓ చినదానా. ముంబైలో ఉన్నప్పుడు ఇతడికి ఇ.వి.వి. సత్యనారాయణ కొడుకులతో సంబంధాలుండేవి. వారి ద్వారా ఈ సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (సినిమా) రాజాకు పేరు తెచ్చిపెట్టింది.

సినిమాలు
· ఓ చినదాన

· విజయం

· ఆనంద్

· అప్పుడప్పుడు

· కల

· మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు

· మిష్టర్ మేథావి

· జగన్మోహిని

· టాస్

· ఆ నలుగురు

· కోకిల

· కేక

· కలియుగ

·

Posted in సినిమా | Tagged | Leave a comment

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు.

బాల్యం, విద్యాభ్యాసం
ఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ బ్రాహ్మణుల కుటుంబంలో, వేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు కుమారునిగా జన్మించారు. ఆయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం అభ్యసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి శిక్షణ కోర్సును చదవడం ప్రారంభించారు.

స్వాతంత్ర సమరంలోకి
ప్రభుత్వోపాధ్యాయ కోర్సు చదవడం ప్రారంభించిన ఆత్మకూరి గోవిందాచార్యులు 1920 అక్టోబర్ 13న గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని విద్యాభ్యాసం వదలిపెట్టారు. 1920లో కలకత్తా, నాగపూర్ లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున గాంధీ సహాయ నిరాకరణను సమర్థిస్తూ మాట్లాడారు. 1921లో ఏలూరులో గాంధీ ప్రబోధించిన జాతీయ విద్యాలయం స్థాపించినవారిలో ఆయన ఆత్మకూరి కూడా ఉన్నారు.

పత్రికా సంపాదకునిగా
వీరు ఏలూరు నుండి 1924లో సత్యాగ్రాహి అనే పేరుతో ఒక రాజకీయ వారపత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు[1].

రచనలు
· గోవింద రామాయణము[2]

· మహాత్మా గాంధీ చరిత్ర

· భారతదేశ ఆర్థికచరిత్ర

· భారతీయ రాజ్యాంగ చరిత్ర

· పాహిమాం శతకము

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3
కవిగా జీవనానంద
జీవనాన౦ద దాస్ కవిత్వం లో ప్రత్యేకత అతని భావ చిత్రాలలో నవ్యత .ఇందులో సంప్రదాయం సమకాలీన భావ సమైక్యతా ఉంటాయి .అతని భావ చిత్రాలు టాగూర్ వాటికంటే ప్రత్యేకంగా ఉంటాయి .టాగూర్ భావ చిత్రాలు అనువాదం లో తేలిపోతాయి అంటే పేలవమై పోతాయి .ఈయనవి స్పష్టంగా నిలుస్తాయి.ఇతనికవిత్వం లో పదాలు సందర్భ శుద్ధి దాటి ఎక్కడో ఉండి అధివాస్తవిక భావనాబలం తో కొత్తగా కనిపిస్తాయి ఇతని ‘’మృత్యు పరిష్వంగానికి ముందు ‘’కవిత విశిష్ట మార్గం లో ఉంటుంది .దీని నిండా కళ్ళకు కనిపించే ,చెవులకు వినిపించే చిత్ర ,క్లిష్ట సంకేతాలు౦టాయి .ఆయన అనుభూతుల్లోంచి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్లు ఉంటాయి .అలంకారాల అందం బలంగా మనసులోకి చొచ్చుకుపోతుంది .ఉదాహరణ –‘’నది ఒడ్డున మంచుపూలు వెదజల్లుతున్న –నారీరత్నాలను చూసిన మేం –నీటిలో ఏకాంతంగా ఈదే –చేపకన్నెల నేత్రాలలోకి –అలల ద్వారా చొచ్చుకు పోయిన –ధాన్యపు సుగంధాలు దర్శించాం-ఇంతకూ మించి నేర్చే దీమిటి ? మృత్యు పరిష్వంగానికి ముందు కు ?ఎర్రగా ఎత్తుగా పెరిగిన ప్రతికోర్కేకు పక్కన గోడలా –నల్లటి మృత్యు ముఖం దాక్కుందని నరులైన మనకు తెలీదా ?మనిషి మనసులో పండే కలలూ ,ఐహిక భోగాల బంగారు చాయలూ –ఒక మహా ప్రశాంత నిశ్చలయోగ స్థితిలో –సమతూకం లో ఉంటాయని ప్రజలకు తెలీదా ?’’
ఇలా ఒకదాని వెంట మరో భావచిత్రం పరుగులు తీసి పరాకాష్టకు చేరతాయి .
ఇదే కృష్ణ శాస్త్రి గారి ‘’ఆకులో ఆకునై ,పూవులో పూవునై ‘’కవితలా మనల్ని మెరిపిస్తుంది .కళ్ళను పేము చెట్టు పళ్ళతో పోలుస్తాడు .ముగ్గురు ముష్టివాళ్ళు కవితలో పట్టణవాతావరణం హాస్యం గా పోషించాడు .’’ఎముకముక్క తిన్న కోతి నీటిలో ప్రతిఫలిస్తుంది’’ అంటాడు
‘’ సరోజినీ సమాధి ‘’కవితలో –‘’ఇదుగో ఇక్కడే నిద్రిస్తోంది మన సరోజినీదేవి –ఇంకా ఇక్కడే ఉందేమో నాకు తెలీదు –ఇక్కడే శాశ్వతంగా ఉండేట్లు –సంగీతాన్ని దాచిపెట్టారు ‘ఈ వర్ణనలో శ్మశానం కనిపించదు.సజీవ స్త్రీ ప్రక్కమీద పడుకొన్న భావం కలుగుతుంది .వర్ణన హఠాత్తుగా ఊహా స్థాయి నుంచి ,విశ్వభావన స్థాయికి ఉవ్వెత్తున ఎగిరిపోతుంది —‘’ఆకాశం లో కాషాయ వర్ణ కిరణ శకలం ఒకటి – పరివేషం తో మిలమిల మెరుస్తోంది-నీహారం కప్పిన నిప్పు కన్నెలా –బూడిదలో దాక్కుని కనిపించని పిల్లిలా –కనిపించీ కనిపించని ముఖం మీద చిరునవ్వు చిందులతో –చూపరుల కనువిందు తో ‘’సరోజినీ సమాధిని వర్ణించాడు .
‘’వనలతా సేన్ ‘’అనే ప్రసిద్ధ గీత౦ ప్రారంభం లో –
‘’శతానేక బ్రహ్మకల్పాలు గతం లో కలిసిపోకముందే –ఈ భూమ్మీద కాలం పరచిన గులకరాళ్ళ రాస్తా వెంబడి –ఓపికతోఒంటరిగా ఒక్కడినే ఆనాడు తిరుగుతూ-కోప ఘూర్ణిత సముద్ర ఘోషలు విన్నాను –అవి ప్రళయంగా నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి –సింహళ సముద్ర తీరం నుంచి –చీకటి రాత్రులలో జీవకళలు విరుగుతూ –మలయా జలసంధిదాకా –మత్తుగా నడుస్త్తూoడేవాడిని –వనలతా సేన్ నన్ను ఆలింగనం చేసుకొన్న చోటు లోమాత్రమే –నాకు కలిగింది మనశ్శాంతి ‘’.కాలం వీధుల్లో ఆత్మ చేస్తున్న అనంత ప్రయాణం ఇక్కడ చూపాడుకవి .చివరగా ‘’శతాబ్దాలక్రిందట తెలిసిన దాని కంటే –ఎక్కువ ఏం తెలిసింది నాకు?’’అంటాడు .మన అనుభూతికవి తిలక్ కూడా ఇలానే రాశాడు .అనేక చారిత్రిక అంశాలు కవితలలో మెలి తిప్పేస్తాడు దాస్ .ఈజిప్ట్ దేశాల పురాతన నాగరకత పై కవి ప్రత్యెక మోజు ఉన్నట్లు కనిపిస్తుంది. పతంజలి ,ఆమ్రపాలి ,నాగార్జున, శ్రావస్తి కంఫ్యూషియస్,అత్తిలి వంటిచారిత్రక పాత్రల ,ప్రదేశాల పేర్లు ఆయనకవిత్వంలో చాలాసార్లు ప్రత్యక్షమౌతాయి .’’మకరమాసం చివరి రోజు ‘’కవితలో కాలప్రవాహ చారిత్రిక చైతన్యాన్ని పరిగెత్తే పక్షితో పోలుస్తాడు .ఎడిత్ సిట్ వెల్ కవితలలో ఉన్నట్లే దాస్ కవితలలో జంతు ప్రపంచమూ దర్శన మిస్తుంది –‘’పుండుమీద నెత్తురూ చీమూ బాగా తాగేసి –తళత్తళల రెక్క లాడిస్తూ ఈగ ఎండలో ఎగురుతోంది ‘’అని వర్ణిస్తాడు .అసహ్యంగా కనిపించేదాన్ని అర్ధవంతంగా భాసి౦ప జేస్తాడు .ఆయనకవిత బుద్ధి సూక్ష్మతను కూడా నిద్ర లేపుతుంది .వీరసావర్కార్ ,నారీమన్ వంటి మహాపురుషులు అత్తిలి వంటి పాత్రలతో కలిసి నడుస్తారు .ఆయనది పలాయన వాదం మాత్రం కాదు –‘ఎక్కడో ఉషస్సు మనకోసం వేచి ఉంది ‘’అని ఆశకలిగిస్తాడు.చరిత్ర కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకోలేక ఆత్మఎక్కడి నుంచి వచ్చిందో ,అక్కడికి అంటే మృత్యు గహ్వరం లోకి ,అంధకార గర్భం లోకి వెళ్ళిపోవాలనే ఆకాంక్ష కనిపిస్తుంది .’’బల్లెపు పోట్లకు బలియిన వరాహం లా-భూదేవి వెర్రికేకలు వేస్తోంది ‘’అన్నాడు .’’ఏనాటికీ మెలకువరాని –ఈఅనంత నిద్రా దీర్ఘ సముద్రం లోకి వెళ్ళ దలుచుకున్న నన్ను –ఎందుకులేపుతారు ?ఎందుకు పిలుస్తారు ?’’అంటాడు .’’యుగయుగాలుగా మనిషి తన శవాన్ని తానె మోస్తున్నాడు-రక్తదాహం దాహం తీర్చుకొన్న మానవాత్మ –దుర్వాసనతో దూరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తోంది-రక్షించమని నక్షత్రాలను అర్ధిస్తోంది-ప్రేమకోసం పరితపిస్తోంది –విజ్ఞాన రోచిస్సులను పిలిచి నెత్తురు మచ్చ తుడిచేయమ౦టో౦ది -అసలు అడిగేవాడా ఆత్మ అనేది లేకపోతె “”?అని ప్రశ్నించాడు .
భాషలోని పలుకుబడితో రవీంద్రుని కంటే , భిన్నమైన పలుకుబడిసాధించినా శబ్దార్ధ సామ్యభావనలో టాగూర్ కు చాలా దగ్గరగా వచ్చాడు దాస్ అనిపిస్తాడు .ఆయన్ను ‘’ ఏకాంతకవి ‘’మహాకవి ,యుగకవి ,అన్నారుకానీ ఏ ఇజానికీ చెందిన వాడుగా ముద్ర పడలేదు ..’’ఈ ప్రపంచభీకరారవ౦ ద్వారా వచ్చిన –నాశనం లేని అనాది నాద శక్తి –వెలుగుకు లొంగి ,ఆన౦దానికి పొంగి మూగ పోయిన దానిలా –అనంత కరుణా సముద్రం మీద అలలలతో గుసగుసలాడుతోంది ‘’అని ముగిస్తాడు కవితను .సంప్రదాయంలో మునిగి తేలుతూ ,తామరాకుపై నీటి బిందువుగా తప్పించుకొనే నేర్పరి కవి జీవనానంద దాస్ . హృదయస్పర్శి.భావనా తీవ్రత తో ,కవితా భాగీరధీ పావిత్ర్యాన్ని వివిధ కోణాలలో దర్శించి ,ప్రదర్శించటం ఏ కవికైనా అసాధ్యం కానీ దాన్ని సుసాధ్యం చేశాడు దాస్ .సమకాలీన బెంగాలీ కవులలో ఇంతటి ప్రతిభా వ్యుత్పత్తులను చూపిన కవి లేడు.’’దటీజ్ ‘’జీవనా నంద దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

పట్టణన వర్గాలలో మధ్యతరగతి ప్రజలకష్ట నష్టాలను  వర్ణిస్తూ సమర సేన్ తనకవితలలో అసహనం చూపాడు .ఈ మార్పులను గురించి కవితా అస్త్ర సన్యాసం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు .విష్ణు డే కవితలలో శ్రామికవర్గం పై జాలికనిపిస్తుంది .నాటికవులు తమ వర్గ స్వభావాన్ని వదులుకోలేక పోయారు .సుభాష్ ముఖోపాధ్యాయ ,,సుకంతో భట్టాచార్య కవితల్లో ఏ కొన్నో తప్ప నిజంగా ప్రజానీకానికి చేరలేదు.ఆ రోజుల్లో కవి తనకు తానె తుది లక్ష్యం వలన ,తనకు తాను తన్మయుడై ,దాన్నికవిత్వంగా ‘’కక్కటం ‘’తప్ప ఏమీ సాధించలేక పోయాడు .ప్రజాహృదయ స్పందన కలిగించలేక పోయాడు .

 విభూతి భూషణ బంద్యోపాధ్యాయ కవిత్వం లో  నవలలో లాగా జీవనానంద దాస్ ప్రకృతి దృశ్యాలతో చేలూ, నదులు సామాన్యప్రజలు వారి మనోభావాల చిత్రణ ఉంది .దాస్ కూడా బంద్యోపాధ్యాయ లాగా వామ పక్ష భావ ప్రభావితుడు కాదు .ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే విభూతి నవలలను సినిమాలుగా మలిచాడు .చిత్రకారుడు జెమిని రాయ్ కూడా ఈ కోవలోని వాడే .ఇతడి కళాఖండాలకు అద్భుత వ్యాఖ్యాత విష్ణు డే.

 టాగూర్ తర్వాత జీవనానంద దాస్ ఒక్కడే బెంగాలీ కవిత్వం లో అద్భుతాలు సాధించాడు .నజ్రులిస్లాం గొంతెత్తి దేశభక్తి గీతా గానం చేశాడు .ప్రజల్లో బ్రతుకు బాధ ఎక్కువై వాటిపై మోజు తగ్గింది .సుధీంద్ర నాథ దత్తా సంస్కృత సాహిత్య లోతులు తరచి ,సమకాలీన జీవితాన్ని సంస్కృతంలో ఆవిష్కరించాడు .విలువలను సమన్వయ పరచాడు .విష్ణు డే తన కవితా మృదు స్పర్శతో ,ఆవేశం ,అనుభూతి రంగరించి ,ప్రజలలో వైజ్ఞానిక చైతన్యం తెచ్చాడు .బుద్ధ దేవ బోస్ తన అనుభూతుల్ని ప్రజానుభూతులు చేసి ప్రజా హృదయం ఆకర్షించాడు .ప్రేమేంద్ర మిత్రా విశాల దృక్పధంతో ప్రజాహృదయాలను మీటాడు .అమీయా చక్రవర్తి రచనలలో ఆధునిక భాష, నుడికారం శైలీ చి౦దులేశాయి .సురేంద్రనాథ్ లాగా ఆజిత్ దత్తా భారతీయ భావాలకు, సమకలీనతకు పట్టం కట్టాడు .అల్పాక్షరాలతో అనల్పార్ధ రచన చేశాడు .ఇలా వీరంతా ఎవరికీ వారే తమ ప్రత్యేకతను నిల్పుకొన్నారు .కానీ వీరిలో ఎవరూ జీవనానంద దాస్ లాగా నూతనత్వం కవితాశక్తి సంమోహ గుణం ప్రదర్శించ లేకపోయారు .అందుకే రవీంద్రుని తర్వాత ఆస్థానం జీవనానంద కు దక్కింది .

           వ్యక్తిత్వం

జీవితమంతా కవిత్వంలోనే మునిగి తేలినవాడు జీవనానంద దాస్ .ఏవోకొన్ని నవలు కథలు రాశాడుకానీ, కవిత్వంలోనే జీవించాడని చెప్పవచ్చు .అదే ఆయన వ్యక్తిత్వమై భాసిల్లింది .ఆయన కవిత్వం లో ఉన్న సౌందర్యం ఆయన వేష ధారణలో కనిపించదు .శైలి లో ఉన్న శోభ ఆయన ఇంట్లో ఉండదు .అంటే ఊహకూ నిజానికీ మధ్య సమన్వయము లేదు .తను నిర్మించిన కల్పనా జగత్తుకు ,సాంఘిక జీవనం లోని నిత్య జీవితానికి సంబంధం ఉండదు .తూర్పు బెంగాల్ బారిసాల్ లో పుట్టి ,కలకత్తా లో పెరిగిన దాస్ కు పల్లె సౌ౦దర్యం ,పట్టణ  సౌభాగ్యం రెండూ కూడా పట్టనే లేదు .తనలోకం లో తాను ఊహా సౌధాలు నిర్మించుకొని గడిపాడు .జీవిత సమస్యలకు దూరంగా ఉన్నా , జీవితాన్ని నిశితంగా పరిశీలించే నేర్పున్నవాడు .కానీ జీవిత సమరంలో రచనలద్వారానే పాల్గొన్నకవి. ఆయన కవే కానీ మరేదీ కానివాడు .అందుకే ‘’ఒక వ్యక్తీ నిజంగా కవి అయితే ,నిత్య జీవితంలో సతమతమయ్యే లోకానికి తానిచ్చే మొదటి బహుమతి కవిత్వమే ‘’అన్నాడు .

  జీవనానంద దాస్ చివరికి ట్రా౦ కారు కింద పడి మరణించటం ఆయన జీవితంలో భగవంతుడు చేసిన చమత్కారం .అయ్యో అనిపించినా ,మంచాన పడి తీసుకోకుండా హఠాన్మరణం పొందటం లో కూడా ఆయన కవితా సాహసం తొంగి చూసింది అంటారు .మరణానికి ముందే ఆయన జీవితంలో పతనావస్థ ప్రారంభమైంది .నిత్య జీవితంలో సన్నిహిత సంబంధం కల వ్యక్తిగా ఆయన్ను భావించేవారు .అందువల్ల సనాతనులు ఆధునికులు హేళన తో ఆయన్ను చూసేవారు .’’శనివారర్ చీటీ ‘’-శనివారం లేఖ అనే పత్రికలో సజనీ కాంత దాస్  ఈయన్ను దుయ్య బడుతూ ఉండేవాడు .

  నిష్టాగరిష్ట బ్రహ్మ సమాజ  కుటుంబం లో పుట్టిన జీవనానంద ,తండ్రి మంచి పండితుడైన ఉపాధ్యాయుడు తల్లి కవయిత్రి ..కలకత్తాలో బ్రహ్మ సమాజీయుల కాలేజిలో దాస్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేశాడు .ఒక కవితలో స్త్రీ వక్షోజాలను  వర్ణించి నందుకు  ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేశారని అంటారు .జీవితమంతా ఇంగ్లీష్ లెక్చరర్ గానే గడిపాడు .ఆదాయం చాలక ,కవిత్వంతో బాగా పేరు తెచ్చుకొనే సమయంలో ఇన్సూ రెన్స్ పాలసీని అయినకాడికి అమ్మేశాడు .

 ప్రజలతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు .టాగూర్ ప్రదర్శించిన ప్రశాంత సమైక్య సంపూర్ణ సమన్వయ భావాలకు దూరంగా జీవితం గడిపాడు దాస్ .ఆయన జీవించిన కాలానికి సంబంధించి సమస్త గుణాలు ఉన్నకాలం లో జీవితం గడిపాడు .జీవితంలో రచనలలో ఆయన టాగూర్ అనంతర కాలానికి అంకితమైన వాడు జీవనానంద దాస్ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.14వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

చిదానంద దాస్ గుప్త ఆంగ్లం లో రాసిన పుస్తకానికి కుందుర్తి చేసిన అనువాదం జీవనానంద దాస్ .కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది. వెల –రూ-2-50.హుమాయున్ కబీర్ కు స్మృత్య౦జలి గా  అంకితం చేశారు .

 కవి కాలాదులు

రవీంద్రుని ప్రతిభ ఉత్కృష్టంగా వెలుగు తున్నప్పుడే జీవనానంద దాస్ కవితా ప్రతిభ కూడా వెలుగు లీనింది .అర్ధ శతాబ్దం టాగూర్ బెంగాలీ సాహిత్యాన్ని ప్రభావితం చేశాడు .ఆనాటి కవులంతా ఆయన దారి తొక్కి ఆమర్గం లో నడిచారు. అదే శైలి అనుసరించారు .ఆయన చూపిన సమన్వయ దృక్పధం అందరికీ ఆరాధనం అయింది .ఆయన్ను దాటి అలోచి౦చటం సాధ్యమా ?అనే స్థితిఏర్పడింది .అన్నిటా ఆయన శిఖరాయ మానుడు .టాగూర్ సాహిత్య సంస్కృతీ బెంగాల్ లో ఇప్పటికీ జీవించే ఉంది .1937లో టాగూర్ ‘’ప్రాంతిక్ ‘అనే కవితా సంపుటిరాసి విడుదల చేశాడు .పెద్ద జబ్బు చేసి మరణావస్థ నుంచి కోలుకొని ,ఆనాటి బెంగాలీ సమకాలీనతను ఆకవిత్వం లో ఆవిష్కరించాడు .యుద్ధ కారణ శక్తులను తీవ్రంగా ఖండించాడు .సమాజం వింతపోకడలు ,దిగజారుడు లను కళ్ళకు కట్టించాడు .తన ఆవేదనను ఒకకవితలో ఇలా అన్నాడు –

‘’బుసకొట్టే సర్పరాజులు విషం కక్కు తున్నాయ్ –నా చుట్టూ ఉన్న గాలిలో –శాంతి ప్రవచానాలన్నీ శక్తి హీనమైపోయాయి-పెద్ద వాణ్ని అయిపోయాను –పోయే లోగా ఒక విజ్ఞప్తి-ఈ రాక్షసిని తుద ముట్టిద్దాం .-అందరూ దీనికోసం సర్వ సన్నద్ధులు కావాలి ‘’

  1930వ తరానికి చెందిన కవులంతా రవీంద్రుని ప్రభావం నుంచి బయట పడాలనే కాంక్ష ,కృషీ మొదలయ్యాయి .బుద్ధ దేవ బోస్ దీనికి ప్రధాన పాత్ర పోషించాడు .టాగూర్ మరణానికి 15ఏళ్ళ ముందునుంచి ‘’కల్లోల్ సాహితీ బృందం ‘’దీనికి తోడ్పడింది .ఆ కాలం లో నిరాశా నిస్పృహలతో ఉన్నవారు ,మార్క్సిస్ట్ ప్రభావితులైన వారు ,,ఈ రెండిటికీ మధ్యగా ఉన్నవారు అందరూ కలిసే ఉండేవారు .వీరంతా టాగూర్ తర్వాత రానున్న ఆలోచనా ధోరణుల గురించే బాగా ఆలోచించారు .కల్లోల్ బృందమేకాదు ‘’విష్ణు డే’’కూడా –‘’టాగూర్ చెట్టు పేరు చెప్పికాయలమ్మే గతి –ఇక మనకు వద్దు –జటాజూటపు మెలికల్లో గంగను ఇరికి౦చుకొని –శాశ్వతంగా నిలపటానికి ఇక వీల్లేదు –ఆత్మ భావ గంగా ప్రవాహాన్ని –విచ్చల విడిగా వదుల్తున్నాం –పాటల పడవల మీదెక్కి –జలధి వైపుకు కదుల్తున్నాం –కొత్తదారి ,కొత్తనడక –కొత్త రంగులు ,కొత్త చిత్రాలు –కొత్త గొంతుల కోలాహలం తో –నవ్యకవితా ప్రవాహాలు పారిస్తాం –ప్రజల మనస్సులు పాలిస్తాం ‘’అంటూ వైశాఖ 25 కవిత్వంతో ముందుకు దూకాడు విష్ణు డే.

  ఇలాంటి సమయంలో కూడా జీవనానంద దాస్ టాగూర్ పై ధ్వజమెత్తి కవిత్వం రాయలేదు .ఆయన కవితా వస్తు ప్రదర్శనం టాగూర్ లో వచ్చిన పరిణామ దశల్లో ప్రయాణం చేసి బలపడింది .టాగూర్ అనంతర కవులలో జీవనానంద దాస్ లో అందరికంటే ఎక్కువగా ఈ పరిణామం చోటు చేసుకొన్నది .ఇది ఆయన గమనించి ఇలా అన్నాడు –‘’తమకంటే ముందున్న మహాకవులను పడ త్రోసే ప్రయత్నం లో, కవులు తమ స్థానాన్ని నిలబెట్టుకో లేరు .ఒకరిద్దర్ని మినహాయిస్తే ఆధునిక బెంగాలీ కవితారంగం అంతా టాగూర్ ప్రభావమే కనిపిస్తుంది .ఆధునిక కవితలను ఆయన కవిత్వంతో పోలిస్తే ,ఆయనలో ఎంత వైవిధ్యం ఉందొ అర్ధమౌతుంది .ఆయన అడుగు జాడల్లోనే ఆధునిక  బెంగాలీ కవిత్వం ఇప్పుడే కొత్తగా ప్రారంభించింది .టాగూర్ ప్రతిపాదించిన విలువలకు ఎన్నటికీ భంగం కలగదు ‘’అన్నాడు .టాగూర్ కవితా సంప్రదాయానికి ఎదురు తిరక్కుండా ,దాన్ని కొత్తతరంలోని భావాలతో ,భాషా నుడికారాలతో మేళవించి ముందుకు తీసుకు వెళ్ళటమే ధ్యేయంగా జీవనానంద దాస్ కృషి చేశాడు .’’సంప్రదాయం –వ్యక్తి ప్రతిభ ‘’లో ఆంగ్లకవి టీఎస్ ఇలియట్ రాసిన వ్యాసం లో ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని వివరించినట్లుగా జీవనానంద దాస్ కవిత్వం రాశాడు .

 బెంగాలీ సాహిత్యం లో పశ్చిమ దేశాల హవా బాగా ఉన్న రోజులవి .రెండు ప్రపంచ యుద్దాలఫలిత౦ గా  ‘’వేస్ట్ లాండ్ ‘’గా మారిన భూగోళం మీద వీచిన గాలి ,బెంగాలీ నేలనూ  తాకింది .విక్టోరియాకాలపు నైతిక విలువలు పతనమై ,అణుయుగం లో మానవ జీవితం లో సందిగ్ధ పరిస్థితులేర్పడి ,ప్రపంచమంతా ఎర్రజండాలు ఎగురుతున్న రోజులవి .వీటన్నిటి ప్రభావం బెంగాలీ సాహిత్యంపై బలంగానే పడింది .

  టాగూర్ యుగం చివర్లో ,టాగూర్ తర్వాత బెంగాలీ సాహిత్య నిర్మాతలలో చాలామంది ఆంగ్ల భాషా నిష్ణాతులవటం విశేషం .అలాంటి వారిలో బుద్ధ దేవ బోస్, అమియా చక్రవర్తి, విష్ణు డే,సమర్ సేన్ ,జీవనానంద దాస్ ముఖ్యాతి ముఖ్యులు .ఇంగ్లీష్ జర్నలిస్ట్ లుగా ఉంటూ ఇంగ్లీష్ సాహిత్యాన్ని మధించినవారూ ఉన్నారు .పాశ్చాత్య దేశాల కళా సాహిత్యాలలో ,పురాతన ,అధునాతన గాధలతో ఉన్న పద చిత్రాలు వారికవితల్లో కో కొల్లలు .ఇలియట్, వెబ్స్ ,యేట్స్,కాల్డ్వెల్ ,రజనీ పామీదత్ ఆస్వాల్డ్ స్ప్లేన్గ్లార్ ల వివిధ సాహిత్య ప్రక్రియలను బెంగాలీ సాహిత్యం లో దిగుమతి చేసి దారీ గమ్యం లేకుండా చేశారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

‘’అక్షరం లోక రక్షకం ‘’

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు

సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి  పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి  మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦   శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం  నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి  హైస్కూల్ లో మా  గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి  శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ  పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు

   సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

   సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

 ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .

             కార్యక్రమ వివరం

 శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు  పుష్పమాలాలంకరణం

        1-  శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన –  శ్రీ  కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  –

ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో  చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి  546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న   –చిర౦జీవి  కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  

  ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి   2022 పదవ తరగతి  పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న

 కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన

కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి  

 ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న

చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  -BC విద్యార్ధినికి

ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య  కాలేజిలో ఇంటర్ చదువుతున్న

కుమారి ధూళి పూడి త్రిష కు

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతీ దేవి  అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక  సన్మానం

 –అమరవాణిలో పని చేస్తున్న  ఇద్దరు ఉపాధ్యాయులకు

  ఉపాధ్యాయ దినోత్సవ  శుభా కాంక్షలతో

జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి              కోశాధికారి

                             గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్

                                                          4-9-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు ..

జీవిత విశేషాలు
1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించారు[1]. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇ సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరు పెట్టారు. తన మాతామహుడైన రేగిళ్ల కామశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలను అభ్యసించారు. పిదప పిఠాపురంలో పేరి పేరయ్యశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది చదువుకున్నారు. అనంతరం వేదుల సూర్యనారాయణశాస్త్రి వద్ద వ్యాకరణం మహాభాష్యాంతం మంజూషతో సహా చదువుకున్నారు. అక్కడ కుప్పా ఆంజనేయశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, వడ్లమాని వేంకటశాస్త్రి సహాధ్యాయులుగా ఉన్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము, దెందుకూరి నరసింహశాస్త్రి వద్ద వేదాంతశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకున్నారు. స్వయంకృషితో ఇతర శాస్త్రాలను కూడా అభ్యసించి సర్వతంత్ర స్వతంత్రతను సంపాదించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు భోజనాది సదుపాయాలు కల్పించి గురుకుల పద్ధతిలో బోధించారు. వీరి వద్ద శిష్యరికం చేయడం గొప్ప విషయంగా భావించి దూరదేశాలనుండి ఎంతో మంది విద్యార్థులు పిఠాపురం చేరుకొనేవారు. ఈయన శిష్యులలో చాలామంది ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్స్‌గా,పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా, పురాతత్త్వ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నతపదవులు అలంకరించారు.

రచనలు
బాల్యం నుండే అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించేవారు. సుమారు 14 గ్రంథాలను సంస్కృతాంధ్రాలలో రచించి ప్రకటించారు. వాటిలో కొన్ని:

  1. చేతవనీ ఖండనం
  2. మహాభారత తత్త్వ దీపః
  3. మహాభారత తత్త్వ కథనం
  4. రామాయణ తత్త్వ కథనం
  5. ఆస్తికత్వం మొదలైనవి.

ఇంకా అనేక వ్యాసాలను విశ్వహిందూ పరిషత్తు సావనీరులోను, ఇతర పత్రికలలోను ప్రకటించారు. తెలుగులోను, సంస్కృత భాషలోను ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశారు. ఇతర రాష్ట్రాలలో సంస్కృతంలో, ఆంధ్రరాష్ట్రంలో తెలుగులో అనేక మహాసభలలో ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా రాణించారు అష్టాదశ పురాణాలను తన పురాణపఠనం ద్వారా పిఠాపురవాసులకు వినిపించి వారిని ఆకట్టుకున్న విద్వన్ శిరోమణి .

బిరుదులు, సన్మానాలు
వీరిని అనేక బిరుదులు, సన్మాన సత్కారాలు వరించాయి.

ఇతని బిరుదులలో కొన్ని:

· వ్యాకరణాలంకార

· బ్రాహ్మీభూషణ

· వ్యాకరణస్థాపక

· మహామహోపాధ్యాయ

· మహాభారత మర్మజ్ఞ

· బాలవ్యాస

· తర్క వ్యాకరణ వేదాంత కేసరి

· జరిగిన సన్మానాలలో కొన్ని:

· విజయవాడలో జరిగిన పండితపరిషత్తులో శృంగేరీ పీఠాధిపతులచే సన్మానం

· ఆంధ్ర ప్రభుత్వాస్థాన కవి కాశీ కృష్ణాచార్యుల చే సత్కారం

· త్రిలింగ విద్యాపీఠం వారిచే సన్మానం

· ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం

· పిఠాపురంలో సింహతలాటంతో పౌరసన్మానం

కుటుంబం
తన మేనమామ రేగిళ్ల చింతామణి పుత్రిక సుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భావనారాయణశాస్త్రి, కామశాస్త్రి, చింతామణిశాస్త్రి, రాజేశ్వరశాస్త్రి అనే నలుగురు కుమారులు, కామేశ్వరి, సుబ్బలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

మరణం
ప్రవచనాలు, ధర్మోపన్యాసాలు, దుర్విమర్శనా ఖండనము తన నిత్యకృత్యంగా పెట్టుకుని జీవిస్తూ తుదకు 1978, మార్చి 3వ తేదీన 84 వ ఏటమరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం  29 –సందేహాలంకారాభాసం  

హాస్యానందం 

29 –సందేహాలంకారాభాసం  

 సందేహం అనే అలంకారం ఉంది .అందులోనరస భూపాలుడిని చూసి  ‘’ఇంద్రుడో ,ఉపెంద్రుడో బలీ౦ ద్రుడో ‘’అనే పద్యం ఉదాహరణగా ఇచ్చాడు అలంకార శాస్త్రవేత్త .సందేహం అనే హాస్య ప్రక్రియ కూడా అలానే ఉంటుంది అన్నారు మునిమాణిక్యం నరసింహారావు మాస్టారు .ఎప్పుడో తనదగ్గర చదువుకొన్న శిష్య పరమాణువును చూసి ఒక మాస్టారు ‘’వీడు నా దగ్గర చదువుకొన్నవాడేనా ?వాడి తమ్ముడా ?’’అని అనుమానపడతాడు .అనుకుని ఊరు కొంటె బాగానే ఉంటుంది .కాని వాడితో ‘’నా దగ్గర చాలా మంది చదువుకొన్నారు .ఒక్కొకుటుంబంలోనే  నలుగయిదుగురు  అన్న దమ్మలుంటారు .వాళ్ళు పెద్ద వాళ్లైన తర్వాత  నన్ను కలిసి ‘నమస్కారం మాస్టారూ అంటారు ..ఆనలుగుర్లో వీడు ఎన్నో వాడో నాకు గుర్తుండదు .అప్పుడు నేను ‘’అయితే అబ్బాయీ !నువ్వు నువ్వేనా ?లేకపోతె మీ అన్నయ్యవా ?“”అంటాను. ఇదే ఒక సందేహమేగా ఈ దేహానికి వచ్చి౦ దేగా  .ఒక సారి అలాంటి కవలలో ఒకడు మరణించాడు .అప్పుడు వాడిని ‘’బాబూ!మీ ఇద్దర్లో చనిపోయింది నువ్వా ?మీ అన్నయ్యా ?అని అడిగాడు .సందేహాన్ని హాస్యోత్పత్తికి ఉపయోగిస్తే ఇలాంటి పలుకు బడులు తయారౌతాయన్నారు మనిమాణిక్యం .కనుక దీన్ని సందేహాలంకార ఆభాసం అన్నారాయన .మరో ఉదాహరణ –విస్తట్లో వడ్డించిన కూర చూసి ‘’ఇది వంకాయకూరా ?దోసకాయ కూరా ??’’అంటే సందేహాలంకారం .ఈ అలంకారం అల్ప వస్తు పరంగా ఉందికనుక సందేహాలంకార ఆభాసం అంటారు మాస్టారు .

 ఉత్ప్రేక్షా భాసం

ఉత్ప్రేక్ష  దాదాపు అతి శయోక్తి వంటిది..మునిమాణిక్యంగారింటి ముందు ఒక ధనికుడి ఇల్లుంది .ఈయనభార్య కాంతం గారికీ, ఆయన భార్యకూ మంచి స్నేహం ..ఆవిడ రత్నాలు ,వజ్రాలు పొదిగిన ఖరీదైన ఆభరణాలు ధరించేది .కా౦త౦ గారికి  ‘’అంత దృశ్యం ‘’లేదు .చిలకల పూడి గిల్ట్ నగలు పెట్టుకొనే వారీమె .ఆవిడ  ఒక సారి ఈవిడను ‘ఏమండీ అవి రవ్వ దుద్దులేనా ?ముత్యాలహారం లోవి మంచి ముత్యాలేనా ?’’అని అడిగింది ఆవిడకు తెలుసు అవి కాదని .కానీ హేళన చేయాలనే ఆవిడ ఉద్దేశ్యం .ఈ సంగతి గ్రహించిన కాంతం గారు ‘’ఆ అవి మంచి ముత్యాలే .నాలుగు వేలు పోసికొన్నవి మాయముత్యాలది అవుతుందా వదినా “”అన్నారు .ఇది చూడండి వదినా .ఇది డైమ౦డ్ నెక్లెస్ అంటే మరీ లక్షల ఖరీదు  కాదు .ఏదో పది వేలకే వస్తే మా వారు ఉబలాట పడితే ,మా అన్నయ్య కొన్నాడు ‘’అవతలామెకూ తెలుసు ఇందులోని మర్మం .మరో సారి ఆ షావుకారి భార్య కాంతం గారిని ‘’వదినగారూ!రత్నాలు,కెంపులు  నీరు పడితే మేము కెమికల్ తో శుద్ధి చేస్తాం .మీరేం చేస్తారు?’’అని అడిగితె కా౦త౦ గారికి ఒళ్ళు మండి,తాను అబద్ధాలాడినసంగతి ఆవిడ బయట పెట్టాలని ప్రయత్నం చేస్తోందని  గ్రహించి ‘’ఇవి ఖరీదైన రాళ్ళే అయినా,నీరు పట్టినా ,మాసినా ,వాటిని బాగు చేస్తూ కూర్చోం .అలాంటి వాటిని గోడవతల విసిరేసి పారేస్తాం .కొత్తవి కోనేస్తాం వదినగారూ ‘’అని మూతి మూడు వంకర్లు తిప్పి ఝాడించి చెప్పారు కాంతం గారు అని భర్త మునిమాణిక్యం ఉవాచ .

  కోతలు –కోతలు కూడా ఉత్ప్రేక్షా ? అనే అనుమానం రావచ్చు .కాని తానూ వాటిని ఉత్ప్రేక్షగా మార్చి అందిస్తున్నాను అన్నారు నరసింహారావు జీ .నరస భూపాలీయం లో –నరస భూపాలుడు శత్రువులను సంహరిస్తే,  వాళ్ళ భార్యలు ఏడిస్తే ఆ కన్నీటితో సముద్రాలు నిండి పొంగాయట.ఇది ఉత్ప్రేక్షాలంకారం .వాడుక భాషలో ఇది సొరకాయ కోత అంటాం .మొదటిది కావ్య గంభీరంగా ఉంటె తాను  చెప్పింది హాస్యం తో రామణీయకంగా ఉంది  అన్నారు .రెండిటిలోనూ జరిగింది వాక్ వ్యాపారమే అన్నారు .మనం కూడా ప్రదీప్ లాగా ‘’అంతేగామరి, అంతేగా ‘’అని తలూపాల్సి౦ దేగా .అంతేమరి .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ మత్తిరుమల రాఘవాచార్య కవి ‘’పెద్దాపురీ వాస ,వేంకటేశ్వర ‘’మకుటం తో 165 సీస పద్యాలతో శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం రచించారు .శ్రీ ఘంటసాల పూర్ణయ్యగారు పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో 1941 న ప్రచురించారు .వేల ఆరు అణాలు .

 కవి గారు సీస పద్యాలలో తన తండ్రి శ్రీ తిరుమల దేశికా చార్య అనీ ,తల్లిగారు రంగాంబ అనీ ,చూడామణి తన భార్య అనీ ,కొడుకు పేరు శ్రీనివాసుడు అని చెప్పారు .తమ్ముడు సీతారామమూర్తి ,అక్కగారు నరసమాంబ .తనపేరు రాఘవాచార్య .షట్ శాస్త్ర ప్రవీణుడు చేవలి సుబ్రహ్మణ్యం గారునూనూగు మీసాల నాడే వైద్యంతో పాటు సంస్కృతం నూరి పోశారు .తమ కుటుంబానికి ఉమా మహేశ్వరం అనే అగ్రహారం ఉంది .పద్నాలుగు ఏళ్ళకే తనను కవితా కన్య పాణి గ్రహణం చేసింది .18వ ఏట భీష్మ సంభవం ,19వ ఏట పార్వతీ వల్లభ శతకం రాసి ,,ఇప్పుడు ఈ ఇరవై రెండవ ఏట  ఈ రాఘవ వేంకాటేశ్వర శతకం సంతరిస్తున్నానని చెప్పుకొన్నారు ,కూచిమంచి తిమ్మన సంస్కృతంలో కుక్కుటేశ్వర శతకం ,ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ,భాస్కరుడు భాస్కర శతకం రాసి వన్నె కెక్కినట్లు తానూ ‘’అనవద్యహృద్య పద్య రత్నమాలికల గూర్చంగ నూతన గతులలో ‘ఈ శతకం రాస్తున్నాని స్వామికి నివేది౦చు కొన్నారు .

  గ్రుడ్డులోపల పిల్ల ఎవరి కారుణ్య౦ చక్కగా ఎదుగుతుందో ,ఆకాశం లోఎంతో ఎత్తున ఎగిరే పక్షి మళ్ళీ ఎలా భూమిని ఎవరి కరుణతో చేరుతుందో,కర్మ బంధాలు ఎవని పాద ధ్యానం వలన విచ్చిన్నమవుతాయో అలాంటి ‘’దేవాది దేవా దివ్య ప్రభావ ,ఆది మధ్యా౦తశూన్య లోకైక మాన్య ‘’అయిన వేంకటేశుని నమ్మాను అన్నారు .,లోకంలోని అన్ని విషయాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు .ధర్మ దేవత నాలుగు పదాలు విరిగాయని బాధ పడ్డారుకవి .అక్క చేల్లెల్లమధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత కరువైంది .వైష్ణవంలో పుట్టి ,వగలు పోయిన నారి వేశ్యగా మాలజాతిలోపుట్టి ,అగ్రజన్మలో పేద బ్రాహ్మణుడి సొమ్ము హరించిన విప్రునిభార్య కడజాతి కాంతగా,అన్త్యకులం లోపుట్టి సార్వ భౌమి గా ప్రసిద్ధి చెందుతారేమో అని పురాణకధలు వివరించారు  .ఆత్మను తెలుసుకున్నవారికి అందరూ పూజనీయులే .

  విటులను తార్చే వేశ్యకు ,ఒక్క నిమిషం హరిని ధ్యానిస్తే ముక్తికలుగుతుంది .మేకల్నికోస్తూ హరినామ స్మరణ చేస్తే కైవల్యం వస్తుంది కటిక వాడికి.సంసార బంధం లో చిక్కుకున్నా చిత్తం శివునిపై లగ్నం చేస్తే జన్మ సాఫల్యం కలుగుతుంది .గోవింద స్మరణ చేసిన వారందరూ ఇహ పరసౌఖ్యాలు పొందుతారు –‘’కలదు భగవంతు డను నమ్మకంబే చాలు –ప్రజలకెల్లను భ్రుత్యుడై పరగు శౌరి’’అని గ్యారంటీ ఇచ్చారు  .చక్రవర్తికి పుత్ర ప్రేమ ఎంతో ,మాలవాని పుత్ర మమత అంతే.పట్టపురాణిపై  పతికి ఎంత ప్రేమో ,,నిరుపేదకు ఆలి పై ప్రేమ అంతే.సుఖభోగాలు అందరికీ సమానం .పండితుడు ఎలాంటి ఖ్యాతికోరుతాడో ,నోరులేనివాడూ అంతె.అంటూ అన్నమయ్యలాగా చక్కని వేదాంతం చెప్పారుకవి .

  ఎండిన చెట్టు చిగిర్చటం ,పెద్దగా పెరిగిన వృక్షం నేలకూలటం ,పనికి రానివాడే అన్నీ సాధించటం ,మహాబలశాలి కూడా ఒక్కోసారి  ఓడిపోవటం ,పండిన చేను ఒరిగిపోవటం ,మహా విద్వా౦సుడుకూడా ఒక్కోసారి కటిక నెల మీద పడుకోవాల్సి రావటం ,రారాజుకూడా చెయ్యి చాచి బిచ్చం అడుక్కోవాల్సి రావచ్చు .మహా దరిద్రుడు రాజుకావచ్చు .ఏది ఎలా జరుగుతు౦దోఎవరికే తెలీదు –‘’కాక మానదు కానున్న కర్మ ఫలము –సర్వము నీ కృతమే కదా శ్రీనివాసా ‘’అన్నారు .గయ్యాళి భార్యకు భయపడే వారు కులమతాచారాలను వదిలేసిన వారు ,అష్టకష్టాలు పడి పెంచిన తలిదండ్రుల చావు కోరేవారు ,పరము అనేదిలేదని విర్రవీగేవారు ,కుటిలమతులు ఈరోజుల్లో  గడ్డాలుపెంచి సన్యాసులై,అమాయకుల్ని మోసగిస్తున్నారు .కాకిగూటిలో కొంతకాలం ఉంటె కాకి కోకిల అవుతుందా .పాము పడగ విప్పకుండా పడుకొన్నమాత్రాన వానపాము శేషభోగి అవుతుందా ?మట్టి కొట్టుకు పోయిన బొగ్గు మాణిక్యం అవుతుందా ?అని ప్రశ్నించారు .’’మానినీ మణికి మారు మనువులేదు –సతుల విడనాడు పతులకు గతులు లేవు ‘’అని ధర్మ సూక్షం చెప్పారు .

   గార్ధభం అశ్వం ,కాకికోయిల ,ఉల్లి మల్లి ,సింహం నక్క ,ఆవుబర్రే ,నెమలి ఎరికోడి ,బంగారం ,కాకిబంగారం ఒక్కటికావు. దేని స్థాయి దానిదే .నువ్వు ఆకాశం అనటానికి సాక్షి దూర దృష్టికల అనంతుడివిఅవటం ,జలరూపదారి అనటానికి సాక్ష్యం గంగ నీ పాదోద్భవ .పృధ్వీస్వరూపం అనటానికి సాక్షి నీ భార్య భూదేవి కావటం .వాయు స్వరూపానికి సాక్ష్యం భూత పాలన .అగ్ని స్వరూపం అనటానికి సాక్ష్యం నీ విగ్రహం ‘’హాటక చ్ఛవి’’వెలుగు ఉండటం –‘’పంచ భూతములీవ ప్రపంచమీవ .’’అని స్వామిని పంచభూతాత్మకునిగా చక్కగా వర్ణించారు కవి .

 మొదటిపద్యం –‘శ్రీ మీర తిరుపతి క్షేత్రమందు వసి౦చి –మూడులోకమూల నేలు మొదటి వేల్ప –

అజ రుద్రులను గూడ గజగజ లాడించు –దేదీప్యమాన మూర్తి ప్రభావ

పాహిమా యని వేడు ప్రజల బ్రోవగ ధాత్రి –నవతరించిన స్వయం వ్యక్తరూప

నీకు సోదరమూర్తి నీవయైద్వారకా- తిరుపతిబాలించు పరమ పురుష

తండ్రులకు దండ్రివైకుంఠ ధామ నిన్ను –బొగడ బూనితి నా పూర్వ పూజ వలన

నిహపరములిచ్చి మముగావు మి౦దిరేశ-విదిత పెద్దాపురీ వాస వేంక టేశ   –   తో ప్రారంభించి 165వ చివరిపద్యం –

‘’కా౦చ నోజ్వల చేల కారుణ్య మయ శీల –యఖిల కళ్యాణ గుణాల వాల

రక్షితామర గణాధ్యక్ష కౌస్తుభ వక్ష –కమలాయతాక్ష రాక్షస విపక్ష

పరమ భక్తిజ్ఞాన ,పటు నిశ్చలధ్యాన –ఘనజన ప్రత్యక్ష కల్ప వృక్ష

సకలలోకస్వామి జ౦గమమస్థావరాం –తర్యామి గరుడ పత౦గ గామి

చిన్మయానంద లక్ష్మీ విహార –పరమ గుణ సద్మ-భవదీయ పాద పద్మ

సేవకు౦డను ననుగావు దేవ దేవ –విదిత పెద్దాపురీ వాస వేంక టేశ’’అని శతకం ముగించారు శ్రీమత్తిరుమల రాఘవాచార్య కవి .

  ఈశతకం లో భక్తి వెల్లువగా ప్రవహించింది .లోకోక్తి తేజస్సుతో ప్రకాశించింది .నడక కావేరీ ప్రవాహం .శైలి అద్భుతం .అత్యంత రమణీయం .ఈ శతకమూ లోకం దృష్టిలో పడ లేదని పించింది .వైష్ణవం లో ప్రచారం లో ఉందేమో ?మంచిశతకాన్ని కర్త అయిన విద్వత్ కవిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

7-శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి

ఒక రోజు రాత్రి  7-30కి నాలుగు లారీలతో యాభై మంది పోలీసులు శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి గారింటిపై దాడి చేశారు .అప్పుడాయన భోజనం భోజనం చేస్తున్నారు .అయ్యే దాకా ఆగకుండా ఆయనపై విచక్షణా రహితం గా లాఠీలతో పోలీసులు విపరీతంగా కొట్టారు .ఆయన స్పృహతప్పి కూలి పోయారు .తలమీద, ఒంటి నిండా గాయాలై రక్తం ప్రవహించింది .ఆయన కుటుంబ సభ్యులను దొడ్లోకి గెంటేసి ,ఇంట్లో ఉన్న 1500రూపాయలు  దోచుకు  పోయారు .బీరువాలలో ఉన్న ఔషధాల సీసాలు బద్దలుకొట్టి వీధిలో పారేశారు .

అప్పయ్య శాస్త్రి గారిని అరెస్ట్ చేసి ,రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో పెట్టి ,చాలా రకాలుగా హింసించారు .కనీసం మంచి నీళ్ళు తాగటానికి కూడా వీల్లేకుండా ,ఆయన నోటిలో గుడ్డలు కుక్కారు .కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి కొట్లో పడేశారు .ఇలా మూడు రోజులు ఆయన్ను బాధించారు .ఈయన సోదరులను బంధువులపై కూడా లాఠీ చార్జి చేశారు .

8-శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

రాజమండ్రి వాస్తవ్యులైన బ్రాహ్మణులు శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

గారు .1932లో కర్కోటకుడు ముస్తఫా ఈయనపై చేసిన లాఠీ చార్జి వలన ఆయన చెయ్యి విరిగి పోయింది .

9-శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావు

కొవ్వూరులో ప్లీడరయిన శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారు సద్గుణ సంపన్నులు .1932లో వీరు రాజమండ్రిలో నెత్తిపై గాంధీ టోపీ పెట్టుకొని వెడుతుంటే ,నర రూప రాక్షస పోలీస్ ఆఫీసర్ ముస్తఫా ఎదురై , టోపీలాగి  పీకిపారేశాడు .దీనిపై సూర్యనారాయణ రావు గారు కోర్టుకు వెళ్లి ,మూడు కోర్టులు తిప్పించి ముస్తాఫాను మూడు చెరువుల నీళ్ళు తాగింఛి ,మొగాడు అనిపించారు .

  వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కానుక

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కాను

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment