ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

33-పెరూ వియన్ సాహిత్యం

ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ  ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక  ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన ‘’హేల్లిస్ కవిత్వం ‘’.ఈ కవిత్వం లో  ఆనాటి నిత్యకృత్య వ్యవహారాలను ‘’హరావేక్ ‘’అనేకవి గానం చేస్తే తరతరాలకు వ్యాపించాయి .జానపద గాధలు ఆండీయన్ ప్రపంచ పుట్టుక,గిట్టుక ,వ్యాప్తి  గురించి చెప్పేవిగా ఉండేవి .ఇవన్నీ ఈనాటికీ సజీవంగా ఉండటానికి ‘’ఇంకా గార్సిలసో ‘’వంటి మేగజైన్లె ముఖ్యకారణం .ఇవే క్వేచువా కవిత్వం ,గుయామన్ పోమా డిఆయల్సా మైదాలజి కవిత్వం లను వెతికి వెలుగు లోకి తెచ్చాయి .వీటిని కవిత్వంగా గుర్తి౦చ టానికి చాలాకాలం పట్టింది .1905లో జోస్ డి లా ఆగేరో ప్రకటించిన దానిప్రకారం స్వతంత్ర పెరు సాహిత్యం ప్రి హిస్పానిక్ సంప్రదాయానికి చెందింది కనుక పెద్దగా లెక్కలోకి రాదనీ ,కొత్తదనం లేనిదని అన్నాడు .ఆతర్వాత 20వ శతాబ్దం లో విశ్లేషకులు అతని భావాలను తప్పుపట్టి ప్రి హిస్పానిక్ సాహిత్య విలువలను గుర్తించి మహోపకారం చేశారు .ప్రి హిస్పానిక్ సాహిత్య మిత్స్,లెజెండ్స్ లో కొన్ని ముఖ్యమైన వాటిని తెలుసుకొందాం –అడాల్ఫో వీన్ రిచ్-తర్మాప్ పచ్చా హువారే ,జార్జి బసాడ్రే-లా లిటరియా ఇన్కా,జోస్ మేరియా ఆర్గెడస్  -హోరాచి వ్రాతప్రతిని చేసిన అనువాదం ,మార్టిన్ లీన్ హార్డ్ –లా వోజ్ య్సు హోఎల్లా,ఆంటోనియో కార్లేజో పోలార్ –ఎస్క్రిబిర్ ఎన్ ఎల్ ఎయిర్ ,ఎడ్మ౦డో బెండజు-లిటరేచర్ క్వేచువా .

  పెరు దేశాన్ని స్పెయిన్ దేశం దాడి చేసి ఆక్రమించినప్పుడు కొంత సాహిత్య సృజన జరిగింది 1532 నవంబర్ 15నుంచి ఈకాలం కజామార్కా లో ప్రారంభం .అప్పుడే చివరి ఇన్కా రాజు అలాహులాల్పా ను లోబరచుకొని ఇన్కా సామ్రాజ్యాన్ని సర్వ నాశనం చేసింది  స్పెయిన్ .ఈకాలపు సాహిత్యం ప్రకృతి పైనే ఎక్కువగా వచ్చింది .క్రానికల్స్ లో ఇవి భద్రపరచారు .ఫ్రాన్సిస్కో కార్రిలియో అనే క్రానికలర్  ఈకాలపు క్రానికల్స్ ను గ్రూపులుగా విభజించాడు .మొదటి గ్రూపు క్రానికల్స్ విజయ విశేషాలున్నవి .వీటిని సైనికులు రచయితలే ఎక్కువగా రాశారు .ఇవి 1532-35కాలానివి .వీరి ఉద్దేశ్యం ప్రజలను నాగరికం చేయటం ,యదార్ధ విశ్వాసం కల్పించటం .అజ్ఞాత వ్యక్తులరచనలుకూడా ఉన్నాయి. తర్వాత వాట్ని ధ్వంసం చేశారు .ఫ్రాన్సిస్కో జేరేజ్ ప్రభుత్వ అధికార క్రానికలర్ ‘’దినెరేటివ్ ఆఫ్ ది కాంక్వెస్ట్ ఆఫ్ పెరు ‘’క్రానికల్ రాశాడు .దీన్ని న్యు కాస్టిల్లీ అంటారు .ఫ్రే గాస్పార్ డికార్వజార్ అనే స్పానిక్ క్రానికలర్ అమెజాన్ నదుల పుట్టుపూర్వోత్తరాలపై విస్తృతంగా1541-42లోరాశాడు .ఇవికాక ఇంకా ముగ్గురు -మిగుల్ డి ఎస్టిల్లె,క్రిస్తోబార్ డిమోలినా ,పెడ్రో సీజ్ డి లేనాన్ లు పెరువార్తలు ,అక్కడి ప్రజలు ,ఆచార వ్యవహారాలగురించి చాలా వివరాలతో రాశారు .అజ్ఞాత రచయితల క్రానికల్స్ లో మేస్టిజో క్రానికల్స్ ,ఇన్కారాజుల రక్తపిపాస,ఆన్డియన్ ప్రపంచ వినాశనం  మొదలైన విషయాలను వివరించారు .గువమాన్ పోమా 1179పేజీల తో స్పెయిన్ రాజు 3వ ఫిలిప్ కు ఒక అర్జీ పంపి  ఆదర్శ ప్రపంచం గురించి రాసి పంపాడు .అధికారుల ఆగడాలు ప్రీస్ట్ ల దౌర్జన్యాలు తెలియజేస్తూ కాలనీ ప్రభుత్వ దుశ్చర్యలను ఎండ గట్టాడు .

  ఆధునిక సాహిత్యం –పెట్రార్క్ రాజును అనుకరించటం గ్రీకు రోమన్ మైథాలజీల విజ్రు౦భణ,పై ఏవగింపు పై సాహిత్య సృజన జరిగింది .లిమాలో అకాడేమియా అంటార్కిట సాహిత్య గ్రూప్ 16,17శతాబ్దాలలో ఏర్పడింది . ఈ అకాడేమియాలో ఫ్రాన్సిస్కో డిఫెగువేరా,డియాగోమెక్సియ డి ఫెర్మా౦గిల్ ఉన్నారు. అజ్ఞాతకవులను ‘’క్లారిండా’’అనీ ,అమరిల్లిస్ అనీ అన్నారు.తర్వాత నియోక్లాసిక్ కవులైన మాన్యూల్ ఎస్సేన్సియో సేగురా ,ఫెలిపే ఫార్డోయ్ అలియాగా మొదలైన వారు మంచికవిత్వం 19వ శతాబ్ది చివరివరకు రాశారు .19వ శతాబ్దిలో రోమా౦టిజం వచ్చి,కార్లోస్ ఆగస్టోసాల్వేర్రి ,జోస్ అర్నాల్డోమార్క్వెజ్ లు ఈ భావంతో గొప్పకవిత్వం రాశారు .వర్ణనాత్మక వచనరచన కూడా ప్రారంభమైంది .మాన్యూల్ అసేన్సియో సేగుర ,రికార్డోపాలమా మొదలైనవారు ఈ ప్రక్రియలో నిష్ణాతులు .ఆధునికకవులు – మాన్యూల్ గొంజేజ్ ప్రాడా,జోస్ సాంటోజ్ కోకానో .మహిళలుమాత్రం రియలిజం ,నేచురలిజం మార్గం పట్టారు .వీరిలో గువానా మాన్యులా గొర్రెట్టి,తెరెసా గొంజాలెజ్ డిఫాన్నింగ్,క్లోరిండామట్తో డిటర్నర్,మెర్సిడెస్కాబెల్లెరో డి కార్బో నేరా ఉన్నారు .

  ఫసిఫిక్ యుద్ధ సంక్షోభం తర్వాత పెరులో మోడర్నిజం ప్రవేశించింది. జోస్ సాన్తోజ్ కోకానో,జోస్ మేరియా ఈగురెన్ దీనిలో ప్రసిద్ధులు .నవలలు నాన్ ఫిక్షన్ కూడా రాశారు .ప్రముఖ సోషలిస్ట్ ఎస్సెయిస్ట్ జోస్ కార్లోస్ మారియాటేగు అవంట్ గార్డె ఉద్యమకారుడు .చిన్న చిన్న గ్రూపులు కూడా వచ్చాయి .1950లో అర్బన్ రియలిజం వచ్చింది .జులియో రేమాన్ రేబెయ్రో ,నాటక రచయితసెబాస్టియన్ సల్జార్ బాండి దీనిలో ముఖ్యులు.రియలిజం లో మేరియో వర్గాస్ ల్లోసా ప్రసిద్ధుడు .నారేటివ్ టెక్నిక్లో ప్రసిద్ధుడు ఆల్ఫ్రెడోబ్రిస్ ఈకేంక్ .కవిత్వం లో సుప్రసిద్ధులు –ఎమిల్లో అడాల్ఫో వెస్ట్ ఫాలెన్ ,జార్జి ఎ డ్యు ర్డోఎలేల్సన్ కార్లోస్ జర్మన్ బెల్లి ,కార్మిన్ ఆలీ .

  సమకాలీన రచయితలలో జైంబెయ్లి ముఖ్యుడు అతని ‘’టెల్ నో వన్’’నవల ప్రఖ్యాతమై సినిమాగా తీశారు .యువ రచయితలలో  ఫెర్నాండో ఇవాస్కి ,ఇవాన్ ధే,ఆస్కార్ మాల్కాకార్లోస్ యుషి మిటోవగైరా ఉన్నారు .బాలసాహిత్యాన్ని ఫ్రాన్సిస్కో ఇజ్క్వేర్డోరియాస్ ,,కారియోలా కార్వల్లో డినునేజ్ వగగైరాలు  రాశారు .బాలసాహిత్యం లో పరిశోధనలు చేసిన వారూ ఉన్నారు .వీరిలో మేరియా రోస్టోవిస్కీ ప్రముఖుడు .పెరూవియన్ ఫేబుల్స్ ను అనలైజ్ చేసినవారూ ఉన్నారు .

  దక్షిణ అమెరికా లో పెరు దేశం  అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రాంతం లో ఉన్నది .ఆండీస్ ప  ర్వతాలు ఇక్కడ ప్రసిద్ధి ,ఇక్కడి మచ్చు చుచ్చు ప్రాంతం ,ఇన్కాలోయ ,మొదలైనవి యాత్రాస్తలాలు .కరెన్సీపేరు’’ సోల్’’.ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం పెరు.స్పానిష్ క్వేచ్చు భాషలు ప్రభుత్వ భాషలు .ఆన్డిస్ పర్వత తూర్పుభాగాన అనేక భాషలు మాట్లాడుతారు .వీరిది రోమన్ కేధలిక్ మతం .ఇక్కడి అక్షరాస్యత శాతం  2007 లెక్కలప్రకారం 92.9  .సెకండరీ స్థాయి వరకు విద్య కంపల్సరి .కొత్త ప్రపంచంలో అత్యున్నత విద్యకు పెరు పేరెన్నికగన్నది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో

ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం

ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని

వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం

కోవిద్ జబ్బును  జబ్బ చరచి

గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం

సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు

 అడవి మనుషుల బాధలేం తెలుసు

 వైద్య౦ కోసం గర్భిణీలను ‘

ముసలీ ముతకాను మంచాలపై

మైళ్ళకు మైళ్ళు మోసుకు వెళ్ళే వారు

తిన్నారో పస్తున్నారో మనకు తెలుసా ?

మన ప్రభుత్వాలకు కళ్ళున్నా చూస్తున్నాయా ?

చెవులున్నా వినిపిస్తున్నాయా ?

తిండి దొరక్క అడవి అక్కలు

‘’పామోలివ్’’ గుత్తుల్ని కోసుకొని

ఆబగా తింటూ ఆకలి తీర్చుకొంటు౦టే

మనం ఇళ్ళల్లో దీపాలు వెలిగిస్తూ

బయటికొచ్చి చప్పట్లు చరుస్తూ

ఓ పోయిందే –ఇట్స్ గాన్, పోయిచ్చే

అని జబ్బలు చరుస్తున్నాం .

అన్నం వండుకోలేని, తినని,ఎప్పుడూ

బయటికి రాని  రాలేని మనుషులను

గుర్తించి ఇళ్ళకు వెళ్లి ఉదార హృదయాలు

ఆహార పొట్లాలు అందించి మా ఊళ్ళో

అదుకొంటు౦టే  ఫోటోలు తీసి పేపర్లలో వేయరు

కాని అధికారులు చేసే గోరంత

సాయానికి కొండంత ప్రచారం చేసి

 ఊదర కొట్టి ఉబ్బేసి కనుసన్నలలో  ఉంటారు

మానవత్వమా నువ్వెక్కడ ?

ప్రచారం మత్తులో మునిగిపోయావా ?

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి-

1-ఒలింపస్ జనరేషన్(1890-1920) –ఈకాలం లో జాతీయ స్పూర్తితో కూడిన రచనలు ఎక్కువగా వచ్చాయి .ఆరచయితలు –మాన్యూల్ ఆర్గేల్లా మోరా ,మాన్యూల్ డి జీసస్ జిమెంజ్ ,పియో విన్క్విజ్ ,రాబర్టోబ్రేనెస్ మేసేన్ ,ఆక్వేల్లో ఈకే వార్రియా ,రికార్డో  ఫెర్మెండేజ్ గార్దియా ,కార్లోస్ గాగిని ,మాన్యూల్ జెంజలేజ్ జేలెడాన్.

2-రిపెర్టరి జనరేషన్(1920-40)-దీనికీ మాగజైన్ ‘’రిపర్టోరియో అమెర్రికానో డిజాక్విన్ గార్సియా మోన్గే’’కు లింకు ఉంది .ఈ కాలం లో లిబరల్ ఆలిగార్కిక్ పాలనలో సంక్షోభం ఏర్పడి,నూతనభావాలు ,శైలి అంటే గ్రోటోస్కో స్టైల్  భయంకర ,భీభత్స హాస్యం ,పారడి,వ్యంగ్యం విజ్రుమ్భించాయి . ఈ రచయితలు –జాక్విన్ గారిక్ మంగే ,ఒమర్ డెంగో,కార్మెల్ లైరా ,మేరియో సాంచో ,మాక్స్ జిమెంజ్.

3-ది40 స్ జనరేషన్ (1940-1960)-ఈ పీరియడ్ సోషల్ డెమోక్రసీ ఏర్పడింది .ప్రశ్నించటం సమాధానం రాబట్టటాలు జరిగాయి .అనేక సాంఘిక సంస్కరణలు అమలయ్యాయి .కొత్త రాజ్యాంగ స్పూర్తి కలిగింది .రచయితలు సాంఘిక సమస్యలు, భూమిపంపిణి,బహుళజాతి కార్పో రేషన్ల పై రచనలు చేశారు .ముఖ్య రచయితలు-జోస్ బాసిలో అకునా ,ఐజాక్ ఫెలిపి అజోఫీఫా ,ఫేబియన్ డోబెల్స్,కారియోస్ లూయీ ఫల్లాస్ ,జాక్విన్ గిటేర్రెజ్,జూలియన్ మార్కేనా ,యోలాండో ఒరియామునో ,జోస్ మారిన్కానాస్ ,కారియో లూయీ సేన్జ్,కారియోస్ సాల్వజార్ హీర్రేరా ,మోసెస్ విన్సేంజి .

4-ది అర్బన్ జనరేషన్(1960-80)-ఈకాలంలో ఆధునికత , యాంత్రికత చోటు చేసుకొన్నాయి .కనుక నగర జీవితమే అందరికీ కథా వస్తువైంది .రచయితలు –ఆల్బర్టో  కానాస్ ,జార్జి చార్పెంటియర్,డేనియల్ గాలేగోస్ ,వర్జీనియా గ్రట్టర్,కార్మెన్ నరంజో ,ఈనిక్ ఓడియో ,శామ్యూల్ రోవెన్స్కి,జోస్ లేనాన్ సాన్చెజ్,లారియానో ఆల్బాన్ ,జూలిఎటా డోబుల్స్ ,జార్జి డెబ్రవో,ఆల్ఫాన్సో చేజ్.

5-డిజెన్చాంట్ మెంట్  జనరేషన్(1980నుండి ఇప్పటి వరకు )-ఈకాలం లో కోస్టా రికా లో కొత్త సాహిత్యం పురుడు పోసుకొన్నది .ఆదినుంచి వస్తున్న సాహిత్యాన్ని నెట్టేసి, వాస్తవికత ప్రవేశించి నేలవిడిచి స్వారి చేసే రచనలు పూర్తిగా మారిపోయి యదార్ధ సంఘటనలకు జీవం పోసి రచనలు చేశారు .ఒకే రకమైన శైలికి స్వస్తి చెప్పి విభిన్నమైన శైలులలో కవిత్వం రచనలు ఆవిర్భవించాయి

  20వ శతాబ్దిలో ఆధునికత ప్రవేశించి జీవన విదానాలలో  పెను మార్పులు వచ్చాయి  .రోబెన్ డోరియో  కోస్టారీకాలోనే స్థిరపడి కవిత్వం ,వ్యాసాలురాసి ప్రచురించాడు .ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో కాకుండా కోస్టా రికాలో మోడర్నిజం కు పెద్దగా ఆకర్షణ లేదు .1965తర్వాత పుట్టినకవులు తమ రచనలను 1990తర్వాత మాత్రమె ప్రచురించారు .వీరిలో జువాన్ ఆన్టిలియాన్,మారికో మోలినా డేల్గడో,మొదలైనవారున్నారు .

 ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు  –రాబర్టోబ్రేనెస్ మేసేన్ –ఎల్ యెన్ సైలేన్సియో కవితలను ,కార్మెన్ లైరా –క్వెంటోస్ డిమి టియా పంచిత,మమితా యునాయ్ మొదలైన నవలలు రాసిన కార్లోస్ ఫలాస్ ,ఎల్ సిటోడి లాస్ ఎబ్రాస్ నవలారచయిత ఫేబియన్ డోబెస్,సీమా డెల్ గోజో కవితా సంపుటి కర్త –ఐజాక్ ఫెలిపి అజోఫీఫా మొదలైనవారు

  ఒకే ఒక కవితా సంపుటి ‘’అలాస్ యెన్ ఫూగా ‘’ తెచ్చిన జోస్ లియాన్ సాన్సేజ్ ,లా ఇస్లా డి లాస్ హోమ్బ్రెస్సోలోస్ నవలకూడా రాశాడు .1970-80కాలం లో రోడాలఫో ఏరియస్,జార్జి ఆర్రియో ,అన ఇస్తాని మొదలైన రచయితలున్నారు .

 టాప్ నైన్ బుక్స్ –1-ఇట్ ఈజ్ ఎవెరిమంకిఫర్ దెం సేల్వెస్-వనేస్సా వుడ్స్ –అడవిమనుషుల శృంగారం పై రచన -2-ఓరో-సిజియా జైక్ 3-గ్రీన్ ఫోనిక్స్ –విలియం ఎల్లెన్ 4-మంకీస్ ఆర్ మేడ్ ఆఫ్ చాకోలేట్స్-జాక్ ఈవింగ్ 5-కోస్టా రికా –ఎ ట్రావెలర్స్ కంపానియన్ –ఆస్కార్ ఆరిస్ 6-ది డెవిల్స్ డీప్-మైకేల్ వాల్లెస్ 7-ది సెంట్ ఆఫ్ జేడ్-డీడీ టార్సియో,8-జురాసిక్ పార్క్ అండ్ లాస్ట్ వరల్డ్ –మైకేల్ క్రిక్టన్ 9-ది యియర్ ఆఫ్ ఫాగ్ –మైకేల్లిరిచ్ మాండ్ .

ప్రపంచ ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు –మాన్యుల్ ఆర్గేల్లో ,జాక్విన్ గార్సియా మోన్గే,గార్మేన్ లైరా ,గార్మేన్ నరెంజో ,కార్లోస్ లూయీ ఫల్లాస్ .

  కోస్టా రిక మధ్య అమెరికాలో  వర్షారణ్య   దేశం .కరేబియన్ ,పసిఫిక్ సముద్రాల అంచున ఉంటుంది .రాజధాని సాన్ జో. సాంస్కృతిక కేంద్ర౦  గోల్డ్ మ్యూజియం కు .అనేకమైన బీచ్ లకు నిలయం .భూభాగంలో ఇకవంతు  అభయారణ్యమే .వన్యమృగ నిలయం .స్పైడర్ మంకీలకు ప్రసిద్ధి  .రోమన్ కేధలిక్ మతానికి నిలయం .స్పానిష్ భాష ప్రజలభాష .భోజనం నేటివ్ అమెరికన్ స్పానిష్ ,ఆఫ్రికన్ వంటకాలు తింటారు .1936లో సమ్మర్ ఒలింపిక్స్ లో ఈ దేశం పాల్గొన్నది .ఫుట్ బాల్ ఇక్కడి ముఖ్యమైన ఆట .బేస్ బాల్ కూడా బాగా ఆడుతారు.97శాతం ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడుతారు .హైస్కూల్ వరకు విద్య ఫ్రీ .కోస్టారికా యూనివర్సిటి ‘’మెరిటోరియస్ యూనివర్సిటిగా ‘’గుర్తింపు పొందింది .టూరిస్ట్ లపాలిటి స్వర్గధామం .టూరిజం వలన ఆదాయం ఎక్కువ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రత్యక్ష పరిచయం

సాహితీ బంధువులకు శుభకామనలు ఇవాల్టితోసరసభారతి పుస్తకాలను 6 ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా పరిచయం చేశాను వీక్షకులకు ధన్యవాదాలు 

   నిన్నరాత్రి అమెరికా షార్లెట్ నుంచి మా అమ్మాయి విజ్జి ఫోన్ చేసి  వాళ్లకు దగ్గరలో ఉంటున్న ఒకావిడ  (పేరేదో చెప్పింది కాని జ్ఞాపకం లేదు ) సరసభారతి బ్లాగు ను అనునిత్యం ఆసక్తిగా ఫాలో అవుతున్నానని ,పుస్తక పరిచయం ప్రాత్యక్ష ప్రసారం కూడా వదలకుండా చూస్తున్నాననిచెప్పిందని ఇంతగా కృషి చేస్తున్నవారెవరూ తనకు  కనిపించలేదని చెప్పిందని చెప్పింది.  ఐతే ఇండియాలోనూ అమెరికాలోనూ పిల్లలకు ”కరోనా  సెలవ”లిచ్చారు కనుక వాళ్ళకోసం నన్ను మంచి నీతి ,కర్తవ్య౦,బాధ్యత ,మానసిక ఉల్లాసం కలిగించే   కథలు  చెబితే  పిల్లలకుకూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారని చెప్పింది . ఐడియా . బాగానే ఉందని పించి ,ఇవాళ రెండు పుస్తకాల పరిచయం త్వరత్వరగా పూర్తిచేసి విరామం      ప్రకటించాను . 
  రేపు 6-4-20 సోమవారం ఉదయం 10 గంనుండి .”కథా సుధ”శీర్షికతో ఉపయుక్త కథలను  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా   చెబుతాను సుమారు 40నిమిషాలలో . దీనిని ఇటీవల ”గో రసం ”వారు శ్రీ శిస్టు సత్యరాజేష్ సంపాదకత్వం లో ప్రచురించిన ”బాలనేస్తాలు ”లోని కథలతో మొదలు పెడతాను -మీ- దుర్గాప్రసాద్ -5-4-20 ఆదివారం -ఉయ్యూరు
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం

పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది

  ఇక్కడ మోడరనిస్మో అనే స్పానిక్ –అమెరికన్ సాహితీ ఉద్యమ౦ 19వ శతాబ్ది మలి దశలో బయల్దేరి ‘’రూబెన్ డేరియో’’ కవి చేత విస్త్రుతమైనది .ఈకవినే ‘’ఫాదర్ ఆఫ్ మోడర్నిజం ‘’అని గౌరవంగా పిలుచుకొంటారు .ఇందులో మూడు స్రవంతులు –రొమా౦టిజం ,సింబాలిజం ,పార్నస్సియనిజం కలిసి ఉన్నాయి .మనోభావాలు ,పాషన్లుఅంటే భావా వేశాలు ఏకస్వరాలనే హార్మనీలు ,దృష్టి అంటే విజన్ లు ,లయలు అన్నీ మహా విశిష్టంగా ,అద్భుత శైలీ విన్యాసాలతో  వాచ్య సంగీతంగా ఇందులో దర్శనమిస్తాయి .ఈ ఉద్యమ౦ ఫిలిప్పీన్స్ తో సహా   స్పానిష్ భాష మాట్లాడే దేశాలన్నిటిలో విస్తృత వ్యాప్తి చెంది,ప్రభావం కలిగించింది .కళాభిరుచి సౌందర్యారాధన లకు ఉద్దీపనకలిగించింది .

   ఈ మోడర్నిస్మో ఉద్యమమే నికారుగ్వా బాహ్య ప్రపంచం పై అత్యంత ప్రభావం చూపింది .ఇదే అసలు సిసలు లాటిన్ అమెరికా సాహిత్యంగా ముద్రవేసుకొన్నది .ఇందులో సౌందర దృష్టి ఎక్కువగా ఉన్నాకూడా కొందరు కవులు సమకాలీన సంఘం పై రచనలు చేశారు సమస్యలు చర్చించారు .20వ శతాబ్దం వచ్చేసరికి కవిత్వ౦ అంతా రాజకీయమయమైపోయింది .దీనికి కారణం చిలియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ పాబ్లో నెరూడా కవి ప్రభావమే .అతన్ని అనుసరించి కవిత్వం రాసినకవి ఎర్నేస్టో కార్డినల్.

  గ్రనాడా –నికారుగ్వా లో1927-29లో ప్రారంభమైన ‘’వాన్ గార్డియా’సాహిత్య ఉద్యమం ను జోస్ కార్నెల్ ఉర్టేకో కవి ప్రారంభించాడు .1931లో ప్రచురితమైన మానిఫెస్టో ప్రకారం ‘’to initiate a struggle to get the public attention through artistic expressions, intellectual scandal, and aggressive criticism”.[4]

  ఈ ఉద్యమం అనేక యూరోపియన్ సాహిత్య ఉద్యమాలపై ప్రభావం చూపి ‘’సర్రియలిజం ‘’ఆవిర్భవానికి కారణమైంది .వాన్ గార్దియా సాహితీ ఉద్యమం ఆధునిక నూతన ఆలోచనలకు విషయాలకు ,ముఖ్యంగా షాకింగ్ నవలలకు దారి చూపింది .

నికారుగ్వన్ రచయితలో కవులు రచయితలూ వ్యాసకర్తలు జర్నలిస్ట్ లు ,విమర్శకులు మొదలైన వారున్నారు .వారిలో కొందరు –క్లారిబెల్ అల్జీరియా ,ఏమిలో ఆల్వరేజ్ లిజార్జా ,మొన్టాల్వన్,జూన్ బీర్ ,గికోకొండా బిల్లి ,యోలాన్దాబ్లాంకో ,ఏర్నేస్టో కార్డినల్,కార్లీ గేటాన్,జాక్విన్ పాసోస్ ,ఆర్టేన్ సియు ,డైసి జమోరా వగైరా .హిస్టరీ ఆర్కి టేక్చర్ లకు ప్రసిద్ధమైన ‘’గ్రనడా ‘’లో ‘’అంతర్జాతీయ పోయెట్రి ఫెస్టివల్ ‘’2005నుంచి జరుగుతోంది .అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన కవులను సాదరంగా ఆహ్వానించి ఈ ఫెస్టివల్ జరుపుతారు .దీనిలో నికారుగ్వన్ సింగర్స్ కమ్మగా పాటలు కచేరీలతో వీనుల విందు చేస్తారు ‘

  నికారుగ్వా దేశం పసిఫిక్ సముద్రం కరేబియన్ సముద్రాలమధ్య ఉన్న సెంట్రల్ అమెరికన్ దేశం .ఇక్కడి సరస్సులు బాగా ఆకర్షిస్తాయి .అగ్నిపర్వతాలకూ నిలయమే .అందుకే ‘’లాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కనోస్ ‘’అంటారు .రాజధాని మానాగువా  .సెంట్రల్ అమెరికాలో అత్యంత పేద దేశం .దీనికంటే కోస్టారికా సురక్షిత ప్రాంతం .దాదాపు అందరూ రోమన్ కేధలిక్ మతస్తులు .ఇక్కడి ‘’మాకువా ‘’అనే డ్రింక్ ప్రసిద్ధం ఈ దేశం లోని వేడిని తట్టుకొవటానికి ఇది తప్పని సరి ,ఫ్రైడ్ రైస్ ,ఉల్లిపాయ,స్వీట్ పెప్పర్,బీన్స్ ఎక్కువ గా ఆహారం .మాంసం తప్పని సరి .భాష –స్పానిష్ తో సహా అన్నీ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-20-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ 

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నానిగబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్

ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ అవటం తో అనేక మహిళా సేవా సంస్థలలో ఆమె సభ్యురాలైంది .వీరందరితోకలిసి 1952లో క్రొత్త వివాహ చట్ట రూపకల్పనకు, అందులో ముఖ్యంగా బాలికల వివాహ వయస్సు పెంచటానికి ఒక కమీషన్ ఏర్పాటు చేసుకొన్నారు . .వీటిపై అందరికి అవగాహన కలిగించటానికి నాని, 1954లో ‘’ది లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఫర్ వుమెన్ ‘’పుస్తకం రాసి ప్రచురించింది .ఇండోనేషియాలో మహిళల స్థానం కోసం రాయబడిన మొట్ట మొదటి పుస్తకం గా ఈ పుస్తకం రికార్డ్ కెక్కింది .బహు భార్యత్వం ను సమర్ధిస్తూ అంతకు ముందు కొద్దికాలం క్రితమే ప్రభుత్వం తేవాలనుకొన్న కొత్త వివాహ చట్టం పై తీవ్రంగా విరుచుకుపడి,స్త్రీలను చైతన్యవంతం చేయటం ప్రారంబించింది .అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం చట్టం చేసినా అమలు లోకి రావటానికి చాలాకాలం పట్టి 1974 లో అమలైంది .దీన దీని ప్రకారం బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా ,బాలుర వివాహ వయస్సు 19 సంవత్సరాలుగా నిర్ణయించారు .ఇదంతా నాని కృషి ఫలితమే .

1955లో మనిలా లో’’ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ యూని వర్సిటి వుమెన్ ‘’సమావేశం జరిగింది .ఈ సమావేశం లో నాని ఇండోనేషియా దేశపు అబ్జర్వర్ గా విధులు నిర్వహించింది .ఆమె శ్రమ, అంకితభావం, సేవా నిరతి అందరి దృష్టి ని ఆకర్షించాయి .దీని ఫలితంగా రెండేళ్ళ తర్వాత ‘’ పౌర బాధ్యతలు ,ప్రజాసేవలో ఆసియా మహిళల భాగస్వామ్యం’’అనే అంశాలపై బాంకాక్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ సెమినార్ లో ఇండోనేషియా ప్రతినిధిగా పాల్గొన్నది .సెమినార్ లో ఇండో నేషియా మహిళలపై ఒక పరిశోధన పత్రం రాసి సమర్పించింది .1958లో శ్రీలంక లోని కొలంబో లో జరిగిన ‘’ఏషియన్ ,ఆఫ్రికన్ వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’లో పాల్గొని ఇతర ప్రతి నిధితులతో కలసి ముక్త కంఠంతో వివాహ చట్టం పూర్తి అమలు కోసం పట్టు బట్టింది. .

1959లో సోయెవాండో నాని స్వీడిష్ స్కాలర్షిప్ గెలుచుకొని శతాబ్దాలపాటు అణగారి పోయిన ఇండోనేషియా మహిళల జీవితాలలో మార్పులపై పరిశోధన చేసింది .మహిళా సమస్యలపై అనేక మహిళా జర్నల్స్ లో చాలా వ్యాసాలు రాసి అ౦దరి దృష్టికి తెచ్చింది .వీటి సాధనకోసం ‘’ప్లాన్నేడ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్ ‘’1957లో స్థాపించి, వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించింది .దీనితోపాటు 1955నుండి ‘’ఇండోనేషియన్ యూని వర్సిటి వుమెన్ అసోసియేషన్ ‘’బాధ్యతలనూ స్వీకరించి సమర్ధంగా నడిపింది .

ఇంతటి మహిళోద్యమ నాయకురాలి జీవితం గురించి ఒక్క పుట్టిన రోజు తప్ప మిగతా వివరాలేవీ దొరకక పోవటం విడ్డూరమే.ఆమె రాసిన ‘’ది ఇండోనేషియన్ మారేజ్ లా అండ్ ఇట్స్ ఇంప్లి మెంటింగ్ రెగ్యులేషన్స్ ‘’పుస్తకం లో చాలా విషయాలు చర్చించింది .వధూవరుల వివాహ వయసు ,భార్యాభర్తల హక్కులు ,బాధ్యతలు ,వైవాహిక ఆస్తి ,విడాకులు ,న్యాయస్థాన నిర్ణయాలు ,వివాహ చట్టం అమలు తీరు ,వివాహ రిజిస్ట్రేషన్ ,వివాహ సర్టిఫికేట్ ,శిక్షా నిబంధనలు మొదలైన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించి ఇండోనేషియామహిళలకు మంచి అవగాహన కలిపించి మహోపకారం చేసింది నాని .ఆమె శతజయంతి కూడా జరిగి పోయింది .కాని గూగుల్ లో ఆదేశం వారు ఆమె గురించి ఏమీ రాయకపోవటం క్షమించరాని విషయం .

                                                                                                                                                                        –                                                                                                                            -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల
ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు ప్రవర్తిస్తూ దాదాపు 15రోజులు గడిపారు .పత్రికలూ టివి లలో మృత్యుభయం వార్తలు చూడలేక ,చూసిన వే మళ్ళీగా సీరియల్స్ చూస్తూ ,పిల్లలను యేమీ అనలేక, వాళ్ళు సెల్ లో ,టాబ్లెట్ లలో గేమ్స్ ఆడుకుంటుంటే మందలించలేక, చదూ కోమని చెప్పాలేక ,ఆడుకోమనటానికి వీలూ లేక ,భార్యపై కోపం ప్రదర్శించలేక భర్తలు ,భర్తలపై సాఫ్ట్ కార్నర్ తో భార్యలూ అత్తామామలపై సాధింపులు మానిన కోడళ్ళు అన్నీ మూసుకొని ఇళ్లలోనే మగ్గిపోతూ ఇదే ఆనందం పరమానందం అనుకొంటూ కన్నీరు పెట్టుకోలేక’’ విలవిల ‘’లాడుతున్నారు మనస్వాతంత్ర్యాన్ని మరెవరో కాజేశారని భ్రమలో .అంతేకాని ఇదంతా మనం చేసుకొన్నప్రారబ్ధమే అనే ‘’ఎరుక’’ రాక పోవటం బాధాకరమే .నరసంచారం లేని రోడ్లు పార్కులు పబ్బులు క్లబ్బులు బార్లు ఆటలు వినోదాలు విందులు ,డేటింగులు ,అర్ధరాత్రి స్వైర విహారాలు పార్కుల్లో అసభ్య శృంగార కేళీ విలాసాలు ,దైవ కళ్యాణాలు మనిషిని అంతర్ముఖం చేశాయా ?చేసి ఉంటె ఎంతో మేలు సమాజానికి కుటుంబాలకు దేశానికీ .ఇదీ జన కీకారణ్యం సంగతి ఇప్పుడు .
ఒక్కసారి అటు అసలు అరణ్యం లోకి తొంగి చూద్దాం .వేటగాళ్ళు రాకపోవటం వలన జంతువులూ ,పక్షులు ‘’కిలకిల’’నవ్వుకొంటున్నాయి ప్రాణహాని తప్పి పోయింది తాత్కాలికంగా నైనా అని ఊపిరి పీల్చుకొంటున్నాయి .’’హమ్మయ్య’’ మళ్ళీ మనజోలికి మనిషి రాకుండా ఉంటె బాగుండునని భావిస్తున్నాయి .చెట్లు ,పొదలు ,లతలు ని౦డుపూలతో ఫలాలతో కనువిందు చేస్తున్నాయి .శుకపికాలు కోయిలలు గొంతెత్తి స్వాతంత్ర్య గీతాలు పాడుతున్నాయా అన్నట్లు కలకల రవాలు చేస్తూ ఆనందంగా పల్టీలు కొడుతూ ,ఇక ఆనందమే అంబరమైతే అన్నట్లు మహా భోగాన్ని అనుభవిస్తున్నాయి .సింహ శార్దూలాలు తమ పెద్దరికం నిలుపుకొంటూ జంతుజాలంతో సఖ్యతగా మెలుగుతున్నాయి .నక్కలు స్వతహాగా వచ్చిన తమజాతి లక్షణాలు జిత్తులు ఎత్తులూ మానేసి ‘’కరటక దమనకుల్లా’’కాకుండా మహా బుద్ధిగా ఉన్నాయి .అడవి పందులు ముస్టులతో నేల త్రవ్వుకొంటూ వీర విహారం చేస్తున్నాయి .భల్లూకాలు’’తమజాతి పిత ‘’జాంబవంతుని పెద్దరికం గుర్తు చేసుకొని పెద్దరికంతో ప్రవర్తిస్తున్నాయి .అడవి ఏనుగులు ,గుర్రాలు పరుగు పందాలు పెట్టుకొని ఆనందం పంచుతున్నాయి .తేనెటీగలు వికసించిన పూల మకరందాన్ని హాయిగా గ్రోలుతూ తుట్టెలు ఇబ్బదడిముబ్బడిగాపెట్టి వాటిని దొంగిలించే దొంగ మానవులు లేక, రాకపోవటంతో అడవి లో’’ తేనె వాకల’’ను ప్రవహింప జేస్తున్నాయి .పూర్వం రుష్యాశ్రమాలుగా ఇప్పుడు అడవి గోచరిస్తోంది సహజీవన సౌందర్యం వికసిస్తోంది .నెమళ్ళు పురి విప్పి ఆనంద నాట్యం చేసి అడవిలో ఇంద్రధనుసులను సృస్టిస్తున్నాయా అనిపిస్తున్నాయి .గుడ్లగూబలు రాత్రిళ్ళే కాక ,పగలూ కళ్ళు ‘’పొడుచు’’కొంటూ మసక కనులతో ఎగురుతున్నాయి .ఎందుకు వీటికి ఆనందం అంటే చైనాలో గబ్బిలాలు పీక్కు తినటం మానేసినందుకు తమజాతి సంపద నష్టం కాకుండా ఉన్నదుకు .
ఎప్పుడో ఎరుక ,ఏనాదులు తిండికి గతిలేక ‘అడవులలో ‘’అలుగు’’లను వేటాడి తినేవారు .నాగరకత బలిసిన దేశాలలో ఇప్పుడు నానా ‘’అలగా జాతులు’’ వాటిని తినటం ఫ్యాషనయి తమ ఉనికికే ప్రమాద ఘంటికలు మ్రోగాక తప్పు తెలుసుకొని అలుగులపై ఆశ హరి౦చు కొని బతుకుతున్నారని సంతోషం వాటిల్లో కనిపిస్తోంది .ఇవే కాదు పాములపై తేళ్ళు జెర్రులూ ఎక్కి స్వారీ చేస్తున్నా కిమ్మనటం లేదు .ఆవులూ దూడలు ఎద్దులూ తమ మాంసం తినటానికి మనుషులు భయపడుతు౦డ టంతో కేరింతలు అ౦బారవాలు రంకెలతో అడవి అంతా ‘’క్షీర సాగరమై’’ అడవిలో ‘’నాద కచేరీ ‘’చేస్తున్నాయి విస్త్రుతానందం తో.కాకులు కోకిలలను సాకుతున్నాయి. గోరువంకలు చిలుకలతో సంసార సౌఖ్యం అనుభవిస్తున్నాయి .వాల్మీకి వచ్చి ‘’మా నిషాద ‘’అంటూ ఆక్రోశించాల్సిన అవసరమే కనిపించటంలేదు .చిట్టిపొట్టి పిచుకలు గూళ్ళు అనంతంగా కట్టుకొని గుట్టుగా గూళ్ళల్లో కాపురాలు చేసుకొంటూ కిచకిచలతో సంతోషం పంచుతున్నాయి . దంతాలు పీక్కుపోయే వారి భయం లేకపోవటం తో, హాయిగా సరస్సులలో జలక్రీడలాడుతూ తొండాలతో నీళ్ళు చల్లుకొంటూ ,రతికేళి లో మైమరచి మదస్రావంతో వి౦త వాసనలు వ్యాపింపజేస్తూ తిరుగుతున్నాయి .సరస్సుల్లో ‘’మకరి’’ఉన్నా , ,’’కరి’’ని ఏమీ చేయకుండా ,’’గజేంద్ర మోక్షం’’ దృశ్యం పునరావృత్తం కాకుండా స్నేహహస్తం చాచి’’ హస్తి’’తో కరచాలనం చేస్తోందా అనిపిస్తోంది .చారల చారల జీబ్రాలుదుముకుతూ పరుగులు తీస్తూ తమ అందాన్నీ హోయలను ఒలకబోస్తున్నాయి . ఒంటెలు, అల్ జజీరాలు మెడ సాచే అవసరం లేకుండా చెట్లు కిందకి వంగి మిత్రత్వం నెరుపుతున్నాయి .ఉడతలు ,కుందేళ్ళు ,జింకలు, దుప్పులు వేటగాళ్ళ భయం లేనదున మహా ఆనందంగా యెగిరి గంతులేస్తున్నాయి .వాటి ఆనందానికి పట్టపగ్గాలు లేవు .ఖడ్గమృగాలు చూపుల గా౦భీర్యమే కాని హింసా ధోరణి ప్రదర్శించటం లేదు.అడవి దున్నలు స్వైర విహారం చేస్తున్నాయి.కోతులు కొండముచ్చుల ‘’కిచకిచ’’లతో మర్కట కిశోర న్యాయంగా తమపిల్లలను పొట్ట కింద కరుచుకొని గెంతుతూ దుముకుతూ పళ్ళు తింటూ తినిపిస్తూ శాఖాచంక్రమణాలు చేస్తూ ఉయ్యాలలూగుతూ చెట్లకు వింత శోభనే తెస్తున్నాయి. మరి ఈజంతు, పక్షులకు’’ అంటు’’’’అంటూ ఏమీ లేదు .స్వేచ్చగా జీవిస్తున్నాయి కరోనా భయం లేని జీవరాశి గా మన్ననలు పొందుతున్నాయి .అరణ్య౦ లో మానవ మృగాలు కలిగించిన భీభత్సం ,ప్రకృతి వినాశనం ,దెబ్బతీసిన పర్యావరణ సమతౌల్యం ,జంతుహింస అంతా వాటికి ఒకప్పుడు ‘’విల విల ‘’గా ఉన్నా, నేడు కరోనా పుణ్యమా అని అక్కడ అంతా’’కలకలా’’ రావాలే .శృతిసౌభగాలే . మనకు మాత్రం ‘’విల విల ‘’లే .మనం చేసుకొన్న పాపమే అదంతా . ఆరణ్య కలకలలు చూస్తుంటే సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి శివతాండవం లోని ‘’ఏమానందము ఇలాతలమున ‘’అన్న గేయభాగం గుర్తుకొస్తోంది .ఇంత ఆనందం ఇంతకు ముందెన్నడూ అడవి జీవజాలం అనుభవించి ఉండదు . మనకొక జాగృతి ,వాటికొక సుకృతి .
కొసమెరుపు –మూడు రోజులక్రితం మా అబ్బాయి శర్మ మెయిల్ లో ఇలా ఆలోచించి రాస్తే ఎలా ఉంటుందో చూడమని హింట్ ఇచ్చాడు .వాడు ఊహించినట్లు వచ్చిందో లేదో నాకు తెలీదుకాని ఈ సాయంత్రం కంప్యూటర్ ముదు కూచుని శీర్షిక కోసం తడుముకొని, తట్టగానే ఇక ‘’కొట్టటం’’ ప్రారంభించి నాన్ స్టాప్ గా రాసి పూర్తి చేశాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ
కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు ,కూర పెరుగు, మంచినీటిపాకెట్ ,అన్నం సంబారులతో ఒక పాకెట్ తయారు చేయించి ,రోజుకు కనీసం 50 మందికి ఆహార పాకెట్లు స్వయంగాఇళ్ళకు వెళ్లి అంద జేయటం ప్రారంభింఛి గత అయిదు రోజులుగా మానవత్వం చాటుతున్నారు .అందులో శ్రీను తనకారులో ఈ బాచ్ ను ఆహారపాకేట్ లతో సహా తీసుకు వెళ్లి డోర్ డెలివరి చేసి ఎంతో సాయపడుతున్నాడు .
ఇప్పటికే రెండు రోజులు అతనే స్పాన్సర్ .ఇవాళ సరస భారతి స్పాన్సర్ చేస్తుందని మా అబ్బాయి రమణ నాకు చెప్పి ,రావి చెట్టు బజారు లో ఉన్న కోటేశ్వరరావు కేటరింగ్ కేంద్రం దగ్గర నాతో ,ఒంటిమిట్ట డాక్టర్ శివకుమార్ గారితో
అర్హులకు పాకెట్లు ఇప్పించే పని మొదలుపెట్టించి ,పెద్దవంతెనదగ్గర రిక్షా వారికీ ,బసవయ్య చెరువు దగ్గరున్న ముస్లిం సోదర సోదరీమణులకు ,గురజాడ డొంకదగ్గర ఉన్న ఎరుకల ఏనాది వారికీ మాచేత ఈ బృందం ఆహార పొట్లాలు ఇప్పించి మాకూ ఆపుణ్య౦ లో వాటా దక్కెట్లు చేశారు .ఈఎరుకలకు వేసుకోవటానికి కళ్ళకు చెప్పులు కూడా కొనుక్కోలేని గర్భిణీ స్త్రీలు కూడా ఉండటం గమనించి ఆకుటు౦బాలవారికి 12 జతల చెప్పులు కూడా మాతో అందజేయటంమరో విశేషం .కేటరింగ్ అతను కోటేశ్వరరావు ,అతని పిల్లలు కుటుంబం ఈ వితరణకార్యక్రమం లో భాగస్వామి అయి, చాలాతక్కువ రేటులో ఆహార పాకెట్లు తయారు చేసి రోజూ అందివ్వటం మరో ముఖ్య విషయం .అందుకే ఉయ్యూరులో మానవత్వం పరిమళించింది అని పించింది .మాటల్లో కాక, చేతల్లో మానవత్వం చూపిన వీరందరికీ మనః పూర్వక అభినందనలు .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కరోనా కల్యాణం

కరోనా కల్యాణం
రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి కర్ర చివర గిన్నె మేకుతో బిగించి అందులో నాకు నైవేద్యం పెడుతున్నావ్ పోకిరి సినిమాలో ఆలీ అలాటి కర్ర డిప్ప తో అడుక్కున్నట్లు .
పూజారి -క్షమించాలి రామయ్యా .కరోనా వైరస్ భయం వల్ల అలాచేస్తున్నాను .ఇంకో పదిహేను రోజులు తప్పదు .
రామ- –నీ భయం చూస్తె –కమలహాసన్ ‘’తెనాలి’’ సినిమాలో బతుకు ,భయం చావు భయం ,తింటే భయం, తినకపోతే భయం, కూచుంటే భయం, నుంచుంటే భయం అంటూ డాక్టర్ తో ‘’భయం దండకం’’ చదివినట్లుంది .అది సరే .పొద్దున్న సుప్రభాతం లేదు ,బాలభోగం లేదు, నైవేద్యమూ అంత౦త మాత్రమె,వండిన గిన్నెలుమాత్రం పెద్దవే తెస్తున్నావ్ .నాకుమాత్రం మూతికి వాసన చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నావ్ .భక్తులరద్దీ కూడా లేదు .అప్పుడొకరు అప్పుడొకరు తప్ప.
పూజారి –స్వామీ !ఇది దేవరహస్యం .ఎవరికీచెప్పలేను .తప్పనిపించినా తప్పటం లేదు ప్రభూ
దేవుడు -అదేదో బద్దలు చెయ్యి
పూజారి –కష్టం స్వామీ .
రామ- –నన్నే చెప్పమంటావా .నువ్వే చెబుతావా
పూజారి –సర్వాంతర్యామివి నీకు తెలియని రహస్యాలు౦టాయా రామయతండ్రీ .నువ్వెందుకు లే. నేనే చెప్పి పాపప్రక్షాళన చేసుకొంటా.ఆలయ చైర్మన్ ,కమిటీ మెంబర్లు అందరికీ ఇళ్ళకు ప్రసాదాలు పంపకపోతే రోజూ ప్రసాదం ‘’పడి ‘’మంజూరు చేయరు .నువ్వు తినేదిలేదు, నేనూ నాపిల్లలూ తినేది లేదు .దేవుడి సొమ్ము దెయ్యాలపాలు అంటే ఇదేనేమో స్వామీ మన్నించు .
అయినా ఇన్ని సినిమా కబుర్లు చెబుతున్నావ్ నీకెలా తెలుసు ?
రామ- –గుడిలో టివి ఉందిగా .నువ్వు ఆన్ చేసి నీమానాన నువ్వు పొతే కాలక్షేపం లేక చెత్తలన్నీ చూడాల్సోస్తోంది .ఖర్మ .అది సరే ఇవాళ శ్రీరామనవమి కదా విశేషం ,కల్యాణం ఉన్నాయా ?ఇవాళాపస్తేనా ?
పూజారి- లేకేం ప్రభో .అన్నీ జరిపిస్తా .ట్రస్టీ గారు 10కిలోలబెల్లం ,దానికి సరిపడా దినుసులు పానకం కోసం కొన్నారని చక్రపొంగలి పులిహోర నైవేద్యాలకూ భారీ ఏర్పాటు చేశారని కబురపి౦చారు .
రామ –ఐతే నా పుణ్యం ఈరోజు పుచ్చిన్దన్నమాట .ఆ సరుకు లేవీ ఇక్కడ కనబడటం లేదే .
పూజారి –ఓయి తెలివి తక్కువ రామయ్యా !అవి రసీదులకు ,బిల్లులకే కాని వినియోగానికి కాదని నీకు తెలీదా”?
రామ –అయ్యో రామ .ఇదో భాగవతమా ?ఇంతకీ కల్యాణం అయినా ఘనం గా చేస్తావా ?దాని ఏర్పాట్లు ఎలా ఉన్నాయ్ ?
పూజారి –ఘనంగానే మాటల్లో .చేతల్లో మాత్రం ఏమీ ఉండదు .అరె గుట్టుచేప్పేశానే ..నూతనవస్త్రాలు ,పూజా సామగ్రి,తలంబ్రాల బియ్యం ,దండలు మేళాలు –
రామ –ఎంతకమ్మని మాటలు చెప్పావయ్యా
పూజారి –నీకు ఆత్రం ఎక్కువ కోదండ రామా .అవి కొందామంటే దుకాణాలు ఉదయం 9కే బంద్ ట .అవేమీ కుదరవన్నాడు ట్రస్టీ .
రామ –నాసంతోషం పై పానకం నీళ్ళు కుమ్మరించావు కదయ్యా .ఇవీ కొంటాడా కొన్నట్లే అనుకోమంటాడా
పూజారి –ప్రత్యేకించిచెప్పేదేమీ లేదు స్వామీ .అన్నిటికీ ల కేత్వమిస్తే , దాకు కొమ్మిస్తేనే.అంటే ‘’లేదు ‘’అని అర్ధం అని చెప్పాలా ,సర్వాంతర్యామి ?
రామా –అసలు రేపు కల్యాణం ఎలా నిర్వహిస్తావ్ ?
పూజారి –సీతమ్మతల్లి నీ ప్రక్కన కూర్చోబెడదామంటే ‘’టచ్ ‘’భయం .నిరుటి కొబ్బరి చిప్పలు లు మంగళసూత్రాలు మట్టెలూ ,ఉత్తర జంధ్యాలు ఉన్నాయిలే .నిత్యపూజకు పూవులేలేవు .ఇక దండలేక్కడి నుంచి తేనయ్యా ,?అర్ధం చేసుకోవూ .మామూలుగా వాడే అక్షితలే తలంబ్రాలుగా వాడుతా .పీటలపై కూర్చుని కల్యాణం జరిపేవారు ఉండరుకనుక .కూతా మేతా రెండూ నేనే . భక్తులకూ ప్రవేశం లేదు కనుక ఇంట్లో చేసిన వంటలే నైవేద్యం .ఎలాగూ జీలకర్రా బెల్లం ఇంట్లో ఉండేవే కనుక నూరించి తెచ్చి మీ దంపతుల శిరసులపై నేనే ఉంచి మా౦గల్యాలూ వగైరా మీరు చేసినట్లే యాక్ట్ చేసి ,మా౦గల్య ధారణా నేనే చేసి సారీస్వామీ నువ్వు చేసినట్లుగా నేనే నటించి ఆపనీ చేస్తాను .తలంబ్రాలు కూడా నేనే పోస్తాను మీ ఇద్దరికీ .మేళాలు తాళాలు ఉండరాదుకనుక దేవుడిగంటే ‘’నౌబత్ ఖానా ‘’అనుకోని నెమ్మదిగా వినిపించీ వినిపిచాకుండా ఆ ఆవిడతో కొట్టించి తంతు జరిపిస్తా . సమ్మతమేనా రామా ?
రామ –ఇదోటా నా ఇస్టా యిష్టా లతోనే ఇవన్నీ చేస్తున్నట్లు ఆపోజోకటి .సరే అలాగే అఘోరించు .
పూజారి –కోపం వచ్చింది దేవరకు . స్వామీ –మొత్తం పావుగంటలో గుంటకొట్టిగంట వాయి౦ చేస్తాగా డోంట్ వర్రీ.
రామ –వర్రీ లేదు కర్రీ లేదు .ఇక ఆలస్యం చేయకుండా తంతు పూర్తి చెయ్యి .ఇవీ ‘’ఆలీ చిప్పలతోనే ‘’చేస్తావా ?
పూజారి –ఎంతమాట .తప్పదు స్వామి .కనీస దూరం ,ముక్కుకు’’ ముసుగు ‘’అదే లే స్వామీ ‘’మాస్కు ‘’ నాకూ ,మీ దంపతులకూ తప్పదు.
రామ –అంటే’’ కరోనా కల్యాణం’’ జరిపిస్తావన్నమాట.
పూజారి –అంతేగా ,అంతే మరి.

సీన్ -2-వైకుంఠం
లక్ష్మి -నాథా! వామా౦క౦ మీద ఎప్పుడూ ఉండే నన్ను దూరంగా పీఠం మీద కూర్చోపెట్టి వినోదం చూస్తున్నారు .అంత అంటరాని దానినైపోయానా ?
విష్ణు –లేదు శ్రీదేవీ !జాగ్రత్త పడుతున్నా .అదేదో క్రిమి ప్రపంచమంతా పాకి భయపెడుతోందట .ఇక్కడికి కూడా వచ్చిందేమో అని భయం
లక్ష్మి –వస్తే ఏం చేస్తుంది .అసలు ఎలా వస్తుంది ఇక్కడికి .
విష్ణు –మనభక్తులు ఇప్పుడు భారత దేశం లోనే కాదు ప్రపంచమంతా ఉన్నారు ఎక్కడ ఏ దేశం లో ఏ భక్తుడి పుణ్యమో పుచ్చి ఇక్కడికి రావచ్చు. అతడు కరోనా బాదితుడూకావచ్చు.
లక్ష్మి -ఐతే
విష్ణు –ఆతను వెంటతెచ్చే క్రిమి మనం తాకితే దాని బారి పడినట్లే .స్పర్శ వల్ల వ్యాపిస్తుందట ఆజబ్బు .అందుకే నీకూ నాకూ అంత౦ దూరం .మన మధ్య ముద్దులు ముచ్చట్లు సరసాలు సల్లాపాలు కౌగిలింతలూ కేరింతలు ఇక బంద్.సమాన దూరమే మనల్ని కాపాడేది .
లక్ష్మి –మన౦ అన్నిటికీ అతీతులం .మనల్నేవరూ ఎమీచేయ లేరని ధీమాతో ఉన్నాం .మనకీ కస్టాలేమిటి స్వామీ ?
విష్ణు –ఆ క్రిమి మనకంటే శక్తివంతం .దానిముందు నా చక్రాయుధం శివుడి త్రిశూలం ఇంద్రుని వజ్రాయుధం కూడా బలాదూర్ .అందుకే అన్ని జాగ్రత్తలు .
లక్ష్మి –మూతికి ఎదోకట్టుకొన్నారేమిటి నాధా?
విష్ణు –అదే ఇప్పుడు వజ్రకవచం అందరి పాలిట .నీకూ ఒకటి తయారు చేయించా ఇదిగో కట్టుకో .
లక్ష్మి –ఇదికట్టుకొని మాట్లాడితే పెదిమలుకదుల్తున్నాయేకాని శబ్దం బయటికి రావట్లేదు .అగ్గి రాముడు సినిమాలో మూతికీ ముక్కుకూ కళ్ళకూ రామారావు గుడ్డకట్టుకొన్నట్లుంది .
ఈ బాధ తప్పదా నాధా?
విష్ణు –ఇంకో పదిహేను రోజులు ఈ అవస్థ తప్పదు దేవీ భరించాలి. మనకోసం మన లోకం మన పిల్లలు మనవలు మనవరాళ్ళు ,దాస దాసీ జనం కోసం కోసం .వాళ్ళకీ ఈ గుడ్డలు తయారు చేయిస్తున్నాను .
శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?
చైనా ఊహాన్ సిటి లో కిందటి డిసెంబర్ లో బయల్దేరిన కరోనా వైరస్ నాన్ స్టాప్ గా 110ప్రపంచ దేశాలను చుట్టేసింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది .దీని విస్తృత వ్యాప్తి వలన ప్రపంచఆర్ధిక పరిస్థితి ,మార్కెట్ వాణిజ్యం పై విపరీత మైన ఫలితాలు చూపి ,మనుషులను’’ శవాలు’’గా మార్చటమేకాక’’ పెను సవాలు’’గా మారింది .ముందు చూపుగా ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు విశ్వవిపణి ని దృష్టిలో పెట్టుకొని కోతలు విధించాయి .దీనివలన ఆర్ధిక సహకార సంస్థలు ,అభి వృద్ధి సంస్థలు వెనకడుగు వేశాయి .అదే సమయం లో కరోనా వైరస్ వలన గ్లోబల్ ఎకానమీ పై ప్రభావం కలిగించి ,ప్రపంచవ్యాప్త మార్కెట్లు కుదేలైపోయాయి .స్టాక్ ధరలు ,బాండ్ ల ధరలు కుంచించుకు పోయాయి .కరోనా వైరస్ వలన ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు అనేదానికన్నా ,నివారణ చర్యలు చేబట్టటానికి ఆర్ధిక పరిపుష్టి పూర్తిగా దెబ్బతిని పోయినందుకు ఎక్కువ బాధపడాల్సి వస్తోంది .ఇదే పెద్ద నష్టం గా కనిపిస్తోంది .గ్లోబల్ రిసేర్చ్ లో ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ కు చెందిన ‘’బెన్ మేయో ‘’దీనిపై స్పందిస్తూ ‘’చైనా చేసినట్లు అన్ని దేశాలు లాకౌట్ ఇష్టం వచ్చినట్లు దామాషా ప్రకారం కాక ప్రకటిస్తే ప్రపంచ ఆర్ధిక స్థితి బలహీనమై ,విపరీతమైన భయం కలిగిస్తుంది. అంటే’’ పానిక్’’ గా మారుతుంది ,గ్లోబల్ ఎకానమీ పెరుగుదల 2020లో2.9గా ఉండాల్సింది ,2.4కు పడిపోతుంది ,ఉత్పత్తి రంగం దెబ్బతిని ఉత్పత్తి తగ్గుదల అవుతుంది .చైనా ఈ ప్రభావాన్ని పొందటం వల దానిప్రభావం ఇతరదేశాలపైనా పడింది .ఆసియా ఫసిఫిక్ ఎకనామీ లైన వియత్నాం సింగపూర్ దక్షిణ కొరియాలు దెబ్బతినిపోయాయి .
సేవా సెక్టార్లు విపరీతంగా దెబ్బతిని, బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్ లో అతిపెద్దదైన,విస్తృతమైన వినియోగదారు మార్కెట్ -కన్సూమర్ మార్కెట్ ఫిబ్రవరిలోనే కుంచించుకు పోయింది .గ్లోబల్ ఎకానమీ అనిశ్చితం లో ఉండటం లో ప్రపంచ వ్యాప్త ఆర్డర్లు లేకపోవటం కూడా ముఖ్యకారణం .దీనివలన విశ్వవ్యాప్త ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోయి,ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయాయి .ప్రొడక్షన్ కట్ కు ఒపెక్కూ దాని అనుబంధ సంస్థలకు ఒప్పందం పై భేదాభిప్రాయం ,జగడం రావటం తో ఇటీవల మళ్ళీ ఆయిల్ ధరలు ఇంకా తగ్గిపోయాయి .కాని భారత్ సహా ప్రభుత్వాలు వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించకపోవటం శోచనీయం .’’కరోనా వైరస్ ఎపిక్ సెంటర్ ఐన చైనా ‘’క్రూడాయిల్ ను అత్యధికంగా దిగుమతి చేసుకొనే దేశం .ఇటలీ ,ఇతర యూరోపియన్ దేశాలు కరోనా వైరస్ భయంతో ఆయిల్ డిమాండ్ ను తప్పని సరిగా తగ్గించుకోవాల్సి వచ్చింది .
కోవిద్-19 వ్యాప్తి భయం వలన ఇన్వెస్టర్లు వెనకడుగు వేయటంతో ,ఆర్ధికరంగం కుదేలై స్టాక్ ధరలు తగ్గిపోయాయి .మార్కెట్ సెంటిమెంట్ ను కరోనా వైరస్ ఉత్పత్తి స్టాక్ మార్కెట్ ,లతోపాటు ఆర్దికమార్కేట్ లపై ఒత్తిడి- స్ట్రెస్ కూడా పెంచి ప్రభావితం చేస్తుంది .బాండ్ ల విలువ బాగా తగ్గిపోతుంది .అమెరికా ట్రెజరికి ఆ దేశ ప్రభుత్వమే వెన్నెముక .కాని అనిశ్చిత మార్కెట్ వలన ఇన్వెస్టర్లు పారిపోతున్నారు .దీని ప్రభావంతో అమెరికా ట్రెజరీ కిందటివారం లో ఇది వరకు ఎన్నడూ లేనంతగా 1%కంటే క్రిందకు పడిపోయి,భయం కలిగించింది .గత పదేళ్ళలో దాని చారిత్రకపతనం 0.3% కు రావటం భీతికోల్పే విషయమే .దీనితో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ,మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది అని ఆర్ధిక విశ్లేషకుల అంచనా .అమెరికా సెంట్రల్ బాంక్ అత్యవసరంగా 50 బేసిక్ పాయింట్లను గతవారం కోతకోసింది .దీనివలన టార్గెట్ ఫండ్ 1నుంచి 1.25% కు పెంచుకొన్నది .
ఇన్వెస్ట్ మెంట్ ,కంపెని షేర్లు కొనుగోలు అమ్మకాల వలన పెన్షన్ దార్లకు మదుపరులకు పెద్ద నష్టం కలిగింది .ఇండస్ట్రియల్ యావరేజ్ ,నిక్కీలుడిసెంబర్ 31తర్వాత భారీ పతనాన్ని చవి చూశాయి .ఒక్కరోజులోనే ఈపతనం రావటం ఇన్వెస్టర్లను ఆందోళన పరుస్తోంది .ఈ ఆర్ధికపతనాన్ని తగ్గించటానికి ప్రభుత్వాలు తీసుకొన్న తీసుకొంటున్న చర్యలు ‘’అరకోర’’ మాత్రమె తప్ప సమర్ధమైన స్థిరమైన చర్యలు కావు అంటున్నారు ఆర్ధిక నిపుణులు .దీనికి జవాబుగా ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తో సహా అన్ని దేశాల సెంట్రల్ బాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి .దీనివలన అప్పుతీసుకోవటం తేలిక అవుతుంది ,ఖర్చు ధారాళంగా పెట్టి ఆర్దికానికి కొమ్ముకాయవచ్చు అని భావన .అమెరికా సెనేట్ కూడా 2ట్రిలియన్ డాలర్ల కరోనా వైరస్ సహాయం ఆమోదించి వర్కర్లకు వ్యాపారస్తులకు వెసులుబాటు కలిగించింది .మన దేశప్రదానికూడా అలానే భారీ మొత్తాన్ని సాయంగా ప్రకటించాడు .కానీ ఇదంతా ‘’అత్యుల్లాసం ‘’,’’త్వరగా ఆవిరి అయ్యే ‘’(వోలటైల్ )విధానమే కాని శాశ్వతం కాదని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు పెదవి విరిచారు .అమెరికాలో 3మిలియన్ల ప్రజలు కరోనా వైరస్ బాధితులుగా సహాయం కోరుతున్నారు .వీరికి ఇంకం టాక్స్ కట్టింగ్ లు పోను చేతికి ఎంతవస్తోందో బ్రాహ్మ పదార్ధం గా ఉన్నదట .మనకూ అదే పరిస్థితి.
100పైగా దేశాలు కరోనా వ్యాప్తి భయం తో ప్రయాణాలపై, రవాణాపై ఆంక్షలు విధించటం ,విమానాల సంఖ్య, ఫ్లైట్ ల సంఖ్య తగ్గించటం తో బిజినెస్ వాళ్ళు టూర్లు ,హాలిడే ట్రిప్ లు రద్దు చేసుకోవటం తో రవాణా పరిశ్రమ చాలా పెద్ద దెబ్బే తిన్నది.యూరోపియన్ ఎయిర్ పోర్ట్ లనుండి అమెరికాకు ప్రయాణీకులను బాన్ చేశాడు ట్ర౦ప్ .చైనా వారిని గృహ నిర్బంధలో ఉంచటం తో ఇంగ్లాండ్ కు గత 12నెలలలో రావాల్సిన 4,15,000 విజిట్లు ఆగిపోయి గొప్ప నష్టం కలిగించింది బ్రిటన్ కు. అన్ని దేశాలవారికంటే చైనావారు ఇంగ్లాండ్ కు సరాసరి అత్యధిక ధర 1,680పౌండ్లు ఖర్చు చేసివచ్చే ఆదాయం’’ లాస్’’అయ్యారు .సూపర్ మార్కెట్ లు, ఆన్ లైన్ డెలివరి సర్వీసు ల వలన సరుకుల అత్యంత డిమాండ్ ఏర్పడిందని తట్టుకోవటం కష్టంగా ఉందని ముఖ్యంగా టాయిలెట్ పేపర్లు, బియ్యం ,ఆరంజ్ జూస్ లకు ఉన్న డిమాండ్ తీర్చటం కష్టతర మై పోతోందని బాధ పడుతున్నారు సప్ప్లియర్స్ .గుడ్డిలో మెల్ల గా వాతావరణ పొల్యూషన్ బాగా తగ్గిపోయింది ప్రయాణాల రద్దు మూలకంగా .చైనా ఉత్పత్తి మొదటి రెండునెలలలో దాదాపు 14శాతానికి పడిపోయిందట
అనిశ్చిత పరిస్థితులలో దేనిపై పెట్టు బడి పెట్టాలని సందేహం ఎక్కువగా ఉంటుంది .అన్నిటికన్నా బంగారం పై పెట్టుబడి ‘’సేఫ్’’ అని అందరి భావన.కాని ఈమార్చిలో ‘’బంగారు’’ కూడా ‘’కంగారు ‘’పడింది . ధర తగ్గిపోయి గ్లోబల్ వైడ్ గా ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పించింది .ఇంకా ఎక్కువ కాలం లాక్ డౌన్లు, లాకౌట్లు పొడిగిస్తే ఆర్ధిక రేటు అత్య౦త నిరాశాజనకమై భయ పెడుతుందని ఆర్ధిక వేత్తల హెచ్చరిక .ముందు బాగానే ఉంటుంది .తర్వాతే మండిపోతుంది .పెద్ద నోట్లు రద్దు చేసిన మోడీ ని అవతార పురుషుడని ఆకాశానికి ఎత్తేశారు ఆతర్వాత నెలకే అందులోని డొల్లతనం బయట పడి ఈసడించారు .అలా మళ్ళీ కాకూడదని, కాదని భావిద్దాం. మనం మాత్రం ప్రకృతిని, పర్యావరణాన్నీ కాపాడుకొంటూ, శుచి, శుభ్రత పాటిస్తూ ఒకరికొకరం దూరం గా ఉంటూ, బుద్ధిగా ఉండి కరోనా మహమ్మారిని తరిమేద్దాం .
రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)

గుళ్ళపల్లి శ్రీరామ కృష్ణమూర్తి 11-11-1918న ప గో జి లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠం హెడ్ .శిక్షాశాస్త్రి సాహిత్య ప్రవీణ ,విద్యా వారిధి . వాణికీతౌ యక్షౌ పునరాయతౌ అనే ఒకేఒక పుస్తకం రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత సాహిత్యపురస్కారం అందుకొన్నాడు

562-ఉదాహరణ కావ్య కర్త –సంగీత గుండేచ(1974)

సంగీత గుండెచ 1-4-1974 ఉజ్జైన్ దగ్గర శక్తిపూర్ లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి,మ్యూజిక్ లో మాస్టరీ .ఉదాహరణకావ్య ,భాషాకా రంగమంచ ,సమకాలీన రంగమంచ మే నవన్యాయ శాస్త్రకి ఉపస్థితి అనే 3పుస్తకాలు రాశాడు

563-అభినవ సీతా రామ సంవాద ఝరి కర్త –బచ్చు సుబ్బారాయ గుప్త (1902)

1902 నవంబర్ లో కర్నూలులో పుట్టిన బచ్చు సుబ్బారాయ గుప్తఒకే ఒక గ్రంథం అభినవ సీతా రామ సంవాద ఝరి రాశాడు

564-సులభ సోపాన కర్త –అఘోరే నాథ గుప్త (1841)

1841యుపి నాడియాజిల్లా శాంతిపూర్ లో జన్మించిన అఘోరే నాథ గుప్త 9పుస్తకాలు రాశాడు .అందులో శ్లోక సంగ్రహ ,సులభ సోపాన ,ధర్మతత్వ ,సులభ సమాచార ఉన్నాయి .బౌద్ధధర్మ నిష్ణాతుడు ,బ్రహ్మ సమాజ ఉపాధ్యాయుడు ,తాపసి .

565-చందోలోకారమంజరి కర్త –కాంత గుప్త (1935)

11-11-1935 యుపి లో నగీనాలో పుట్టిన కాంత గుప్త రసిక బిహారీ శిష్యుడు .ప్రొఫెసర్ .చందోలోకారమంజరి మాత్రమె రాశాడు .

566-వేదాంత సార కర్త –మనోరమా గుప్త (1956)

సాహిత్య వేద దర్శన లో డిలిట్ మనోరమాగుప్త 1956 డిసెంబర్ 10 కాన్పూర్ లో పుట్టింది .కాన్పూర్ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యామందిర్ లో సంస్కృత హెడ్ .2పుస్తకాలు –వేదాంతసార ,సాంఖ్యకారిక రాసింది .

567-మూల్యాన్య మూల్యాని కర్త –శశి గుప్త( 1946)

1946 నవంబర్ 8 రాజస్థాన్ బికనీర్ లో పుట్టిన శశి గుప్త,అక్కడే భైరవ రత్న స్కూల్ సంస్కృత లెక్చరర్ . మూల్యాన్య మూల్యాని అనే పుస్తకం మాత్రమె రాసింది

568-ఋగ్వేద పరిచయ కర్త –సుదీర్ కుమార్ గుప్తా (1917)

1917లోహర్యానా గుర్గావ్ లో పుట్టిన సుదీర్ కుమార్ గుప్తా సంస్కృత ఎం. ఏ .పి.హెచ్ డి.యూనివర్సిటి ఆఫ్ రాజస్థాన్ ,గోరఖ్ పూర్ యూని వర్సిటీలలో లెక్చరర్.రాసిన 5లో ఋగ్వేద పరిచయం ,సంస్కృత సాహిత్యస్య సుబోధ ఇతిహాస ,భారతీయ దర్శనస్య సంప్రదాయ ,దండి భాణయోరేక మధ్యయానం ,వేదలావణ్యం రాశాడు .రాజస్థా సంస్కృత అకాడెమి పురస్కార గ్రహీత .

569-సంస్కృత ఛందో విధానం కర్త-వినోద్ కుమార్ గుప్తా (1972)

వినోద్ కుమార్ గుప్తా 1972 నవంబర్ 14 తెహ్రిగద్వాల్ లో పుట్టాడు. అక్కడే ప్రభుత్వ పి.జి .కాలేజిలో ప్రొఫెసర్ .సంస్కృత ఛందో విధానం మాత్రమె రాశాడు .

570-హితోప దేశ నీతి శతక కర్త – బ్రిజేంద్ర సింగ్ గుజార్ (1972)

1972 ఆగస్ట్ 1 రాజస్థాన్ లో పుట్టిన బ్రిజేంద్ర సింగ్ గుజార్ విద్యావారధి ,ప్రవక్త ,ప్రాచార్య శ్రీ మా మహా విద్యాలయ .హితోపదేశ నీతి శతకం మాత్రమె రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రక్త బీజుని రక్త సంబంధివా ?

రక్త బీజుని రక్త సంబంధివా ?

image.png
ఒళ్ళంతా ముళ్ళు
ముఖమంతా ఉమ్మెత్త కాయ
పోలికగా పొడవైనవాడిముళ్ళ భీభత్స రూపం
పూర్వం ఎందరెందర్నో
మహామ్మారుల్ని చూశాం
వాటన్నిటికంటే వికృత రూపం నీది
తలచుకొంటేనే ఒళ్ళు జలదరిస్తోంది
పూర్వం రక్త బీజ రాక్షసుడి
అనుంగు సోదరివా, రక్తసంబంధివా?
వాడి రక్తం బిందువు నేలపై పడితే
అనంతంగా వాడి లాంటి వాళ్ళు పుట్టి
భీభత్సం చేసి భయపెట్టేవారట
అవతలి వాడికి జయించటం
అలవికాక ఉసూరు మనేవాడట
నీ పరిస్థితీ ఇలానే ఉంది కరోనా !
ఒక్కసారి శరీరం లోకి నువ్వు ప్రవేశిస్తే
లక్షాలాదిగా పెరిగిపోయి జీవన ప్రక్రియలు
స్థంభి౦ప జేసి ఉసురు
తీస్తావట సునాయాసంగా
ముట్టుకుంటే అంటుకు పోయి పెను ముప్పు
తెస్తున్నావు ప్రపంచ మానవాళికి
ఇప్పటికే విశ్వమంతా వ్యాపించి
నలభై వేలమందిని నీ కరాళ కోరలతో
కబళించేశావ్ ,భీభత్సం సృస్టించావ్.
మహా రాణిని అనుకొన్నావా
కిరీటం( కోరోనా )పెట్టుకోన్నావ్ ?
మహమ్మారికి అంతటి అహం వద్దు
ప్రతి కుక్కకూ ఏదో రోజు చావు తప్పదు
రక్త బీజుడినే వణికించి
అమ్మకాళికాదేవి ఉగ్రరూపం దాల్చి
వాడి ఒక్క రక్తపు బొట్టు నేలమీద పడ కుండా
రక్త బీజ పునరుత్పత్తి జరక్కుండా
అనంతమైన నాలుకను నేలంతా చాచి
నిలువునా వాడిని సంహరించి
లోకోపకారం చేసిందని మర్చిపోకు
ఇప్పుడు ప్రపంచమంతా అత్యంత జాగృతమైంది
మా అశక్తత ,అలసత్వం ,విచ్చలవిడితనం నీకు
ఆసరా అయి మా ప్రాణాలతో చెలగాటమాడావ్
ఇక నీ ఆటలు సాగనివ్వం
నీ సంహారానికి మందే అక్కరలేదు
శుచి ,శుభ్రత ,దూరం పాటించి నిన్ను
తరిమి తరిమి కొట్టి ఉపశమనం పొందుతాం
అందరం’’ మహ౦ కాళీ’’ స్వరూపులమై
మమ్మల్ని మేము సంరక్షి౦చు కొంటాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)

27-21938 న రాజస్థాన్ భరత్ పూర్లో జన్మించిన చంద్ర కిషోర్ గోస్వామి సంస్కృత పిహెచ్డి,ఫ్రెంచ్ డిప్లోమాహోల్డర్.వనస్థలి విద్యా పీఠం లో దర్శన వేదిక్ స్టడీస్ లో ప్రొఫెసర్ .సంపూర్ణానంద మిశ్ర ,కాడి పుండరీక ,కృష్ణచంద్ర శర్మ ,ప్రేమనిది శాస్త్రి గురుపరంపర .భావశతకం , పృధ్విరాజ జయం ,కావ్యాంజలి ,దాన వీర కర్ణ,గీతాంజలి రాశాడు .రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత పురస్కారం ,అంబికా దత్ వ్యాస్ పురస్కారం పొందాడు .

552-హఠ యోగ ప్రదీపిక కర్త –గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామి (1968)

1968ఏప్రిల్ 1న అస్సాం లో ద్వీపరసాస్ట్ర నల్బరి లో పుట్టిన గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామిగౌహతి ప్రభుత్వకాలేజి మీమా౦స శాస్త్ర హెడ్ .రాసిన 17పుస్తకాలలో హఠ యోగ దీపిక ,వేదమంజరి ,రాదా తంత్ర ఉన్నాయి .హేమ చంద్ర గోస్వామిఅవార్డ్ పొందాడు .

553-విరహిణీ వ్రజా౦గనా కర్త –గోర్ కిషన్ గోస్వామి (20శతాబ్ది )

20వ శతాబ్దికి చెందిన గోర్ కిషన్ గోస్వామి-కావ్య తీర్ధ .,పురాణ ,దర్శన తీర్ధ .ఆయుర్వేద శిరోమణి .బృందావన్ గురుకుల ఆయుర్వేద ఫాకల్టి హెడ్ .విరహిణీ వ్రజా౦గనా అనే ఏకైక కావ్యం రాశాడు .

554-సింహ సిద్ధాంత సి౦ధు కర్త –హరి కృష్ణ గోస్వామి( 1909-1979)

1909లో రాజస్థాన్ జైపూర్ మహాపుర లో పుట్టిన హరి కృష్ణ గోస్వామి-సాహిత్య ,న్యాయ ,శుద్ధాద్వైత వేదాంత నిష్ణాతుడు .ఉదయపూర్ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ ,అజ్మీర్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .రాసిన 25పుస్తకాలలో సింహసిద్ధా౦త  సింధు ,ఆదర్శ సౌందర్యం ,లలితాకథ కల్పలత ,దివ్యాలోకః ఉన్నాయి .1979లో 70ఏళ్ళ వయసులో చనిపోయాడు .గద్యపద్య స్మార్ట్ అవార్డ్ ,మాఘ  అవార్డ్ లుపొందాడు .

555-వర్షావలి కర్త –హరిరాయ్ గోస్వామి (1950)

1950మే 22 జోద్ పూర్ లోపుట్టిన హరిరాయ్ గోస్వామి సాహిత్య ఆచార్య .మాఘ పురస్కార గ్రహీత .రాసిన 7పుస్తకాలలో జరాసంధవధ మహాకావ్యం ,వర్షా వలి ,పురుస్సంభవ మహాకావ్యం ఉన్నాయి .

556-మహాత్మా విదుర కర్త –రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి (1952)

1952అస్సాం దేరాగావ్ లో పుట్టిన రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి జ్యోతిష  శాస్త్ర ఆచార్య .మహాత్మా విదుర ,భక్తరాజ ,సంస్కారతత్వ ,సుభాషితం మొదలైన 13పుస్తకాలు రాశాడు .

557-అవయవ చింతామణి కర్త –సుబుద్ధి చరణ్ గోస్వామి (1944)

1944 మే 20న వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ లో పుట్టిన సుబుద్ధి చరణ్ గోస్వామి-కలకత్తా రవీంద్రభారతి యూనివర్సిటి ప్రొఫెసర్ .గణేశ అవయవ చింతామణి ,కణాద టిప్పణి రాశాడు .

558-స్మార్త ప్రభు కర్త –విద్యాధర్ గౌర్ (1886-1941)

1886 హర్యానా రొహ్ టక్ లో   పుట్టిన విద్యాధర్ గౌర్ కాశీ హిందూ యూనివర్సిటి డీన్.పండిట్ ప్రభుదత్త గౌర్ ,పండిట్ వామచరణ గురుపరంపర .అనేకమంది ప్రసిద్ధ శిష్యులున్నారు స్మార్త ప్రభు ,ప్రతీషాప్రభు  ,వివాహ ,ఉపనయన పధ్ధతి ,వాస్తు శాంతి పధ్ధతి మొదలైన 8పుస్తకాలురాశాడు .1941లో 55వ ఏటనే మరణించాడు .మహామహోపాధ్యాయ ,వైదిక, స్మార్త యాజ్ఞిక సామ్రాట్ ,వైదిక చక్రవర్తి ,విద్యా  వాచస్పతి ,విద్యాభూషణ ,ధర్మాలంకార ,మహాపండిత మొదలైన సార్ధక బిరుదాంకితుడు

559-ధర్మ విజయ చంపు కర్త –కె.వి .గోవిందం (1948)

1948సెప్టెంబర్ 3పుట్టిన కె.వి .గోవిందం-శిక్షా శాస్త్రి, విద్యా వారిది .కృష్ణ  యజుర్వేద తైత్తిరీయ శాఖ ,మీమాంస , విశిష్టాద్వైత ల లోతులు తరచినవాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ .17పుస్తకాలు రాశాడు .అందులో ధర్మ విజయచంపు ,ఆత్మత్వ జాతి విచార ఉన్నాయి .నవ్యన్యాయ ప్రవీణ్ విపశ్చిన్మణి బిరుదాంకితుడు .ఎన్నో అకాడేమీలనుంచే కాక ప్రెసిడెంట్ అవార్డీ కూడా

560-పంచనద దేశస్తవః-కర్త –పండిట్ చంద్రశేఖర శర్మ గులేరి (1883-1922)

పండిట్ చంద్ర శేఖర గులేరి 7-7-1883న రాజస్థాన్ అజ్మీర్ లో పుట్టి 12-9-1922న 39ఏళ్ళకే చనిపోయాడు .సాహిత్య దర్శన ,లింగ్విస్టిక్స్ లో నిపుణుడు .అజ్మీర్ మేయోకాలేజి ప్రొఫెసర్ .పృధ్విరాజ విజయ , పంచనద దేశస్తవః(పంజాబ్ స్తుతి ).స్మార్త సిద్ధాంతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లిష్ లోకి అనువదించాడు .సమాలోచన,నాగరీ ప్రచారిణి సంస్కృత పత్రికల సంపాదకుడు .అపూర్వమైన కథలను హిందీలో ‘’ఉస్నే కహా థా’’పేరున రాసి ప్రచురించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 29-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది

ప్రపంచమొక కుగ్రామం మనమంతా ఆ గ్రామవాసులం

అని చాతీ విరిచి రొమ్ము చరఛి నిన్నటి దాకా చెప్పుకున్న మనం

ఇవాళ కరోనా కల్లోలంతో మనిషి మనిషికీ

బారెడు దూరం పాటిస్తున్నాం ,

కలుసుకోవటానికి  భయపడి పోతున్నాం .

లాక్ డౌన్, లాకౌట్ లతో ఏకాకులమై

ఏకాంత కూ దగ్గరకాకుండా

ఏకాంతవాసం చేస్తున్నాం

మన సైన్స్ టెక్నాలజీ లు

 కలిపి ఉంచాల్సిన మనల్ని

క్వారంటైన్ లలోకి నెట్టి 14రోజులు శిక్షిస్తున్నాయి

రెక్కాడితేకాని డొక్కాడని నిర్భాగ్యులు

ఇటు ఆకలి కేకలతో అటు కరోనా కోరలతో

విలవిలలాడుతూ దిక్కుతోచక దిగాలుగా ఉన్నారు

సుమారు అరవై ఏళ్ళక్రితం చైనా కవ్విస్తే

యుద్ధానికి దిగి తుప్పు తుపాకులతోపోరాడి

 బదులు చెప్పలేకకుప్పకూలి  ఓడిపోయాం

నాటి ప్రధాని అవమానభారంతో మంచం పట్టాడు కూడా

ఇప్పుడు మళ్ళీ అదే చైనాలో ప్రకోపించిన కరోనా ను

ముందు నష్టపోయినా తర్వాత తెలివిగా ప్రవర్తించి

ఉపద్రవంనుంచి కాపాడుకొన్నదా దేశం  

వనరులు సమకూర్చుకొని మళ్ళీ ప్రపంచాన్ని శాసిస్తోంది

‘’నాగరకతా వ్యామోహంలో కన్నీళ్ళ నడుక్కుంటున్న

యుగ భిక్షువును నేను ‘’అని ఆనాడేప్పుడో

చెప్పిన కవి వాక్యం  నేడు రుజువైంది.

సుమారు యాభై ఏళ్ళ హస్తం పాలన ను

అపహాస్యం చేసి ,పొడిచేస్తాం నలిపేస్తాం

ఉషస్సులు కుమ్మరిస్తామని గద్దెనెక్కిన నేతలు

ఆర్ధిక పరిపుష్టి సంగతి వదిలేసి వ్యంగ్యబాణాలతో

వ్యవస్థలన్నీ ధ్వంసం చేసి ప్రజాస్వామ్యం అంటే ఇదా

అని ముక్కున వ్రేలేసుకోనేట్లు చేసి

 తమాషా చూస్తున్నారు చేతకాక

తలలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు

యాభై ఆరు అంగుళాల ఛాతీలో

నాలుగంగుళాల హృదయం

 మనసు వికసశించలేక అనర్ధంసృష్టి స్తోంది

నిబద్ధతలేని పాలన,ఆలోచనలేని ఆచరణ ,

తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే

 ఆరేళ్ళు కష్టనష్టాలు పడ్డాం

కరోనా రూపు మాపటానికి లాకౌట్లు గట్రా

తాత్కాలిక ఉపశమనాలే తప్ప

పూర్తి పరిష్కారాలు కాదు

సమర్ధ నాయకత్వం  నిస్వార్ధ జీవనం

 ఆడంబరరహిత పాలన మాత్రమే పరిష్కారం

ఆరోగ్యం పై డబ్బు ఖర్చు చేయలేని ప్రభుత

సువ్యవస్థ లేని ప్రజారోగ్య పధకాలు

మనపాలిటి ఇప్పటిశాపాలు

సంకల్ప శక్తి లేని వాగాడంబరం తెచ్చిన ,తెస్తున్న

అనర్ధాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం

తగినన్ని ఆస్పత్రుల్లేవు పడకల్లేవు మందుల్లేవు

మాస్కులులేవు వెంటిలేటర్లు లేవు

చేతులుకాలాక ఆకులు పట్టుకొన్న చందం

ఘనత వహించిన మన ప్రభుత్వాలది

ఎన్నికలలో ఎలాగైనా,ఎన్ని కోట్లు గుమ్మరించైనా,   

ప్రత్యర్ధుల ను అన్ని సామదాన భేద దండోపాయాలతో

ఎన్నిక యంత్రాలనూ మంత్ర జాలం తో

నియంత్రించి, పీ.కే .లాంటి వారికి సలహా వ్యూహాలకోసం

 కోట్లు మంచినీరులా ప్రవహింపజేసి

గెలవాలన్న ధ్యేయం ఉండి గెలిచిన పాలకులకు

ప్రజారోగ్యం తో పనేమిటి ?

అలాంటి పకడ్బందీ వ్యూహాలు ప్రజారోగ్యం కోసం

ఆర్ధిక పరిపుష్టి కోసం వెచ్చిస్తే యెంత బాగుండును ?

ఎవర్ని లాకప్ లో పెడదామా  ఎక్కడ కబ్జా చేద్దామా

 ఎవరి ఇజ్జత్ నాశనం చేద్దామా

 అన్న  వాటిపై పై ఉన్నయావ

ప్రజా సంక్షేమం కోసం పెడితే దేశం నందనవనం కాదా !

ప్రక్కదేశం పై సైనిక దాడి చేసి ఎన్నిక ఫలితం

రాబట్టే నాయకులకు

రైతుల కూలీలనిరుద్యోగుల ప్రభుత్వ వ్యవస్థల

బాగుకోసం ఆలోచించే తీరిక లేకపోబట్టే ఇంత

ఆర్ధిక విష విలయం చుట్టూ ముట్టేసింది

కరోనానే వణకించే శక్తి సామర్ధ్యాలున్న

వారికి ప్రజలతో సంబంధమేమిటి

ఎలెక్షన్ రోజుల్లో తప్ప ?

ఇలాగే ఉంటే పాలించే మీరు .

పాలించటానికి ప్రజలు మిగలరని

ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి

అన్నిటికీ రాజకీయం చేస్తే

చరిత్ర హీనులై మిగిలిపోతారు

తస్మాత్ జాగ్రత జాగ్రత

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

541-రుక్ సూక్త మంజూష కర్త –గౌతమ్ (1936)

4-8-1936న గుజరాత్ అహ్మదాబాద్ లో పుట్టిన గౌతమ్ 120 గ్రందాల రచయిత.అందులో ఆది శంకరాచార్య ,ఛాందోగ్య దీపిక ,కుమార సంభవం ఆఫ్ కాళిదాస ,వైదిక సాహిత్య ఔర్ సాంస్క్రిట్ ఉన్నాయి .

542-నీలమత పురాణ కర్త –వేదకుమారి ఘాయ్(1931

1931డిసెంబర్ 14న జమ్మూ –తావి లో  పుట్టిన వేదకుమారి ఘాయ్,జమ్మూ యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ హెడ్ కూడా .10 పుస్తకాలు రాసింది  .వాటిలో నీలమత పురాణం ,పురంధ్రపంచకం ,కాశ్మీర్ కా సంస్కృత సాహిత్య కా యోగదాన ఉన్నాయి

543-యాజ్ఞ్యవల్క్య సహస్ర నామావళి కర్త –పరశురామ ఘనాపాఠి(1914)

1914 ఆగస్ట్ 15 తమిళనాడు కుంభకోణం దగ్గర ఎంగికొల్లై లో పుట్టిన పరశురామ ఘనాపాఠి  సలక్షణ ఘనతంత్ర విద్వాన్ శతపథబ్రాహ్మణ .చెన్నై అమ్బత్తూర్ లోని యాజ్ఞవల్క్య గురుకుల అధ్యాపక్ ,ప్రెసిడెంట్ .యాజ్ఞవల్క్య సహస్రనామావళి అనే ఏకైక గ్రంధరచయిత

544-అభావ విమర్శ కర్త –దీపక్ ఘోష్ (1941)

1941జనవరి 24 కలకత్తాలో పుట్టిన దీపక్ ఘోష్ రాసిన 6పుస్తకాలలో –అభావ విమర్శ ,విలాప పంచిక ,సంస్కృత  రబీంద్ర సంగీతం ,మేఘ విలాప ,సురవాగ్ విలాస ,అమరవిలాప ,ఉజ్జయిని విలాస ఉన్నాయి

545-కొల్లాల అమృతా చే కర్త -. ,వాసుదేవ పురుషోత్తం గిండే(1937)

19-1-1937పుట్టిన వాసుదేవ పురుషోత్త౦ గిండే సంస్కృత మరాఠీ ఏం ఏ .కల్లోల అమృతాచే ,జానేశ్వారి టిల్ రస తీర్ధే,ఏక్ రసవాదే రాశాడు .

546-భైరవీ మహా విద్య కర్త – గోస్వామి ప్రహ్లాద్ గిరి (1959)

1959జూన్ 22ఒరిస్సా బలాన్ గిరి లో పుట్టిన గోస్వామి ప్రహ్లాద్ గిరి సాహిత్య ,శంకర వేదాంత ,దర్శన ఆచార్య .డిపార్ట్ మెంట్ ఆఫ్ ధర్మాగారం  టీచర్ .బెనారస్ హిందూ యూనివర్సిటి ఫాకల్టి   మెంబర్ .ఆయనది శంకరాచార్య గురుపరంపర .29గ్రంథాలు రాశాడు .భైరవి మహా విద్య ,భువనేశ్వరి మహావిద్య ,షోడశి మహావిద్య ,శ్రీ చక్ర నిరూపణం,సావిత్రీరాస్ట్రాధ్యాయి అందులోకొన్ని .

547-వాది వినోద కర్త –విశ్వ౦భర్ నాద గిరి –(1953)

1-4-1953మీర్జాపూర్ లో పుట్టిన విశ్వ౦భర్ నాద గిరిపూర్వ మీమా౦స లో ఎం ఏ .వాదివినోద ,శ్రీ కృష్ణ లీలా ,దశకుమార చరిత్రం రాశాడు .

548-జైమిని సూత్ర కర్త –పి.వి.గోపకుమార్ (1971)

1971మే 20న కేరళ కొత్తమంగళంలో  పుట్టిన పి.వి.గోపకుమార్ సాహిత్యాచార్య .ఎక్సిక్యూటివ్ ప్రెసిడెంట్ .జైమిని సూత్రాలు మాత్రమె రాశాడు .

549-వ్యవహార సూక్త కర్త –కాశీనాద్ గోపాల గోరె (1936)

3-6-1936హిందీ సాహిత్యరత్న ఎలఎల్ బి గోల్డ్ మెడలిస్ట్ ,సంగీత విశారద ,తెలుగు కోవిద .యుపి ప్రభుత్వ జాయంట్ సెక్రెటరి .7పుస్తకాలు రాశాడు .వ్యవహార సూక్త ,కాళీ గీత ,యోగ అండ్ స్వాస్త్య అందులో ఉన్నాయి .ఎన్నో సంస్థలకు గౌరవ హోదాలలో ఉన్నాడు

550-సంస్కృత పాఠ సంగ్రహ కర్త –భారతి గోస్వామి (1962)

1962 జనవరి 29అస్సాం లోని దూలాజిల్లా మాజ్ గావ్ లో పుట్టిన భారతి గోస్వామి గౌహతిలో ప్రొఫెసర్ .3పుస్తకాలురాసింది  . సంస్కృత పాఠ సంగ్రహ 3భాగాలు,సంస్కృత వ్యాకరణ జ్యోతి రచనలు  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గిరీశ భాష్యం

గిరీశ భాష్యం

గిరీశం -ఏం వాయ్ మైడియర్ వెంకటేశం !కరోనా వైరస్ తో రెండు నెలలు హాయిగా మీ ఇంట్లో కాలక్షేపం చేసే వీలు దక్కింది .జేబులో కాపర్స్ ఏమైనా ఉన్నాయా ?

వెంకటేశం –ఉన్ననాలుగు డబ్బులు  ముందే దొబ్బేశారుగా  ఇంకెక్కడివి ?

గి –సంచీ ఒకసారి దులిపి చూడు

వెం-దులిపితే రాలేవి ఎంగిలి బీడీ ,చుట్టముక్కలే .మీ పరువూ నా పరువు పోతుంది .

గి-ముదిరిపోయావ్ .పుట్టి శతాబ్దం అయిందిగా తెలివి తేటలు బానే ఒంటబట్టాయి .

వెం-లేకపోతె మీరు నాకు అక్షరమ్ముక్క నేర్పితే ఒట్టు .అంతా నా తంటాలతోనే ఎదిగా .గురువుగారూ !మీ పూటకూళ్ళమ్మ రోజూ ఫేస్ బుక్ నన్ను రెచ్చగొడుతూ లైనేస్తోంది .

గి –ఒరేయ్.గురూకు పంగనామం పెట్టబోకు పుణ్యం ఉంటుంది .

వెం-మీకు కృతజ్ఞతా  పాడూ లేవు కాని నాకున్నాయ్ .నేనేమీ ప్రొసీడ్ అవటం లేదు .ఫుల్ స్టాఫ్ పెట్టేశా, పెట్టించా .

గి –మంచి పని చేశావ్ .ఇంతకీ ఇక్కడ ఉండిపోటానికి మీనాన్నకే ఠస్సావెయ్యాలా ఆని ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది .మీ సిస్టర్ ని పంపి కాస్త నవరత్న తైలం మర్దన చేయించి పుణ్యం కట్టుకో .

వెం-మంచిదే .కాని ఇదివరకట్లాకాదుగా .టచ్ చేస్తే వైరస్ అంటుకుంటుంది .నేను పంపనే పంప .ఇంతకీ మానాన్న కేం చెప్పి బురిడీ కొట్టిస్తారు ?

గి-నాలుగు రోజులనుంచి అన్నీవెతుకుతున్నా .చిక్కట్లేదు .మీనాన్న కూడా బయటికి రావటం లేదే .

వెం- అందరికీ అదే భయం .సంధ్యవార్చి నీళ్ళు తులసి  చెట్టులో పోయటానికి వస్తాడు అప్పుడు పట్టుకోండి.

గి –సరే .అదుగో మామగారు వస్తున్నారు .

వెం-ఏమండోయ్ చుట్టరికం కలిపేస్తున్నారు

గి –ఇవాళకాకపోతే రేపైనా నువ్వు నాబామ్మర్దివి మీ అక్కయ్య నా వుడ్ బి ,మీ అమ్మా నాన్న నాకు అత్తా మామలే కదా .ఇప్పట్నించే కొంచెం అడ్వాన్స్ అవుతున్నా .

వెం-సరే అఘోరించండి .

గి-మామగారూ కులాసానా ?

అగ్ని –ఏం కులాసా మీ బొంద .అదేదో జబ్బుష ప్రపంచమంతా పాకి నవిలేస్తోందష. ఇంట్లో రెడియోకూడా లేదు. బయటికి వెళ్ళనివ్వటం లేదు .కోర్ట్ లున్నాయో లేదో తెలీదు .దావాలు వాయిదాలు పడ్డాయో లేదో ప్లీడరీ గుమాస్తా చెప్పి చావటం లేదు. నీకు తెలిస్తే దాన్ని గురించి చెప్పు కాస్త పూజ ముగించుకొని చక్కా వస్తా.

గి –అలాగే కానీండి అదిగో అత్తయ్యా వస్తున్నారు .ఎలాఉన్నారత్తయ్యా ?

వెంకమ్మ – – ఎందుకడుగుతావు బాబు .మాతమ్ముడు కరకటం రావాలి ఎదురు చూస్తున్నా .ఎలా వస్తాడో పాపం నన్ను చూడంది ఉండలేడు వెర్రి నాయన . నా చేతుల్లో పెరిగాడు వెధవ .పిచ్చిసన్నాసి .

గి-కంగారు పడకండి అత్తయ్యా .మామయ్య కూడా రాగానే కంగారు తగ్గెట్లు కరోనా గురించి క్షుణ్ణంగా చెబుతా .దాని తీవ్రత తగ్గే దాకా సిగ్గు విడచి మీ ఇంట్లోనే ఉండి పోవాల్సి వస్తోంది .బిడియంగా ఉంది .

ఆమె-సంకోచం వద్దు .మీరూ కాల్సినవారే కాదుషా .కడుపులో పెట్టుకొంటాం నాయనా .సంకోచించకు నువ్వూ అబ్బాయి ఇక్కడే ఉండిపొండిపంతులుగారూ .మా వారికి ప్రధమకోపం ఎక్కువ .అగ్గి మీద గుగ్గిలమే .ఉబ్బెస్తే తర్వాత మనసు నవనీతమే .నువ్వే ఆయన్ను ఎష్లా  గైనా ఒప్పించాలి .మామాట వింటే కల్లుతాగిన కోతిలా ఎగిరెగిరి పడతారు .జాగ్రత్త నాయనా .

గి –నేను చూసుకొంటాగా .మీరు గమ్మున ఉండండి .ఇదుగో మామయ్యా వచ్చేశారు .

అగ్ని –ఏమిటి శిఖరాగ్ర సమావేశం ?

గి – ‘’కరోనా ఆశానాసౌ నాసౌమన కోవిద్ప్రజానాం –నహి సౌభాగ్యం తనూం-చైనే రాను వ్ర-వ్రాతా భూతా ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ సున్నా హేతు కృతా అకృతాం ‘’

కరోనా శాత్యా –శాసనా సౌమనససం-ప్రజామితి ప్ర –జాం-న సౌభాగ్యం తనూం –అగ్నెః చైనేను  -అనువ్రతా భూత్వా  – నహ్యే-ఇటలీ అమెరికా  ఇంగ్లాండ్ సమితి సున్నా సున్నా హేతు కృతా అకృతాయ కం.

అగ్ని –పంతులూ ఏదో కొత్త పదం ఆలపిస్తున్నావు .ఎప్పుడూ వినలేదే .ఎక్కడ్నించి తెచ్చావ్

గి.మామగారూ ఈ ప్రాంతం లో నులక అగ్ని హోత్రావదాన్లు అంటే పదం క్రమ౦ ఘన జటలలో ఆయన్ను మించిన వారు లేరని లోకం కాకై కూస్తోంది. హనుమాన్ ముందు నా కుప్పిగంతులేమిటి ?

అగ్ని –నేను వినలేదు నేర్వలేదు రా బాబూ అంటే విని చావవేమిటి ?నీ బొట్లేరు ఇంగ్లీషుకు వేద పనసలు కూడానా.నమ్మకం కలగట్లేదుస్మీ .

గి-అందుకే నాకు ఎక్కడో కాల్తుంది .మీ తరం వారంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి బాపతు .ఆతర్వాత వేదం యెంత పెరిగి విస్తృతి చెందిందో మీకు తెలీదు .నాలుగు ఇంగ్లిష్ అక్షరంముక్కలోస్తే తెలిసోచ్చేది .అది మీకు అంటరానిదాయే .కోర్టులు వ్యవహారాలకు మాత్రం దాన్లోనే అఘోరించాలి. తెలీక పొతే ప్లీడర్ల చేతుల్లో మూటలకు మూటలు పోసి వ్యాజ్యాలాడుతారు .ఇదెక్కడి ఖర్మ వచ్చిందో మనబ్రాహ్మణ్యానికి .

అగ్ని- ఝాడించింది చాలుకాని  అసలు విషయం ఏడవండి పంతులుగారు .

గి –అందుకే మీది ప్రధమకోపం అని జిల్లా అంతా అనుకొంటారు .సీమలో అంటే కోనసీమలో కాదు ఇంగ్లాండ్ లో మాక్స్ ముల్లర్ అనే జర్మని పండితుడు న్నాడు .మనవేదాలను ఉపనిషత్తులు పురాణాల అంతు చూసి వదిలిపెట్టాడు .స్వయంగా ఋగ్వేదం గానం చేసి గ్రామఫోన్ పై రికార్డ్ కూడా చేశాడు .

అగ్ని-అలాగటస్మీ .వాడి తస్సా దియ్యా  భలే వాడే .మేమెప్పుడూ వినలేదే .

గి-(స్వగతం గా –గురుడు దిగొచ్చాడు .ఇక మనం చిలవలు పలవలు సృష్టించి ఎంతదాకా అయినా అల్లేయచ్చు) అవును మామగారూ !ఆయనే ఇందాక నే చదివిన మంత్రం ,పదం దర్శించాడు .దీన్ని మనవాళ్ళు ఎక్కడా చేర్చలేదు మన దౌర్భాగ్యం .

అగ్ని –ఇంతకీ ఆమంత్రం అర్ధం ఏమిషో సెలవివ్వండి.

గి-అక్కడికే వస్తూ మధ్యలో మీ చిరాక్కు వెనకడుగేశా మామగారు .ఈ మధ్య ప్రపంచమ౦తా కరోనా అనే క్రిమి అందర్నీ భయపెడుతూ వ్యాపిస్తోంది .దానితో కోవిద అనే జబ్బు వస్తోంది అది వస్తే మందూ, మాకూ లేదు .సరాసరి కాటికే . ఆయన ద్రష్ట కనుక ముందే ఊహించి మంత్రం లో బిగించాడు .దీనికి క్రమం ఘట, జట కూడా జడ అల్లినట్లు తేలిగ్గా అల్లేశాడు .

అగ్ని –పంతులూ నీ డొంక తిరుగుడు తగ్గించుకోలేదు ఇన్ని నెలలు మా వాడికి చదువు చెప్పే మిషతో మాఇంట్లో తిష్ట వేసినా .

గి-అలా ఐతే నేనిప్పుడే వెళ్లి పోతామామగారూ .

భార్య –అదేమీ షండీ అర్ధాంతరంగా పొమ్మని పొగబెడితే ఎక్కడికి పోతారు పంతులుగారు .బయటికి రానివ్వని కాపలా ఉన్న రోజుల్లో .

గి-(మనసులో –అత్తయ్య కూడా సపోర్ట్ బాగానే ఇచ్చింది. ఇదే బెస్ట్ చాన్స్ నా ప్రతాపం చూపాలి .ఇటలీలో కరోనాలాగా  కదలకుండా తిష్ట ఇక్కడే  వెయ్యాలి .మాంచి ధూపం తో పని చక్కబెడతా చూడు నా తడాఖా  )

  మాటవరసకు అన్నాను కానీ మామయ్యా ,నన్ను పోనివ్వనని అత్తయ్య బహు ఇబ్బంది పెడుతోంది .బుచ్చమ్మక్కూడా ఇష్టం లేదు వెంకటేశిగాడు సరేసరి .బయటికెళ్ళి లోకం లో ఆవ్యాధి అందరికీ పంచిపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఇక్కడే మీ ఇంట్లోనే మీరు చీపురుపెట్టి తరిమేసేదాకా ఉండిపోతాను .మీ మీద, అత్తయ్య మీద ఒట్టు .

అగ్ని –ఒట్టు తీసి గట్టున పెట్ట రాదుషో.ఇంతకీ మంత్రార్ధం చెప్పకుండా శాఖా చంక్రమణం చాలా చేశావు పంతులూ .

గి-నాగుబాము ముందు బురద కొయ్య ఆడినట్లు నేను మీ ముందు మంత్రార్ధం చెప్పేంత ఘటికుడినా మామగారూ  .

అగ్ని –మేమంతా నులక పేనినట్లు ఘనా జటా పేనుతూ వేదం వల్లె వేయటమే కాని అందులో ఏముందో తరచి చూడని బాపతు .నువ్వు చెబితే వినాలని ఉంది .

గి –(తనలో –చిక్కాడు మిడటం భొట్లు .ఒకాట ఆడుకుంటా పాచిక వేసి ప్రయోజనం సాధిస్తా )

  అది కరోనా మంత్రం  .దానికి పదం క్రమం ఘన జట కూడా ఉన్నాయి .సింపుల్గా భావం చెబుతా వినండి అత్తయ్యా మీరుకూడా –చైనాలో పుట్టిన ఓ కరోనా నీకు జాతిమతకుల ప్రాంత భేదం లేదు .కనిపించినవాడినల్లా నీ కిరీటం లాంటి కోరల్లో బంధించి నంజుకు తింటావు .ఇటలీ ఇరాన్ ఇంగ్లాండ్ దాటి అమెరికా లో ఇప్పుడు మనదేశం లోనూ అంటే ఇండియాలోనూ స్థిరపడ్డావ్ .నువ్వు అంటుకుంటే వదలని కామపిశాచి లాంటి దానివి .నీ క్రిమి అంటే వైరస్ సోకిన ఎవరినైనా కౌగిలిస్తే వాళ్ళు మటాష్ .మాడిపోవటమే భస్మాసుర హస్తమే .దానివల్ల వచ్చే జబ్బే కోవిద .అంటే- ఎవరికి తెలుసు అని అర్ధం .కరో అంటే పని చెయ్యి .న అంటే వద్దు మొత్తం మీద ఒక పని మాత్రం చెయ్యద్దు అని అర్ధం .ఆఒక్కపని ‘’హగ్ ‘’చెయ్యటం అన్నాడు తెల్లవాడు.అంటే కౌగిలించటం ,దగ్గరకు తీసుకోవటం ముద్దు,శృంగారం  వగైరాలతో ముంచేయటం చెయ్యరాదు అని అర్ధం .మామయ్యా .పెద్దవారు మీదగ్గర శృంగార విషయాలు ప్రస్తావించటం ఇబ్బందిగానే ఉంది .విడమర్చి చేబితేనేకదా అర్ధమయ్యేది .తప్పలేదు అత్తయ్యా .బుచ్చమ్మకూడా దొంగ చాటుగా వింటోంది .వెంకటేషి జామ చెట్టెక్కి పళ్ళు తింటూ వాడూ వింటున్నాడు .చివరికి దొర చెప్పిందేమిటి అంటే  కరోనా రాక్షసి కి  కృత్యం అకృత్యం అంటూ ఏమీ జాలీ దయాలేదు .మనిషికీ మనిషికీ బారెడు దూరం పాటించాలి .గోమూత్రం తో ఇల్లూ ఒళ్ళూశుభ్రం చేసుకోవాలి. ఆవుపంచితం తీర్ధంగా. తులసి దళాలతో రెండు పూటలా పుచ్చుకోవాలి .మామయ్యా రాత్రిళ్ళు మీ ఇద్దరూ కూడాదూర౦ పాటించండి .తప్పదు.ఇలా చెప్పినందుకు మన్నించండి ..

అగ్ని,  వెంకమ్మ -ఇంత కథా కమామీషు ఉందిషోయ్ అల్లుడూ .నీ కడుపు చల్లగా మంచి వేదమంత్రం చేవినేసి మాకు అర్ధం కాని విషయాలన్నీ చెవికెక్కి౦చావ్ .సూర్యుడు మేషరాసిలో ఉచ్చస్థితి లోకి వచ్చేదాకా మీరిద్దరూ ఎక్కడికీ కదలకుండా మా ఇంట్లోనే ఉండిపొండి.మా ఆబోరు దక్కించండి .

గి-(మనసులో -పడ్డాడు మామ నాపాచిక గోతిలో )అంటే మామయ్యా అత్తయ్యా ఏప్రిల్ 14 వరకూ ఇక్కడే ఉండిపొమ్మని సెలవా .

ఇంతలో కరాటక శాస్త్రి వచ్చి –అక్కయ్యా  బావయ్యా బాగున్నారా .వీధిలో అందరికళ్ళూ  కప్పి వచ్చేసరికి తలప్రాణం తోకకు వచ్చింది .ఎప్పుడు  నేను మీ ఇంటికి వచ్చేసరికి ఎడ్డెం తడ్డెం గా ఉండే మీరిద్దరూ ఇవాళ కలిసి నవ్వుతూ ఒకే మాటమీద ఉన్నట్లు కనిపిస్తున్నారు .ఏమిటి విశేషం ?

 అక్కా బావా –ఏమీ లేదోయ్ కరకటం-గిరీశం పంతులు ఏదో కొత్త వేద మంత్రం చెప్పి దాని అర్ధ తాత్పర్యాలు వివరించాడు .

కరటక –(వీడేదో ఠస్సా వేసి బావనూ అక్కనూ బురిడీ కొట్టించి ఉంటాడు .జగజ్జ౦త్రీ  గిరీశం అంటే ) వేదం లో కొత్త మంత్రమా .వింతగా ఉందే.

అగ్ని –నేనూ మొదష్లో అష్లాగే అనుకొన్నా .తీరా పంతులు విడమర్చి చెప్పేసరికి సరేనని తలూపాను .అదేదో కొత్తరకం క్రిమిట ప్రపంచాన్ని భయపెడుతోందట .పంతులు అంతా చెప్పాడు .ఎవరూ ఎక్కడికీ కదలకూడదట .ఒకరినొకరు ముట్టుకోరాదట .బారెడు దూరం లో ఉండాలట .

కరటక –అవునవును .నేనూ విన్నా .(లోపల -ఇదే సమయమని వీడు ఇక్కడ తిస్ట  కోసం మహా పనస అల్లాడన్నమాట )

అగ్ని దంపతులు –ఒరేయ్ కరకటం .ఎల్లాగో అలలాగా కస్ట పడి ఇక్కడికి వచ్చావ్ .అంతా సర్దుమణిగేదాకా నువ్వూ, పంతులు ,అబ్బి గాడితో ఇక్కడే ఉండి పో మాతోపాటు .

కరటక-బావా నువ్వేనా ఈమాట అన్నదీ .ఎప్పుడొచ్చినా ఎప్పుడు వెళ్తావు అనే కాని, నోరార ఒక్కసారీ ఉండమని అఘోరించలేదు .అందుకే జగత్తులో ఇంత విలయం .(మనసులో –మనకూ మంచిదే –మధురవాణి దగ్గర కెళ్లినా అంటూ కోకుండా ముట్టుకోకుండా  ఉండటం బ్రహ్మ ప్రళయం .కనుక ఇక్కడ తిష్ట వేయటమే  మంచిది .ఉభయ  భ్రస్టుత్వం- ఉపరి సన్యాసం ఎందుకు ?సరే నంటే పోలా ?)

  సరే- మీరు అంతగా బతిమాలుతున్నారు కనుక ,మీమాట గౌరవి౦చాలికనుక ఇక్కడే ఉండిపోతా (లోపల –ఇక్కడే ఉండిగిరీశం గాడికి చెక్ పెట్టటమూ మంచిదే .వెంకటేషి గాడి బీడీలు సిగరెట్లు చుట్టా నశ్యం తగ్గించనూ వచ్చు )

గి –చూశారా అత్తయ్యా మామయ్యా కరటక బాబాయిగారూ .ఎందుకొచ్చిందో కరోనాకానీ మనల్ని ఇక్కడే కలిపి ఉంచి మంచి పని చేసింది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు

 

 

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

ట్రయల్ రన్ గా ఇవాళ శనివారం పేస్ బుక్ లోప్రసారం

ట్రయల్ రన్ గా ఇవాళ శనివారం పేస్ బుక్ లోప్రసారం
ట్రయల్ రన్ గా ఇవాళ 28-3-20 శనివారం ఉదయం 10గంటలకు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ”శతజయంతి కరదీపిక ‘సరసభారతి ‘ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము వీక్షించండి .రేపటినుంచి నిన్న తెలియ జేసినట్లే కార్యక్రమాలు ప్రసారమౌతాయి -దుర్గాప్రసాద్ -28-3-20

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)

3-6-1981 లో ఉమేరిలో పుట్టిన ప్రఫుల్ గాడ్పాల్ సంస్కృత పిహెచ్ డి .న్యు ఢిల్లీ  రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ . బోధి చర్య వార్తారహ,యూనివర్సల్ మెస్సేజ్ ఆఫ్ బుద్ధిష్ట్  ట్రడిషన్ ,బృహర్నీతి శతకం రాశాడు

532-వేదిక సాహిత్య పరిచయిక కర్త –భావ ప్రకాష్ గాంధి (1982)

వేదిక సాహిత్య పరిచయిక రాసిన భావ ప్రకాష్ గాంధి 6-1-1982 గుజరాత్ లో పుట్టి సంస్కృతం లో శాస్త్రి అయి , జునాగడ్ లోని శ్రీ సోమనాథ్ సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ .శుభాషిత పీయూషం అనే మరో పుస్తకం కూడా రాశాడు .

533-చార్వాక దర్శన కర్త –హేమంత కుమార్ గంగూలీ (1914)

1-2-1914 న బారిసాల్ లో జన్మించిన హేమంత కుమార్ గంగూలీ కావ్యతీర్ధ ,సాంఖ్య తీర్ధ.జాదవ్ పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . చార్వాక దర్శన,సమాజ సాహిత్య ఓదర్శన,వైదిక ధర్మ ఓమీమాంస దర్శన ,ఫిలాసఫీ ఆఫ్ లాజికల్ కన్స్ట్రక్షన్ –గాడ్-రీజన్ అండ్ రెలిజియన్ వంటి 6పుస్తకాలు రాశాడు .

534-భారత దర్శనం కర్త –గరికపాటి లక్ష్మీ కాంతం (20వ శతాబ్దం )

హైదరాబాద్ నిజాం మహావిద్యాలయ తెలుగు హెడ్ గరికపాటి లక్ష్మీకాంతం 12పుస్తకాలు రాశాడు. అందులో భారత దర్శనం,భవ్యభారతం , విశ్వకవి,కీర సందేశం ,భారతరత్నం ఉన్నాయి .

535-సంస్కృత ఆయుర్వేద సుధ కర్త –భన్వారిలాల్ గౌడ్ (1946)

 ఔషధ ఆచార్య ,ఆయుర్వేద బృహస్పతి భాన్వారి లాల్ గౌడ్ 17-3-46 జైపూర్ లో పుట్టాడు .జర్మన్ భాషలో డిప్లొమా, పిహెచ్ డి.రాజస్థాన్ ఆయుర్వేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ .పండిట్ వ్రజ్ మోహన్ శాస్త్రి , వైద్యారాం కృష్ణ ల శిష్యుడు .16గ్రంథాలు రాశాడు -వాటిలో ఆయుర్వేద శబ్ద బోధ ,అష్టాంగ హృదయం ,సంస్కృత ఆయుర్వేద సుధ,ఆయుర్వేద చికిత్స విజ్ఞానం ,పదార్ధ విజ్ఞాన పరిచయం ఉన్నాయి .ఇంగ్లాండ్ ఫెలోషిప్ పొందాడు. శ్రీలంక ,సౌతాఫ్రికా పర్యటన చేశాడు .ప్రజ్ఞాపురస్కారం ,ఇషేర్ పురస్కారం ,ఆదర్శ ఆయుర్వేద శిక్షా పురస్కారం పొందాడు .

536-అగ్నిజా కర్త –బిషన్ లాల్ గౌడ్ –(1936)

వ్యాకరణ ఆచార్య బిషన్ లాల్ గౌడ్3-1-1936యుపి-ముర్దాబాద్ జిల్లా లక్ష్మణ్ పూర్ లో పుట్టాడు .సాహిబాబాద్ లో లెక్చరర్ .అగ్నిజా ,అహం రాస్త్రి పుస్తకాలు రాశాడు .

537-అభినవ శరీరం కర్త –దామోదర్ శర్మ గౌడ్ (20శతాబ్దం )

20శతాబ్ది దామోదర్ శర్మ గౌడ్ శ్రీ వైద్యనాధ ఆయుర్వేద భవన్ డాక్టర్ .అభినవ శరీరం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .

538-ముక్తావళి టీకా కర్త –జ్వాలాప్రసాద్ గౌడ్ (20వ శతాబ్ది )

20వ శతాబ్దికి చెందిన జ్వాలాప్రసాద్ గౌడ్ ముక్తావళి టీకా, సత్ ప్రతిపక్ష,స్వయభిచార  రచించాడు .

539-మహాకవి భాస ద్వారా ప్రణీత ప్రతిమా సాహిత్య అధ్యయనం కర్త –లలితకుమార్ గౌర్ (1962)

హిందీ ,సంస్కృత ఎం .ఏ .,సాహిత్య ఆచార్య లలితకుమార్ గౌర్ 1-1-1962 బులంద సహార్ లోపుట్టి ,కురుక్షేత్ర యూనివర్సిటిలో సంస్కృత ,పాళీ భాషలలో ప్రొఫెసర్ చేశాడు .ఆచార్య ప్రభు దత్త శర్మ ,డా.రాం కిషోర్ శర్మ ల శిష్యుడు .మూడు పుస్తకాలు రాశాడు .అందులో పై పుస్తకం ఒకటి .రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ అవార్డ్ గ్రహీత.

540-  ఘుర్మే సంతు శివాలయే కర్త –నందకిషోర్ గౌతమ్ (1936)

1936జనవరి 6 న రాజస్థాన్ మధోపూర్ జిల్లా శివార్ గ్రామం లో నంద కిషోర్ గౌతమ్ జన్మించాడు . సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ .5పుస్తకాలు రాశాడు .ఘుర్మే సంతు శివాలయే ,ఘుస్మేశ్వర పద్య కథా,ప్రతి శృతి ,యౌతుక నర్తనం ,సంస్కృత నిబంధ పారిజాతం రాశాడు .చాలా సంస్కృత కవి   సమ్మేళ నాలలో  పాల్గొని ప్రైజులు పొందాడు .సంస్కృత మేగజైన్ స్వర్ణమంగళ భారతి మొదలైన పత్రికలలో ఎన్నో వ్యాసాలూ రాశాడు .రేడియో టివిలలో కవితలు కథలు రాసి ప్రసారం చేశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

← Back

Thank you for your response. ✨

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం 
 శ్రీశార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించి అభినందించిన  బంధువులకు,సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు ఫేస్ బుక్ గ్రూపులకు ధన్యవాదాలు . ఈ కార్యక్రమం ద్వారా  ఎందరెందరికో సరసభారతి మరింత దగ్గరయింది ..   వారు ఇచ్చిన ప్రోత్సాహం ,సూచనలను అనుసరించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలను కూడా ఇలాగే ధారావాహికంగా వీలు వెంట పరిచయం చేయాలనే సంకల్పం కలిగింది .  ఈ ప్రణాళిక ఈ నెల 29 వ తేది చైత్ర శుద్ధ పంచమి ఆదివారం ఉదయం 10 గంటలకు ”సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా ”పుస్తక పరిచయం తో ప్రారంభిస్తున్నాను .సుమారు 45 నిమిషాలు ఉండే ఈకార్యక్రమాన్ని చూసి ఆనందించ వలసిందిగా కోరుతున్నాను . మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి  వెంటవెంటనే రోజూ ప్రసారం తో ”కరోనా  ఎమర్జెన్సి”పూర్తయ్యే లోపు పూర్తి చేయాలనుకొంటున్నాను  -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27 -3-20-ఉయ్యూరు 

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం జ్యోతి-27-3-20

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం

1-ఏతావంతం సమయం ,సర్వాపద్యోపి రక్షణ౦ కృత్వా -దేశస్య వరమిదానీం ,తాటస్త్యం వ హసి  దుర్గాంబ ”
2-”అపరాధా  బహుశః ఖలు-పుత్రాణా౦ ప్రతిపదం భవంత్యేన -కోవా సహతే లోకే ,సర్వాం స్తాన్మాతరం విహాయై కాం
‘3-‘మా భజ , మా భజ దుర్గే -తాటస్త్యం పుత్రకేషు ,దీనేషు -కేవా గృహ్ణ౦తి సుతాన్ ,మాత్రా త్యక్తా న్వదాంబికే. లోకే ”
4-”ఇతః వరంవా ,జగదంబ జాతు ,దేశస్య -రోగ ప్రముఖా పదోస్య -న స్యున్తథా కూర్వచలాం కృపాం   

   ఇత్యభ్యర్థనాం మే సఫలీ కురుస్వ ”
5-”పాహి హీన జనతా వన దక్షాఃః -సంతి నిర్జరవరా న కి జన్తః -పాపపూర్ణ జన రక్షణ దక్షాం,త్వాం వినా భువి పరా౦ న విలోకే ”

పై స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించమని స్వామి వారి ఉద్బోధ

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ 27-3- 20

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)

5-1-1938పాట్నాలో పుట్టిన వాచస్పతి ద్వివేది సంస్కృత ,హిందీసాహిత్య రత్న ,ఎం.ఎడ్.,పిహెచ్ డి.వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత హెడ్ .బ్రహ్మ దత్ ద్వివేది ,ప్రొఫెసర్ బొచ్చన్ ఝా  గురువులు .ప్రొఫెసర్ సుభాష్ చంద్ర త్రిపాఠీ,ప్రొఫెసర్ మీరా దూబే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .సంస్కృతం లో 8గ్రంథాలు రాశాడు .వాటిలో –కేదారఖండ పురాణం ,బృహదారణ్యక వృత్తి సారం ఉన్నాయి .శ్రీమద్ భగవద్గీతకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత అకాడెమి నుంచి విశిష్ట పురస్కారం పొందాడు .మారిషస్ లో 2008-09కాలం లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

522-కౌత్సస్య గురు దక్షిణ కర్త –వాసుదేవ శాస్త్రి ద్వివేది (1913)

వేద,వ్యాకరణ సాహిత్య రత్న వాసుదేవ శాస్త్రి ద్వివేది 1913లో యుపి లో భవానిచత్ర గ్రామం లో జన్మించాడు .13గ్రంథాలు రాశాడు .వాటిలో కౌత్సుక గురు దక్షిణ ,దీపమాలిక ,సంస్కృత గానమాల ,భోజరాజీయ సంస్కృత సామ్రాజ్యం ,సంస్కృత గౌరవ గానం ఉన్నాయి .సార్వ భౌమ సంస్కృత ప్రచార సంస్థ నెలకొల్పి సేవ చేశాడు .సంస్కృత భాష మాటాడే అనేక కాంపులు ఉత్తరాభారత్ లో నిర్వహించి భాషా వ్యాప్తికి అద్వితీయకృషి చేశాడు .1955లో రాష్ట్రపతి పురస్కారం పొందాడు .1958లో విశ్వభారతి అవార్డ్ అందుకొన్నాడు

523-త్రిదోష లోకః  కర్త-విశ్వనాథ ద్వివేది –(1910)

1910లో బాలియా జిల్లా ఓజ్హా వాలియా లో విశ్వనాథ ద్వివేది జన్మించి ఆయుర్వేద ఆచార్య అయ్యాడు .లక్నో యూనివర్సిటి ప్రొఫెసర్ .జాం నగర్ ఆయుర్వేద శిక్షణ కేంద్ర డైరెక్టర్ .7సంస్కృత పుస్తకాలు రాశాడు .వాటిలో త్రిదోష లోకః  ,తైల సంగ్రహం ,అభినవ నేత్ర రోగ విజ్ఞానం ,నాడీ విజ్ఞానం ,ప్రత్యక్ష ఔషధీ నిర్మాణం ఉన్నాయి .వారణాసీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో నూ సేవలందించాడు .

524-పథిక జన పాటక చింతామణి కర్త –వ్రిజ్ వల్లభ ద్వివేది (1921)

 1921లో  సహపురా బిల్వాడా లో జన్మించిన దర్శనాచార్య వ్రిజ్ వల్లభ ద్వివేదిసంస్కృత ప్రొఫెసర్ .ప్రొఫెసర్ ధుంది రాజ్ శాస్త్రి ,రఘునాధశర్మల వద్ద విద్య నేర్చాడు.ప్రాచీన నిర్ణయ పత్రం , పథిక జన పాటక చింతామణి గ్రంథాలు రాశాడు .

525-గురువాయూర మహాత్మ్యం కర్త –వాసు దేవన్ ఎలయంత్ (1912)

  గురువాయూర మహాత్మ్యం రాసిన వాసు దేవన్ ఎలయంత్15-6-1912న కేరళలోని త్రిస్సూర్ జిల్లా కక్కస్సేరి లో పుట్టాడు .న్యాయ భూషణ్ ,సాహిత్యశిరోమణి .మన్నీత శాస్త్రి శర్మ ,అచ్యుతపోత్వాల్ ,రాం వారియర్ లు గురువులు .కృష్ణ గీతి , గురువాయూర మహాత్మ్యం అనే రెండు గ్రంథాలు రాశాడు .

526-అద్వైత ధర్మ౦ కర్త –కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్(1943)

కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్ 5-3-1943న కేరళలో వజ్హూర్ లో పుట్టాడు .సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ ,అడయార్ లైబ్రరి రిసేర్చ్ సెంటర్ డైరెక్టర్ .శృంగేరి మఠం కృష్ణ శాస్త్రి దగ్గర విద్య నేర్చాడు .సంస్కృతం లో 10పుస్తకాలు రాశాడు .అందులో అద్వైత ధర్మ౦ఒకటి .దిఎదిక్స్ ఆఫ్ సాంస్క్రిట్ ,డి కాన్సెప్ట్ ఆఫ్ జీవన్ముక్తి కూడా రాశాడు కేరళ సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత

527-కేరళో దయః కర్త –కె.యెన్ .ఎలుతచ్చన్ (1911)

1911జూన్ 19 కేరళ చెర్పల్ చేరిలో పుట్టిన కె.యెన్ .ఎలుతచ్చన్ సాహిత్య శిరోమణి .కుసుమోపహారం ,ప్రతిజ్ఞ,ప్రతీక్ష ,కేరలోదయః  అనే నాలుగు పుస్తకాలు రాశాడు .కాలికట్ యూని వర్సిటి మలయాళం డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .1976లో కేరలసాహిత్య అకాడెమి అవార్డ్ ,1979లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .

528-ఆధునిక భారతీయతత్వజ్ఞాన  కర్త –హేమంత విష్ణు ఈనాం దార్(1925-2006)

హేమంత విష్ణు ఈనాం దార్ 1925 నవంబర్ 3 న మహారాష్ట్రలో పుట్టాడు .సంస్కృత మరాఠీ లలో ఎం .ఎ. ఎల్ఎల్ బి ,పిహెచ్ డి .12పుస్తకాలు రాశాడు .అందులో సంత్ నామ దేవ ,భక్తీ పంధా-నవ చింతన ,శ్రీ ఏకనాధ దర్శన ,ఆధునిక భారతీయ తత్వ జ్ఞాన  ఉన్నాయి .81 ఏళ్ళు జీవించి 23-6-2006 చనిపోయాడు

529- సారస్వత్య  శాఖ  కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ (1970)

సారస్వత్య  శాఖ  కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ 1970మే 20 న కేరళ త్రిస్సూర్ జిల్లా ఎలవల్లి లో జన్మించి సాహిత్య౦లొ పిహెచ్ డి పొందాడు .హైదరాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .వాసుదేవన్ ఎలాయత్ ,ప్రొఫెసర్ కే గోవిందన్ నంబియార్ ,భారత్ పిశోడీ లు ఇతని గురుపరంపర .12పుస్తకాలు రాశాడు .సారస్వత్య  శాఖ ,భ్రుగు వంశ మహాకావ్య ఆఫ్ ప్రతాప రాజ ,దిముక్తావళి ,.ఇండియన్ అనలిట్రిక్ ట్రడిషన్స్ లో కంప్యూటరేషనల్ అప్ప్రోచ్ ప్రాజెక్ట్  హెడ్ .

530-ఖాది గీత కర్త –ఆత్మారాం కమల్ ఫోందారి(1944-2000.)

15-6-1944న తిహారి గద్వాల్ లో పుట్టిన ఆత్మారాం కమల్ ఫోందారి వైద్య విశారద ,.ఖాదీ గీత ,శ్రీ కమలా గురువంశ మహిమ్న స్తోత్రం రాశాడు .56ఏళ్ళు మాత్రమె జీవించి 2000 సంవత్సరం లో మరణించాడు .సంస్కృత హిందీ గద్వాల్ భాషలలో మహాకవిగా కీర్తి గడించాడు .సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !

 జనతా కర్ఫ్యూ ప్రవేశపెట్టి వారం అవుతోంది .ఉద్యోగస్తులకు జీతం నాతం వస్తుంది కనుక ఇబ్బంది లేదు .పనుల్లేక దినకూలీలు యెంత బాధ పడుతున్నారో ఏలినవారు గమనిస్తున్నారా ? తమ చిత్తం ప్రకారం నడుచుకొంటూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న పేద లకు ఇప్పటి వరకు హామీల వర్షమే కాని ,’’కనకధార’’ ,సరుకు ,కూరగాయల రవాణా లేక  రేట్లు ఆకాశం లో ఉంటె ఉన్న డబ్బు తో కొనలేక గగ్గోలు పడుతున్నారు .మీ ఆన శిరసావహించే పేదలపై ఉపేక్ష ఇప్పటికైనా వదలండి .చురుగ్గా ,కరుగ్గా ముందుకు కదలండి .యాత్రలకని బయల్దేరిన జనం ఇతర రాష్ట్రాలలో దిక్కు తోచక ,సాయం అందకా ,ఇంటికి చేరే రవాణా సౌకర్యాలు అన్నీ మూసుకుపోగా బావురు మంటూ కాశీ మొదలైన ప్రాంతాల్లో ఉన్నట్లు పేపర్లద్వారా, చానళ్ళ ద్వారా తెలుస్తున్నాయి తమ చెవులకు కళ్ళకు ఆ వార్తలు వినిపిచాలేదా కనిపించలేదా ? వాళ్లకు ఊరట కలిపించే ప్రయత్నం వీసమైనా చేశారా ?పక్కరాస్త్రానికి ఇదే సమయమా హాస్టళ్ళు మూసి విద్యార్ధుల్ని రోడ్లమీద పడెయ్య టానికి ఒక నవారమో పక్షమో  పోషించి హాయిగా ఇంటికి పంపిస్తే ఘనమైన ఆప్రభుత్వాన్ని యెంత మెచ్చుకొంటారు ?ఇంతలోనే కక్కూర్తా ? ఇప్పుడే కళ్ళు తెరిచి కొన్ని పనులు చేబట్టినట్లు విన్నాను ధన్యవాదాలు .

1-ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమాచారం సేకరించి వెంటనే తగిన వైద్య పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెంది వాళ్ళ స్వగ్రామాలకు పంపే ఆలోచన సత్వరమేచేయండి .లేకుంటే ‘’హోమ్ సిక్ నెస్’’తో దూరంగా ఉన్నవాళ్ళు ,వాళ్ళ కోసం కుటుంబ సభ్యులు  బాధ పడే ప్రమాదం ఉంది .ఉభయ తెలుగు రాష్ట్రాలు, కేంద్రం ఈ విషయం లో త్వరగా చర్యలు తీసుకొని ప్రజాసేవ చేయాలి మహా ప్రభో .

2-వాలంటీర్లకు వేలాది జీతాలిచ్చి పోషిస్తూ వారితో ఈ సమాచారం తెప్పించుకోకపోతే వారికిసాయపడకపోతే ఎలా ?తగిన చర్య నిమిషాల్లో జరగాలి ,జరపాలి .సరుకులు ,వారానికి కనీసం మూడు వేల రూపాయలు అర్జెంట్ గా వారి ఇళ్ళకు చేర్చాలి .లేకపోతె ఆకలి బాధ ,మాల్ న్యూట్రిషన్ ప్రమాద ఘంటికలు మోతాయ్ .చేతులుకాలాక ఆకులు పట్టుకో వద్దు ఇల్లుకాలాక నుయ్యి తవ్వొద్దు .జనాలకు కావలసింది ఊరడింపు మాటలు, హావభావాల చేష్టలూ కాదు .సానుభూతి ,సహకారం ,చేయూత ఓదార్పు ఆరోగ్య రక్షణ కావాలి .ఇవన్నీ కలిసి పని చేసేట్లు చూసే సమన్వయ వ్యవస్థ కావాలి . .

3-ఇళ్ళకు డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అనుమానం ఉంటె హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలి .

4-ఇలాంటి ఎపెడేమిక్ ఉపద్రవాల్లో ఎప్పుడూ ముందుండే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు .వారి ఆరోగ్యాలకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు వారి సేవలు వినియోగించుకోవాలి .

5-స్థానికం పోస్ట్ పోన్ అయ్యాక ,కోర్టులు చీవాట్లు పెట్టాక మన పోలీసు వ్యవస్థ కొంత ముందుకు కదలటం శుభ పరిణామం .ఇందులో పార్టీ విచక్షత చూపి ,పక్ష పాతం ప్రదర్శించి వ్యవస్థకు కుల ,రాచకీయ ‘’ పక్షవాతం తెచ్చి’’ సమాజాన్ని నిర్వీర్యం చేయకండి .బాధితులు ఎవరైనా ఒక్కటే .అక్కున చేర్చి ఓదార్చి మెప్పు పొందండి’’ మూడు సి౦హాల వారూ ‘’.ఇదే చేయకుంటే చరిత్ర మనల్ని క్షమించదు.

6-అమరావతి పై ఉద్యమిస్తున్న రైతులను మహిళలను సాంత్వన దృష్టితో చూడండి. రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఎప్పుడూ ఉండేదిఓటుహక్కున్న ‘’ఆం ఆద్మీలే’’.కేజ్రీ వాల్ ను చూసి నేర్చుకోండి .నోళ్ళు సంబాళించు కోండి.  ఇకనైనా వీటిని గుర్తించండి . ఉస్ట్ర పక్షి పోకడలు వినాశ హేతువు  .

  ఈ షట్కర్మ నిరతులై ప్రజాభిమానం పొందమని పాలక ,ప్రతిపక్ష ,స్వచ్చంద సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

 వద్దురా — గోలోకం… కైలాసం

 వద్దురా —

గోలోకం –నాదా కృష్ణా !మురళి వాయిస్తూ భూలోకం వెళ్ళకు .అందులోంచి  తు౦పురులు  బయటకొచ్చి నీకూ గోపాలురకు ఇబ్బంది కలిగించి అదేదో ‘’కరోడా ‘’అట అంటుకుంటుంది .నువ్వు అసలే పిచ్చిమారాజువు .అది ఇక్కడికి తెస్తే మనం ఏమీ చెయ్యలేం . చద్దన్నాలని ఎంగిళ్ళ ని ,మురళి వాయిస్తామని ,నీ మురళి లాక్కోవచ్చు ‘’అంటు’’తో అంటుకునే మహమ్మారి అట .నువ్వు దయార్ద్ర హృదయుడివి .చిన్ననాటి నెచ్చెలి అని కుచేలుని అటుకులు తినేవ్ .ఆయన ఎంగిలి నీకు అభ్యంతరం లేదు కాని, నా  జాగ్రత్త నేను పడాలిగా .నిరంతరం నీ వెంటే నేనుంటున్నా ఎప్పుడో కనుమాయచేసి వ్రేపల్లె గొల్ల వనితలతో సరసాలాడి, ‘’కిందా మీదా ‘’అవుతావ్ .ఇకిలి౦పులు ,సకిలింపులు కౌగిళ్ళు, వేధింపులు ,సాధింపులు ,లాలనలు ,పాలనలు తో  ఆ సూక్ష్మజీవి ప్రకోపిస్తే కొ౦ప లంటుకుంటాయి .మీ అమ్మ వడిలో గారాలుపోయినా ముప్పే ముకుందా .మీ అన్న గారిని వెంటేసుకొని అడవులు ,లోయలు తిరగద్దు. యమునా నదీ విహారం ,వెన్నెల్లొడపిల్లల్తొ జల్సాలు చేస్తే నా వల్ల కాదు వేణుగోపాలా !పాలు వెన్నామింగి కొంప కొల్లేరు చేయకు కొంటె కృష్ణా.  కాళింది మడుగు బురదమయం ట .ఆ నీళ్లు ప్రమాదమట .పడగలపై అడకయ్యా పావన నామా .రోలు ముట్టుకున్నా, మద్ది చెట్లు కూల్చినా చేతులు తాకటమే కదా  త్వరగా  ఆ  జీవులు వ్యాపిస్తాయట .బండీ ,ఎద్దు , ధేనువుల జోలికి వెళ్ళద్దు దేవకీ నందనా .తేరగా ఇస్తోందని పూతన పాలు తాగితే, రోగం అంటుకొని రొస్టున పడతావ్  .అసలే శరదృతువు .నీకు మరింత ఉద్దీపనకలిగిస్తుంది .రాసక్రీడల మొనగాడివి . చెట్ల వెంటా, పుట్టలవెంటా చెట్టాపట్టాలేసుకొని ఆలింగనం తో మై మరచిపోతే  అసలుకే మోసం రాస విహారీ .అస్టభార్యలూ ,పదహారు వేల కన్యలూ మర్చిపో .ఇది నా ఆన .అందుకే నిన్ను నా ఇంట్లోనే బందీ చేస్తా .నా గదిలోనే అన్నిజాగ్రత్తలతో అదేదో’’ క్వారన్ టైన్’’ ట అందులో ఉంచినట్లు ఉంచేస్తా .కనుక ఒద్దురా కన్నయ్యా ,పోవద్దురా అయ్యా ‘’.

  కైలాసం –వినాయకుడు -ఒరేయ్ అనిన్ద్యా !నా దగ్గర అయిదు నిమిషాలు ఉండవ్ ఎప్పుడూ కలుగుల్లో నక్కుతావ్ .సుస్టుగా నాతో  భో౦ చేస్తున్నా  ,ఇంకా కక్కుర్తి ఎందుకు .భూలోకం పోయి మూతలు పడేసి  ఉన్నవి హుష్ కాకీ చేసి  చటుక్కున తిరిగోస్తావ్ .ఇక అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు .అత్యవసర పరిస్థితి ఉందక్కడ  .స్పర్శ తో వచ్చే జబ్బు ట ప్రపంచమంతా వ్యాపించి భీభత్సం చేస్తోంది .నువ్వు అక్కడ ఎంగిలి చేసి ఇక్కడికొస్తే ఇక్కడా అదే భీభత్సం వచ్చి దిక్కుండదు .నాన్నగారు కూడా ఏమీచేయలేరు .శక్తిమయి అమ్మ వల్లాకాదు.కుడుములు ఉండ్రాళ్ళు అటుకులు నానుబెల్లం చలిమిడి ,పానకాలు ముట్టుకోకు .అన్నీ బంద్. మాంసాహారం అనర్ధం తెస్తోంది .ఒళ్ళు దగ్గర పెట్టుకో .ఆ జబ్బు అంటుకుంటే అంతే. మందూ లేదు మాకూ లేదు .అందుకే నిన్ను నా కాలి కింద గూట్లో బంధిస్తున్నా .వద్దురా ,ఎక్కడికీ   వెళ్ళద్దురా’’.

 పార్వతి శివుడితో –‘’ప్రాణేశ్వరా ! భూలోకం భయానకంగా ఉందని నారదుడు చెప్పి వెళ్ళాడు ఇప్పుడే .కొత్త వైరస్ వ్యాపించి అల్లకల్లోలం చేస్తోందట .మందులేదట .అంటుకుంటే వస్తుందట ఆ జబ్బు .మీరేమో భోళా శంకరులాయే.ఏ నరుడో వానరుడో దానవుడో కొ౦పమునిగే తపస్సు చేస్తే ,మీ అర్ద భాగం గా  ఉన్న నాకే తెలీకుండా, గుట్టు చప్పుడు కాకుండా పరిగెత్తుకెళ్ళి  వాళ్ళకు  అడ్డదిడ్డమైన వరాలు ఇచ్చేసి చక్కారావటం, వాళ్ళు లోక భీకరులై ప్రవర్తించటం ,డీలా పడి మీరుంటే, అన్నయ్య విష్ణుమూర్తి వచ్చి ఏదో చిట్కాతో పరిష్కరించటం జరిగింది ఇన్నాళ్ళూ .మళ్ళీ ఏ భస్మాసురుడు లాంటి వాడో తపస్సు చేస్తే జాలిపడి వరం ఇస్తే వాడు మీ నెత్తిన చెయ్యి పెడితే  సర్వమంగళ నైన నాకు కూడా దిక్కు ఉండదు .మీ తలద్వారా నాకు అంటుకొని కైలాసం  గోవిందో  హారి . నెత్తికెక్కి కూర్చున్నమీ ముద్దులావిడ తో సరసం  బంద్ చేయకపోతే ప్రళయమే .నీటి వలన వ్యాపించే క్రిమిట  ఇప్పుడు విశ్వాన్ని అంతట్నీ వణికించేది . మీ పాములూ పుర్రెలు చర్మాలు తాకితే చాలు క్రిములు విపరీతంగా పెరిగి పోతాయట.వీటన్నిటిని కట్టడి చేయటం నా వల్ల కాదు భూతనాథా,పశుపతీ ఈశ్వరా , పరమేశ్వరా . కనుక ఇక మీరెక్కడికీ వెళ్ళటానికి ఒప్పుకోను .క్వారంటైన్ లాంటి  ‘’డీప్ ఫ్రిజ్ ‘’పెట్టె తయారు చేయించాను .అందులోనే మీమకాం .వద్దురా వృషాధిపతీ !త్వరపడి ఎక్కడికీ పోవద్దురా శంభూ .’’

‘’వద్దురా కన్నయ్యా ,పోవద్దురా వృషాదిపతీ,   వెళ్ళోద్దురా  -వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు ‘’

అంటూ పలవరిస్తుంటే మా ఆవిడ వచ్చి’’ ఏమిటీ కూని రాగాలు పొద్దున్నే .పనీ పాటా లేకపోతె సరి ‘’ అని నాలుగు ఝాడిస్తే కాని అది కల అని తెలియలేదు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో చూసి స్పందించిన సాహితీ బంధువులకు అభిమానులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు .మా అబ్బాయి శర్మనిన్న ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఫేస్ బుక్ లో పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది అని సూచించటం ,మా అబ్బాయి రమణ ,మనవడు చరణ్ నా సెల్ ఫోన్ లో ఆ యాప్ డౌన్ లోడ్ చేసి రెడీ చేయటం తో సాయంత్రం 5 గం లకు పంచాంగ శ్రవణం లైవ్ జరిగింది .ఇదే మొదటి ప్రయత్నం అవటం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయాం .కెమెరా నాకు ఇంకొంచెం దగ్గరగా ఉండిఉంటె ,మరింత స్పష్టంగా కనిపించి, వినిపించి ఉండేదని గ్రహించాం .వీక్షకులు చాలా ఉత్సాహంగా చాలామంది చూసినట్లు అర్ధమయింది అందరికీ మరోమారు ధన్యవాదాలు -మీ దుర్గాప్రసాద్ -26-3-20

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)

ఇప్పటి వరకు 1605మంది గీర్వాణ కవులగురించి రాశాను .ఇప్పుడు 1606వ కవిగా ఈ ఎపిసోడ్ లో  516 వ కవి ని గురించి రాస్తున్నాను’

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)

15-3-1928 న ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో జన్మించిన శివ శరణ్ శర్మ ద్వివేది హిందీ సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ డి,ఎల్ ఎల్ బి కూడా ,మధ్యప్రదేశ్ ప్రభుత్వకాలేజి ప్రిన్సిపాల్ .10పుస్తకాలు రాశాడు .అందులో శ్రీమద్భాగవత కావ్య సౌందర్య ,జాగరణం, లోకార్చనం ,ఆవాహన మొదలైనవి .

517-సంస్కృత వ్యాకరణ పుస్తక రచన వర్క్ షాప్ నిర్వహించిన –శ్రేయాన్ష్ ద్వివేది (1969)

1969-జనవరి 10 పుట్టిన శ్రేయాన్ష్ ద్వివేది ఏం ఏ పిహెచ్ డి .స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ .సంస్కృతం లో రెండు పుస్తకాలు రాశాడు .సంస్కృత వ్యాకరణ పుస్తకరచన  వర్క్ షాప్ నిర్వహించాడు .సంస్కృత ఆడియో ప్రోగ్రాం లు నిర్వహించాడు .సాంస్క్రిట్  సెలెక్టేడ్ స్టోరీస్ కు విద్యా వీడియోలు తీశాడు .సంస్కృత కర్రిక్యులం డిజైన్ చేశాడు .

518-విశాల భారత్ కర్త –శ్యాం వరణ్ ద్వివేది –(1916-1975)

1916లో పుట్టి 59 ఏళ్ళకే 1975లో చనిపోయిన శ్యాం వరణ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో జన్మించాడు .విశాల భారత్ అనేఒకే ఒక గ్రంథం రాశాడు .

519-దీర్ఘ వృత్త లక్షణ కర్త –సుధాకర్ ద్వివేది –(1917-1960)

వారణాసి లోని ఖజూరీలో 1917లో పుట్టి 43ఏళ్ళకే 1960నవంబర్ 28న చనిపోయిన సుధాకర్ ద్వివేది జ్యోతిష శాస్త్ర పారంగతుడు .34గ్రంధాలు రాశాడు. వారణాశి సంస్కృత కాలేజి లెక్చరర్ .దేవి కృష్ణమిశ్ర శిష్యుడు .మహామహోపాధ్యాయ పండిత మురళీధర  మిశ్ర ,పండిట్ బలదేవ్ మిశ్ర ,పండిట్ రామాయణ్ ఓఝా,పండిట్ బలదేవ దత్ పాఠక్ వంటి ఉద్దండులవద్ద విద్య నేర్చాడు .రచించిన 34పుస్తకాలలో దీర్ఘ వృత్త లక్షణం ,వాస్తవ చంద్ర శ్రీరంగోన్నతి సాధనం ,భూ భ్రమ రేఖాని రూపనం ,గానకట రంగిని,దిన మీమాంస ఉన్నాయి ,బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసింది .సిద్ధాంత జ్యోతిషం లో అఖండుడు.

520-నారాయణ కావ్యకర్త –ఉమాపతి ద్వివేది –(1853-1911)

ఉమాపతి ద్వివేదివ్యాకరణ ,న్యాయ శాస్త్రాలలో అద్వితీయుడు .గోరఖ్ పూర్ లో సహువాపార్ లో 1853లో పుట్టి 58వ ఏట 1911లో మరణించాడు .అయోధ్యలోని వశిష్ట పాఠశాల సంస్కృత టీచర్ .పండిట్ హరిదత్ ద్వివేది శిష్యుడు .4గ్రంథాలు రాశాడు .సనాతన ధర్మోద్ధార ,శబ్దెందు శేఖర కు జట,టీకా ,పరభాషే౦దు  శేఖర కు జటా, టీకా,నారాయణ కావ్యం రాశాడు .విద్యామహార్ణవ బిరుదాంకితుడు .

  సశేషం

శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం

  ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .

అందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు .

శ్రీ కళ్యాణ గుణావాహం రిపుహరం –దుస్వప్న దోషాపహం –గంగాస్నాన విశేష పుణ్య ఫలదం –గోదాన తుల్యం నృణాం-ఆయుర్వృద్ధిద ముత్తమం ,శుభకరం –సంతాన సంపత్ప్రద౦

నానా కర్మ సుసాధానం –సముచితం –పంచాంగ మాకర్ణ్యతాం’’ .

‘’శుక్లాంబరధరం విష్ణుం –శశివర్ణం చతుర్భుజం –ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ‘’

‘’సుముఖశ్చైక దంతశ్చ్య కపిలో గజకర్ణికః –లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః –ధూమ కేతుర్గణాధ్యశ్చఃఫాలచంద్రో గజానన –వక్రతుండ శ్శూర్ప కర్ణోః హేరంబ స్కంద పూర్వజః ‘’

‘’సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ –విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ‘’

‘’యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా –యా వీణా వరదండ మండిత కరా  యాశ్వేత పద్మాసనా –యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భి ర్దేవై స్సదా పూజితా –సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా .

‘’లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం –దాసీభూత సమస్త దేవ వనితాం –లోకైక దీపాంకురాం –శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం-త్వం త్రైలోక్య కుటుంబిణీ౦-సరసిజాం వందే ముకుంద ప్రియాం .’’

శ్రీ శార్వరి నామ  సంవత్సర ఫలం

ఈ సంవత్సరం రాజు ,ధాన్యాధిపతి  బుధుడు .మంత్రి ,సైన్య, అర్ఘ్యా,మేఘాధిపతి చంద్రుడు . ,సస్యాధిపతి ,నీరసాధిపతి గురుడు .రసాధిపతి శని .నవనాయకులలో ఎనిమిది ఆధిపత్యాలు శుభులకు ,ఒక్క ఆధిపత్యం మాత్రమే – అదీ శనికి వచ్చాయి .శత్రువు మిత్రుడు అవటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సఖ్యత ,సహాయ సహకారం ఒకమాదిరిగా మాత్రమె ఉంటాయి ,

‘’శార్వరీ వత్సరే సర్వ సస్య వృద్ధిర్భవే ద్భువిః-రాజానో విలయం యాంతిపరస్పర జయేచ్ఛ  యా  ‘’అంటే –అన్ని పంటలు బాగా పండుతాయి .నాయకులు  విజయ కాంక్షతో పరస్పర విరోదాలతో నశిస్తారు .

బుధుడు రాజు అవటం వలన గాలి భయం.స్త్రీ,పురుష సమాగమభయం ఉంటాయి .మేఘాలు కొద్దిగా వర్షిస్తాయి .పంటలు ఒకమాదిరిగా పండుతాయి

‘’సదాగతి స్సాద్వ సక్రుత్ప్రజానం నరాః-స్త్రీయోవా రతికర్మహీనాః –ధారధరాశ్చాప్యవిముక్త ధారాః –మధ్యాని సస్యాని భవంతి భూమౌ.

మంత్రి చంద్రుడు అవటం వలన –పంటలకు తగిన వర్షం కురిసి ధాన్యాలు బాగా పండుతాయి .ప్రజలు ఆరోగ్యంగా క్షేమ౦గా సుభిక్షంగా ఉంటారు –

‘’సువృస్టి స్సర్వ సస్యాని ఫలితాని భవంతిచ –క్షేమారోగ్యం సుభిక్షం స్యాచ్ఛశాంకే సచివే సతి ‘’

సేనాధిపతి చంద్రుడవటం వలన –అధికధారాలు ,అధిక వర్షం ఉంటాయి .ప్రజలు ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు .ఆవులు పాలుబాగా ఇస్తాయి .

‘’అతివర్ష మతీవార్ఘ ,మరోగా స్సుఖినో జనాః –బహు క్షీర ప్రదా గావ  శ్చ౦ద్రే ససేనాధిపతిః’’

సస్యాధిపతి గురువు –యవలు ,గోధుమలు ,శనగలు బాగా పండుతాయి .పచ్చని నేలలో పంటలు ఎక్కువ .

‘’యావ గోధూమ,చణకాః ఫలితాశ్చ భావంతిహి-పీత దాత్రీచ ఫలితా గురౌ సస్యాదిపే సతి’’

ధాన్యాధిపతి బుధుడు –మేఘాలు గాలులచే చెదరగొట్టబడి ,పంటలకు అనుకూల వర్షం కురవదు .ధాన్యాలు కొద్దిగా పండుతాయి .పాలకులు ఆందోళనతో ఉంటారు –

‘’మధ్య వృష్టి ర్మంద సస్యం మేఘా వాతేన పీదితాః-త్రాపస్సర్వ నృపాణా౦చ  బుదే ధాన్యాది పతే సతి’’

అర్ఘాధిపతి చంద్రుడు –పంటలను బట్టి వర్షం వస్తుంది .పైరులన్నీ బాగా ప౦డుతాయి కాని ధరలు బాగా పెరుగుతాయి –

‘’సువృస్టి స్సర్వ సస్యానా మభీ వృద్ధిశ్చ జాయతే –మహతీ దార్ఘ్య వృద్ధిస్యాచ్ఛ౦ద్రేచారార్ఘ్యా దీపే సతి .

మేఘాధిపతి చంద్రుడు –దేశమంతా సస్యానుకూల వర్షం కరుస్తుంది .పూర్వ అపర ధాన్యాలు బాగా పండు తాయి .గోక్షీరం సమృద్ధి .

రసాధిపతి శని-చెరుకు నెయ్యి నూనె బెల్లం తేనే ఉప్పు కర్పూరం వగైరా రస జాతుల ధరలు తగ్గుతాయి .-

‘’ఘ్రుత  తైల గుడా క్షౌద్రాః ఏ చానె రస రస జాతయః –శూన్యార్ఘ్యం యాంతి తే సర్వే,శనౌయది రసాదిపే ‘’

నీరసాధిపతి గురుడు –వక్కలు రత్నాలు బ౦గారం ధాన్యాలు పత్తి చర్మం చందనం బాగా వృద్ధి చెందుతాయి .బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉంటారు –

‘’పూగీ ఫలా న్యఖిలం రత్న సువర్ణ ధాన్యం కార్పాస చర్మ కుసుమానిచ చందనం చ –వృద్ధియయుర్ద్విజః గణా స్సుఖినో భవంతి భూమౌచ నీరసపతౌ సురరాజ పూజ్యే ‘’

ఈ సంవత్సరం లో ఆశ్వయుజమాసం అధికమాసం .నిజ ఆశ్వయుజం లోనే శుభకార్యాలు ,శరన్నవ రాత్రులు జరుగుతాయి .

20-11-20కార్తీక శుద్ధ షష్టిశుక్రవారం గురుడు మకరరాశిలో ప్రవేశించటంతో  తుంగ భద్రానదికి పుష్కరాలు ప్రారంభమై 1-12-20కార్తీక బహుళ పాడ్యమి మంగళవారం వరకు 12 రోజులు జరుగుతాయి .

29-5-20నుండి 8-6-20 వరకు శుక్ర మౌఢ్యమి .16-1-21నుంచి 10-2-21వరకు గురు మూఢమి కనుక శుభకార్యాలు ఉండవు .

21-6-2020జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిరా నక్షత్ర చివరిపాదం లో’’చూడామణి ‘’పేరున్న  సూర్యగ్రహణం .ఉదయం 10-25కు ప్రారంభమై ,మధ్యాహ్నం 1-53 దాకా ఉంటుంది .మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులు చూడకుండా ఉండటం మంచిది .

14-1-2021పుష్యశుద్ధ పాడ్యమి తాత్కాల విదియలో శ్రవణా నక్షత్ర యుక్త వృషభ లగ్నం లో మధ్యాహ్నం 1-57కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటం వలన మకర సంక్రాంతి .సంక్రాంతి పురుషుడి పేరు ‘’మంద ‘’.

ఒకటిరెండు రాష్ట్రాలలో ఊహించని పరిస్థితులేర్పడతాయి .దేశం లో ఆర్దికమాన్ద్యం ఇబ్బందిగా ఉంటుంది .పాక్ కుపీడ  ఈఏడాది  .భారత్ –చైనాలమధ్య డిషుం డిషుం.మన దేశ సీనియర్ నాయకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది .శ్రీ లంక భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలమై ,దేశాధ్యక్షుడికి ఇబ్బంది కలుగుతుంది .బంగ్లాదేశ్ లో అనిశ్చిత పరిస్థితులు ..మయన్మార్ లో రాజకీయాలు దారితప్పచ్చు .ధాయ్ లాండ్ లో తిరుగుబాట్లు జరిగే ప్రమాదం .మలేశియాలోనూ కల్లోల పరిస్థితులే .సైన్స్ లో    ఫ్రాన్స్ గణనీయంగా పేరుపొంది ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందచ్చు .పశ్చిమాసియాలో భారీ భూకంపం రావచ్చు .అమెరికా అడకత్తెరలో పోక గా మారుతుంది .ట్ర౦ప్ మళ్ళీ గెలవచ్చు .దక్షిణ కొరియా భారత్ భాయి భాయి .అగ్నిపర్వత ప్రాంత ప్రదేశాలు జాగ్రత్తగా ఉండాలి .

  ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .

శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు

25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు

image.png

image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రీ శార్వరి ఉగాది పంచా౦గ శ్రవణం కు ఒక రోజు ముందు రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రవణం వినండి- సారీ చదవండి .ఈ సంవత్సరం నవగ్రహాలలో 8గ్రహాలు శుభులు ,ఒక్కటే పాపగ్రహం .రాజు ,ధాన్యాధిపతి బుధుడు .మంత్రి ,సస్య ,నీరసాది పతి గురుడు .సైన్య ,అర్ఘ ,మేఘాధిపతి చంద్రుడు .రసాధిపతి శని .కనుక లెక్క ప్రకారం శుభులు ఎక్కువవటం తో అన్నీ మంచి శకునాలుగా ఉండాలి .కానీ సీన్ రివర్స్ అయింది  . మన రాష్ట్రం లోఎమ్యెల్యేలు, ఎం .ఎల్సీలు  ,కేంద్రంలో సభ్యతమరచి రాజ్యసభ సభ్యులు ,కర్ణాటక,మద్యప్రదేశ్ లలో నిస్సిగ్గుగా శాసనసభ్యులు బోర్డులు తిప్పేసి గుంపుగా జంప్ జిలానీలయి ,కొత్తప్రభుత్వాలకు వీర విదేయులైనట్లే , గత  డిసెంబర్ లోనే మన శుభగ్రహాలన్నీ జంప్ జిలానీలై పాపులుగా ,’’పావులు’’గా మారిపోయి విశ్వవ్యాప్త ఉపద్రవం కరోనా సృష్టించి ఒక దేశాన్ని నాశనం చేయాలని మరో దేశం పై ప్రయోగించి  ,వీర విష విలయాలు వ్యాపింపజేసి అదుపుకాని స్థితి కల్పించి ,కాలిఫోర్నియా దావాగ్నిలా ,దివిసీమ బడబాగ్నిలా  వేలాదిగా జనం చనిపోతుంటే ఆనందంగా  స్మశానాలలో చలికాచుకొంటున్నారు పైశాచికంగా .

    టచ్ ద్వారా వ్యాపించే ఈ వైరస్ యెంత భయానకంగా వ్యాపిస్తోందో ఇప్పుడు తెలుసుకొని ‘’బావురావురు’’ మంటున్నాయి అగ్ర దేశాలైన ఉగ్రదేశాలు .మానవత్వం మంట గలవటానికి అదుగో  ఆ శుభగ్రహాల కప్పదాట్లే కారణం .కొన్ని దేశాలలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ .అగ్రదేశాలు ‘’కొంప’’లోనే అన్నీ కానిమ్మని లాకౌట్ ,లు లాక్ డౌన్లూ  చేసి నరసంచారం లేకుండా చేస్తున్నారు .’’కరోనా! బొంగా  !అదే౦ చెయ్యలేదు ఉత్తిహడావిడి పార సెట్మాల్  వాడమని బ్లీచింగ్ తో స్నానం చేయమని ప్రకటించి మర్నాడే ప్లేట్ ఫిరాయించి లాక్డౌన్ చేయించి ‘’బయటికొస్తే ముక్కుతో చంపేస్తా ‘’అని భయపెట్టాడు పక్కరాస్ట్రనాయకుడు .ఆయన్నే ఆదర్శంగా అడుగులేసే మన పరమానందయ్య శిష్యుడు గురూ మొదట చెప్పింది నిజమేనని నమ్మి దాన్నే రికార్డ్ గాపెట్టి చెప్పి ,90రోజులుగా అమరావతి ఉద్యమం నడుపుతున్నమహిళలను రైతుల్నీ ప్రక్కనుంచి పోతున్నా పట్టించుకోకుండా’’ నీరో’’ లా ప్రవర్తించి ఒకే ఒక్కసారి తనకు కావాల్సిన వందిమాగధ పత్రికలవారిని పిలిచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘’60 దాటినవారికే కరోనా భయం .మిగిలినోరికి’’ ఫికర్ నై ‘’రోజుకు నాలుగు కిలోల పారాసెట్మాల్   టాబ్లెట్స్ మింగితే ,బ్లీచింగ్ పౌడర్ చిమ్ముకుంటే కరోనా గమ్మునుంటుంది ‘’అని డాక్టర్ రెడ్డీ గా ,రెడ్డీస్ లాబ్ అధ్యక్షుడుగా ,ఫిలాసఫర్లకే ఫిలాసఫర్ గా ,అపర ధన్వంతరిగా సూచిస్తే జనం విస్తుపోయి కిలకిలా గలగలా నవ్వుకొన్నారు .ఈయనా మర్నాడే ప్లేట్ మార్చి సెలవులు లాకౌట్లు ప్రకటించి,’’ —- ముత్తైదు’’ లా వ్యవహరించాడు .రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానినకాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఎక్కడో కాలి ,కులం పూనకంతో ఆయనా ఆయన కౌరవ సేన భీభత్సం సృష్టించారు అంతకు ముందూ  తర్వాత కూడా .ఉచ్చనీచాలు వదిలేశారు .పాపం వాళ్ళెం చేస్తారు మంచి గ్రహాలన్నీ స్వస్థానాలు వదిలేసి పరాయి కొంపల్లో ,పాప స్థానాలలో హాయిగా స్థిరపడితే .ఇది పాపగ్రహకూటమి .ప్రపంచ విలయం .అక్రమాలకూ నిలయం .కలియుగం  అంతమయే రోజులు దగ్గరకోచ్చాయా అనే అనుమానం .ఇదంతా ఆ  ‘’అష్ట గ్రహ కూటమి’’ప్రభావమే .వీళ్ళు పావులు, పిపీలికాలు .శాంతం పాపం .

  ఇక దేశ గ్రహచారం ఎలా ఉంటుందో చూద్దాం –అన్ని రాష్ట్రాలు జనతాకర్ఫ్యు తో ఇంటి క్వార౦ టైన్ లో ఉండటం వలన ప్రభుత్వాలకు రూపాయి కూడా ఖర్చుకాదు. అంతా ఆదాయే .భక్తులకు పూలు  కొబ్బరికాయ, పళ్ళు,అగరొత్తులు ,కర్పూరం  ఖర్చులు లేవు .గుడులన్నీ మూతలేకాని తీతల్లేవు .ప్రసాదాలు వండక్కర్లేదు  నైవేద్యాలు, భోగాలు లేవు .యెదొఇన్త వండి నైవేద్యం పెట్టటమే. దేవుళ్ళకూ పస్తులే పాపం. ‘’యదన్నం మానవాః తదన్నం దేవతాః ‘’అని ఆర్యోక్తి ఉండనే ఉంది ..గ్రహప్రభావం కాక మరేంటి .శివుడికే ఒకప్పుడు శని ప్రభావం తప్పలేదు .ఇప్పుడు కామన్ గా దేవుళ్ళకూ దేవతలకూ అదే తీరు .దండల్లేవ్ స్తోత్రపాఠాల్లేవ్ ,పవళింపు,సుప్రభాత సేవల బంద్.పూజార్లు ఏంచేస్తే అదే జరిగినట్లు ఊరడింపు.

  శుక్ర ,గురులు భీష్మించారు .వివాహాది శుభకార్యాలు బంద్.ఒక వేళ చేసుకొన్నా అయిదారుగురు మనుషులతోనే .ఎంత ఆదా?స్వయం నియంత్రణ తెచ్చింది కరోనా ఒక రకంగా .కేంద్ర ప్రభుత్వం  ఆర్ధిక మాంద్యానికి చేసే పనుల్లేవ్.స్పీచులు తప్ప’’ మెజర్లు’’ ఉండవు .మాటలకు ఝడిసేదా ఆర్ధిక కరోనా ?కొరడా దెబ్బలకు జడుస్తున్దికాని .మొత్తలావులకు ఊడిగం చేసేవారికి సామాన్యుల గొడవేం పడుతుంది .500కోట్లకు రాజ్యసభ సీటు కొనేవారికి జనానలతో పనేమిటి -బ్యాంకు లావాదేవీలు పారిశ్రామిక దిగ్గజాలకు రోడ్డునపడే కుక్కల నక్కల రొద పడుతుందా .ఇదంతా పాపగ్రహ కూటమి ఫలితమే .గ్రహాలు నడిపిస్తుంటే పాపం వీళ్ళే చేస్తారు ?అని సరిపుచ్చుకోవాలి సామాన్యుడు .మాన్యుల నెదిరించి బతగ్గలడా .ఎదిరిస్తే దేవభూమి ఉత్తరప్రదేశ్ లో ,వీరభూమి పంజాబ్ లో,  దేశ శిరో భూమి ఢిల్లీ లో అయినట్లే శాస్తి జరుగుతుంది .అడ్రస్ లు గల్ల౦తవుతాయి

   ఇకమన రాష్ట్రం సంగతికొస్తే –ఎన్నికల కమీషన్ తో తలంటి .రోజూ హై కోర్ట్ తిట్లు మొట్టికాయలు ,పంచ్ లూ తప్పని పరిస్థితి .స్పీకర్ తో సహా వాచాలత్వం ,బూతుల పంచాంగం కరోనా వైరస్ లా సెకండ్, ధర్డ్ స్టేజ్ చేరి ,చివర్లో  పీక్ లో ఉంటాయి .ఇంకా పీక్ లో ఫ్రస్ట్రేషన్ ప్రసాద్ లా ,ఫ్రస్ట్రేషన్ ఉమన్ లా మంత్రులు ప్రవర్తిస్తారు .నాలుకలపై సరస్వతి నర్తించాల్సిన చోట చండిక నర్తిస్తోంది .ఇప్పటికే పది పదిహేను రద్దులు చేసిన ‘’ముద్దు’’ లాయన ఇక ఈ కరోనా ఫ్రస్ట్రేషన్,  కోర్టు కేసులు ,ఎలక్షన్ తంతు ,దోపిడీలు ,నామినేషన్ చిమ్పుళ్ళు,వెయ్యకుండా బెదిరింపులు ,ఉపసంహరణ అఘాయిత్యాలు, నరుకులాటలు ,హోదా, ‘’వినోదం ‘’సినిమాలో ‘’ఉత్తుత్తి బ్యాంక్ ‘’లా ఎండమావి అవటం ,సెంటర్ డబ్బు ‘’చేపక’’పోవటం ,శుక్రవారం’’ కోర్టు’’ ప్రార్ధనలతో  ఎన్ఫోర్స్ మెంట్ వేధింపులతో విసిగి, వేసారి,కౌరవ నాయకుడిలా   ,చివరకి అసెంబ్లీతో సహా మంత్రి వర్గ౦తో సహా తననూ రద్దు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి .ఇది జరక్కపోతే 365 భయం ఉండనే ఉంది .అమరావతికి అభయమిస్తు౦ది కోర్టు .ఇప్పటిదాకా దాగుడుమూతలాడిన సినీ హీరోలు తప్పు తెలుసుకొని జనజీవివన స్రవంతి లో చేరే సూచనలున్నాయి .మీడియా కూడా భజన మానేసి స్వయం నియంత్రణ తో ప్రజాస్వామ్యంగా పనిచేసే సూచనలున్నాయి .కరోనా భయోత్పాతం కలల్పించినా చివరకు ఒక రకంగా మంచే చేస్తుందేమో .ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందరికి గుణపాఠం మాత్రం నేర్పింది .మర్చిపోలేని పర్యావరణ స్పృహ ,శుచి ,శుభ్రత ,మనదైన సంస్కారం లకు పునరుజ్జీవనం కలిగించింది.

  ఇప్పుడే ఒక యువక శ్రోత ఒక చీటీ పంపి ‘’ఇక సోది ఆపి ,సరుకులధరలు ,ఎగుమతి దిగుమతి ,జనాభా వగైరాలు చెప్పి ఏడవండి ‘’అని రాశాడు ,.అదే విషయానికి వస్తోన్నాన్రాకన్నా . కరోనాలాగా కంగారు పెట్టిస్తే ఎట్లారా నాన్నా ! ప్రేమించుకొన్నా, స్పర్శ సుఖం లేకపోవటం వలన యువతీ యువకులు పెళ్లి చేసుకోటానికి భయపడటం వల్లా ,పెళ్లి ఐన భార్యాభర్తలు కూడా అన్ని సుఖాలున్నా’’ ఆసౌఖ్యం ‘’లేనందువల్లా సంతానం ఈ ఏడాది తగ్గి, జనాభా పెరగదు . చైనాలో పాము ,కప్ప ,పిల్లి ,ఎలుక, కుక్కా, నక్కా నరజాతికి ఆహారం కాకుండా హాయిగా జీవిస్తాయి .ఇండియా నుంచి వాటి ఎగుమతులూ ఉండవుకనుక  ఎగుమతి ,స్మగ్గ్లింగ్ తగ్గుతుంది .ఆవు మాంసం చూస్తే ఐరోపా గడగడ లాడటం వల్ల అక్కడా,ఇక్కడా  గోమాత సేఫ్ .ఇక్కడకూడా ప్రజల్లో అవేర్ నెస్ పెరిగి లారీల్లో వాటి దొంగరవాణా బంద్ .విభూతి ,తులసి, పసుపు మిరియం ధనియం, గోమూత్రం, ఆవుపాలు, పేడ, వేపల ఔషధ గుణాలు మళ్ళీ గుర్తుకు రావటం తో  వీటి ధరలు ఆకాశాన్నంటినా ఆశ్చర్యం లేదు .

  రోజుకూలీ లేక నిత్యావసరాలు దొరక్క కూరగాయలు ఆకాశం లో ఉండటం వల్లా జనం తిండికి మొహం వాఛి పోతారు .ప్రభుత్వం వారికి డబ్బు సాయం చేసి ఆదుకోకపోతే వారి జీవితాలు మాల్ న్యూట్రిషన్  తో హుళక్కి అయ్యే ప్రమాదముంది .మగ ఉద్యోగులు ఇంటి చాకిరి ,వర్క్ ఫ్రం హోమ్ లతో బిజీ బిజీ అయి, పలకరిస్తే కస్సుబస్సు  మంటారు .చిక్కి శల్యమౌతారు .ఆనందం అర్ణవం అవ్వాల్సింది ఆవిరై పోతుంది .స్త్రీ ఉద్యోగినులు,  హౌస్ వైవ్స్ ల పాలిట స్వర్గం గా ఉంటుంది జనతాకర్ఫ్యు. హాయిగా కాలు మీద కాలేసుకొని సీరియల్స్, సినిమాలు చూస్తారు .కనుక ఒళ్ళు బరువెక్కే ప్రమాదం ఉంది .పిల్లలు ‘’జాం జాం’’ గా  వీడియో గేమ్స్ తో ఎంజాయ్ చేస్తారు .ఒకప్పుడు చైనా చేసినట్లు ,ఆమెరికాలో వాళ్ళకూ’’ లెసన్స్ ఆన్ లైన్’’ లోనే కనుక కళ్ళు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు కర్తా0తికులు .

  రాశి ఫలితాలకొస్తే ‘’అన్ని రాశుల ఉనికి ‘’అని అన్నమయ్య చెప్పినట్లు ఒక్కటిగానే ఉంటుంది .పెద్ద తేడా ఉండదు .ఎందుకంటె శుభులు కూడా సావాసా దోషం తో పాపులయ్యారు కనుక .నరఘోషకు, గ్రహ శాంతికి డబ్బులు ఖర్చు చెయ్యలేని స్థితి కనుక నే చెప్పే చిట్కా పాటిస్తే చాలు .మేష రాశి వారు మేకతోలు ,వృషభం వారు ఎద్దు చర్మం ,మిధునం వారు రతీమన్మధ బొమ్మ ,కర్కాటం వారు –ఎండ్రకాయ డిప్ప ,సింహం వారు సింహ౦ తోక ,కన్యారాశి వారు బాపు బొమ్మ ,తులవారు త్రాసు ,వృశ్చికం వారు తేలుకొండి,ధనుస్సు వారు విల్లంబు ,మకరంవారు మొసలి పొలుసు ,కుంభరాశి వారు కుండపెంకు ,మీనం వారు ఎండు చేప ఉంగరాలలోనో తలకో మొలకో ఆభరణ౦ లోనో ధరిస్తే ,అన్నీ సర్దుకుంటాయి .అన్ని రాశులవారు తప్పక ‘’కరోనా జపం ‘’కరోనాభిషేక౦  చేయిస్తే కాని శాంతి లభించదు .ఇవేవీ చేయలేనివారు ఇంటి వాకిలి ద్వారం తలుపు మీదనో, గోడమీదనోఒకప్పుడెప్పుడో మనం ‘’ఓ స్త్రీ రేపురా ‘’అని రాయించినట్లు ఇప్పుడు  ‘’ఓ కరోనా !ఇవాళకాదు రేపు రా ‘’అని రాయిస్తే చూసి పారిపోవచ్చు .అసలు ఇవన్నీ ఎందుకురా భయ్ నమస్కార సంస్కారం ,బయటినుంచి రాగానే కాళ్ళూ చేతులూ మొహం కళ్ళూ కడుక్కొని తడి గుడ్డ తో తుడుచుకొంటే కరోనా లాంటివి మనల్ని చూసి ఆమడ దూరం పారిపోతాయి .ఎరుక మర్చి పోయి ,అనర్ధాలు తెచ్చు కొంటున్నాం .మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలని కరోనా సందేశంరా భయ్.ఇది గుర్తిస్తే చాలు .

   మాస్కులు అందించలేక అమెరికా యే చేతులెత్తేసింది కనుక మనం పాత చీర ముక్కలతో మాస్కులు తయారు చేసుకొని వాడితే సరి .దీనివలన పాతచీరల ధరలు పెరిగే ప్రమాదం ఉంది .స్టీలు సామాను వాళ్ళ నోట మట్టే. దేవుళ్ళకూ’’ మాస్కుల దండలు’’ వేస్తె మంచిది వారు సర్వవ్యాపులు ,సర్వాంతర్యాములు కనుక .

  ఇక ‘’సంక్రాతి పురుష ‘’పు౦గవుడి గురించి నాలుగు మాటలు.పేరు ‘’మంద’’.అంటే ‘’మనమంద’’లోని వాడే నన్నమాట .  ఆయనాకరోనా విషయం లో సకల  జాగ్రత్తలు తీసుకొని  వేప నీటి స్నానం ,పీత వస్త్రధారణ –పేత అంటే పీతలు వస్త్రంగా అనికాదు రా బాబూ పసుపురంగు,పెద్దపులి వాహనం తో వస్తాడు .తుంగభద్రానదికి ఈఏడాది పుష్కరం కనుక అన్ని జాగ్రత్తలతో పుష్కర విధులు నిర్వహిస్తే మంచిది .ఇంతకీ రేపు ప్రవేశించే కొత్త సంవత్సరం పేరు ‘’శార్వరి’’అంటే ‘’రాత్రి ‘’పగలుకంటే రాత్రి భయంకరం కదా .అందుకే ముందే కరోనా హెచ్చరికలతో వస్తోంది .కనుక మనం సరదాగా ‘’కరోనా ఉగాది ‘’అనుకున్నా తప్పేమీ లేదేమో .

  అసలు పంచాంగ శ్రవణం రేపు చేస్తాను .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-20 –ఉయ్యూరు    .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా వూరు -మావాళ్లు -శ్రీ శార్వరి ఉగాది కవి సమ్మేళనం లో చదవాలనుకున్నా కవిత

మా వూరు -మావాళ్లు  కవిత 

మావూరూ మా వాళ్ళు గురించి ఎంత  చెప్పినా తరగని జ్ఞాపకాల గని 

అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే 

ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే

 మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే 

వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే 

ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను 

ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా   మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -23-3-20-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )adhunika andhra sastra maniratnalu

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

Download by clicking the link

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)somanadh numchi kaasiviswanadh daaka

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు

 

 

 

23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా

download here by clicking the links

vusullo vuyyuru Cover Page

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

22-3-20 ఆదివారం ఉదయం మా ఇంట్లోఅనుకోనిఆత్మీయ అతిధులు

22-3-20 ఆదివారం ఉదయం మా ఇంట్లోఅనుకోనిఆత్మీయ అతిధులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కరోనా నిజాలు

నిజాలు

1-కరోనా అంటే ఎందుకు చింత ?-పారా  సెట్మాల్ఉందిగా మీ చెంత .-అని చెబితే నమ్మితే మీ పని మటాష్

2-కోవిడ్ అంటే భయమెందుకు ?బ్లీచింగ్ దానికి అభయం అని తెలీదా –అని నీతి బోధిస్తే మీరు లేవలేని గోతిలో పడ్డట్లే

3-కరోనా ముసలాళ్ళ కే అని దిగులా ? 60దాటితే ఆస్పత్రిలో చేర్చుకోరుగా –ఇక నేరుగా వైకుంఠ యాత్రే

4-నాగరకత కు నిలయం ఇటలీ –ఇప్పుడు కరోనాతో కళేబరం అవుతోంది

5-కప్పలు కుక్కలు పాములు తినే చైనాలో  కరోనా రాకేం చేస్తుందని ఈసడింపా ?

  వాళ్ళే ము౦దుమేల్కొని అన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి ని తరిమేశారని తెలుసుకో

6-ధనిక దేశాలమని విర్రవీగే అమెరికా ,యూరప్  లు  కరోనాతో కల్లోలమై ఆర్ధిక మాంద్యం లో విలవిలలాడుతుంటే –చైనా తన ఆర్ధిక స్థితిని ఎన్నో రెట్లు పెంచుకొన్నది కరోనా కష్టకాలంలో కూడా

7-అమెరికాలో షాపుల్లో సరుకులు నిల్-చైనాలో సరుకులతో షాపులు ఫుల్

8-అసలే ఆర్ధికంగా ఈ ఐదేళ్ళలో కుంగిన భారత్ –కరోనా తో మళ్ళీ తల పైకెత్తు కుంటుందని నమ్మగలమా

9-మాటలు కోటలు దాటటం కాదు –చేతల్లో సత్తా నిరూపించాలి నాయకమ్మన్యులు

10-స్పర్శ వైరస్ కరోనా  కులం గజ్జి సలపరింతతో  మరీ  విజ్రు౦భిస్తే –మందే లేదు ఇక భస్మాసుర హస్తమే .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

తప్పని సరి పరిస్థితులలో – శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి 3 పుస్తకాల ఆవిష్కరణ

తప్పని సరి పరిస్థితులలో – రసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు శుభకామనలు ,మరియు శ్రీశార్వరి ఉగాది శుభాకాంక్షలు .ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి తీవ్ర అల్లకల్లోలం చేస్తూడటం ,సెకండ్ ఫేజ్ దాటి మూడవ ఫేజ్ లోనూ విజ్రు౦భి౦చటం  దేశాలన్నీ స్వయం కర్ఫ్యూ విధించుకొని జాగ్రత్త పడుతూ౦డటం ,మనరాస్ట్రం లోనూ  కరోనా కోరలు సాచి భయానక పరిస్థితులు కల్పించటం ,ప్రజలు ఇంటి నుంచి కదిలి బయటికి వెళ్ళే ధైర్యం లేకపోవటం ,విద్యా సంస్థలు మూతపడటం ,పదవతరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి జరుగ బోతూ౦డటం,స్థానిక ఎన్నికలు వాయిదా పడటం తో, గందరగోళ పరిస్థితి ఏర్పడి ,ఎప్పటికి మామూలు వాతావరణం నెలకొంటుందో చెప్పలేక పోతున్నారు .ఇలాంటి ఆపత్కర పరిస్థితులలో  ఈ రోజు అంటే మార్చి 22ఆదివారం సరసభారతి 150వ కార్యక్రమ౦గా నిర్వహించాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలను వాయిదా వేయక తప్పలేదని మీకు తెలుసు .

1-       ఐతే ఇద్దరు ముగ్గురు అతిధులు ఇప్పటికే ఉయ్యూరు వచ్చి ఉండటం మళ్ళీ ,ఇంత పెద్ద కార్యక్రమం సమీప భవిష్యత్తులో నిర్వ హించటం కూడా చాలా కస్టమవటం, ఆవిష్కరి౦పబడే 3పుస్తకాలు ముద్రణ పొంది నిన్న సాయంత్రమే అందటం తో, తప్పని సరి పరిస్థితులలో నిన్ననే 21-3-20 శనివారం రాత్రి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల పాదాల చెంత పై మూడు పుస్తకాలు ఉంచి ,పూజ చేయించి ,ఉన్న అతిదులతోనే స్వామివార్ల సన్నిధానం లో ఆవిష్కరణ జరిపించి నట్లు భావించాం .

2-కొత్తగా అందిస్తున్న’’ శ్రమశక్తి’’ పురస్కారగ్రహీతలు ,ఎక్కువమంది’’ స్వయం సిద్ధ ‘’పురస్కార గ్రహీతలు స్థానికులే అవటం తో ,వారికి కూడా పురస్కారాలు అందజేస్తున్నాం .

3-కరోనా భయం ఇప్పుడప్పుడే పోయే సూచనలు లేనందున ‘’మా వూరు –మా మా వాళ్ళు ‘’అంశం పై జరపాల్సిన  ఉగాది కవి సమ్మేళనం  సమయం దాటాక చేస్తే బాగుండదని భావించాం .దీనివలన కవిమిత్రులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం .ఐతే మీరు రాసిన కవితలను  నాకు మెయిల్ లో కాని, పోస్ట్ లో కాని ఉగాది దాటాక పంపమని కోరుతున్నాను .వాటిని ఇదివరకు లాగానే సరసభారతి అంతర్జాలం , ఫేస్ బుక్ ,వాట్సాప్  లలో పెట్టి, అందరికి అందు బాటులోకి తెస్తామని తెలియజేస్తున్నాను . వీలుని బట్టి కవితలు పుస్తకరూపం లో తెచ్చే ప్రయత్నం చేస్తాము .

పై విషయాలను అతిధులు ,పురస్కార గ్రహీతలు ,కవి మిత్రులు,సాహిత్యాభిమానులు  సహృదయం తో  అర్ధం చేసుకొంటారని భావిస్తూ ,మరొక్క సారి శ్రీ శార్వరి ఉగాది శుభా కాంక్షలు తెలియ జేస్తూ –సెలవ్ –మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు .

Public links
You can download use pdf option to download these books

 from our blog

శార్వరి ఉగాది వేడుకలలో వెలువడనున్న పుస్తకాలు

వరుస పుస్తకం పేరు వివరాలు
23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా

vusullo vuyyuru Cover Page

24 సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)

 somanadh numchi kaasiviswanadh daaka

25 ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )

 adhunika andhra sastra maniratnalu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా

సాహితీ బంధువులకు శుభకామనలు -రాష్ట్రం లో, దేశం లో ఉన్నకరోనా వైరస్ , ప్రధాని ప్రకటించిన స్వచ్చంద కర్ఫ్యూ వలన   22-3-20 ఆదివారం జరగాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా వేస్తున్నామని తెలియ జేస్తున్నాను .దుర్గాప్రసాద్ -20-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 30-ఘనాసాహిత్యం

ప్రపంచదేశాల సారస్వతం 30-ఘనాసాహిత్యం

 

ఘనా  అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఘనా, తూర్పు ఆఫ్రికాలోని ఒక దేశం. దీని పశ్చిమసరిహద్దులో ఐవరీకోస్ట్, ఉత్తరసరిహద్దులో బుర్కినాఫాసో, తూర్పున టోగో, దక్షిణసరిహద్దులో గినియా అఖాతం ఉన్నాయి. ఘనా అంటే సోనింకే భాషలో యోధుడైన రాజు అని అర్ధం. “[4] 1957 లో యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం పొందినది.[5] ఇది పశ్చిమ ఆఫ్రికా గినియా అఖాతం, అట్లాంటికు మహాసముద్రం సమీపంలో ఉన్న ఒక దేశం. దేశవైశాల్యం 2,38,535 చ.కి.మీ.[4]

11 వ శతాబ్దంలో ప్రస్తుత ఘనా భూభాగంలో మొదటి శాశ్వత రాజ్యం స్థాపించబడింది. శతాబ్దాలుగా ఈప్రాంతంలో అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉద్భవించాయి. వీటిలో ” అశాంతి రాజ్యం ” అత్యంత శక్తివంతమైనది.[6] 15 వ శతాబ్దం నుండి అనేక ఐరోపా శక్తులు వాణిజ్య హక్కుల కోసం ఈ ప్రాంతం కొరకు పోటీ పడ్డాయి. 19 వ శతాబ్దం చివరి నాటికి బ్రిటిషు వారు తీరంపై నియంత్రణను సాధించారు. శతాబ్ధకాలం కొనసాగిన స్థానిక ప్రతిఘటన తరువాత, ఘనా ప్రస్తుత సరిహద్దులు (1900 ల నాటికి) బ్రిటిషు గోల్డు కోస్టుగా స్థాపించబడ్డాయి. 1957 మార్చి 6 న యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది.

ఘనా జనాభా సుమారు 30 మిలియన్లు ఘనాలో వివిధ రకాల జాతి, భాషా, మత సమూహాలను కలిగి ఉంది.[11] 2010 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 71.2% క్రైస్తవులు, 17.6% ముస్లింలు, 5.2% మంది సాంప్రదాయ విశ్వాసాలను పాటించే ప్రజలు ఉన్నారు.[12] తీరప్రాంత సవన్నా నుండి ఉష్ణమండల వర్షారణ్యాలతో ఘనా భౌగోళిక, పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంటుంది.

ఘనా అధ్యక్షుడి నేతృత్వంలోని ఏకీకృత రాజ్యాంగ ప్రజాస్వామ్యం.[13] ఘనా పెరుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ దీనిని పశ్చిమ ఆఫ్రికాలో ప్రాంతీయ శక్తిగా మార్చాయి.[14] ఇది అలీన ఉద్యమదేశాలు, ఆఫ్రికా సమాఖ్య, ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు (ECOWAS), గ్రూప్ ఆఫ్ 24 (G24), కామన్వెల్తు నేషన్సు సభ్యదేశంగా ఉంది.[15]

పేరు వెనుక చరిత్ర

ఘనా అనే పదం శబ్దవ్యుత్పత్తికి “యోధుడైన రాజు” అంతేకాక ఇది పశ్చిమ ఆఫ్రికాలోని మధ్యయుగ ఘనా సామ్రాజ్యం రాజులకు ఇవ్వబడిన బిరుదుగా ఉండేది. అయితే ఈ సామ్రాజ్యం గినియా ప్రాంతంలో ఆధునిక ఘనా దేశం కంటే ఉత్తరాన ఉంది.[16

స్వతంత్ర]

1947 లో “ది బిగు సిక్సు” నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన యునైటెడు గోల్డు కోస్టు కన్వెన్షను (యుజిసిసి) 1946 లో గోల్డు కోస్టు శాసనసభ ఎన్నికల తరువాత “స్వల్ప-కాల వ్యవధిలో స్వయం పాలన” కొరకు పిలుపునిచ్చింది.[31][38] ఘనా మొదటి ప్రధాన మంత్రి మరియు ఘనా మొదటి అధ్యక్షుడు క్వామె న్క్రుమా, “ఇప్పుడు స్వయం పాలన” అనే నినాదంతో కన్వెన్షను పీపుల్సు పార్టీ (సిపిపి)ని ఏర్పాటు చేశారు.[31]

1951 లో గోల్డు కోస్టు శాసనసభ ఎన్నికలలో న్క్రుమా మెజారిటీ సాధించారు. గోల్డ్ కోస్ట్ ప్రభుత్వ వ్యాపారానికి నాయకుడిగా న్క్రుమా నియమితులయ్యారు.[31] గోల్డు కోస్టు ప్రాంతం యునైటెడు కింగ్డం నుండి 1957 మార్చి 6 న స్వాతంత్ర్యం ప్రకటించి ఘనా దేశాన్ని స్థాపించింది.[7][8][9]

1957 మార్చి 6 న ఉదయం 12 గంటలకు. న్క్రుమా ఘనా స్థాపన, స్వయంప్రతిపత్తిని ప్రకటించారు. 1960 జూలై 1 న ఘనా రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ, ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత 1960 న్క్రుమా ఘనా మొదటి అధ్యక్షుడిగా రిపబ్లిక్కుగా ప్రకటించింది. మార్చి 6 దేశ స్వాతంత్ర్య దినోత్సవం, జూలై 1 ఇప్పుడు రిపబ్లిక్కు డేగా జరుపుకుంటారు.

స్వాతంత్ర్య సమయంలో న్క్రుమా ఇలా ప్రకటించాడు. “ఘనాలో పేదరికం, అజ్ఞానం, వ్యాధి నుండి నిర్మూలించడమే నా మొదటి లక్ష్యం. మన ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం ద్వారా మన పురోగతిని సాధిస్తాం; పాఠశాలలో పిల్లల సంఖ్య, వారి విద్య నాణ్యత ద్వారా; మన పట్టణాలు, గ్రామాలలో నీరు, విద్యుత్తు లభ్యత ద్వారా; వారి సొంత వ్యవహారాలను నిర్వహించగలిగినందుకు మన ప్రజలు పొందే ఆనందం ద్వారా. మన ప్రజల సంక్షేమం మా ప్రధాన లక్ష్యం. దీని ద్వారా తీర్పు చెప్పమని ప్రభుత్వం అడుగుతుంది. “.[41] 1966 లో సైనిక అధికారుల బృందం న్క్రుమాను తిరుగుబాటులో పడగొట్టి ఘనాను నేషనలు లిబరేషను కౌన్సిలు అధికారం స్థాపించింది.[42]

1957 లో గోల్డు కోస్టు ఘనా అనే పేరును పొందినప్పుడు ఎరుపు, బంగారం, ఆకుపచ్చ, నల్లని నక్షత్రాలతో కూడిన ఘనా జెండా కొత్త జెండాగా మారింది.[43] దీనిని థియోడోసియా సలోం ఒకోహ్ రూపొందించాడు. ఎరుపు స్వాతంత్య్రం పోరాటంలో చిందించిన రక్తాన్ని సూచిస్తుంది, బంగారం ఘనా పారిశ్రామిక ఖనిజాల సంపదను సూచిస్తుంది, ఆకుపచ్చ ఘనా గొప్ప గడ్డి భూములను సూచిస్తుంది, నల్ల నక్షత్రం ఘనా ప్రజల చిహ్నం, ఆఫ్రికన్ విముక్తి సూచిస్తుంది.[44]

పాన్-ఆఫ్రికనిజం అనే భావనను ప్రోత్సహించిన మొట్టమొదటి ఆఫ్రికా దేశాధినేత న్క్రుమా. దీనిని యునైటెడు స్టేట్సు లోని పెన్సిల్వేనియాలోని లింకను విశ్వవిద్యాలయంలో తన అధ్యయనాల సమయంలో పరిచయం చేసాడు. ఆ సమయంలో మార్కసు గార్వే తన “బ్యాక్ టు ఆఫ్రికా ” ఉద్యమం ” ప్రాబల్యత సంపాదించాడు.[31] మార్కసు గార్వే, మార్టిను లూథరు కింగు జూనియరు, సహజసిద్ధమైన ఘనా విద్యావేత్త ” W. E. B. డు బోయిసు ” బోధనలను న్క్రుమా 1960 ల ఘనా ఏర్పాటుకు వినియోగించాడు. [31]

ఒసాగిఫో డాక్టరు క్వామే న్క్రుమా, ఆయన అలీనూద్యమం స్థాపన, కమ్యూనిజం – సోషలిజం వంటి తన సిద్ధాంతాలను బోధించడానికి క్వామే న్క్రుమా ఐడియాలజికలు ఇన్స్టిట్యూట్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.[45] ఆయన శతాబ్ది పుట్టినరోజు వేడుకలో ఆయన జీవిత విజయాలు ఘనావాసులు గుర్తించారు. ఈ రోజు ఘనాలో (వ్యవస్థాపక దినోత్సవం) ప్రభుత్వ సెలవుదినంగా స్థాపించబడింది.[46]

తిరుగుబాటు

“ఆపరేషను కోల్డు చాపు” అనే పేరుతో ఘనా సాయుధ దళాల తిరుగుబాటు ద్వారా న్క్రుమా ప్రభుత్వం పడగొట్టబడింది. ఎన్క్రూమా జో ఎన్లైతో వియత్నాం యుద్ధాన్ని ముగించడంలో సహాయపడటానికి వియత్నాంలోని హనోయీకి మిషను పంపడానికి పీపుల్సు రిపబ్లికు ఆఫ్ చైనాలో ఉన్నసమయంలో ఇది జరిగింది. 1966 ఫిబ్రవరి 24 న కల్నలు ఇమ్మాన్యుయేల్ కె. కోటోకా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. లెఫ్టినెంటు జనరలు జోసెఫ్ ఎ. అంక్రా నేషనలు లిబరేషను కౌన్సిలు (ఎన్.ఎల్.సి) రూపొందించి దానికి అధ్యక్షత వహించారు.

1966 నుండి 1981 వరకు సాగిన ప్రత్యామ్నాయ సైనిక, పౌర ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్ధిక అస్థిరత నెలకొంది. తాత్కాలిక జాతీయ రక్షణ మండలి (పిఎన్‌డిసి) ఫ్లైట్ లెఫ్టినెంటు జెర్రీ జాను రావ్లింగ్సు అధికారంలోకి రావడంతో ఇది ముగిసింది. ఈ మార్పులు 1981 లో ఘనా రాజ్యాంగాన్ని నిలిపివేసి ఘనాలో రాజకీయ పార్టీలను నిషేధించాయి.[ ఫలితంగా ఆర్థిక వ్యవస్థ త్వరలో క్షీణించింది. కాబట్టి రావ్లింగ్సు అనేక పాత ఆర్థిక విధానాలను మార్చడానికి సర్దుబాటు ప్రణాళిక గురించి చర్చలు జరిపారు. 1980 ల మధ్యలో ఆర్థిక వృద్ధి ప్రారంభం అయింది. 1992 లో ఘనా అధ్యక్ష ఎన్నికలో బహుళ పార్టీ వ్యవస్థ రాజకీయాలను పునరుద్ధరించే ఘనా కొత్త రాజ్యాంగం ప్రకటించబడింది; ఎన్నికలలో ఘనా అధ్యక్షుడిగా రావ్లింగ్సు ఎన్నికయ్యాడు. 1996 లో తిరిగి ఘనా సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికయ్యారు.

21 వ శతాబ్ధం

2000 ఘనా ఎన్నికలలో విజయం సాధించిన న్యూ పేట్రియాటికు పార్టీ (ఎన్‌పిపి) కు చెందిన జాను అగ్యెకుం కుఫూరు 2001 జనవరి 7 న ఘనా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2004 ఘనా ఎన్నికలలో మళ్ళీ అధ్యక్ష పదవిని సాధించాడు. తద్వారా రెండు పదవీకాలాలు (పదం పరిమితి ) ఘనా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాల్గవ రిపబ్లిక్కు ఆధ్వర్యంలో మొదటిసారిగా అధికారానికి చట్టబద్ధంగా ఎన్నుకోబడిన దేశాధినేత, నుండి మరొకరికి బదిలీ చేయబడింది.

2008 లో నిర్వహించబడిన ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత నేషనలు డెమోక్రటికు కాంగ్రెసు (ఎన్డిసి) జాను అట్టా మిల్సు తరువాత కుఫూరు ఘనా రిపబ్లిక్కు అధ్యక్ష పదవికి నియమితుడయ్యాడు. జాను అట్టా మిల్సు నాల్గవ రిపబ్లిక్కు ఆఫ్ ఘనా మూడవ అధ్యక్షుడిగానూ

,[ 2012 జూలై 24 న అప్పటి ఘనా ఉపాధ్యక్షుడు జాను డ్రామణి మహామా అధ్యక్షుడుగా నియమించబడ్డాడు.

ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత 2012 జాను డ్రామణి మహామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాలుగవ రిపబ్లిక్కు ఆఫ్ ఘనా 4 వ అధ్యక్షుడిగా, 2013 జనవరి 7 న ఘనా 7 వ అధ్యక్షుడిగా ప్రారంభించి నాలుగేళ్ల కాలపరిమితి గల పదవీకాలం 7 జనవరి 2017 జనవరి 7 వరకు ఘనా అధ్యక్షుడిగా ఉండి[54] స్థిరమైన ప్రజాస్వామ్యంగా ఘనా హోదాను కొనసాగించారు.

2016 ఘనా అధ్యక్ష ఎన్నికలలో ], నానా అకుఫో-అడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఘనా నాలుగవ రిపబ్లికు 5 వ అధ్యక్షుడిగా 2017 జనవరి 7 న ఘనా 8 వ అధ్యక్షుడిగా ప్రారంభించి 2021 జనవరి 7 వరకు ఘనా అధ్యక్షుడిగా నాలుగు కాలపరిమితి వరకు ఉంటాడని విశ్వసిస్తారు

ఆరోగ్యం మరియు బయోటెక్నాలజి

1970 లలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ఏజెన్సీ ఆర్ అండ్ డి, ప్రాక్టికలు రిసోర్సు (ప్రొడక్టు ప్రొడక్షను & డిస్ట్రిబ్యూషను / ప్రొవిజను)రెండిటిని నిర్వహించడానికి సెంటరు ఫరు సైంటిఫికు రీసెర్చి ఇన్ ప్లాంటు మెడిసిను స్థాపించింది. ప్రరధానంగా ఔషధ మొక్కలకు సంబంధించిన బయోటెక్నాలజీ రంగాలలో పనిచేయడానికి ఇది రూపొందించబడింది. ఇది మూలికా ఔషధం తయారీలో మరింత ఆధునిక పరిశోధనల కొరకు పనిచేస్తుంది. ఆరోగ్యం, బయోటెక్నాలజీ, సంబంధిత రంగాలలో విదేశీ విద్యార్థులకు విద్యా వనరుగా ఇది ద్వితీయ పాత్ర వహిస్తుంది.

విద్య

ఘనా విద్యా వ్యవస్థ మూడు భాగాలుగా విభజించబడింది: ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, తృతీయ విద్య. “ప్రాథమిక విద్య” 11 సంవత్సరాలు (వయస్సు 4‒15) ఉంటుంది.] దీనిని కిండరు గార్టెను (2 సంవత్సరాలు), ప్రైమరీ స్కూలు (3 సంవత్సరాల, 3 సంవత్సరాలు), జూనియరు హై (3 సంవత్సరాలు) గా విభజించారు. జూనియరు హై స్కూలు (జె.హెచ్.ఎస్) ప్రాథమిక విద్య సర్టిఫికేటు పరీక్ష (బి.ఇ.సి.ఇ) తో ముగుస్తుంది.బి.ఇ.సి.ఇ. సాధించిన తర్వాత, విద్యార్థి ద్వితీయ స్థాయికి వెళ్ళవచ్చు.[115] విద్యార్థికి సాధారణ విద్య (సీనియరు హైస్కూలు), వృత్తి విద్య (టెక్నికలు సీనియరు హై స్కూలు, టెక్నికలు అండు వొకేషనలు ఇన్స్టిట్యూట్సు చేత, నిర్వహించబడింది, భారీగా ప్రైవేటు సంస్థల ద్వారా పూర్తవుతుంది) మధ్య ఎంపిక ఉంటుంది. సీనియరు హై స్కూలు 3 సంవత్సరాల పాటు వెస్టు ఆఫ్రికన్ సెకండరీ స్కూలు సర్టిఫికేటు ఎగ్జామినేషను (వాస్సే) తో ముగుస్తుంది. విశ్వవిద్యాలయ బ్యాచిలరు డిగ్రీ ప్రోగ్రాంలో చేరడానికి వాస్సే అవసరం.] పాలిటెక్నిక్సు వృత్తి విద్యార్థులు ఎస్.హెచ్.ఎస్, టి.వి.ఐ అభ్యసించడానికి అర్హత సాధిస్తారు.

బ్యాచిలరు డిగ్రీ సాధారణంగా 4 సంవత్సరాలు ఉంటుంది. తరువాత 1- లేదా 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీని పొందవచ్చు. దీనిని 3 సంవత్సరాలలో పిహెచ్‌డి ద్వారా ముగించవచ్చు. ] పాలిటెక్నికు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుంది. [117] ఘనాలో అనేక విద్యా కళాశాలలు ఉన్నాయి.కిండరు గార్టెను నుండి అండరు గ్రాడ్యుయేటు డిగ్రీ స్థాయి వరకు ఘనా విద్యా విధానం 20 సంవత్సరాలు పడుతుంది.

భాషలు

ఘనా ఇంగ్లీషు అధికారిక భాషగానూ వాడుక భాషగానూ ఉంది.

అదనంగా, ప్రభుత్వ ప్రాయోజిత భాషల హోదా కలిగిన పదకొండు భాషలు ఉన్నాయి:

సాహిత్యం

ఘనా జాతీయ సాహిత్య రేడియో కార్యక్రమంతో పాటుగా వాయిసు ఆఫ్ ఘనా ప్రచురణ ఆఫ్రికన్ ఖండంలో మొట్టమొదటిదిగా గుర్తించబడుతుంది. ఘనా రచయితలలో ప్రముఖులు నవలా రచయితలు; ఇథియోపియా అన్బౌండు ) ” ది బ్యూటీఫులు వన్స్ ఆర్ నాట్ యట్ బర్ను ) ” టైల్ ఆఫ్ ది బ్లూ బర్డు (2009) పుస్తకాలతో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన జెఇ కాస్లీ హేఫోర్డ్, ఐయి క్వీ అర్మా, నియి అయిక్వే పార్క్సు.] ప్రముఖ ఘనా నాటక రచయితలు, కవులు జో డి గ్రాఫ్టు, ఎఫువా సదర్లాండు నవలలతో పాటు, ఘనా థియేటరు, కవిత్వం వంటి ఇతర సాహిత్య కళలు కూడా జాతీయ స్థాయిలో మంచి అభివృద్ధి మరియు మద్దతును కలిగి ఉన్నాయి.

 

అదింక్రా

అదింక్రా

13 వ శతాబ్దంలో ఘనావాసులు తమ ప్రత్యేకమైన అడింక్రా ప్రింటింగు కళను అభివృద్ధి చేశారు. చేతితో ముద్రించిన, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన అడింక్రా బట్టలు అప్పటి ఘనా రాజకుటుంబాల ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఉపయోగించడానికి తయారు చేయబడ్డాయి. ఉపయోగించబడ్డాయి. అడిన్క్రా సింబాలిజం కార్పసును రూపొందించే కళాఖాండాలన్నింటిలో ఒక సామెత, ఒక చారిత్రక సంఘటన, మానవ వైఖరి, ఎథాలజీ, మొక్కల జీవన రూపం, నిర్జీవమైన, మానవ నిర్మిత వస్తువుల ఆకారాల నుండి ఉద్భవించిన పేరు, అర్థం కానీ ఉంటాయి. ఇవి శైలీకృత రేఖాగణిత ఆకృతులలో గ్రాఫికలుగా ఇవ్వబడ్డాయి. మూలాంశాల అర్ధాలను సౌందర్యం, నీతి, మానవ సంబంధాలు, భావనలుగా వర్గీకరించవచ్చు.

అడిన్క్రా చిహ్నాలు పచ్చబొట్లు వలె అలంకార పనితీరును కలిగి ఉంటాయి. కానీ వీటికి సాంప్రదాయ జ్ఞానం, జీవిత అంశాలు లేదా పర్యావరణాన్ని తెలియజేసే ఉద్వేగభరితమైన సందేశాలను కూడా కలుపుతాయి. వీటిలో విభిన్న అర్థాలతో చాలా విభిన్న చిహ్నాలు ఉన్నాయి. ఇవి తరచుగా సామెతలతో ముడిపడి ఉంటాయి. ఆంథోనీ అప్పయ్య మాటల్లో చెప్పాలంటే, అక్షరాస్యత లేని సమాజంలో “సంక్లిష్టమైన, సూక్ష్మమైన అభ్యాసం, నమ్మకం ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి” సహకరిస్తున్న ఇవి ఒకటిగా ఉన్నాయి.[

సంగీతం మరియు నృత్యం

ఘనా సంగీతం విభిన్నమైనది వివిధ జాతుల, ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. ఘనాయను సంగీతం టాకింగు డ్రం బృందాలు, అకాను డ్రం, గోజే ఫిడిలు, కొలోకో లూటు, కోర్టు మ్యూజికు, అకాను సెపెరెవా, అకాను అటుంపను, గా క్పాన్లోగో స్టైల్సు, అసోంకో సంగీతంలో ఉపయోగించే లాగు జిలోఫోనుల వంటి అనేక రకాల సంగీత వాయిద్యాలను కలిగి ఉంది.ఘనా కళాకారుడు కోఫీ ఘనాబా సృష్టించిన ఆఫ్రికను జాజ్ అత్యంత ప్రసిద్ధ శైలిగా గుర్తించబడింది. దాని ప్రారంభ లౌకిక సంగీతాన్ని హైలైఫు అని పిలుస్తారు.[ హైలైఫు 19 వ శతాబ్దం చివరిలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉద్భవించింది. పశ్చిమ ఆఫ్రికా అంతటా వ్యాపించింది.[1990 లలో హైలైఫు, ఆఫ్రో-రెగె, డాంసుహాలు, హిప్‌హాపు ప్రభావాలను కలుపుకొని యువత కొత్త సంగీత శైలిని సృష్టించింది.ఈ హైబ్రిడును హిప్ లైఫు అని పిలుస్తారు.] “ఆఫ్రో రూట్సు” గాయకుడు, కార్యకర్త పాటల రచయిత రాకీ దావుని, ఆర్ అండు బి, సౌల్ సింగరు, రియాను బెన్సను, సర్కోడీ వంటి ఘనా కళాకారులు అంతర్జాతీయ విజయాన్ని సాధించారు.[ 2015 డిసెంబరులో రాకీ దవుని తన 6 వ స్టూడియో ఆల్బం కొరకు ” బ్రాంచెసు ఆఫ్ ది సేం ట్రీ ” పేరుపెట్టబడింది. పేరుతో 31 మార్చి 2015 మార్చి 31 న విడుదలైన ఉత్తమ రెగె ఆల్బం విభాగానికి గ్రామీ అవార్డుకు గ్రామీ అవార్డుకు ఎంపికైన మొదటి ఘనా సంగీతకారుడు అయ్యాడు.

ఘనా నృత్యం దాని సంగీతం వలె వైవిధ్యమైనది. వివిధ సందర్భాలలో సాంప్రదాయ నృత్యాలు, విభిన్న నృత్యాలు భాగంగా ఉన్నాయి.  ఘనా వేడుకలలో ఘనా నృత్యాలు భాగంగా ఉన్నాయి. ఈ నృత్యాలలో అడోవా, క్పాన్లోగో, అజోంటో, క్లామా, బమయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.

ఘనేనియన్ సాహిత్యం ఫిక్షన్ కు ఎక్కువ విలువనిచ్చింది .యువరచయితలు విజ్రుమ్భించి రాస్తున్నారు .వారిలో కోఫీ అవూనోర్’’దిస్ ఎర్త్ మై బ్రదర్ ‘’అమ అట ఐడూ’’అవర్ సిస్టర్ కిల్లిజో ‘’అయి క్వేజి అర్మా ‘’ది హీలర్స్ ‘’నవలలు రాశారు. యువకవులూ వచ్చారు .క్రైం ఫిక్షన్ కూడా రాస్తున్నారు .ఇటీవల ‘’టైయేసేలాసి ‘’రాసిన ‘’ఘనా మస్ట్ గో ‘’అసాధారణ శైలిలో ఉంది .బోస్టన్ కుటుంబం లోని ఆరుగురు సభ్యుల కథ.మామలే కబుఅనే మహిళా రాసిన కవిత్వం కథలు బహుళ వ్యాప్తి చెందాయి .బర్ట్ అవార్డ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ ‘’అవార్డ్ పొందింది .సోఫియా ఆకేం ఫాంగ్ రాసిన ‘’గ్రోయింగ్ యామ్స్ ఇన్ లండన్ ‘’అనే అడల్ట్ ఫిక్షన్ 14ఏళ్ళ బాలిక గురించి రాసినది .ఇక్కడ కూడా రివైవల్ ఉద్యమం బాగా వచ్చి పాతతరం వారిని గుర్తు చేసుకొంటున్నారు .రైటర్స్ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు .నుబూకే ఫౌండేషన్ దీనికి విశేష కృషి చేస్తోంది .ఇటీవలే అక్రాలో మహిళా రచయితల సమావేశం ‘’యారి యారి సింపోజియం ‘’నిర్వహించారు.నాటక, కవిత్వ,ఫిక్షన్ రచయిత్రులు –సఫైర్ ,డోరోతీ  స్మార్ట్ .జేనెట్ బద్జన్ యాంగ్ మొదలైన వారు హాజరై విజయం చేకూర్చారు .

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల  సారస్వతం 28-ఆఫ్రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల  సారస్వతం

28-ఆఫ్రికన్ సాహిత్యం

 ఆఫ్రికన్ సాహిత్యం ఆఫ్రికా నుండి లేదా వచ్చిన సాహిత్యం మరియు మౌఖిక సాహిత్యాన్ని కలిగి ఉంటుంది (లేదా “వక్తృత్వం”, ఉగాండా పండితుడు పియో జిరిము చేత సృష్టించబడిన పదం).
జార్జ్ జోసెఫ్ సమకాలీన ఆఫ్రికాను అర్థం చేసుకోవడంలో ఆఫ్రికన్ సాహిత్యంపై తన అధ్యాయంలో పేర్కొన్నట్లుగా, సాహిత్యం యొక్క యూరోపియన్ అభిప్రాయాలు తరచూ కళ మరియు కంటెంట్ యొక్క విభజనను నొక్కిచెప్పాయి, ఆఫ్రికన్ అవగాహన కలుపుకొని ఉంది:

ఆఫ్రికన్ సాహిత్యంలో రెండు స్థాయిల సంప్రదాయం ఉంది: మౌఖిక మరియు వ్రాతపూర్వక. మౌఖిక సంప్రదాయం సాంస్కృతిక ప్రచారం యొక్క ఇరుసుగా సమాజ అవసరాలను నెరవేరుస్తుంది మరియు సామాజిక సమైక్యత యొక్క పనితీరును పంచుకుంటుంది. కుటుంబ సాయంత్రం లేదా ఒక రకమైన వృత్తిపరమైన కులం సంప్రదాయం యొక్క స్థలాన్ని సృష్టిస్తుంది. బెనిన్ కింగ్డమ్ ఎడ్ ప్రజల విషయంలో, రెండు రకాల కథనాలు వేరు చేయబడతాయి. సాయంత్రం రాత్రి (ఇబోటా) ఇకున్ అనే పవిత్ర స్థలంలో జరుగుతుంది, ఇది ఇంటి మధ్యలో ఉంది మరియు పూర్వీకుల ఆత్మకు అంకితం చేయబడింది. ఇబోటాలో, మాట్లాడాలనుకునేవారు మరియు పాడాలనుకునే వారు పాడతారు. పాల్గొనేవారి స్థానం తప్ప వేరే ప్రత్యేక వాగ్దానం లేదు. మరొకటి ఒకుపోబుహి అని పిలుస్తారు (దీని అర్థం “ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఒక పరికరం ధ్వనించండి”), మరియు అక్పాటా (కాంగో మూలం యొక్క ఏడు-స్ట్రింగ్ గిటార్) ఆడే ఒక ప్రొఫెషనల్ కథకుడు నవజాత శిశువుల పేరు, ఆచార సందర్భాలు మొదలైన వాటికి బాధ్యత వహిస్తాడు. ప్రకరణం యొక్క కర్మ వంటి పెద్ద రోజు. ఈ రెండింటి కథనాల మధ్య కఠినమైన వ్యత్యాసం లేదు, మరియు ప్రజల రోజువారీ అనుభవాలు మరియు ఒబా యొక్క పురాణం (కింగ్ బెనిన్ యొక్క విజయం వంటివి) ఆధారంగా అనేక రకాల విషయాలను ఎంపిక చేస్తారు. కొన్ని సందర్భాల్లో, అక్పాటాకు బదులుగా టైకో (ఎమ్మా) ఉపయోగించబడుతుంది మరియు కథనం కంటే నాటకీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆధునిక పరివర్తనాలు గొప్పవి, మరియు అసలు కర్మ అర్ధం పోతుంది, ఇది రోజువారీ వాణిజ్య చర్యగా మారుతుంది. . ఈ సందర్భంలో, కథకుడు నటుడిగా పరిగణించబడతాడు మరియు డబ్బు పట్ల కొంత గౌరవం మరియు కొంత గౌరవం కలిగి ఉంటాడు.

మౌఖిక సాహిత్యం (పురాణాలు, ఇతిహాసాలు, పాత కథలు, సామెతలు, జానపద పాటలు మొదలైనవి) పని యొక్క ఉనికి మరియు ప్రసార ప్రదేశంతో సరిపోలుతాయి మరియు ఉత్పత్తి (సంజ్ఞ, ముఖ కవళికలు, అనుకరణ) ఒక రకమైన సాధారణ ప్రదర్శనగా పరిగణించవచ్చు వాస్తవిక భావాన్ని పెంచే కళ. ఒంటరి మాధ్యమం, ఇది కేవలం భాషా వ్యక్తీకరణలపై ఆధారపడుతుంది మరియు రచయిత మరియు లబ్ధిదారుడి మధ్య స్థలం మరియు సమయానికి విరామం ఇస్తుంది. ఈ రెండు విభిన్న సాహిత్య సంప్రదాయాల ఏకీకరణ కష్టం, అయితే “ఆఫ్రికన్” సాహిత్యం యొక్క జాతి ప్రత్యేకతను స్థాపించడానికి ఇష్టపడని రచయితలకు ఇది ఒక ముఖ్యమైన సమస్య. అచోలి తెగ యొక్క సాంప్రదాయ సంస్కృతిని త్రవ్వండి, మరియు అక్కడ నుండి, పాశ్చాత్య ఆధునికత యొక్క అలసట నుండి ఉపశమనం పొందండి. Okoto , ఇబో సంప్రదాయాన్ని రూపొందించడం అచేబ్ యోరుబా యొక్క గొప్ప, పౌరాణిక ప్రపంచాన్ని పునరుద్ధరించండి Shoinka , కికుయు పురాణాల మరియు జానపద పాటల వలస వ్యతిరేక భావాలను చదవండి Gugi వారి పని ఆఫ్రికన్ సంస్కృతి యొక్క కళంకాన్ని కడిగి, జాతి సంప్రదాయాలను పునర్నిర్వచించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అలాగే సెయింట్ బెనె , గుగి, షోయింకా, ఆర్మర్ కోల్ ఓమోటోసో (1943-), హుస్సేన్ ఇబ్రహీం హుస్సేన్ మరియు ఇతర స్వాహిలి రచయితలకు సినిమాలు, థియేటర్ మరియు ఎథ్నోగ్రఫీ పట్ల ఆసక్తి ఉంది, మీడియాను మార్చడం ద్వారా ఆఫ్రికన్ పాఠకుల సన్నగా ఉండటానికి ఇది ఉద్దేశించబడింది. రాజకీయ నిర్బంధించిన తరువాత జాతి భాషా రచయితగా మారి, రైతులు మరియు కార్మికుల నాటక ఉద్యమానికి అంకితమిచ్చిన గుగు విషయంలో, ఇది అసమ్మతివాదుల యుద్ధభూమిని మార్చడమే కాక, కొత్త పాఠకులను కూడా సంపాదించింది, తెరవడానికి సుముఖత ఉంది సృష్టిలో ప్రజల భాగస్వామ్యం మరియు కికుయు యొక్క జాతీయ సంప్రదాయంపై అంటుకునే మార్గం.

సాంప్రదాయ సంస్కృతి మరియు ఆధునిక పాశ్చాత్య

స్వాహిలి మరియు హౌసా వలసరాజ్యానికి ముందు అరబిక్ లిపిలో వ్రాసే సంప్రదాయం ఉంది. స్వాహిలి భాషలో, మాగజీ సాహిత్యం (622 లో, ముహమ్మద్ హింస కారణంగా మక్కా నుండి మదీనాకు పారిపోయిన తరువాత, అతను వెళ్ళిన విజయం గురించి పురాణ సాహిత్యం ఇది. “దాడి” సంప్రదాయం ఆధారంగా అనేక కవితలు ఉన్నాయి మరియు “దాడి”, అబ్దుల్లా బిన్ నాసిర్ (1720-1820), షేక్ ముహీల్-దిన్ (1778-1869), మ్వానా ・ క్వోనా మ్వానా కుపోనా (1810-60) మరియు ఇతరులు చురుకుగా ఉన్నారు. ఇస్లామిక్ శాంతిని బోధించే శాస్త్రీయ సాహిత్యం యొక్క ఈ సంప్రదాయాలు ముయాకా బిన్ హాజీ (1776-1840) వంటి ప్రత్యేకమైన ఉనికి ద్వారా మసీదు నుండి మార్కెట్‌కు తీసుకువెళ్లారు. Sherban ఆధునిక గద్య శైలి స్థాపించబడింది. ప్రస్తుతం ఉన్న స్వాహిలి రచయితలైన పెనినా ముహండో (1948-) మరియు యూఫ్రేస్ కెజిలాహాబీ (1944-) కార్యకలాపాలను విస్మరించలేము. పీటర్ అబ్రహామ్స్ (1919-) విషయంలో కూడా ఇదే పరిస్థితి, Mufarere , లా గుమా ఇటువంటి, వర్ణవివక్ష దిగువ పనికిమాలిన అనుభవాన్ని గీసిన మరియు దక్షిణాఫ్రికా సమకాలీన సాహిత్యాన్ని ప్రపంచ వేదికపై ఉంచిన రచయితలకు ఇది చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో, ఆత్మహత్య రచయితల వంశపారంపర్యంగా టెన్బా కెన్ థెంబా (1924-69) మరియు నకాసా నాట్ నకాసా (1937-65), గువారా మాఫికా గ్వాలా (1946-), మాచోబా మ్తుతుజెలి మత్షోబా (1950-), ముసమనే ముబులెలో మజమనే ( 1948-)) పట్టణ శ్రామికుల సాహిత్యం అని పిలవబడే రచనల సమూహానికి ప్రతిఘటన మరియు తిరుగుబాటు స్ఫూర్తిని అందించారు, అయితే దీనికి పునాది సోతో భాషా థామస్ మోఫోలో (1875-1948) మరియు షోసా- ముకై శామ్యూల్ మఖాయి. (1875-1945), జూలూ డ్రోమో (1901-71) మరియు ఇతర దక్షిణ బంటు రచయితలు. చర్చి యొక్క సెన్సార్షిప్ ఉన్నప్పటికీ, మోఫోరో యొక్క ది ట్రావెలర్ టు ది ఈస్ట్ (1906), చకా (1925) మొదలైనవి క్రైస్తవ విమర్శలను, పట్టణ విలువను తిరస్కరించడం మరియు ఆఫ్రికన్ పరాయీకరణను పొందుపర్చాయి.

ఆఫ్రికన్ నల్లజాతి రచయితలు పాశ్చాత్య నల్ల ఆధునికవాదం యొక్క తిరుగుబాటు ఫ్రెంచ్ మార్టినిక్ నుండి రెనే మారన్ (1887-1960) రాసిన “బాట్సురా” (1921) నవల. ఫ్రెంచ్ ఈక్వటోరియల్ ఆఫ్రికాలో శ్వేతజాతీయుల పతనం వాస్తవ పరిశీలనల నుండి విమర్శించాడు, స్థానిక నివాసితుల కష్టాలను విజ్ఞప్తి చేశాడు మరియు వలసరాజ్యాల వ్యాపారం యొక్క మోసాన్ని బహిర్గతం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత విలువల గందరగోళం మార్క్సిజం, అధివాస్తవికత మొదలైన వాటి పెరుగుదలకు దారితీసింది మరియు మేధావులు మరియు కళాకారులను పశ్చిమ ఐరోపా నుండి దూరం చేయడానికి దారితీసింది, కానీ మరోవైపు, జాతి గుర్తింపును కోరుకునే ఉద్యమాలు (హార్లెం పునరుజ్జీవనంతో పాటు , ఉదాహరణకు, క్యూబన్ ఆఫ్రోనెగ్రిస్మో ఉద్యమం) ప్రజాదరణ పొందింది. ఈ ధోరణి చివరికి పారిస్‌లో నివసిస్తున్న నల్లజాతి ఉన్నత వర్గాల వ్యతిరేకతను పిలిచింది. <పశ్చిమ ఐరోపాను అనుసరించడం కోల్పోయిన దానికంటే గొప్పది అనే మేల్కొలుపు Sangor , Ceser , డామా లియోన్ డమాస్ (1912-78) మరియు ఇతరులు తమ జాతి విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు మరియు ఆఫ్రికన్ పునరావాసం, వ్యక్తివాదం మరియు భౌతిక నాగరికతపై ఆఫ్రికన్ ఆధ్యాత్మిక మరియు సమాజ విలువను నొక్కి చెబుతారు. చనిపోయిన మరియు జీవించిన వారి సహజీవనం, ప్రకృతి మరియు మానవుల ఐక్యత, ఇది తెలుపు కంటే నలుపుకు అంతర్గత విలువను ఇస్తుంది నిర్లక్ష్యం ఈ ఉద్యమం ఆఫ్రికన్ జాతీయవాదానికి ఒక తాత్విక స్తంభంగా మారిందని ఖండించలేము. ఏదేమైనా, నిర్లక్ష్యం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత, వ్యక్తిత్వం కంటే సమూహ అనుభవం మరియు వ్యక్తులపై జాతి ప్రాధాన్యత యొక్క స్థానం, వ్యక్తుల సృజనాత్మకతను గౌరవిస్తుంది మరియు రాజకీయ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఫారేర్, షోయింకా, మరియు రుబాదిరి డేవిడ్ రుబాదిరి (1930 -) ఇంగ్లీష్ మాట్లాడే వైపు విమర్శలపై నిలబడండి. వాస్తవానికి, సాంప్రదాయ ఆఫ్రికాలో తిరుగుబాటు శక్తి పోరాటాన్ని వర్ణించే యంబో ఓయులోగుమ్ యొక్క (1940-) “హింస యొక్క ఆబ్లిగేషన్” (1968), ఫ్రెంచ్ మాట్లాడే కళాకారులు స్వయంగా నిర్లక్ష్యం ముగిసినట్లు ప్రకటించారు. టిచాయా యు టామ్సి (1931-88) ఒక ప్రత్యేకమైన కవి, నిర్లక్ష్యాన్ని విమర్శనాత్మకంగా అధిగమించడం ద్వారా తనదైన మార్గాన్ని తెరిచాడు.

దక్షిణాఫ్రికాతో పాటు, ప్రసారం మరియు ప్రచురణ వంటి జర్నలిజం మరియు ఘనా మరియు నైజీరియా ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాసంస్థలుగా ఉన్న పశ్చిమ ఆఫ్రికా, ఆధునిక నవలల మక్కాలు. నైజీరియాలో, ఆఫ్రికన్ ఫిక్షన్ రంగంలో నివసించిన సిప్రియన్ ఎక్వెన్సి (1921-) కు ప్రసిద్ధి చెందాడు మరియు ప్రసిద్ధ నవలల రంగంలో చాలాకాలంగా చురుకుగా ఉన్నాడు మరియు యోర్బా కథనాలను కవర్ చేసే “డ్రింకర్” (1952). అమోస్ టుటుయోలా (1920-97) మరియు ఇతరులు, కానీ అచెహేవ్ తరువాతి తరం మీద ప్రభావం పరంగా నిలుస్తుంది. తన కన్య రచన గిరిజన కుదించు (1958) లో, అతను ఒక క్లాసిక్ ఇతివృత్తం, ఆఫ్రికన్ సాంప్రదాయ విలువలు మరియు పాశ్చాత్య ఆధునిక విలువల మధ్య సంఘర్షణ మరియు ఆఫ్రికన్ వైపు జరిగిన విషాదం. ఈనాటి ఆఫ్రికన్ రచయితల ప్రధాన ఇతివృత్తాలు పశ్చిమ ఐరోపా మరియు క్రైస్తవ మతంతో ఎన్‌కౌంటర్లు, వలస పాలన యొక్క ప్రారంభ దశ, పాశ్చాత్య విద్యను అంగీకరించడం మరియు తిప్పికొట్టడం, పట్టణీకరణ సమస్యలు, రాజకీయాలు మరియు స్వాతంత్ర్యానికి ముందు మరియు తరువాత రాష్ట్ర నిర్మాణం మొదలైనవి ఉన్నాయి. ప్రతిదానిలో, అద్భుతమైన రచనలు చేయవచ్చు చూడవచ్చు. మరియు వలసరాజ్యాల అనంతర యుగం ఏకరీతిగా తీవ్ర నిరాశకు గురై, స్వీయ-పరాయీకరణకు గురైందని చెప్పవచ్చు. అచేబే యొక్క “వన్ ఆఫ్ ది పీపుల్” (1966), అర్మా యొక్క “ది బ్యూటీ ఈజ్ నాట్ బర్న్” (1968), సెయింట్-బేన్ యొక్క “హరా” (1970), ఆనా కోఫీ అవూనోర్ (1935-) “ది ఎర్త్, మై బ్రదర్‌హుడ్” (1971) , మ్వాంగి యొక్క మెజా మవాంగి (1948-) యొక్క డౌన్ ది రివర్ రోడ్ (1976), గుగిస్ బ్లడ్ పెటల్స్ (1977), మొదలైనవి స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రం ఏర్పడిన చీకటిలో ఒక భాగం మాత్రమే. , ఆనా, షోయింకా, గుగి మరియు ఇతరులు బలవంతంగా జైలు శిక్ష అనుభవించారు, లా గుమా, మాజిసి కునేనే (1930-2006), బెట్టీ ఈ ప్రవాసులు కొనసాగుతారు. ఎక్వెన్సి, అచేబే మరియు ఇరో ఎడ్డీ ఇరోహ్ యొక్క ఇటీవలి రచనలు బియాఫ్రా యుద్ధం యొక్క చీకటి నీడలను కలిగి ఉన్నాయి. ఏదేమైనా, గుగు «డిటెన్షన్: ది రైటర్స్ ప్రిజన్,» (1981) మరియు అర్మా «థౌజండ్ సీజన్స్» (1973) మరియు 《థెరపిస్ట్స్》 (1978) లలో ప్రయత్నించినట్లు జనాదరణ పొందిన చరిత్రను పునర్నిర్వచించే ఉద్యమం. ఆఫ్రికన్ సాహిత్యంలో ఒక కొత్త దిశ ఇప్పటికే మార్గదర్శకత్వం వహిస్తోందనేది ఒక ప్రకాశవంతమైన సంకేతం, ప్రస్తుత ఇరుకైన పరిస్థితి యొక్క చారిత్రక మూలాన్ని పున -పరిశీలించి, ఆఫ్రికా యొక్క చారిత్రక దృక్పథంలో ప్రాథమిక పరివర్తన కోసం ముందుకు వస్తోంది. మహిళా కళాకారులుగా, సదర్లాండ్ ఎఫువా సదర్లాండ్ (1924-96), ఒగోటో గ్రేస్ ఓగోట్ (1930-), నువాపా ఫ్లోరా న్వాపా (1931-93), హెడ్ బెస్సీ హెడ్ (1937-86), ఐడే అమ అటా ఐడూ (1942-), ఎమెచెటా ఇన్ బుచి ఎమెచెటా (1945-) మరియు ఇతరులతో పాటు, పిల్లల సాహిత్యం ప్రజాదరణ పొంది౦ది

సాహిత్యం లో నోబెల్ పొందినవారు –వోల్ సోయంకా ,జె .ఎం. కొట్జీ

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 27-దక్షిణ సూడాన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతంసారస్వతం

27-దక్షిణ సూడాన్ సాహిత్యం

దక్షిణ సూడాన్ అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ,భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది.[6] దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, దక్షిణ సరిహద్దులో ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు, పశ్చిమసరిహద్దులో మధ్య జబలు అంటారు. అంటే ఆఫ్రికా రిపబ్లిక్కులు ఉన్నాయి. దీనిలో సుడ్డు అనబడే చిత్తడినేల ప్రాంతం ఉంది. ఇది వైట్ నైలేచే ఏర్పడింది. దీనిని స్థానికంగా బారు అల్ (పర్వత సముద్రం) అంటారు.

సూడాన్, దక్షిణ సూడాన్ దేశాలను ఈజిప్టుని పరిపాలించిన మహమ్మద్ ఆలీ వంశం ఆక్రమించి ” ఆంగ్లో ఈజిప్షియను కండోమినియంగా పాలించబడింది. బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తరువాత 1956 లో స్వతంత్రం పొందాయి. మొదటి సూడాన్ అంతర్యుద్ధం తరువాత 1972 లో దక్షిణ సూడాన్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏర్పడి 1983 వరకు కొనసాగింది. రెండవ సూడాన్ అంతర్యుద్ధం 2005 శాంతి ఒప్పందంతో ముగిసింది. అదే సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటయింది.

2011 జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.83% ఓట్లు సాధించిన తరువాత 2011 జూలై 9న దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.[8][9] తరువాత ఇది ఐక్యరాజ్యసమితిలో, ఆఫ్రికా సమాఖ్యలో సభ్యదేశం అయింది.

దక్షిణ సూడానులో 12 మిలియన్ల ప్రజలు ఉన్నారు. వీరిలో నిలోటికు ప్రజలు అధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 17 సెప్టెంబరులో ఐఖ్యరాజ్య ప్రతినిధి (చిల్డ్రెన్ అండ్ ఆర్ముడు కాంఫ్లిక్టు) మాట్లాడుతూ దక్షిణ సూడాన్ నివాసితులలో సగం మంది 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారని చెప్పాడు.ఇది ఐక్యరాజ్యసమితి,ఆఫ్రికా సమాఖ్య  తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ  ఇంటర్గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటులలో సభ్యదేశంగా ఉంది. 2012 జూలైలో దక్షిణ సుడాన్ జెనీవా ఒప్పందాల మీద సంతకం చేసింది. దక్షిణ సుడాన్ జాతి హింసను ఎదుర్కొంది. 2013 నుండి పౌర యుద్ధం సంభవించింది. 2018 నాటికి తాజా ఐక్యరాజ్య సమితి రిపోర్టు నివేదికలో దక్షిణ సుడాన్ దిగువస్థాయి నుండి మూడవ స్థానంలో ఉంది.అమెరికా ఫండు ఫర్ పీసు ” ఫ్రాజిలు స్టేట్సు ఇండెక్సు (గతంలో ఫెయిల్డ్ స్టేట్స్ ఇండెక్స్).

చరిత్ర

దక్షిణ సుడాను లోని నిలొటికు ప్రజలలో ప్రపంచప్రపంచ దేశాలసారస్వతం-అకోలి, అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు, కాలిగి (అరబికు ఫెరోఘే), ఇతరులు- మధ్యయుగ నబ్బియా పతనం సంభవించిన 10 వ శతాబ్దానికి ముందు దక్షిణ సుడాన్లోకి ప్రవేశించారు. 15 వ నుండి 19 వ శతాబ్దాల వరకు బహరు ఎల్ ఘజలు ప్రాంతం, ఉన్నత నైలు ప్రాంతాలకు అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు ప్రజలు వలసగా వచ్చి చేరుకున్నారు. అచోలి, బారి ప్రజలు ఈక్వెటోరియాలో స్థిరపడ్డారు. 16 వ శతాబ్దంలో దక్షిణ సుడాన్లోకి ప్రవేశించిన అజాండే, ముండూ, అవకాయ, బకా దక్షిణ సూడానుకు చేరుకుని ఈ ప్రాంతం అతిపెద్ద దేశం అయిన గ్రేటు ఈక్వెటోరియా ప్రాంతంను స్థాపించారు.

సంఖ్యాపరంగా డింకా అతిపెద్ద జాతి, న్యూయరు రెండవ అతిపెద్దది, అజాండే మూడవ అతిపెద్దది, బారి దేశంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా ఉంటాయి. ఈ ప్రజలు పశ్చిమ ఇకాటోరియా ఉష్ణమండల వర్షారణ్యపు బెల్టులోని మరీడి, యాంబియో, టోంబురు జిల్లాల్లో కనిపిస్తారు. అయోండో క్లయింటు ఎయి, మద్య ఈక్వెటోరియా, పశ్చిమ బహరు ఎల్ గజలు ప్రాంతాలలో ఉంటారు. 18 వ శతాబ్దంలో అవంగరా సిబు అధికారంలోకి వచ్చి మిగిలిన అజాండె సమాజం మీద సాధించిన ఆధిపత్యం 20 వ శతాబ్దం వరకు కొనసాగింది.వైటు నైలు, క్రైస్తవ మిషనరీలను 1922 నాటి క్లోజ్డు డిస్ట్రిక్టు ఆర్డినెంసు (చూడండి హిస్టరీ ఆఫ్ ఆంగ్లో-ఈజిప్టు సుడాన్) దక్షిణాది ప్రాంతాలకు పంపించే బ్రిటీషు ప్రాధాన్యతతో భౌగోళిక సరిహద్దులు ఏర్పడ్డాయి. దీని వలన వారి సాంఘిక, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే వారి రాజకీయ, మత సంస్థలను నిలుపుకోవటానికి వీలు కల్పించింది. బ్రిటిషు ఉత్తర అరబు ప్రాంతాల వరకు అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పించి దక్షిణ ప్రాంతాలలో ఉన్న నల్లజాతీయులను విస్మరించింది. 1958 లో సూడాను మొట్టమొదటి స్వతంత్ర ఎన్నికల తర్వాత ఖార్టూం (పాఠశాలలు, రోడ్లు, వంతెనలు లేకపోవటం) దక్షిణప్రాంతాలను నిరంతరాయంగా విస్మరించడం తిరుగుబాటులు జరగడానికి, ఖండంలోని అతి పెద్ద పౌర యుద్ధం జరగడానికి దారి తీసింది.2012 నాటికి ఈ ప్రాంతంలో ప్రజలు ఆచోలి, అనియుకు, అజాండే, బకా, బాలండా బ్వివిరి, బారి, బోయా, దితిదా, డిన్కా, జియీ, కాలిగి, కుకు, లోతుకా, ముందరి, మురీ, నిలోటికు, నుయరు, షిల్లోకు, టోపోసా, జండే ఉన్నారు.

బానిసత్వం చరిత్రవ్యాప్తంగా సుడానీసు జీవితంలో ఒక సంస్థగా ఉంది. 19 వ శతాబ్దంలో దక్షిణాన బానిస వాణిజ్యం తీవ్రమైంది. ఉప-సహారా ఆఫ్రికాలో బ్రిటిషు అధికంగా బానిసత్వాన్ని అణిచివేసిన తరువాత కూడా ఇది కొనసాగింది. ముస్లిమేతర ప్రాంతాలలో జరిగిన వార్షిక బానిస దాడులు ఫలితంగా దక్షిణ సుడానులో అనేక వేలమందిని బానిసలుగా పట్టుకోవడం ఈ ప్రాంతం స్థిరత్వం, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడం జరిగింది.

భాషలు

దక్షిణ సుడాను అధికార భాష ఆంగ్లం.

60 కి పైగా దేశీయ భాషలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిలో-సహారన్ భాషా కుటుంబంగా వర్గీకరించబడ్డాయి; సమిష్టిగా ఇవి నైలు సూడాను, మద్య సుడాను విభాగాలుగా విభజించబడ్డాయి.

మతం

దక్షిణ సుడాను మతాలలో సాంప్రదాయ స్థానిక మతాలు, క్రైస్తవ మతం, ఇస్లాం ఉన్నాయి.

సంస్కృతి

 

అనేక సంవత్సరాల పౌర యుద్ధం కారణంగా దక్షిణ సుడాను సంస్కృతి దాని పొరుగువారిచే భారీగా ప్రభావితమవుతూ ఉంది. చాలామంది దక్షిణ సుడానీయులు ఇథియోపియాకెన్యాఉగాండాలకు పారిపోయారు. అక్కడ వారు జాతీయులతో పరస్పరం మిశ్రితమై వారి భాషలు, సంస్కృతిని నేర్చుకున్నారు. దేశంలో మిగిలిపోయిన ప్రజలల్ఫ్ సుడాను, ఈజిప్టుకు ఉత్తరంగా వెళ్లి అరబు సంస్కృతిలో మిశ్రితమై ఉన్నారు.

సంగీతం

దక్షిణ సుడాను నుండి అనేక మంది సంగీత కళాకారులు ఇంగ్లీషు, స్వాహిలీ, అరబీ జుబా, వారి మాండలికం లేదా అన్ని మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. బార్బజు, యాబా ఏంజెలోసి వంటి పాపులర్ కళాకారులు ఆఫ్రో-బీటు, ఆర్ & బి, జుకు పాడతారు; డైనంకు రెగె విడుదలలకు ప్రసిద్ది చెందాడు; జానపద, రెగె, ఆఫ్రో-బీటు పాడుతున్న ఇమ్మాన్యూలు కెంబు. దక్షిణ సుడానీస్ సంగీత కళాకారుడు ఇమ్మాన్యూలు జలు తన ప్రత్యేకమైన హిప్ హాప్, సాహిత్యంలో సానుకూల సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి  తీసుకుని వెళ్ళాడు. మాజీ బాల సైనికుడు జెలు సంగీతకారుడిగా మారి యు.కె.లో మంచి ప్రసారం, ఆల్బం సమీక్షలను అందుకున్నాడు. టి.ఇ.డి. వంటి ప్రసిద్ధ చర్చా వేదికలలో ప్రధాన చర్చలలో ఉపన్యాసం చేయడానికి కూడా అవకాశం లభించింది.

సాహిత్యం –

ఇవాళ సూడాన్ లో ఆరబిక్ భాషలో రచనలు చేస్తున్నారు .కవిత్వం మాత్రం ఫర్ భాషలో వస్తోంది .జానపదం కూడా ఉంది.20వ శతాబ్దిలో మౌఖిక సాహిత్యానికి అక్షరారూపమిస్తున్నారు .అజాహి ,మదిహ్ కదా సాహిత్యం బాగా వ్యాప్తిలో ఉన్నాయి .ఇవి పౌరాణిక గాదలు.వీటితోపాటు మహమ్మద్ ప్రవక్త గురించిన కధలు గాధలూ కూడా వచ్చాయి .20వ శతాబ్దిలో పయోనీర్ వంటి పత్రికలు వచ్చాయి .ఇతర దేశాలను చూస్తూ ప్రస్తుతం వాస్తవ సాంఘిక నవలలు రాస్తున్నారు .’’ది వాస్ట్ ఎంప్టి నెస్’’నవలను మల్కార్ ఎడ్డార్ మహమ్మద్  రాస్తే 1960లో మరణానంతరం ప్రచురితమైంది .సుడానీస్ రచయితలలో ప్రసిద్ధుడు –అల్ తయ్యాబి సాలిహా .యితడు కధలు కూడా రాశాడు .ఇతని ప్రసిద్ధ నవల ‘’సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్ ‘’1967లో ప్రచురితమైనది .ఇది ఇంగ్లాండ్ నుంచి సూడాన్ వచ్చే విద్యార్ధుల విషయం పై రాసింది .మొదట అరబిక్ లో తర్వాత ఇంగ్లిష్ ఫ్రెంచ్ భాషల్లో వచ్చింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం  26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

 26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

మాలి అధికారికంగా ” రిపబ్లిక్ ఆఫ్ మాలి ” అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. మాలి జనాభా 18 మిలియన్లు.దేశ రాజధాని బామాకో. మాలి సార్వభౌమ దేశం. దేశంలోని ఎనిమిది ప్రాంతాలలో ఉత్తరప్రాంతం సహారా ఎడారిలో చొచ్చుకుని ఉంటుంది. అదే సమయంలో దేశంలో అధికసంఖ్యలో ప్రజలు నివసిస్తున్న దక్షిణ భాగంలో నైగరు, సెనెగలు నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం, గనులు దేశం ఆర్ధిక కేంద్రాలుగా ఉన్నాయి. మాలి ముఖ్యమైన సహజ వనరులలో బంగారం ప్రాధాన్యత వహిస్తుండగా. ఉప్పు ఉత్పత్తిలో దేశం అతి పెద్ద నిర్మాతగా ఉంది.

ప్రస్తుతమున్న మాలి మూడు పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యములలో భాగంగా ఉంటూ ట్రాన్స్-సహారన్ వర్తకాన్ని నియంత్రించింది: ఘనా సామ్రాజ్యం, మాలి సామ్రాజ్యం (దీనికి మాలి పేరు పెట్టబడింది), తూయింగ్ సామ్రాజ్యం. దేశ స్వర్ణ యుగంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, కళలు అభివృద్ధి చెందాయి.1300 లో శిఖరాగ్రస్థితిలో ఉన్న సమయంలో మాలి సామ్రాజ్యం ఆధునిక ఫ్రాన్సు కంటే రెండు రెట్లు అధిక వైశాల్యంతో ఆఫ్రికా పశ్చిమ తీరం వరకూ విస్తరించింది.] 19 వ శతాబ్దం చివరలో ఆఫ్రికా ఆక్రమణ సమయంలో మాలి నియంత్రణను ఫ్రాంసు స్వంతం చేసుకుంది. ఇది ఫ్రెంచ్ సుడాన్లో భాగంగా మారింది. ఫ్రెంచ్ సుడాన్ (సుడానీస్ రిపబ్లిక్గా పిలువబడేది) 1959 లో సెనెగల్తో కలిసి, 1960 లో మాలి ఫెడరేషనుగా స్వాతంత్ర్యం పొందింది. తరువాత కొంతకాలానికి సెనెగలు సమాఖ్య నుంచి ఉపసంహరించిన తరువాత సుడానీస్ రిపబ్లిక్కు మాలిని స్వయంగా స్వతంత్ర రిపబ్లిక్కుగా ప్రకటించింది. సుదీర్ఘకాలం ఏక-పార్టీ పాలన కొనసాగిన తర్వాత 1991 లో తలెత్తిన తిరుగుబాటు తరువాత కొత్త రాజ్యాంగం రూపొందించబడి తరువాత మాలిని ఒక బహుళ-పార్టీ ప్రజాస్వామ్య దేశంగా స్థాపించడింది.

2012 జనవరిలో ఉత్తర మాలిలో సాయుధ పోరాటాలు జరిగాయి. తిరుగుబాటు మార్చిలో తీవ్రరూపం దాల్చింది. తిరుగుబాటులో ఉత్తరప్రాంతం టువరెగ్ తిరుగుబాటుదారులు వశపరచుకుని ఏప్రిలులో అజావాడు పేరుతో కొత్త దేశాన్ని ప్రకటించారు.  టువరెక్ ప్రతిస్పందనగా 2013 జనవరిలో ఫ్రెంచి సైన్యం ” ఆపరేషన్ సర్వెలును ” ప్రారంభించింది. ఒక నెల తరువాత మాలీ, ఫ్రెంచి దళాలు ఉత్తరప్రాంతం లోని చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 2013 జూలై 28 న రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 11 న జరిగిన రెండో రౌండ్ రన్-ఆఫ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. నవంబరు 24 న, డిసెంబరు 15 న జరిగాయి.

 మాలి ప్రజలలో అనేక సహ-సహారా జాతి సమూహాలు ఉన్నారు. బంబారా ప్రజలు అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు జనాభాలో 36.5% మంది ఉన్నారు.

మాలీలో సమిష్టిగా బంబారా, సోనింకే, ఖస్సోన్కే, మాలిన్కే (మండిన్కా అని కూడా పిలుస్తారు), మండే సమూహంలోని అన్ని భాగాలు కలిసి మాలి జనాభాలో 50% ఉన్నారు.ఇతర ముఖ్యమైన సమూహాలు (ఫులా 17%), వోల్టాయికు (12%), జుంగు (6%) , టువరెగు, మూరు (10%) ఉన్నారు.మాలి, నైగర్లలో మూర్లను అజవాఘు అరబ్బులు (సహారాలోని అజావాగు ప్రాంతం పేరుతో) అంటారు. వారు ప్రధానంగా హస్సనియను అరబిక్కు మాట్లాడతారు. ఇది అరబిక్కు ప్రాంతీయ మాండలికాలలో ఒకటి. వ్యక్తిగత పేర్లు మాలి ప్రాంతీయ గుర్తింపుల సమగ్రరూపాన్ని ప్రతిబింబిస్తాయి.ఈ ప్రాంతంలోని బానిసత్వం చారిత్రక వ్యాప్తి కారణంగా ఉత్తరప్రాంతంలో బెర్బెరు-సంతతికి చెందిన టువరెగు సంచార ప్రజలు, ముదురు రంగు చర్మంగల బెల్లా (తామషెకు ప్రజలు) ఒక విభాగంగా ఉన్నారు.

మాలిలో బానిసల సంతతికి చెందిన 8,00,000 మంది ప్రజలు ఉన్నారు.[35] మాలిలో శతాబ్దాలుగా బానిసత్వం కొనసాగింది.

20 వ శతాబ్దం మధ్యలో ఫ్రెంచి అధికారులు బానిసత్వం అణిచివేసే వరకు అరబ్బు ప్రజలు 20 వ శతాబ్దం వరకు బానిసలను ఉపయోగించారు. కొన్ని వంశావళి సంబంధాలు ఇంకా సాగుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం సుమారుగా 2,00,000 మంది మాలియన్లు ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు. ఐరోపా, ఆఫ్రికా సంతతికి చెందిన స్పెయిను ముస్లింల మిశ్రమ ప్రజలు, అలాగే కొంతమంది ఫ్రెంచి, ఐరిషు, ఇటాలీ, పోర్చుగీసు మూలాలు కలిగిన ప్రజలు మాలిలో నివసిస్తున్నారు. అర్మా అని పిలువబడుతున్న ఈ ప్రజలు దేశం జనాభాలో 1% ఉన్నారు.

భాషలు

మాలి అధికార భాష ఫ్రెంచి. అదనంగా వివిధ జాతుల సమూహాలలో 40 కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి. మాలి జనాభాలో సుమారు 80% మంది బంబారాలో సంభాషించగలరు. ఇది ఒక ముఖ్యమైన ఫ్రాంకా భాషగా పనిచేస్తుంది.

మాలీలో ఫ్రెంచి, బంబారాతో సామీపసంబంధం ఉన్న 12 జాతీయ భాషలు ఉన్నాయి. అవి వరుసగా బోము, టైయాక్సో బోజో, టోరో సో డోనో, మాసినో ఫుల్ఫుల్డే, హస్సనియన్ అరబిక్, మమరా సేనౌఫో, కిటా మనిన్కాకాన్, సోనిన్కే, చెయినా సినోఫో, తమాషెఖ్, క్సాసంగక్సాంగో . ప్రతీభాషా ప్రాథమికంగా జాతి సమూహాలను అనుసంధానించిన మొదటి భాషగా చెప్పబడుతుంది.

మతం – 11 వ శతాబ్దంలో పశ్చిమాఫ్రికాలో ఇస్లాం పరిచయం అయ్యింది. ఇస్లాం ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రధాన మతంగా ఉంది. సుమారుగా 90% మంది మాలియన్లు (ఎక్కువగా సున్నీ) ముస్లుములు ఉన్నారు. సుమారుగా 5% క్రైస్తవులు (సుమారుగా మూడింట రెండు వంతులు రోమన్ కాథలిక్కులు, ఒక వంతు ప్రొటెస్టంట్లు), మిగిలిన 5% స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా ఉంటారు. మాలియన్లలో నాస్తికత్వం, అజ్ఞేయవాదానికి చెందిన ప్రజలు చాలా అరుదుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది వారి మతాన్ని దినసరి జీవితంలో ఆచరిస్తారు.

మాలి రాజ్యాంగం దేశాన్ని ఒక లౌకిక దేశంగా ఏర్పరుస్తుంది. మతం స్వేచ్ఛను కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ హక్కును ఎక్కువగా గౌరవిస్తుంది.

మాలిలో చారిత్రాత్మకంగా పాటిస్తున్న ఇస్లాం స్థానిక పరిస్థితులకు అనుగుణమైనదిగా స్వీకరించబడింది; ముస్లింలు, అల్పసంఖ్యాక మత విశ్వాసాల అభ్యాసకులు సాధారణంగా స్నేహంగా ఉంటారు.2012 లో దేశం ఉత్తర భూభాగాలలో షరియా పాలన ప్రవేశపెట్టిన తరువాత ఉత్తర ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన హింసను వివరించే ఓపెన్ డోర్స్ ప్రచురించిన క్రిస్టియన్ పీడన సూచికలో అధిక సంఖ్యలో (7 వ స్థానం) జాబితా చేయబడింది

విద్య -మాలి లోని ప్రజలకు విద్య ఉచితంగా ఇవ్వబడుతుంది. ఏడు నుండి పదహారు సంవత్సరాల వయస్సు మధ్య తొమ్మిది సంవత్సరాలకాలం నిర్బంధవిద్య తప్పనిసరి.  విధావ్యవస్థ 7 సంవత్సరాల వయస్సులో ప్రారంభించి ఆరు సంవత్సరాల ప్రాధమిక విద్య తరువాత ఆరు సంవత్సరాల ఉన్నత విద్యావిధానం కలిగి ఉంది.[81] కుటుంబాలకు యూనిఫాంలు, పుస్తకాలు, సరఫరా, హాజరుకు అవసరమైన ఇతర ఫీజులకు వ్యయంచేసే ఆర్ధికస్థోమత లేనందున మాలి ప్రాధమిక పాఠశాల నమోదుశాతం చాలా తక్కువగా ఉంటుంది.

2000-01 పాఠశాల సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల నమోదు రేటు 61% (71% పురుషులు, 51% స్త్రీలు) ఉంది. 1990 ల చివరిలో ఉన్నత పాఠశాల నమోదు రేటు 15% (పురుషులు 20%, ఆడవారి 10%).[81] గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు లేకపోవడం, ఉపాధ్యాయుల, వస్తువుల కొరత విద్యా వ్యవస్థను ప్రభావితమవుతుంది.[8

ఆరోగ్యం

పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, పారిశుద్ధ్యసౌకర్యాల లోపం కారణంగా మాలి అనేక ఆరోగ్య సవాళ్లను మాలి ఎదుర్కొంటుంది.

లింగ వివక్ష

2017 లో యునైటెడు నేషన్సు డెవలప్మెంటు ప్రోగ్రాం నివేదించిన ప్రకారం లింగ అసమానత సూచికలో 160 దేశాలలో మాలి 157 వ స్థానాన్ని పొందింది. మాలియన్ రాజ్యాంగం మహిళల హక్కులను కాపాడుతున్నప్పటికీ పలు చట్టాలు మహిళలపై వివక్షత కలిగి ఉన్నాయి.చట్టాలలోని నిబంధనలు వివాహం తర్వాత మహిళల నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తాయి. అందులో భర్త తన భార్యకంటే ఉన్నతుడౌతాడు.[91] స్త్రీలు వారి భర్తలను కనిపించకుండా దూరంగా ఉంటే నిందకుగురౌతారు. తమ పిల్లల చర్యల కొరకు కూడా మహిళలు నిందలను ఎదుర్కొంటారు. ఇది మహిళల స్థితి తక్కువగా పరిగణించే సాంస్కృతిక వైఖరిని ప్రోత్సహిస్తుంది.రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం లేకపోవడం రాజకీయాలు పురుషులతో సంబంధం కలిగి ఉండటం, మహిళలను ఈ రంగం నుండి తప్పించడానికి కారణంగా ఉంది.బాలికల విద్యాభ్యాసంలో బాలుర ఆధిపత్యం అధికంగా ఉంది. ఎందుకంటే బాలురకు విద్యను అందించడం తల్లిదండ్రులకు మంచి పెట్టుబడిగా భావించబడుతుంది.[91

సంగీతం

మాలీ సంగీత సంప్రదాయాలు గ్రియోట్సు నుండి తీసుకోబడ్డాయి. వీరు “మెమోరీస్ కీపర్స్” గా పిలవబడుతున్నారు.మాలీ సంగీతం విభిన్నంగా ఉంటూ అనేక విభిన్న కళా ప్రక్రియలను కలిగి ఉంది. సంగీతంలో కొంతమంది ప్రసిద్ధ మాలీ సంగీతకళాకారులలో కోరా (ప్రసిద్ధ సంగీతకారుడు), టౌమాని డయాబెటే, బెస్సెకో కౌయుయేట్, జాలీ నోగోని, బ్లూస్ గిటారిస్టు అలీ ఫర్కా టూరే, టువరెగు బ్యాండు టినారివేను, సాలిఫు వంటి అనేక గాయకులు ప్రాధాన్యత వహిస్తున్నారు. కెయిటా, ద్వయ అమాడౌ ఎట్ మరీయం, ఊమా సంగరే, రికో ట్రోరే, హబీబ్ కోయిటే ఆఫ్రో-పాప్ కళాకారులుగా ప్రాబల్యత సంతరించికున్నారు. మాలియన్ సంస్కృతిలో నృత్యం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. స్నేహితుల మధ్య డ్యాన్స్ పార్టీలు సాధారణం. వేడుకల కార్యక్రమాలలో సాంప్రదాయ ముసుగు నృత్యాలు ప్రదర్శించబడతాయి.

సాహిత్యం

మాలీలో సాహిత్యం సంగీతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ  అన్ని సమయాలలో మాలి ఆఫ్రికా అతి ప్రాముఖ్యమైన మేధో కేంద్రాలలో ఒకటిగా ఉంది. మాలి సాహిత్య సాంప్రదాయం ప్రధానంగా మౌఖికంగా ప్రాచుర్యం పొందింది. జలిస్ (పఠించడం, హృదయానికి తెలిసిన కథలు, చరిత్రలను పాటలరూపంలో కథనం చెప్పడం వంటి ప్రక్రియలలో ప్రదర్శించబడుతుంటాయి.అమడౌ హంపటే బా మాలి అత్యంత ప్రసిద్ధ చరిత్రకారుడుగా ఈ మౌఖిక సంప్రదాయాలను ప్రపంచాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా లిఖితరూపం ఇవ్వడానికి జీవితం అకింతం చేసాడు.

మాలియన్ రచయిత ” యమబో ఓయులోగ్యుయం ” వ్రాసిన ప్రసిద్ధి చెందిన నవల ” లే డెవోయిర్ డే వయోలెంసు ” ఇది 1968 ప్రిక్సు రెనాడోట్ను గెలుచుకుంది. కానీ ఇది ప్లాగియారిజం అన్న ఆరోపణల ద్వారా దెబ్బతింది.బాబా ట్రోరే, మోడిబో సౌంకలో కేయిటా, మాసా మకాన్ డయాబాటే, మౌసా కొనాటే, మరియు ఫాలీ డాబో సిసోకోలు ఇతరులు మలియన్ రచయితలుగా ప్రసిద్ధిచెందారు.ఊస్మేన్ సెంబి -ఉల్ఫ్ సేనేగేలెస్ నవల రాశాడు .ది ఎపిక్ ఆఫ్ సన్ డియాట రాశాడు మాసా మకాన్ డైబెట్.బంబారా ప్రజల గురించి వారిలో నుంచి వచ్చిన కెరీర్ రచయిత్రి మేర్సో కొండాటే.వోలోఫ్ సేనేగాలిస్ట్ నావలిస్ట్ ‘’గాడ్ బిట్స్ ఆఫ్ వుడ్ ’రాశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం  25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

 25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )

క్రీ.శ.14-117వరకున్నకాలం లాటిన్  సాహిత్యానికి ‘’రజత యుగం ‘’.  ఉత్తమ శ్రేణి వచన రచనలొచ్చాయి..తాసి తుస్ -35-118,సుయెతోనియుస్-75-160లు చరిత్రను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి రాశారు సంప్రదాయం పాటిస్తూ చరిత్రరాశాడు ప్లిని. ఈ యుగం లో వ్యాజస్తుతి ,నిందాత్మక రచనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .సమాజాన్ని ఎడా పెడా వాయిస్తూ వెర్సియుస్ ప్లాకుస్ -34-62 రాశాడు .ఇంతకంటే తీవ్రంగా విజ్రుమ్భించి ,ఐరోపాఖండ సాహిత్యాన్ని పూర్తిగా మారుస్తూ కవిత్వం లో రాసినవాడు జువనెల్-55-130.అవినీతికి’’ చండా మార్కుడు ‘’అనిపించాడు .

శైలికి ప్రాముఖ్యమిచ్చి కొత్త దృక్పధం తో సాహిత్య మీమాంసా శాస్త్రం రాసినవాడు-క్వింతిలియస్ 35-100.ఇతనిది ప్రామాణిక సమీక్షగా అందరూ అంగీకరించారు .రోమ్ నగరం లో కామకేళీ విన్యాసాలను ,ప్రమాదాలను వ్యంగ్య౦ అనుపానంగా రాసాడు ‘’పెట్రోనియుస్.సాంస్కృతిక హైన్యాన్ని వచనం లో ‘’బంగారు గాడిద ‘’అనే కథ లో అద్భుతంగా చిత్రించాడు .ఇందులోని సైకి ,క్యుపిడ్ అంటే ‘’రతీ మన్మధుల కథ’’ తర్వాత కాలం లో కవులను విపరీతంగా ఆకర్షించింది .

  క్రీ.శ. 2వ శతాబ్ది నుంచి లాటిన్ వాజ్మయం క్రైస్తవుల చేతిలోకి పోయింది .ఈకాలం లో బెర్తులియస్-160-220 రాసిన ‘’అప్లో బేతికస్ క్రైస్తవ  ధర్మ ప్రాతిపదికంగా రాశాడు .ఓజో వంతమైన శైలి లో వ్యంగ్యాత్మకం గా రాశాడు .3వ శతాబ్దిలో మిమసియుస్  ఫెలిక్స్ డైలాగ్ రూపంగా ‘’అక్తావియుస్ ‘’రాసి క్రైస్తవాన్ని సమర్ధించాడు .ఆర్నోబియుస్-303,లక్తాన్తియుస్-250-310 లు అదే ధోరణి లో రాశారు .సెయింట్ జెరోం -345-420,సెయింట్ ఆగస్టిన్-354-420 లు ఈకాలపు ప్రసిద్ధ రచయితలు .4వ శతాబ్ది నుంచి లాటిన్ సాహిత్యం లో’’ ఆగస్టీన్ యుగం ‘’ఆరంభమైంది .జెరోం ,ఆంబ్రోస్ -340-378,పౌలినుస్ -353-431 హృదయ౦గమైన కవిత్వం రాశారు .దోనాతుస్,మర్తియానుస్ ,,కపెల్ల మొదలైనవారు  మిస్టిక్ కవిత్వం రాశారు .ఆధ్యాత్మిక దార్శనిక గ్రంధాలన్నీ ఆగస్తిన్ యుగం లోనే వచ్చాయి .జెరోం బైబుల్ ను లాటిన్ లోకి అనువాదం చేసిన మొదటి కవి .’’డివైన్ సిటి’’అనే అత్యుత్తమ ఆధాత్మిక గ్రంథం ఆత్మాను భూతితో రాశాడు సెయింట్ ఆగస్టిన్.

  ఆధ్యాత్మిక ,దార్శనిక విషయాలను క్రైస్తవం తో సమన్వయ పరచి కొత్త పోకడలలో రాసిన వారు –బోయే ధియుస్-480-525,కసియొ దూరస్ -480-570,సెయింట్ బెనెడిక్ట్-480-547,గ్రెగరీ-540-604.ఇందులో మొదటి ఇద్దరు ప్రాచీన గ్రీకు ,రోమన్ సంప్రదాయాలను కాపాడారు .రెండవ ఆయన అరిస్టాటిల్ రచనలను ప్రచారం లోకి తెచ్చాడు .సెయింట్ బెనెడిక్ట్ కృషి వలన చర్చిలు విద్యా ,కేంద్రాలుగా మారాయి . సేయేంట్ ఇసిడోర్-570-636’’ ఎతిమలోగే ‘’అనే ‘’విశ్వ కోశం ‘’రాశాడు .సేదూలియున్ క్రైస్తవ ధర్మ కవిత్వం రాశాడు .కావ్యకళా నిష్ణాతుడు-  ఫోర్త్ నాతాన్ -535-600 మధురగేయకవిత్వం రాశాడు .కొలుమ్బనుస్-543-615,బీడ్-673-735 లు గొప్పకవ్య నిర్మాతలు .మత కవిత్వ కవి ఆల్కుయిన్ -735-804,థియో డుల్ఫ్,పాల్,అన్గిల్బర్త్ ,ఐన్హార్డ్ లుపాస్ నేర్వుతస్ మౌరుస్ మొదలైనవారు .ప్రకృతి సౌందర ప్రేమిక కవి స్ట్రాబో.హోన్బిథా కవయిత్రి ఆకాలపు ‘’సాహిత్య అనురాగిణి’’గా  ప్రసిద్ధి చెందింది .

   11వ శతాబ్దిలో వ్యావహారిక ,ప్రాకృత భాషలు కూడా సాహిత్యభాషలుగా పరిణామం చెందాయి .18వ శతాబ్ది లో కూడా ఐరోపాలో లాటిన్ భాష సాంస్కృతిక భాషగా ఉన్నది .11వ శతాబ్దిలో యూని వర్సిటీలు వచ్చి గ్రీకు ,లాటిన్ లకు ప్రాధాన్యత పెరిగింది .అన్సేలం ,అనెలార్డ్-1079-1142,సాలిస్బరి కి చెందిన  జాన్ -1115-1180 లో లాటిన్ లోనే రచనలు చేశారు సెయింట్ థామస్ ఆక్వినస్ ఛాయా వాదానికి దగ్గరగా ‘’దియోలోజికా ‘’గ్రంథం రాశాడు .డాంటే-1265-1321లాటిన్ లో ఖండకావ్యాలు రాశాడు .ధామస్ అకేన్సిస్ -1380-1471’’ఇమితాతియో క్రిస్తీ’’ ను  కవితా ధోరణిలో  తాత్విక  వివేచనతో దార్శనిక౦గా రాశాడు .14వ శతాబ్దం లో పెట్రార్కా  ఖండకావ్యాలురాస్తే ,వచనరచనలు సిసిరో శైలిలో లాటిన్ లో రాశాడు .

  తర్వాత శాతాబ్దాలలోకూడా లాటిన్ భాషలోనే రచనలు వచ్చాయి .17వ శతాబ్ది ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ లాటిన్ భాషలోనే ఫిజిక్స్ రాశాడు .19వ శాతాబ్దినుంచి లాటిన్ లో గొప్ప రచనలు రాలేదు కాని లాటిన్ గౌరవం తగ్గలేదు .యూరప్ వారు గ్రీకు,లాటిన్ లు వదిలేస్తే వారి సంస్కృతి నిర్జీవమే అవుతుంది . Latin moves with impressive dignity in the writings of OvidCicero, or Virgil. It reflects the seriousness and sense of responsibility that characterized the ruling class of Rome during the great years of the republic. But the Romans could also relax and allow what Horace called the “Italian vinegar” in their systems to pour forth in wit and satire.

    ఇంగ్లీష్ కవులు కూడా లాటిన్ లో కవిత్వం రాశారు .మిల్టన్ ఇంగ్లిష్ లో, లాటిన్ లో కవితలు రాశాడు ధామస్ కామ్పియాన్ ,జార్జి హెర్బర్ట్ ,ఆండ్రూ మార్వేల్ లు కూడా ..కొందరు లాటిన్ లోనే రాసి ఆభాష ఔన్నత్యాన్ని డిగ్నిటిని నిలబెట్టారు .దీనికి ఉదాహరణ ఆన్దోని ఆల్సోప్ ,విన్సెంట్ బోర్న్ వగైరా . 19వశతాబ్ది కవి వాల్టర్ సావేజ్ లాండర్ లాటిన్ లో రాసిన చివరికవి .

లాటిన్ లో 10 ప్రసిద్ధ రచనలు -1-సేలేక్టెడ్ వర్క్స్ బై సిసిరో 2-వర్జిల్ రాసిన ఎనిఎడ్ 3-ఓవిడ్ రాసిన మెటామార్ఫసిస్4-టాసిటస్ –హిస్టరీస్ 5-జూలియస్ సీజర్ రచన-ది కాంక్వెస్ట్ ఆఫ్ గాల్6-మార్కస్ ఆరిల్లస్ రచన –మెడిటేషన్స్ 7-ప్లిని రచన నేచురల్ హిస్టరీ 8-డేసేడిరస్ ఎరాస్మస్ రచన –ది ప్రైజ్ ఆఫ్ ఫాల్లిస్ 9-హోరేస్ రాసిన –ఓడ్స్10-ఆగస్టిన్ ఆఫ్ హిప్పో రచన-కన్ఫెషన్స్.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -1

లాటిన్ భాష –గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేశాక,ట్రాయ్ రాజకుటుంబాలు సురక్షిత స్థావరం కోసం వెతుకుతూ’’ ఈనియస్’’ నాయకత్వం లో ఇటలీ వచ్చారని కథనం ..వీరిభాష ఆర్య భాషా కుటుంబానికి చెందిన లాటిన్ .విభక్తులు ,వికరణలు ఈ భాషలో సంస్కృతం లో లాగానే చాలా ఉన్నాయి .ప్రస్తుతం మృత భాషగా ఉన్న లాటిన్ నుండి ఉత్పన్నమైన భాషలే ఇటలి ,ఫ్రాన్స్ ,స్పెయిన్ ,పోర్చుగల్ ,దక్షిణ అమెరికా భాషలు .లాటిన్ భాషా వాదులు గ్రీకుల సంపర్కం తో వాడిన లిపినే పశ్చిమ ఐరోపా వారు తీసుకొని ‘, ’రోమన్ లిపి ‘’అన్నారు .ఇంగ్లిష్ లోని జె,యుఅక్షరాలు  లాటిన్ లో లేవు .

  సాహిత్యం –అతిప్రాచీనకాల సాహిత్యం లో ప్రకృతి,దేవతలు,గీతాలు సూక్తాలు ,ప్రార్ధనలు ఉన్నాయి .’’ట్వెల్వ్ కమాండ్ మెంట్స్’’ ప్రాచీన రచన .క్రీ.పూ మొదటి శతాబ్దం లో సిసిరో తత్వ వేత్త రచనలు,ఉపన్యాసాలు మాత్రం  సాహిత్య పరమైనవి .వీటిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయం  చెప్ప బడింది .సిసిరో కి పూర్వం లివియాస్  ఆండ్రో నికస్-క్రీ.పూ.284-202 గ్రీకు భాషలో ఉన్న హోమర్ కావ్యాన్ని అనువదించాడు .ఇతడు ,జెవియస్  -క్రీ.పూ.270-199 కొన్ని గ్రీకునాటకాలు కూడా తర్జుమా చేశారు .క్విన్తున్ ఎన్నియస్ ను క్రీ.పూ.239-169’’లాటిన్ సాహిత్య పిత ‘’అంటారు .19సర్గలు ,600పద్యాలతో వీరకావ్యాన్ని రాశాడు .ఇతని బంధువు వసూలియస్ –క్రీ.పూ.220-130 కొన్ని నాటకాలు రాశాడు .రిపబ్లిక్ గా ఉన్న ఇటలి దేశస్థులు ఆఫ్రికాలో చాలా చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసికొన్నారు .అక్కడనుండి ఖైదీగా తీసుకు రాబడిన తెరింతియస్-క్రీ.పూ 195-156లాటిన్ నాటకాలు కళాఖండాలుగా రాసి ,ఐరోపాలో నాటక వాజ్మయానికి పునాదులు వేశాడు .అతడు రాసిన వాటిలో ఆరు సుఖాంత నాటకాలు లభిస్తున్నాయి .ఇతని తర్వాత ప్లాతస్-క్రీ.పూ.220-184 గొప్ప నాటకాలు రాసి నాటక సాహిత్యానికి ఉద్దీపన కలిగించాడు.

   గ్రీకుల ఖండ కావ్య విధానం లో లాటిన్ లో రాసినవారు కాతులస్-క్రీ.పూ.84-54,వలెరియస్  యేది తువస్,లిస్ నుస్  మొదలైనవారు .చతురింద్రియ గ్రాహ్యాలైన చిత్రాలతో ఖండకావ్యాలురాసిన వాడు –లేవియుస్ .హృదయాన్ని స్పందింపజేసి ,గొప్ప అనుభూతితో గేయాలు రాసినవాడు మాత్రం -కాతులస్ .భౌతిక వాదాన్ని ఇతి వృత్తంగా ‘’రేరుం నాతురా ‘’అనేమహాకావ్య౦ రాసిన  దార్శనిక కవి-  లుక్రేషియుస్-క్రీ.పూ.94-54.దార్శనిక భావాలను కవితాత్మకంగా రాసి రస సౌందర్యాన్ని సృష్టించాడు .వచనం లో విశిష్ట శైలి తో మార్గ దర్శనం చేసిన  వారు-కాథో-క్రీ.పూ.234-149,వారో –క్రీ.పూ. 116-27,సిసెరో- క్రీ.పూ.106-43,జూలియస్ సీజర్ –క్రీ.పూ.100-44 మొదలైన వారు .క్రీ.పూర్వం లో విచ్చిన్న శక్తులు అంతర్యుద్దాన్న్ని తెచ్చాయి .విజేత అగస్టస్ సీజర్ కాలపు మహాకవి వర్జిల్ –క్రీ.పూ.70-19.గ్రీకు కవిపితామహ హోమర్ తో సరి తూగ గల ఐతిహాసిక మహాకావ్యం ‘’ఈనియద్’’ను వర్జిల్ మహా కవి రాశాడు ఈనియస్ ఇటలి చేరిన  ఇతి వృత్తం  .భావం భావ చిత్రాలు రూప నిష్పాదన మహా శైలి,పాత్రపోషణ ,గుణాలు అలంకారాలతో ఈ వీరకావ్యానికి మించిన కావ్యం రాలేదని అభిప్రాయం .

   ఆగస్టస్ రాజు కాలం లాటిన్ భాషకు స్వర్ణయుగం వర్జిల్ ,హోరేస్ , ప్రొవెర్తియస్ ,ఓవిద్ మొదలైన మాహాకవులున్నకాలం అది.  వ్యంగ్యాత్మక అవహేళన కావ్యాలను హోరేస్ –క్రీ.పూ.65-8 రచించి ప్రసన్న గంభీర శైలిలో ‘’ఓడ్’’అనే ఖండకావ్యం ,గేయాలు ,సమీక్ష సిద్ధాంతాలు ,లేఖలు రాశాడు .ఎలిజీ కి సృష్టికర్త ప్రొవెర్తియుస్-క్రీ.పూ -47-15ఐతే, వ్యాప్తి చేసినవారు ,తిఖుల్లాస్ క్రీ.పూ.-55-16,ఐవిద్-క్రీ.పూ.43-18.మనోహర కావ్యదార తో ప్రోవెర్తియుస్ అసమానంగా రాశాడు .పౌరాణికం సంప్రదాయం కలిపి ‘’మెటామార్ఫోసిస్ ‘’అనే కావ్యాన్ని రాసినావాడు  ,ఓవిద్  కవి. కవిత్వం లో లాలిత్యం, పాత్రపోషణ  హృదయగ్రాహ్యమైన ప్రణయ కళ ఉన్నాయి .ఇతిహాసాన్ని గద్య౦ గా రాసినవాడు లీవీ –క్రీ.పూ.59-క్రీ.శ 17చరిత్రను కవిత దృష్టితో మలిచి గొప్ప ప్రయోగం చేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-20-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment