ద్వాదశి వ్రత కథ

క్షీరాబ్ధి ద్వాదశి పూజ – క్షీరాబ్ధిశయన వ్రతం – కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం

ఆషాడ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేసినయెడల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది.

క్షీరాబ్ధి ద్వాదశి పూజ లేదా క్షీరాబ్ధిశయన వ్రతం లేదా కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రత విధానం, ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.

How To Perform Ksheerabdi Dwadasi Vratam Pooja
శ్రీ పసుపు గణపతి పూజ:
శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

క్షీరాబ్ధి పూజ విధానము:
ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే
చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే
దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,
స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).

ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం
రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద
పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,
ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || ఆర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక
గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం
పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ ||
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || పంచామృతస్నానం సమర్పయామి.
టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,
వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే
కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)

అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,
గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || అక్షితాన్ సమర్పయామి.
(అక్షితలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం
పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.
(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,
గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,
జగన్నాథాయ నమః జంఘే పూజయామి,
జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,
ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,
కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,
నిరంజనాయ నమః నితంబర పూజయామి,
నారయణాయ నమః నాభిమ్ పూజయామి,
వామ్నాయ నమః వళిత్రయం పూజ,
కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,
హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,
లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,
పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,
మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,
హరయే నమః హస్తాన్ పూజయామి,
అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,
శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,
వరదాయనమః స్తనౌ పూజయామి,
అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,
ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,
దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,
పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,
గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,
నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,
నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,
భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,
భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,
కుండలినే నమః శ్రోత్రే పూజయామి,
లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,
శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,
సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి
శ్రీకృష్ణ అష్టోత్తర పూజ:

ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || 10 ||
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః
ఓం దేవాకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగా సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియనుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః || 20 ||
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటనాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః || 30 ||
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 ||
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః || 50 ||
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః || 60 ||
ఓం శమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || 70 ||
ఓం నారాకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః || 80 ||
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 ||
ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత
శ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 100 ||
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త నమః
ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః || 108 ||
ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం
ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

శ్లో|| అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే
ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,
దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం
కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం
గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో||యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం
తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు
శ్రీ కృష్ణార్పణమస్తు.
(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ:

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో ‘స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు ‘నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా – ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ‘ దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. ‘యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.’ అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. ‘యాన్ములే….’ అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ‘ నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని’ అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ‘ ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.’ అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.’ అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.

Posted in రచనలు | Tagged | Leave a comment

“మార్కండేయ మహాపురాణం.10వ భాగం.4.11.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు”

Posted in రచనలు | Leave a comment

“బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .25వ భాగం.4.10.22”

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహాత్మజ్యోతి 1

మహాత్మజ్యోతి -1

మానవ ప్రవర్తన భావోద్వేగ ,తార్కిక స్థాయి లలో మాత్రమేకాదు ఆధ్యాత్మిక స్థాయిలోనూ చూడాలి .ఆధ్యాత్మిక ఊహాజనితమే కాదు. అందులో తర్క ,కారణ సంబంధమూ ఉన్నాయి .కొందరికి సాధారణానికి ఎక్కువగా అంటే అతీత శక్తులు ఉంటాయి .వీటిని సిద్ధులు అంటారు సిద్ధులు కారణాతీత౦గా ఉంటాయి .ఇవాళ దీన్ని యోగా అంటున్నారు .గాంధీ మహాత్ముడురాజకీయ కార్యానికి ఆధ్యాత్మికత జోడింఛి మార్గదర్శనం చేశాడు .ఆయన సత్యాగ్రహం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించటానికే .దాన్నే ఆయన ‘’సత్య శక్తి ‘’అన్నాడు .ఇది అహింస సాధన వలన కలిగి ,సంక్లిష్ట స్థితులలో పరిష్కారంచూపిస్తుంది .

రాజకీయాలను ఆధ్యాత్మీకరించటంను సర్వోదయం అన్నాడు .ఇవాల్టి మతాతీత రాజ్యంలో దాన్ని సాధించటానికి గాంధీ ఎన్నో ప్రయోగాలుచేశాడు .పాశ్చాత్య మేధావులు తిడ్రిక్ లాంటి వారు ఆయనను తప్పుగా అర్ధం చేసుకొన్నారు . శరీరాన్ని శుద్ధి చేయటం తప్పుకాదు యోగా లో అదేముఖ్యం .విధులకంటే హక్కులు గొప్పవని పాశ్చాత్యులు భావిస్తే, హక్కులకంటే విధులు అంటే ధర్మం గొప్పఅని భారతీయులు భావిస్తారు .విశ్లేషణ విభజిస్తుంది ,ఆధ్యాత్మికత సంశ్లేషణ చేస్తుంది అంటే కలుపుతుంది .చట్రంలో ఉన్న భౌతికత కంటే ఆధ్యాత్మికత శక్తి ఉత్పాదకంగా ఉంటుంది .

ఈ నాటి ప్రపంచంలో అస్తిత్వ సంక్షోభం ఎక్కువైపోయింది .అస్తిత్వం రాజకీయంగా మతపరంగా కూడా ఉంది .అది వ్యక్తిగతమై సంతృప్తి పొందకపోతే సామూహికమై హింసకు దారితీస్తుంది. అస్తిత్వంముఖ్యమే అది జాతీయ సమైక్యత కు దారితీయాలి .అందులో ముఖ్యంగా ఇండియాలాంటి సెక్యులర్ దేశానికి .సైన్స్ ,స్పిరిటియువాలిటి చేతులుకలిపి నడవాలి .మహాత్ముని సిద్ధాంతాలలో సైకాలజీ ఫిలాసఫీలు పెనవేసుకుపోయాయి .

ఆధారం డా.కోనేరు రామకృష్ణారావు గారి ‘’గాంధీ అండ్ అప్లైడ్ స్పిరిట్యువాలిటి ‘’గ్రంథం.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం.9వ భాగం.3.11.22.

మార్కండేయ మహాపురాణం.9వ భాగం.3.11.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆదినారాయణ శతకం

ఆదినారాయణ శతకం

ఆదినారాయణ శతకం  శ్రీ మదాంధ్ర మాఘపురాణనిర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణఅబ్బరాజు శేషాచలామాత్య మణి ప్రణీతం .తత్పుత్ర హనుమంతరాయ శర్మ పాకయాజి పరిశోదితం .శ్రీ దోనేపూడి పార్ధ సారధి సహాయంతో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంముద్రాలయం లో క.కోదండరామ శర్మగారిచే1934లో  ముద్రితం. వెల-ఒక అణా.

  విజ్ఞప్తిలో కుమారుడు –తనతండ్రిగారు 28ఏళ్ళకు పూర్వం ఈ శతకం రాశారని ,భక్తిశతకాలలో దేనికీ తీసిపోదని తాను  ముద్రించటానికి అనేక సార్లు ప్రయత్నించినా ,ద్రవ్యాభావ ,ఇతరకారణాల చేత చేయలేకపోయాననీ ,దోనేపూడి వారు ఈ వ్రాతప్రతి చూసి వెంటనే ముద్రిద్దామని పూర్తిగా ద్రవ్య సాయం చేశారని చెప్పారు .శార్దూల ,మత్తేభాలశతకమిది .’’ఆదినారాయణా ‘’మకుటం .

 మొదటిశార్దూల పద్యం –‘’శ్రీ వాణీశ భవాదిసన్నుత ,రమా చిత్తేశ,మౌనీంద్ర స౦ –సేవా౦ఘ్రిద్వయ ,భాస్కరేందు నయనా చిద్రూప,భక్తప్రియా  – భావాతీత సురేంద్ర వందిత ,మహా బ్రహ్మాండ భాండోదరా –వేవేగం గరుణింప నా దెసకు రావే యాది నారాయణా ‘’అని రాసి తర్వాత గణేశ త్రిమూర్తులను,వారి సతులను వ్యాసాది మౌనులను స్తుతించి కాకుత్స్థ అన్వయ పూర్ణశశి శ్రీరామ చంద్రునికి ఒకనూలుపోగేసి ,తర్వాత తనబాధలు చెప్పుకోవటం ప్రారంభించారు కవి .

  సప్తజలధులు ఏకార్ణవం  అయిన వేళ,బ్రహ్మాండాన్ని గర్భంలో దాచి రక్షించావనీ ,కరిరాజును బ్రోచావనీ ,ఇల్లు ,సంసారం జంజాటంలో మునిగి మనుషులు నిన్ను మర్చి ,కాలుని చేత దండన పొందుతున్నారనీ , నీ మంత్రాక్షర జపం ముక్తిమార్గమనీ ,’’సిరియుం, బంట వెలందియు గెలకులన్ సేవింప ,దిక్పాలకుల్-పరి వేష్టింప సనందనాది మునులున్ బ్రార్ధింప ,నీ మూర్తిని  ‘’  ,కుజన క్షోభం ,సత్యాత్మక స్థిర తోషం ‘’కలిగిస్తావు .అరవి౦దాలకంటే అందంగా స్వామి చరణాలుంటాయి.నారాయణ మంత్రరాజ మహాత్మ్యం తెలిసినవారికి కొంగుబంగారమే చివరకు మోక్షమే .కలి దోషం అనే బాధకు స్వామి కళ్యాణ చరిత్ర దివ్యౌషధం .అమరాదీశ్వరుడు ఒకసారి ప్రమదా వినోదంలో మునిగితేలుతూ ‘’వాచస్పతి ‘’ని గౌరవి౦చక పోతె,స్వర్గంతో సహా అన్నీ నష్టపోయి ‘’నీ నామ మార్గము దాల్పన్ సుర సేవ్యుడైనాడు .

  తర్వాత సోమకాసురవధ పాలసముద్రమధనం,’’త్రివి ‘’రూపంలో హిరణ్యాక్ష నిధనం ,  హేమకశిపుని నృసింహావతారం లో వధించి భక్త ప్రహ్లాదుని కాపాడి లోకాలకు హ్లాదం కలిగించటం ,ముల్లోకాలఏలిక బలిని ‘’బాకారి బంనంబులన్ దొలగం ద్రోసి ,రమాఢ్యు చేయుటకునై ,భూతాఘుడైనట్టి తద్బలిచే గొన్న పదత్రయావనిని –సర్వ వ్యాపివై నాకమున్ బలిమిన్వజ్రికి’’ఇచ్చావు .ఇలా దశావతార  వర్ణన చేశారు.

 పురుహూతుడు అసురెంద్రునితో పోరాడితే ఆఇన్ద్రునికరిమ్రి౦గితె,వృత్రు గర్భంలో పుట్టి వేగంగాచించి ‘’నారాయణ మంత్రం ‘’తో బయటికి వచ్చాడని మంత్రమహిమను కీర్తించారు .బాలకృష్ణుని లీలలు మేనమామ కంస వధ ,తృణావర్త వృత్తాంతం ,తల్లియశోదకు ‘’బ్రహ్మాండంబు నోర జూపగటం’’కాళింగు బిగబట్టి ,వానిపడగల్  కాళ్ళన్జెడన్, మట్టి-యా కాలిందీనది బాపి తజ్జలము ‘’చక్కగా ప్రాణులకు ఉపయోగ పడేట్లు చేశావ్..మురళీగానంతో గోపసతులకు మొహమ్ కల్గించి ,ఒక్కొక్కరికి ఒక్కొక్కడి వై రాసక్రీడ జగన్మోహనంగా ఆడావు .నరకుని తల్లి సత్యభామచేతనే  నరికి౦చావ్ యుద్ధంలో .ధర్మరాజు రాజసూయంలో అగ్రతాంబూలం అందుకున్నావ్ .కురుక్షేత్ర యుద్ధంలో ‘’పార్దునకు చేదోడుగా ఉంటూధరాభారం తగ్గించావ్ .ఆపత్కాలం లోఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారికి ‘’దాపై గాచెదవు ‘’.

  నహుష గర్వభంగం వర్ణించారు ‘’ఒకదీపం లోఉన్న తేజం వేరొక్కొక్క దీపంబు నన్ బ్రకటంబై నట్లు బ్రహ్మాండం లో  ‘నీ ఒక్క రూపమే అనేక రూపాలుగా ఉత్పత్తి సంస్థితి వికలానికి కారణమవుతుంది .చివరగా –‘’శ్రీ కౌండిన్య మునీంద్ర గోత్రభవు డర్దిన్ దేవ భాషామాంధ్రభా-షాకావ్యామృతపానలాలసుడిలన్,శార్దూల ,మత్తేభ వృ-త్తాకారోజ్వల సూనమాలికను నమ్మక్కా౦బికా,నారసిం-హాకా౦క్షోద్భవ శేషయాహ్వయుడు ,కొమ్మీ యాదినారాయణా ‘’అని చెప్పి

  పరాభవ నామ సంవత్సరంలో ద్రోణపురంలో ఆర్యులు ప్రమోదం పలుకగఈ శతకమ్ రాశానని ,ఆదినారాయణుడికి అన్కితమిచ్చాననీ ప్రకటించారు కవి .అన్ని విధాలా భక్తీ చిప్పిలింది .ముఖ్యంగా నారాయణ మంత్రం రాజ శ్రేష్టను గొప్పగా  వర్ణించారు.మంచి భక్తిశతకమే వారబ్బాయి గారన్నట్లు .ఈ శతకాన్నీ, కవి గారిని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు         

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 నౌపడా ఉప్పు సత్యాగ్రహ నాయకురాలు ,త్యాగి – శ్రీమతి వేదాంతం కమలాదేవి (వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -నవంబర్ 

కడపజిల్లా నందలూరులో శ్రీమతి వేదాంతం కమలాదేవి 5-5-1897న ప్రతాపగిరి రామ గోపాల కృష్ణయ్య,శ్రీమతి భ్రమరాంబ దంపతులకు జన్మించింది .తండ్రి ప్లీడర్.అయన గారాబు పుత్రిక కనుక రోజూ ఆమెను తనతో కోర్టుకు తీసుకు వెళ్ళేవాడు .అందువల్ల అర్ధం లేని సిగ్గు జంకు ఆమెకు ఉండేవికావు .రాజకీయ ,సాంఘిక పరిజ్ఞానం అలవడింది 12వ ఏటనే .ఆమె వివాహాన్ని బాపట్ల వాసి వేదాంతం వెంకట కృష్ణయ్యయ్య తో  చేశారు .భర్త విద్యావంతుడు, సంస్కారజీవి .బ్రహ్మసమాజ మతానికిఆనాటి అందరు యువకుల్లాగానే ఈయనా ఆకర్షితుడయ్యాడు.పిల్లని అత్తారింటికి కొంతకాలం ప౦ప కుండా ఉంటె , అతడే దారికోస్తాడనుకొన్నారు ఆమె తలిదండ్రులు .కానీ వారి ఆలోచనలకు భిన్నంగా కమలాదేవి 13ఏటనే భర్త భావాలతో ఏకీభవించి కాకినాడకు కాపురానికి వెళ్ళింది .

  ఆమె భర్త అప్పుడు కాకినాడలో హెడ్ మాస్టర్ .పిఠాపురం రాజాగారు స్థాపించిన అనాధ ఆశ్రమ నిర్వాహకుడుగా కూడా ఉండేవాడు .  అందువల్ల కమలాదేవికి జాలి కరుణ ,ప్రేమ ,కార్యనిర్వహణ అభిలాష సేవాభావం అ వయసులోనే కలిగాయి .పని చేసి యేదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఆమె నేర్పు ,పట్టుదల అందరికి వి౦తగొలిపేవి .భర్త డాక్టర్ పరీక్ష చదవటానికి కలకత్తా వెడితే, ఈమెకూడా వెంట వెళ్ళింది .అక్కడ మహిళాభ్యుదయానికి ఎంతగానో కృషిచేస్తున్న శ్రీమతి సుప్రభాదేవికి శిష్యురాలై౦ది .బెంగాలీ నేర్చుకొని బెంగాలీతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలూ చదివే సామర్ధ్యం సాధించింది .బెంగాలీ పుస్తకాలను కొన్నిటిని తెలుగులోకి అనువాదం చేసింది .

  కలకత్తా చదువు పూర్తిచేసి భర్త వెంకట కృష్ణయ్య కాకినాడ లో 1919లో డాక్టర్ గా స్థిరపడ్డాడు .సంఘానికీ దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేయాలన్న విశాలభావాలతో కమలాదేవి కలకత్తా నుంచి కాకినాడ చేరింది .1920లో  గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం ఈ దంపతుల హృదయాలను ఊపేసింది.జాతీయోద్యమ బీజం మొలకరించి వృక్షంగా పెరిగింది .విదేశీ వస్త్ర బహిష్కారం ,నూలు వడకటం ఖాదీ ధరించటం,ఇంటింటికీ  తిరిగి ఖాదీ వస్త్రాలమ్మటం నిత్య కృత్యమైంది .శాసనోల్లంఘన పై ప్రజాభిప్రాయ సేకరణ కు 1921లో అఖిలభారత శాసనోల్ల౦ఘన సంఘం సామర్లకోటకు వచ్చింది .అప్పటికి కొన్ని రోజులక్రితమే కమలాదేవి బిడ్డస్వరాజ్యం  చనిపోయింది .ఆ బాధను మనసులో దిగమింగుకొని ,విచారణ సంఘాన్ని ఆహ్వానించి వినతిపత్రం సమర్పించింది .ఆనాటికీ నేటికీ ఒక్క సారే కాంగ్రెస్ మహాసభలు ఆంధ్రదేశంలో 1923లో మాత్రమె జరిగాయి .

  కాకినాడలో జరిగిన ఆమహాసభలు రంగరంగ వైభవంగా జరగటానికి కమలాదేవి చేసిన కృషి అనన్య సదృశం .ఘోషా వదిలేసి మహిళలు మహోత్సాహంగా వేలాదిగాపాల్గొని విజయవంతం చేశారు .వారిలో అణువు అణువునా ఉత్సాహం ఉద్రేకం పెల్లుబికింది .కమలాదేవి నాయకత్వంలో అనేక బాలికా ,మహిళా వాల౦టీర్ దళాలు  ఏర్పడి  ఇరవైనాలుగుగంటలు విసుగు విరామం లేకుండా  సేవలందించారు ..స్త్రీల శాంతిదళానికి కమలాదేవి  ఆధిపత్యం వహించింది .భర్త కృష్ణయ్య వైద్య దళానికి నాయకుడు .మహిళాసంఘ కార్య దర్శినిగా కమలాదేవి  ఆంధ్ర దేశమంతా తిరిగి, ఖాదీ ప్రచారం చేసి ,తిలక్ స్వరాజ్యనిధికి భారీగా విరాళాలు సేకరించింది .

   1930లో ఉప్పు సత్యాగ్రహం నాటికి కమలాదేవి ఆరోగ్య౦ ఏమీ బాగాలేదు .ఇంట్లో అంతా పసిపిల్లలు ,ఇల్లు’’ఆనందనిలయం’’ కాంగ్రెస్ ఆస్పత్రి అయింది .అతిధి అభ్యాగతులతో, క్షతగాత్రులతో కిటకిట లాడేది .విశాఖ జిల్లా ఉద్యమం నడపటానికి మహిళా నాయిక కోసం మహర్షి బులుసు సాంబమూర్తి వెతుకుతున్నారు .ఈమె అన్ని ఇబ్బందుల్నీ వదిలేసి ,రంగంలోదూకింది .ఆవేశంగా ఉపన్యాసాలిస్తూ ఉద్బోధిస్తూ చాకచక్యంగా పురుషులతోపాటు చొచ్చుకుపోయింది .ఒక గొప్ప ప్రజానాయికగా ,ఉద్యమకారిణిగా గొప్ప పేరు తెచ్చుకొన్నది .ఏ జిల్లావారు ఆజిల్లో శాసనోల్లంఘన చేయాలని కాంగ్రెస్ నియమాన్ని అనుసరించి కమలాదేవి ‘’నౌపడా ఉప్పు కొఠార్ల మీదికి దండెత్తింది .ఆ ఉద్రేక౦ , సంరంభం ,పట్టుదల అసామాన్యం అనిపించాయి .లాఠీ దెబ్బలకు జంకలేదు ,అరెస్ట్ లకు భయపడలేదు .సాశనోల్లంఘన ఒక పవిత్రయజ్ఞం లా  ప్రజలు  భావించి ముందుకు కదిలారు. అనేకమంది స్త్రీ పురుషులతో కలిసి ఆమె నౌపడా ఉప్పు కొఠార్లవద్ద ఉప్పు సత్యాగ్రహం చేసి 1930మే 20న అరెస్ట్ అయింది .రాయవెల్లూరు జైలులో ఆరు నెలలు బిక్లాస్ ఖిదీగా శిక్ష అనుభవించింది .

   రాయవెల్లూరు జైలులో శ్రీమతి ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ,శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయమ్మ ,దువ్వూరి సుబ్బమ్మ గార్లవంటి అగ్ర నాయకులతో పరిచయం కలిగింది .కళాత్మక హృదయమున్న ఈమె ఏపనైనా ఉత్తమంగా ,నాణ్యంగా చేసేది .చమ్కీ ,పట్టు ,జరీ ,అల్లికలు పూలతోట పెంపకం ,చక్కగా వంట చేయటం మధురంగా పాడటం వంటివి ఆమెకు కరతలామలకం .ఖైదీగా తనకు వంటపని డ్యూటీ వచ్చినపుడు వంటిల్లు ను ముందు అద్దం లాగా పరిశుభ్రం చేసి ,ఆటర్వాతే కమ్మని వంటచేసేది .1930నవంబర్ 12న  విడుదలై ఇల్లు  చేరింది .అనారోగ్యంగా ఉన్నా ఏపనీ మానలేదు .1931లో ఇచ్చాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిలళాసభకు అధ్యక్షతవహించింది .

  1932 రెండవ సారి శాసనోల్లంఘన లో ప్రభుత్వం లాఠీ లను ఉపయోగించి ఉద్యమకారుల్ని భయ భ్రాతుల్ని చేసింది .భారీసభలు జరగకుండా అడ్డగించింది 144 సెక్షన్ విధించింది .సభ జరిపితే రాజద్రోహ నేరం మోపేవారు .ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం జరపరాదాని  ఆంక్షపెట్టింది ప్రభుత్వం. అయినా లెక్క చేయకుండా కొండా వెంకటప్పయ్య ,ఉన్నవా లక్ష్మీ బాయమమ్మగార్లు వెళ్లగా స్టేషన్ లోనే వందలాది మందిని అరెస్ట్ చేశారు .కానీ తెలివిగా ప్రకటించిన చోటకాకుండా గుట్టు చప్పుడు కాకుండా వేరొక చోట సభనిర్వహించారు కమలాదేవి ప్రభ్రుతులు .

  ఈ సందర్భంగా కమలాదేవి తెలివి తేటలు చాతుర్యానికి సంబంధించిన ఒక ఉదంతం తప్పక చెప్పుకోవాలి .గుంటూరు జిల్లాలో శ్రీమతి వేదాంతం కమలాదేవి అధ్యక్షతన 5-6-1932న ఆంధ్రరాష్ట్ర మహా సభ జుగుతుందని అందరూ పాల్గొనాలనీ పత్రికలలో ప్రకటించారు .గోడలమీద కాగితాలు అంటించారు .ఆ సభను ఎలాగైనా జరగనివ్వకుండా చూడాలని నిశ్చయించి పోలీసులు అప్రమత్తులై కమలాదేవి అరెస్ట్ చేయటానికి సర్వ సన్నద్ధంగా ఉన్నారు.నాలుగవ తేదీ అర్ధ రాత్రి గడిచినా ఆమెజాడ కనబడలేదు.అగ్రహారంలో సంపత్కుమారా చార్యులవారి వ్యాయామ శాలలో నాలుగవ తేదీ ఉదయంనుంచి రాములవారి భజన కార్యక్రమాలు రాత్రిదాకాజరిగి రాత్రి పది గంటలకు తీర్ధ ప్రసాదాల సందడి జరిగింది .ఆసమయం లో నలుగురు మనుషులు చేరితే ఆరుగురుపోలీసులు వచ్చేవారు .ఆ రోజు ఆ పోలీసులు కూడా ప్రసాదాలు తీసుకొని ,చుట్టు ప్రక్కలున్న అరుగులపై ఆదమరిచి హాయిగా నిద్రపోయారు .తెల్లవారి కళ్ళు నులుముకొంటూ కలవర పాటుతో పరిగెత్తి లాఠీచార్జి చేస్తున్న పోలీసులతో కలిశారు .తెల్లని ఖాదీ ధరించి జండాలు పట్టుకొని జాతీయగీతాలు పాడుతూ వందే ‘’మాతరం మనదే రాజ్యం ‘’అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లు సింహ గర్జన చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ,పౌరులమధ్య విజయోత్సాహం విజయ గర్వం ముఖాన తాండడ విస్తూ ,వేదాంతం కమలాదేవి నిలబడి ఉంది .ఆమె అనుకున్న ప్రకారమే కాకినాడలో బయల్దేరి ,గుంటూరుకు ముందు  స్టేషన్లోనే దిగి ,పల్లెటూరి పెళ్లి ముత్తైదువలాగా తయారై రైల్లోనే గుంటూరుచేరింది .వ్యాయామశాల చుట్టూ ఉన్న చాలా ఇళ్ళల్లో రహస్యంగా వచ్చి దిగిన ప్రతినిధులు ,పొరుగూరి ప్రేక్షకులతోపాటు ఆమె కూడా వచ్చింది .తెల్లవారుజామున కోనేరు గట్టుపై అందరూ చేరి జండా వందన చేశారు .కమలాదేవి అచ్చు వేయించిన తన అధ్యక్షోపన్యాసాన్ని చదివింది .కాంగ్రెస్ మహా సభ ఆమోదించిన శాసన ధిక్కార తీర్మానాలన్నీ చదివి ,ఆమోదించారు .మరికొన్ని ఉపన్యాసాలు ప్రబోధాలు అయ్యేసరికి తెల్లారింది .మహాసభ అద్భుతంగా విజయమైనందుకు అందరూ ఆనందంగా జాతీయగీతాలుపాడుతూ ఊరేగి౦పు గావచ్చారు .తెల్లవారి తెలివిపై తెలివిగా దెబ్బకొట్టి తెల్ల బోయేట్లుచేసిన సాహసి కమలాదేవి .తర్వాత అందరిని  అరెస్ట్ చేశారు .గుంటూరు సబ్ జైలులో పది హేను రోజులుంచి ,ఆరునెలలశిక్షవేసి, రాయవెల్లూరుకు పంపారు .ఈమెతోపాటు అరెస్ట్ అయిన కొండా సత్యవతమ్మగారికి జైలులో టైఫాయిడ్ వచ్చింది .కమలాదేవి ఆమెను కంటికి రెప్పలాగా కాపాడి ఆరోగ్యం కుడుటబడేట్లు చేసింది .

  రెండవ సారి అరెస్ట్ అయి విడుదలయ్యాక 1929,1930,1934లలో అఖిలభారత కాంగ్రెస్ స్థాయీసంఘ సభ్యురాలుగా గౌరవం పొందింది .మూడు సార్లు కాకినాడ మునిసిపల్ కౌన్సిలర్ గా ఉన్నది .ప్రాధమిక విద్యావ్యాప్తి చేసింది .స్త్రీలలో జాతీయభావ స్పూర్తి పెంచింది .తర్వాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ప్రచారం చేసింది .ప్రత్యర్ధులు కొన్ని చోట్ల ఆమెకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేశారు. అయినా అత్యధికం కాంగ్రెస్ వారు గెలిచారు ఆమె కృషి ఫలించి సంతృప్తి చెందింది .మద్రాస్ కార్పోరేషన్ ఎన్నికలలో ఆచంట రుక్మిణీ లక్ష్మీ పతికి తోడ్పడింది .స్వాతంత్ర్యం రాక మునుపే ఇంతటి దక్షతకల నాయకురాలు,త్యాగమయి  , శ్రీమతి వేదాంతం కమలాదేవి 43వయేటనే14-7-1940న పక్షవాతంతో మరణించింది .

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 24వ భాగం.3.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 24వ భాగం.3.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

· 349-టివి సీరియల్ నటుడు ,ఆనంద్ సినిమా నటుడు ,సిటీ బీట్స్ దర్శకుడు –లగడపాటి గోపీ చంద్

· గోపీచంద్ లగడపాటి (English: Gopichand Lagadapati) [1] సిని నటుడు, నిర్మాత, దర్శకుడు ఇంకా రచయిత . లగడపాటి తెలుగు చిత్రం ఆనంద్ తో సినిమా రంగప్రవేశం చేసారు .తర్వాత మిస్టర్ మేధావి సినిమాను ఆయన తాతగారితో కలిసి నిర్మించారు.

మునుపటి జీవితం
గోపీచంద్ లగడపాటి 1981 జూలై 16, లగడపాటి సంగయ్య, రమాదేవి దంపతులకు జన్మించారు.[2] లగడపాటి తల్లిగారి తండ్రి శ్రీ రామారావు బొద్దులూరి సిని నిర్మాతగానే గాక ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా కూడా ఉన్నారు. గోపీచంద్ హోటల్ మేనేజ్మెంట్ నుండి డిగ్రీ చేసారు.

వృత్తి
గోపీచంద్ లగడపాటి [3] మొట్టమొదటిగా ప్రియనేస్తం అనే తెలుగు ధారావాహికంలో నటిచారు.ఇది జెమినీ టెలివిజన్లో 2000 సంవత్సరంలో ప్రసారం అయ్యింది . తర్వాత గోపీచంద్ లగడపాటి ప్రేమించి చూడు అనే సినిమాకు దర్శకత్వ శాకలో పనిచేసారు. కొంత కాలం చదువుల కొరకు సినిమాకు దూరంగా ఉన్న గోపీచంద్ మరల తన చదువులు పూర్తైన తర్వాత యాద్రుచికంగా తన స్నేహితుల ద్వారా శేఖర్ కమ్ములను కలుసుకున్నారు.ఆ విధంగా ఆనంద్ తో నటుడిగా సిని రంగ ప్రవేశం చేసారు. ఆనంద్ సినిమా తదుపరి, రెండేళ్ళ తరువాత అనే చిత్రంలో మరొక ఇద్దరితో కలిసి కథానాయకునిగా నటించారు. ఈ చిత్రం 2005 జూలైలో విడుదలయ్యింది . ఈ చిత్రం విడుదల వరకు అంచనాలు ఉన్నప్పటికీ జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది . తరువాత గోపీచంద్ ఇండియన్ బ్యూటీ అనే చిత్రంలో ప్రతి నాయకుని పాత్రలో నటించారు.ఈ చిత్రం కూడా జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది .ఈ చిత్రం 2006వ సంవత్సరంలో విడుదల అయ్యింది . గోపీచంద్ తదుపరి చిత్రం ఆన్ ది అదర్ సైడ్ అనే ఇంగ్లీష్ సినిమాలో. ఈ చిత్రంలో కూడా గోపీచంద్ ప్రతినాయకుని పాత్రలోనే నటించారు. ఇది 2007వ సంవత్సరంలో అమెరికాలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను హార్లం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నుండి ఉత్తమ చిత్రంగా 2007 సంవత్సరానికి గాను ఎంపికయ్యింది. గోపీచంద్ లగడపాటి 2007 లో తన తాత గారితో కలిసి మిస్టర్ మేధావి అనే చిత్రాన్ని నిర్మించారు . దీనికి ఆయన ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. .ఈ చిత్రం తర్వాత గోపీచంద్ హాలీవుడ్ సినిమా భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ అనే చిత్రంలో దర్శకత్వశాఖలో ప్రముఖ హాలీవుడ్ నటులైన మార్టిన్ షీన్, మిస్చా బార్టన్, కాల్పెన్, తదితరులతో కలిసి పనిచేసారు. ఈ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది.గోపీచంద్ లగడపాటి జంజీర్ అనే హిందీ సినిమాలో కూడా దర్శకత్వ శాఖలో పనిచేసారు.ఇది తెలుగులో తూఫాన్ అనే పేరుతో విడుదల అయ్యింది. గోపీచంద్ లగడపాటి సినిమాలోనే కాక పలు జాతీయ అంతర్జాతీయ లఘు చిత్రాలు, ప్రకటనలకు రచయితగా ఇంకా సహాయ దర్శకుడుగా ; పని చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా పనిచేసారు.

చిత్ర వివరములు

  1. ప్రియనేస్తం ( 2000 ) – ధారావాహికం – నటుడు
  2. ప్రేమించి చూడు (2001) – సినిమా – సహాయ దర్శకుడు
  3. ఆనంద్ (2004) – సినిమా – నటుడు
  4. సిటీ బీట్స్ (2004 ) -డైలీ – దర్శకుడు
  5. రెండేళ్ళ తర్వాత (2005) – సినిమా – నటుడు
  6. ఇండియన్ బ్యూటీ (2006) – సినిమా – నటుడు
  7. ఆన్ ది అదర్ సైడ్ (2007) – సినిమా – నటుడు
  8. మిస్టర్ మేధావి (2008) – సినిమా – సహ నిర్మాత
  9. అడ్వెంచర్స్ ఇన్ ఒడిస్సీ (2010 ) – ధారావాహికం- సహాయ దర్శకుడు
  10. యొప్లైత్ (2010) -ప్రకటన -సహాయ దర్శకుడు
  11. డెత్ (2011) -లఘు చిత్రం -సహాయ దర్శకుడు, నటుడు
  12. జంజీర్ (2013) -సినిమా – సహాయ దర్శకుడు
  13. తూఫాన్ (2013) -సినిమా – సహాయ దర్శకుడు
  14. భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ ( 2014) -సినిమా – సహాయ దర్శకుడు, నటుడు

· 350-మాధవిపిక్చార్స్ అధినేత ,శ్రీకృష్ణ తులాభారం,కురుక్షేత్రం ఫేం –గోరంట్ల రాజేంద్ర ప్రసాద్

· గోరంట్ల రాజేంద్రప్రసాద్ రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 1963లో రాముడు భీముడు చిత్రం భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు నిర్మించారు.

· మరణం
· 86 సంవత్సరాల గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యం కారణంగా 2022 జులై 7న కన్నుమూశారు.[1]

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(చివరి భాగం )
‘కొవ్వలి నవలలు –పఠనాసక్తి ‘’వ్యాసంలో చదివే ఆసక్తి ఉంటేనే రచన కాలంతోపాటు చెల్లుబాటౌతు౦దనీ ,సామాన్య చదువరులచేత అనూహ్య ఆదరణపొందిన నవలారచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అనీ ,విశ్వనాథ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడుతూ ,చలం స్త్రీలకు బయటి ప్రపంచాన్ని చూపిస్తూ కొడవటిగంటి సమాజంలోని స్తబ్దతను వదిలించి చైతన్యం కలిగిస్తూ రచనలు చేస్తున్నకాలం లో కొవ్వలి ఆకర్షణ ,ఉత్సుకతలతో ఒక సంచలన రచయితగా ఆవిష్క్రుతుయ్యాడని,చదువరి పుస్తకం లోనుంచి తన మస్తాకాన్ని పక్కకు తిప్పే వీల్లేకుండా నియంత్రించే మంత్ర శక్తి కొవ్వలికి ఉందనీ ,ఇంట్లో వాళ్ళు ఏమనుకొంటారో అని పుస్తకాల చాటున ,పడగ్గదిలో దాచుకొని చదివే వారనీ ,రైల్వే స్టేషన్లలో, రైళ్ళలో కొవ్వలి నవలలు ‘’హాట్ కేకులు ‘’గా అమ్ముడుపోయేవని ,అలాంటి వాడు ఇంకోడు రావాలనుకోవటం ఎండమావి లాంటి దేమో ?’’ అన్నారు .కొవ్వలి నవలలు ‘’కాలక్షేపం బఠానీ’’లు అని అనేవారు .
ఘంటసాలను ‘’వాగ్దేవి స్వరనైవేద్యం ‘’అని ఆవిష్కరించిన వ్యాసంలో కరుణ శ్రీ పద్యం ముందు తన గొంతును అద్దంలో పెట్టి ఘంటసాల భావ ప్రతిబింబాన్ని చూపాడు అని చెప్పటం నాకు తెలిసినంతవరకూ ఎవరూ ఇంతగొప్పగా ఆవిష్కరించలేదు .కవి అస్తిత్వాన్నీ కవిత్వ స్థితిగతుల్ని గళమాధుర్యంతో ప్రకటించగల ఘనత ఘంటసాలది అన్నారు .అలిగితివా సఖీ పాటలోఅనునయం అర్ధం కోసం నిఘంటువులలో వెతకక్కరలేదు ఆయన పాడే తీరులో పుష్కలంగా లభిస్తుంది .’’ధారుణి రాజ్య సంపద ‘’పద్యంలో భీముడి ఉద్రేకం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది .రౌద్రానికిస్థాయీభావంగా కనిపించే క్రోధం యొక్క ఔద్ధత్యం శ్రవ్య చిత్రంగా నిల్పి శరీరం రోమాంచితం చేస్తారు .’’మాణిక్య వీణా ముపలాలయ౦ తీం ‘’అన్న కాళిదాసు శ్లోకానికి తన స్వరంతో ‘’అమృత తుల్యం చేశారు .ధ్వన్యనుకరణలు చేయకుండా అగ్ర నటులకు గాత్రదానం చేసిన స్వర మాంత్రికుడు .పాట ,పద్యంతో వాగ్దేవికి స్వరనైవేద్యం చేసిన పూజారి .
‘’అతడొక త్రివర్ణమాల ‘’అంటూ శ్రీరంగం నారాయణ బాబు ‘ను పరిచయం చేశారు వోలేటి .ఆనాటి ఆంధ్రపత్రికలో ‘’మనకు సహకారి యగుచు మన్మధుడు వెదకి-వాడి యడుగుల గాడి త్రవ్వంగ కొత్త –చెలమలేర్పడి తేటలౌ జలములూరే ‘’అని రాసి భావకవిగా అస్తిత్వాన్ని చాటుకొని ,చీకటిలో మిణుగురు లను వెతికాడు.’’మువ్వపు వలపుతారల మువ్వ మ్రోత’’ఆయన మాత్రమె అనగలడు .’’దంతపు వీణైతేనేమి వొళ్ళు –తెగిపోయిన తీగ బతుకు –మేళన చేయని హృదయం –నీ వ్రేళ్ళకు బాధ మిగులు-నను ముట్టకు ‘’అంటూ వేశ్యను వర్ణించిన తీరు అనితరసాధ్యం –వెలకట్టబడిన తనువుతో వేదనా మయిగా జీవించే వెలది కరుణా౦తరంగాన్ని ,మానవీయకోణ౦తో ఎత్తిన పతాక .’’నా నివాసంము తొలుత గాంధర్వ లోక –మధుర సుషమా సుధాగాన మంజువాటి-ఏనొక వియోగ గీతిక ‘’అని కృష్ణశాస్త్రిని ,’’లోకాలు నాకేలనే –కోకిలా బాలకృష్ణుడు చాలునే ‘’అంటూ తురగా వెంకటరామయ్యను బాబు పాడుతుంటే ‘’ఇంతకంటే కవిత్వానికి పరమావధి ఏముంది ‘’అని శ్రీశ్రీ కూడా అంటే ఇంకేం కావాలని మనకు తెలీని విషయం ఆవిష్కరించారు పార్వతీశం .తనకాలంనాటి యువకవులకవితలను ఆయన గానం చేస్తుంటే ‘’విజీనగరంరసప్లావితం ‘’అయీదట .నారాయణ బాబు భావకవిత్వ ఆదర్శ వాద కవితా శాఖనుంచి వాస్తవిక శాఖకు ,అక్కడినుంచి వాస్తవిక అధివాస్తవికత కు ప్రయాణించాడు అతనికి పౌరాణిక కథలపైనా ,శాస్త్రీయ సంగీతం పైనా సమస్కంధమైన అవగాహన ఉందన్నారు .’’మంటల్లోపుట్టి మంటల్లోపెరిగి మంటల్లోనే మడిశాడు ‘’అని భగత్ సింగ్ ను ఒక అగ్ని శిఖగా చేసి రాశాడు .రాగ,తాళ లక్ష్యాలు సాకల్యంగా తెలిసి ‘’చెప్పవా –కష్టమైనా –సంకీర్ణపు –నరజాతికి –ఆకలి –ద్రువతాళ౦ –ఆకలితో –నా కడుపు –అగ్ని వీణ వాయిస్తే –దీపకరాగం-దిక్కు లెగబాకి-ఆకాశం అంటుకుంది –ఆర్పండి –ఆర్పండి ‘’రాత్రిని జీవితాన్నీ పడుగు పేకల్లా వర్ణించి ‘తెలుగు ధాత్రి ‘’రాశాడు .సర్రియలిజాన్ని శ్రీశ్రీ అతి వాస్తవికత అంటే నారాయణబాబు అది వాస్తవికత అని మౌన శంఖం పూరించి విలక్షణప్రయోగం చేశాడు –‘’మౌనము శంఖమై చెరగు మాయగా నేత్ర పాతనగ బింబ వి-ధ్వానము కొంగ నెత్తురులు త్రాగెను నల్లతురాయిపూవుగా —‘’
మారుషులు మార్క్స్ ,ఫ్రాయిడ్ లు అన్నాడు .ప్రయోజనాన్ని వినియోగించుకొని ,అనర్ధాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చేయగలపని అన్నాడు .బాబు వ్యాసాలూ కతలూ రాశాడు .వీటిలో సినిమాలు నాటకాలూ ఉన్నాయి .కొమ్మూరి వెంకట్రామయ్య పత్రిక ‘’తెలుగు సినిమా ‘’లో వ్యాసాలురాశాడు .అబ్బూరివారి ‘’నటాలి’’లోనూ పనిచేశాడు .భావకవి అధివాస్తవిగా ,చివరికి అభ్యుదయకవిగా రూప విక్రియ చెంది తెలుగు వాళ్ళ కవనాకాశం లో త్రివ ర్ణమాలగా ఆవిష్క్రుతుడు అయ్యాడు నారాయణ బాబు అంటూ ఎస్టిమేట్ చేశారు పార్వతీశం .
‘’చివరకు మగిలిన సగం ‘’లో శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి రాస్తూ భర్తబుచ్చిబాబు అనే వెంకట సుబ్బారావు గారి కీర్తిలో అర్ధభాగం దక్కించుకొన్న విదుషీమణి అనీ ,ఆయనకోసం వచ్చే కవులు కళాకారులు రచయితలకోసం’’ వండ నలయదు వేవురు వచ్చి రేని ‘’అన్నట్లు ప్రవరునిభార్యలాగా అన్నపూర్ణకు ఉద్ది అయిన ఉత్తమా ఇల్లాలు .ఆమెగాయని, చిత్రకారిణి రచయిత్రి కనుక ఆ అర్ధ గౌరవం సంపాది౦చు కొన్నారని ,నిరంతర సౌన్దర్యాన్వేషి అయిన భర్త కు తగ్గట్లు ఇల్లు ఆహ్లాదంగా తీర్చిదిద్దేవారని ,ఇదంతా ఆయన వలన కలిగిన కీర్తి .మహిళాచైతన్యానికి ప్రేరణ గా నిలిచి కావ్య సుందరివంటి కథా సంపుటాలు,తీర్పు వంటి నవలలు రాసి’’భర్తకంటే ఉత్తమకథలు రాయాలని ‘’. పింగళివారి ఆశీర్వాదం పొందిన భాగ్యశాలి .’’రేపటి విరాణ్మూర్తిగా వెలగానున్న ‘’బాపు ‘’కు గురువన్న సంగతి వేదగిరి రాంబాబు తెలియజేశారనీ ,మంచి ప్రాజెక్ట్ ప్రారంభించేముందు సీతారాముల బొమ్మలు గీసుకొని పని ప్రారంభించే బాపు ,ఒకానొక సమయంలో బుచ్చిబాబు శివలక్ష్మి దంపతుల బొమ్మలు వేసి పని ప్రారంభించే వారన్న విషయంకూడావేదగిరి ఉవాచ .మిసిమి పత్రికకు ఆమెతో చేసిన ఇంటర్వ్యు సారాంశం –పాశ్చాత్య దేశాలసాహిత్యం బాగా చదివి అక్కడి కొత్తదనాన్ని తెలుగులో ప్రవేశ పెట్టాలని ఆయన అబిరుచి .మద్రాస్ రేడియో లొనే ఈ ప్రయోగాలు మొదలుపెట్టారు ‘’రాయల కరుణ నృత్యం ‘’చేసినపుడు బిఎన్ రెడ్డిగారితో ముందుమాటలు చెప్పించారు .ఇదే మల్లీశ్వరి సినీకథ .అడ్డదిడ్డంగా విమర్శిస్తే కోపం వచ్చేది ఆయనకు .పరోక్షంలో తక్కువ చేసిమాట్లాడటం సహి౦చె వారుకాదు .చివరకు మిగిలేది నవలలో తన ఊహలన్నీ అందులో పెట్టేశారు అందుకే ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది .సహృదయులతో శేషే౦ద్ర లాంటి వారితో ఎంతసేపైనా మాట్లాడేవారు .రామాయణం లోతులు బహు చక్కగా చెబుతుంటే ఆసక్తిగా తానూ వినే దాన్ని అన్నారు .వర్ణనలు చేయాలంటే మావారే .అందుకే నాకథలలో వర్ణనలు లేకు౦డారాశాను .తనకథల్లో అందరూ సామాన్య స్త్రీలే ఇద్దరం చిత్రాలు చాలానే వేశాం.ఒరిజినల్ దాట్స్ బాగుంతాయనేవారు .చిత్రకళలో తనకు గురువులేరని ఆసక్తిగా స్వయంగా నేర్చినదే అని అన్నారు .ఆయన లాండ్ స్కేప్స్ ఎక్కువ వేశారు తాను వ్యక్తుల బొమ్మలు వేశారు .గాంధీ గారి బొమ్మ గీశారు. గాంధీ మద్రాస్ లో ఉన్న నెలనాళ్లు ఆమె రోజూ బస్సెక్కి వెళ్లి ఆయన ఎక్కడ ఉంటె అక్కడ చూసే వారు. అతి సన్నిహితంగా బాపును చూడటం తన అదృష్టం .సంస్కృతం ఇష్టం అ౦దులొ కావ్యాలు చదివారు .ఆయనకు హార్మోనియం ఇష్టం .పద్యాలు మహా ఇష్టం . .ఈలపాట రఘురామయ్య తరచూ ఇంటికి వచ్చి పద్యాలుపాదడి ఆయనకు సంతృప్తికలిగించేవారు .బుచ్చిబాబు శతజయ౦తి వరకు ఆమె ప్రతి ఏడూ ఆయన పుట్టిన రోజు జరిపేవారు .ఆయనకు పుట్టిన రోజు అంటే భలే ఇష్టం నాకు నువ్వు చెయ్యి నీకు నేను చేస్తాను అనేవారు .ఆఖరి సంవత్సరం ‘’షేక్స్పియర్ సాహితీ ప్రస్థానంను ‘’స్థానం నరసింహారావు గారికి హైదరాబాద్ లో అంకితమిచ్చారు దేవులపల్లివారి అధ్యక్షతన తమ ఇంట్లోనే జరిపి అందరికీ భోజనాలు పెట్టటం మరుపుకురాని సంఘటన అన్నారు .ఆయన చిత్రాలలో ముఖ్యమైనవి ఒక సంపుటిగా తెచ్చారు ఈమె ‘’.
సుబ్బలక్ష్మి గారు మహిళాలోకపు మూర్ధన్య ‘’అని ముగించారు ఓలేటి .
స్వవిషయం -1970-80లలో ద్విప్లేట్స్ అనీ ప్రాసక్రీడలని చాపల్యంతో కొన్నిగిలికాను .అప్పడు బుచ్చిబాబుపై –‘’చివరకు మిగిలిందేమిటి బుచ్చిబాబూ –‘’కోమలి ‘’నమైనా ,’’అమృత’’మైనా ఒక్కటే కదా ప్రేమ పిచ్చిబాబు ‘’అని రాసింది గుర్తుకొచ్చింది .
‘’అమృతాశ్రువులు ‘’ ఆధునిక కవులగురించి నివాళి .భావకవితా ప్రతిష్టాపకుడు రాయప్రోలు తనగురువు రవీంద్రుని అస్తమయం పై –‘’ఆరిపోయినదిదివ్యస్నేహ శృంగార దీపంబు –నివాళితీసినట్లు ‘’అని ఆత్మీయత ప్రదర్శించారని ,తనకుమారుని మరణాన్ని కూడా కరుణార్ద్రంగా చెప్పారనీ ,వ్యక్తులు పోయినప్పుడేకాక అనేక విషయాలపైనా ఎలిజీ రాస్తారని ఎలిజాయిక్అనే ఛందస్సు ఉందని అందులో రాసిన ఏవిషయమైనా ఎలిజీ గా భావిస్తారని తెలియజేశారు .అబ్బూరి చేజారిన బాల్యాన్ని జ్ఞాపకాలలో భద్రపరచి –‘’పెంచితి నీరుపోసి ,మొలిపించిన స్వాదు పరార్ధ్ర సాహితీ –కాంచన రాగ వల్లికల గాఢ తమో మలినమము బాపి ‘’అని పద్యం చెక్కారని ,బసవరాజు అప్పారాగారికిఎంతో శోకంకుమారుని మరణం వల్ల కలిగితే ‘’వేదాద్రి శిఖరాన వెలిగిన్న జ్యోతి-మినుకు మినుకుమని –కాసేపు కునికి పోయిందని ‘’పద్యంలో తాత్వికాన్ని భావ స్ఫోరకంగా ప్రకటించారని ,ఆంధ్ర రత్న ఈయనతో యమునాకల్యాణి రాగం పాడించుకొని వినేవారనీ ,ఆయన మరణం ఈయనకు ఆశనిపాతమై ‘’ఎలాపాడెద నింక యమునా కల్యాణి నే-లీల మానవుడు గోపాలుడు లేడాయే-ఎంత చి౦చు కొన్నా గొంతు పెగలదాయే –కన్నీళ్లు గారవకే కడుపు చెరువయ్యే ‘’అని విలవిల లాడి వలవల కన్నీరు కార్చారట .విశ్వనాథ ,దువ్వూరి కూడా అద్భుత స్మృతి గీతాలురాశారని ,బాపి బావ కొడుకుమరణాన్ని –‘’మబ్బుల౦దు బుట్టి మాయమౌ నింద్ర చాపంరీతి –స్వల్పకాలమే వాసనలజిమ్మి వడలు పుష్పంబు బోలి ‘’తమను బాసి వెళ్లిపోయాడని బావురుమన్నారు .కృష్ణ శాస్త్రి భార్య మరణం తట్టుకోలేక ‘’హృదయ నాళము తెగియె ,నా హృదయ ధనము –తొలగిపోయెను జీవిత ఫలము స్రుక్కి ‘’అని జీవితంపై ఇచ్చ నశించి నంతగా సతీ వియోగం కలవరపెట్టి౦దన్నారు .నాయనితల్లిమరణాన్ని ‘’నీవు మడిగట్టుకొని పోయినావు పండ్లు –పుష్పములు తీసుకొని దేవ పూజ కెటకో-నేనునీ కొంగు పట్టుక నీదు వెంట –పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు ‘’అని బాధపడ్డారు .గురువు వెంకటశాస్త్రి గారి మరణం జీర్ణించుకోలేని శిష్యులు పింగళి, కాటూరి –‘’ఎనుబదేండ్లు దైన్య మెరిగిక జీవించచె –బెంచె శిష్యకోటి –యరిగె పూర్ణకాముడగుచు గురుడు ‘అనిగు స్మృతికిసాక్షి సంతకం చేశారట .మానాప్రగడ ,కూడా రాశారు రావూరిభరద్వాజ భార్య మరణం పై ‘’కాంతం నీవు నానుంచి వెళ్ళిపోయాకా-నేను అర్ధం లేని శబ్దాన్ని భాష లేని భావాన్ని శక్తిలేని ద్రవ్యాన్ని వేగంలేని ప్రవాహాన్ని శిల్పిలేని శిలను అయ్యాను నాకిప్పుడే విలువాలేదు –భగవంతుడుకూడా ఇప్పుడు నీరూపం లో కనిపిస్తే తప్ప నేను గుర్తించలేను కాంతం ‘’అని అక్షరలక్షలు విలువ చేసే ఎలిజీ రాశారు .
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గార్ని ‘’అక్షరాల బాట సారి ‘’గా పరిచయం చేశారు పార్వతీశం .1500గ్రామనామాలు అధ్యయనం చేసి పిహెచ్ డి పొంది ,దానికి నామవిజ్ఞానం పెరేట్టి,దాన్ని తనకు అంకితం చేసి యూనివర్సిటిపాఠ్యప్రణాళికలో దాన్ని చేర్పించి బోధి౦ప జేసి బోధించి తన సిద్ధాంత వ్యాసానికి సోపానపంక్తి నిర్మించినవారు యార్లగడ్డ .విశ్వ విద్యాలయ బోధనా శాఖకు విజిటింగ్ ప్రొఫెసర్. పన్లు అయ్యాక బెజవాడలో మకాం పెట్టి భారతాన్ని విశేష వ్యాఖ్యతో రచించి ఎన్నెన్నో రెడియోప్రసంగాలు చేసి ,ఆయన చేసిన ప్రతిపాదనలు సంచలనాలకు కారణమై ‘నిజం వెలికి తీసే ప్రయత్నానికి తానొక కారణమౌతానని చెప్పుకొనేవారు .జీవితంలో సింహభాగం అక్షరాల మధ్య గడిపారని అక్షరయజ్ఞం చేసిన సోమయాజి అని ఆకాశానికి ఎత్తేశారు .
ఇక్కడ స్వవిషయం –నేను 1963లో మోపిదేవి హైస్కూల్ లో మొదటిసారిగా సైన్స్ మాస్టారు గా చేరినప్పుడు పెదప్రోలు లో కాపురం ఉండేవాడిని .అక్కడే బాలగంగాధరరావు ఉండేవారు. అప్పటికి సేకండరీగ్రేడ్ ట్రెయినింగ్ పాసై ఉద్యోగం లేక ఎదురు చూస్తూ ఉ౦ డేవారు.సాయ౦త్రాలలో మాతోపాటు ఒక వంతెనపై కూర్చుని కబుర్లు సాహిత్య విషయాలు మాట్లాడేవారు,రాగాలు తీసేవారు .తర్వాత నేను ఉయ్యూరు వచ్చేశాను .ఆతర్వాత చాలాకాలానికి నాగార్జున యూని వర్సిటిలో లెక్చరర్ గా చేరటం రీడర్ అవటం దోణప్ప గారి శిష్యరికం ,పత్రికలలో వ్యాసాలవలన ఆయన్ను గుర్తుపట్టాను .తర్వాత ఆయనతో మళ్ళీ ప్రత్యక్ష పరిచయం కలిగతం బెజవాడ సాహిత్య సభలలో తరచూ కలుసుకోవటం నేనంటే విపరీతమైనఅభిమానం కలగటం ,పరస్పరం ఫోన్ సంభాషణలు జరగటం ఆంధ్రా యూనివర్సిటిలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండటం అప్పుడూ తరచూ మాట్లాడుకోవటం జరిగింది .ఒక సారినేను విజయనగరంజిల్లా గరివిడిలో మా అన్నయ్యగారమ్మాయి వాళ్ళ ఇంటికి వెడుతున్నప్పుడు కొన్ని ఊళ్లపేళ్ళు తమాషాగా ఉంటె ఇంటికి వచ్చాక ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన గ్రామనామాలపై రాసిన పుస్తకాలు పంపారు .మాపుస్తకాలుకూడా పంపేవాడిని ఒకసారి ఉయ్యూరుకు ఆహ్వానించాం కూడా .ఆయన తానె ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు .తన వద్ద చాలాపుస్తకాలున్నాయని వచ్చి తీసుకు వెళ్ళమనేవారు.కాని ఆభాగ్యం నాకు దక్కకుండానే ఆయన పోయారు .
‘’ప్రణయద్వయం నుంచి శరణు త్రయానికి ప్రస్థానం సౌందరనందం ‘’ పింగళి కాటూరి వారి సౌ౦దర నంద కావ్యం .వ్యక్తిగత ప్రేమ విశ్వ మానవ ప్రేమగా మారటమే కథ .వినగవినగ బుద్ధునిఉపదెశ౦ మనసుకుపట్టి ప్రణయజీవనం సాధు జీవనమైంది .భార్యమాత్రం ఎందుకు కాకూడదు అని భావించి శాక్యమునినే నందుడు అడిగితె అభ్యంతరం లేదంటే ధర్మాచరణకు అనువైన మనస్థితి ఉండాలికాని స్త్రీపురుష భేదం చూపక్కరలేదని అనుజ్ఞ ఇద్దరూ భిక్షుకులౌతారు సుందరీనందులు .’’భావమొక్కడుగాగ భావన యోక్కడై –రసభావ పరిణతి యొసగ జేసి –మిత్రభావము లిమ్మెయి మేళవించి –సృష్టి చేసితిమీ కావ్య శిల్పమూర్తి ‘’అని ఈ జంటకవులు చెప్పుకొన్నారు .
ఇక్కడా స్వవిషయం –సుమారు 1953-54లో కాటూరి, దేవులపల్లి ఉయ్యూరులో మా పెంకుటింటికి వచ్చి హాలులో తూర్పు వైపు గోడకు అ అనుకుని కుర్చీలలో రెండు గంటలు కూర్చోటం ఇంకా నా స్మృతితి పధం లో నిలిచిఉంది .కృష్ణ శాస్త్రిగారు మా పెద్దక్కయ్య గాడే పల్లి సూర్యనారాయణ గారనే పండిట్ రావు గారి పెద్దకోడలు .మాబావ కృపానిధిగారు .ఈయనతండ్రిగారి తమ్ముడే కృష్ణ శాస్త్రి గారి మామగారు రెడియోబావగారైన చిన్న సూర్యనారాయణ గారు. అదీ బంధుత్వం .మా అక్కయ్యగారింటికి మద్రాస్ వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని మా అక్కయ్య కృష్ణ శాస్త్రి గారింటికి తీసుకు వెళ్ళేది .ఆయన చనిపోవటానికిసుమారు పదిహేను రోజులక్రితం నేను మద్రాస్ లో వారింటికి మావాళ్ళతో వెళ్లాను. స్క్రిబ్లింగ్ పాడ్ పై చాలాసంగతులు ముచ్చటి౦చు కొన్నాం . .నన్ను మామేనకోడలు కళను కారులో ఎక్కించుకొని చాలాచోట్లకు తిప్పారు .అదీ మరువలేనిఅనుభవమే .
తరవాతది ‘’ దృశ్య శ్రవ్య మాధ్యమాలలో తెలుగు భాషా సాహిత్యం ‘’మల్లవరపు విశ్వేశ్వరరావు గారి రూపకాలన్నీ సంగీతరూపకాలలో పతాక చిహ్నాలన్నారు –ఓలేటి .ఇక్కడా స్వవిషయం -2017లో మేము అమెరికాలో షార్లెట్ కు మా అమ్మాయి గారింటికి వెళ్ళినప్పుడు మల్లవరపు గారికుమారుడు పరిచయమయ్యారు వారిన్తికిఆహ్వానిన్చి దసరా బొమ్మలకొలువు చూపించి డిన్నర్ ఇచ్చారు .పాటకు దీర్ఘాయువిచ్చింది ప్రసార మాధ్యమమే పక్షిలాంటిది పాటఅన్నారట కృష్ణ శాస్త్రిగారు .పాటలోని చైతన్యాన్ని ఊపిరులుగా ఊదింది ఆకాశవాణి అన్నారు పార్వతీశం.జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి ‘’రావోయి నవమానవా రసరాజ్య రమాధవా ,అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ‘’లాంటి అమృత గుళికలు రెడియోవలననే దక్కాయి .’’సుమదళాలు ఎన్నైనా సురభిళ౦ ఒక్కటే ‘’అన్నట్లు ప్రసార మాధ్యమం గొప్ప సాహిత్య సంస్కృతిని ప్రజలమధ్య నెలకొల్పింది అని నీరాజనం పట్టారు .
చివరిది –‘’తల్లీ నిన్ను దలంచి ‘’లో తల్లిగారు వోలేటి హైమవతి గారి గురించి స్తవనీయ వ్యాసం .కస్టాలువచ్చేటప్పుడు అమెలోదైన్యం ఉండేదికాదు ధైర్యం తప్ప అన్నారు. తనకు జన్మతో పాటు ధన్యతనూ ప్రసాదించిన మాతృమూర్తికి నమస్సులర్పించారు పార్వతీశం . సాధారణంగా కవులు ‘’తల్లీ నిన్ను దలంచి ‘’అని సరస్వతిని స్తుతించి కావ్య౦ మొదలుపెడితే , ఈయన తల్లీ నిన్ను తలంచి ‘’తో మాతృ వందనంచేసి వ్యాసార్ధం ముగించి విలక్షణత చూపారు .ఇంతవరకు నేను రాసింది అంతా దాదాపు వోలేటి గారికలం నుంచి వచ్చిందే .
ఇప్పుడు నా భావం చెబుతున్నా .ఈ పుస్తకం ‘’స్వర్ణఖని.’’లోతుకు వెళ్లి వెతికే సాహసం చేయకుండా ఒడ్డున కూచుని నెరుసులు పోగేశా .అదే ఇంత సు’’వర్ణ ‘’రాసిఅయింది ,.లోతులు తరిస్తే పట్టిందంతా బంగారమే .ఇదొక రస ధుని .త్రాగేవారికి కావలసినంత అమృతం .ఆయన పుస్తకం చదువుతుంటే పూల సెజ్జలపై నడుస్తున్నట్లు నందనవనం లో విహరిస్తూ పారిజాత పరిమళాలుఆఘ్రాణిస్తున్నట్లు ఉంది .మరోలోకపు అంచులమీద తేలియాడుతున్నట్లని పిస్తుంది .అచ్చరల్లాంటి అక్షరాలూ ,కిన్నెర గానం లాంటి పదాలు ,కింపురుష నృత్యంలాంటి వాక్యాలు మనకు గొప్ప అనుభూతినిస్తాయి .ముఖ చిత్రం, మిసిమి వెన్నెలలాంటి పేజీలు .ప్రతి వ్యాసానికి ముందు కలర్ ఫోటో లో అందులోని ప్రముఖుల చిత్రాలు మనోజ్ఞం గా ఉన్నాయి .చదివి ఆన౦దించి అనుభూతి పొందాల్సిన రసరేఖలు వ్యాసార్ధంలోని వ్యాస మంజీరాలు .పార్వతీశంగారిని మనసారా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం.8వ భాగం.2.11.22

మార్కండేయ మహాపురాణం.8వ భాగం.2.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 23వ భాగం.2.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 23వ భాగం.2.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -346

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -346

· 346-నటుడు నిర్మాత దర్శకుడు ,ప్రేమ నగర్ ఫేం,రఘుపతి వెంకటరత్నం అవార్డీ –కే.ఎస్.ప్రకాశరావు

· కోవెలమూడి సూర్యప్రకాశరావు (1914 – 1996) తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయనకుమారుడు కె. రాఘవేంద్రరావు కూడా దర్శక నిర్మాత అయ్యాడు.

తొలి జీవితం
సూర్యప్రకాశరావు 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు.

సినీరంగ ప్రవేశం
ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు.నాయకిగా జి.వరలక్ష్మీ గారు నటించారు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలై విజవంతమైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్‌గా మార్చి మొదటిరాత్రి, దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్‌ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్‌గా నామకరణం చేశాడు.

1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమనగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది.

ఈయన పుట్టన్న కణగాళ్ తీసిన నగర హావు (1972) అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు.

కుటుంబం
ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు.ఈయన అన్న కుమారుడు కె. బాపయ్య కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకులు. ప్రముఖ సినీ నటి జి, వరలక్ష్మి గారు వీరి రెండవ భార్య

పురస్కారాలు
1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది.

మరణం
ప్రకాశరావు గారు 1996 సంవత్సరంలో మరణించాడు.

· 347-ఓనమాలు స్క్రీన్ ప్లే రచయితా ,నిర్మాత దర్శకుడు,భరతముని అవార్డీ –క్రా౦తిమాధవ్

క్రాంతి మాధవ్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా తెలుగు సిజననం – విద్యాభ్యాసం
ఖమ్మంలో జన్మించిన క్రాంతిమాధవ్, వరంగల్లులో పెరిగాడు. మణిపాల్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ చదివాడు.

సినిమారంగం
దర్శకత్వం వహించినవి

  1. 2012 – ఓనమాలు (స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
  2. 2015 – మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం)
  3. 2016 – ఉంగరాల రాంబాబు (దర్శకత్వం)
  4. 2020 – వరల్డ్ ఫేమస్ లవర్ (దర్శకత్వం)[2]

ఎంపికలు – పురస్కారాలు
· సిని’మా’ అవార్డు – ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు

· చెన్నై తెలుగు అకాడమీ అవార్డు – ఉత్తమచిత్రం

· సంతోషం అవార్డు – ఉత్తమచిత్రం

· ఎ.ఎన్.ఆర్. – అభినందన అవార్డు – ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు

· భరతముని అవార్డు – ఉత్తమ సందేశాత్మక చిత్రం, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు

· నిమారంగంలోకి ప్రవేశించాడు

· 348-అమృతం సీరియల్ ఫేం ,అమ్మ చెప్పింది నిర్మాత ,జస్ట్ ఎల్లో యజమాని,నిర్మాత దర్శకుడు –గుణ్ణం గంగరాజు

· గుణ్ణం గంగరాజు సినీ రచయిత, నిర్మాత, దర్శకులు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో వీరి పనితనానికి వీరు ప్రసిద్ధులు. వీరికి రెండు జాతీయ సినిమా అవార్డులు అందాయి. ఐతే, బొమ్మలాట సినిమాలకు గానూ ఈ గౌరవం అందింది.[1][2] వీరు అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది లాంటి విలక్షణ సినిమాలు కూడా నిర్మించారు. తెలుగిళ్ళలో హాస్యపు గిలిగింతలు పుట్టించిన అమృతం ధారావాహిక కార్యక్రమం ఈయన సృష్టే. సినీ నిర్మాణ సంస్థ జస్ట్ యెల్లోకి ఈయన యజమాని.[3]

వ్యక్తిగత జీవితం
గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్యలో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లోయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళనకు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పనిచేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.[4]

సినీ వ్యాసంగం
రచయిత
· లిటిల్ సోల్జర్స్ కథ & సంభాషణలు (1996)

· ఐతే సంభాషణలు (2003)

· అనుకోకుండా ఒక రోజు సంభాషణలు (2005)

· అమ్మ చెప్పింది కథ & సంభాషణలు (2006)

· అమృతం కథ & సంభాషణలు (2007)

· కథ సంభాషణలు (2009)

· లయ టీవీ ధారావాహిక – కథ (2008–2010)

· ఎదురీత టీవీ ధారావాహిక – కథ (2011)

దర్శకత్వం
· లిటిల్ సోల్జర్స్ (1996)

· అమ్మ చెప్పింది (2006)

· అమృతం చందమామలో (2014)

నిర్మాత
· లిటిల్ సోల్జర్స్ (1996)

· ఐతే (2003)

· అనుకోకుండా ఒక రోజు (2005)

· బొమ్మలాట (2006)

· అమ్మ చెప్పింది (2006)

· ఇన్ ఎ డే (2006)

· కథ (2009)

కళా దర్శకత్వం
· లిటిల్ సోల్జర్స్ (1996)

టీవీ ధారావాహికలు
· అమృతం (2001–2007)

313 ఎపిసోడ్లు

· నాన్న (2003–2004)

89 ఎపిసోడ్లు

· రాధా మధు (2006–2008)

450 ఎపిసోడ్లు

· అమ్మమ్మ.కామ్ (2006–2007)

200 ఎపిసోడ్లు

· లయ (2008–2010)

321 ఎపిసోడ్లు

· అడగక ఇచ్చిన మనసు (2011)

60 ఎపిసోడ్లకు ఆగిపోయింది

· ఎదురీత (2011)

· సశేషం

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -2-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3
‘’కొప్పరపు కొప్పరమ్మిది’’అనే కొప్పరపుకవుల వ్యాసంలో ‘’వేగంగా చందోసహితపద్యాన్ని చెప్పేవాడు పద్యకర్తవుతాడు కానీ తనకు కావలసిన భావానికి అనువుగా పదాలనుఎంచుకొని పద్యం చెప్పేవాడు కవి అవుతాడు ‘’అన్న శ్రీ శ్రీని కోట్ చేసి ,సోదరకవులన్న ప్రఖ్యాతి పొందినవారు కొప్పరపు కవులే అనీ ,22ఏళ్ళపాటు అవధాన దిగ్విజయ యాత్ర చేసి ,ప్రసిద్ధ నగరాలలో ,పల్లెల్లో రాజాస్థానాలలో అవధాన సరస్వతిని ఊరేగించిన మహానుభావులని ,అన్నగారు వెంకట సుబ్బారాయ శర్మ ఎనిమిదవ ఏటనే ‘’హనుమత్ కవచ రూప నక్షత్ర మాల ‘’గా27పద్యాలు చెప్పి పండితలోకాన్ని ఆశ్చర్యపరిచారని ,నరసరావు పేట లో తండ్రితో పంచదారకోసం దుకాణానికి వెడితే యజమాని అడిగితె పదేళ్ళ వయసులో ఆశువుగా అక్కడే ఒకశతకంచెప్పారనీ ,ఒకే రోజు రెండు శతావధానాలు నిర్వహించిన ఘనత ఈ జంటకవులదనీ మద్రాస్ లో అరగంటలో ‘’కనకాంగి చరిత్ర ‘’,కాకినాడ గంజాం వెంకటరత్నం గారింట్లో సీతాకల్యాణం ,పిఠాపురం రాజావారి కళాశాలలో భీష్మజ్ఞానం ,మార్టూరులో అరగంటలో 360పద్యలాతో మనుచరిత్ర ,చిలకమర్తి వారి సమక్షంలో 400పద్యాలతో శాకు౦తల కథ చెప్పి రికార్డులు సృష్టించారని చెబితే నాకు ఒకప్పుడు క్రికెట్ వీరుడు సచిన్ ,ఈనాటి విరాట్ కోహ్లీ రికార్డ్లు గుర్తుకొస్తున్నాయి .ఈ జంట ఆశుకవిత్వం ఎలాఉంటుందో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు ‘’మీ ఆశువున మేరుమీరి శబ్దశ్లేశ ,లర్ద చిత్రంబులు నతిశయిల్లు –దుష్కర ప్రాసముల్ దొడరించి ధారగా –బ్రవహించు మీ యాశుకవిత –గడియకు మూడువందలుగా గవిత్వ –మమలమతి గూర్చు శక్తి నే నరసినాడ –నది ప్రబంధంము రీతిగా నమరె భళిరే –సుగుణ నిధులార ,కొప్పర సుకవులార’’అని నిండుమనసుతో మెచ్చారని ,అసాధారణంగా పృచ్చకులమధ్య కలయ తిరుగుతూ ,వారిపేరు ,కేటాయించిన సంఖ్య,అడిగిన అంశం ,అన్నీ చెబుతూ పద్య ధారణ చేయటం అపూర్వమనీ ,క్రమం పాటిచనినిపద్ధతిలో పద్యాలు అప్పజెప్పి ,తర్వాత వరుసక్రమంలో అన్నిపద్యాలను ధారణ చేయటం అనన్యసామాన్య విషయం అది వారికే చెల్లిందనీ ,,అవధాన వేదికలపై పద్యాలలోనే మాట్లాడటం తప్ప ,వచనంలో మాట్లాడని నియమం పాటించారనీ ,అది చూస్తె సినిమాలు చూసేవారికి దేవతలు ఋషులు ఇలాగే మాట్లాడేవారేమో అన్న భావన కలుగుతుందనీ ,సమస్యాపూరణ, దత్తపది, ,వర్ణన నిర్వహణలో వీరి ధోరణి అనితరసాధ్యమనీ ,ప్రతిపద్యం రసోచితమేననీ పొంగిపోతూ చెప్పారు ఓలేటి .సంస్కృతమైనా తెలుగైనా పద్యం నల్లేరుమీద బండి లాసాగిపోయేదని ,1916కే వారి కవిత్వ ప్రదర్శన 150దాటిందనీ ఆపద్య సౌరభం కప్పుర పరిమళ భరితమనీ అన్నారు పార్వతీశం .
ఆలపాటి రవీంద్ర నాథ్ ‘’వేసినవి ‘’పాదముద్రలేకాదు పద ముద్రలు ‘’అంటూ జ్యోతి, రేరాణి పత్రికలు నిర్వహించి ‘’మిసిమి ‘’ని పసిడి మెరుగులతో తీర్చి రేపటి కాలానికి స్మరణీయ ధన్యత సంపాదించుకొన్న చిరస్మరణీయుడు అన్నారు .
‘’ఆయన కవితల్లజుడు ‘’లో కందుకూరి రామభద్రరావు గారి జీవితం రుషి తుల్యజీవితం,అయన భార్య కలిసి పల్లెల్లో రాట్నాలు వదడికిస్తూ ,గాంధీ ఇజానికి మార్గదర్శి గా నిలిచారు .లేమొగ్గ వారి తోలి రచన .ఆయనకవిత్వంలో గోదారి పరవళ్ళు తొక్కుతుంది .అక్షరాన్ని ఆత్మనివేదనగా పూజించిన మహా భక్తుడు .యాభై అరవై దశకాలలో ఆకాశవాణిలో డజన్లకొద్దీ ఆయన పాటలు ప్రసారమయ్యాయి .’’ఎంత చక్కనిదొయఈ తెలుగుతోట –ఎంతపరిమళ మోయి ఈ తోట పూలు –ఈతోట ఏపులో ని౦త నవకము విరియు ‘’అని పరవసించి రాసిన గీతం ఆ నాడు ఇంటింటా మారుమోగేది .తెలుగు సరస్వతి కంఠ సీమలో గమకాలుపలికించిన రసవీణ ఆయన అని అనితరసాధ్యమైన అభినందన తెలిపారు వోలేటి .ఈ రస హృదయుని చూసి పులకించి వేదులవారు –‘’నీ కవితా తరంగిణి జయించిన కల్పనాంధ్ర వాజ్మయ –శ్రీ కబరీ భరమ్ము కయి సేసిన కావ్య కళా కలాప సా౦-దా కుశలు౦ దావౌ కవివసంత త్వదున్నత కీర్తి సధ పున్ –వాకిట వ్రేలుబో తెలుగువారిడు మంగలతోరణాలికిన్’’ .అని మురిశారన్నారు
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్కండేయ మహా పురాణం.7వ భాగం.1.11.22

మార్కండేయ మహా పురాణం.7వ భాగం.1.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2

‘’పద్యానికి అరణమిచ్చిన పాడియావు ‘’వ్యాసం ‘’పున్నయ్య ‘’అనబడే చిలకమర్తి లక్ష్మీ  నరసింహం గారి గురించి .ధారణ బాగాఉన్న ఏక సంధాగ్రాహి .వారి గణపతి నవల తెలుగువారి శ్రవ్య మాధ్యమం లో మైలు రాయి ..ఇమ్మానేని హనుమంతరావు గారి ప్రోద్బలం తో కీచకవధ నాటకం 1899లో రాశారు .మంచి ప్రజాదరణ రావటంతో నాయుడుగారి ప్రోద్బలంతోసీతాకల్యాణ0 ,ద్రౌపదీ కల్యాణ౦, గయోపాఖ్యానాది నాటకాలు రాశారు .ప్రసిద్ధమైన ఆయన పద్యం ‘’భరతఖండంబు చక్కని పాడియావు ‘’’వేదికాముఖంగా పుట్టిందే .ఆయన చమత్కార సంభాషణ చణులు.చిక్కని హాస్యంతో లింగంగారు గిల్లిబాదిస్తే ,పల్చనిహాస్యంతో నరసింహంగారు గిలిగింతలు పెట్టి నవ్విస్తారు అన్న జయంతి రామయ్య మాటలు యదార్ధమన్నారు వోలేటి .’’ముదితల్ నేర్వగరాని విద్యగాలడీ ముద్దార నేర్పించినన్ ‘’అనే పద్యం అందరం ఉదాహరిస్తాం .కానీ పూర్తీ పద్యం ఏమిటో ఎవరు రాశారో ఎవరికీ తెలీదు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు మా మధ్య ఈ విషయం వస్తే ,’’ప్ర్రసాద్ గారూ దీన్ని మీరే సాధించాలి అని తెలుగు పండితులు నామీదనే భారం వేస్తె ఆంధ్రదేశంలో ప్రసిద్ధకవిపండిత విమర్శకులకు కార్డులు రాస్తే ఎవరూ స్పందించకపోతే చివరికి శ్రీమాన్ కోవెల సంపత్కుమారాచార్య నాకుకార్డ్ పై సమాధానం రాస్తూ అది చిలకమర్తివారి ప్రసన్న యాదవం నాటకం లోనిదని పద్యం పూర్తిగా రాసిపంపారు-‘’చదువంన్నేర్తురు పూరుషుల్ బలెనే శాస్త్రంబుల్ పతిఠింబించు చోన్ –నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్ వ్యాపారముల్ నేర్పుచో –నుదితోత్సాహముతోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్టించుచో –ముదితల్ నేర్వగ రాని విద్యగాలదేముద్దార నేర్పించినన్’’.

 ఆతర్వాత ఆయనకూ నాకు మంచి స్నేహంకుదిరి తరచూ మాట్లాడుకోనేవారం .ఆయన పెదముత్తేవి పీఠాది పతి శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారిపై  రాసిన పద్యాలపై చే.రా .చక్కని సమీక్ష చేస్తే ,ఆపుస్తకం పంపమంటే నాకు పంపిన సహృదయులు కోవేలవారు నిజానికి స్నేహానికి వారు కోవెల .

  ‘’విస్మృతిబాటలో  ఒక స్మృతి పధం ‘’ఆచంట జానకిరాం పైన .ఆస్కార్ వైల్డ్ కవితను రాం ‘’నేను నిదురించు శయ్యాగ్రుహ పుటాకాశ –గవాక్ష మందుండి యొక్క తారకామణి’’కవితగా తెనిగించాడని ,’’అపురూపమైన ఒక్క నక్షత్రానికి ఉన్న విలువ అవలీలగా కనబడే నక్షత్రాలకు ఉండదు ‘’అన్న అద్భుత వాక్యం రాసినవాడు జానకిరాం అనీ ,రచనలలో మానవ సంబంధాలు ప్రతిబింబించేట్లు  చేయటం ఆయన ప్రత్యేకత అనీ ,తాను  ‘’ఆచంట లక్ష్మీ పతిగారబ్బాయిని ‘’అని చెప్పుకొని గర్వపడతారనీ ,,జీవితాంతం దాన్ని కొనసాగించారనీ ,నూలువడికి గాంధీ ముందు  పెడితే ఆయన ‘’నువ్వు  వడి కిందేనా ?అన్న ఆకంఠ స్వరాన్ని ఆజన్మాంతం మరచిపోలేదని ,వారం రోజులు సాధన చేసి మూడు నిమిషాలు మహాత్మని సమక్షంలో మాట్లాడి ‘’చంద్రునికో నూలుపోగులా విద్యార్ధుల తరఫున ఈచిన్న కానుక సమర్పిస్తున్నాను ‘’అని ఖద్దరు సంచీలోని నూటపదార్లు గాంధీ చేతిలో ఉంచగా ‘’ఆర్ యూ సాటిస్ఫైడ్ ?’’అని అయన అంటే పాతాళంలోకి కుంగిపోయిన ఆయన తలవంచుకొన్నాడట జానకిరాం .నా స్మృతితిపధం ను ముగిస్తూ ‘’ఎన్ని మెలికలు తిరిగినా నది చివరికి సంద్రం చేరకుండా ఉంటుందా ??’’అనేవాక్యం తనకు గొప్పనమ్మకం ధైర్యం ఇచ్చాయని ముగిస్తాడు అని చెప్పారు .ఆపుస్తకం ‘’ఏది చదివితే ఏమీ చదవకపోయినా ,అన్నీ చదివినట్లో-ఏది చదవకపోతే ,అన్నీ  చదివికనా ఏమి చదవనట్లో ‘’అనే ఆర్యోక్తి ఉపనిషత్ వాక్యం కు అర్ధం అద్దం జానకిరాం పుస్తకం అనటం అత్యద్భుతం అనిపిస్తుంది .నిజంగా ఆపుస్తకం చదువుతుంటే ఆయనతో వెన్నెల విహారం చేస్తున్నట్లే ఉంటుంది .మనుషుల౦దరిలో మంచి తనం చూసిన మహనీయుడు .

  పిఠాపురం ప్రవక్త ,కవి ఉమర్ ఆలీషా గురించి రాసిన ‘’శతవసంత సుందరి-మణిమాల ‘’లో ఓలేటి ‘’బాల్యదశ వదిలి యవ్వన ప్రారంభం లోఒక పద్య బహుళ నాటకానికి ఊపిరిపోయటం దానికి శతవసంతాలు ఆయుర్దాయం  కలగటం ఒక అసాధారణ విషయమన్నారు .

‘’భావ చిత్ర చయనిక ఏకాంత సేవ ‘’లో వేంకటపార్వతీశకవుల  ప్రతిభా విశేషాలు ఉగ్గడించారు .కృష్ణశాస్త్రిగారన్నట్లు ‘’వంగ భాష కు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో మనయా౦ధ్రమున మహాకవుల –భక్తులఏకాంత సేవ అట్టిది ‘’ఇంతకంటే ఎక్కువగా చెప్పక్కర్లేదు దాని వైశిష్ట్యం గూర్చి .

 మంగళం పల్లి పై రాసిన ‘’ఆబాలగోపాలం ‘’లో దైవదత్తమైన అపూర్వ సంగీత విద్యా గరిమ చేత ,అపురూపమైన సాధనా బలం  చేత సంగీత కళాకారునిగా తన అస్తిత్వం చాటుకొన్న బాలమురళి ,తంత్రీ ,తాళ వాద్యాలను వశం చేసుకాగా అవి ఆయనకర స్పర్శకు పరవశం చెందాయి .తానె వయోలిన్ వాయించుకొంటూ గానం చేసి ,మళ్ళీ ఆకీర్తనపాడుతూ మృదంగం వాయిస్తూ రెండు ట్రాక్ లు ఏకం చేసి తనపాట తాను  పాడుకొంటూ ,సహకార వాయిద్యాలుగా వయోలిన్ ,మృదంగం  తానె పలికి౦చు కొంటూ ఒక అరుదైన రికార్డ్ సృష్టించినవారు బాలమురళి .కృతుల గ్రంథాలేకాదు రాగ గంధాలూ సృష్టించారు .ఆయన సృజన రాగం లతాంగి విశిష్టమైనది .తిల్లానా గానం, రచనలతో అనితరసాధ్య వైదుష్యం చూపారు ,ఈల పాటను ‘’గళమురళి’’గా నామకరణం చేసి ,’’విజిల్ విజార్డ్ ‘’కొమరవోలు శివప్రసాద్ గారితో జుగల్ బందీ నిర్వహించటం ప్రతిభకు పట్టం కట్టటం .ఆబాలగోపాలమూ ఆరాధించే స్వరసమ్మోహన మూర్తి మంగళం పల్లి ‘’అని గొప్పగా విశ్లేషించారు పార్వతీశంగారు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం . 22వ భాగం.1.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం . 22వ భాగం.1.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -343\

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -343\

· 343-గోపాలరావు గారమ్మాయి సినీ నిర్మాత ,దక్షినాది ఫిలిం చేంబర్ కమిటి మెంబర్ –కె.సి.శేఖర్ బాబు

· కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత.

జీవిత విశేషాలు
ఆయన 1946 మే 1 న ఆయన జన్మించారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, ముఠామేస్త్రీ, సర్ధార్,సాహస సామ్రాట్, భార్గవ రాముడు, ఎంత బావుందో! చిత్రాలను నిర్మించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగాగా ఆయ‌న ప‌నిచేశారు. ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందించారు.[1]

అస్తమయం
ఆయన జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఫిబ్రవరి 24 2017 న మరణించారు.

· 344-భారత్ బంద్ సినీ నటుడు రక్త తిలకం నిర్మాత –కొల్లా అశోక్ కుమార్

· అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత, నటుడు.[2] తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.[3] కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ నుంచి అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయనకు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం కూడా ఉంది.

సినిమాలు
నటుడిగా[మార్చు]
సంవత్సరం

సినిమా

పాత్ర

1991

భారత్ బంద్

ప్రతినాయకుడు

1997

ఒసేయ్ రాములమ్మా

ప్రతినాయకుడు

1997

ప్రేమించుకుందాం రా

రెడ్డెప్ప

1998

అంతఃపురం

1998

ఆవారాగాడు

2000

జయం మనదేరా

2002

ఈశ్వర్

హీరోయిన్ తండ్రి

2002

టక్కరి దొంగ

వీరు దాదా

నిర్మాతగా[మార్చు]
సంవత్సరం

సినిమా

1988

రక్త తిలకం

1989

ధృవ నక్షత్రం

1990

చెవిలో పువ్వు

1998

ప్రేమంటే ఇదేరా

2002

ఈశ్వర్

345-నటుడు దర్శక నిర్మాతఉప్పు సత్యాగ్రహి ,శాసన సభాపతి ,మంత్రి పాండిచ్చేరి,మహారాష్ట్ర గవర్నర్ –కోన ప్రభాకరరావు
కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాపతి, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మా
, విద్యాభ్యాసం
ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసు లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణే లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.

పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. ఉప్పు సత్యాగ్రహము లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.

రాజకీయ జీవితం
ప్రభాకరరావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972, 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతిగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక, ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.

గవర్నరుగా]
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న సిక్కిం గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రియల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చెలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడడంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[1]

క్రీడలు, సినిమాలు
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల, ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవాడు., బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమా లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి, సౌదామిని.[2]

శాసనసభ్యునిగా
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.

మరణం[మార్చు]
ఈయన అక్టోబరు 20, 1990 న హైదరాబాదులో మరణించాడు.

సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-1

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-1

 ప్రసార కళా ప్రవీణ శ్రీ ఓలేటి పార్వతీశం గారు మొన్న ఉయ్యూరుకు మా ఆహ్వాన౦పై, సరసభారతి జీవన సాఫల్య పురస్కారం అందుకొన్న శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మగారి తో కలిసి  వచ్చినపుడు కార్తీకసాయం సమయాన మా శ్రీ సువర్చలానజేనేయస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం తాము రచించిన ‘’వ్యాసార్ధం ‘’అనే మహత్తర పుస్తకాన్ని అందించారు .ఇవాళేకొన్ని వ్యాసాలు  చదివి అందులోని విషయాలు సాహితీ బంధువులతో పంచుకొంటున్నాను కానీ ,ఆధునిక శుకులు, వైశంపాయననులు సౌతి ,అభినవ మల్లినాథ సూరి,  అయిన వారి పుస్తకం సమీక్ష చేసే తాహతు ఉందనుకోను .,

వారిగురించి ఆచార్య  జి.వి .సుబ్రహ్మణ్యం గారికంటే గొప్పగా చెప్పగలవారు ఉంటారని నేను అనుకోను  .జి.వి .గారి మాటలు యధాతధంగా –‘’శ్రీ ఓలేటి పార్వతీశం గారితో మాట్లాడుతున్నప్పుడు నేను కార్తీక దీప ఘటం ప్రక్కన కూర్చున్న ఏదో అవ్యక్తమైన అనుభవాన్ని అంతరంగం లో అనుభవిస్తాను .వారిలోని ఏదో వెలుగు జిలుగు వన్నేలతోచుట్టూ పూలజల్లులా కురుస్తూ ఉంటుంది .మాట్లాడేవారికిఒక చెప్పలేని హాయిని కలిగిస్తుంది.అది వారి తాతగారి (ఓలేటి పార్వతీశం గారు )దివ్యభారతి ప్రకాశం కావచ్చు .తండ్రి శశాంక గారి స్నేహ కాంతి ప్రసారం కావచ్చు ,లేదా రెండూ కలిసి సాత్విక మధురంగా  వెలుగొందుతున్న నవ్యకాంతి దీపకళికా సందీప్తికావచ్చు .కాల్పనిక చైతన్యం తో భక్తిభావ సుధాధారలను తాతగారు రాగమదురంగా ఆవిష్కరించేవారు .నాన్నగారు భావనా లలితమైన సుందర గీతికలను కమనీయంగా అభి వ్యక్తేకరించేవారు .తాతగారి భావతరంగం ,నాన్నగారి శబ్ద విహంగం రెండూకలిసి ఒక నవీన సృష్టిగా రూపొందిన సాహితీ చైతన్యం శ్రీ పార్వతీశం .ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా ,ఒక సంప్రదాయంతో ముచ్చట్లాడుతున్నఅనుభవాన్ని అందించే సహృదయులు శ్రీ వోలేటి పార్వతీశం’’.కనుక దటీజ్ పార్వతీశం .

  అసలు వ్యాసార్ధం అంటే ఏమిటి ? జామెట్రిలో వృత్త కేంద్రాన్ని పరిధిపై ఏదో ఒక బిందువుతో కలిపేరేఖ  అని అర్ధం.అది వృత్తానికి ప్రాణం .మరో అర్ధం కిరణం .కనుక ఇక్కడ ఈ పుస్తక శీర్షిక ను బట్టి అందులోని వ్యాసాలపై ప్రసరి౦ప బడిన కాంతి పుంజం అంటే, అందులోని జీవధాతువును వెతికిచూపించేది అని భావం అని నేననుకొన్నాను .మరో అర్ధం చక్రం ఇరుసులో ఉండే కీల .అది లేకపోతె బండి ముందుకు సాగదు .ఇందులోని వ్యాసాలలో కీలక భావాలున్నాయనే సంగతి తెలపటం కూడా .ఇందులో ఆలోచనాత్మకమైన ఇరవై వ్యాసాలున్నాయి .పుస్తకాన్ని తండ్రి శశాంకగారికి అంకితమిచ్చారు .దీనికి తగ్గట్టే చంద్ర రేఖ అంటే శశాంక ముఖ చిత్రంగా ఉంది .హాయిగా దానిని ఆసరాగా చేసుకొని ఊగుతున్న దేవ కన్యలాంటి చిన్నారి .

  తండ్రి ని గురించి రాసిన శశాంక యశశ్చంద్రిక ‘’లో శుక్లపక్షం అదృష్టం ,కృష్ణపక్షం దురదృష్ట౦ .ఈ రెండూ కాలగతిలో పక్కపక్కనే పీఠం వేసి కూచున్న నేపధ్యం చంద్రవంకది.సాహిత్యం అలాంటి వారే  నాలుగు దశాబ్దాలముండు మరుగైన సుప్రసిద్ధకవి శశాంక .’’ఎన్నినాళ్ళున్ననేమి ?క్షణము క్షణమొక సాహితీ ప్రణయ నేమి ‘’అని ఆయనే రాసుకొన్నాడు .కవీ అని సోమసుందర్ చేత  పిలువబడినవాడు .అసలు సుబ్బారావు పేరును శశా౦కగా మార్చి౦దిఆయనె .కవిత్వంలో కమ్యూనిజమే ప్రవహించింది ‘’ఇజం నుంచి నిజం అనే ప్రిజం లోకి ప్రస్థానించటం ఆయన జీవితంలో అతి పెద్దమలుపు ..కొత్త ప్రపంచం –నయా జమానా కు ప్రేరణ పీడిత జన సంవేదన .అభ్యుదయ కవిత్వానికి మైలురాళ్ళు గురజాడ ,శ్రీ శ్రీ నారాయణబాబు పఠాభి.ఆదారుల్లో చైతన్యపు కాగడాలతో నడిచిన వారు సోమసుందర్ ,ఆరుద్ర ,దాశరదధి,కాళోజి కుందుర్తి .ఆ వెలుగు వేడి పిండుకొని తమగొంతుల్లో పలికి౦చినవారు గంగినేని, అనిసెట్టి ,గజ్జెల ,రమణారెడ్డి .ఆవరుసలో నే ఉన్నాడు శశాంక అన్నాడు డా ఎండ్లూరి సుధాకర్ ..

 కవితలో ఒక అంతరలయ నిక్షేపి౦చటం శశాంక ప్రత్యేకత –‘’ధనస్వామ్య ఆకాశ జలదమూ –జనులకివ్వ దేనాడూ వర్షము ‘’అన్నాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానంతో  ఆంధ్రరాష్ట్రం రావటం చారిత్రకఘటనే కాని దాన్ని అభి వృద్ధిమార్గం లో నడిపించటం మనకర్తవ్యం అని –‘’తెలుగు తల్లి రక్తము తల్లి నొసట కు౦కుముగా –తెలుగుత్యాగము తల్లి మెడలోని నగలుగా –తెలుగుబిడ్డలనవ్వు సిగలోని పువ్వుగా –తెలుగులో విజిగీష జిల్గు దళుకొత్తగా –లేవోయి ,లే యింక తెలుగుబిడ్డా –నిలుపుకో మెలకువగా నీ తెలుగు గడ్డ ‘’అని ప్రబోధ గీతం పాడారు     ‘’ఏమో –నువ్వు చనిపోయావేమో –లేకపోతె ఏమిటి ఈ చీకటి ?దుఖాశ్రుమాల –ఏమిటీ వట వృక్షం –శాఖా౦త రాలలో నిట్టూర్పులగాడ్పులు –ఆ౦క్ష మనో ఫలకం మీద –జగచ్చిత్ర శిల్పీ చిత్రిస్తున్నావా ?మానవ జాతి చరిత్రం –ఉదయాద్రిని మళ్ళీ కుంచె పుచ్చుకొన్నావా మళ్ళీ ‘’అంటూ శశాంక భావనామయప్రపంచాన్ని బాపిబావ యెంత అందంగా దర్శించాడో అని పార్వతీశం సంబర పడ్డారు

  నవమానవ స్మిత సౌందర్యం –కవి శశాంక జీవనగానం –ఇదిరా నయాజమానా –హృదిలో నయా తరానా ‘’అని నినదించిన మానవతావాది శశాంక .కృష్ణశాస్త్రి వరవడిలో దేశభక్తి గీతాలురాసి పవిత్రతకు అద్దంపట్టాడు ‘’రావమ్మ స్వాతంత్ర్య భారత సావిత్రీ –రమ్మహో శాంత సంగీత శుభగాత్రి ‘’అనే గీతం ఆకాశ వాణి  లో గణుతికెక్కిన గీతం .రజతోత్సవ సమయంలో –భారత స్వాతంత్ర్య రజతోత్సవం –వీరపూజకై ప్రజలెత్తు నీరాజనం ‘’వసంతానికి ఆయన అందజేసిన వినతిపత్రం అంతర్లయతో కుసుమ పెశలంగా ఉంటుంది-‘’చిలుకల వజీరూలు ,గొరవంక సరదార్లు –చివురాకు బాకులతో తీర్చిరి  బరాబరులు ‘’బంగ్లా దేశ ఆవిర్భావానికి ‘’తూర్పు దెస చీకటుల చీల్చుక -.వెలసింది బంగాళాదేశం .ప్రతిరాత్రి 7-05వార్తాప్రసారాలముందు,7గం లకు చిన్నపిల్లలకోసం శశా౦కరాస్తే శారదా శ్రీనివాసన్ లాంటి సుగాత్రి చదివి వినిపించేవారని అందులో పెద్దమామయ్య- ,పనసపండు బదరీ మామయ్యా –అమలాపురం ,రాజుమామయ్య –వినాయక చవితి కథలు ధారావాహికంగా చిన్నపిల్లల మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనాలు లుగా ఉండేవని ఓలేటి గుర్తు చేసుకున్నారు ,గుర్తు చేశారుమనకు ,

  రెండో వ్యాసం చూదడికొడుత్తు నాచియార్, ఆండాళ్ అయిన గోదా దేవి దివ్య చరితాన్ని కృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద లో వర్ణించిన తీరు సౌరు ‘’ఆమె చిత్తరువు లకొలువు ‘’.విష్ణుచిత్తునికి ఆమె తులసివనంలో లభించిన రాయలపద్యం –వింగడమై యొక్క వనవీదిగను౦గొనెనే నీడ సున్నపున్ –రంగు తరంగు పచ్చల యరంగాయిపో  వెలిదమ్మి బావికిం-జెంగట నుల్లసిల్ల తులసీ వనసీమ శుభాంగి నొక్క బా-ల౦  గురువింద కందళ దళ ప్రతిమా౦ఘ్రి కరోదరా ధరన్’’అంటూ ఆమె దేవతాస్వరూపాన్ని దేవతానుకూల వతావరణ౦ లోనే చిత్రించాడని  ,రాబోయే కథకు తులసీ మాల కంకర్యానికి ఇది సంబంధాన్ని సూచిస్తు౦ది అన్నారు  వోలేటి .చెలులు ఆమెను అలంకరించిన వైనాన్నీ స్తవనీయ పద్యంగా చెప్పాడని ,పూర్వ జన్మలో భూదేవి అయిన ఆమెకు చెలులుగా ఉన్న నాగకన్యలు ఈ జన్మలో కూడా ఎడబాయక ,ఇరుగుపొరుగు వైష్ణవ కుటుంబాలలో మరాళిక, ఏకావళి ,హరిణి మొదలైన పేర్లతో ఆడ పిల్లలుగా పుట్టారట .గోదాదేవి రంగనాథుని శిరస్సున తల౦బ్రాలు పోస్తుంటే చివుళ్ళ  వంటి ఆమె చేతి ముని వ్రేళ్ళు స్వామి శరీరానికి తాకి ఆయన మేను  చమర్చగా అవి తలపైనుండి ముత్యాలబొట్లుగా ,వాన కురిసినప్పుడు చినుకులు ,వడగళ్ళు కలిసి కురిసినట్లు మనోజ్ఞంగా ఒక చిత్రం గీశాడు రాయలు అన్నారు .

గోదారి తూర్పు దారిలో –నవకవితా ఝరి ‘’అనే మూడవ వ్యాసంలో వీరేశలింగం గారినారద  సరస్వతీ సంవాదం ‘’లో వర్తమానకవులు చౌకబారు అలంకరణచేస్తున్నారని రాసిన ‘’దయమాలి తుదముట్ట తలకట్ల నిగిడించి –ధీరుడై నన్ను బాధించునొకడు ‘’అన్నపద్యం సారస్వత లోకాన్ని కొత్తదారికి మళ్ళించిందనీ ,రామలింగారెడ్డిగారి ‘’ముసలమ్మ మరణం ‘’వేదం వారి ఆశీసులు అందుకొన్నదనీ ,,ఇతివృత్తం బ్రౌన్ ప్రచురించిన అనంతపుర చరిత్రలోది కావటం వలన కాల్పనిక కవిత్వంలో ప్రచలితంగా వినబడ లేదనీ ,విషాదా౦తమే అయినా శ్రీకారంతో మొదలుపెట్టి భరత వాక్యంతో ముగించటం తో ఇబ్బందికలిగిందనీ ,కవిత్వానికి కావలసింది మానసిక ఆలోచనే అయినా ,దాన్ని మించి భావనా  శక్తి ఉండాలని కాల్పనిక కవులు కోరారానీ ,అది opens to an eternal world ‘’కాల్పనిక కవిత్వం అంటే ఏమీ లేదు మన భావకవిత్వమే ‘’అని కృష్ణశాస్త్రిగారు భరోసా ఇచ్చారని ,పిఠాపురం రాజా వెంకట మహీపతి గంగాధర రామారావు గారు ‘’సువిశాలమిదం విశ్వం ‘’,తరంగములు ,చినుకులు –చిందులు అనే గ్రంథాలు రాసి ,రాధామాధవం ఖండికలో మాధవుని పొందులేక వగపుతో ఉన్న  రాధ ,ఆమె లేకపోవటంతో చింతలో ఉన్న మాధవుడు గా ఉన్నసన్నివేశంలో విరహాగ్ని కణాలు వెదజల్లి గొప్ప చిత్రం గీసినట్లు ‘’పదముల్ తొట్రిలవచ్చి ‘’పద్యం రాశాడనీ ,వెంకట పార్వతీశ జంటకవులు  శతాధిక గ్రంథాలు రాశారని, గాలిపటం కవితలో ‘’పిల్లవానికి నైన నీవు ,విధికి నేను—సూత్రమున నీవు,నే గర్మ సూత్రమునకు –ననిలమునకీవు ,నే విషయానిలమున –కొదిగి ,లోగి భ్రమించు చుంటిమహహా ‘’లో అపరమాత్మతో జీవాత్మ సంబంధాన్ని సూత్రబంధం చేయటం అపూర్వమనీ ,గౌతమీకోకిల వేడదులవారు భావకవితా ప్రపంచంలో ద్వితీయులనీ ,ఆయన మాతల్లికావ్యం లో అనల్ప కల్పనా చతురత ఉందనీ ,ప్రకృతి పారవశ్యానికి కృష్ణ శాస్త్రి కేరాఫ్ అడ్రస్ అనీ ‘’ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల –బడిపోవు విరికన్నె వలపు వోలె ‘’పద్యం ఆయన కవితా శక్తికిదివిటీ అని ,ఆంధ్రా వర్డ్స్ వర్త్ కవికొండల వెంకటరావుగారు ఆంధ్ర,ఆంగ్లాలలో  సమాన కవన వైదుష్యం చూపారనీ ,మరోభావకవి పిలకావారి రత్నోపహారం ,విభ్రాంతామరుకం భావనాపతటిమకు సంకేతాలనీ ,’’తలపు అర్చనకు అగరుపొగ మాలకావటం ‘’అపురూప కల్పనా చాతుర్యానికి నిండు దర్పణం అనీ ,కందుకూరి రామభద్రరావు బతుకు దారులగతుకుల్లో గడియకొక తీరుగా సాగే జీవన పయనం లో ఊహించిన వైవిధ్యం అపూర్వమనీ ,గోదావరిని పుణ్యోపేతగా మాతగా, సంభావించి చింతా దీక్షితులుగారు రాసిన –ప్రణయ వర్షం బామే వర్షి౦చు నమ్మ –మన కిలవేల్పామె ,మన పట్టుగొమ్మ –మనకలప భూజంబు మన వేల్పుతావు –మము గాంచి మము బెంచి మన్ని౦చు మాత  ‘’అన్న పద్యంలో భావాలు కమనీయ కల్పనా లతికలు అన్నారు పార్వతీశంగారు .భావకవిత్వానికి అ౦కురారోపణ చేసింది రాయప్రోలు  అయినా ,నవ్యకవిత్వ ధోరణికిబీజం వేసినవాడు మాత్రం కందుకూరి .ఆకవిత్వవనానికి పరివ్యాప్తం చేసి విరాణ్మూర్తి ని చేసింది కృష్ణశాస్త్రి .సజీవమైన గోదావరినది ఈ తీరానికి ఆకుపచ్చని చేలను అరణం ఇచ్చినట్లు ,తెలుగు సాహితీ గౌతమి తూర్పు తీరం కల్పనా భావన అన్న ద్వైతానికి నవ్య కవనమనే అద్వైతాన్ని బహుమానంగా ఇచ్చింది .ఫలితంగా గోదావరి తూర్పు దారిలో నవ కవితా ఝరి అమృత తుల్యప్రవాహమై రసానంద మందాకినీ సోయగాలతో సాగిపోయింది అన్నారు వోలేటి .ప్రత్యక్షర మాధుర్యంగాఅక్షర లక్షలు చేసే విలువైన వ్యాసంగా  సాగిన రచన ఈ వ్యాసం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-31-10-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్కండేయ మహా పురాణం.6వ భాగం.31.10.22

మార్కండేయ మహా పురాణం.6వ భాగం.31.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .21వ భాగం.31.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .21వ భాగం.31.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -341

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -341

· 341-క్షణక్షణం ,హలో బ్రదర్ సినీ నిర్మాణ ఫేం,ఒకే చిత్రానికి అయిదు నందులుపొందున –కె.ఎల్.నారాయణ

· కె.ఎల్.నారాయణ తెలుగు చలనచిత్ర నిర్మాత.

సినిమా రంగం
1987లో ప్రముఖ కెమెరామెన్ ఎస్. గోపాల రెడ్డితో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరూ 1990లో దుర్గా ఆర్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన దుర్గా ఆర్ట్స్ ద్వారా తొలిసారిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణక్షణం అనే సినిమాను నిర్మించాడు. ఆ చిత్రం సంచలనం సృష్టించడంతో బాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో హలో బ్రదర్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో దొంగాట సినిమాలను తీశాడు. అక్కినేని నాగార్జున హీరోగా సంతోషం అనే సినిమాను నిర్మిస్తూ దశరథ్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు[1].

సినిమాల జాబితా
· క్షణక్షణం (1990)

· హలో బ్రదర్ (1994)

· ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)

· దొంగాట (1997)

· సంతోషం (2002)

· నిన్నే ఇష్టపడ్డాను (2003)

· 342-మహాకవికాలిదాసు నిర్మాత ,శ్రీరంజని భర్త –కె.నాగమణి

· కె.నాగమణి తెలుగు చలనచిత్ర నిర్మాతలలో ఒకరు. ఈయన ప్రముఖ నటీమణులు శ్రీరంజని సీనియర్, శ్రీరంజని జూనియర్‌ల భర్త. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు ఎం.మల్లికార్జునరావు ఈయన, శ్రీరంజని సీనియర్ల ముగ్గురు కుమారులలో పెద్దవాడు.

· వైవాహిక జీవితం
· నాగమణి గారు బెజవాడ హనుమాన్‌దాసు గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని కూడా హనుమాన్‌ దాసు గారి దగ్గరే సంగీతం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందారు, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.

· సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మార్కండేయ మహా పురాణం.5వ భాగం.30.10.22

మార్కండేయ మహా పురాణం.5వ భాగం.30.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం )

ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం )

అజ్మీర్ వీర

ఒక ఏడు సుఖరాం అజ్మీర్ వార్షికోత్సవ సభలో పాల్గొన్నాడు .నగర సంకీర్తనలో పాల్గొన్నాడు దారిలో ముస్లిం లతో వాదోపవాదం జరిగింది ‘ఖ్వాజా శిస్తీ దగ్గరలో ఉంది .ఆర్యసమాజికులు భయపడి పారిపోయారు .శాంతంగా ఉండే ఈయన దర్గా ద్వారం దగ్గరకు వెళ్లి ,ద్వారానికి 30అడుగులదూరంలో ఒక చిన్న వంతెనపై నిలబడి ‘’కబ్రపరస్తీ ,’’మర్దుం పరస్తీ ‘’లను ఖండించటం మొదలుపెట్టాడు .ఎవ్వరూ ఆయన జోలిక రాలేదు .పారిపోయిన అర్యసమాజికులు తమాషా చూట్టానికి వచ్ఛి పండిట్ వీరత్వాన్ని మెచ్చి పారిపోయినందుకు సిగ్గుపడ్డారు .

  స్వల్పాదాయంతో సంతృప్తి

  ప్రతినిధి సభనుంచి నెలకు కేవలం 25రూపాయలు తన కనీస ఖర్చుకు సరిపడా జీతం తీసుకొనేవాడు లేఖరాం .పెళ్ళయ్యాకక 30 తీసుకొన్నాడు .స్వామి శ్రద్ధానంద దాన్ని 35 చేయించాడు .ధనంనం ,కీర్తి లకు ఆశపడ లేదు .

  పోలీసులకు జవాబు

18-7-1896న పండిట్జీ  అయిదుగురు మౌల్వీలతో వాదించటానికి పసరూర్ వెళ్ళాడు .మొదట్లో వాళ్ళు తప్పించుకోవాలని చూశారు .అందులో ఒక్కమౌలిమాత్రమే ఏదో చెబితే మిగిలిన నలుగురు తలలూపారు .శ్రాస్త్రార్ధం జరగటం లేదుకనుక వ్యాఖ్యానం చేద్దామని అనుకోన్నసమయం లో మునిసిపల్ కమీషనర్ మధురాదాస్ తనప్రక్కనున్న ప్రచారకుల చెవిలో ఏదో గుసగుస లాడటం చూసి ఏమిటి విషయం అని అడిగితె వ్యాఖ్యానాల వలన గొడవలు జరిగితే తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీస్ అధికారి వార్త పంపాడని చెప్పారు .’’మేము యుద్ధం చేయటానికి రాలేదు ధర్మ ప్రచారానికి కే వచ్చాం.బాగుంటే వింటారు .మాకు పోలీస్ రక్షణ అవసరం లేదు ‘’అన్నాడు .వీరత్వ నిర్భయత్వాలు లేఖరాం సొమ్ములు .

   మీర్జా గులాం అహ్మద్ కాదియాని శిష్యుడితో వాదం

సిమ్లా ఉత్సవ సభలో   మీర్జా గులాం అహ్మద్ కాదియాని శిష్యుడు క్వాజా కమాలుద్దీన్ ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నాడు .రోజూ వెళ్లి అతని వ్యాఖ్యానాలు వినేవాడు .అతడు హిందువుల ఆర్యులగురించి ఏయే వ్యాఖ్యలు చేసేవాడో వాటిని తన ఉపన్యాసాలలో ఖండించేవాడు పండిట్జీ  .’’హుఅతుల్ ఇస్లాం ‘’అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ క్వాజా ‘’మహమ్మద్ కత్తికి భయాడడు .ఇస్లాం కు వ్యతిరేకంగా రాయటం మాట్లాడటం మానుకో ‘’అనగా దీటైన సమాధానాలతో గట్టి దెబ్బ తీశాడు .ఒకసారి పండిట్ ముస్లిం లకు చెందిన పైగంబరులు శవాన్ని పూడ్ఛి పెట్టటం  సమర్ధించి పాపాలు వ్యాపింప జేశారు అన్నాడు .ఇంతలో ఆగు౦పు లో నుంచి ఒకమహమదీయ యువకుడు ‘’మహమ్మద్ కత్తిని మర్చిపోకు ‘’అని అరిస్తే ,’’పరికి వాడు తల్వార్ మాట ఎత్తి నను భయపెట్టాలని చూస్తున్నాడు .అధర్మం లో నడిచే పిరికి వాళ్ళ కు భయపడను .అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని తిరుగుతాను ‘’అని జవాబిచ్చాడు .

  ధార్మిక ప్రేమకు ఉదాహరణ

లేఖరాం కొడుకు చనిపోయాడు .వజీరాబాద్ ఆర్యసమాజ వార్షికోత్సవం దగ్గర పడింది .అయినా అక్కడికి వెళ్లి ధార్మిక ప్రసంగం చేసి పైగంబరుల నిజ స్వరూపం బయటపెట్టాడు .

  జీవిత విశేషాలు

అన్నమాటకు కట్టుబడి ఉండటం ,నాలుగు గంటల రాత్రి ఇంకా ఉండగానే నిద్ర లేవటం ,,శౌచం కోసం నగరం బయటికి వెళ్ళటం ,నిత్య వ్యాయామం ,భోజన ,వస్త్ర విషయాలలో జాగ్రత్త ,మంచిభోజనం చేస్తేనే శక్తికలిగి పనిపై శ్రద్ధ కలుగుందని నమ్మటం ,లోపలి వస్త్రాలను శుభ్రంగా ఉంచుకోవటం ,నిత్యం వేదం కోరాను చదవటం,ఇంద్రియ దాసుడు కాకపోవటం,మద్య మాంసాలకు దూరంగా ఉండటం,సదాచారం ,సామాన్యజీవితం ,,సాత్వికాహారం ,,అన్నిమతాలలోని లోపాలు ఖండించటం ,సంస్కరణలనుకోరటం లేఖరాం సుగుణాలు  ,.

  సుమారు 33పుస్తకాలు రాశాడు .ఆర్యసమాజ దశ నియమాలను అరబిక్ భాషలో కి అనువదించాడు .తన 16పుస్తకాలను అరబ్బీ  భాష లో అనువదించి తనవెంట ఆరబ్ దేశాలకు తీసుకు వెళ్ళాలనుకొన్నాడు .

 ముస్లిం ల చేత ఆక్రమణ

1893లో లాహోర్ ముస్లిం లు లేఖరాం రాసిన జీహాద్ మొదలైన పుస్తకాలపై దావా వేయగా ,ఈయన తరఫున లాలా లజపతిరాయ్ వాదించి నిర్దోషి అని రుజువు చేసి కేసు కొట్టేయించాడు  .మీరట్ ఢిల్లీ బొ౦బాయ్  లలో కూడా ఇలాంటికేసులు పెట్టటం ఆయన నిర్దోషిగా రుజువవటం జరిగింది

 మతోన్మాదం వలన బలిదానం

1897ఫిబ్రవరిలో ఒకనల్లని నీరసముఖ౦ కల  ముస్లిం ఒకడు పండితః లేఖరాం ఇంటికి వచ్చాడు .తాను  హిందువునని బలవంతంగా ముస్లిం గా మార్చారని ఇప్పుడు మళ్ళీ హిందువు అవాలని ఉందని బొంకి నమ్మించాడు .ధర్మ వీర్ అయిన ఆయన వాడిని ఏమీ అడగకుండానే సరే అనగా ఆయన నీడలా వాడు సంచరించాడు .వాడు భయంకరంగా ఉన్నాడు మీ ప్రాణాలు తీయటానికి వచ్చినవాడుగా ఉన్నాడని ఆర్యసామజికులు చెప్పినా పెడ చెవిని పెట్టాడు పండిట్ .మార్చి 4 ఈద్ రోజున ఈయన్ని చంపాలని గట్టిప్లాన్ తో వాడున్నాడు. ఆయన ,సభాకార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 6కు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగిఇంటికి రాగా ,ఆయన పక్కనే కూర్చున్నాడు ,  సంధ్యాసమయంలో పండిట్ రాసుకోవటం ఆపేసి కాగితం కలం కిందబెట్టి లేచినిలబడగా ,వాడు అకస్మాత్తుగా కంబళి లోనుంచి కత్తి తీసి పొట్టలో పొడవగా గాయాలుకాగా ,ప్రేగులు తెగి కిందపడుతుంటే ఎడమ చేతితో వాటిని లోపలి నొక్కుతూ కుడి చేతితో వాడిని పట్టుకోగా తల్లీ భార్యాకూడా సహాయానికి రాగా ,వాడు గట్టిగా చెయ్యి విదిలించుకొని పారిపోయాడు .ఎవర్నీ వీళ్ళు పిలవలేదు అరవలేదు వాడికి అది గొప్ప అవకాశమై  పరిగెత్తాడు .

  పండిట్ జీ ని వెంటనే ఆస్పత్రికి తీసుకు వెడితే  రెండు గంటలవరకు కుట్లు వేస్తూనే ఉన్నారు .ఒక ప్రేగు రెండు ముక్కలైంది. ఎవరికీ ఆయన బతుకుతాడనే నమ్మకమే లేదు .అపస్మారంలో ఉన్నందున డాక్టర్ కూడా ఆయన బతకడు అన్నాడు .రాత్రికి ఆయన మిత్రులు శ్రద్ధానంద జీ వంటివారు వచ్చారు .ఆయనకు భయం, కోపం ఏమీ లేవు .గాయత్రీ మంత్రాలు పఠిస్తూ ఉండగా రాత్రి 2 గంటలకు ధర్మవీర పండిట్ లేఖరాం మరణించి వీర స్వర్గం పొందాడు .మర్నాడు ఉదయం ఆయన పార్ధివ దేహాన్ని దర్శించుకోవటానికి 20వేలమంది వచ్చారు . ఊరేగింపుగా ఆయనను తీసుకు వెడుతున్న దారిలో ప్రజలు పన్నీరు కురిపిస్తూ పుష్పాలు చల్లుతూ శ్మశానం దాకా 7వేలమంది చేరుకొన్నారు .దుఖం ప్రవహించింది .వేదోక్తంగా అంత్యేష్టి జరిగింది.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి యొక్క168వ,కార్యక్రమం

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఉయ్యూరు సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు మరియు శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలో “సరస భారతి” యొక్క168వ,కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రముఖ నాటక,రేడియో,బుల్లి తెర,సినిమా రంగ ప్రముఖులు శ్రీ ఉప్పులూరి సుబ్బారాయ శర్మ గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు హాజరయ్యారు.విశిష్ట అతిధిగా కవి పండితులు,వక్త, విశ్లేషకులు,ప్రసార కళాప్రవీణ,దూరదర్శన్ ఎక్సిక్యూటివ్ ఓలేటి పార్వతీశం గారు, ఆత్మీయ అతిధులుగా కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బరావు గారు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ గారు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ గారు, ఉయ్యూరు జాగృతి కో – ఆపరేటివ్ సొసైటి అధ్యక్షురాలు పామర్తి రాజీవి గారు,శ్రీనివాసా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పరుచూరి శ్రీనివాస్ గారు,శ్రీ శ్రీనివాసా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి పరుచూరి నీలిమ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సరస భారతి అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ సభాధ్యక్షత వహించగా,శ్రీ శ్రీనివాసా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పరుచూరి శ్రీనివాస్ గారు ముగింపు సందేశాన్ని అందించారు.
నేను సహితం ఈ కార్యక్రమానికి హాజరై,అశేష ప్రజ్ఞా మూర్తుల ప్రత్యక్ష దర్శన భాగ్యమూ మరియు వారి అమృత తుల్యమైన మధుర వాక్కులను వినే అవకాశం కలిగినందుకు ధన్యుడను.మా గురు సమానులైన శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారి దాతృత్వ గుణం,వారి ఉత్తేజం,ఉత్సాహం, సహృదయతను మరో మారు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినందుకు మరింత సంతోషం.శ్రీనివాస్ గారి దంపతులు స్వయంగా వారి గృహానికి మా అందరిని ఆహ్వానించి షడ్రుచోపేతమైన తొలి కార్తీక మాసపు విందును పసందుగా అందించినందులకు వారికి నా హృదయ పూర్వక నమస్సులు తెలియజేస్తున్న.విద్యార్థులు సభా సమావేశం అదియంతమునంతనూ చాలా ఆసక్తిగా విని వారి కరతాళ ధ్వనులతో మనోల్లాస జల్లులను కురిపించినందుకు వారికి అభినందనలు,ఆశీస్సులను అందజేస్తూ… ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక నమస్సులను తెలియజేస్తున్న!
🙏🙏🙏🙏🙏🙏🙏
మాధవరావు మోకా
తెలుగు విషయ సహాయకుడు
కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కాటూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 20వ భాగం.30.10.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 20వ భాగం.30.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 20వ భాగం.30.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

సుబ్బరాయ శర్మ గారికి సరసభారతి అంద జేసిన జీవన సాఫల్య పురస్కారం.విశ్వర్ భరతి పత్రిక.విశాఖ

సుబ్బరాయ శర్మ గారికి సరసభారతి అంద జేసిన జీవన సాఫల్య పురస్కారం.విశ్వర్ భరతి పత్రిక.విశాఖ

Posted in రచనలు | Leave a comment

మార్కండేయ మహా పురాణం.4వ భాగము.29.10.22

మార్కండేయ మహా పురాణం.4వ భాగము.29.10.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మార్కండేయ మహా పురాణం.3వ భాగం.28.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -339

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -339

· 339- క్రియేటివ్ కమ్మర్షియల్ అధినేత ,,అభిలాష సినీ నిర్మాత ,ఇళయరాజా తో మొదటి తెలుగు ట్యూన్స్ ఇప్పించిన –కె.ఎస్ .రామాకె.ఎస్. రామారావు ఒక తెలుగు సినీ నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి పెక్కు పురస్కారాలను కూడా పొందారురావు

నేపధ్యము
ఇతనిది విజయవాడ. అక్కడే పుట్టి పెరిగాడు. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశాడు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. సినిమాల మీద ఇతని ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు వాళ్ల నాన్న కె.ఎస్. ప్రకాశరావు గారు అతడిని తన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆయన వద్ద ‘బందిపోటు దొంగలు’, ‘విచిత్ర కుటుంబం’, ‘నా కుటుంబం’ అనే మూడు సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత ఇతని నాన్నకి ఒంట్లో బాగా లేకపోవడంతో విజయవాడ తిరిగి వచ్చాడు. అప్పుడే వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆంధ్రా పీపుల్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉండేవాడు. కానీ వాటిలోనూ రాజకీయ నాయకులు రావడంతో వదిలేసి, మళ్లీ చెన్నైకి వెళ్లిపోయాడు.

నిర్మించిన చిత్రాలు
ఇతను మొదట పుట్టనకనగళ్ అనే కన్నడ దర్శకుడి మీద అభిమానం ఉండటంతో ఆయన సినిమాని తెలుగులో అనువాదం చేశాడు. అది ఫ్లాపయింది. కమల్‌హాసన్ అబిమాని కావడంతో ‘ఎర్ర గులాబీలు’ కొన్నాడు. అది పెద్ద హిట్టయింది. అలాగే ఆయనదే ‘టిక్ టిక్ టిక్’ చేశాడు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత సుహాసిని మొదటి సినిమా ‘మౌనగీతం’ చేశాడు. అది కూడా ఆడింది. అలా డబ్బింగ్ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రధాన సినిమాల్లోకి వచ్చాడు. చిన్నప్పట్నించీ సాహిత్యం ఎక్కువగా చదివేవాడు. ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ ధారావాహిక ‘అభిలాష’ చదువుతూ, బాగుందనిపించి, ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ సినిమా తీశాడు. ఇళయరాజాను నేరుగా తెలుగుకు పరిచయం చేసింది ఆ సినిమాతోనే. అదివరకు ‘సీతాకోకచిలుక’కు ఆయన పనిచేసినా, అందులోని పాటలు తమిళ ట్రాకువే. ఆయన ప్రత్యేకంగా తెలుగు సినిమా కోసం ట్యూన్లు కట్టింది మొదటగా ‘అభిలాష’కే. ఆ తర్వాత ఆయన ఇతని సినిమాలకు తెలుగు ట్యూన్లే చేస్తూ వచ్చారు.

చిత్రాల జాబితా

  1. కౌసల్య కృష్ణమూర్తి (2019)[1]
  2. వరల్డ్ ఫేమస్ లవర్ (2020)[2

· 340-‘’నవ్విపోదురుగాక ‘’ఆత్మకధా రచయిత ,మాధుర్య మైన పాటలకు స్థానమిచ్చిన సీతామాలక్ష్మి ,మురారి సినీ నిర్మాత, –కె. మురారి

· కె. మురారి గా ప్రసిద్ధిచెందిన కాట్రగడ్డ మురారి ఒక తెలుగు సినిమా నిర్మాత. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. జానకి రాముడు, నారి నారి నడుమ మురారి లాంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. నవ్విపోదురుగాక పేరిట తన సినీ రంగ అనుభవాలపై మురారి పుస్తకం రచించారు.

వ్యక్తిగత జీవితం
విజయవాడ, మొగల్రాజపురంలో 1944 వ సంవత్సరంలో జన్మించాడు. తాత, నాయనమ్మలు: కాట్రగడ్డ గంగయ్య, అక్కమ్మలు. వరంగల్లు, ఆ తర్వాత హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేసి సినిమా రంగంలో ప్రవేశించాడు.

మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవి.

2012 లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.[2]

సినీ రచయిత పి. సత్యానంద్ మురారితో తన అనుభందం గురించి వ్రాసిన వ్యాఖ్యలు :

“హీరోని తీసేస్తున్నా మన సినిమా లోంచి” నిర్మాత అన్నాడు .అందరికీ షాక్ .

“ఎందుకని ..ఏమయింది “

“కథ లో చిన్న చిన్న మార్పులు కొన్ని చెబుతున్నాడు “

“చిన్నవే కదా పోనీ చేసేద్దాం ….”

“కథ ,పాట, సీన్ ..నాకు నచ్చాలి ..తర్వాత డైరెక్టర్ కి , రైటర్ కి నచ్చాలి అంతే …హీరో కి , హీరోయిన్ కి కాదు ..వాళ్ళ చెప్పే మార్పులు -కూర్పులు నేను చెయ్యను .డబ్బు పెట్టేది నేను ..పొతే నష్ట పోయేది నేనే ..”

చెప్పాడు నిర్మాత .

“మనకి ఇప్పుడు వేరే హీరో ఎవరూ దొరకరు …”

“అయితే సినిమా తియ్యను …హీరో డేట్స్ వున్నాయని , లక్షలు వస్తాయని , వాళ్ళకి నచ్చేటట్టు మార్పులు చేసి మాత్రం సినిమా తియ్యను ..”ఖచ్చితం గా అన్నాడు నిర్మాత మురారి ..

ఆ మొండి తనం తోనే తను అనుకున్నట్టే సినిమాలు తీసాడు .

ఆలా కుదరక పోవటంతో ,తను అన్నట్టే మానేసాడు కూడా చాలాకాలం క్రితమే .

ఆ నాటి టాప్ దర్శకులు అందరితోనూ (విశ్వనాధ్ ,దాసరి , రాఘవేంద్రరావు , జంధ్యాల , కోడి రామకృష్ణ , కోదండరామిరెడ్డి ..) సినిమాలు తీసాడు తనకి ‘నచ్చిన ‘విధంగానే .

సాహిత్యం ,సంగీతం -అంటే ప్రాణం గా ఫీల్ అయ్యే మురారి “మావ -బాలు “ని

మారుద్దాం అంటే అలాఅన్న డైరెక్టర్ ని కూడా మార్చేయటానికి సిద్ధపడేవాడు .

అందుకే తన సినిమాల్లో అన్ని పాటలూ బావుంటాయి

తనకి రెండే సినిమాలు ( త్రిశూలం (సినిమా), జానకిరాముడు) రాసినా మూడుపదుల స్నేహం మాది .

మొండి ,కోపిష్టి , తిక్క మనిషి ,అని కొందరు అన్నా నాకు మాత్రం చాలా మంచిస్నేహితుడు …మురారి కాట్రగడ్డ.

“నవ్వి పోదురుగాక …”నాకేమిటి అని తనకి నచ్చినట్టే జీవిస్తూ ,

ఆ టైటిల్ తోనే తన జీవిత అనుభవాలు రాసిన ( ఎక్కువ సేల్స్ అయిన సినిమా మనిషి బయోగ్రఫీ )

మిత్రుడు మురారి ఎప్పటికీ అలాగే ,

సాహిత్య ..సంగీతాలతో హాయిగా గడపాలని తన ఈ పుట్టిన రోజు పూట కోరుకుంటూ …

సినిమాలు

  1. సీతామాలక్ష్మి
  2. గోరింటాకు
  3. జేగంటలు
  4. త్రిశూలం
  5. అభిమన్యుడు
  6. సీతారామ కల్యాణం
  7. శ్రీనివాస కళ్యాణం
  8. జానకిరాముడు
  9. నారీ నారీ నడుమ మురారి

పుస్తకాలు

  1. తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర 1931-2005, తెలుగుసినిమా వజ్రోత్సవాలలో విడుదలయిన పుస్తకానికి సంపాదకుడు.
  2. నవ్విపోదురుగాక ఆత్మకథ. (2012లో తొలి ప్రచురణ)

మరణం
కాట్రగడ్డ మురారి చెన్నైలోని తన స్వగృహం నీలాంగరైలో 2022 అక్టోబరు 15న మరణించాడు.[3]

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 19వ భాగం.28.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 19వ భాగం.28.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

హాస్యానందం(చివరిభాగం )

హాస్యానందం(చివరిభాగం )

55- నవ్య  సాహిత్యం లో హాస్యం -3

  శ్రీశ్రీ హాస్యం

మహా కవి శ్రీ శ్రీ కొన్ని హాస్య గేయాలు రాశాడు .మూడు యాభైలు అనే గేయ సంపుటిలో చాలా హాస్యం పండించాడు ప్రాస క్రీడలు లో ‘’–రాస క్రీడా శృంగారానికీ రమ్యమైన ప్రాణం –ప్రాస క్రీడహాస్యానికి పసందైన బాణం ‘’నవ్యత్వాన్నికోరాడు ‘’సౌభద్రుని ప్రణయయాత్ర చదవాలని తొందర –ఎంకిపాటలు వన్స్ మోర్ ,కవికోకిల గబ్బిలం విశ్వ సత్య నాథాయణ అగ్గిమీద గుగ్గిలం ‘’మొదలైన వాక్యాలు హాస్య స్ఫోరకాలన్నారు మునిమాణిక్యం.అల్లాటప్పా రాతలు రాస్తే చెవి మేలేస్తాడు శ్రీశ్రీ –‘’అల్లాటప్పా రాతలు రాయటమే గొప్పా –ఒప్పుకోదగ్గ మెప్పా ?అలాంటి కవుల చెవులు మెలితిప్పానంటే అది నాతప్పా ?’’అన్నాడు .శ్రీశ్రీ కలం నుంచి జలువారిందిఏడైనా గోప్పెఅని కితాబిచ్చారు మాష్టారు .

 భానుమతిగారి హాస్యం సంసార పక్షం .ఆవిడ అత్తగారు అమాయకురాలు.జపాను ఎక్కడ ఉందొ తెలీనిది .ఆగ్రా దగ్గరే ఉంది అంటే నమ్ముతుంది. తన్ను తీసుకు వెళ్లి చూపించమని కొడుకును అడుగుతుంది .మదడి బట్టలు మడి ఆవకాయ జాడీలతో జపాన్ కు ప్రయాణమౌతుంది .కోడలూ మనుమడూ ఆమెను ఆడిస్తారు .ఆమె అమాయకత్వమే ఇక్కడ హాస్యానికి హేతువు అన్నారు గురూజీ .ఆమె అభిప్రాయాలుఅజ్ఞానం పరిహాసం సృష్టిస్తాయి .అయితే ఆమె ప్రేమ మూర్తి .ఆమెకు జపాన్ బట్టలు కట్టి తైతక్కలాడుతున్నట్లుగా ముఖ చిత్రం గీయటం ఆమెను అపహాస్యం చేయటమే అన్నారు బాధతో,ఉగ్రరూపం తో  నరసి౦హారావు గారు .

  ముళ్ళపూడి వెంకట రమణ ఉత్సాహ వంతుడైన యువకుడు .పరమ రమణీయమైన శాబ్దిక హాస్యం సృష్టించాడు .మల్లాది విశ్వనాథ కవిరాజు ,మల్లాది వెంకట కృష్ణ శర్మ మంచి హాస్య ఏకాంకికలు రాశారు. నేటి రాజకీయాలు ,అంతర్ రాష్ట్ర సమస్యలు ,కవి సమాజాలు ,నాటక సభలుమోదలైనవాటిపై వ్యంగ్య రచనలు చేశారు.మన హాస్య గ్రంథాలలో ముందు చెప్పదగినది మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం,.’’క్షితిలో బారిస్టరు పార్వతీశమును చెప్పి –పిదప పలుకవలే గదా –కితకితల కితరులను –భాసిత సుశ్లోకు డతడు’’అన్నమాట నిజమన్నారు మాణిక్యం మాస్టారు .రావూరు వారి హాస్యం మృదువైంది . విడిగా హాస్య గ్రంథాలు రాయలేదుకానీ వీరి వడగండ్లు ,ఆషామాషీ చదవని వారులేరన్నారు .మాటల్లోనూ హాస్యం చిలికిస్తారు .ఆయన ఛలోక్తి ఒకటి మాస్టారు చెప్పారు –సిగరెట్లు మానెయ్యటం మంచిది ‘’అన్నాను నేను .ఆయన ‘’నిజమే .అందుకే నేను ఎప్పుడూ మానేస్తూ ఉంటాను .ఇప్పటికి కనీసం పాతిక సార్లు మానేసి ఉంటాను ‘’అన్నారట రావూరు వెంకట సత్యనారాయణగారు .

  అసలు హాస్యానికి పుట్టినిల్లు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా .ఇతర దేశాలసంగతి తనకు తెలీదన్నారు. ఆ దేశాల్లో హాస్యం సాహిత్యం లో ఉజ్జ్వలమణిలాగా ప్రకాశించింది .ఇంగ్లీష్ తో పరిచయం అయ్యాకే హాస్య సమగ్రస్వరూపం ,విశిష్ట త మనకు తెలిశాయి అన్నారు గురూజీ .మోలియర్ ,మార్క్ ట్వేన్ ,లీకాక్ వంటి హాస్యవేత్తలు తెలుగులో లేరనే చెప్పచ్చు అన్నారు .ఒకరిద్దరున్న అదేమీ విశేషం కాదు అని పెదవి విరిచారు .పాలగుమ్మిపద్మరాజుగారి ‘’బతికిన కాలేజి నవల లో చక్కని,మృదువైన  హాస్యం ఉందన్నారు ముని జీ .

  చివరగా మనం చమత్కారం హాస్యం అనే మాటలను పర్యాయ పదాలుగా వాడుతాం ..ఈ రెంటికీ ఏదో కొత్తదనం విశిష్టఃత ఉండాలి .ఈ రెంటికీ భేదం ఏమిటి అంటే చెప్పటం కష్టం .స్థూలంగా కావ్యగుణం కలది చమత్కారం అనచ్చు. కావ్య గుణం కాక మరొక రకమైన రామణీయకత్వం కలదాన్ని హాస్యం అనచ్చు అన్నారు .చమత్కారంలో కావ్యగునం పెరిగితే ఉత్తమకవిత్వం అవుతుంది .చమత్కారం దిగజారి వికృతిపొందితే హాస్యం అవుతుంది అని మాస్టారు నిర్వచించారు .చిత్ర ,బంధకవిత్వాలు చమత్కార సంబంధమున్నవే .అల౦కారాలుకూడా చమత్కారాన్ని సాధించాటానికే ఉపయోగపడతాయి .వికృతి తో సంబంధంలేని ఏ అందమైనా చమత్కారమే .అయితే ఒక్కోసారి చమత్కారం హాస్యం కలిసే ఉంటాయి .అని చెప్పి –

‘’హమ్మయ్య ‘’అయిపొయింది కానీ హాస్యం గురించి చెప్పాల్సినవి కొన్ని చెప్పనే లేదు ‘’నవ్వు ఎందుకు వస్తుంది “’అనేదానిపై సమగ్రంగా చర్చించలేదు .బర్గ్ సన్,ఈస్ట్ మన్ ల సిద్ధాంతాలు సూచించి వదిలేశానేకాని ,తృప్తికరంగా పరామర్శించలేకపోయాను అని బాధపడ్డారు .శక్తిమూల హాస్యం ఉక్తిమూల హాస్యం లలోచేర్చాల్సినవి ఇంకాచాలా ఉన్నాయి .హాస్య ప్రయోజనం గురించి రాయలేకపోయాను ఈపుస్తకానికి ఆదరణలభిస్తే ,రెండో ఎడిషన్  లోఆవిషయాలురాస్తాను .లేకపోతె తర్వాత వాళ్ళు ఆసంగతిచూసుకొంటారు .ఈ పుస్తకం లో దోషాలను సద్భావంతో తెలియజేస్తే,సంతోషిస్తాను .కానీ మీ అభిప్రాయాలుమాత్రం నాకు తెలియ జేయండి అని ప్రార్ధిస్తున్నాను ‘’అని శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు 1968లో333పేజీలలో  రాసిన ‘’మన హాస్యము ‘’ను ముగించారు దీన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ –హైదరాబాద్ ప్రచురించింది .ఇదే నేను24-10-2021న మొదలుపెట్టి ఈరోజు 27-10-22న పూర్తీ చేసిన 55ఎపిసోడ్ల ‘’హాస్యానందం ‘’కు ఆధారం .మరొక్క మారు- మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో-

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం .2వ భాగం.27.10.22

మార్కండేయ మహాపురాణం .2వ భాగం.27.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం -3

ధర్మవీర పండిత లేఖరాం -3

 విదేశాలలో ప్రచారం చేయాలన్న కోరిక

 విదేశాలలో కూడా ధర్మ ప్రచారం చేయాలని లేఖరాం భావించాడు .డా.షా రాసిన సత్యార్ధ ప్రకాశికను పార్సీ భాషలో అనువాదం చేయాలనే కోరిక కలిగింది .ఆఫ్ఘనిస్తాన్ పర్షియా ,ఆరబ్ దేశాలకు వెళ్లి ధర్మప్రచారం చేయాలనుకొన్నాడుకానీ ఆయన జీవితకాలం లో జరగలేదు .

 కుంభ మేళా

12-4-1891నాటి కుంభమేళా కు నెలరోజులముందే స్వామి శ్రద్దానంద్ తోకలిసి ప్రచార ప్రకటన చేశాడు .పంజాబ్ ,ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు అత్యంత ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకారు .లేఖరాం ఎన్నో చోట్లకు తిరిగి విరాళాలు సేకరించాడు .కుంభ మేళాలో ఆర్య సమాజం చేసిన సేవను ఒక పుస్తక రూపం వెలువరించాడు . సింథ్ లో

సి౦థ్ లోని హైదరాబాద్ లో హిందువులు కొందరు క్రైస్తవ ,ఇస్లాం మతాలలోకి మారుతున్నారని పంజాబ్ ఆర్యప్రతినిధి ప్రధాన్ లేఖ రాయగా ,సింధీ భాష తెలిసిన స్వామి పూర్ణానంద ను తనతో తీసుకు వెళ్లి ,వారివాదాలను ఖండించి ‘’ఆడం ,అవ్వ లు మన తలిదండ్రులా ?’’అనే పుస్తకం రాసి సమస్త మానవ సృష్టి ఒకేతలిదండ్రుల సంతానం కాజాలదని అనేక రుజువులతో ,ప్రమాణాలతో వివరించాడు .అక్కడి పదిమంది యువకులను మతం మారకు౦డాకాపాడి ,అక్కడి ఆర్య సామాజికులను అప్రమత్తం చేశాడు .ఒక సింధీ ధనికుడు దివాన్ సూర్యమల్ ముసల్మాన్ గా మారటానికి సిద్ధపడితే ,విషయం తెలిసి ఆయన్నుకలవటానికి  వెడితే ,ఆయన ఆలీపూర్ వైపుకు పారిపోగా ,అతని కొడుకుల్ని ముట్టడించగా పెద్దకొడుకు తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ,నాలుగు సార్లు వెళ్లి శాస్త్రార్ధా  నికి పిలిచి ఉత్తరాలవర్షం కురిపించగా మౌల్వీలు వచ్చి పాల్గొనగా వాదంలో వారిని నిరుత్తరుల్ని చేశాడు .ప్రసిద్ధబ్రహ్మ సమాజ వ్యాఖ్యాత టిఎల్. స్వామి హృదయమ లో  ధర్మ శాస్త్రాలపై గౌరవం కలిగించాడు .లర్కానాలో కొందరు హిందువుల్ని బలవంతంగా ముస్లిం లుగా మార్చారు .ఆదుకోమని అక్కడివారు లేఖ పంపితే ఆరోగ్య౦ బాగాలేక వెళ్ళ లేక పోయాడు .ఆతర్వాత ఎన్నోప్రయత్నాలతర్వాత  వాళ్ళంతా వైదిక  ధర్మం లోకి వచ్చారు .

 లేఖరాం ఎక్కువగా పంజాబ్ లోనే పని చేశాడు .అమృతసర్ ఆర్యసమాజ వార్షికోత్సవం లో చారిత్రకదృష్టితో ,పరిశోధనాత్మక ప్రసంగం చేయగా అమరవీరుడు స్వామి శ్రద్ధానంద దాన్ని ప్రశంసిస్తూ,హిందీలో’’షార్ట్ హాండ్’’ అవసరమని ఆయన ప్రసంగం రుజువుచేసిందని అంతటి వాక్ ప్రవాహంతో ఉత్తేజంగా ఆయన ఉపన్యాసం సాగిందని తెలిపాడు .నాహన్ రాజ్ లో సాధు కేశవానంద ఉదాసి పెద్ద దుమారం లేపితే పండిట్ జీకి టెలిగ్రాం ద్వారా తెలియబరిస్తే వెళ్లి ,ఆయనతోమాట్లాడి మనసులో మార్పు తెచ్చి ఆయనతోనే అక్కడ ఆర్యసమాజం  స్థాపించేట్లు చేశాడు

   రాజపుఠానా లో ప్రచారం

దయానందుని జీవన సామగ్రి సేకరణకు పండిట్జీ అజ్మీర్ కు వెళ్లి అక్కడ అందరినీ కలిసి విషయ సేకరణ చేసి దయానందుని జీవిత చరిత్ర రాశాడు .నిత్యానంద ,విశ్వేశ్వరానంద లు బూందీ రాజ్యంలో శాస్త్రార్ధ చర్చల్లో మునిగిపోయారు .వారికి సాయంగా ఈయనకూడా వెళ్ళాడు .అక్కడినుంచి షాహాజ్ పూర్ ,వెళ్లి వ్యాఖ్యానం చేస్తుంటే ఒక ముసల్మాన్ సుబేదార్ లేచి ‘’30దెబ్బలుతిని బూందీ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావ్ ?’’అని ప్రశ్నిస్తే పండిట్ ‘’విరోధులు శాస్స్త్రార్ధానికినికి రమ్మంటే రాకపోతే ఏం చెయ్యాలి ?మేము హజరత్ మహమ్మద్ లా పారిపోయి రాలేదు ‘’అనగా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి .

  ఉపనిషత్తులకు టీకా తాత్పర్యాలు రాయలనుకొన్నాడు .మనుస్మృతిలో ఒక అధ్యాయానికి భాష్యం రాశాడు. కాశ్మీర్ లో అరుదైన మనుస్మృతి గ్రంథం ఆయనకు లభించింది .మనుస్మృతి తర్వాత వాల్మీకి రామాయణం అనువది౦చా లనుకొన్నాడు .శ్రద్ధానంద శాస్త్రాల అనువాదాలకు ఒక ప్రణాళిక తయారు చేశాడు .దురదృష్టవశాత్తు లేఖరాం అకాల మృత్యువు పాలయ్యాడు .అమీర్ లో పీరజేతో శాస్త్రార్ధం చేశాడు .మొత్తం మీద ఇక్కడ 15వ్యాఖ్యానాలు చేశాడు .

  కథియవాడ లో

దయానంద జన్మస్థలం నిర్ధారించటానికి కథియవాడ వెళ్ళాడు .అక్కడ బాన్కానేర్ ,మౌర్వీ రాజ్యాలలో తిరిగాడు .మహర్షి పుట్టిన అక్కడ ఆర్యసమాజం చాలా దుర్దశలో ఉండటం గమనించి బాధపడ్డాడు .పంజాబ్ లో మాంసం తినటం ఎక్కువ .ఆర్యసమాజ సభ్యులుకూడా అలవాటు మార్చుకోలేక పోయారు .వేదం లో మాంస భక్షణ ఉందని మొండిగా వాదించేవారు .ఆర్యప్రతినిధి సభ ప్రాధాన్ ఈయనను పంజాబ్ కు రమ్మని కోరగా ,రాజపుఠానా వెళ్లి మా౦సభక్షణం విరుద్ధమని,పాపం అనీ  అనేక ప్రమాణాలతో నిరూపించాడు .ఆయనవాదానికి జవాబు చెప్పగలమోగాడు అక్కడ లేకపోయాడు .అప్పటికి ఒకటి ఆర్యసమాజంలో సంస్కృత శిక్షణ ను సమర్ధించేది ,రెండోది కాలేజి పక్షంగా,పాశ్చాత్య శిక్షణ అనుసరించాలి అనేది  ఉన్నాయి .

  గృహస్థ జీవనం

వైశాఖమాసం లో దయానందుని ఆజ్ఞాపాలనలో 25 ఏళ్ళు గడచిపోయి పండిట్ కు 35ఏళ్ళు రాగా వివాహం చేసుకొన్నాడు .జహాలం నుంచి కహూటకు వెళ్ళాడు .అక్కడ భాన్న గ్రామవాసి,అక్షరంకూడా రాని  లక్ష్మీదేవి ని ఆమె 26ఏట వివాహం చేసుకొన్నాడు .తర్వాత ఆమెకు తానె చదువు చెప్పాడు.ఆమెకు ధార్మిక శిక్షణ ఇవ్వటానికి గ్రామమే తగినదని అనుకొన్నాడు.

 జోథ్ పూర్ లో

పంజాబ్ లో ఆర్యసమాజం రెండు పక్షాలు అయ్యాక ,మాంస పక్షం నుంచి శ్రద్ధానంద ,జోథ్ పూర్ వెళ్ళాడు .రాజు మేజర్ జనరల్ ప్రతాప సింహా మహర్షి భక్తుడైనా యుద్ధం చేసే రాజపుత్రులకు  మాంసభక్షణ తప్పదు అని వాదించేవాడు .రాజు భయంతో ధనికులు పత్రికలవారూ తలలూపారు .రాజు తనకు సపోర్ట్ గా నిలుస్తారని  పండిట్ గంగాప్రసాద్ ,పండిట్ ఎం ఎ మీరట్ లను పిలిపించాడు .కానీ డబ్బు, హోదా తమల్ని ధర్మమార్గం నుంచి తప్పించలేవు అని రాజుకు కౌంటర్ ఇచ్చారు .లేఖరాం జోథ్ పూర్ వెళ్లి కొన్ని రోజులు౦డిచర్చల్లోపాల్గొని మాంస వ్యతిరేకతకు మద్దతు కూడ గట్టాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-22-ఉయ్యూరు   —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 18వ భాగం.27.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -336

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -336

· 336-మన వూరిపాన్డవులు సినీ నిర్మాత ,ఫిలిం ఫేర్ అవార్డీ –కాకితజయకృష్ణ

· జయకృష్ణ (ఆగష్టు 18, 1941 – మార్చి 29, 2016) భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు ప్రధానంగా నిర్మాతగా సేవలనందించారు.[1] ఆయన 1978 లో మనఊరి పాండవులుకు నిర్మాతగా కెరీర్ ప్రారంభించి తెలుగులో ఉత్తమ ఫిలిం పేర్ అవార్డును అందుకున్నారు. ఆయన ఇతర సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు (1983), వివాహ భోజనం, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్ళంట, కృష్ణార్జునులు, 420 మొదలగు సినిమాలను తెలుగులో నిర్మించారు. తమిళంలో ఆయన “ఆలవందం” సినిమాను నిర్మించారు.[2] 15 పైగా తెలుగు చిత్రాలు నిర్మించారు. మరో 20కిపైగా డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.[3][4]

జీవిత విశేషాలు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి సమీపంలోని కొమ్మర గ్రామానికి చెందిన జయకృష్ణ, తన బావ లైన ఎడిటర్ గోపాలరావు, మేకప్‌మ్యాన్ సురేశ్‌బాబుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. తొలుత కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అటుపైన మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రయాణం మొదలుపెట్టారు. మేకప్ వృత్తిపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న జయకృష్ణ ఎన్నో మెళకువలు నేర్చుకుని పరిశ్రమకు వచ్చిన ఎనిమిదేళ్లకే చీఫ్ మేకప్‌మ్యాన్ స్థాయికి ఎదిగారు. ‘బంగారు తల్లి’ సినిమా సమయంలో కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడి ఆయన పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా చేరారు. ఆ తర్వాత జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించారు. అటుపై సినీ నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగానూ మారారు. ‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘అమర దీపం’ తదితర చిత్రాలకు భాగస్వామిగా ఉంటూనే నిర్మాణ నిర్వహణ చేశారు. ప్రముఖ పంపిణీదారు ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగ మూర్తి ప్రోత్సాహంతో 1977లో జేకే మూవీస్ సంస్థను స్థాపించి, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్ తదితరులతో ‘మనవూరి పాండవులు’ నిర్మించారు. దాసరి దర్శకత్వంలో ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’, ‘రాగలీల’, ‘వివాహభోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’, క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్రవంతి’ తదితర చిత్రాలను నిర్మించారు.[5]

కెరీర్
కృష్ణం రాజు, జయసుధలకు మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఆయన విద్యార్థి. ఆయన వద్ద మేకప్ ఆర్టిస్టుగా చేరి తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు.[6] ఆయన ప్రముఖ సినిమా నటుడు చిరంజీవికి మొట్టమొదటిసారిగా పారితోషకాన్ని (రూ.1116/-) అందించిన నిర్మాత. ఆయన ప్రొడక్షన్ బానర్స్ లో ముద్దు ఆర్ట్ మువీస్, జయకృష్ణ మువీస్ కూడా ఉన్నాయి.[7]

గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా ‘దాసు’. సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై ‘ఒక తార’ అనే సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అది తెరకెక్కలేదు. జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం జయకృష్ణ జీవితంలో అత్యంత విషాదాత్మక ఘటన.[8]

· 337-భారత్ బంద్ సినీ నటుడు ,పెళ్లిపందిరి సినీ నిర్మాత –కాస్ట్యూమ్ కృష్ణ

కాస్ట్యూమ్స్ కృష్ణ ఒక సినీ నటుడు,, నిర్మాత.[1] అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 8 చివ్యక్తిగత జీవితం
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట.[3]

కెరీర్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[2] కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు.[3]

జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు.[4]

సినిమాల]
నటుడిగా
· భారత్ బంద్

· అల్లరి మొగుడు

· దేవుళ్ళు

· మా ఆయన బంగారం

· విలన్ (2003)

· శాంభవి ఐపిఎస్ (2003)

· పుట్టింటికి రా చెల్లి (2004)

నిర్మాతగా
· పెళ్ళిపందిరి

· 338-మనీషా ఫిలిమ్స్ నిర్మాత ,యమలీల సినీ ఫేం –కె.అచ్చిరెడ్డి

· కె. అచ్చిరెడ్డి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. దర్శకుడు, స్నేహితుడైన ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు.[1] ఆయన కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2]

· వ్యక్తిగత జీవితం
· అచ్చిరెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి. ఆరవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అప్పటి నుంచి ఎస్. వి. కృష్ణారెడ్డితో స్నేహం ఉంది.[1] తనకు సినిమా మీద ఆసక్తి లేకపోయినా కృష్ణారెడ్డి అవకాశాల కోసం మద్రాసు వెళ్ళినపుడు తనే నిర్మాత అయితే బాగుండుననిపించింది. హైదరాబాదుకు వచ్చి డబ్బు సంపాదించడానికి అనేక వ్యాపారాలు చేశాడు. మొదట్లో జంట నగరాల్లోని ఇరానీ కేఫ్ లకు స్వీట్లు సరఫరా చేశారు. అప్పట్లో పాప్ సంగీతం ప్రాచుర్యంలో ఉండటంతో పాప్ టీ పేరుతో అప్పట్లో ఉన్న డంకన్ టీకి పోటీగా తయారు చేశారు. గోల్డెన్ ఫింగర్స్ పేరుతో ఒక రకమైన వడియాలు లాంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేశారు. కొంతమంది కలిసి బృందంగా ఏర్పడి డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారాలు నిర్వహించేవారు. ఖాళీ సమయాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. వ్యాపారాల ద్వారా కొంత డబ్బును కూడబెట్టారు కానీ సినిమా నిర్మాణానికి అవి సరిపోవని తెలిసింది. సినీరంగంతో పరిచయం కలగడం కోసం అప్పుడే ప్రాచుర్యం పొందుతున్న దూరదర్శన్ చానల్లో అధికారులకు, నిర్మాతలకు మధ్య వారధిగా వ్యవహరించడం ద్వారా సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు. అప్పుడే మరో నిర్మాత కిషోర్ రాఠీతో పరిచయం ఏర్పడింది. ఆయనకు అప్పుడే మనీషా వీడియోస్ పేరుతో సినిమాలకు సంబంధించిన ఒక సంస్థ ఉండేది. మొదట్లో మూడు రీమేక్ చిత్రాలు నిర్మించాక కొబ్బరి బోండాం సినిమా తీశారు.

· కెరీర్
· 1988లో ఆయన కెరీర్ ప్రారంభమైంది.[3] మొదట్లో మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించాడు. తర్వాత ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాడు. తర్వాత మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి ఆది హీరోగా ప్రేమ కావాలి సినిమా తీశాడు.

·

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం55- నవ్య సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం
55- నవ్య సాహిత్యం లో హాస్యం -2
కృష్ణ శాస్త్రిగారిహాస్యం
కృష్ణ శాస్త్రి గారిహాస్యంచాలా చక్కగా ఉంటుంది .అవి పద్యాలు .ఇంకా పుస్తకరూపం దరించ లేదనుకొంటాను (ఇది 1968లో మాస్టారు అన్నమాట ).దేశంలో ప్రతిప్రాంతం తనకుస్వతంత్ర్యం కావాలని కోరే రోజులవి .తర్వాత పాకిస్తాన్ లాగా విడిపోయి స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలని చిన్న చిన్న సంస్థానాలు కూడా ఆశ అడ్డాయి .ఇలా చేస్తే దేశం ముక్కలు చెక్కలవుతుంది .దీన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ శాస్త్రిగారు పద్యం రాశారు –వీట నున్న శుద్ధ విశ్వస్తలందరూ-గొప్ప సభను చేసి గోలపెట్టి –వెధవ పేట నొకటి వేరే ఇమ్మన్నారు-విశ్వదాభిరామ వినురవేమ ‘’
సోషలిజ వాదుల డాంబికాన్ని హేళన చేస్తూ రాసిన మరోపద్యం –‘’కత్తిసాము చేతు గండడు రాళ్ళను మోతు –మొగ్గ వేతు నగ్గిపోతుననియే –స్వామి ఎవరమంటే సామ్య వాడదులమన్నాడు –విశ్వదాభిరాం వినురవేమ ‘’.
అర్హత లేని పనులు చేయటానికి సాహసించే అవివేకులను అవహేళన చేస్తూ ‘’ఆడ వేషం వేయటానికి అర్హత లేకపోయినా సరదాకు ఆవేషం కట్టి న వాడిని హేళన చేస్తూ రాసిన పద్యం –
‘’నాటకాలలో నారీ వేషము వేయ –పురుషుడట్టులుండుపోతరాజు-ఉత్తయప్డు సరిగా యువతీ లలమయే –విశ్వ –‘’
భావకవిని గురించి మరో చెణుకు –‘’మెరుగు కంటి జోళ్ళు ,గిరజాలు సరదాలు –భావకవికి లేని వేవిలేవు-కవిత యందు తప్ప గట్టివాడన్నిట –విశ్వ —‘’
ఎప్పుడో రాజ్యమేలిన పాదుషాలు తురకలైన కారణం తో,తానూ అంతవాడినే ఆని రొమ్ము విరుచుకొనే ‘’కుట్టు సాహేబు’’(దర్జీ )సంగతి మరీ హాస్యాస్పదంగా ఉంది –‘’
‘’మొగలు పాదుషాలు తుఘలక్ నవాబులు డొక్కచి౦చి తోలు చెక్కిరంచు –కుట్టు సాహేబయ్య కొట్టు బడాయీలు –విశ్వ –‘’
నియోగులలో కొందరుకరణాలు గోముఖ వ్యాఘ్రాల్లా కొ౦పలార్పారు .వారిని హేళన చేస్తూ –‘’ఆరు వేల కొ౦పలంటించి నయగారు –ఆరు వేల వేరే యప్పు జేసే –అతడుగాక ఎవ్వ డారువేల నియోగి –విశ్వ –‘’
పనికిమాలినవాళ్ళు రాజకీయ నాయకులౌతున్నారని చెబుతూ అల్లిన పద్యం –
‘’నోటి తీతవాడు ,మేటి నాయకుడాయే –మౌని వరుడు పనికి మాలిపోయే –సింహమునకు గ్రామ సింహమే గురువయ్యే –విశ్వ –‘’
గుర్రాలే కుర్చీ ఎక్కి పెత్తనం చలాయిస్తున్నాయి అంటూ –
‘’ఉలవ చారు త్రాగి ఉద్యోగి గుర్రమై –దౌడుతీసే లద్దె తానె వేసె-గుర్రముండి యుండి కుర్చీపైకేక్కేరా ‘’
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం.1వ భాగం.26.10.22

మార్కండేయ మహాపురాణం.1వ భాగం.26.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మ ప్రచారానికి ఒక పత్రిక అవసరం అని గుర్తించి ‘’ధర్మోపదేశ ‘’మాసపత్రిక స్థాపించి ,సంపాదకు డయ్యాడు లేఖరాం .దీనితోపాటు వ్యాఖ్యానాలు కూడా చెబుతూవాటికి సంనద్ధుడవుతూ ఉండేవాడు .ఒకసారి మద్య నిషేధం పై ఈయన ఉపన్యాసం విన్న సైనికాధికారి సైన్యంలో మద్య నిషేధం విధించాడు శాస్త్రార్ధాలు  చేయటంలోనూ నైపుణ్యం సంపాదించాడు .పోలీస్ సూపరింటే౦డెంట్ తన డిప్యూటీ లీడర్ వజీర్ ఆలీ ఈయన తో వ్యాఖ్యానాలు చేస్తూ సమర్ధించే వాడు .ఈయన బదులువచ్చిన కొత్తాయన లేఖరాం ను పెషావర్ నుంచి ‘’సు ఆబీ ఠాణా ‘’కు మార్చాడు .అక్కడిను౦చికూడా తన వ్యాసంగాన్ని కొనసాగించాడు .ఒకసారి ఇక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈయనతో సత్యాసత్యాలపై చర్చకు రాగా ,ఈర్ష్య చెంది ఈయన ఇంక్రిమెంట్ ఆరునెలలు నిలిపేశాడు .

   ఆర్య సామ్రాజ్యకా౦క్ష

  భారతీయ శిక్షా పద్ధతికి లేఖరాం వద్ద ఎప్పుడూ ఒక గ్రంథం ఉండేది .దాని ముఖ చిత్రంగా ‘’ఓ3మ్’’అనే జండా ముద్రి౦పజేయించారు. అంటే సమస్తభూప్రపంచ౦పై  ఈ పతాకం ఎగరాలి ఉద్దేశ్యం .వైదికం ప్రపంచానికి శిరోమణి కావాలనే భావం .కానీ ఇప్పటివరకు నెరవేరలేదు .ఏదైనా ముందు తానూ ఆచరించి ఇతరులకు చెప్పేవాడు .పెషావర్ లో జరిగే ఆర్యసమాజిక సాప్తాహికాలకు వెళ్ళాడు .ధర్మశాల అధ్యక్షుడైన తాసిల్దారునే సమాజానికి ప్రధాన్ గా చేయాలని అందరి ఆలోచనగా ఉంది .తాసిల్దార్ మద్య మా౦సప్రియుడు కనుక ఉండటానికి వీలులేదని ఆయన హాజరైఉండగా చెప్పాడు .సభ్యులు అంగీకరించకపోతే సభ వదిలి వెళ్లి పోయాడు లేఖరాం .

  ఉద్యోగానికి రాం రాం

 పోలీసు ఉద్యోగం ధార్మిక కార్యక్రమాలకు అడ్డంకి గా ఉందనిభావించి 24-12-1884న రిజైన్ చేశాడు .ఇప్పుడు స్వేచ్చ లభించింది .ఇంతలో దయానందుని నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి .ఒకదానిలో గోరక్షణ కోసం సంతకాల సేకరణ ,రెండవది పంజాబ్ లో హిందీ ప్రచారానికి విద్యా సంస్థకు నివేదన పత్రం పంపటం గురించి .ఎంతో ఉత్సాహంగా ఈ రెండూ పూర్తిచేశాడు .

  మీర్జా గులాం అహమ్మద్ కాదియాని తానూ పైగంబర్ అని చెప్పుకొంటూ జమ్మూలోని ,హిందువులను ముస్లిం లుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు .ఈయన చాలాసార్లు అక్కడికి వెళ్లి ఆప్రయత్నాలకు అడ్డు పడ్డాడు ..కాదియానిరాసిన ‘’బురాహీన్ ఆహామదియా ‘’లో ఆర్యసమాజం పై దూషణలు చేశాడు .కనుక తన చర్యలను తీవ్రతరంచేయటంతో  మతమార్పిడి చాలాభాగం తగ్గింది .ఇంకో అడుగు ముందు వేసి క్రైస్తవ ,ముస్లిం లనుకూడా వైదిక ధర్మ౦ లోకి తెచ్చాడు .ఎవరైనా తనదగ్గర ఏడాదికాలం ఉంటె తన చమత్కారాలు ప్రత్యక్షంగా చూడచ్చు అని కాదియానా ప్రకటించగా,ఖండించి , ఈయన వెళ్లి ,ఆయన రహస్యాలు బట్టబయలు చేసి ,జనాల భ్రమలను వదిలించి ఆర్యసమాజం స్థాపించాడు .కాదియాకు చెందినా హిందువు విష్ణుదాసు ఇస్లాం లోకి మారకపోతే ఏడాదిలోపే చచ్చి పోతాడనిమీర్జా  ప్రచారం చేయగా ,లేఖరాం వెళ్లి సందేహాలు సంతృప్తితో తీర్చి ఆర్య సమాజ సభ్యుని చేశాడు .ఎందఱో సామాన్యులని మీర్జాకుతంత్రానికి  బలికాకుండా కాపాడాడు .సురమా చాస్మ ఆరియా అని మీర్జా రాస్తే దాన్నిఖండిస్తూ లేఖరాం’’సుస్తా ఖబ్దఆహ్మదియా ‘’రాసి నోరుకాదుకాదు కలం మూయించాడు .

  లాహోర్ లో ఉపన్యాసాలిస్తూనే సంస్కృత వ్యాకరణం సాయంతో వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .ఫాదరీ ఖడక్ సింహ్ క్రైస్తవాన్ని సమర్ధిస్తూ ఆరు వ్యాసాలురస్తే ,వాటికి ఖండిస్తూ ఆరు చిన్న పుస్తకాలు రాశాడు .’’ఆర్యగజేట్ –ఫిరోజ్ పూర్’’ కు ఆయన సంపాదకు డయ్యాడు .దయానందుని నిర్యాణం తర్వాత లేఖరాం బాధ్యత పెరిగింది .ఆర్య ప్రతినిధి సభ దయానందుని జీవిత చరిత్ర లేఖరాం రాయాలని తీర్మానించింది .దీనికోసం విషయ సేకరణకు దేశమంతా పర్యటించాడు .ముందుగా  స్వామి విరజానందుని  శిష్యులైన పండిత యుగళ్ కిషోర్ ,పండిత దామోదర్ చౌబే వంటి వారినికలిసి విషయాలు గ్రహించాడు .వీరు దయానండునిక్లాస్ మేట్స్ .మధుర ,సంయుక్త పరగణాలు కూడా వెళ్లి విషయాలుసేకరించాడు .అజ్మీర్ లో అబ్దుల్ రహమాన్ తక్జీబ్ ,నుస్కా ఖబ్ద్  పుస్తకాలు చదివి ఇస్లాం వదిలి ‘’సోమదత్త ‘’పేరుతొ వైదికం లోకిచేరి ఆర్యసమాజానికి గొప్ప ప్రచారకుడయ్యాడు  .ఆర్య సమాజ హేతువాద ప్రచారం పౌరాణికులను, జైనులను కూడా కలవర పరచింది .లేఖరాం గారికి ప్రాణాపాయం ఉంటుందేమో అని భయపడి ఆయనకు కాపలాగా నలుగుర్ని నియమించాలని ఆర్యులుకోరగా ఈయన ఒప్పుకోలేదు .తనకు భయం లేదన్నాడు .ఒక మౌల్వీకి హిందీనేర్పించాడు

  శూద్రునికి యజ్ఞోపవీతం

మీర్జాపూర్ ఆర్యసమాజంలో ఉన్న ఒక శూద్రుడు  వైశ్యులకు  వైదికకార్యాలుచేస్తాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయటానికి అక్కడి ఆర్యసమాజం ముందుకురాలేదు .ఇది తెలిసి  లేఖరాం ఆయనకు యజ్ఞోప దేశ సంస్కారం దగ్గరుండి చేయించాడు .మీర్జాపూర్ లో ఒక గూండా మౌలీతో శాస్త్రార్ధం  చేశాడు .ఆతనికి భయపడి ఎవరూ ఎదురు వెళ్ళేవారు కాదు .ఈయన సాయ౦కాలం నిర్భయంగా దుడ్డుకర్ర చేత్తోపట్టుకొని వాహ్యాళి వెళ్ళేవాడు .కాశీలో రెండు ననెలలున్నాడు .ఓజస్వీ భాషణ చేశాడు .పౌరాణికులు అడ్డుపడినా నిర్భయంగా తనవాదాన్ని వెలువరించి ఆమోదం పొందాడు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -334

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -334

· 334-చాయాగ్రాహకుడు ,క్షణ క్షణం సినీ నిర్మాత –ఎస్.గోపాల రెడ్డి

· ఎస్. గోపాలరెడ్డి సినీ ఛాయాగ్రాహకుడు (కెమెరామెన్) రచయిత, దర్శకుడు, నిర్మాత.[1] డా. కె. ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నాడు. తెలుగులోనే కాక కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతగా క్షణ క్షణం ఆయనకు బాగా పేరు తెచ్చింది.

వ్యక్తిగత వివరాలు
గోపాల్ రెడ్డి జులై 4, 1951న కృష్ణా జిల్లాలో జన్మించాడు. ఆయన మరో కెమెరామెన్ అయిన రసూల్ ఎల్లోర్ సోదరి మైకేలాను వివాహం చేసుకున్నాడు.[2] వారికి ఒక కుమారుడు సందీప్, కుమార్తె సంధ్య ఉన్నారు. సందీప్ కూడా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.[1]

కెరీర్
1968 లో చెన్నైలోని వీనస్ స్టూడియోలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి దగ్గర సహాయకుడిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో అనేక తెలుపు-నలుపు చిత్రాలకు పనిచేశాడు.1979 లో ఆయనకు సినిమాటోగ్రాఫర్ గా పేరు వచ్చింది. తరువాత 1980 వ దశకంలో అనేక తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. 1980 వ దశకంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, ఇంక్విలాబ్, సూర్యవంశీ మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. తరువాత 1990 వ దశకంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన కచ్చే ధాగే సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం. ఆయన మొత్తం 150 సినిమాలకు పైగా పనిచేస్తే అందులో నాగార్జున కథానాయకుడిగా నటించినవి 15 సినిమాలున్నాయి.

క్షణక్షణం, దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆయన నిర్మాతగా పేరు తెచ్చిన సినిమాలు. రవితేజ హీరోగా నటించిన, తమిళ సినిమాకు రీమేక్ అయిన నా ఆటోగ్రాఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఛాయాగ్రాహకుడిగా
· చిన్నబ్బాయి (1997)[3]

· పోలీస్ లాకప్ (1993)

· 335-నటుడు ,కిలాడి సినీ నిర్మాత –ఏడిద శ్రీరాం

· ఏడిద శ్రీరాం తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత. ఇతను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న కుమారుడు

జీవిత విశేషాలు
అతను డిగ్రీ వరకు చదివాడు. స్వరకల్పన సినిమా చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మితో వివాహం 1989 అక్టోబరు 5న జరిగింది. అతను నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాడు. తరువాత అతను కన్‌స్ట్రక్షన్ రంగంలో అడుగు పెట్టాడు. అతనికి ఒక కుమార్తె శ్రీజ ఉంది. [1]

సినిమాలు
నిర్మాతగా
· కిలాడి [2]

· కేడి [3]

· వీరి వీరి గుమ్మడి పండు [4]

నటునిగా
· శంకరాభరణం[5]

· సాగరసంగమం[6]

· సీతాకోక చిలుక [7]

· సితార (1983)[8]

· స్వాతిముత్యం [9]

· స్వరకల్పన (1989)[10]

· శంభో శంకర (2018)

· వీరి వీరి గుమ్మడి పండు [4]

· మిస్టర్ ఎర్రబాబు [11]

· తెలంగాణ దేవుడు (2021

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .17 భాగం26.10 .22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .17 భాగం26.10 .22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి 168 వ కార్యక్రమం (సినీనటులు శ్రీ సుబ్బరాయశర్మ గారి జీవన సాఫల్య పురస్కార ప్రధాన వేడుక ఆహ్వానం)

సరసభారతి 168 వ కార్యక్రమం (సినీనటులు శ్రీ సుబ్బరాయశర్మ గారి జీవన సాఫల్య పురస్కార ప్రధాన వేడుక ఆహ్వానం)

Video link

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హాస్యానందం54- నవ్య సాహిత్యం లో హాస్యం

హాస్యానందం
54- నవ్య సాహిత్యం లో హాస్యం
నవ్య సాహిత్యమంటే ఇరవై వ శతాబ్దిలో పుట్టిన సాహిత్యం .నవ్య సాహిత్యానికి పితామహుడు కందుకూరి .చిలకమర్తీ ,పానుగంటి ఈయన సమకాలికులు .ఈ ముగ్గురుహాస్యరచయితలే.చిలకమర్తి వారిహాస్యం ‘’మడి’’వదల్లెదన్నారు మునిమాణిక్యం .నవలలో హాస్యపు చెణుకులున్నాయి .వీరి మందపాలుడు సంస్కృతతనాటకాలలో విదూషకుని సంతతి వాడే అన్నారుమాస్టారు .వీరి గణపతి అనాకారితనం ,అసభ్యపనులు చూసి నవ్వుతాం .కానీ అది సభ్యతా హాస్యంకాదన్నారు గురూజీ .హాస్యంలో ప్రతిభా ప్రదర్శన మృగ్యం అన్నారు .
వేదం వారి హాస్యం తురకభాషా సంపర్కం తో ‘’మైలపడింది ‘’అన్నారు సార్..మనహాస్యం తురకం నేర్చున్నట్లు కనబడుతుంది .దానితో ఆహాస్యం తెలుగుకాకుండా, మనదికాకుండా పోయిందని తేల్చారు .గురజాడ హాస్యం ఇంగ్లీష్ సంపర్కం తో మైలపడి ,అదీ మనదికాదేమో అనిపిస్తు౦దన్నారు .కన్యాశుల్కం కొందడు భట్టీయాలలో ఇంగ్లీష్ సంపర్కం లేని హాస్య కుశాలమైన పరిహాస భాశితమైన ఘట్టాలులేకపోలేదన్నారు .ముదిగొండ వీరభద్రమూర్తి గారు రాసిన ‘సువర్ణ ధార ‘’కావ్యం హాస్య రచనకాదుకానీ ,కొన్ని ఘట్టాలు హాస్యాశ్రయం కలవి . మార్కండేయం అనే పద్యకావ్యంలో బహు సున్నితహాస్యాన్ని కవి సాధించాడు ,గుప్తంగా దాచిన బంగారు నగలా ఉంది .మార్కండేయుడికి చివరిఘడియలు వచ్చాయి .యమధర్మరాజే స్వయంగా వచ్చి పాశం వేశాడు .అప్పుడు కవి ‘’పాశ బంధిత కంఠుండాబాలకుండు పలికె’’నో దండధర నన్ బలిమిన్ గట్టి కొంచు బో దలచితే కోవిదుడవు .రాను ఫో .శివపూజ పూర్ణమగు వరకు ‘అ౦టాడుకవి ఇందులోహాస్యం పైకి కనబడదన్నారుమాస్టారు .అంతభయంకారాకార భారీ శాల్తీ వస్తే భయపడకుండఈ నాలుగేళ్ల చిన్నిపిల్లాడు ‘’రాను ఫో ‘’అన్నాడుకనుక నవ్వొస్తుంది .అందులోని అసంగత్వం అసహజత్వం హాస్య హేతువులయ్యాయన్నారు మునిశ్రీ .నిజంగా యముడికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటె పసివాడు తన్ను సవాల్ చేయటం ఏమిటని నవ్వి ఊరుకోవాలి .అలాచేయకుండా కోపం తెచ్చుకోవటం హస్యస్ఫోరకమే అయింది కుర్రడిపై యముడికోపమూ అనుచితమే .అనుచితం ఎప్పుడూ నవ్వు పుట్టిస్తు౦దన్నారు సార్.యముడు ‘’ఇప్పటికే నీపూజలు పూర్తవాల్సింది.ఇప్పటికే చాలాలస్యమయింది ‘’అన్నాడు .తనతో సమానమైన వాడితో అనాల్సినమాటలవి. కుర్రకుంకతో అనాల్సినవికావు అంటారు మునిమాణిక్యం .ఏకళన ఉన్నాడో యముడు దున్నపోతుదిగి వస్తుంటే గురుడిలో ఏదో మార్పు గమనించిన మృకండ సూతి ‘’నా వంటి భక్తుణ్ణి హి౦సిస్తావా ?చస్తావురా అబ్బాయ్ ‘’అన్నాడు ఈ క్షీర కంఠడు లోకపాలకునికినీతి బోధించటం మరీ హాస్యాస్పదం అని తేల్చారు సార్.అంతటితో ఊరుకోక యముడిని ‘’మహిష వాహనా ‘’అన్నాడు అంటే ఇంత బుద్ధిలేని వాడివా అని అర్ధం. తనకు ఆమాటకు మాస్టారికి ఫక్కున నవ్వోచ్చిందట .అప్పుడాబాలుడు ‘’నీతోమాట్లాడటానికి నాకు తీరికలేదు ‘’అంటాడు .ఎంతధీమా ?ఈ సామాన్యుడుఒక అసామన్యుడిని అంత మాట అనటం పూర్తిగా హాస్యాస్పదమే అన్నారు మునిమాణిక్యం .
యముడు గమ్మున ఊరుకొంటే బాగుండేది .’’నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని తనడబ్బా తాను బాగా వాయి౦చు కొని ‘’అట్టి ప్రతాపవంతుని ,మహాత్ముని నన్ను తృణీకరిస్తావా చిట్టెముగట్టు భక్తిగల జిట్టెడ బొట్టెడ ‘’అన్నాడు. తనగొప్ప తానె చెప్పుకోవాల్సిన అవస్థ వచ్చినందుకు మనకు నవ్వూ జాలీ వస్తాయి .ఆతర్వాత ఆబొట్టెడు యముణ్ణి ‘’పదంబు రావడి ఎత్తి దండధరు బోర ఫెడీలున ‘’తన్నాడు .ఆతన్నుకు యముడు ఒరిగి నిలబడి నెత్తురు కక్కుకొన్నాడు .ఇదంతా శివ మాహాత్మ్యం అనుకోండి .ఆతర్వాత గ్రంథకర్త ఒక విసురు విసుర్తాడు ‘’నెత్తురులను గ్రక్కుచు యముడు దోరెను దున్నయు బారెనయ్యడన్ ‘’యముడు చచ్చాడట ,దున్న మాత్రం పారిపోయిందట. ఇవన్నీ తనకు విపరీతంగా నవ్వు పుట్టి౦చాయని మునిమాణిక్యం నరసి౦హారావుగారు చెప్పారు ..
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 16వ భాగం.25.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 16వ భాగం.25.10.22

Posted in రచనలు | Leave a comment

సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీకథలు

సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీ కథలు

ప్రముఖ రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతల కుమారుడు శ్రీనివాస్ మరణాన్ని తట్టుకొని అతని స్మారకం గా సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహించి బహుమతులు అందించి ఆ కథలను రమ్యభారతి ‘’ఆగస్ట్ –అక్టోబర్ ‘ప్రత్యేక సంచికగా తీసుకురావటం, శ్రీనివాస్ ఆత్మకు గొప్ప శాంతిని చేకూర్చి ఉంటుంది .ఈ కథల విశేషాలు సింగిల్ వాక్యాలలో మీముందుంచుతున్నాను .

  మొదటి బహుమతిమరీదు వేణు పొందిన  కథ –ఒకరిప్ తోసరి .ప్రేమ పిచ్చి ఒకడిని పాతాళంలోకి నెడితే ఆమెను అమెరికా పంపింది .కరోనాతో అతడు చనిపోతే ఆమెకు తెలిసి వాట్సాప్ లో ‘’రిప్ ‘’పెట్టి,లిప్ మూసుకొని  సరిపుచ్చింది ప్రేమ ఒకరికి త్యాగం మరొకరికి భోగం అయింది .అది పొందలేని ప్రతివారిదీ దీర్ఘరోగమేఅయింది .

జి .రంగబాబు కథ’’అసలైన పూజ ‘’రెండవ బహుమతి పొందింది .ప్రతిదీ ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేసి బుర్రల్ని కంగాళీ చేయటం వెర్రితనం. అది భక్తి విషయంలో ముదిరి అతి అయితే, కొడుకే ‘’మనసు ముఖ్యంకాని మన భక్తి మనకు ముఖ్యం ‘’అని బుద్ధి చెబితే ఆర్ధం చేసుకుని తనకళ్ళు తెరిపించిన కొడుకును అభినందించింది కన్నతల్లి.

పాణ్యం దత్త శర్మ రాసిన ‘’నేను వస్తలేను’’కథ మూడవ బహుమతి పొందింది .హజ్ యాత్రకు మొహనత్ చేసి కమాయించిన  డబ్బుతోనే వెళ్లాలని ఖుర్ ఆన్  చెప్పిందని ,ప్రభుత్వం డబ్బుతో పంపే యాత్రకు ‘’నేను వస్తలేను ‘’  అని చెప్పిన ముస్లిం పెద్దాయన ,ఆయన మనసు అర్ధం చేసుకొన్న కొడుకుఅభినందనీయులనిపిస్తారు .

  తర్వాతవన్నీ ప్రోత్సాహక బహుమతులు పొందిన కథలు .విరిగిపోయిన బొమ్మలో అమ్మ ఉందని బొమ్మకొన్న అమ్మలేని పిల్ల ,నల్లగా ఉ౦డేకుర్రాడు చానళ్ళ  ప్రభావంతో తెల్లబడటానికి పాలలో వాషింగ్ పౌడర్ కలిపితాగటం ,’’నాభర్తా,పిల్లలు చల్లగా ఉండాలి ‘’అనిడైరీలో అన్నిపెజీల్లో అమ్మరాసిన వాక్యాలు పేర్చిన అన్నం మెతుకుల్లా ఉండటం ,అమ్మా నాన్నల్ని  ఇంకో ఫామిలీ గా లెక్కపెట్టే ఇల్లు అద్దెకు వద్దన్నఅతని మాటకు ఓనరమ్మ అమెరికాలో ఉన్న కొడుకుకుటుంబం  ఫోటో చూసి ,కన్నపేగు కదిలినట్లు౦డటం ,నిజమైన సాహసం సెల్ఫీకాదు ప్రాణాలను కాపాడేవారిదే ,ముఖ్యంగా మన సైనికులది అని ,ప్రాణదానానికి ఉపయోగపడే రక్తానికి కులం అడ్డురాదని ,తెగించే దా ‘’రుణదాతలు ‘’గురించి తెలిసి అండగా ఉంటామన్న మెసేజ్ లు ,ఎవరో ఎప్పుడో రాసి ప్రసిద్ధి చెందినకథను శీర్షికమార్చి పత్రికకు పంపెసాహసి ,పని మనిషి రోగం కనుక్కొని జీత౦తో పాటు మందులూ కొనిచ్చి తనకు పెరిగిన జీతం ఇకనుంచి ఆ అమ్మాయికే  ఖర్చు పెడతానన్న యజమానురాలు .ఇవన్నీ ఆయా కథలలోని దినుసులు .మనసునచ్చే విషయాలు .సామాజిక అంశాలు .

 మొదటి మూడు బహుమతులు తో పాటు ప్రోత్సాహక బహుమతులు పొందినవారికీ ,ఎంపిక చేసిన సమర్ధులకు ,బహుమతి ప్రదానం చేసిన పుష్పాదేవి దంపతులకు ,ఇదంతా ప్రత్యేక సంచికలో పొందుపరచిన రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్ కు అభినందనలు .ఇదంతా ఈ సంచికలో ముఖ్యభాగమైన ప్రధాన ఆకర్షణ.

తర్వాత పుస్తకాల సమీక్ష,నానీలు ,సాహిత్య సమాచారం ,పాఠకుల చర్చ ,ఎందరో మహానుభావులు ,మంచికథలవలన మంచి సమాజం వస్తుందనే బిక్కునూరి వ్యాసం ,సాహితీ సభల సమాచార చిత్రాలు ,హైకూలు నానీలు ,అడిగోపులకవిత ,వంశీ స్వర్ణోత్సవ కథా సంకలనం పై చలపాక సమీక్ష తోపాటు ముఖ చిత్రంగా ఈయేటి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ గ్రహీతలు లతో సంచిక ఆకర్షణీయంగా,విజ్ఞాన దాయకంగా  ఉంది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment