ఉగ్రవాది కి స్వేచ్చ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాగంటి రవీంద్ర గారి లేఖ

maganti1 001 maganti2 001 maganti3 001 maganti4 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్త రాజధాని రూపు రేఖలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Nehru ;s spy eye on Netaji

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం )

టాల్ స్టాయ్ అనుచర గణం

 

టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన పెరిగింది .అడపాదడపా పుస్తకాలు  బూట్లు రిపైర్ చేసే బెంచి పై  కూర్చుని రాస్తున్నాడు .ఇలా అనేక విధాల స్థిమిర జీవితం లేకపోయినా కుటుంబంలోను బయటా ఆయన ప్రతిభా కీర్తి పెరుగుతూనే ఉన్నాయి .ప్రజలకు ఆయన బోధలపై విపరీతమైన గురి ఏర్పడింది .ఆయన బోధనలను అమలు పరచటానికి కాలనీలు ఏర్పడ్డాయి .రష్యా యువకులు తమ గురూజీ టాల్ స్టాయ్ అనే చెప్పుకొన్నారు .తమను ‘’టాల్ స్టాయన్స్ ‘’గా పిలుచుకొన్నారు .ఆయన రచనలు ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి .వాటి ప్రభావం ఇంకా పెరిగింది .

కరువు –సహాయ పనులు

1891 లో రష్యాలో వచ్చిన భయంకర కరువును ఎదుర్కోవటానికి బాధితులకు సహాయ సహకారాలు అందజేయటానికి నడుం బిగింఛి అంకిత భావంతో రిలీఫ్ వర్క్ ను చేబట్టాడు . .దేశ విదేశాలనుండి కరువు నివారణకు అందు తున్న నిధులను గ్రామాలకు గ్రామాలకే ఆహారం సరఫరా చేయటానికి ఖర్చు పెట్టాడు .దీనితో టాల్ స్టాయ్ సేవానిరతి ప్రపంచమంతా పాకిపోయి ప్రపంచం లోనే గొప్ప గౌరవ నీయుడు ఆరాధనీయుడయ్యాడు

అరిస్టోక్రసికి సింహ స్వప్నం .

ఆయన జీవితం లో చివరి ఇరవై ఏళ్ళు రష్యన్  అరిస్టోక్రసి కి  సింహ స్వప్నమే అయ్యాడు  .ఆయన రచనలనేకం నిషేధించబడ్డాయి .దొంగచాటుగా ప్రింట్ చేసి సొమ్ము చేసుకొన్నారు .ఆయన సమర్ధకులను జైల్లో పెట్టి హింసించారు . ఆయననూ పోలీసు నిఘాలో ఉంచారు .75 వ ఏట చర్చి కూడా బహిష్కరించింది ఆయనను .సంప్రదాయ క్రిస్టియన్ మతాన్ని కాదన్నాడనేదే అభియోగం .ఆయనకున్న పరపతిని తగ్గించాలన్నదే ఆశయం .

అహింసా పరమో ధర్మః

ప్రభుత్వం  పెట్టె హింసలను చూపించే దౌర్జన్యాలను ఆయన పరమ ప్రశాంత చిత్తం తో అహింసా మార్గం లో  ఎదుర్కొన్నాడు .ఆయన విప్లవానికి పూర్తీ వ్యతిరేకి .ప్రభుత్వ చేష్టలను తీవ్ర స్వరం తో నిరసించాడు .అన్యాయాలను అడ్డుకున్నాడు .ప్రతిపనిపైనా పూర్తిగా విచారణ జరిపి మాత్రమె చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియ జెప్పాడు .ఆ నాటి ప్రజల మనోభావాలకు టాల్ స్టాయ్ అద్దంపట్టాడు .విప్లవానికి టాల్ స్టాయ్ యెంత వ్యతిరేకి అయినా ఆయన మరణం తర్వాత 7 ఏళ్ళకు చివరి రివల్యూషన్ రష్యాలో జరిగింది .

మహాత్ముడికి ఆదర్శం

రష్యాలోని యాస్నాయ పోల్యానా దక్షిణ అమెరికాకు అర్ధ ప్రపంచం దూరం లో ఉంది .అక్కడ మోహన్ దాస్ కరం చంద్ గాంధి ‘’the kingdom of God is within you ‘’అని  ప్రకటించాడు .టాల్ స్టాయ్ కి జాబు రాస్తూ తాను  ఆయన విశ్వాసపాత్రుడైన అనుచరుడిని అని చెప్పుకొన్నాడు .ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం జరిగాయి .1910 చివరలో టాల్ స్టాయ్ మహాత్ముడికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు .అందులో క్రిష్టియానిటి  క్రీసు బోధనలను అనుసరించటం లేదని బాధ పడ్డాడు .అందులోనే చాలా తీవ్రంగా ‘’the longer I live ,and especially now when I vividly feel the nearness of death ,I want to tell others what I feel so very clearly and what to my mind is of great importance –namely that which is called passive resistance ,but which in reality is nothing less than the teaching of love ,uncorrupted by false interpretations. A s soon as force was admitted into love ,love was no longer the law of life .And as there was no law of love ,there was no love at all, except violence –that is the power of the strongest .Thus Christian mankind has lived for nineteen centuries ‘’అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు .ఇవే మహాత్ముడికి ప్రేరణ మంత్రాలైనాయి భారత దేశ స్వతంత్ర సాధనకు .అవే మార్టిన్ లూధర్ కింగ్ కు ఆదర్శాలూ అయ్యాయి .

సందర్శకుల సందడి

ఈ ముసలివయసులో అన్నిరకాల అభిప్రాయాల వారి సందర్శన తో టాల్ స్టాయ్ క్షణం తీరిక లేకుండా గడిపాడు .ప్రముఖ కవులు ,భక్తులు ,రాజకీయ నాయకులు ,రాజ్య పాలకులు అందరూ క్యూకట్టి దర్శనాలు చేసుకొని సర్వ సంగ పరిత్యాగి అయిన ఆ మహాను భావుడిని అర్చి౦చేవారు .సన్మానించి గౌరవించేవారు .’’సత్యం కోసం బాహ్య విషయాలను త్యాగం చేయటమే పరమార్ధం అని బోధించాడు లియో .

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత లాగా   తయారైంది టాల్ స్టాయ్ బతుకు .ప్రపంచమంతా ఆరాదిస్తూ పూజిస్తున్న మహా రచయితా దార్శనికుడికి ఇంటిపోరు అదే దామాషాలోఅనులోమంగా  పెరిగి ఇంట్లో పరువు విలోమంగా తగ్గిపోయింది సంతానాన్ని గారాబం గా చూసుకొంటూ వాళ్ళతో ఆటలాడుకొంటూనే  ఉండే వాడు ఒకప్పుదు  .వారికీ తండ్రిపై వల్లమాలిన గౌరవ ప్రేమలుండేవి .కాని ఇప్పుడు అంతా ‘’ఉల్టా సీదా ‘’అయి పోయింది .పిల్లల్లో స్వార్ధం పెరిగింది  .తండ్రి త్యాగనిరతిని వాళ్ళు అర్ధం చేసుకోలేక గొడవ పడ్డారు .పలకరింపులే లేవు .సానుభూతి ఎండమావి అయిపోయింది .కుటుంబం లో .చిన్న కూతురు అలేక్సా౦డ్రా మాత్రమె తల్లినెదిరించి తండ్రి పక్షాన నిలిచింది .మిగతావారంతా బద్ధ విరోదులైపోయారు

సుఖము లేదంతే.

సాధారణం గా మానవ జీవిత చరమాంకం లో సుఖ శాంతులతో వర్ధిల్లటం అందరూకోరుకొనే వరం పాపం ఈ ముసలాయనకు అది శాపంగా మారింది .అందరూ ఆయన్ను వ్యక్తిగతంగా బాధించారు హింసించారు ,పీడించారు .భార్య సోన్యాకు లియో అనుచరుడు వి. జి .చేర్కొవ్ కు మధ్య’’ టగ్ ఆఫ్ వార్ ‘’కొనసాగింది .చేర్కొవ్ పెద్ద లాండ్ లార్డే .సంస్థానం లో ఉండే రైతుల జీవితాలను బాగు చేయాలనుకోన్నవాడే .రెండు విషయాలే తగాదాకు కారణాలైనిలిచాయి .మొదటిది తన రచనల మీద కాపీ రైట్  హక్కులు ప్రజలకు ఇవ్వకుండా భార్యకు దఖలు పరచటం .చరమాంకం లో ఉన్న మాస్టర్ లియో  ను ఆ హక్కులు ప్రజలకు దక్కెట్లు వీలునామా లో పొందుపరచమని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు ,ఇలా చేస్తే సోన్యాకు ,ఆమె వారసులకు  హక్కులు దక్కవు .రాయల్టీలు రావు .టాల్ స్టాయ్ చాలా రహస్యం గా భద్ర పరచిన డైరీలు చేర్కొవ్ అధీనం లో ఉండటం .చివరికి చిలికి చిలికి గాలివానైంది ఈ డైరీల విషయం లోనే .

సోన్యా మానసిక స్థితి

ఇంటిలోని పోరు గురించి ఆయన రాసుకొన్న ఎనిమిది డైరీలున్నాయి .సోన్యా మానసిక పరిస్తితికూడా బాగా లేదు .మెనోపాజ్ బాధలెక్కువైనాయి .హిస్టేరికల్ గా మారిందికూడా .భర్త రాసుకొన్న డైరీలలో తన అనారోగ్య విషయాలేమైనా ఉన్నాయేమోనని ఆమె అనుమానం  అపోహ  .భర్త చనిపోతే వాటిని ప్రచురించే హక్కు ఎవరికి దక్కుతుంది అనేదానిపై సందిగ్ధం ఆమెను పీడిస్తోంది .ఎప్పుడూ ఇంట్లో ఆమె ఏడుపులు పెడ బొబ్బలుగా గా ఉంది. ఇల్లు నరకప్రాయమై పోయింది .తరచుగా ఆత్మహత్యా ప్రయత్నాలూ చేసింది .భర్త ప్రతికదలిక పైనా నిఘా పెట్టింది .చెప్పరాని రాయలేని అనేక నేరాలు ఘోరాలు ఆయనపై మోపి మానసిక క్షోభ పెట్టింది .82 ఏళ్ళ ముదుసలి భర్తకు చేర్కొవ్ తో అక్రమ సంబదాన్నీ అంట గట్టింది .ముప్ఫై ఏళ్ళు భార్యకు లొంగి బతికాడు .ఇక ఏమాత్రమూ సహించలేక పోయాడు స్వేచ్చ కావాలని పించింది .రాజీ ప్రశ్నే లేదన్నాడు .

ఇంటి నుంచి బయటి ప్రపంచం లోకి –అటునుంచి అనంత లోకాలకు

28-10-1910 ఉదయం 6 గం లకు అక్టోబర్ చలిగాలిలో తెల్లవారుజాముననే టాల్ స్టాయ్ లేచి తన స్వంత ఎస్టేట్ యాస్నా పోల్యానా వదిలి బాహ్య ప్రపంచం లోకి వచ్చేశాడు .ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు .తన ఇంట్లో ఇంక ఒక క్షణం కూడా ఉండలేనని ,ఉండరాదని మాత్రం నిశ్చయించుకొని బయట పడ్డాడు ఆమహా రచయిత.అయనను అమితంగా ఆరాధించే కూతురు అలేక్సా౦డ్రా తండ్రిని ఆయన సోదరి ఉండే ఒక కాన్వెంట్ దగ్గర కలుసుకోగలిగింది . మర్నాడు తండ్రీ కూతురు కలిసి తెలియని దూర తీరాలకు ప్రయాణం చేశారు .లియో చలితో వణికి పోతున్నాడు .జ్వరం తీవ్రంగా ఉంది వీళ్ళు ఎక్కిన రైలు  ఆష్టా పోవో స్టేషన్ లో ఆగింది .స్టేషన్ మాస్టర్ దయ తలచి తను ఉంటున్న ఇంటిలో ఆతిధ్యమిచాడు .అప్పటికే న్యుమోనియా సోకి బాధపడుతున్నాడు .టాల్ స్టాయ్ ఇల్లు వదిలి వేల్లిపోయాడన్న వార్త  గుప్పుమన్నది .ప్రపంచం అంతా ఆయన పక్షాన నిలిచింది .ఆస్టా పోవోగ్రామం అంతా జనసముద్రమై ఉప్పొంగింది .విలేకరులు ,ఫోటోగ్రాఫర్లు ,అధికారులు ,గూఢచారి పోలీసులు ,శిష్యులు ,కొడుకులు ,కూతుళ్ళు బంధుజనం అభిమానులు ఆసక్తి పరులతో అంతా హడావిడిగా ఉంది .భార్య సోన్యా కూడా చూడటానికి వచ్చింది కాని భర్త ఆమెను తన రూమ్ లోకి రానివ్వ వద్దని ఆంక్ష విధించాడు  .మర్నాడు నవంబర్ 7 ఉదయం టాల్ స్టాయ్ స్పృహ కోల్పోయే దాకా ఆమెను లోనికి రానివ్వలేదు .ఆ తర్వాతే అనుమతించారు .కొన్ని గంటల తర్వాత ఆయన ఆయాస పడి గాలి పీల్చుకోవటానికి చాలా కష్టపడి చివరికి అంతిమ శ్వాస వదిలాడు .

టాల్ స్టాయ్ తప్పులేమీ చేయని వాడూ ,మహోన్నతుడూ కాకపోయినా ఆయన రష్యాసాహిత్య చరిత్రలో ఒక విస్తృత విశాల మానవుడు ,అంతకు మించి అత్యంత గొప్ప నైతిక బలమున్నవాడు అనటం లో సందేహం లేదన్నాడు రచయిత లూయీ అంటర్ మేయర్ .

టాలెస్ట్ రైటర్, ఫిలాసఫర్ పసిఫిస్ట్   టాల్ స్టాయ్

నవలాకారులలో అత్యున్నతుడు లియో అంది వర్జీనియా ఉల్ఫ్ .జేమ్స్ జాయిస్ ‘’he is never dull ,never tired ,never pedantic ,never theatrical ‘’అన్నాడు .డాస్తో విస్కీ ‘’సజీవనవలాకారుల్లో గొప్పవాడు ‘’అంటే, ఫ్లాబర్ట్ వార్ అండ్ పీస్ చదివి ‘’ఆయనలో కళాకారుడు ,సైకాలజిస్టూ’’ఉన్నారన్నాడు .’’seldom art work so much like nature’’అనిపోగిడాడు ధామస్ మాన్ .ప్రౌస్ట్ ,ఫాక్నర్ ,నబకోవ్ లదీ ఇదే అభిప్రాయం .

టాల్ స్టాయ్  ప్రైవేట్ ప్రాపర్టీ కింద భూములు ఉండటానికి ఇష్టపడలేదు .ఫాదర్ సేర్జియాస్ ను చెకోవ్ కు గోర్కీ కి చదివి వినిపిస్తూ చివర్లో టాల్ స్టాయ్ కన్నీళ్లు ఆపుకోలేక కార్చేశాడు .ఆయన గాంధీగారికి రాసిన ఉత్తరం ‘’ఏ లెటర్ టు ఎ హిందూ ‘’పేరున ప్రసిద్ధి చెందింది .మహాత్ముడు ఆయనను ‘’the greatest apostle of non violence that the present age has produced ‘’అని శ్లాఘించాడు .దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన రెండవ కాలనీకి గాంధీగారు ‘’టాల్ స్టాయ్ కాలని ‘’అని గౌరవ నామ కరణం చేశాడు .అంతర్జాతీయం గా భాషలన్నిటికి ఏక భాష  ‘’ఎస్పరాంటో ‘’ఉండాలని ఆశించాడు లియో .డొకో భోర్ 1895లో తమ వద్ద ఉన్న ఆయుధాలను తగల బెట్టి శాంతి ఉద్యమాన్నిచేయటాన్ని  సమర్ధించాడు .వారి భావాలను అంతర్జాతీయ వేదికపై చర్చి౦చాడు కూడా.డొకో బోర్లు కెనడాకి వలసపోవటానికి సహాయ పడ్డాడు లియో . 1904జపాన్ –రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించన శాంతి కాముకుడు టాల్ స్టాయ్ .

Image result for tolstoy

మరో ప్రముఖవ్యక్తితో కలుద్దాం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-15 –ఉయ్యూరు

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3

కరేనిన ప్రాముఖ్యత

వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . నైతికతపై ఆలోచనలున్నాయి .రష్యా ఉన్నత వంశానికి చెందిన ఒక మహిళ విషాద గాధ ఇది .యవ్వనంలో అందంగా ఉన్న సున్నితమనస్కతకల ఒక అమ్మాయికి  తనకంటే చాలా పెద్ద వయస్కుడైన వాడితో పెళ్లి జరిగింది .పరిస్తితుల ప్రాబల్యం వలన ఆమె ఒక యువ ఆఫీసర్ ను ప్రేమించింది .ఇటు ప్రేమ అటు భర్త తో సంసారం .ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది .తేల్చుకోలేక ,ముందుకు సాగలేక ,సమాజాన్ని ఎదిరించలేక నిరాశా నిస్పృహలతో రగిలిపోయే కేరేనినా పాత్రను చిరస్థాయిగా నిలిచేట్లు మలచిన తీరు అసదృశం గా కనిపిస్తుంది .’’Anna Karenina is all encompassing stern and compassionate ,understanding ,yet merciless ,one of the supreme novels of the century ‘’.

 

టాల్ స్టాయ్ కొత్త మతం

నిజ జీవితం లోకూడా టాల్ స్టాయ్ అంతసంఘర్షణ  కు లోనయ్యాడు .తప్పు చేస్తున్నానేమోనని చింతించాడు చావు భయం వెన్నాడుతోంది .మానసులోని భావాలను అణచుకోలేక పోతున్నాడు .జీవించటానికి ఆధారమూ గోచరి౦చటం లేదు  .సమైక్యత,కనీస న్యాయం ,నైతికతస్తిరత్వం  వైపు మొగ్గు పైనే ద్రుష్టి పెట్టాడు .మతం లో సామాన్య రైతుకు అభయం ,మరణానికి సంసిద్ద మయ్యే ప్రశాంతత ఉన్నాయనుకొన్నాడు .దీనికి తనకు పూర్తీ ఆధ్యాత్మిక భావాలే శరణ్యమని పించింది .మొదట సంప్రదాయ చర్చి పై ఆధార పడాలనుకొన్నాడు .కాని వారిలోని చాందస భావాలు ,కర్మకాండలు నచ్చలేదు .చివరికి తన ధోరణిలో ఒక కొత్త మతాన్ని గురించి ఆలోచించాడు .ఈ విషయాలన్నీ ‘’కన్ఫెషన్స్ఆఫ్ సెయింట్ ఆగష్టిన్  ‘’లో చర్చించి రాశాడు.ఆయన మతం లో దేవుడు అంటే దేవుడు అంటే అన్నిరకాల నమ్మకలున్నవారికీ చెందినవాడు .ఏదో ఒక భావానికి మాత్రమె చెందినవాడుకాదు .అంటే ‘’యూని వర్సల్ గాడ్ ‘’ .. జీసస్ అంటే ఒక లిజే౦డరి ఫిగర్ మాత్రమె .అన్నికాలాలకు గొప్ప బోధకుడు .విజ్ఞానానికి పరాకాష్ట .ఆయన చెప్పిన’’ సేర్మాన్ ఆన్ ది మౌంట్ ‘’ లో ఉత్తమజీవికా విధానాలున్నాయి .అందులో చెప్పిన ‘’resist not him that is evil ‘’అనేది శాంతికి ప్రవచనం గా భావించాడు

టాల్ స్టాయ్ ని రూసో తోపోల్చటం ఉంది ఇద్దరి జీవన విధానాలు వేరే . ‘’మనిషి లోని దైవానికి’’సేవ చేయాలనే తత్త్వం లియో ది .వ్యక్తిగతమైన ఇష్టం బలహీనత అన్నాడు .పనిలో మనమెవరమో మర్చిపోవాలి .కళ మానవ సహోదరత్వానికి మాధ్యమంగా ఉండాలి అన్నాడు .ప్రతిదీ కళాత్మకం గా ఉండాలని అంటాడు .చదువులో ,పనిలో ,వ్యక్తిగత భావాలలో ,ప్రభుత్వం లో పబ్లిక్ సెంటిమెంట్ అన్నిటిలో కళ కనపడాలి .కళతోనే అన్నిటినీ కొలిచేవాడు .వీటినే దిలివింగ్ కార్ప్స్’’,దిపవర్, ఆఫ్ డార్క్ నెస్ మొదలైన  నాటకాలలో నిక్షిప్తం చేశాడు .ప్రసిద్ధమైన కధలు’’ దిడెత్ ఆఫ్ ఇవాన్’’’’ ఇల్యోవిచ్ ,ది క్రాత్రడ్జ్ర్ సోనాటా ‘’లలో కూడా పోదిగాడు ‘’.రిసరేక్షన్ ‘’అనే నవల ‘’వాట్ ఈజ్ ఆర్ట్ ‘’లు పూర్తిగా నైతికతను సంర్ది౦చేవే .

మారిన మనిషి

టాల్ స్టాయ్ లో అంతులేని  మార్పులు వచ్చాయి .వస్త్రదారణా మారింది ముతక బట్టలు కట్టటం మొదలు పెట్టాడు .పాద రక్షలు లేకుండా నడిచాడు .ఇతరుల శ్రమ మీద జీవించటం నేరంగా భావించాడు .అన్నిరకాల వ్యసనాలకు ,’’ఆకళ్ళ’’కు దూరంగా ఉన్నాడు .పొగ తాగటం మానేశాడు .శాకాహారం పైనా,తీవ్ర శిక్షల రద్దు పైనా  పుస్తకాలు రాశాడు .డబ్బు బంధాలనుండి ,ఆస్తి సంకెళ్ళ నుండి విడిపడాలని ఆలోచించాడు .ఇవన్నీ ‘’అయ్యవారికి’’ బాగున్నా ‘’అమ్మవారు సోన్యా’’ కు నచ్చలేదు .వీటిపై ఆలోచించటానికే ఆమె ఇష్ట పడలేదు .భార్య పూర్తిగా మతాన్ని చర్చిని సమర్ధించే వ్యక్తీ .అందువల్ల టాల్ స్టాయ్ ఊగిసలాట ధోరణి భార్యకు అసలు నచ్చలేదు .ఆమె స్వతహాగా రైతు కాకపోవటం ‘’ కౌం టేస్’’’’కావటం ,ఆస్తిని విస్త్రుతపరచాలనే ఆలోచనలో ఉండటం ,ఎస్టేట్ ను సంపన్నం చేయటానికి ,పిల్లలకోసం ఎస్టేట్ రాబడి ,సంపద వృద్ధి చేయాలనే ఆలోచనా ఆమెది .స్వచమైన తల్లిగా ఉండటమే ఆమె ఆదర్శం .ఆమెకు విరుద్దం గా ప్రవర్తించలేక తన భావాలను ఒదులుకోలేక సతమతమవుతున్నాడు .నిర్ణయాలను వాయిదాలపై వాయిదాలు వేస్తున్నాడు .తన ఆస్తినంతా ఆమె పేరున రాసేశాడు .తన పుస్తకాలపై వచ్చే ఆదాయం హక్కులు జనానికి ఇవ్వటానికి బదులు  ,ఆమెకే చెందేట్లు రాయటంచేసేశాడు .సోన్యా స్వంతం గా పబ్లిషింగ్ హౌస్ ఏర్పాటు చేసి భర్త రచనలను స్పెషల్ ఎడిషన్స్ గా ముద్రించింది .వ్యాపార ధోరణి బాగా ఉన్న ఆమె దీనితో  డబ్బు బాగా గడించి లాభాలు తీసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అది చాలు మన్మధా మరియు స్మార్ట్ మన్మధ కవితలు -మూసీ -ఏప్రిల్

జీవనోద్భాషి ఆంద్ర భాష -బలివాడ అప్పారావు కవిత -మూసి ఏప్రిల్bhasha 001bhasha 001manmadha 001

Posted in కవితలు | Tagged | Leave a comment

సత్య నాష్


 


 
 


 
 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగ సంప్రదాయం అంటే ఏమిటి?

యోగ సంప్రదాయం అంటే ఏమిటి?
 
యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా నిశితంగా వీటిని అభ్యాసం చేశారు. బహుశా బౌద్ధుల కాలంలోనే యోగశాస్త్రం మనదేశం ఎల్లలు దాటి టిబెట్‌, చైనా తద్వారా మిగతా ఆసియా దేశాలకు కూడా విస్తరించింది. అన్ని భారతీయ సంప్రదాయాలూ యోగాన్ని అంగీకరించినా ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశాల్ని సూత్రాల రూపంలో పతంజలి అనే ఋషి వ్రాశాడు. వీటినే పతంజలి యోగసూత్రాలు అంటారు. ప్రపంచంలోని మేధావులందరూ ప్రశంసించిన గ్రంథమిది.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం. జీవుడు తాను కేవలం శరీరం, ఇంద్రియాలు  కాదనీ, చైతన్యం తన నిజరూపమనీ తెలుసుకోవడం.
శరీరానికి, మనస్సుకు ఉన్న సంబంధాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రం యోగశాస్త్రం. సాధారణంగా యోగమంటే ఏవో ఆసనాలు వేయడం, శరీరాన్ని అనేక రీతుల్లో వంచడం, గాలిని బిగబట్టడం మొదలైనవేనని భావిస్తూ ఉంటాం. ఈ విధమైన ఆసనాలు, గాలిని బిగబట్టడం లాంటివి యోగశాస్త్రంలో ప్రాథమిక అభ్యాసాలు మాత్రమేనని యోగసూత్రాల్ని చూస్తే గమనించగలం. మరి ఇందులో అసలైన విషయమేమిటి అని పరిశీలిద్దాం.
చైతన్యం అనే రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చ అన్ని భారతీయ దర్శనాల్లో చూడగలం. జడం నుండి చైతన్యం వచ్చిందని కొందరు, చైతన్యమే జడంగా మారిందని కొందరు, చైతన్యం జడంగా కనిపిస్తుందని మరికొందరు ప్రతిపాదించారు. ఈ సమస్యకు సమాధానానికై ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆధునిక మనస్తత్వశాస్త్రజ్ఞులు మన యోగశాస్త్రం చేసే ప్రతిపాదనల్ని స్వీకరించి ఈ యోగ విధానాల్ని అభ్యాసం చేసే సాధువులు, బౌద్ధభిక్షువులు మొదలైన వారితో కూడా కలిసి పనిచేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలకు మనిషి(అన్ని జీవుల) శరీరమే ప్రయోగశాలలాంటిది. దీనిలో ఒక ఆలోచనాశక్తి ఉంది, శరీరం, ఇంద్రియాలు, అవయవాలు ఉన్నాయి. ఆలోచనాశక్తి చైతన్యానికి సంబంధించిన అంశం. శరీరం, ఇంద్రియాలు జడానికి చెందిన అంశాలు. ఈ రెండూ కలగాపులగంగా విడదీయరానివిగా శరీరంలో ఉన్నాయి. ఏది దేనిపైన ఆధారపడి ఉంది, ఏది ప్రధానమైనది అని తెలియాలంటే శరీరము, మనస్సు అనే లేబొరెటరీతోనే పరిశీలన చేయాలి.
శాస్త్రవేత్తలు దేన్నీ నిర్ధారించి చెప్పనప్పటికీ వేదాంతం. సాంఖ్యము, యోగశాస్త్రమూ చైతన్యమే ప్రధానమైనదని చెపుతాయి. ప్రాణుల శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనేవి సృష్టిలో ఉన్న పృథివి, జలం, అగ్ని మొదలైన ఐదు భూతాల పరిణామంగా ఏర్పడినవే (్ఛఠిౌజూఠ్ఛి) అని ఇది వరకు వ్యాసాలలో గమనించాం. శరీరం, అవయవాలు స్థూలమైనవి, అంటే బండవి, చైతన్యం లేనివి అని చెప్పవచ్చు. మనస్సు వీటికన్నా మెరుగైనది. దీనికి విషయాల్ని గ్రహించే శక్తి ఉంది. అందుకే దీన్ని సూక్ష్మమైనది అన్నారు. మనిషికి ‘నేను’ అనే భావన ముఖ్యంగా స్థూలమైన శరీరంపై ఉంటుంది. దీనికి ఆకలి, దప్పికతో పాటు, ఇంద్రియాల సంతోషానికై అనేక కోరికలు ఉంటాయి. మనస్సు వీటి వెంబడి పరిగెడుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరనప్పుడు మనస్సు తీవ్రంగా కలత చెందుతుంది. దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. కానీ మనిషి స్వరూపం శరీరం, ఇంద్రియాలు కాదు, చైతన్యం అని ఉపనిషత్తులు చెప్పినట్లే పతంజలి కూడా చెబుతాడు. అందువల్ల సాధన మార్గంలో ఉన్న వ్యక్తి ‘నేను’ అనే భావనను స్థూల శరీరం నుండి తీసివేసి తన స్వరూపం చైతన్యమే అని గమనించాలనేది యోగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇలా గమనించడానికి మనస్సుకు చాలా అభ్యాసం కావాలి. ఇలాంటి అభ్యాసాన్నే యోగశాస్త్రం చెప్తుంది.
మనస్సు శరీరంపై ప్రభావం చూపుతుందని మనకు తెలుసు. ఏదైనా ఎక్కువ సంతోషాన్ని, దుఃఖాన్ని కలిగించే వార్తలు విన్నప్పుడు మనిషి ఉద్వేగానికి లోనౌతాడు. కానీ శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును ప్రభావితం చేయగలం అనేది యోగశాస్త్రంలో మౌళికమైన సూత్రం.పతంజలి తన యోగసూత్రాల్లోని మొదటి మూడు సూత్రాల్లోనే విషయాన్నంతా సంగ్రహంగా చెప్పాడు. యోగమంటే మనస్సులోని అన్ని ఆలోచనల్నీ నిరోధించడం అని, అలా చేసినపుడు సాధకుడు తన అసలు స్వరూపమైన చైతన్యంలో ఉంటాడని, అలా చేయలేనప్పుడు బయటి ప్రపంచంతో మమేకమై కష్టసుఖాలు అనుభవిస్తుంటాని మొదటి మూడు సూత్రాలు. మిగతా గ్రంథమంతా ఈ మూడింటిపైన వచ్చిన వ్యాఖ్య. మనస్సును అదుపులో తేవడానికి ఎనిమిది మెట్లు చెప్పారు. దీన్నే అష్టాంగయోగం అన్నారు. మొదటగా శరీరానికి సంబంధించిన అభ్యాసాలు. ఒక విషయంపై కోరిక కలిగినపుడు బలవంతంగా శరీరాన్ని నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. మంచి, చెడులు విచారించి, మనస్సును కోరికలవైపు వెళ్ళకుండా చేయడం రెండవ మెట్టు. మూడవమెట్టు మనందరికీ తెలిసిన ఆసనాలు. ఇవి శరీరానికి కష్టం కలిగించేటట్టుగా లేకుండా ఆలోచించడానికి అనువైన పద్ధతిలో ఉండాలి. ఆ తర్వాత గాలిపై నియంత్రణ మొదలైన మెట్లు చెప్పబడ్డాయి. వీటిని పుస్తకాల ద్వారానే కాక ఒక మంచి సాధకుడైన గురువు పర్యవేక్షణలో అభ్యాసం చేయడం ముఖ్యం.
యోగశాస్త్రంలో దేవుడి ప్రస్తావన కేవలం ఒకే సూత్రంలో ఉంది. మనిషికున్న క్లేశాలు, కర్మఫలం మొదలైన వాటికీ, దేశకాలాలకూ అతీతంగా ఉన్న సర్వజ్ఞుడైన వ్యక్తి అని మాత్రమే చెప్పబడింది. కావున ఇది ఏ మతవిశ్వాసానికీ, ఏ దేవుడికీ చెందింది కాదు. ప్రపంచంలో ప్రతి మనిషికీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఒకటే. అందువల్లే ఈ శాస్త్రంలోని విశ్లేషణపై మనకన్నా ఎక్కువగా ఇతరులు శ్రద్ధ చూపుతున్నారు. పాశ్చాత్య మనస్తత్వశాసా్త్రనికి మూల పురుషుడు అని పిలవబడే గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట (హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం) వివేకానందుని శిష్యుడు. వివేకానందుడు ఇతని ఆతిథ్యంలో ఉండేవాడు. ఇతడు చెప్పిన టఛిజీౌఠటుటట అనే భావన యోగసూత్రంలోనిదే. గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట హిందూ, బౌద్ధ సంప్రదాయాల్ని క్షుణ్ణంగా చదివాడు. అలాగే ఇ్చటజూ ఒఠుజ కుండలిని యోగంపై అనేక సెమినార్లు నిర్వహించాడు. బ్రిటీష్‌ పరిపాలన సమయంలో కలకత్తాలో జడ్జిగా ఉండిన ఖిజీట ఒౌజిు గిౌౌఛీటౌజజ్ఛ అనే అతను శరీరంలోని వివిధ చక్రాలు, కుండలిని మొదలైనవాటి గూర్చి ఖీజ్ఛి ఖ్ఛిటఞ్ఛు మొదలైన పుస్తకాలు వ్రాశాడు. యోగంలో చెప్పే ధ్యానాన్ని అనే పేరిట మనస్తత్వవేత్తలు బోధిస్తున్నారు. ప్రస్తుతం యోగవిధానాల్ని హిందూ సంప్రదాయంలో కన్నా బౌద్ధులు ఎక్కువ అభ్యాసం చేస్తూండడం, ఆదరణ పొందడం ఒక విశేషం.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
 
సుగుణ మూర్తి స్వరూపమే విగ్రహారాధన!
స్పందన
చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన అధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
మార్చి 27 వ తేదీ శుక్రవారం భారతీయంలో విగ్రహారాధన ప్రధానాంశంగా రిటైర్డ్‌ డి.జి.పి డాక్టర్‌ అరవిందరావు గారి వ్యాసం ఆలోచనాత్మకంగా బాగుంది. దానికి మరి కొంచెం వివరణే ఈ వ్యాసం.
మన భారతీయతత్వ చింతన జ్ఞాన ప్రధానమైనది కేవలం విశ్వాస ప్రధానమైనది కాదు. తత్వం అంటే మూలతత్వం. – ‘ఈ అనంత విశ్వశకి ్తరహస్య తత్వం. ఆ తాత్విక జ్ఞానాన్నే వేదం అన్నారు.‘‘ వేత్తీఆవేదః వేదమతీతివేదః ’’
అని వేద నిర్వచనం. తెలిసేది- తెలుసుకునేది- తెలుసుకున్న జ్ఞానమే వేదం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసినదే చాలా ఉంటుంది. అందుకే ‘‘అనంతావైవేదాః’’ . అయితే ఈ వేద విజ్ఞానాన్ని నాల్గు వేదాలుగా వింగడించాడు వ్యాస మహర్షి. ‘‘వేదాన్‌ వివ్యాస ఇతివేదన్యాసంః’’ అని సంగీత వాక్యము. వేదములు మూడు అని ‘‘త్రయోవేదాః’’ అని కూడా అంటారు. సరే అది ప్రస్తావాంశమే కానీ ప్రధానాంశం కాదు. ప్రస్తుతం విగ్రహారాధనకు వేద నాగరికతా పరిణామం ఎలాగో ఆలోచిద్దాం.
మొదటిగా..
మొట్టమొదటి ఋగ్వేద కాలంలో మానవ నాగరికతలో మనస్సే ప్రధానంగా భావించారు. ఋక్కు అంటే మంత్రం. మను తేత్రాయతీతి మంత్రః అని, మన్య తేత్రాయతేతిమంత్రః అని, మీననాల్‌త్రామతే ఇతిమంత్రః అని నిర్వచనాలున్నాయి. ‘‘మన ఏవ మనుష్యాణాంకారణంబంధవేలూక్షమోః’’ అని మనసునే ప్రధానాంశంగా జపయోగాన్ని, తపోయోగాన్ని సంకల్ప ప్రధానంగా తపోభవ’ అని ఉపదేశించాడు అగస్త్య మహర్షి. అందుకే రుగ్వేద కర్మకాండల్లో క్రియ కంటే ఎక్కువ సంకల్ప ప్రధానంగా ఉంటాయి .‘‘యజ్ఞారాంజపయజ్ఞోస్మి’’ గీతా వాక్యం. కానీ కాలక్రమంలో మనస్సే కాకుండా క్రియకు కూడా ప్రాధాన్యమివ్వాలనే దృష్టిలో యజుర్వేద యుగం ప్రారంభమైంది. ‘‘ కామేనవాచామనసేంద్రియైుః బుద్ధ్యాత్మనా’’- చేసిన కర్మలే సంపూర్ణ సాఫల్యాన్నిందిస్తాయని యజ్ఞయాగాది కర్మలను ప్రబోధించింది. ‘‘యజ్యతీతియజ్ఞం’’ ,దేవేభ్యోయజ్ఞందేవయజ్ఞం’’, ‘‘భూతేభ్యోయజ్ఞః’’, ‘‘ భూతయజ్ఞః’’ అని దేవతలకు, పితరులకు, తనచుట్టూ ఉన్న చరాచర భూత ప్రపంచానికి మేలు చేకూర్చే కర్మలను యజుర్వేదంలో నిర్దేశించారు- యజుర్వేదమైన నమకచమకాదులలో అంతా కూడా ప్రకృతి లోని సర్వవస్తువులను ప్రస్తుతించారు. ముఖ్యంగా మానవజీవనానికి ఆధారభూతమైన నదులను(నద్యామచ), ప్రవాహములను(ప్రవాహ్యమచ), సముద్రపు నురుగును(ఊర్మ్యామచ), శిలలను ( శిలామచ) , రహదారులను(ప్రపధ్యామచ) అన్నింటినీ దేవతా స్వరూపంగా భావించి ప్రస్తుతించింది. ’’ఆపోవాఇదగుంసర్వం… భూర్భువస్సవరోం’’ అనే మంత్రంలో నీటి ప్రాధాన్యాన్ని వివరించింది. అదే ఋగ్వేదంలో జ్ఞానప్రధానంగా భావించి ‘‘అగ్నిమేలే పురోహితం.. హోతారంరతృధాతమమ్‌ ’’ అని అగ్నిని ప్రధానదైవత్వంగా జ్ఞానాన్ని లక్ష్యంగా మనస్సంకల్పాన్ని లక్షణంగా భావించింది ఋగ్వేదం. యజుర్వేదంలో అన్నిప్రాధాన్యాన్ని గుర్తించినా శన్నుదేవరభష్టయతో నీటి ప్రాధాన్యాన్ని ప్రకృతి శక్తుల ప్రాధాన్యాన్ని మానవుని ఐహిక ఆముష్మిక కర్మల్లో అవసరమని గుర్తించింది. అందుకు మానవుడు మనస్సంకల్పంతో పాటు క్రియాత్మకంగా ఉండాలని యజ్ఞయాగాది కర్మలను నిర్దేశించింది. మానవుడు- ప్రకృతి- సంకల్పశక్తి- ఇచ్ఛాశక్తి- క్రియాశక్తుల సమహార సుస్వరూపమే యజుర్వేదం. తరువాత క్రమంలో ’ఆనందో బ్రహ్మ’ అనే లక్ష్యంతో నాద ప్రధానము, సుస్వర ప్రధానమూ అయిన సామవేదం నిష్పన్నమైంది- ఉపవేదంగా గాంధర్వవేదం ఆవిష్కృతమైంది. చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన ఽఅధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
సుగుణనిర్గుణలు..
సుగుణనిర్గుణోపాసనల పరంగా చర్చించినపుడు సగుణోపాసకమైన విగ్రహం ఒక బొమ్మకాదు- మనస్సంకల్ప సిద్ధి పూర్వకమైన మంత్ర పరిపుష్టి(మంత్రాధీనంతుదైవతం) అక్షరము- ధ్వని- స్వరబంధోనియమ బద్ధమైన మంత్రసిద్ధి రేఖాప్రమాణ శాస్త్ర నియమబద్ధమైన యంత్రము. శిల్ప శాస్త్ర ప్రధానమూ ఆగమమంత్ర ప్రమాణమైన విగ్రహమూ, వీటన్నింటిని సమాహార స్ఫూర్తి స్వరూపమే. దేవతామూర్తి అంటే కాని ఏదో ఒక రీతిన చెక్కిన బొమ్మ కాదు. ఇక ఆరాధన, అర్చన విషయానికి వస్తే- కామేన( శరీరం చేత), మనసా (మనస్సు చేత), బుద్ధ్యా (బుద్ధి చేత), ఆత్మనా (ఆత్మ చేత) చేసిన క్రియా కర్మమే సంస్కార భూతంగా సూక్ష్మబుద్ధిలో ప్రవేశించి మానవుని ఉన్నత స్థాయికి, ఉపాసనాస్థితికి చేరుస్తుంది. అదీ ఆరాధన అంటే. వెరసి విగ్రహారాధన భగవత్స్వరూపం- ఈ గంభీర సుశాస్ర్తీయ ఆలోచనా సరళిని విమర్శకులు గ్రహించవలెనని మనవి చేస్తున్నాను.
ఇక నిర్గుణము అనే మాటకు వస్తే వేదాంత పరిభాషలో నిర్గుణ ం అంటే గుణరహితం అని అర్థం కాదు. సంస్కృత వ్యాకరణరీత్యా నిర్‌ అనే ఉపసర్గ రహితం- అని కాకుండా విశేష సంజ్ఞాగుణ వాచకంగా వర్తిస్తుంది. ఉదా: నిరుక్తం- నిర్దేశం – నిర్వచనం- నిర్దిష్టం- నిర్ణయం- వంటి పదములు. అందువల్ల నిర్గుణం అంటే విశేష సౌంజ్ఞాగుణ వాచక శూన్యం అని చెప్పుకోవాలి. అంటే వ్యవహార భాషలో గుణం అనే మాట సంకుచితమైంది. సర్వశక్త్యాత్మక, సర్వవిశ్వాత్మక, సర్వ జ్ఞానాత్మక గుణం కూడా గుణ తత్వమే కానీ అది విశేష సౌంజ్ఞాగుణ వాచకం నిర్గుణం అని అర్థం చేసుకోవాలి. అందుచేత నిర్గుణ తత్వాన్ని మనం చేరుకోలేము కనుక దానినే మంత్ర యంత్ర, తంత్ర సహితంగా సంక్షీప్తికరీంచి సగుణాత్మక దృశ్య మానమూర్తిగా నిర్ధేశించారు. శ్రీ చక్రాది యంత్రాలు – దేవతామూర్తుల విగ్రహాలు దేహా దేవాలయ ప్రోక్తో అని చెప్పబడిన విధంగా దేవాలయాలు – పూజా స్థానాలుగా నిర్ణయించారు. ఈ గంభీరతత్వమే విగ్రహారాధన – ఈ తాత్విక రహాస్యాన్ని తెలుసుకోవలసినదిగా విమర్శకులకు మనవి.
ఉమాపతి బి శర్మా
9246171342
 
స్ఫూర్తే ముఖ్యం!
 
మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు.
జీవితంలో ప్రోత్సాహకాలు, స్ఫూర్తి- ఈ రెండింటిలో ఏది ముఖ్యం? స్పూర్తే అంటారు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌. ఇటీవల జపాన్‌లో పర్యటించినప్పుడు – ఆయనను అక్కడి వాణిజ్యవేత్తలు అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి రవిశంకర్‌ చెప్పిన సమాధానాలు..
జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోగలం?
ఆహారం, విశ్రాంతి, ధ్యానం, వ్యాయామం- ఈ నాలుగు మన శరీరానికి అత్యవసరం. ఇవి క్రమం తప్పకుండా శరీరానికి అందిస్తే మనకు శక్తి లభిస్తుంది. ఆ శక్తి మనను ముందుకు నడిపిస్తుంది. కానీ చాలా సార్లు మనం మన శరీరానికి ఈ నాలుగు తగిన పాళ్లలో అందివ్వం. దీని వల్ల మన శరీరం అలసిపోతుంది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధపడదు. సవాళ్లను ఎదుర్కోవాలంటే పైన చెప్పిన నాలుగు అత్యవసరం.
నా కంపెనీ కోసం సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం చాలా కష్టంగా ఉంది.. దీనికి పరిష్కారమేమిటి?
దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- ఏదైనా రిక్రూట్‌మెంట్‌ కంపెనీకి ఆ బాధ్యత అప్పచెప్పటం. కానీ ఈ బాధ్యతను ఇతరులకు అప్పచెప్పటం సరికాదు. మనకు కావాల్సిన వ్యక్తులను మనమే ఎంపిక చేసుకోవాలి. దీనికి పరిష్కారం ఒకటే. సమాజాన్ని జాగ్రత్తగా గమనించటం. వారిలో మనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం.
నాకు రెండు కంపెనీలు ఉన్నాయి. వాటిలో వేల మంది పనిచేస్తున్నారు. మా ఆవిడ- ఇంత సంపాదించాం కదా.. జపాన్‌ వదిలి వెళ్లిపోదాం అంటోంది. అది నాకు ఇష్టం లేదు. ఒక వైపు కంపెనీలను, ఒక వైపు ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్‌ చేయాలి?
ఒక చక్రంతో సైకిల్‌ తొక్కగలమా? జీవితం కూడా అంతే. కుటుంబం, పని- ఇవి రెండూ మన జీవితమనే సైకిల్‌ చక్రాలు. ఏ ఒక్కటి పంక్చర్‌ అయినా ముందుకు వెళ్లలేం. పని మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో.. అంతే శ్రద్ధ కుటుంబం మీద కూడా పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
నూడిల్స్‌ తింటే చైనీయులం అయిపోం. డానిష్‌ బిస్కట్లు తింటే డానిష్‌ అయిపోం. అలాంటిది- పరాయి సంస్కృతికి చెందిన భావాలను ఎందుకు ఆదరించలేకపోతున్నాం? వాటిని ఎందుకు సహించలేకపోతున్నాం?
దీనికి ఎకైక పరిష్కారం ఇతరుల భావాలను గౌరవించటం. వారు చెప్పే విషయాలను వినటం. ఈ రెండు ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ వాటిని వింటే తప్పులేదు కదా!
నాకు ఒక కంపెనీ ఉంది. నా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలంటే ఏం చేయాలి?
ముందు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను. మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు. ఇక టాప్‌ మేనేజిమెంట్‌ విషయానికి వద్దాం. సిబ్బంది చేత బాగా పనిచేయించుకోవటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి- ప్రోత్సాహకాలు ఇవ్వటం. రెండోది- వారికి స్పూర్తి ఇవ్వటం. ప్రోత్సాహకాలు తాత్కాలికమైనవి. వాటి విలువ కూడా తాత్కాలికంగానే ఉంటుంది. స్ఫూర్తిని ఒక సారి ఇస్తే చాలు. జీవితాంతం పనిచేస్తుంది. దీనికి ఉదాహరణ గాంధీజీ. ఏనాడు ఆయన ప్రోత్సాహకాల గురించి మాట్లాడలేదు. స్ఫూర్తిని నింపటానికే ప్రయత్నించాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రిక

మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రికass1 001 ass2 001 ass3 001 ass4 001 ass5 001 ass6 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి 78 వ సమావేశం -11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

Inline image 1 My Photo
                                 డా    శ్రీ కొంపెల్ల శర్మ
సరసభారతి 78 వ సమావేశం రేపు అనగా 11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకుఉయ్యూరులో  ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ మరియు  సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం (ఫ్లోరా స్కూల్ దగ్గర )నందు ఆత్మీయ సమావేశం గా జరుగుతుంది . ప్రముఖ కదా రచయిత డా.  శ్రీ వేదగిరి రాంబాబు గారు ,”తెలుగు రధం ” అధ్యక్షులు డా  శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య  శర్మ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు . ఈ వేసవిలోఏర్పాటు చేసిన  ఈ చల్లని ఆత్మీయ సాహితీ కార్యక్రమం లో  సాహిత్యాభిలాషులందరు  పాల్గొని సేద దీరవలసినదిగా   ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాము  .పాల్గొని   జయప్రదం చేయ ప్రార్ధన . 

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివలక్ష్మి గబ్బిట  వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

-గౌరవాధ్యక్షులు –         కార్య దర్శి                     కోశాధికారి         అధ్యక్షులు -సరసభారతి

10-4-15 -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2

ఆర్మీకి రాం రాం

విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ స్టాయ్ .అనేక భాషల్లో ప్రావీణ్యం సాధించాడు .ఫ్రెంచ్ భాషలో హాయిగా రాశాడు .గ్రీక్ ను స్వయం గా అభ్యసించి ,ఆ భాషలో చేసిన అనువాదాలు మహా మహా గ్రీకు ప్రొఫెసర్ల అనువాదాలకంటే మిన్నగా ఉన్నాయని పించుకొన్నాడు .రష్యా టర్కీ యుద్ధ సమయం లో తనను బదిలీ చేశారని తెలుసుకొని  విభ్రాంతి చెందాడు .సేవేస్టపోల్   రక్షణ బాధ్యతలో ఉన్నాడిప్పుడు .ఈ కాలం లో పొందిన అనుభవాలతో సైన్యం అన్నా యుద్ధం అన్నా అసహ్యం కలిగింది .27 వయసులో సైన్యానికి రాజీనామా చేశాడు .యుద్ధ అనుభవం తో ‘’సేవేస్ట పోల్ కధలు ‘’రాశాడు .ఇప్పటికే రచనలో ప్రసిద్ధు డనిపించుకొన్నాడు .బోహీమియా అరిస్టాక్రటిక్ గా లేదు. తన అభిరుచులకు అనుకూలంగా లేదని భావించి మళ్ళీ పీచే మూడ్ గా యసన్యా పోల్యానాకు చేరాడు .కుర్రవయసులో ప్రశాంత జీవితాన్ని అనుభవించే స్తితిలో లేడు.మనసు స్థిమితంగా లేదు .ఏమి చేయాలో పాలు పోవటం లేదు అస్తిమితత్వం బాధిస్తోంది .చివరికి యూరప్ టూర్ చేయటానికి బయల్దేరాడు .తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు .తనకు కావాల్సిన భార్య కోసం ప్రయత్నించాడు .అలాంటివారెవరూ తారసడ లేదు .దాదాపు కాలమంతా డెస్క్ దగ్గరే గడుపుతూ రాసుకొంటూ కూర్చున్నాడు .రాత విసుగని పించి రాత మానేద్దామనుకొన్నాడు .టాల్ స్టాయ్ ఊహించిన  తీరులో రచనలు చేయటం  అసాధ్యం అన్నారు విమర్శకులు .వాళ్ళ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నమేమీ చెయ్యలేదాయన .

పిల్లల   స్కూల్ ఏర్పాటు  -విద్యపై అభిప్రాయాలు

31 వయసులో తన సంస్థానం లోని పిల్లలకోసం ఒక స్కూల్ ప్రారంభించాలను కొన్నాడు .అంతకు ముందు చదువురాని కూలీలను  విద్యా వంతుల్ని చేసే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు .తనకు ఈ విషయాలలో ఉన్న సామర్ధ్యం తక్కువ అని తెలుసుకొన్నాడు .మళ్ళీ యూరప్ ట్రిప్ చేసి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు .విద్య ఉచితంగా స్వచ్చందం గా అందించాలనే అభిప్రాయానికి వచ్చాడు .విద్యవలన నైతికత పెరగాలని ఆశించాడు .శీల సంపదను పెంచి స్వయం అభివృధికి తోడ్పడాలి .స్వీయ ప్రతిభకు ఊతమివ్వాలి .సృజనను ప్రోత్సహించాలి .తరగతిగది స్వేచ్చకు ,విముక్తికి ఆధారమై ప్రయోగ శాలగా ఉండాలని భావించాడు .

మలుపు తిరిగిన జీవితం

1862 లో టాల్ స్టాయ్ జీవితం అనూహ్యమైనపూర్తీ  మలుపు తిరిగింది .బెర్స్ కుటుంబం చాలాకాలంగా ఆయనకు తెలుసు .తండ్రి డాక్టర్ తల్లి ఆతిధ్యం లో సమర్ధురాలు .పిల్లలు ఉత్సాహ వంతులు . సంతానం లో మధ్య పిల్ల పద్దెనిమిదేళ్ళ  సోన్యా బెర్స్ పై మనసుపడ్డాడు .31 వయసులో అకస్మాత్తుగా ఆమెపై ప్రేమలో పడ్డానని గ్రహించాడు .చాలాకాలం సందేహం ,ఊగిసలాట సాగి చివరికి ఆమెను ప్రొపోజ్ చేయటం ఆమె అంగీకరించటం జరిగిపోయాయి .టాల్ స్టాయ్ అప్పటికే సోన్యా అభిమాన రచయిత.ఆయన్నే ఆరాదించేది .ప్రేమలేఖలతో బాటు డైరీలూ మార్చుకొన్నారు .ఇద్దరి మధ్య రహస్యాలేలేవు .ఆదర్శ దాంపత్యం అనిపించారు .ఒకరికోసం ఒకరు అన్న భావన ఏర్పడింది .ఈ హాయైన అనుబంధం 16 ఏళ్ళపాటు దివ్యం గా కొనసాగింది .భార్య సోన్యా భర్త టాల్ స్టాయ్ రచనకు ప్రేరణగా నిలిచింది .ఆయన రాసిన అనంత సాహిత్యాన్ని  స్వదస్తూరీతో కాపీ చేసింది .ఆయన్ను  సామాన్య విధులనుండి రిలీఫ్ కలిగించి తానె బాధ్యతలు చేబట్టింది .టాల్ స్టాయ్ కి 13 మంది పిల్లలను ‘’కని’’పెట్టింది .ఏడాది కేడాది గర్భిణీగా ఉండటం తో బాహిర ప్రణయ సౌఖ్యాన్ని అందించ లేక పోయింది .ఆయన సెక్స్ దాహాన్ని తీర్చలేక పోయేది .

యుద్ధము-శాంతి .-అన్నా కేరేనీనా

.కాని ఆయన రచనా వ్యాసంగం నిర్విఘ్నం గా కోన సాగుతూనే ఉంది .ఎన్నో రాసిన తర్వాత మనసులో ‘’యుద్ధము –శాంతి ‘’నవలకు బీజం పడి మొలకెత్తి మహా వ్రుక్షమైపోయింది .ఈ నవలలో టాల్ స్టాయ్ పియర్రీగా ప్రిన్స్  ఆండ్రీ గా రెండు విభిన్నపాత్రాలు పోషించాడు .కాని అందరు మగ వాళ్ళూ మెచ్చిన,ప్రేమించిన  నతాషా  పాత్ర మాత్రం భార్య సోన్యాకు పోలిక లేకుండా ఆమె చెల్లెలు తాన్యా లాతీర్చి దిద్దాడు  .దీన్ని రాయటానికి ఏడేళ్ళు పట్టింది .ప్రచురణ పొందిన తర్వాత ఈ నవల బృహత్తర మహా రచనగా ఆధునిక ఇతిహాసం గా  గుర్తింపు పొందింది .రష్యా సాహిత్య చరిత్రలో డి.ఎస్ .మిర్క్సి రాస్తూ  ‘’చాలాముందు చూపున్నమహా రచన అని ,కాల్పనిక సాహిత్యపు అవధిని పెంచిందని ,యుద్ధం అవా౦చనీయమని ,సాధారణ మానవుని మహోన్నతంగా మలిచాడు ‘’అని కీర్తించాడు .మనుషుల సాధారణ స్వభావాలను చాలా చక్కగా చిత్రించాడు ఇందులో . ‘’war and piece is a panoramic  spectacle and social drama .The horror of battle ,the death throe struggle of great armies ,the accidents of war and the sense of fatality are depicted on the largest scale ever attempted by a novelist .but here also are superbly detailed domestic situations ,illuminations of a society which is both effete and barbarous  and the intricately tangled lives of human beings who are un forgettable .వ్యక్తిలోని సమాజం లోని నిజ జీవితాన్ని వైరుధ్యాలను ప్రతిబి౦బి౦ప జేశాడు . చరిత్ర వేదాంతపు లోతులను తరచాడన్నారు .చరిత్రలో జరిగే సంఘటనలునెపోలియన్ లాంటి  ఏ ఒక్క వ్యక్తీ కోరిక  ననుసరించి జరగవని ,అవి ముందే నిర్ణయించబడి ఉంటాయని అంటాడు .చరిత్ర అనేది రాజుకు బానిసకాదని అన్నాడు .చరిత్ర సంఘటన  వెనుక ఎప్పుడూ ఒకే  ఒక కారణం ఉండదు ,అనేక కారణాలు ఉండచ్చు .అవన్నీ ఏ ఒక్క వ్యక్తీ అధీనం లోనూ ఉండవు .

ఈ చారిత్రాత్మక  నవల రాస్తూనే అనేక కధలను,వ్యాసాలను  రాశాడు టాల్ స్టాయ్ . ఫస్ట్ గ్రేడ్ విద్యార్దులకోసం పుస్తకం రాశాడు .ఇందులో రష్యా జానపదకధలను చేర్చాడు .దీనిని  సంప్రదాయ వాదులు అడ్డుకొన్నారు .రష్యన్ మెసెంజర్ పత్రికలో అన్నా కేరేనీన నవల ధారావాహికం గా రాస్తున్నాడు .అయిదేళ్ళ తర్వాతా ఇదంతా నవలగా వెలువడింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన త్రిభాషాకవి  న్యాయ వేత్త ,శ్రీ చింతకుంట సూర్యనారాయణ రావు గారు .న్యాయశాస్త్ర పాండిత్యం  వారికవిత్వానికి రచనలకు సొబగు కూర్చింది  .రావు గారిని  ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నమే ఇది .

అవధాన ఆశుకవితా ప్రభావం

1924 లో జన్మించిన సూర్యనారాయణ రావు గారికి  ఆశుకవి సార్వభౌములైన కొప్పరపు సోదర కవుల పరిచయ భాగ్యం 12వ ఏట కలిగింది .ఆంద్ర పత్రిక సంపాదకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు గారి భవనం లో వారి సమక్షం లో సోదరకవుల ఆశుకవితావదానాన్ని కవితా విందుగా అనుభవించిన రావు గారు ఆశుకవిత్వం వైపుకు మొగ్గారు . సోదరులలో ఒకరు ఒక పాదం చెబితే రెండవ వారు రెండవ పాదాన్ని చెప్పి ఆశుకవితకే పట్టం కట్టారు .కాని వారు  శాశ్వతం గా నిలిచిపోయే గ్రంధాలను రాయకపోవటం  దురదృష్టం . కొప్పరపు కవులతో ఢీ అంటే ఢీ  అని సవాలు చేసి ఆశుకవిత్వావదానాలు చేసిన తిరుపతి కవులు మాత్రం శాశ్వత రచనలు చేసి సరస్వతీ సమార్చనం చేశారు . ఈకవుల విధానం నచ్చిన సూర్య నారాయణ రావు గారు ఇదే బాటలో నడిచి సద్గ్రంధ రచన చేసి కీర్తి సాధించారు .ఆనాటి యువ కవులకు తిరుపతికవులే స్పూర్తి ప్రేరణ .తెలుగు వారికి మాత్రమె స్వంతం  ఆశుకవిత్వం ,అవధాన ప్రక్రియ అని భావిస్తాం .రావుగారు ఏం ఏ. బి .ఎల్.

జాన్ మిల్టన్ ఆశుకవిత్వం

ఆంగ్లకవి జాన్  మిల్టన్ కనులు కోల్పోయి గుడ్డివాడై ‘’పారడైజ్ లాస్ట్ ‘’మహా కావ్యాన్ని ఆశువుగా చెబుతూంటే ఆయన కుమార్తె గ్రంధస్తం చేసిన విషయం మనకు తెలుసు .దీన్ని ఒక రకంగా ఆశుకవిత్వం గా భావించవచ్చు .ఆశు కవిత్వానికి గొప్ప ఊహ ,కవితా సామర్ధ్యం ,సందర్భాన్ని బట్టి కవిత అలవోకగా జాలువారి సహృదయ స్పందన కలిగించటం లక్షణాలు .ఆశుకవి తనకు వాగ్దేవీ  అనుగ్రహం లభించటం వలన కవిత్వం వస్తోందని నమ్ముతాడు .మిల్టన్ కూడా అనేక దేవీ దేవతలా అనుగ్రహమే తన కవిత్వానికి శ్రీరామ రక్షగా భావించాడు .

రావు గారి కవితా భ్యుదయం –బిరుద సత్కారం

సూర్య నారాయణ రావు గారు 1970లో కాన్పూరు లో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా  ఉన్నప్పుడు సంస్కృత కవిత్వం పైన ద్రుష్టి పడింది .పిల్లల చదువుకోసం కుటుంబాన్ని కలకత్తాలో ఉంచేసి తానోక్కరే కాన్పూరు లో ఉన్నారు .కాన్పూరు రాదా కృష్ణ మందిరం పవిత్రత ,ప్రశాంతత ఆయనకు మహా నచ్చటం వలన రోజూ దైవ దర్శనం చేసుకొనేవారు .కృష్ణ భక్తీ ఆయన మనసులో నిండిపోయి ‘’కృష్ణ కదా సుధ’’రాయటం ప్రారంభించారు అప్పటికే మొదలు పెట్టి రాస్తున్న ‘’గీతాంజలి గానామృతం ‘’వెనక బడింది .కృష్ణ కద ముందే ముద్రణ పొందింది .రాదా కృష్ణ మందిరం లో దర్శనానుభూతి పొందుతుండగా ఆయన మనసులో భావాలు ప్రవాహాలై కవితా ఝరులై ప్రవహించి కావ్యాన్ని పూర్తీ చేయించాయి .దీని తర్వాత చాలా రచనలు చేశారు .కవిత్వాన్ని గుణ ప్రధానం గా ఎంచాలని అభిప్రాయపడేవారు. అశాశ్వత మైన ,పనికిమాలిన కవిత్వం శాశ్వత ఆనందాన్నవ్వదంటారు .మంచి కవిత్వం ఉత్తమ విలువలతో కూడి ఉండి వ్యక్తికీ సమాజానికి మేలు చేసేదిగా  ఉండాలి .ఇవే భావాలను ఆంగ్ల కవి ‘’హాబ్స్ ‘’కూడా చెప్పాడు .భక్తి  భావాలతో పులకించిన సూర్య నారాయణ రావు గారు అనేక రచనలు చేసి ఉత్తమకవిగా వినుతి కెక్కారు .అందుకనే ‘’ 1998లో  మద్రాస్ కు చెందిన’’అఖిల భారత విష్ణు సహస్ర నామ ఫెడరేషన్ ‘’శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు గారికి తిరుమలలో  శ్రీ వారి ఆస్థాన మండపం లో వెయ్యి మంది ప్రనిధులు పాల్గొన్న సదస్సు లో ‘’ భక్తి సాహిత్య  భాస్కర ‘’మరియు ‘’కవి హృదయ విశారద ‘’బిరుదులను  ప్రదానం చేసి గౌరవించారు .సరస్వతీ పుత్రులైన ఆ విజ్ఞాన మూర్తి శ్రీ చింతగుంట సూర్య నారాయణ రావు గారు  91 సంవత్సరాల వయసుతో ఆరోగ్యంగా మనముందున్నారు .స్పూర్తిని కలిగిస్తున్నారు .వారి సమకాలీనులుగా  ఉండటం వలన మనం ధన్యులం .అదృష్ట వంతులం .

త్రిభాషా రచన

రావు గారు ఆంగ్ల, ఆంద్ర, సంస్కృత భాషలలో అరుదైన రచనలు చేసి తన విద్వత్తును ప్రదర్శించారు .

ఆంగ్ల రచనలు

న్యాయ శాస్త్రం తో సంబంధం ఉన్నసీనియర్ లాయర్ ,ప్రభుత్వ విధానాలలో అనుభవం ఉన్న  సూర్యనారాయణ రావు గారు రాజ్యాంగం పై గొప్ప రచనలే చేశారు .1999లో రాసిన ‘’Constitution of conventions ‘’ గ్రంధానికి సుప్రీం  కోర్ట్ జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి ముందుమాట రాశారు .భారత రాష్ట్ర పతి విధి విధానాలను ఇందులో రావు  గారు విపులంగా చర్చించారు .ఇది ప్రతి పౌరుడికి కరదీపిక .రెండవ పుస్తకం ‘’Role of directors in company laws ‘’1970లో ప్రచురించారు .సుప్రీం కోర్ట్ జస్టిస్ శ్రీ కోకా సుబ్బారావు గారు దీనికి ముందుమాట రాశారు .ఆంగ్లం లోనే ‘’త్యాగరాజ గీత ‘’రాసి అందులో త్యాగయ్య గారి 27 అమర కీర్తనలపై విపులమైన వ్యాఖ్యానం వచనం లో రాశారు .రామాయణ భాగవత ,కాళిదాస గ్రంధాలనుండి విషయ సేకరణ చేసి ‘’Tales from  ancient India ‘’రచించారు .అధర్వ వేదం లోని ‘’ఆదిత్య మండలం ‘’ను సాదికారికం గా ఆంగ్లం లోవచనం గా  తర్జుమా చేసి తన విద్వత్తును ,ప్రతిభను నిరూపించుకొన్నారు .ఆంగ్ల మహాకవి షేక్స్ పియర్ రాసిన ‘’సానేట్స్’’పై  ‘’Shakespeare;s sonnets- their purport and significance in the Indian perspective ‘’గా రాశారు  .అన్నమాచార్యులు సంస్కృతం లో రాసిన అతి తక్కువ సంస్కృత ‘’పదాలను ‘’ఆంగ్లం లోకి ‘’Annamacharya;  Sanskrit  Lyrics on Lord Venkateshwara ను 1996లో వెలువరించారు .

తెలుగు రచనలు

మహాకవికాళిదాసు రచన ‘’మేఘ దూతం  ‘’ను మేఘ సందేశం గా తెలుగులో1946లోనే  కవిత్వీకరించారు .సంస్కృత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ‘’రసాలవాలం ‘’పేరిట తెలుగు అనువాదం చేశారు .ఇందులో వివిధ దేవీ దేవతలపై స్వీయ కవితలూ ఉన్నాయి .1994లో ‘’గోపికాగీతం ‘’రచించి ప్రచురించారు .వ్యాస విరచితమైన భాగవతం లోని 19 శ్లోకాలకు మధుర మంజుల అనువాదమే ఇది .కృష్ణ ప్రేమ పై విపుల వ్యాఖ్యానం రాసి వన్నె తెచ్చారు .1990లో శంకారాచార్య స్వామివారి ‘’శివానందలహరి ‘’కి భక్తి  ప్రపత్తులతో అలౌకిక అనువాదం చేసి కావ్య వస్తు విషయాలపై గొప్ప ఉపోద్ఘాతమూ రాశారు .జగద్గురువుల’’ సౌందర్య లహరి’’కీ  సుస్పష్ట అర్ధ అనువాదం చేశారు .ఇది ఇంకా ప్రచురణకాలేదు . సఖ్య-ఆసక్తి అనేది షేక్స్పియర్ రాసిన 154 సానెట్ లకు తెలుగు అనువాదం1977లో రాశారు . .ఒకే ఛందస్సులో రాసిన రచన ఇది సానేట్లన్నిటిలో ఏక సూత్రత గమనించిన రావు గారు వీటిని భారతీయ ఆధ్యాత్మిక ద్రుష్టి తో అనువదించి వైశిస్ట్యాన్ని చూపారు .ఇలా ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇదొకఅద్భుత సృష్టి .రావు గారి నూతన దృష్టికోణం .భారతీయ వేదాంత పరమార్దానికి ఇదొక మచ్చు తునక .

సంస్కృత రచనలు

మొదటి సంస్కృత కావ్యం గా ‘’గీతాంజలి గానామృతం ‘’రాశారు రావు గారు దీనిపై శ్రీ బెజవాడ గోపాల రెడ్డి స్పందిస్తూ ‘’రవికవి గీతా౦జలి ప్రపంచ భాషలలోకి అనువదింపబడింది .దీనికే గురు దేవులకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది .ప్రాచ్యభాషా సౌధం లోకి పాశ్చాత్యులకు ప్రవేశం గీతాంజలి వలన కలిగింది .శ్రీ సూర్యనారాయణ గారి సంస్కృత గీతాంజలి అనువాదం సుందరం గా సాగింది ప్రసిద్ధలైన నాలుగైదు  వృత్తాలలో రవీంద్రుని హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు .ఆంగ్లం లో లేని లయా ,శయ్యా సౌ భాగ్యం  .సంస్కృతం లో రావు గారు కలిగించారు .బెంగాలీ గీతాంజలి పాటల్లాగా ఉండి దాని ప్రత్యేకత నిల్పింది .రావు గారు రవీంద్రుని ఆంగ్లానువాదాన్నే అనుసరించారు .బెంగాలీ గీతాంజలి చూసి ఉన్నట్లు లేదు .సంస్కృత విద్యార్ధులకు రావు గారివలన గీతాంజలి పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉన్నది .రావు గారు దీన్ని రవీ౦ద్రునికే అంకిత మివ్వటం గంగా జలం తో గంగా నదికే  అర్ఘ్యమివ్వటం లాగా ఉందని చమత్కరించారు .భారత సాహిత్యం లో ఏ  గ్రంధానికి లభించని నోబెల్ బహుమతి గీతాంజలికే వచ్చింది ‘’అని గురుదేవ్ టాగూర్ ప్రతిభను ప్రస్తుతించారు .

గోపాల రెడ్డిగారు శాంతినికేతన్ కు అధిపతిగా ఉండేవారు .ఒక సారి నెల్లూరు లో ఒక సభ జరిపి శ్రీ సూర్య నారాయణ రావు గారిని ఆహ్వానించి రవీంద్రుని స్మారక ఉపన్యాసం చేయించి  సన్మానించారు .దీనితర్వాతే రావు గారి సంస్కృతగీతాంజలి అనువాదం 1996 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ప్రచురింపబడి విడుదలయింది

రావు గారి అముద్రిత గ్రందాల లిస్టు కూడా పెద్దదే .’సూర్య సన్నుతి’’ అందులో ఒకటి .మయూరుని సూర్యశతకం లాంటిది .’’శ్రీ కృష్ణ కదా సుధ’’ ఇంకారావాలి .శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా కావ్య రూపంగా రాసిన గ్రంధం .అమ్మవారి దివ్య విభూతి పై రాసిన ‘’మాతృ సహస్రనామ స్తోత్రం  ‘’ముద్రి౦పబడాలి  . ‘’జ్యోతిర్లేఖ ‘’కూడా వెలుగు చూడాలి .

రావు గారి రచనలను స్వంత సంస్థ అరుణ్ పబ్లిషర్స్ ద్వారా  ప్రచురించారు .దీని అధ్యక్షులు రావుగారే .అడ్రస్ –అరుణ్ పబ్లిషర్స్ బంజారా కాటేజ్ బి 747-ఎల్లారెడ్డి గూడా –హైదరాబాద్ -500073.-ఫోన్ నంబర్ -040-23732315.రావు గారి పుస్తక ప్రచురణకు , ముద్రితమైనవాటి పునర్ముద్రణకు ఎవరైనా స్పాన్సర్లు ముందుకు వస్తే ఆహ్వానిస్తున్నామని పబ్లిషర్లు తెలియ జేశారు .ఆసక్తి ఉన్నవారు సంప్రది౦చ వచ్చు .

రావుగారి మెయిల్ అడ్రస్ chsrao63@rediff.mail .com

ఈ వ్యాసానికి ఆధారం –డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు పంపిన ఆంగ్ల వ్యాసం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-15 ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా ”గీర్వాణం ” పై ప్రసరింప జేసినవెలుగులు

సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను  నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా ఉన్నాయని ”ముఖ చిత్రం అద్భుతం”గా ఉందని ,పేజీలలోని బాక్సులు కట్టిన తీరు  బాగాలేదని క్షుణ్ణంగా అధ్యయనం చేసినిర్మొహమాటం గా  పేజీ వరుసలో వివరంగా చూపి 8 పేజీల సుదీర్ఘ ఉత్తరం రాసి” వెలుగులు వెదజల్లిన సమీక్ష”  ఈ రోజే అందింది . అందులోని విషయాలను మీ అందరికి తెలియ జేసుకొనటానికి వీలుగా దీనితో” అటాచ్” చేస్తున్నాను .చూడండి .ఒక మహా సంస్కృత విద్వాంసుని చేతిలో గీర్వాణ గ్రంధం పడి అందులోని మెరుగులను తరుగులను అందరి దృష్టిలోకి తెచ్చినందుకు శ్రీ సాయిబాబా గారికి కృతజ్ఞతలు తెలియ జేసు కొంటున్నాను  .వారి సహృదయతకు క్రుతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను  
ippagunta1 001
ippagunta2 001 ippagunta3 001 ippagunta4 001 ippagunta5 001 ippagunta6 001 ippagunta8 001

   వారు అన్నట్లు అతి త్వరలో అంటే రెండు నెలలలో గ్రంధం ముద్రణ జరగటం ,చివరి స్టేజిలో మరొక్క సారి తప్పులు దిద్దే అవకాశం కలగక పోవటం  వలన ముద్రా రాక్షసాలు దొర్లాయి దీనికి పూర్తీ బాధ్యతనాదే.  గ్రన్ధమ్  లోని విషయం లో నేను పడిన పొరబాట్లు నా దృష్టికి తేవటం సాయిబాబాగారు చేసిన మహోపకారం  అవి తప్పని సరిగా దిద్దుబాటు చేసుకోవాల్సినవి .ఇదీ నాదే బాధ్యత.ippagunta8 001
 మొదటివ్యాసం శ్రీ శంకరాచార్యుల వారిది అక్కడేవెంటనే  రిపీట్ అయింది అదీ  నా దోషమే .వీటి నన్నిటి కీ బాధ్యత వహిస్తున్నాను శ్రీ సాయిబాబా గారి ఆత్మీయతకు మరొక్క సారి పొంగిపోతూ నా కృతజ్ఞతను తెలియ జేసుకొంటు న్నాను .వారు సూచించి రిఫరెన్స్ గ్రంధాలను వీలయితే సేకరించి మరొక సారి కవుల  రచనలపై ,కాలం పై ద్రుష్టి పెడతాను .ఇంకా రాయాల్సిన కవుల గురించి రాసే ప్రయత్నమూ చేస్తాను.వారి సమీక్ష నాకు గొప్ప ప్రోత్సహాన్నిచ్చిందని మనస్పూర్తిగా తెలియ జేసు కొంటున్నాను  -దుర్గాప్రసాద్ -8-4-15-రాత్రి 10-30
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29

 

14-సంస్కరణ  ,వాస్తవ వాది  శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్

పరస్పర విరోధభావాల లియో

 

‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని భావించేవాడు మహా గొప్ప వాడు ‘’.అని ఇరవై అయిదవ ఏటనే ఈ మహా వాక్యాలు రాసిన మహా రచయిత లియో టాల్ స్టాయ్.ఆయన నీతి మార్గామేమిటో దీనిలో కన్పిస్తుంది .యుద్ధము –శాంతి ,అన్నా కేరీనీనా అనే రెండు నవలలతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు .ఆయన చెప్పినవన్నీ ఆయనకే వర్తించటం బహు తమాషా .జూదం ,విలాసం ,అధికారం చెలా యించటం లో ఆయన చాలా చెడ్డవాడు .కీర్తికోసం తాపత్రయం ,తప్పు చేస్తున్నానని తెలిసినా అదే దారిలో నడవటం ఆయన బలహీనత .తోటి వారి పట్ల ప్రేమ ,దయ, సానుభూతి కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దైవం పై ఆరాధన, ఆయన రచనలన్నిటా చూపటం టాల్ల్ స్టాయ్ ని మహోన్నతుని చేసింది .తాను  ఎవరైనా కానీ ఆయనే అన్నిటా ఉండటం ప్రత్యేకత .వీటికి తానె వ్యతి రికి అవటం పారడాక్స్ .విరుద్ధ భావాలు ఆయన నరనరానా వ్యాపించి ఉన్నాయి .సుఖం పై మోజు ,తిండిపై వ్యామోహం ఆత్మ తిరస్కారం అన్నిటా ఆయనే ముందు .లాజిక్ తో మేజిక్ చేసే దమ్మున్నవాడు .తనదే రైట్ అని ఇతరులను నమ్మించే పట్టుదల ఉన్నవాడు .ఆడవాళ్ళను చడపురుగులులాగా తిరస్కరించటం ఉన్నా రచనలో కాంతి ప్రసరించి మిరుమిట్లు గొల్పే చాకచాక్యమున్నవాడు .దూకుడు స్వభావం ఉన్నా ప్రపంచ కధకుల్లో అగ్రస్థానాన నిలచిన ఉత్తమ కధకుడు టాల్ స్టాయ్.సృజనాత్మక రచనలతో నైతికత స్థాయి పెంచిన దార్శనికుడు .1899 లో టాల్ స్టాయ్ తీవ్రంగా జబ్బు పడ్డప్పుడు మరో రష్యన్ కదకుడు చెకోవ్ ‘’ఆయన బతికి ఉన్నప్పుడు సాహిత్యం లో చెడు జుగుప్స ,కన్నీరు ,అనాగరక భావాలనన్నిటినీ దూరంగా పెట్టాడు .టాల్ స్టాయ్ రాకతో రచయితలు  కావలసినవారికి మహదానందం ,తేలిక అయింది అన్నీ కస్టపడి టాల్ స్టాయ్ చేసి ఉంచాడు కనుక మా లాంటి రచయితల పని సులువైంది ‘’అన్నాడు   .

తండ్రి దివాలా-తల్లితో మళ్ళీ మహా రాజ భోగం

కౌంట్ లియో నికోలావిచ్ టాల్ స్టాయ్ 28-8-1828 మాస్కో కు ముప్ఫై మైళ్ళ దూరం లో ఉన్న బహు సంపన్నమైన యాస్నాయ పోలియాన ఎస్టేట్ లో జన్మించాడు .అప్పటికి వీరి కుటుంబం లో ఇరవై తరాలు గడిచి పోయాయి .వీరిలో 17 వ శతాబ్దికి చెందిన ఆండ్రియో విచ్ టాల్ స్టాయ్ రష్యా రాజు’’ పీటర్ ది గ్రేట్ ‘’కు గొప్ప అభిమాని .టాల్ స్టాయ్ తండ్రి అదే రాచమర్యాదాలతో పెరిగాడు .నెపోలియన్ ను ఓడించిన  యుద్ధ దళం లో సభ్యుడుకూడా .ఖైదీగా పట్టుబడి పారిస్ జైలు లో ఉండి ,విడుదలై వచ్చాక తండ్రి చనిపోయాడు  .ఎస్టేట్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది .అ అప్పులతో తనకేమీ సంబంధం లేదన్నాడు టాల్ స్టాయ్ తండ్రి  .తల్లి పోషణ భారాన్ని మాత్రం స్వీకరించి ఆనాటి రష్యా సంపన్న కుటుంబీకుల మాదిరి బాగా డబ్బు ,సంపదా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .భార్య ధనికురాలేకాదు రాయల్ ఫామిలీకి చెందింది .ఆమె పేరు ప్రిన్సెస్ మార్యా నికోలా యేవ్నా  వోల్ కోన్స్కి.అందగత్తె కాదు . భర్త కంటే అయిదేళ్ళు పెద్దదికూడా .పెళ్ళి నాటికి ఆమె వయస్సు ‘’ముప్పీ రెండు ‘’.ఐదు భాషలలో నిష్ణాతురాలు .యాస్నాయా  పోల్యానా లో ఉన్న ఎనిమిది వందల శేర్ఫ్ లను, కౌలు దార్లను చాలా తేలికగా మేనేజ్ చేసే సామర్ధ్యం ఉన్నది .భర్త  కు అయిదుగురు  సంతానాన్ని ‘’కన్నది ‘’. అందులో లియో నాలుగోవాడు .చివర గా  కూతురుపుట్టింది .  .

బాల్యం –పరాయి పెంపకం

టాల్ స్టాయ్   రెండేళ్లప్పుడు తల్లిని ,తొమ్మిదో ఏట తండ్రినీకోల్పోయాడు . బంధువుల మహిళలే పెంచారు ఇంటి దగ్గర ట్యూషన్ ఏర్పరచి చదివించారు .బాగా చదివి టీచర్ల మెప్పు పొందాడు .మనిషి అందం గా ఉండడు.అది మనసులో కెలుకుతూ ఉండేది .వయసు పెరిగినకొద్దీ పెడసరం గా ,గర్విష్టిగా మారాడు.వీటితో పాటు ఆత్మ పరిశీలనా దృష్టీ పెరిగింది .అందంగా ఉండే తండ్రిపోలిక రాకుండా అందవిహేనురాలైన తల్లి పోలిక వచ్చినందుకు మనసులో ఎప్పుడూ బాధ పడేవాడు .దీనితో సిగ్గు వచ్చి మనుషులకు దూరంగా ఉండేవాడు . అంతరాత్మ ప్రబోదానికి  లోనై హుందా తనం లేకుండా ఉండేవాడు .వీటివలన స్నేహితులను సంపాదించుకోలేక పోయాడు .తనకున్న కొన్ని ప్రత్యేకతల వలన అతి కొద్దిమందిమాత్రమే టాల్ స్టాయ్ కి సన్నిహితులు కాగలిగారు  .

విద్య

లియోకు గార్డియన్ గా వ్యవహరించిన అలేక్సాండ్రియా- లియో 13వ ఏట చనిపోయింది .దీనితో ఆంట్ పెలగేయా వీరి కుటుంబాన్ని తన స్వగ్రామం కజాన్ కు మార్చింది .లియో కజాన్ యూనివర్సిటి లో చేరి ,టౌన్ లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందాడు 17 ఏళ్ళకే .దసరా బుల్లాడి లాగా  డ్రెస్ ల గొడవే కాని అందాల రాముడిలాగా అడ పిల్లలను ఆకర్షించలేక పోయాడు .పెళ్లి అయినవారితోకాని , కాని వర్జిన్స్ తో కాని ‘’లవ్వాయణం’’లాగించలేదు .డబ్బు, అధికారం ,రాజరికం ఉన్నవాడు కనుక ‘’పడుపు కత్తేల ‘’తో పడక సుఖం అనుభవించేవాడు .19 ఏళ్ళప్పుడే సుఖాన్ని కొనుక్కోన్నానని డైరీలో రాసుకొన్నాడు .దీనిఫలితమైన ‘’గనేరియా ‘’తగులు కొని  బాధ పడ్డాననీ నిజాయితీగా డైరీలో నోట్ చేశాడు .రెండో సంవత్సరం చదువు పూర్తికాకుండానే యూని వర్సిటీ వదిలేశాడు .చాలా తక్కువ మార్కులు రావటం, అక్కడ తను నేర్చుకొన్నది అతి తక్కువ అని భావించటమే నిష్క్రమణకు కారణం .తాను  ఉండాల్సినది తన ఎస్టేట్ అయిన యాస్నయా పోల్యానా లో మాత్రమె అనే భావం బలమైనది .అక్కడికి వెళ్లి తన సమర్ధత చూపించి గొప్ప లాండ్ లార్డ్ గా రుజువు చేసుకోవాలనుకొన్నాడు .వేదాంత పరమైన ఆలోచనలూ దీనికి దోహదం చేశాయి .తనకు నచ్చిన రీతిలో ప్రయోజనాత్మకమైన అర్ధ వంతమైన జీవితం గడపాలనుకొన్నాడు టాల్ స్టాయ్ .

టాల్ స్టాయ్ ఎస్టేట్

తన ఎస్టేట్లో సెర్ఫ్ ల విస్తరణ ప్రారంభించాడు .దీనికోసం డబ్బు చాలాఖర్చు పెట్టాడు .అప్పుల్లో చిక్కుకొన్నాడు .ఇదికాదు అనుకోని మరో కొత్త విధానం ప్రవేశ పెట్టటం చేతులు కాల్చుకోటం  మళ్ళీ మరోదానికి పాకులాట ఇలా గడిచింది ఎస్టేట్ లో .తనమనోభావాలన్నిటినీ డైరీలో భద్రం చేశాడు .లోపల్లోపల యెంత కుమిలిపోయే వాడో అవి చదివితెతెలుస్తుంది .

యుద్ధ అనుభవం –సెక్స్ అనుభవం

23 వయసులో ‘’జెంటిల్మన్ వాలంటీర్ ‘’అయ్యాడు సోదరుడు నికోలాయ్ అప్పటికే యుద్ధ సైనికుడు గా ఉన్నాడు .కకాసాస్ కు కేడేట్ గా వెళ్ళాడు .యుద్ధ కాంప్ లో ఉన్నా పాత అలవాట్లు మార్చుకోలేదు .సరైన విధానాలలో నడవ లేదు .జూదం ఆడి పోగొట్టుకొనిఅప్పుల అప్పారావు అవతారం ఎత్తి  ఎస్టేట్ లో కొంత భాగం అమ్మాడు .కకాసియన్ అమ్మాయిలతో సెక్స్ జరిపి సుఖ వ్యాధి బాధించి తగ్గటానికి మందు పుచ్చుకొన్నాడు  .తనకున్న మూడు దుర్గుణాలను వదిలించుకోటానికి తీవ్ర యత్నం చేస్తున్నట్లు గురూగారు డైరీలో రాసుకొన్నారు .ఆ మూడు మోహాలే జూదం  ,ఇంద్రియ లోలత్వం ఆడంబరం (gambling sensuality and  vanity )యుద్ధ భూమిలో ప్రత్యక్షం గా యుద్ధ భీభత్సాన్ని చూశాడు .శత్రువులపై తుపాకి గురిపెడుతుండగా ఒక బులెట్ వచ్చి తుపాకికి తగిలి దాదాపు ప్రాణం పోయేంత ప్రమాదం జరిగి బయటపడ్డాడు .ఇంకోసారీ ప్రమాదం అంచుమీద నుండి తప్పించుకొన్నాడు ప్రానాపాయాన్ని .అందుకే ధైర్య సాహసాలు చూపినందుకు సెయింట్ జార్జ్ క్రాస్ ను బహూకరించాలని ప్రభుత్వం న్ర్నయించింది మర్నాడు ఉదయమే బహుమతి ప్రదాన ఉత్సవం .కాని   బాగా నిద్ర పోయి ఫంక్షన్ కు వెళ్ళలేక పోయాడు .అ అవార్డ్ ను ఇవ్వకుండా గార్డ్ హౌస్ కు పంపారు .సైనికుల౦దరితో చాలాకలుపుగోలుగా ఉండేవాడు .పొట్టి బుడం కాయలా ఉన్నా  బలిస్టం గాఉండేవాడు  . నేల మీద పడుకొని రెండు చేతులూ సాచి వాటిమీద ఇద్దరు సైనికులను నిల బెట్టుకొని పైకి లేపెవాడట అంతటి సామర్ధ్యం ఉండేది .గురూగారి ముక్కు చాలా వెడల్పు .పెదిమలు మొద్దుగా పెద్దగా ఉండేవి .కళ్ళు చిన్నవి.కాని ఆకళ్ళు మహా పవర్ ఫుల్ .ఎన్నోభావాలకు ఆలవాల౦గా  ఉండేవి .నవ్వే పెదిమలతో అందరికీ ఆకర్షణీయం గా ఉండేవాడు టాల్ స్టాయ్ .

రచయిత టాల్ స్టాయ్

అప్పటికి ఇంకా రచన వ్యాసంగం పై ద్రుష్టి పెట్టలేదాయన .ఈవిషయాలు డైరీలో రాశాడు .తన ఆంట్ కు ఉత్తరం రాస్తూ ఆమె తనను నవల రాయమని కోరిన సంగతి గుర్తు చేశాడు .1852 జూలై లో ‘’కాంటెంపొరరి ‘’అనే ప్రముఖ సాహిత్య పత్రికా సంపాదకుడికి ‘’చైల్డ్ హుడ్ ‘’అని తాను  రాసిన జీవిత చరిత్ర భాగాన్ని పంపాడు .వెంటనే అది ప్రచురణ పొంది అభిమానుల్ని సంపాదించింది .ఇరవై నాలుగేళ్ల ఈ కుర్ర రచయితను చూసి అతనిలో ‘’un known and remarkable talent ‘’ఉందని మెచ్చుకొన్నారు .కొద్దిగా కల్పన ఉన్నా అది టాల్ స్టాయ్ జీవితమే .అ తర్వాత ఏది రాసినా స్వీయ జీవిత చరిత్రయే అయింది .ఇప్పటికే గొప్ప శైలి అలవడింది. అది అంతటా హాయిగా ప్రవహించింది .సంఘటనలన్నీ యదార్ధమైనవే కావటం తో రియలిస్టిక్ రచయితగా మంచి గుర్తింపు వచ్చింది .

 

L.N.Tolstoy Prokudin-Gorsky.jpg

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-15 –ఉయ్యూరు

 

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం -‘’పద్య ప్రసూనాలు ‘

‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం

‘’ గోపీనాద్ ప్రత్యేకత

శ్రీ ఎరుకలపూడి గోపీ నాద రావు గారితో నాకు మూడేళ్ళ పరిచయమే ఉంది .ఒకటి రెండు సార్లు సరసభారతి ఉగాది కవి సమ్మేళనానికి వచ్చారు .మరో రెండుసార్లు రాలేకపోయారు .కాని విజయవాడ సభలలో తరచుగా కలుస్తాం .ముభావం గానే ఉంటారు .’ ‘’పని ఉండి రాలేక పోయాను సార్ ‘’అని ముందే ఆయన నా దగ్గరకొచ్చి సంజాయిషీలా చెప్పే సంస్కారం ఆయనది . సభల్లో నేను కొంచెం హడావిడి చేస్తాను .కాని ఆయన నిండుకుండ .తొణక్క బెణక్క  బుద్ధిగా కూర్చుంటారు .ఇంతకు మించి పరిచయం లేదు .కాని సుమారు పదిరోజుల క్రితం తన రచన ‘’పద్య ప్రసూనాలు ‘’పంపి అందులో’’అభిప్రాయార్ధం ‘’అని అన్నారు .కనుక జాగ్రత్తగా చదివా .నేను పద్యాలు రాయను .ఛందస్సు రానివాడిని .నన్ను అభిప్రాయం కోరడం లో ‘’మతలబు’’ నాకు అర్ధం కాలేదు .రాయటానికి రెండు మూడు కారణాలు కనిపించాయి .మొట్టమొదటిది ఆయన మహారాష్ట్ర లోని పూనా లో ‘’కిర్కి ‘’లో పుట్టటం .అక్కడే మా తమ్ముడు మోహన్ ఆర్డినెన్స్ ఫాక్టరీ లో పని చేస్తూ కిర్కీ లోని ‘’సిపోరేక్స్ క్వార్టర్స్’’ లో ఉండటం .మేము 45ఏళ్ళ క్రితం ఒక వారం అక్కడే గడపి రావటం .రెండవది ఆయన మహా రాష్ట్రలో పుట్టి ,ఇంటర్ దాకా ఆంగ్ల మాధ్యమం లో చదివి ఆంద్ర ప్రాంతానికొచ్చి తెలుగు నేర్చి పద్యాలు అల్లటం .మూడవది ఆ పద్యాలు రసస్పోరకం గా ఆపాత మధురంగా ఉండటంఅనేక ప్రముఖ సాహిత్య  సంస్థల పురస్కారాలు లభించటం   .ఆయనకు పృథ్వి ఆరాధ్యమవటం ,దానిపైనున్న జీవరాసి పై ప్రేమస్పదనలు౦డటం ,జీవావరణ ,పర్యావరణాల పరి రక్షణ పై ద్రుష్టి ఉండటం ,దేవతల ఆశీస్సులు మానవ జాతికి అవసరమని భావించటం ,ఇలలో జన్మించిన మహాను భావులను సంస్మరించటం  జీవన దాతలైన నదీ సాగరాల స్తుతి చేయటం అన్నీ చూస్తె  ఈ’’ పద్య ప్రసూనమాల ‘’పృధ్వీ మాతకు అల౦కార మవటం నా దృష్టిలో ‘’ఆధునిక పృధ్వీ సూక్తం ‘’గా ఉండటం వలన నా భావాలను తెలియ జేయటానికి ‘’గోపీ నాద పృధ్వీ సూక్తం ‘’అన్నాను .

సీసాల గోపీనాధ కవి

గోపీనాధ రావు గారికి’’ సీసా’’లంటే మత్తు ఎక్కువ .’’సీ- సా ‘’బల్లపై ఊగినంత హాయిగా  ఆటగా ఆయనకు సీసపద్యాలు పలుకుతాయి .పలకటం కాదు పదాలు వచ్చి కూర్చుని పొదగమని ప్రాధేయ పడతాయి .తర్వాత సార్ధకమై విలువను పొందుతాయి .ఏది రాసినా ఆయన రచనలో ఎక్కడా తడుముకోవటం ,తడబాటు ఉండదు .సరైన పదం అక్కడ చేరి తిష్ట వేస్తుంది .అది వాణి శ్రీ ప్రసాదమే .వాణీ నాధుడైన విరించి లా పద్య సృష్టి జరుగుతుంది .ధన్యులు ఆయన ..ఇందులో ఎన్నో సంస్థల అవార్డులు పొందిన కవిత లున్నాయి .అవి వారి పద్య పాటవానికి  బహుమతులే .భావ సౌందర్యానికి అలంకారాలే .ఊహా సౌభాగ్యానికి ఊతాలే .కదిల్తే సీసం మెదిల్తే సీసం .అవి చెవిలో పోసిన సీసం లాకాకుండా మధురాతి మధురం గా ఉండటం ,శ్రీనాధుని పోకడ మనకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి .

ఛందో వైవిధ్యం

విద్దెల దేవికి విన్నపాలు ,జన్మభూమికి కృతజ్ఞత ,లక్ష్య సిద్ధి ,భాష వేదన ,దుఖితుల జీవన దృశ్యం ,కలికల్మషాలు ,మేఘ సంస్తుతి ,వర్షం, హర్షం మొదలైన 69 శీర్షికలతో అల్లబడిన పద్య ప్రసూన మాల ఇది .దేనికదే సాటి .ప్రతి దానిలో గోపీనాధీయం దర్శన మిస్తుంది .దీర్ఘ చంపక ,ఉత్పల మాలలూ కూర్చి వాగ్దేవిని అలంకరించారు .సరదాగా ‘’ఆట వెలదుల’’తో ఆడుకొన్నారు . తేట గీతులతో సేద దీర్చా(రా)రు .

శారదా స్తుతి –ఎరుక గల కవి

‘’నిత్య సత్కావ్య నిర్మాణ నిష్ట నిమ్ము ‘’అంటూ పంచ భూతాత్మకమై శ్రేయమిమ్ము ,శుద్ధ చేతమ్ము నందించి వృద్ధి నిమ్ము ‘’అని’’ సకల కళా నీరద’’ శారదను ప్రార్ధించారు ముందుగా .స్వా౦తాన్ని వెలిగించే సంక్రాంతి (some క్రాంతి కాదు సంపూర్ణ క్రాంతి )ఇమ్మన్నారు .ఆత్మకు పరమాత్మ అండ కలిగించమని వేడారు .తనను గుర్తించి దరి చేర్చి వన్నె లద్ది  భావ చిత్రాలకు భవ్యాక్షరా కృతులిచ్చి ,తెలుగు భాషను పూజించే దీక్ష నిమ్మని వేరొక చోట ప్రార్ధించి తన ఆరాటాన్ని అమ్మకు ఎరింగించారు . ‘’ఎరుక’’ గల కవి .కనుక ఎరుకల కూడి(పూడి)అని సార్ధక మైంది ఇంటిపేరు .

ప్రకృతి పాఠాలు

ప్రకృతిని చూసిఆత్మ శుద్ధి , పరహితం సమతామార్గం రుచిర  సౌందర్యం వంటివి ఎన్నో నేర్చుకొన్నానని కృతజ్ఞత చెప్పారు .ప్రపంచీకరణం యాంత్రిక ఉన్మత్తం కలగ జేసిందని ,స్వేచ్చ మితిమీరి ద్వేషాలు పెచ్చరిల్లాయని ఆవేదన చెందారు .మతాల  మధ్య మారణ హోమానికి కలత చెందారు .’’దైవీ దత్త మనోజ్ఞ ధాత్రి నొక దైత్య స్థావర స్థాయికి ‘’తీసుకురావటం బాధాకరం అన్నారు .సిరులన్నీ వస్తు చయ దాహాన్నిపెంచే శ్రీలే –‘’అంటూ పుణ్యం ఒక్కటే ‘’చిర సుఖ శాంతి నిచ్చేది యశేష విశేష ములున్న కల్మి’’అని బుద్ధి చెప్పారు .అంత్యకాలం లో అండగా నిలిచేది పుణ్యం ఒక్కటే అని నిర్ద్వందం గా చెప్పారు .అన్నీ చేజేతులా నాశనం చేసుకొంటున్న మానవుడికి ‘’సుకమొక స్వప్న లోకమున సోకే  హృష్టి గ  మారిపోయే ‘’అన్నారు .తృష్ణ మృగ తృష్ణ వంటిదని దాని వెంబడి పరిగెత్తితే ఆయాసప్రయాసమే తప్ప సుఖ శాంతులు ఉండవు .’’ధ్వజమై మానవ జాతి రక్షణ’’నిర్వర్తించే వారు లేరని ,ఇదంతామారిపోయి ‘ప్రేమ సంహిత మయి ,జీవ కోటి సుఖ హేతువు కావలె ‘’అని ఆశించారు .

సామాజిక స్పృహ

కవి ,కళాకారుడు ,శిల్పిఒకరేమిటి సకల వృత్తుల వారు సుఖమయ ఆనందమయ సంతృప్తికర జీవితం గడప లేక పోతున్నారని బాధ పడ్డారు .సామాజిక స్పృహ కు ఇవి అద్దం పట్టే రచనలే  .’’జడముకుజీవ మండించు శాస్త్ర వేత్త –జీవనోపాధి లేక నిర్జీవమై ‘’పోతున్నందుకు హృదయ భారం తో నొచ్చుకొన్నారు ‘’తాడఘము ‘’లిడే  వ్రుత్తికిన్ తాడనములు ‘’అని శాబ్దిక చమత్కారం చేశారు .ఈ నాటి చదువుల హైటెక్కు లగురించి ‘’ప్రతి ఇంట బీటేక్కు ,ప్రతి ఇంట ఎంటెక్కు ‘’అని మొదలు పెట్టి జనని భాష నేర్చే చదువు కనిపించటం లేదని ,ఆధునికత అందించే అభ్యుదయం లో మూల్యాలను త్రెంచే మూఢత అయిందని ,రోజు గడిస్తే చాలన్న భావం మానవ ప్రగతి కాదన్నారు .’’సాగర ఘోష ‘’కవిగా గరికపాటి వారు ప్రసిద్ధులు  .వీరూ అదే శీర్షికతో సాగారాగ్రహానికి మానవ తప్పిదాలే నని చెబుతూ ‘’వృత్తుల రెక్కలన్ తొడిగి ,వృద్ధి నొసంగు విదేశ సీమ సం –పత్తుల కోసమై సుతులు వారధులు దాటు ‘’తున్నారని ఈ రోజుల్లో ‘’సింధువులు చెలంగి దైహికపు దూరం బెంచెను వారి వారికిన్ ‘’ అని సమకాలీన సత్యాన్ని చాటారు .ఎన్ని నదులొచ్చి చేరినా సముద్రం చెలియలి కట్ట దాటదు.మనవ ఆత్మ మాత్రం అంత  సహనం విశాల మైనదికాదు .’’శోక వాహినీ క్రమ గతులన్ని మోయుచు స్తిరంముగా నుండుట సాధ్యమా ?’’అని మనస్తస్త్వాన్ని ఆవిష్కరించారు .

మానవీయ విలువలు

దయ, సానుభూతి ,సహవేదన, ప్రేమ, కరుణ  , మానవీయత  మానవులలో మృగ్యం అవటాన్ని జీర్ణించు కోలేకపోయారు గోపీనాధ కవి .’’బీడులలో మొక్క మొలిపించెడి ఆ వనమాలు లేరయా ?”’అని ప్రశ్నించి జనాన్ని ప్రేమగా చూసే దయాళువులు ,కూలిజనానికి రక్ష నిచ్చే వారు లేక ‘’పాడు వడెన్ , స్వతంత్ర పరిపాలన పాలక వర్గ భోజ్యమై ‘’అని విమర్శ చేన్నాకోల్ తో బాదేశారు .

తెలుగు భాషపై మక్కువ

తెలుగు భాషా సంస్కృతుల పట్ల అపార ఆరాధనా భావం ఉన్న ‘’రావుకవి’’ నేటి భాష దుస్తితికి చింతించారు ,.’’తెలుగు తనజాతి గుర్తింపు గనెను గాని –సొంత పేరును కోల్పడి చి౦తమునిగే ‘’అని ‘’అమ్మభాష గరళమై పోయిందని ,ఏ జాతి అయినా ‘’విధుల నాచరించిన జాతి వినుతికెక్కు –జాతి నిల్పున దొక్క భాషా విభూతి ‘’అని జాతి ని నిలబెట్టేది భాషా వైభవం విస్తృతి మాత్రమె నని ఘంటా పధం గా చెప్పారు .’’బోధన లేదు ఆంధ్రమున పోడిమి నిచ్చెడిశాస్త్ర బద్ధ సంశోధన లేదు తెల్గున ‘’అని బాధపడి ‘’రాస్ట్రాధిపు  కార్య శాలలను సైతము వాడుక లేదు తెన్గుకున్ ‘’అని కుంగిపోయారు .దేశ భాషలలో తెలుగు లెస్స పోయి,’’తెలుగు  less ‘’అవటం మింగుడుపడని వ్యవహారం అయింది ఆయనకు. ఆయనతో బాటు మనందరికీ కూడా .రత్నాలను వదిలి రాళ్ళను కోరుకొనే మానవ మనస్తత్వం ఆయనకు వింతగా తోచింది .స్వార్ధం వదిలి ,భావి తరం క్షేమం కోసం వ్యర్ధపు జీవిత విధానాలని త్యజించి ,జన్మ సర్వార్ధాన్ని గ్రహించి తే ‘’విశ్వ మంతటన్ తీర్ధపు క్షేత్రముల్ వెలసి ‘’దివ్య పరిస్తితులోస్తాయి అని హితవు చెప్పారు .

దిక్కు లేని దీన స్థితి

’’తూర్పులో కూర్పు ,ఆగ్నేయం లో ఆశ ,దక్షిణం (యామ్య దిశ )లో సంతోషం ఇచ్చేఊర్పు ,నైరుతిలో నచ్చే మార్పు ,పడమట పరితోషాల పేర్పు,వ్యాయవ్యం లో  బతుకు పొల్పు ,ఉత్తరాన కరుణ తో నిండిన పిలుపు ,ఈశాన్యం లో మేలు వేల్పు ,పైన ఒప్పు ,కింద నేర్పు గోపీ గారికి కనిపించనే లేదు .ఆదుకోవటానికి ఇంకేది దిక్కు ?అని కలత చెందారు .

ఏదిఉన్నా లేకపోయినా మనిషికి జాతికి శీలం ముఖ్యం .’’శీలము చేతనే బ్రతుకు శ్రేయము నొందును ‘’అని ప్రేయస్సునోదిలి శ్రేయస్సు వైపుకు కదలమని బోధించారు .పూలను చూసి విద్య,చెట్లను చూసి బ్రతికే ధర్మం ,నేర్చుకోవచ్చు అని ‘’తరతమ భేదభావములు  ,తామస భావనము ,స్వార్ధ నైజమున్ ‘’వదులుకొని వినాశం నుంచి బయటపడమని హితోపదేశం చేశారు .ఇవి జాతికి వ్యక్తికీశ్రేయోదాయకాలే కదా .కనుక ‘’గోపీ కవి ‘’సమాజ జాతి హితైక  కవి కాదా ?

వియద్గంగకు విన్నపం చేస్తూ ఆమె అలిగి తే బతుకు నరకం అవుతుందని ,’’జలకణ మొక్క టోక్కటిగ సంకలనమ్మొనరించి గుండెలో నిలిపి –వసు౦ధరాస్థలికి నిర్మల వారి శుభాభి షేకముల్’’చేసే మేఘ ప్రసారం ప్రశస్తమైనది .ఇది తెలియని మూర్ఖులే ‘’పుడమి దేవత పాలిటి వైరులయ్యేడిన్ ‘’అని ప్రుద్వికి శత్రువులెవరో చెప్పారు .ఆమె అలౌకిక మహా గుణ శీల అని స్తుతించి ,ఆమె క్షమా అనే నీడనిచ్చి కరుణించి ‘’మిన్నువాక ‘’గా మారి సువర్ష దారలు కురియుమని ప్రార్ధించి పృధ్వీ తాపానికి ఉపశమనం వాంచించారు .

జైకిసాన్ –జైజవాన్

రైతే రాజు ,అన్నదాత అనిపిలువ బడే హాలికుడిని  పద్య సుమాలతో అర్చించారు .భూమి పుత్రుడైనా ,ఆవాసం లేక ,ఆకాశానికి ఆత్మీయుడైనా వికాసం లేక ,జలదేవతా భక్తుడైనా శుష్క జీవనం ,పవనానికి పరమాప్తుడైనా ఆశ్వసించలేక నిశ్వ సించి  ‘’చిత్ర వధలకు చిక్కాడు క్షేత్ర జీవి ‘’అని రైతు పక్షాన నిలిచారు .కాలం అతన్ని కసిదీరా కాటేసింది అన్నారు .విఫల సేద్యం ‘’అరకాని వెన్ను విరిచింది ‘’అని ,’’మట్టి పూజారి ‘’ప్రార్ధనలన్నీ వట్టి పోయాయని సానుభూతి చూపారు .ఈ సందర్భం లో రాసిన పద్యం చాలా హృద్యంగా ఉంది –చూడండి –

‘’అ౦బు జాసను వోలె నన్నమ్ము సృష్టించు రైతుకు నిత్యమ్ము త్రాసమేల ? –ఘర్మ జలాభి షిక్త హరస్వరూపికిన్ భిక్షాటనా వస్థ శిక్షలేల ?-వసుమతికి హరిత వసనమ్ము లందించు హరి వంటి హలదారి కార్తి ఏల?’’అని రైతు కున్న త్రిమూర్తి స్వరూపాన్ని మహాద్భుతం గా వర్ణించిన తీరు , అయినా బాధలు తప్పని వేదనా  అసదృశం అనిపించింది .రైతుకున్న చాలాపేర్లనిక్కడ సందర్భా శుద్ధితో  చక్కగా వాడారు . .’’శతృ శేషం లేనట్టి శాంతి కోరి ,దేహం రక్త తీర్ధమైనా దేశం కోసం దేహాన్ని త్యాగం చేసే జవాన్ కు జై జై అన్నారు.

నవమానవ గుణాలు

‘’నవ మానవ గుణాలు ‘’వర్ణిస్తూ బాంధవ్యాలు పట్టు దప్పాయని ,అంతా అంధ వ్యాపనం గా ఉందన్నారు .వ్యక్తికీ వ్యక్తికీ అనుబంధం ఉంటె వజ్ర వైడూర్యాలు పోతాయా ,కూర్మితో నరజాతి ఉంటె గోమేధిక రాశి గుల్ల అవుతుందా,ఇచ్చి పుచ్చుకొంటే పుష్యరాగాలు హరించుకు పోతాయా ,ఒకరి క్షేమం మరొకరు కోరుకొంటే మరకతాలుకొండ తరిగి పోతుందా   ,చేతులు కలిపితే కెంపు గుట్ట తరిగిపోతుందా ,మమత పూయిస్తే నీలాలు రాలిపోతాయా ,మంచిమాట మాట్లాడితే పగడాలు ముత్యాలు పారిపోతాయా అని అతి విలువను అతి విలువైన వజ్ర వైదూర్యాలతో పోల్చి సొగసుగా చెప్పి చివరికి ‘’మంచి పెంపారగన్ జేయు మనిషి తనము ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .

వేదనా వాసుదేవం –స్త్రీ శక్తికి చేయూత

గాయమే గేయమై ,ప్రతిగాయం జీవన కావ్యమౌతుందని షెల్లీ లాగా, కృష్ణ శాస్త్రి లాగా చెప్పారు .’’కామము లేమల ప్రాణ మానములనవలీలగా దోచే ‘’దుస్టకాలాన్ని చూసి వ్యధ చెంది చూస్తూ ఊరుకోవద్దని మహిళలకు హితవు చెప్పి ‘’సత్తువ కూడ దీయుచు ‘’అసంగతమైన అసభ్య ప్రేమలను అణచి వేసి శిక్షల పాలు చేయమని ధైర్యం బోధించారు .’’చక్కనౌ పొత్తుల నిచ్చు ప్రేమమును పొంది శుభమ్ముల నొందగావలేన్ ‘’అని పూర్తి ఆశా భావం కనబరచారు .

విహంగ వేదం

‘’విహంగ గానం’’ ఒక సూక్తి సుధ.స్వేచ్చ మూల్యాన్ని ,విశ్వ గానామృతాన్ని ,సహన ధర్మాన్ని ,ప్రేమశీలతను .విఘ్నాల దాడి నెదిరించే లక్షణం ,వివిధ వర్ణాలు ,విమల ప్రకృతి ,సహజ సుఖ జీవనం ,విశ్వ సందేశ వాహకత్వం ,వెతలకు వెరవని ధర్మం ,విహగ గతులలో గీపీనాధకవి దర్శించారు .ఇది ఒక అలౌకిక దర్శనమే .చివరికి ‘’–

విదిత సుర వాహనమ్ము లీ విహగ తతులు –అహిత మహి రక్షణన్ ,గోరు విహగ తతులు –వేదన మాన్పి రహి పెంచు విహగ తతులు –వేకువకు స్వాగతమ్ము పల్కు విహగ తతులు ‘’అని మానవులకు విహ౦గాలిచ్చే స్పూర్తిని మహా మహితాత్మకం గా చెప్పారు .

జగద్ధితం

ఉగాది లాంటి పర్వ దినాలు ‘’ఉర్వికి శాంతి సౌఖ్య మహితోపక్రుతుల్ ఘటించా’’లని మనసారా కోరుకొన్నారు .ఏదైనా ఆయనకు జగద్ధితం కావాలి .తర్వాతే ఏదైనా .మానవుడు యాంత్రిక జీవనం గడుపుతున్నాడని కుజగ్రహం పైకి కాలు దువ్వుతున్నాడని ‘’యంత్రములాయె మానవాత్మలున్ ‘’అని యంత్రితమైన మానవుని ఆత్మ ఎప్పుడు మేలు కొంటుందో? నని అన్నారు అంటే త్వరగా మేల్కోవాలని ఆశ .

దేశ భక్తి

భారత దేశమంటే పరమ ఆరాధనా భావం ఉన్న కవిగారు ‘’ఇన కిరణమ్ము ప్రప్రధమ మీ ధర ముద్దిడు తుంది ‘’అని మురిసిపోతారు ..తన సంగీతం విశ్వ మానవతకు నాట్యం నేర్పించాలని ,తన సంసర్గం తో జగము జ్ఞానైశ్వర్యం పొందాలని ,తన సందేశం చేత ఈశ్వర జ్ఞాన కాంక్ష లభించాలని విశ్వ చేతనాభావం తో కమనీయంగా కవిత చెప్పారు .భారత దేశ కార్మికులే స్వదేశ ,విదేశాలలో  భర్మ్యరమ్య భవన నిర్మాణం చేస్తున్నారని ,’’భారత బుద్ధి జీవుల ప్రభావము చేతనే సర్వ దేశ వృద్ధి ‘’జరిగిందని మెచ్చుకొంటారు .అన్నిరంగాలలో భారతం అగ్రగామిగా వెలిగి పోతూఉండగా  ‘’భారతారాధన మిన్ను ముట్టి అలరారెను విశ్వ మంత ‘’అని పొంగిపోయి ‘’నిష్ట  యే మా ధనమన్న నా జనుల మాటలు నక్షర సత్యముల్ ‘’అని కీర్తించారు .జననీ జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసి ‘’అన్న శ్రీ రామవాక్యాన్ని గుర్తు చేశారు .

గ్రామ సౌభాగ్యం

‘’గ్రామమే అన్నపూర్ణ ప్రతి కర్షక బంధువు అన్నదాతయున్ –‘’అని చెప్పి ‘’పల్లె శ్రమైక్య జీవనారామము ,పంచ భూత పరిరక్షణ చక్రము ‘’అని గ్రామజీవనాన్ని కొనియాడి ‘’ఉల్లము దోచు ప్రక్రుతి సమున్నత ధామమే గ్రామ సీమ ‘’ అన్నారు .నరుడే భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొని నశిస్తున్నాడని ఆవేదన చెంది ‘’నరుడు కాలపు చక్రమ్ము నడత మార్చె.’’అని విచారించారు .

స్పూర్తి దాతల కు ప్రస్తుతి ప్రసూన మాల

జాతికి స్పూర్తి దాతలైన జాషువా ,మాడపాటి ,ప్రకాశం లను పద్య ప్రసూనాలతో పూజించి గౌరవించారు గీపీనాద్ రావు .జాషువా సమకూర్చిన కావ్య రత్నాలు తెలుగు గుండెలను పిండేశాయని  పీడకాత్మలను పిప్పి చేశాయని చెప్పి ‘’మేదిని నేలెడి కీర్తి నొందె’’అని ఘన నివాళులర్పించారు .’’నిత్యము  సంఘ సేవ ,అను నిత్యము  సంస్కరణాభిలాష,నిత్యము  సాహితీ కృషి  ‘’చేసే మాడపాటి ఆంద్ర పితామహుడని స్త్రీ విద్యా పోషకుడని ,’’ప్రస్తుతించారు ‘’.సురవరమే’’ ప్రతాప రెడ్డి అని ,తెనుగు లిపిని సంస్క రి౦చాడని ,ఆంధ్ర చరిత్రరాసి ‘’సాంఘిక జీవన విధానాలను’’ వెలుగు లోకి తెచ్చాడని ,మెచ్చి’’ వైతాళికుడు’’ అనే పెద్దసార్ధక  గౌరవాన్ని కల్పించారు .ఇక పీ .వీ .ఠీవి ని మెచ్చి ఆయన బహుభాషా ప్రతిభ ,లౌకికభావన ,రాజనీతి, జ్ఞానధనం ,దూరదృస్టి  ,వాగ్ధాటి లకు అబ్బురపడ్డారు .’’గుండుకు గుండె  చూపిన మొనగాడు ‘’ఆంధ్రకేసరి ప్రకాశం .’’మాతృ భూమికి తనువూ ,మనమ్ము ,సంపదలు ‘’త్యాగం చేసిన జాతిని మేలుకోల్పిన మహా నాయకుడన్నారు.యేసును అల్లాను కూడా పద్య పుష్పాలతో అర్చించారు .పరమత సహనాన్ని చాటి చెప్పారు గోపీనాద్ .

–                         జ్ఞానదీపారాధన

.. బయటి చీకట్లను పోగొట్టటానికే కాదు దీపం ‘’హృది దేహళి ‘’లో పెట్టాలని మనస్తాపం అనే మహాన్ధకారాన్ని దాంతో త్రుంచాలని కోరారు .’’దివ్వియ –జ్ఞానదీప్తికొక తిన్నని చిన్నియ ‘’అన్నారు పరమ భావుకం గా .’’చిత్తం చీకటింట బడి చేతన కోల్పోరాదు’’అని సందేశ మిచ్చారు .’’దివ్వె తో దివ్వె వెలిగించమని జ్ఞాన బోధ చేశారు .

కవి రవి

కవి కాలానికి రెండుకళ్ళు  ,విశ్వ చేతనకు కదలిక  ధర్మానికి నాల్గు కాళ్ళు,అని నిజం చెబుతూ ‘’కవిభావ దేవియై కవితాత్మరశ్మియై ,కావ్య భారతి ‘’తనను కాపాడాలని కమ్మని తెలుగు తన హృదయ స్పందనై  జీవభాషై,వర్ధిల్లాలని వా౦చి౦చారు .చివరగా ‘’ పూర్వ పుణ్యమై ,నాజాతి జీవమై కాంతిల్లు తెంగు నన్ కావుగాత –నారాష్ట్ర తేజమై నా జీవ నాడియై కలి (ల)కాల మీ తెల్గు వెలుగు గాత’’ అని గోపీనాధకవి ఆశాభావం వ్యక్తం చేశారు . ఇదే మనందరి ఆకాంక్ష .అది తప్పక తీరగలదని ఆశిద్దాం .మరిన్ని పద్యకావ్యాలు రచించి ఆంద్ర సరస్వతిని అలంకరించాలని గోపీనాధ రావు గారిని కోరుతున్నాను .

ఈ పద్య సుమమాలను ‘’ యువ కవి పాదుషా ‘’శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారికి  అంకితమివ్వటం, ‘’కవితా మడుగు ‘’ .రామడుగు వెంకటేశ్వర శర్మ గారు విపుల , మనోహర సమీక్ష చేయటం ,పుష్పగిరి సంస్థాన పండితులు శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు ఆశీఃపూర్వక ప్రశంసలు అందించటం  అదనపు ఆకర్షణలు .

 

 

శ్రీ గోపీనాధ రాగారు రాసిన ”పద్య ప్రసూనాలు ”లభించే చోటు
శ్రీ ఎరుకల పూడి గొపీ నాధ  రావు

— డోర్ నంబర్     -23-17-8-   బడి వీధి

  సత్యనారాయణ పురం
  విజయవాడ -11
సెల్ నంబర్ -98482-93119

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-4-15 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

తృతీయ నాడు మా పెరటి” సువర్ణ సుమ దరహాసం

DSCN0474 DSCN0475 DSCN0476 DSCN0477 DSCN0478 DSCN0479 DSCN0480 మా పెరటి” సువర్ణ సుమ దరహాసం’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మానవతా కధకుడు -(శశిశ్రీ)-రాచపాళెం రామ చంద్రా రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దండాలు -అరదండాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో అక్కయ్యే స్టేషన్ డైరెక్టర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

 

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం )

మొదటి రియలిస్టిక్ డ్రామా

 

మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్  టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . చీకటి వ్యాపారులు ,డబ్బే ప్రధానం గా జీవించేవారు ,అబద్ధాల కోరులు వగైరా నీతిబాహ్యుల బండారం బయట పెట్టాడు .మధ్యతరగతి గౌరవం మీద ఇబ్సెన్ కు గౌరవం లేదు .పై ముఠా ద్రుత రాష్ట్ర కౌగిలిలో గిజ గిజా తన్నుకుంటున్న సామాన్యుడి గురించిన ఆరాటమే ఇబ్సెన్ ది .ఇది ఆనాటి దేశ రాజకీయ పరిస్తితికి ప్రతి బింబమే .సామాన్యుడికి శత్రువైన ప్రభుత్వ తీరు తెన్నులపైనే ఇబ్సెన్ ద్రుష్టి పెట్టాడు .తనకు సంప్రదాయసిద్ధమైన కానుక లేదన్నాడు .స్వేచ్చ అన్నిటికంటే ప్రధమ౦, ఉత్తమం అన్నాడు .’’destroy the false ideal –the State –make willingness and spiritual kinship the only essentials of unity –and you have the beginning of a liberty that has the same value ‘’అని సమాజానికి తెలియ జేశాడు .

తర్వాత రాసిన ‘’ఏ డాల్స్ హౌస్ ‘’,ఘోస్ట్స్ ‘’నాటకాలు రెండూ సమాజం లో పాతుకు పోయిన సంప్రదాయాలను మరింత తీవ్రం గా అధిక్షేపించినవే .’’పెళ్లి ఒక పవిత్ర కార్యం ‘’అన్న భావానికి విరుద్ధమైనవే .డాల్స్  హౌస్ లో హేల్మేర్స్  హాయిగా సెక్స్ సుఖాలను పొండాడు  .  నిజాయితీ ఉన్న లాయరు అయినా ,మంచి కుటుంబం లోను౦చి వచ్చినా భార్య నోరా   ఆదర్శ భార్యగా  కొంచెం చిలిపి గా   చూపాడు.భర్తకు తనమీద కంటే సంప్రదాయం మీదే ఆసక్తి ఎక్కువ అని ఆమె భావించింది .తాను ఇక ఏమాత్రం ‘’వుమన్లీ వుమన్ ‘’గా ఉండ దలచుకోలేదు .’భర్త మనస్తత్వానికి ’అద్భుతాలకే అద్భుతమై’’న విషయమై తన వ్యక్తిత్వాన్ని గుర్తి౦చె దాకా తిరిగి రాను అన్నది . భర్త భార్యను అర్ధం చేసుకొని అన్యోన్యం గా మెలగితేనే దాంపత్య జీవితం ఆనందమయం అనే భావన తెలియ జేశాడు ఇబ్సెన్. మనుష్యులలో పరి వర్తన రావాలని ఆశించాడు ..

రెండవ నాటకం ఘోస్ట్స్ విషాదాంత నాటకం .ఒక భార్య బిడ్డకు తల్లిఅయిన ఒక స్త్రీ ఆల్వింగ్  తన కుటుంబ బంధం సంప్రదాయ ఉక్కు కౌగిలిలో నలిగి నశించటం ఇందులో కద.’’లోకం ఏమనుకొంటుందో ‘’అనే భయం ఆమెను వెంటాడి కొడుకును రక్షించుకోలేక కోల్పోతుంది ..భర్తమీద కుటుంబం మీద ఒక తీవ్రమైన అపనింద మోపితే ,న్యాయం గా కొడుకునైనా రక్షించుకోవాల్సిన ఆమె తండ్రినుండి సంక్రమించే సిఫిలిస్ వ్యాధి తోకొడుకు  బతక రాదనుకోన్నది  .అది ఆనాడు సంఘం లో నిషేధమైనదే .

విమర్శల జడివాన

ఈ రెండు నాటకాలను పత్రికలూ ,ప్రజలూ తీవ్రం గా వ్యతిరేకి౦చినవే .డాల్స్ హౌస్ ను ‘’ఇమ్మోరల్ ‘’అన్నారు .సంఘం లోని అన్ని మర్యాదలను మంట గలిపింది అన్నారు .జర్మనీలో నాటకం తప్పనిసరిగా సుఖాంతం అవ్వాలి . బెర్లిన్ ,హాం బర్గ్ ,వియన్నా లలోని నాటక ప్రియులు ఆ నాటకాన్ని తమకోసమైనా సుఖాంతం చేయమని ప్రాధేయ పడ్డారు .తప్పని సరి పరిస్తితిలో ప్రింట్ లో మార్పు తెచ్చాడు ఇస్బెన్ .విమర్శకులు ఘోస్ట్ నాటకం పైన కురిపించిన విమర్శల జడివాన ,వాడిన అసభ్య పదజాలం భయంకరం గా ఉందని ఇబ్సెన్ జీవిత చరిత్రకారుదు ఇబ్సెన్ కు ఆంగ్ల అనువాదకుడు విలియం ఆర్చేర్  వాటిని సేకరించి వీటిని ‘’dictionary of Abuse ‘’లో చేర్చటానికి దాచిపెట్టాడు .దీనికి ‘’ఘోస్ట్స్ అండ్ గిబ్బరింగ్స్ ‘’అని పేరు పెట్టాడు .ఇది తర్వాత పాల్మాల్ గెజిట్ లో1891 లో అచ్చయింది .

వ్యంగ్య వైభవం

వివాహం  సంప్రదాయ విధానాలు పై తన కున్న అభిప్రాయాలను ఇబ్సెన్  ఖచ్చితంగా చెబుతూనే ‘’యాన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ ‘’అనే మరో నాటకం రాసి మరికొన్ని సంప్రదాయాలను చీల్చి చెండాడాడు ..శీర్షిక వ్యంగ్య వైభవం తో విషాదం గా ఉన్నది .దీనిపై వాద ప్రతివాదాలు తారా స్తాయిలో జరిగాయి .జార్జ్ బ్రాండ్స్ మెజారిటీప్రజల అభిప్రాయాలు సరైనవి ,వాటినే అనుసరించాలి అని ఇబ్సెన్ కు హితోపదేశం చేస్తే ‘’the minority is always right ‘’ అని ప్రతిగా సమాధానమిచ్చాడు ఇబ్సెన్ .యాభై లో ప్రవేశించాడు .,.ఇబ్సెన్ సాహిత్య ప్రయాణం రొమాంటిక్ మలుపు దాటి రియలిస్టిక్ దారిలో ప్రయాణిస్తోందిప్పుడు .’’వైల్డ్ డక్’’నాటకం రాశాడు .ఇందులో దంపతులు తమ పాత జీవితాలను రోజూ తవ్వుకొని పోట్లాడుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనే ఆలోచనలో ఉంటారు దీనిలోంచి బయటపడి ఐక్యత తో జీవించాలనే సందేశమిచ్చాడు .ఇందులోని స్త్రీ’’most impassioned ,purposeful ,and enigmatic woman ‘’అన్నారు విమర్శకులు .జనం బాగానే రిసీవ్ చేసుకొన్నారు .  మరోనాటకం ‘’ది లేడీ ఫ్రం ది సీ ‘’లో చక్కని సుఖాంతం ఉంది .ఇలా రాసినవి తక్కువ నాటకాలే ఉన్నాయి .’’హెడ్డా గేబ్లెర్ ‘’అనే మరోనాటకం లోని స్త్రీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది .ఒంటరితనం తో బోర్ కొట్టి ,అసూయ పీడిస్తూ ,పెత్తనం కోసం పాకులాడుతూ ఉండే స్త్రీని గొప్పగా చిత్రించాడు .ఆమె ‘’నార్వీజియన్ లేడీ మేక్ బెత్  .’’అని పిస్తుంది .ఈ నాటకం తో మరింత తీవ్ర విమర్శకు గురయ్యాడు .

ముసలాయనకు దసరా పండగ

ముసలాయనకు అరవై మీద పడ్డాయి .పది హేడేళ్ళపడుచు పిల్ల ఎమిలీ బార్డాక్ తో మొహం లో పడి ముసిలోడికి దసరా పండగ అనిపించుకొన్నాడు .ఆమెను ‘’The May sun of my September life ‘’అని చెప్పుకొని జీవితం లోకి ఆహ్వానించాడు .పెళ్లి ,వెంటనే పెటాకుల్లా విడాకులు  అయిపోయి ముసలాయన ప్రపంచ యాత్రకు బయల్దేరాడు .అక్కడక్కడ ప్రేమ భామలు తగిలినా వెటపడకుండా జాగ్రత్త పడి కొంపకు తిరిగి వచ్చాడు .

ప్రపంచ ప్రసిద్ధి

ఇంకా పదిహేనేళ్ళు బతకాల్సి ఉంది ఇబ్సెన్ .ఈ కాలం లో రాసినవి మూడే మూడు నాటకాలు .’’దిలిటిల్ యియోల్ఫ్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’వెన్ వు డెడ్ అవేకేన్ ‘’.మూడూ ట్రాజేడీలే .మొదటిది దిక్కుమాలిన విరమణ .రెండోది మృత్యు నాట్యం .మూడోది పునరుద్ధానికి ఆశగా కనిపించినా చివరికి విషాదమే ,ఇప్పటికే ఇబ్సెన్ కు ప్రపంచ ప్రసిద్ధ నాటక కర్తగా గుర్తింపు వచ్చేసింది .పంతర్జాతీయంగా అయన నాటకాలు అన్నిభాషల్లోకి అనువాదం పొందాయి .లండన్ లో ఇబ్సెన్ నాటకాలుప్రేక్షకులచేత  క్రోధాగ్ని కురిపించాయి .ఇస్బెన్ ను వెనకేసుకొచ్చి బెర్నార్డ్ షా సుదీర్ఘమైన సమాధానాలు చెప్పి వాటిలోని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .తనకు మించిన ప్రసిద్ధ నాటక కర్త ప్రపంచం లోనే లేడనే తిరుగు లేని నిజాన్ని ఇబ్సెన్ చాలాకాల విన్నాడు .

చరమ దశ

72 వయసులో మొదటిసారి గా గుండె పోటు వచ్చింది .రెండవ సారి స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడు ,శరీరమూ దెబ్బ  తిన్నాయి .దేనిపైనా  ద్రుష్టి పెట్టలేక పోయాడు .రోజుకు అయిదారు పేజీలకంటే చదవ లేక పోయాడు .రాయటం అనేది అసాధ్యమే అయింది .అక్షరాలను కూడబలుక్కోవలసి వస్తోంది .మూడవ సారి గుండె పోటు వచ్చి ఇది కూడా దూరమై 78 వ ఏట మే నెల 23 న 1906లో ఇబ్సెన్ మరణించాడు .

నార్వేజియన్ నవలాకారుడు ,విమర్శకుడు కౌంట్ హామ్సేన్ ‘’A book keeper of dramatic art ‘’అన్నాడు .ఇబ్సెన్ మరణానంతరం ఎవరూ ఆయన స్థానాన్ని గురించి కామెంట్ చేయనే లేదు .మానవ అంత రాత్మకు సూటిగా సోకిన నాటకాలు ఇబ్సెన్ రాశాడు .సంఘం లో అప్పటిదాకా గౌరవింప బడ్డ నైతిక విలువలను సంప్రదాయాలను ప్రశ్నించాడు .’’Ibsen disturbed the accepted concepts of conduct ,proposed new moral values ,and in his very dramas of disaster and defeat ,suggested the imperative need as well as the inevitable triumph of truth ‘’ అన్నాడు గ్రంధ కర్త లూయీ అంటర్ మేయర్ .

 

నాటక శాలలో ఆధునికతను ప్రవేశ పెట్టిన మొట్ట మొదటి వాడు ఇబ్సెన్ .షేక్స్ పియర్ నాటకాలు ఆడినంత గొప్పగా ప్రపంచం మొత్తం మీద ఇబ్సెన్ నాటకాలే  ఆడాయి .డాల్స్  హౌస్ నాటకం ఇరవై వ శతాబ్దం లో ప్రపంచం మొత్తం మీద అనేక ప్రదర్శనలు పొంది రికార్డ్ సృష్టించింది .ఐరోపా సంప్రదాయం లో గొప్ప నాటక కర్త గా గుర్తింపు పొందాడు .పీర్ గింట్ నాటకం లో సర్రియలిజ ధోరణి కూడా ఉంది .షేక్స్పియర్ తర్వాత ఇబ్సెన్ కు మాత్రమెప్రసిద్ధ  నాటక రచయితగా గుర్తింపు వచ్చింది .ఇబ్సెన్ ప్రభావం బెర్నార్డ్ షా ,ఆస్కార్ వైల్డ్ ,ఆర్ధర్ మిల్లర్ ,జేమ్స్ జాయిస్ ,యూజీన్ ఒ నీల్ వంటి ప్రసిద్ధ నాటక కర్తలపై అమితం గా ఉంది .1902 ,1903 ,1904  లలో అంటే మూడేళ్ళూ ఇబ్సెన్ పేరు నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయ బడింది .కాని దక్కలేదు .

ఇబ్సెన్ తన రచనలు డేనిష్ భాష అంటే నార్వే ,డెన్మార్క్ దేశాల భాషలోనే రాశాడు .ఆ భాషలోనే ముద్రణ పొందాయి .డ్రామా నిబంధనలను రియలిజం తో తిరగ రాసిన సాహసి ఇబ్సెన్ . దీన్నే చెకోవ్మొదలైన వారు  అనుసరించారు అవే ఇప్పుడు దియేటర్ లో రూల్స్ గా చెలామణీ అవుతున్నాయి వినోదాన్ని మించి సాంఘిక ప్రయోజనాన్ని నాటకాల ద్వారా అందించాలన్న ధ్యేయమే ఇబ్సెన్ కుండేది .జేమ్స్ జాయిస్ పై అమిత ప్రభావం కలిగించాడు .ఇబ్సెన్ నుపాత్ర చేసి జాయిస్ ‘’స్టీఫెన్ హీరో ‘’నవల రాశాడు నార్వే సమాజం లో ప్రముఖ మైన మంచి మార్పులన్నిటికీ ఇబ్సెన్ కారణ భూతుడయ్యాడు . .ఆధునికత నాటక రంగానికే కాదు జీవితం లోను రావటానికి ప్రధాన కారణం ఇబ్సెన్ .

2006 లో ఇబ్సెన్ శత జయంతి జరిగింది దాన్ని ‘’ఇబ్సెన్ యియర్ ‘’గా గౌరవించారు .ఇబ్సెన్ మ్యూజియం మళ్ళీప్రారంభమైంది  .మొత్తం 27 రచనలు చేశాడు .ఎడ్మండ్ గూస్ కు స్వదస్తూరితో ఇంగ్లీష్ లో ఇబ్సెన్ రాసిన ఉత్తరం .

 

 

Letter from Ibsen to his English reviewer and translator Edmund Gosse: “30.8.[18]99. Dear Mr. Edmund Gosse! It was to me a hearty joy to receive your letter. So I will finally personally meet you and your wife. I am at home every day in the morning until 1 o’clock. I am happy and surprised at your excellent Norwegian! Your amicably obliged Henrik Ibsen.”

Inline image 1   Inline image 2  Inline image 3

Inline image 4   

 

మరో ప్రముఖ వ్యక్తితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘

‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘lee1 001 lee2 001 singam1 001 singam2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ రామ కృష్ణ ప్రభ -ఏప్రిల్

akshaya 1 001 akshaya 2 001 nrusimha 1 001 nrusimha2 001 shankara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిత్రకళకు రాణువ తెచ్చిన రామారావు దామెర్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివుని మూడో కన్ను జ్ఞానానికి సంకేతం -డా అరవింద రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ విహారి పద చిత్ర రామాయణ విహారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తిన లో తెలుగు ఠీవీ-పీవీ-

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనగనగ గాయకుడు

అనగనగ గాయకుడు
సీన్‌ సితారే
సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- ‘‘ఈ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడుగుతావా? అని ఎదురుచూస్తున్నాను.. అని ఆగాడు. ఇప్పుడు నీకో కథ చెబుతాను. ఆ కథలో ఒక చిక్కు ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతే- వచ్చే వారం వరకూ నాతో మాట్లాడకూడదు..’’ అని సవాలు విసిరాడు. శిష్యుడు ఆ సవాలును స్వీకరించినట్లు తలూపి- చెప్పండి.. గురుదేవా అన్నాడు.
కథాక్రమం..
మన ఇండసీ్ట్రలో ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పాడితే- తేనె కారినట్లు ఉంటుందని అందరూ అనుకొనేవారు. ఎంత కఠినమైన పాటనైనా సునాయాసంగా పాడేసేవాడు. దాంతో సంగీత దర్శకులకు పని చాలా సులువయ్యేది. అందువల్ల చాలా మంది సంగీత దర్శకులు ఆయనే కావాలనుకొనేవారు. ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేవి. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు. ఇలా కథ సాగుతున్న సమయంలో- ఒక కుర్రాడు హఠాత్తుగా రంగం మీదకు దూసుకువచ్చాడు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నింటిలోను అతని ప్రొగ్రాములే. ప్రతి మ్యూజిక్‌ డైరక్టర్‌ ఏదో ఒక సందర్భంలో అతనిని పొగిడిన వారే. చిన్న వయస్సులో అంత సులువున్న గాయకుడు మరొకరు లేరని ప్రస్తుతించినవారే. ఆ కుర్రవాడు మన గాయకుడి దృష్టిలో పడ్డాడు. ఒక సారి అతనిని పిలిచి- ుూనీది జిల్లా స్థాయి కాదు. మద్రాసు స్థాయి.. నా దగ్గరకు వచ్చేయి..’’ అని ఆహ్వానించాడు. ఆ కుర్రవాడు పొంగిపోయాడు. మూటాముళ్లు సర్ధుకొని మద్రాసు వెళ్లిపోయాడు. గాయకుడు- ఆ కుర్రవాడిని అమితంగా ఆదరించాడు. ఎక్కడికి వెళ్లినా- వెంటబెట్టుకొనే వెళ్లేవాడు. ఒక రోజు గాయకుడికి బాగా జ్వరం వచ్చింది. పాట రికార్డింగ్‌ చేయటం తప్పనిసరి. ఆ సమయంలో మ్యూజిక్‌ డైరక్టర్‌ ఫోన్‌ చేసి- ుూమీ దగ్గరున్న కుర్రాడి చేత పాడిద్దాం. బాగా పాడుతున్నాడు కదా..’’ అన్నాడు. అప్పుడా గాయకుడు- ుూవాడిది మన స్థాయి కాదు. బాలీవుడ్‌ స్థాయి. వాడికి అక్కడే గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నా..’’ అన్నాడు. అన్నట్లే కొద్ది కాలం తర్వాత తన పలుకుబడి ఉపయోగించి- ఒక సినిమాలో ఛాన్స్‌ కూడా ఇప్పించాడు. బొంబాయిలో తన స్నేహితుడి గెస్ట్‌ హౌస్‌లో ఉంచాడు. ఆ కుర్రాడు చాలా కాలం ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి విఫలమయి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అప్పటికి ఇక్కడి ట్రెండ్‌ కూడా మారిపోయింది. దాంతో అతనికి ఇక్కడ కూడా ఛాన్స్‌లు దొరకలేదు..
 
ఉపసంహారం
బాలీవుడ్‌లో ఛాన్స్‌లు దొరకటం చాలా కష్టమనే విషయం తెలిసి ఆ గాయకుడు కుర్రావాడిని బొంబాయి ఎందుకు పంపాడు?’’ అని ప్రశ్నించాడు గురువుగారు. దీనికి సమాధానం చెప్పటం చాలా సులువు గురువుగారు.. అన్నాడు శిష్యుడు. ‘‘ఆ కుర్రాడి టాలెంట్‌ను గాయకుడు గుర్తించాడు. అతను టాలీవుడ్‌లో ఉంటే తనకు ప్రమాదమనే విషయం అతనికి తెలుసు. అందువల్ల అతనిని బాలీవుడ్‌కు పంపాడు. బాలీవుడ్‌ ఒక మహాసముద్రమని- అక్కడ నిలదొక్కుకోవటం కష్టమని అనుభజ్జుడైన గాయకుడికి తెలుసు. అందుకే ఆ పన్నాగం పన్నాడు..’’ అని సమాధానాన్ని చెప్పాడు శిష్యుడు. ఆ సమాధానానికి గురువు చిరునవ్వు నవ్వి- ‘‘నువ్వే గెలిచావు..’’ అని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు.
చౌరా నీతి
ఇండసీ్ట్రలో టాలెంట్‌ ఉంటే సరిపోదు. దృతరాష్ట్ర ప్రేమ కూడా ఉంటుందని గ్రహించాలి.
ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేది. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్‌ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒరిగిన సాహస శిఖరం -మస్తాన్ బాబు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –


 

నరసింహన్‌ ఇంటికి!

మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్‌!
మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం
రామ్‌ మాధవ్‌కు కేబినెట్‌ బెర్త్‌?
స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన!
పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను తొలగించాలని ఎన్డీయే భావిస్తోందా!? తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి గవర్నర్‌ చాన్స్‌ దక్కనుందా!? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ ముహూర్తం ఖరారైందా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబిస్తున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 9న ఫ్రాన్స్‌ పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా కెనడా, జర్మనీ వెళతారు. తిరిగి 16వ తేదీన ఢిల్లీ వస్తారు. ఆ తర్వాత 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లడానికి ఒకటి రెండు రోజుల ముందే పలు రాషా్ట్రల్లో గవర్నర్ల మార్పు, కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కొత్త గవర్నర్‌ నియామకాన్ని ఖరారు చేస్తారని తెలిపాయి. గత కొద్ది కాలంగా గవర్నర్‌ పనితీరుపై కేంద్రంలోనూ చర్చ సాగుతోందని, దీనికి కొనసాగింపుగానే ఆయన రాజీనామా కోరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. మరో 9 రాషా్ట్రలకు కూడా గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో పంజాబ్‌, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, మణిపూర్‌, బీహార్‌, పాండిచ్చేరి, త్రిపుర ఉన్నాయి. ఇక, కొత్తగా గవర్నర్‌ పదవులు పొందనున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పరును చంద్రబాబు కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే, సీమాంధ్ర నుంచి బీజేపీ సీనియర్‌ నేత ప్రొ ఫెసర్‌ శేషగిరిరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజాని కి, గతంలో విద్యాసాగర్‌రావును నియమించినప్పుడే ఆర్‌ఎస్‌ ఎస్‌ వర్గాలు శేషగిరిరావు పేరును మోదీకి సూచించాయి. రాష్ట్రంలో ఏబీవీపీని నిర్మించడమే కాకుండా పలు పుస్తకాలను ఆయన రచించారు. రెండు రాషా్ట్రలకు చెందిన మేనిఫెస్టోలను కూడా ఆయనే రూపొందించారు. గవర్నర్లుగా బీజేపీ, సంఘ్‌ నేపథ్యం ఉన్న వారినే నియమించాలని మోదీ భావిస్తే శేష గిరిరావుకు అత్యధిక అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. పాలనను మెరుగుపరచడం, మిత్రులను సంతృప్తిపరచడం అనే ద్విము ఖ లక్ష్యాలతో ఈ మార్పులు చేపడతారని చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి మరికొందర్ని తొలగించి వారిని గవర్నర్లు గా పంపవచ్చని తెలు స్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా పేర్లు ఇందు కు వినిపిస్తున్నాయి. ఈనెల 8న మంత్రి వర్గ పునర్వ్యసీ ్థకరణ జరగవచ్చని, శివసేన, పీడీపీ, బీజేపీల నుంచి మరికొంత మందిని చేర్చుకోవచ్చని తెలుస్తోంది. ఎన్ని కలు జరగనున్న బీహార్‌ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తారంటున్నారు. జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించడంతోపాటు అనంతరం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభు త్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన రామ్‌ మాధవ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి స్థానచలనమో, ఉద్వాసనో జరిగే అవకాశాలు లేకపోలేదు. శివసేన నుంచి ఆనంద్‌రావు అడ్సుల్‌, లేదా అనిల్‌ దేశాయ్‌, పీడీపీ నుంచి ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ లేదా తారిఖ్‌ హమీక్‌ కర్రా, బీజేపీ నుంచి షానవాజ్‌ హుస్సేన్‌లకు అవకాశం లభించవచ్చని సమాచారం. రైల్వే శాఖ సహాయ మంత్రి, యూపీకి చెందిన మనోజ్‌ సిన్హా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తదితరులకు కేబినెట్‌ హోదాలో ప్రమోషన్‌ లభిస్తుందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను అప్పగించే అవకాశాలున్నాయి.

గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది!

క్యూ లైన్లలోనే మగ్గుతున్న భక్తులు
అధికారులు, ప్రోటోకాల్‌ అధికారుల యాతన
తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి సంబంధించి ‘గోల గోవిందుడిది.. వేడుక వెంకన్నది’ అనే సామెత ఉంది! భక్తులు ‘గోవిందా గోవిందా’ అనుకుంటూ వెళ్లి ముడుపులు వెంకన్నకు వేస్తారని, అక్కడ ఆయనకే కల్యాణం జరుగుతుందనే అర్థంలో ఈ నానుడి పుట్టింది! కానీ, గవర్నర్‌ నరసింహన్‌ పుణ్యమా అని ఈ నానుడికి మరెన్నో పేరడీలు పుట్టాయి! ‘గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది’ అని అంటున్నారు. ఇందుకు కారణం.. గవర్నర్‌ నరసింహన్‌ రాచమర్యాదలతో శ్రీవారి దర్శనం చేసుకుంటుంటే.. క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు అవస్థలు పడుతున్నారు! అలాగే, ‘గోల అధికారులది.. వేడుక గవర్నర్‌ది’ అనే పేరడీ కూడా ఉంది! గవర్నర్‌ వస్తున్నారంటే తహసిల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ నుంచి తిరుమల జేఈవో వరకూ అటెన్షన్‌లో ఉండాల్సి రావడమే ఇందుకు కారణం! అంతేనా.. ‘నిధులు ప్రజలవి.. వేడుక నరసింహన్‌ది’ అని కూడా ప్రచారంలో ఉంది. ప్రజా ధనాన్ని ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు పెట్టుబడిగా వాడుకోవడమే ఇందుకు కారణం! తిరుమల శ్రీనివాసుడి దివ్యరూపాన్ని ఎన్నిసార్లు.. ఎంతసేపు చూసినా తనివి తీరదని చెబుతూ ఉంటారు. అందుకే, తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే, ఏడాదికో ఆరు నెలలకో ఒకసారి చుట్టం వస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆనందం. కానీ, అదే పనిగా వస్తూ ఉంటే ఎంత దగ్గరి వాళ్లకు అయినా విసుగు పుడుతుంది. గవర్నర్‌ నరసింహన్‌ తిరుమల పర్యటనలకు సంబంధించి ఉద్యోగులు, భక్తుల్లో ఇటువంటి భావనే వ్యక్తమవుతోంది. సంప్రదాయబద్ధంగా తిరుమలకు వచ్చే నరసింహన్‌ను తొలి రోజుల్లో భక్తులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారిపై ఆయనకున్న అచంచల భక్తిని చూసి మురిసిపోయారు. అయితే, ఆయన పదే పదే తిరుమలకు వస్తుండడంతో సేవలు చేయలేక కొందరు, గంటలకొద్దీ నిరీక్షించలేక మరికొందరు నొచ్చుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి దాకా ఏ గవర్నరూ రానన్నిసార్లు తిరుమలను దర్శించుకున్న గవర్నర్‌గా నరసింహన్‌ రికార్డు సృష్టించారు. దేవదేవుడిపై ఆయనకున్న భక్తి ఎంత తీవ్రమైనదంటే ఒకే నెలలో మూడు నాలుగుసార్లు తిరుమలకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల ఒకసారి గవర్నర్‌ తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాతి రోజు అప్పట్లో బెంగాల్‌ గవర్నర్‌, నరసింహన్‌కు సన్నిహితుడు ఎంకే నారాయణన్‌ వచ్చారు. దాంతో తర్వాత రోజు మళ్లీ నరసింహన్‌ తిరుమల వెళ్లి ఆయనతోపాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పోటెత్తే పర్వదినాల్లోనూ మందీ మార్బలంతో ఆయన శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి.
అధికారుల వేల పని గంటలు వృధా
ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. ఆయన కాన్వాయ్‌లో మూడు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లు, ఒక పైలెట్‌ వాహనం, రెండు టైలెండ్‌ వాహనాలు, రెండు ఎస్కార్ట్‌ వాహనాలు ఉంటాయి. వీటిలో పోలీసులు, రిజర్వు పోలీసులు, సీఐ స్థాయి అధికారులు ఉంటారు. ఒక అంబులెన్స్‌, ఒక రక్తనిధి వాహనం ఉంటుంది. వీటిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు ఉంటారు. గవర్నర్‌ రాత్రి బస చేస్తే పదిమంది గార్డులు కాపలా ఉంటారు. ఒక్కో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు గవర్నర్‌ వచ్చినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకు మరో పని ఉండదు. టీటీడీలో ఈవో లేదా జేఈవో స్థాయి అధికారులు గవర్నర్‌ వెంట ఉంటారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ వరకు అందరూ ఒకరోజు ముందు నుంచే తిరుమలలో తిష్టవేసి గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. గవర్నర్‌ వరుస పర్యటనల కారణంగా అత్యంత బిజీగా ఉండే ఈ అధికారుల పని గంటలు అన్నీ వృథా అవుతున్నాయి. గవర్నర్‌ పర్యటన సందర్భంగా సుమారు 70 మంది రాష్ట్ర ఉద్యోగులు ప్రొటోకాల్‌ విధుల్లో ఉంటారు. పరోక్షంగా ఈ సంఖ్య మరీ ఎక్కువ. వీరందరికీ టీఏ, డీఏ చెల్లించాలి. వాహనాలకు ఆయిల్‌ ఖర్చులు ఇవ్వాలి. తిరుమలలో బస, భోజన ఖర్చులు అదనం. గవర్నర్‌ వచ్చారంటే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు రుయా ఆస్పత్రి నుంచే వెళ్లాలి. అసలే డాక్టర్ల కొరతతో కునారిల్లుతున్న రుయా ఆస్పత్రిలో వీవీఐపీలు వచ్చారంటే ఇక ఆరోజుకు ఓపీలకు హాలిడే ప్రకటించినట్లే!
ఈ విషయం తెలియక ఆస్పత్రికి వచ్చే రోగులకూ ఇబ్బందులు తప్పవు. ఇక, రుయా ఆస్పత్రికి ఉన్నది ఒక్కటే అంబులెన్స్‌. అది కాస్తా వీవీఐపీల వెంట వెళితే ఇక ఆరోజు ప్రాణాపాయ స్థితిలోని రోగులు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా వాహనదారుల ఇక్కట్లు చెప్పాల్సిన పని లేదు. నగరంలో ఎక్కడైనా రోడ్డు బ్లాక్‌ చేస్తే, ‘గవర్నర్‌ వచ్చాడేమో’ అని అంటున్నారంటే ఆయన రాక జనం దృష్టిలో ఎంత అసహనాన్ని సృష్టిస్తోందో ఊహించుకోవచ్చు.
తిరుమలకు 37 సార్లు.. దర్శనానికి 60 సార్లకుపైగా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ఒకే పర్యటనలో రెండుసార్లు (సాయంత్రం, ఉదయం), ఒక్కోసారి మూడుసార్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు. నరసింహన్‌ సాధారణంగా సాయంత్రం, ఉదయం దర్శనాలకు వెళుతూ ఉంటారు. దాంతో, ఆరోజు రాత్రి ఆలయం మూసివేసేలోగా శ్రీవారిని దర్శించుకొని బయటపడాల్సిన వేలాదిమంది భక్తులు… గవర్నర్‌ వంటి వీవీఐపీల కోసం క్యూలైన్లు నిలుపు చేయడంతో ఆ రాత్రికి దేవదేవుని దర్శనం కాకపోగా మరుసటి రోజు ఉదయం సర్వదర్శనం ఆరంభమయ్యే వరకు (శని, ఆది, సోమ వారాల్లో 7 గంటల వరకు, మంగళ, బుధ, గురు వారాల్లో 9 గంటల వరకు, శుక్రవారం 10 గంటల వరకు) క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇక, గవర్నర్‌ వస్తే ఘాట్‌ రోడ్డు ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవు. గవర్నర్‌ వాహనం కొండెక్కే వరకు అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తారు. కొండ దిగే సమయంలోనూ ఇంతే. అలిపిరిలో అర్ధగంట వాహనాల రాకపోకలు నిలిపితే ఆ ప్రభావం కొండెక్కే యాత్రికులపై సుమారు గంటన్నర ఉంటుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరతాయి. తనిఖీలు ముగించుకొని టోల్‌గేటు దాటే సమయానికి కొండ కిందే యాత్రికులకు దేవుడు కనిపిస్తాడు!

విజ్ఞత అంటే అదీ..!

తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే ఆ వెనువెంటనే గుర్తుకొచ్చే పేరు మరొకటి ఉంది. అదే శంకర్‌ దయాళ్‌ శర్మ. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించిన వివాదరహితుడు ఆయన. తన పదవీ కాలంలో అనేక పర్యాయాలు తిరుమలేశుని దర్శించుకుని రికార్డులకెక్కారు. ఒకరోజు ఆయన రాష్ట్రపతి హోదాలో తిరుమలేశుని దర్శించుకుని, తిరిగి వెళుతూ తిరుపతి విమానాశ్రయంలో విలేకరులను హడావుడిగా పిలిపించారు. ఇందుకు కారణం అంతకు ముందురోజు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనమే. శంకర్‌ దయాళ్‌ శర్మ తరచూ తిరుమలకు వస్తుండడంతో భక్తుల ఇబ్బందులను అందులో వివరించారు. దాంతో, సదరు పత్రిక ప్రతినిధి తనంతట తానే సంజాయిషీ ఇచ్చారు. ఆ వార్తను తామంతట తాము రాయలేదని, వార్తా సంస్థ ఇచ్చిన కథనాన్నే ప్రచురించామని, మన్నించాలని కోరారు. అందుకు శంకర్‌ దయాళ్‌ శర్మ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘‘నేను ఫలానా అన్నిసార్లు తిరుమలకు వచ్చారని రాశారు. అది తప్పనుకుంటున్నా. ఇంకా ఎక్కువసార్లే వచ్చాను. బహుశా, మీరు గమనించలేదేమో! ఇప్పుడు నేను మీడియాను పిలిచింది ప్రజలకు క్షమాపణ చెప్పడానికి. స్వామివారంటే నాకు వల్లమాలిన భక్తి. రాకుండా ఉండలేను. చనిపోయాక ఎలాగూ రాలేను కదా! బతికున్నన్నాళ్లు ఆయనకు సేవ చేసుకుందామనే వస్తున్నా. అధికారం ఉందని దర్పం చెలాయించడం లేదు. నావల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్న విషయాన్ని నేను గుర్తించాను. అందుకే మీ ద్వారా భక్తకోటికి క్షమాపణ చెప్తున్నా. అలాగే, టీటీడీ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను దర్శనానికి వచ్చినప్పుడు క్యూను ఆపవద్దు. మహా అయితే, గర్భ గుడిలో ఉన్న రెండు మూడు నిమిషాలు మాత్రం ఆపి, మిగతా సమయాల్లో యథావిధిగా భక్తులను అనుమతించండి. ఘాట్‌ రోడ్డులోగానీ, క్యూలోగానీ భక్తులెవరికీ అసౌకర్యం కలిగించవద్దు. దయచేసి ఇకపై నా కారణంగా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. తాను మాత్రమే కాకుండా తన సతీమణి విమల కూడా భక్తులకు అసౌకర్యం కలుగుతోందని తెలిసి నొచ్చుకున్నారని, ఇకపై భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. శర్మ ఆ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అదీ ఒక విజ్ఞత గల రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన లక్షణమని వ్యాఖ్యానించారు.


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్నేహం – ఓ త్రికాల వేదం – ఈ బందా నాదం.

img078

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మారణకాండలో వెలసిన మానవత్వం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

scan017

 

0001 0002 0003 0004

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్

పరిచయం

ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు  తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన పాత్రల్లకు భిన్నం గా సర్వ  సాధారణం గానే ఉంటాయి . సంప్రదాయానికి బద్ధుడుగా కనిపిస్తాడు అంగీకరించిన నిజాలకు నిజరూపాలుగా మాత్రలను మలిచిన నేర్పు ఇబ్సెన్ స్వంతం .కాని19 వ శతాబ్దపు చివరి భాగం లో  ఇవే మిరుమిట్లు గొలిపాయి ఊహాతీత విజయాలకు కారణమయ్యాయి .

సంకీర్ణ కుటుంబనేపధ్యం

హెన్రిక్ ఇబ్సెన్ 20-3-1828ననార్వే దేశపు దక్షిణభాగాన ఉన్న స్కీన్ లో జన్మించాడు .అతని కుటుంబం స్కాండినేవియన్, ట్యుటోనిక్,  గేలిక్ మిశ్రమ సంజాతం .తండ్రి తరపు పూర్వీకుడోకాయనడేనిష్ జాతికి చెందిన  నౌకా కెప్టెన్ .ఇంకోకాయన స్కాటిష్  రక్త సంబంధీకుడు.తల్లి జర్మన్ జాతికి చెందింది .మొదటి నుండీ ఇబ్సెన్ కుటుంబం సంపన్న తరగతికి చెందిన వారే . ఇబ్సెన్ తండ్రి సమాజం లో గౌరవ ప్రతిష్టలున్న ముఖ్య వ్యక్తీ .ఆర్ధికంగా సుస్తిరుడు .

తండ్రి దివాలా –కుటుంబ ఆర్ధికం చిద్రం

దురదృష్ట వశాత్తు ఇబ్సెన్  ఎనిమిదవ ఏట తండ్రి దివాలా తీశాడు .భవిష్యత్తు కోసం వేసిన ప్రణాలికలు దెబ్బతిని జీవితం అంధకార బందురమైంది .గత్యంతరం లేక విలాస వంతమైన భవనం నుండి కుటుంబాన్ని మురికి కూపం గా ఉండే వ్యవసాయ క్షేత్రానికి  మార్చాల్సి వచ్చింది . కుర్రాడైన ఇబ్సెన్ మనస్సులో ఈ ఆర్ధిక కల్లోలం ,అసమానత ముద్రగా పడ్డాయి .వీటినే ఆధారం గా చేసుకొని తార్వాతి కాలం లో .’’డాల్స్ హౌస్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’’’దివైల్డ్ డక్ ‘’నాటకాలు రాశాడు .

మందులషాపు లో పని –సెటైర్ కవిత్వ రచన

తండ్రి అసమర్ధత పై ఇబ్సెన్ కు కోపంగా ఉండేది. కుటుంబ పునాదులు కూలి పోవటానికి తండ్రే కారణం గా భావించాడు .

ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు .ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన దాఖలాలు లేవు .16 ఏళ్ళ వయసులో గ్రిం స్టాడ్ చేరాడు .ఇది నార్వే లో దక్షిణ తీరపు చిన్న నౌకాశ్రయం .అక్కడ మందుల దుకాణం లో అప్ర౦టిస్ గా చేరాడు. అయిదేళ్ళు అక్కడే ఉండి కవిత్వం రాశాడు .అందులో గ్రామస్తుల ప్రవర్తనపై సెటైర్  దట్టించేవాడు .పోయిన కుటుంబ ప్రాభవం మరలా దక్కాలని ఆశించేవాడు .తనకన్నా పదేళ్ళ పెద్దదైన పని అమ్మాయికి కడుపు చేసి ఒక బిడ్డకు తన 18 ఏట జన్మనిచచ్చి తండ్రి అయ్యాడు .ఇది తెలిసిన కుటుంబం మండిపడింది .ఉత్తర ప్రత్యుత్తరాలు బందయ్యాయి .ఇబ్సెన్ ను సాంఘిక బహిష్క్రుతుని చేసింది కుటుంబం  . బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించినా జీవితాతం ఈ తప్పు అతన్ని  వెంబ డిస్తూనే ఉంది  గిల్టీగా ఫీల్ అయ్యేవాడు

తిరుగు బాటు –నాటక ప్రక్రియ –దర్శకత్వం

సంప్రదాయ జీవనం లో ఇబ్సెన్ చేసింది తప్పు అయింది. అందరు అతన్ని ద్వేషించ సాగారు దీ.నితో సంఘం పై తిరుగు బాటు చేశాడు మెజారిటీ తీరకుండానే  .ఈ భావాలతో తాను కీర్తి పొందాలని ‘’కేటిలిన్ ‘’అన్న నాటకం రాశాడు .పెద్దగా ఆదరణ పొందక పోయినా అతని భావావేశాలకు నిలయమైంది .ఒక స్నేహితుడు దీన్ని ప్రింట్ చేశాడు .ఎవరూ కొనలేదు .చిత్తుకాగితాల క్రింద అమ్మేయాల్సోచ్చింది .దీనిపై స్పందిస్తూ ఇబ్సెన్ ‘’ఒక రచయిత ఈ రకంగా కూడా డబ్బు సంపాదించి పోతట్టగడుపుకోవచ్చునని ఆడబ్బుతో తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేసుకో వచ్చు నని తెలిసింది ‘’అని చమత్కరించాడు . ఈ సంఘటన అతనిని క్రిస్టియానా కు వెళ్ళేట్లు చేసి యూని వర్సిటీలో చేరటానికి  దోహద పడింది .పరీక్ష’’గుంట కొట్టి గంట వాయించింది ‘’లాభం లేదని జర్నలిజం వైపు కదిలాడు .ఇరవై మూడవ ఏట నార్వీజియన్ నాటకశాల మేనేజర్ గా ఉద్యోగం లో చేరి బీదరికపు అ౦చులనుండి బయటపడ్డాడు ఇబ్సెన్ .క్రమంగా డైరెక్టర్ అయ్యాడు .34 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే అదే పదవిలో క్రిస్టి యానాలో ఉన్నాడు .

పెళ్లి-నాటక ప్రయోగం –నేచురల్ రైటర్

29 వ ఏట సుసానా తోరేసేన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక గొప్ప రచయిత కు మారుటి కూతురు .ఇబ్సెన్ నాటక రచనలో ప్రయోగాలతో బిజీ గా 25 ఏళ్ళ వయసు నుండి 34 వ ఏట వరకు గడిపాడు .అరడజను జానపద నాటకాలు రాశాడు .దీనితో స్వాభావికత కు అద్దంపట్టి ‘’నేచురల్ రైటర్ ‘’గా పేరు తెచ్చుకొన్నాడు . వీటిలో  హీరోయిజం ఎక్కువ .రొమాంటిక్ టచ్ కూడా జోడించాడు .వీటిలో ‘’లవ్స్ కామెడి ‘’ఒక్కటి మాత్రమె ఇబ్సెన్ ప్రతిభకు నిదర్శనం గా నిలిచింది .ఇదులో ప్రేమ ,పెళ్లి ల  ఐరని ఉండటం కొత్త గా అనిపిస్తుంది .సెటైర్ ,సెంటిమెంట్ ,త్యాగం వగైరాలన్నీ ఉన్నాయి .

దియేటర్ ,ఆదాయం లేని డైరెక్టర్ ,రచయిత

35 ఏళ్ళు వచ్చాయి .డైరెక్టర్ అని పించుకోన్నాడుకానిస్వంత దియేటర్ మాత్రం లేదు . దాని వలన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే పరిస్తితి మాత్రం పూజ్యం .తండ్రిగా ,పుట్టిన కొడుకు పోషణ,రచయితగా ఏది రాసినా చూసే వారు కరువైన స్థితి .ఇక ఇక్కడ ఉండటం నిరర్ధకం అనుకొన్నాడు .జెండా పీకాలని పించేసింది .తన సృజనకు ఇక్కడ ఆదరణ లేదని ఇక్కడి జనం హృదయాలు ఇరుకు మురికి కూపాలని అనిపించింది .సరాసరి రోమ్ నగరానికి చేరుకొన్నాడు .

రోమ్ నగర అనుభవం

రోమ్ చేరి అయిదేళ్ళున్నాడు.జీవన భ్రుతికోసం నాటకాలు రాసిపారేస్తూనే ఉన్నాడు .డ్రమాటిక్ పోయెం ,పోయేటిక్ డ్రామా లను రాశాడు .ఇబ్సెన్ కొత్త ఆగంతకుడు . అతని వేషం ఆహార్యం జనాలకు నచ్చాయి .’’నత్త తన గుల్ల లోకి శరీరాన్ని ముడుచుకున్నట్లు ‘’కనిపించేవాడని చూసిన వారన్నారు .బిగ్గరగా మాట్లాడితే మాత్రం చీకటి లో  చెట్టు మీద  కూర్చుని బిగ్గరగా కూసే గుడ్ల గూబ అరుపులా వినిపించేదిట.రోమ్ చేరిన కొత్తలో రెండు  ప్రసిద్ధ నాటకాలు’’ బ్రాండ్ ‘’ పీర్ గింట్ ‘’లు రాసి ప్రదర్శించి మాస్టర్ పీసెస్ అని పించుకొన్నాడు .ఇదే మొట్టమొదటి విజయం .రెండిటిని వచనం లోనే రాశాడు .కాని ఆర్ధికం గా గిట్టుబాటు కాలేదు .తర్వాత ‘’ఆల్ ఆర్ నధింగ్ ‘’కర్క్ గార్డ్ రాసిన ‘’యైదర్ ఆర్’’కు సమానం అన్నారు .కొందరు  బ్రాండ్ నాటకం కర్క్ గార్డ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిందే అన్నారు .పీర్ గింట్ మాత్రం బ్రాండ్ కు వ్యతిరేకం .ఇది చట్టం న్యాయం లేని మనసుకు ఏది తోస్తే అది చేసే పాత్ర . బ్రాండ్  మాత్రం ఇబ్సెన్ నడవడికలో ఉన్నదే అన్నారు .ఆయనా దాన్ని ఒప్పుకొన్నాడు. బ్రాండ్ తన భావాలను ఆడ మగా అందరిపై రుద్దే స్వభావం ఉన్న పాత్ర .పీర్ గింట్ మాత్రం తన భావాలను తనలోనే ఉంచుకొనే పాత్ర .

జర్మనీ యాత్ర-  ప్రపంచ చారిత్రాత్మక నాటకం

రోమ్ వదిలి నలభై వ ఏట జెర్మనీ చేరాడు ఇబ్సెన్ .మ్యూనిచ్ లో కాపురం .అప్పుడప్పుడు ఇటలి వెళ్లి వచ్చ్చేవాడు .డ్రెస్ డ్రెయిన్ లో మూడవ కవిత్వ రచన చేశాడు .రోమ్ లో ఉండగా ప్రారంభించిన ‘’ఎమ్పరర్ అండ్ గలీలియన్ ‘’జర్మనీలో పూర్తీ చేశాడు .ఇందులో నాలుగవ శతాబ్దానికి చెందిన పాగానిజం –క్రిష్టియానిటి మతాల మధ్య ఉన్న విద్వేషమే కద.దీన్ని ‘’ప్రపంచ చారిత్రాత్మక నాటకం ‘’అన్నాడు ఇబ్సెన్ .(world historic al drama ) .చారిత్రక నేపధ్యం ఉన్నా నైతిక ఐక్యతను బోధించాడు ఇందులో .మనిషి తనను తానూ నమ్మనంత వరకు ఇతరులను నమ్మలేడు అన్న సిద్ధాంతాన్ని  తెలిపాడు .ఇందులోని పాత్రలన్నీ తమను తాము మోసం చేసుకొని అపరాదులైనవే  .Ibsen was a self divided person .,an idealist who distrusted abstract ideals ,an iconoclastic truth –teller who forced himself to see the destructive power of the truth .’’ అని ఇబ్సెన్ ను ఆవిష్కరించాడోక విమర్శకుడు .

యాభై వయసులో ఈ రకమైన రేటరిక్ రొమాంటిక్ కవిత్వ డ్రామాలను వదిలేశాడు .వాస్తవిక వచన  రచనలపై ద్రుష్టి పెట్టాడు .ఆధునిక ప్రపంచ జీవితం లోని విషయాలను కదా వస్తువులుగా స్వీకరించాడు .ఈ మార్పునే బెర్నార్డ్ షా ‘’exposing the mischief  of idealism ‘’అన్నాడు .ఇక్కడి నుండి ఇబ్సెన్ రచనా ప్రస్తానం కొత్త పుంతలు తొక్కి మార్గ దర్శనం చేసింది.

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

 

షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు

O! how much more doth beauty beauteous seem
By that sweet ornament which truth doth give.
The rose looks fair, but fairer we it deem
For that sweet odour, which doth in it live.
The canker blooms have full as deep a dye
As the perfumed tincture of the roses,
Hang on such thorns, and play as wantonly
When summer’s breath their masked buds discloses:
But, for their virtue only is their show,
They live unwoo’d, and unrespected fade;
Die to themselves. Sweet roses do not so;
Of their sweet deaths are sweetest odours made:
And so of you, beauteous and lovely youth,
When that shall vade, my verse distills your truth.
–William Shakespeare

 

 

 డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం

      ‘’ సత్యమను ముత్య మొకటి ‘’

 సత్య శీలతా లంకార ముత్య మొకటి

సుందరాధికత నొసగు సుందరతకు

ఆ గులాబి ప్రసవమ్ము అంద మేను

కాని రుచిర మనోజ్నమై కానబడును

సౌరభ మిళితమై యున్న కారణమున

కల  దితర పూలకును గాఢమైన రంగు

వేసవిని వాటి మొగ్గలు విచ్చినపుడు

ముళ్ళతో నిండి గాలిలో తేల గలవు

కాని ఆ సుమ శోభ ఆకారమందే !

వరలు గౌరవములు లేక వాడిపోయి

మృతిని చెందు –కాని గులాబి స్థితియె  వేరు

మధురమౌ తన మరణ సమయము నందు

మధురతరమౌ పరీమళమ్ము  మన కొసంగు

అవును –నీ వట్లే సౌందర్య యువ మనోజ్ఞ

అంద చందములన్నియు  డిందు నపుడు

కవితలో నుంతు సత్య సార మంత .

 

Inline image 1    View photo in message

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల కవితా ప్రసాద్”

 ”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల   కవితా ప్రసాద్” 

కవితాప్రసాద్ కవితా విహారం

వచన కవితా విహారం

పద్యమైనా ,వచనకవిత్వమైనా ఆయనకు నల్లేరు పై బండీ నడకే .రెండిటిలోనూ తనప్రత్యేకత చూపి కవితా శిఖరారోహణం చేసిన నిత్య పదికుడు .కొన్ని కవితా నిర్వచనాలు అనితర సాధ్యం గా చేశాడు .కన్నీరు కు అందరూ అనేక రకాలుగా నిర్వచిస్తే కవితాప్రసాద్ ‘’కాల పరీక్ష నాళిక లోకి –కళ్ళు వొంపుతున్న ‘’మనస్సల్ఫ్యూరికామ్లం ‘’అన్నాడు కవిత్వానికి శాస్త్రీయతను అద్దుతూ .మనషి మనస్తత్వాన్నీ అంతే గొప్పగా చెప్పాడు ‘’మనిషి ఒక వస్తువు –మనిషి మహా వ్యాపరం –మనస్సోక మరణ శాసనం ‘’అన్నాడు వ్యాపార ధోరణికి ,విపణి వీధికి మనిషికి ఉన్న సంబంధాన్ని మహా గొప్పగా చెప్పిన మాటలివి . తనను ‘’తెల్లకాగితం ‘’తో పోల్చుకుంటూ ‘నన్ను తనపైకి అనువది౦చుకొనే కవయిత్రి తెల్లకాగితం ‘’అన్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’అది నామనసు –దానిపై పద్యమై శయనిస్తాను .-అక్షర సరస్సు నై వికసిస్తాను ‘’అన్నాడు భావ గర్భితంగా .ఆధునికులకేమాత్రం తీసిపోని కవితా ధోరణి ఇందులో కనిపిస్తుంది .ఏ ప్రక్రియ అయినా దాన్ని తన అవక్ర కవితాపరాక్రమ  ప్రక్రుతి తో  సామర్ధ్యం తో తీర్చిదిద్దగలిగే కవితాత్మ ఆయన సొత్తు .అక్షరాలకు ఏమీ తెలియదని చమత్కరిస్తూ ‘’ఎక్కడో ఒక్కడు  నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటాడు –ఇది చదివి ఇంకోడు గుండె పగిలి చస్తాడు .-అక్షరాలకి ఈ రెండు సంఘటనలూ తెలియవు ‘’అన్నాడు .తిట్టినా ,పొగిడినా వాటికి ఆ తిట్టినవాడూ పొగడిన వాడూ కూడా తెలియదన్నాడు –‘’నువ్వు నన్ను తిడుతున్నా –నిన్ను నేను పొగుడు తున్నా –తిట్లకు ,పొగడ్తలకు –మనమెవ్వరో తెలీదు ‘’అన్నాడు .

తనజీవితాన్ని’’ నీటిపై పడవ’’గా అభి వర్ణించు కొంటూ ‘’ఆశల ఇంద్ర ధనుః పతాకతో –నదికన్నా వేగం గా –గమ్యం వైపుకు దూసుకు పోతోంది నా పడవ –ప్రతి అలా ప్రశ్నార్ధకం గా మారి పోతోంది –ప్రతి కలా ఆశ్చర్యార్ధకం గా రాలి పోతోంది –ఇక నా పడవే తీర రేఖ –నా పాలిటి కాల శాఖ ‘’అన్నాడు ఇందులో ఒక నిర్వేదం ఉంది .తన మృత్యువును ముందే చూసుకోన్నాడా అనే అనుమానం మనకు వస్తుంది .

గ్రంధ ముఖి లో లక్ష పద్యార్చన

‘’ ఫేస్ బుక్ ‘’ను ..గ్రంధ ముఖి ‘’అని కాయినేజ్ చేశాడు .అద్భుతమైన నిర్వచనం .అందులోనూ తన ప్రయోగాలు కొన సాగించాడు. సెల్లు తో సొల్లు కబుర్లు చెప్పే మనందరికీ కనువిప్పు కల్గించాడు కవితా ప్రసాద్ –గ్రంధ ముఖిలో ‘’లక్ష పద్యార్చన ‘’చేయాలని సంకల్పించుకొన్నాడు అదీ 27-2-2014 శివరాత్రి పుణ్య దినాన .అందులో తనకు ప్రశ్నలు సంధించమని కోరాడు . సమస్య ,దత్తపది ,వర్ణన ,అనువాదం ,అప్రస్తుత ప్రశంశ అనే అయిదు అంశాలు ఎన్నుకొన్నాడు .వీటిపై ప్రశ్నలు పంపమని కోరాడు .ఆ ప్రశ్నలుకూడా మానవులకు ఉపయోగ పడేవిగా ,సమకాలీనతకు ప్రతి బింబం గా ,విజ్ఞానం ,ఉత్తమ సంస్కృతీ నిర్మాణ పరం గా ఉండాలని గొప్ప నిబద్ధత పాటించాడు .ఉదాత్త ఆశయానికి సముదాత్త ప్రక్రియ అయింది ఇది .దటీజ్ కవితా ప్రసాద్ –ఆ పద్య మహా యజ్ఞం ఎలా నిర్వహించాలని భావి౦చాడో అందరికి తెలియజేశాడు ఫేస్ బుక్ ద్వారా –

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహా యజ్న వేదికి –దివ్య హవిస్సులిడగ

రసవదమృత   పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య సరస్సు లిడగ

భూమాత హృదయమ్ము పూర్ణ  కుంభమ్మునై –శ్రీంకార రోచిస్సులిడగ’’

ఆ లక్ష పద్య యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతిన బూని ప్రారంభించి 1000  రోజులలో పూర్తీ చేస్తానని అన్నాడు . . దాదాపు సంవత్సరమే ఆ పద్య  సరస్వతీ నది  పారింది .ఆయన  అకాల  మరణం తో ఆగిపోయింది .

కవితాప్రసాద్ మూర్తి మత్వం

కవితా ప్రసాద్ మూర్తి మత్వాన్ని చక్కగా  వర్ణిం చాడొక కవి ‘’అసద్రుస మందహాసము –సమాదర చిత్తము –సత్కవిత్వ మున్ –విషయ వివేకమున్ –విశ్వజనీనత ‘’ఆయన లక్షణాలన్నాడు .నిజం గా ఆ గొప్ప లక్షణాలతో రాణించి వన్నెకేక్కి తనతో బాటు ఆంద్ర కవితా సరస్వతినీ దేశ విదేశాల లో ఊరేగించి చిర యశస్సు సాధించాడు .దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ – మన కొత్త రాజధాని అమరావతి రాక ముందే ‘’అమర పురి ‘’కి చేరాడు .అక్కడ ఇంద్ర సభలో కవితామృతం చిలికిస్తూ అమ్రుతానికే తీయదనాన్ని పవిత్రతను కల్గిస్తున్నాడేమో   !

అవ్యవవావధానం

అవధానాలు పూర్వం చాలా మంది చేశారు ఇప్పుడూ చేస్తున్నారు .కాని ప్రశ్న సంధించిన త్రుటిలోనే అంటే స్విచ్ వేస్తె బల్బు వెలగటానికి పట్టే సమయం కంటే ముందే పద్యం అందుకొనే మహా వేగం ఆయనది. దీన్నే మెరపు వేగం అంటారేమో !ఆ వేగాన్ని ఇంతవరకెవ్వరూ చూసి ఉండలేదు .ఎక్కడా యతి భంగం గతి భంగం  ప్రాసభంగం, ఔచితీభంగం సంస్క్రుతీభంగం కలగ కుండా ఆ పద్య వేగం సాగేది .దీనినేనేను ‘’అవ్యవవావధానం ‘’అన్నాను అదో చిర తపో సాధ్యమైన అమృత ఝరి .ఒక తపస్సు .అమ్మవారి అనుగ్రహం .అందులో మనం మునక లేయాల్సిందే .ఆ అనుభూతి కి లోను కావాల్సిందే .ఒక  అవధాని ప్రశ్న సంధించిన పావు గంటదాకా జిలేబీ చుట్ట రాగాలు తీసి ఏమీ తట్టక ఏదో పొడి మాటలతో ప్రారంభించి పాదం పూర్తయ్యే లోపు ఎన్నో సవరణలు చేసి మన బుర్ర తినటం చూశాం .ఒకాయన పద్య పూరణ వేగంగానే చేస్తాడు కాని ఆ పద్యం చదివే తీరు మనకే కాదు  బహుశా ఆయనకూ అర్ధం కాని రీతిలో ఉంటుంది .యువ అవధానులూ బాగానే చేస్తున్నారు .సహస్రావాదాన  సమ్రాట్టులూ ఉన్నారు .కాని పద్యం ఇంతహుందాగా ఇంత వేగం గా ,ఇంత సందర్భ శుద్ధిగా  చెప్పినవారు లేరు అంటే అతిశయోక్తి కాదు .ఎక్కడా సహనం కోల్పోవటం ఉండదు .యెంత క్లిష్ట ప్రశ్న వేసినా నవ్వుతూనే చిక్కుముడి విప్పటం ఆయనకే చెల్లింది .అప్రస్తుతం యెంత అప్రస్తుతం అయినా సంయమనం  కోల్పోవటం ఆయన అవధాన చరిత్రలో లేనే లేదు .ఆ చిరు దరహాసమే అందరికీ వందనీయమై  శ్లాఘనీయమైంది .ఆ నవ్వులో మనకు అమ్మవారి దర్శనం కలిగిస్తాడు ..అదీ కవితా ప్రసాద్ ప్రత్యేకత .ధారణలోను ఆయనది ప్రత్యేకమైన శైలి .ధారణా రాక్షసులున్నకాలం లో వారిని మించిపోయిన ధారణా సామర్ధ్యాన్ని చూపి వారి చేతనే ప్రశంశా వర్షం లో తడిసిన’’ధారణా పరబ్రహ్మ ‘’. ధన్య జీవి కవితా ప్రసాద్ . గంటకు ౩౦౦ పద్యాలు చెప్పాలనే దాన్ని ఛాలెంజీ గా తీసుకొని  పద్య కవితాప్రవాహం పారించిన ఆశుకవితా సమ్రాట్ కవితాప్రసాద్ .పట్టు బట్టలు సంప్రదాయ బద్ధం గా కట్టి ముఖాన యెర్రని కుంకుమ బొట్టు ధరించి బాసిం పట్టు వేసి అవధానానికి కూర్చుంటే ఎన్ని గంటలైనా ఆ తీరు మారేదికాదు .వెనకా ముందూ బాలీసులు తలగడల సీన్లు ఉండవు సర్వ సాధారణ క్రియగా అదొక సరస్వతీమాత  అర్చన గా జరపటం ఆయన ప్రత్యేకత .

శతాధిక గ్రంధ రచన

అవధానాలు చేయటం తో సరి పుచ్చుకోకుండా ‘’అవధాన విద్య ఆరంభ వికాసాలు ‘’వంటి గ్రంధాలు ,అగ్నిహంస ,ఒంటరి పూల బుట్ట ,దోసిట్లో భూమండలం ,వంటి ఆధునిక భావ జాల గ్రంధాలు ,తను నిత్య౦ అర్చించే   జగన్మాతపై ‘’కాదంబినీ ‘’శతకం ,ఏడుకొందలవానిపై భక్తీ ప్రపత్తులతో చెప్పిన ‘’సప్తగిరిదామ –కలియుగ సార్వభౌమ ‘’వంటి భక్తీ శతకాలతో బాటు వందకు పైగా గ్రంధాలు రాసి సాహితీ సృష్టి లోను అద్వితీయుడని పించుకొన్నాడు ..ప్రతిభా వ్యుత్పత్తి సామర్ధ్యం ముప్పిరిగొన్న కవితా పటిమ కవితా ప్రసాద్ కున్నది

కవితా ప్రసాద్ ఎదుగుదల క్రమం

కృష్ణా జిల్లా నెమలి వేణుగోపాల స్వామి దగ్గర గంపలగూడెం సమీపం లో ‘’గానుగ పాడు ‘’లో జన్మించిన వరప్రసాద రాజు 7 వ ఏటనే పద్య రచన ప్రారంభించి 18 వ ఏట భద్రాచలం లో మొదటి  అష్టావధానం చేశాడు .నెమలి స్వామి సమక్షం లో అవధానమూ చేసి స్వామిపై శతకమూ చెప్పాడు .తర్వాత బందరులో బి ఇ డి కాలేజి లో చదివి భద్రాచలం నెల్లిపాక లో లేక్కలమేస్టారుగా పని చేశాడు .పి ఐ బి లో ఉద్యోగం పొంది ,ప్రకాశం జిల్లా డి ఎస్ .డబ్ల్యు బి .గా పని చేసి హాస్టల్ విద్యార్ధులకు ఆరాధ్య దైవమే  అయ్యాడు .తర్వాత విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా అవినీతి అధికారుల భరతం పట్టి అసెంబ్లీ చేత  ప్రశంసలు  అందుకొన్నాడు .రెసి డేన్షియల్ హైస్కూల్స్  సొసైటీ కి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు .పిమ్మట వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ గా చేశాడు .తర్వాత ఆంద్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు కార్య దర్శిగా గొప్ప సేవలు అందించాడు .ఇన్ని పదవులలో ఉన్నా అవధానాలు మానలేదు .పద్యాన్ని కవిత్వాన్ని వదిలి ఉండలేదు .మరింతగా విజ్రు౦భి౦ఛి చేశాడు ..

కృష్ణా జిల్లా కవితా కళా సమ్రాట్

కవితా  ప్రసాద్ చేత తొలి శతావధానం ,ద్విశాతావధానం చేయించిన ఘనత కృష్ణా జిల్లాకే దక్కింది .ముఖ్యం గా శ్రీ రావి రంగారావు కవితాప్రసాద్ కు బి ఇ డి కాలేజి లో టీచర్ .ఆ గురు శిష్య సంబంధం కృష్ణా జిల్లాకు ఏంతో  ఉపయోగపడింది .ప్రసాద్ చేత రంగారావు గారు చేయి౦చినవే శత ,ద్విశతావదానాలు .శతావధానం బందరు లో జరిగింది .కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని సాహిత్య సంస్థలలోని సభ్యులు రంగారావు గారు ప్రుచ్చకులను గా ఎంపిక చేసి శిక్షణ నిచ్చి అవధానం అత్యద్భుతం గా జరిగేట్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు .అంటే కవి అనుకొన్న ప్రతి వాళ్ళూ ప్రుచ్చకులైనారు .సాహిత్యాభిమానం ఉన్న వారు అవధానం పై మోజున్నవారందరూ ప్రుచ్చకులైనారు .ఇది కృష్ణా జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం .ఒక రకం గా ప్రతి ఇంటా ఒక ప్రుచ్చకులున్నట్లయి౦దన్నమాట .ఇది రంగారావు గారి చొరవ కవులతో సాహిత్య సంస్థల తో ఆయనకున్న అనుబంధానికి నిదర్శన .శిష్యుడైన కవితా ప్రసాద్  కవితా సామర్ధ్యానికి బల పరీక్ష పెట్టి నిగ్గు తేల్చటం .దీనికి సహకరించిన బందరు లోని చలమల శెట్టి వంటి వారెందరో వదాన్యులు ఏంతో అభినందనీయులయ్యారు .రెండు రోజులు సాగిన ఈ అవధానం ధారణ రోజున శ్రీ ప్రసాద రాయ కులపతుల వారి సమక్షం లో జరగటం ఒక దివ్యాను భూతి. ఆయనిచ్చిన ప్రశంశలు చిర స్థాయి గా నిలిచాయి .ఇందులో నేనూ ఒక ప్రాశ్నికుడిగా ఉండటం నా అదృష్టం .కవితాప్రసాద్ గారిఅవధానం తో నాకు సంబంధం కలుగ జేసిన రావి రంగారావు గారి సౌజన్యమే ఇది .కవితా ప్రసాద్ అవధాన మరంద ధారలోతడిసి ముద్ద అయిన అనుభవం నాది .

ద్విశతావదదానం కూడా రంగారావు గారి ఆధ్వర్యం లో బెజవాడలో జరిగింది .కవితా ప్రసాద్ ధారణ  ధారణా రాక్షస బిరుదాంకితులు సహస్రావధాని శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి సమక్షం లో జరగటం చిరస్మరణీయం .తెలుగు సరస్వతికున్న రెండు సూర్య చంద్ర నయనాలు వేదికపై దర్శనమివ్వటం  సాహితీ అభిమానులకు గొప్ప అనుభూతి .ఈద్విశతావధానం లో నాతో బాటు నా శ్రీమతి ప్రభావతి కూడా ప్రుచ్చకురాలవ్వటం రంగారావు గారి కి నాపై ఉన్న అభిమానం .ఆమెలాగా మరెందరో రెండు అవధానాలకు ప్రుచ్చకులయ్యారు .అదొక గొప్ప ప్రేరణ .అవధానం పై అందరికి ఆసక్తి కల్గించటం లో వేసే ముందడుగు .ఈ అవధానం లో మరీ సన్నిహితుడినయ్యాను అవధాని గారితో .అయన కేదో బిరుదునూ సెలెక్ట్ చేశాం నేనూ రంగారావు గారూ .అది ఇచ్చారో లేదో నాకు గుర్తు లేదు .ఈ సారీ కృష్ణా జిల్లా పృచ్చకులు సింహ భాగం పొందారు .ఇలా రెండు అవధానాలలో చాలా మందిని ప్రుచ్చకులను చేసిన సౌజన్యం రావి వారిదే .కనుక వీరందరూ ప్రసాద్ గారి అభిమానులైనారు .అదొక అపూర్వ సన్నివేశమే అయింది అందుకనే కృష్ణా జిల్లా వారు అవితా ప్రసాద్ గారంటే అంతటి అభిమానం చూపించటం .అందరం కృతజ్ఞతా భావం చూపించాల్సిన అవసరం కూడా ఉంది .

బహుముఖీన ప్రజ్ఞ

ఆ తర్వాత ఇతర జిల్లాల లో,రాష్ట్రాలలోవి దేశాలలో ఎన్నో అవధానాలు చేసి లబ్ధ ప్రతిష్టితులయ్యాడు కవితా ప్రసాద్ .దాదాపు 500 అవధానాలు చేసిన అవధాన ఘనాపాటి శ్రీ కవితాప్రసాద్ .ఏది చేసినా ఆయన ద్రుష్టి యువత మీదే ఉండేది .వారిని సాహిత్యం వైపు ఆకర్షించటానికి ఆయన చేసిన కృషి అనన్య సాధ్యమైంది .అవధానాలపై వారికి అవగాహన కల్పించారు .యువ ప్రుచ్చకులను ఆహ్వానించారు వారికి ట్రైనింగ్ ఇచ్చారు.ఇన్ని విశేషాలు మూర్తీభవించిన వ్యక్తీ .బహుముఖ  ప్రజ్ఞా శాలి .మూర్తీభవించిన చైతన్యం .ప్రభుత్వపదవులను అత్యంత సమర్ధత తో నిర్వహించి ప్రజలకు చేరువయ్యాడు .అవధాన ప్రక్రియ లో ఆధునికతను జోడించి ,యువతకే కాక అన్ని వయసులవారికీ దగ్గరయ్యాడు .ఒక రకం గా ‘’విశ్వం పట్ట లేనంత అవధాన సరస్వతి ‘’.అంతటి వాడు మన కృష్ణా జిల్లా వాడు కావటం మనకందరికీ గర్వకారణం .ఆయన సమకాలీనులం గా మనం ఉండటం మన అదృష్టం

ఎన్నెన్ని ప్రక్రియలో

అష్టావధాన ,నవరసావదాన ,అల౦కార అష్టావదాన ,సాహిత్య ప్రక్రియావదాన,అపూర్వ దశావదాన ,విచిత్రావదాన ,శతావధాన ద్విశతావధాన ,ఆశుకవితా ఝరి అంటే గంటకు ౩౦౦ పద్యాలు చెప్పటం ,రేడియో అవధానం ,పలకరిస్తే పద్యం లలో ఎన్నో ప్రయోగాలు చేసి అందర్నీ అప్రతిభులను చేసిన ప్రక్రియా వై విద్యం చూపిన మహా ఆలోచనా పరుడు కవితా ప్రసాద్ .కవిత అమ్మవారి చేత ప్రసాదంగా పొందిన ధన్యుడు .అందుకే అమ్మవారిపై ‘’త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యేడిన్ ‘’ అనే మకుటం తో ‘’కాదంబినీ ‘’శతకం రాసి అమ్మవారికి కవితా నైవేద్యం గా సమర్పించాడు .’’సప్తగిరి ధామ –కలియుగ సార్వ భౌమ ‘’మకుటం తో ‘’ ఏడు కొండల వానిపై శతకం రాసి ఆత్మ నైవేద్యం చేసిన పరమ భాగవతోత్తముడు కవితా ప్రసాద్ .ఇందులో ఒక పద్య భాగం –‘’వేయి కన్నుల వానికే యగమ్యము తాను-నీరూప తతులు ననేక మాయే ‘’ఇందులో ‘’నీరూప ‘’అనే శాబ్దిక  చమత్కారాన్ని చేశాడని –నిర్ +రూప = నీ రూప  అవుతుందని అంటే రూపమే లేనివాడు అనేక రూపాలు పొందాడని భావం అని ఆచార్య శలాక రఘునాధ శర్మ గారు విశ్లేషించి చెప్పారు .ఈ పద ప్రయోగానికి ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి  భాషా వ్యాకరణాలపై పట్టూ ఉంటేనే సాధ్యం అన్నారాయన .అదీ కవితా ప్రసాద్ కవితా లోతు .

భువన విజయ రాయలు

ఎన్నో భువన విజయాలు వివిధ సందర్భాలలో ప్రదర్శించి తానూ శ్రీ కృష్ణ దేవరాయల పాత్ర పోషించి ఉదాత్త భావగర్భిత ఆశుకవిత్వాన్ని చెప్పి అందరిని సంభ్రమాశ్చర్యాలతో ము౦చేసేవారు .అలాగే అమర సభలోను ఇంద్రుడిగా రాణించారు  .శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాన్ని శ్రీకాకుళం లో ప్రతిస్టిం చటానికి ,కృష్ణా జిల్లా వైభవ సభలు జరపటానికి ఆయనదే ముందడుగు .

ప్రత్యక్ష వ్యాఖ్యానాలు

కృష్ణా గోదావరీ పుష్కరాలకు ,వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు భద్రాద్రి శ్రీరామ నవమికి ఎన్నో సార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసి భక్తీ భావ లహరి ప్రసరింప జేశారు. వ్యాఖ్యాలకు గొప్ప స్థాయి కల్పించారు .కృష్ణా పుష్కరాలకు దగ్గరుండి కృష్ణా మహోత్సవాలు నిర్వహించారు .ఏ విషయాన్నైనా అలవోకగా యెంత సేపైనా ఏ ఆధారం చేతిలో లేకుండా ఎన్నో ఉదాహరణ లిస్తూ పద్యాలు శ్లోఆలు మంత్రాలు ఉదాహరిస్తూ లోతులు తరుస్తూ చెప్పగలిగే సామర్ధ్యం కవితా ప్రసాద్ ది.గాత్రం మధురం కాయం మధురం మధురాతి మధురం కవితా ప్రసాద్ హృదయం .

పురస్కారాలు –బిరుదులు

అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్  ,అష్ట దశావధాని ,ద్విశతావధాని బిరుడుల౦దుకొన్నారు కవితా ప్రసాద్ .ఇవి ప్రతిభకు తగిన పురస్కారాలు .2000లో ముఖ్యమంత్రి పురస్కారం , 2005 లో ప్రతిభా పురస్కారం ,విజయవాడలో స్వర్ణ కంకణ ధారణ ,మచిలీ పట్నం లో కనకాభిషేకం ,గుంటూరు లో కులపతుల వారిచే కనకాభిషేకం పొందారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు రూప శిల్పి కవితా ప్రసాద్ .ప్రభుత్వం నుండి గణనీయం గా ఆర్ధిక సాయం అందజేయించి రాష్ట్ర సాంస్కృతిక శాఖా కార్య దర్శిగా బాధ్యతను గణనీయం గా నిర్వహించి సాహిత్యాభిమానుల మన్ననలు అందుకొన్నారు .

ఆ నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇంట్లో కవితాప్రసాద్ ‘’ఆశు కవితా ప్రదర్శన ‘’చేసి ఆయన్ను  తన సామర్ధ్యం తో  ఆశ్చర్యం లో ముంచేసి అభిమాన పాత్రులయ్యారు . .

కవితాప్రసాద్ కు’’ కవితాంజలి’’

కవితా ప్రసాద్ కు కృష్ణా జిల్లా ఎంతో రుణ పడి ఉంది .ఆయన ఇక్కడ పుట్టినందుకే కాదు ఆయన ఎదుగుదలకు సోపానమైనందుకు ,ఆయన వల్ల మనం ప్రభావితమైనందుకూ .మనందర్నీ తనతో కలుపుకొని అవధాన ప్రదర్శనలో భాగ స్వాములను చేసినందుకు మనం ఋణం తీర్చుకోవాలి .కాని ఎవరూ ఇంతవరకు అ దృష్టితో ఆలోచించక పోవటం బాధగా ఉంది   .ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని మొక్కుబడిగా చేస్తున్నారు .మనలోని వర్గ భావాలను దూరం చేసి సమైక్యం గా సాహిత్యాభిమాను లందరూ కలిసి ఘన నివాళిని అందజేస్తే బాగుంటుందని పించింది .కాని ఆ దిశలో ఎవరూ ప్రయత్నం చేయలేదు .అందుకే బందరు’’ సాహితీ మిత్రుల సంఘం’’ అధ్యక్షులు శ్రీ సిలార్ గారితో చెప్పి బందరులో ‘’కవితా ప్రసాద్ గారికి కవితాంజలి ‘’కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పాను .ఉయ్యూరు  ‘’సరసభారతి భారతి’’ కూడా సహకారం అందిస్తుంది అని చెప్పాను .సరే నన్నారు .బందరు లోని సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నిటికీ తెలియ జేసి 2-4-15 గురువారం  సాయంత్రం వివేకానంద మందిరం లో ఏర్పాటు చేశారు శిలార్ జీ .ఒక 35 మంది హాజరయ్యారు .కవితాప్రసాద్ గారి చిత్రపటం పెట్టారు .పూలు, దండా తెచ్చారు .దండవేయటం మర్చి పోయారు .అప్పుడు నేనే కల్పించుకొని ము౦దుగా కవితా ప్రసాద్ గారి చిత్ర పటానికి అందరి చేత పూలు సమర్పింప జేశాను .అ తర్వాతైనా సిలార్ గారు దండ వేయంచలేదు .మేమురాత్రి  ఎనిమిదింటికి బయటికి వచ్చేదాకా ఆ దండ కిందనే ఉండిపోయింది.ఆతర్వాత వేశారో లేదో తెలీదు .సిలార్ గారు మీడియాకు చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు లేదు .కనీసం నేను మూడు సార్లు ఫోన్ చేసి అడిగే దాక నాకు ఆహ్వాన పత్రాన్ని  నెట్ లో పెట్టి పంపలేదు .అదీ నిర్వహణ లో’’ సౌఢభ్యం ‘’.

ఇక ప్రసంగించిన వారు కూడా కవితా ప్రసాద్ తో కాఫీ తాగాను ,ఆయనకు అద్దెకు ఇల్లు ఇప్పించాను ,ఆయన ఇంటికి వెడితే  భార్య టిఫిన్ పెట్టింది వగైరాపనికి మాలిన విషయాలు  మాట్లాడినవారేకాని కవితా ప్రసాద్ కవితా సౌందర్యాన్ని గురించి చెప్పలేదు .ఆయనపై కవిత్వం రాసి చదవ లేదు .ఒక్క మురళీ కృష్ణ  నేను తప్ప కృ. .జి .ర .సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాత్రం తమ సంఘం ఆధ్వర్యం లో జరిగిన మొదటి రెండు ప్రపంచ తెలుగు సభలకు కవితా ప్రసాద్ మార్గ దర్శి ,స్పూర్తి ప్రదాత ,అని ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం అందించిన చొరవ ఆయన దే నని ‘’పది లక్షల ప్రభుత్వ చెక్ ను కవితా ప్రసాద్ గాలిలో ఊపుతూ వేదికపై ప్రత్యక్షమైన తీరును’’ గుర్తు చేసి దృశ్యమానం చేశారు  .ప్రముఖ గాయకురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు ‘’ప్రసాద్’’ గారి పాటలకు స్వర రచన చేసి శ్రావ్యం గా గానం చేసి కవితాంజలి ఘటించారు .ఇంకా ఒకరిద్దరు ఇలా చేసి ఉంటె ఇంకా ఘనం గా ఉండేది .కల్యాణిగారితో పాడించమని ఆమె భర్త శ్రీ గోవర్ధన్ గారికి అంతకు ముందు  జరిగిన సుబ్బారావు గారి అభినందన సభలో (29 మార్చి  )చెప్పాను ఆయన ఆ బాధ్యత తనది అని చెప్పి మాట నిల బెట్టు కొన్నారు వేదిక కూడా గోవర్ధన్ గారే ఏర్పాటు చేశారు ..మరో ప్రసిద్ధ గాయని శ్రీమతి కాళీ పట్నం ఉమ తనకు రావటానికి కుదరలేదని రానందుకు బాధ పడుతున్నానని నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు  .. తర్వాత దండిభోట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి కవితలు  రాసుకొచ్చినట్లు చూశాను . అందరూ బందరులో కవులేకదా అందరూ ఆయన ప్రభావం ఉన్నవారేకదా గొప్పగా కవిత్వం రాసి ఘన నివాళి  అర్పిస్తారనుకోన్నాను. కానీ’’ ఉల్టా’’అయింది .చాలా బాధగా ఉంది .ఇంత పేలవం గా జరుగుతుందనుకోలేదు .ఆ కవితలు వస్తే నెట్లో రాద్దామని లేక చిన్న పుస్తక రూపం లో తెచ్చే ఆలోచన చేద్దామని అనుకొన్నా .కాని అది జరగక పోవటం తీవ్ర నిరాశకు గురి చేసింది . సాధారణం గా సరసభారతి ఏర్పాటు చేసే సభలకు కవి సమ్మేళన .కార్యక్రమాలకు ఉయ్యూరు వారి పేర్లు చివరికి వేసి ముందు ఇతరుల పేర్లు వేస్తాం .నిర్వహణలో కూడా బయటి నుండి వచ్చిన వారిని అతిధులుగా గౌరవించి ముందు వారికే అవకాశం ఇచ్చిమాట్లాడించి కవిత్వం చెప్పించి  గౌరవిస్తాం .కానీ ఈ సభలో ముందే స్థానికులను పిలిచి వారికి ఎక్కడ కోపం వస్తుందోనని సిలార్ భాయ్ భయపడినట్లుకనిపించింది .ఇది బయటినుంచి వచ్చిన వారికీ చాలా అమర్యాద .సుబ్బారావు గారి సభలో భవిష్య గారు మొదట స్థానికుల కొకరికి అవకాశం ఇచ్చి తర్వాత సరసభారతికి అవకాశం కల్పించి గౌరవించారు .ఆ మాదిరి సౌజన్యం ఇక్కడ కలగక పోవటం ఇబ్బంది అని పించింది .అయిడియా మాది .సభ పెట్టాలని ,ఆయన ఫోటో పెట్టాలని ,దండ, కొనాలని, పూలు అందరితో వేయించాలని ఆహ్వానపత్రిక వేయాలని బందరులోని అన్ని సాహిత్య సాంస్కృతిక సంస్థలకు ఆహ్వానాలు వెళ్లాలని, మీడియా వారిని పిలవాలని ,సభ విషయం ఒక రోజు ముందే పేపర్ లో రావాలని  అందరూ కవిత్వం రాసి’’కవితాంజలి ‘’గా  నివాళి అర్పించాలని చెప్పింది సరసభారతి .దీన్ని అమలు చేయటం లో వైఫల్యం జరగటం శోచనీయం .

జరిగిందేదో జరిగిపోయింది . ఇటీవల జరిగిన తెలుగు ప్రపంచ సభల స్థాయి లో ఘన నివాళి కవితా ప్రసాద్ కు జరగాలి .అప్పుడే మనం కృతజ్ఞులం అని పించుకో గలం.కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నో అవధానాలకు ,సాహిత్య సభలకు ప్రేరణ, స్పూర్తి  నిర్వహణా కవితా ప్రసాద్ దే అని మరువ రాదు .

మచిలీ పట్నం లో కవితా ప్రసాద్ కు చిరస్మరణీయ స్మృతి చిహ్నం

కవితాప్రసాద్ గారికి  కాంశ్య విగ్రహం తయారు చేయించి బందరులో  ప్రతిష్టించాల్సిన  బాధ్యత కృష్ణా జిల్లా సాహిత్యాభి మాను లందరిపైనా ఉంది .ముఖ్యంగా దీనికి కృష్ణా జిల్లా రచయితల సంఘం నడుం కట్టాలి .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పూనుకోవాలి .అప్పుడే ఇది సాధ్యం .దీన్ని సాధించక పొతే చరిత్ర మనల్ని క్షమించదు.ఇది అందరి సమష్టి బాధ్యతగా భావించి కదలాలని మర్చి పోరాదు. కృష్ణా యూని వర్సిటీలో అయన పేర సాహిత్య పీఠం ఏర్పాటు చేయగలిగితే మహా మంచిది . .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

.

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో

51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో వారి శ్రీమతి కమలమ్మగారి తో ఈ రోజు 2-4-15 గురు వారం సాయంత్రం5 గం లకు    మేమిద్దరం  -మరియు బందర్ వివేకానంద మందిరం లో సాయంత్రం ఆరు గంటలకు అవధాన సరస్వతి స్వర్గీయ రాళ్ళబండి కవితాప్రసాద్ గారికి ”కవితాంజలి ”దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సహృదయ స్పందన డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం

             సహృదయ స్పందన

                డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం

గబ్బిట వంశ యశస్సును శాశ్వతం చేసి

శ్రీ దుర్గాప్రసాద్ గారికి

భాష సంస్కృతీ ,సభ్యత గల తెలుగు జాతి

ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు?

‘’దర్శనీయ దేవాలయాలు ‘’పేరిడి

మా మనస్సును ,చిత్తాన్ని ఆ దేవ సన్నిధిలో నిలిపారు

‘’శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం ‘’ద్వారా

స్వామి మహత్తు ,ఆత్మ విశ్వాసం ,ఆధ్యాత్మిక అనుభూతి మిగిల్చారు

‘’మహిళా మాణిక్యాలు ‘’లో

ఏ స్త్రీ వాద రచయిత్రీ  చూప లేని నిబద్ధత వ్యక్త పరిచారు

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’లో

ఆయా కవుల ఆత్మ శోధన ,భావ వ్యక్తీకరణ

చారిత్రిక ,సాంస్కృతిక నేపధ్యాన్ని ఆవిష్కరించారు

ఇక ఈ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’

ఈ జాతికి మీరిచ్చిన అపురూప కానుక

ఆది శంకరుల వారితో ప్రారంభించిన

మీ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’

సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం .

సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీ పట్నం -2-4-15

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పివి స్మృతిలో -సంపాదీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిజెపి కి అనుకూలతలు లేవు -హృదయాలను గెలవాల్సిందే –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గవర్నర్ ఫిటి0గే ఏ ఎంట్రీ టాక్స్ –

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసలైనది ఆత్మబలమే

అసలైనది ఆత్మబలమే
 
కులబలం, జనబలం, ధనబలం, మంత్రబలం, ఔషధబలం, రసాలబలం, తపోబలం, యోగబలం ఇవి ఏవీ మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఆత్మబలమే నిజమైనది.. ఆత్మ అంటే ఎవరు? మన శరీరం కాదు. పంచేద్రియాలు కావు. ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒకొక్కసారి ఒక్కొక్కటిగా ఆత్మ అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా అసలైన ఆత్మ కావు. వాటికున్న బలం నిజమైనది కాదు. వీటిని సమగ్రంగా పరిశీలిద్దాం.
చాలా మంది కులబలం వల్ల తమకు అమితమైన ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ దేహం అశాశ్వతమైనది. అది నశిస్తుంది. అందువల్ల కులబలంతో గర్వించేవారు కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవాల్సిందే. ఇదే విధంగా ధనాన్ని తీసుకుందాం. ఇది చంచల. ఎవరి దగ్గరా ఉండదు. చలామణిలో ఉన్నంత కాలమే దాని ప్రయోజనం. ఉదాహరణకు రూపాయి నోటు ఉందనుకుందాం. అది చలామణిలో ఉన్నంత కాలమే విలువ ఉంటుంది. దానిని చలామణి నుంచి తొలగించారనుకుందాం. అప్పుడు దానికి విలువ ఉండదు. అంతే కాదు. ఆ డబ్బును చూసి చాలామంది నేనే బలవంతుడిని’ అనే భ్రాంతికి గురవుతారు. కానీ ఆ బలం వ్యక్తిది కాదు. ధనానిది. ధనం ఉన్నంత వరకే మనుషులు చేరతారు. లేకపోతే అందరూ అదృశ్యమవుతారు. ఇక జనబలం విషయానికి వద్దాం. వేర్వేరు ప్రయోజనాల కోసం జనాలు ఎవరో ఒకరి పంచన చేరుతూ ఉంటారు. తమ ప్రయోజనాలు సిద్ధిస్తున్నంత కాలం వారు ఉంటారు. ఆ తర్వాత వేరే వ్యక్తి దగ్గరకు చేరతారు. ఇప్పుడు ఔషధ బలం గురించి తెలుసుకుందాం. ఔషధాలు మన శరీరంలో ఉన్న బలానికి ఆలంబనగా మాత్రమే పనిచేస్తాయి. ఇవన్నీ భౌతిక బలాలు. ఇక ఆధ్యాత్మిక బలాలను గమనిద్దాం. మంత్ర బలం కేవలం ఒక భావన. పునశ్చరణ, గురోపదేశం వీటిలో చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటి ద్వారా బలం వస్తుంది. ఇవి దూరమైతే ఆ బలం కూడా తగ్గుతూ వస్తుంది. అంతే కాదు. మంత్రానికి బలాన్ని చేకూర్చటంలో మానసిక పరిస్థితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తపస్సు వల్ల ఎన్నో సిద్దులు చేకూరుతాయంటారు. తపస్సు వల్ల బలం చేకూరుతుంది. అయితే ఇది స్థిరమైనది కాదు. చంచలమైన మనసుపై ఆధారపడి ఉంటుంది. మనసు మాయలో పడితే- తపస్సిద్ధి కూడా నశిస్తుంది. చాలా కఠినమైన నియమాలతో ఆచరిస్తే తప్ప తపోబలం వల్ల శ్రేయస్సు కలగదు. యోగబలం పరిపూర్ణమైనదే. కానీ దాని ద్వారా బలాన్ని పొందటం అతి కష్టం. వీటిన్నింటిని విశ్లేషించిన మీదట- ఆత్మబలమే నిజమైదనే విషయం తెలుస్తుంది. ఆత్మ అంటే ఈ దేహం కాదు. ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. మరి ఏమిటి? అంటే వీటి అన్నింటిని దాటిన తానైన సచ్చిదానందం. అది అన్ని ప్రాణులకు కూడా ఆత్మ అయి ఉంటుంది. దానినే పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మను ఆశ్రయించడమే పరమానందం. దానిని పొందడానికి పూర్వీకులైన శంకర భగవత్పాదుల అద్వైత అమృతాన్ని చెప్పే గురువులను అశ్రయించాలి. ఈ లోకంలో గురువులు అనేకమంది ఉంటారు. పైన చెప్పిన యోగము, మంత్రము ఇత్యాదులు చెప్పవచ్చు. కాని ఆత్మ జ్ఞానం చేత కలగని ఏ బలమైనా వ్యర్థమే. శాశ్వత ఆనందాన్ని కలిగించవు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి
9966669658
ఎది సంప్రదాయం భారతీయం

 
సంప్రదాయం అనే మాట వినగానే కొందరికి ఆదరభావం కలగవచ్చు. మరికొందరికి ఒక చాదస్తమైన మాటలాగ అనిపించవచ్చు. ప్రపంచమంతటా అన్ని సమాజాలలో తమతమ సంప్రదాయాన్ని నిలుపుకోవాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. అలా నిలుపుకోవడం ఒక సవాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దీని అవసరాన్ని పరిశీలించాల్సి ఉంది.
సంప్రదాయం అనే పదానికి ‘బాగ అందించడం’ అని అర్థం. ‘సం’ అంటే సంపూర్ణంగా, ‘ప్ర’ అంటే ప్రభావవంతంగా, ‘దాయ’ అంటే ఇవ్వడం. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతిని మన పిల్లలకి అందించడం ఇందులోని ముఖ్య విషయం. ఈ సంస్కృతిలో రెండు విభాగాలు- సాంఘిక జీవితం, విలువలు అనేది మొదటిది, మత సంబంధమైన విశ్వాసాలు రెండవది. విజ్ఞానశాస్త్రం యొక్క ఆవిష్కరణలు సమాజంలో తెస్తున్న మార్పులు పై రెండు అంశాల్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో విజ్ఞానశాస్త్రం మనిషి జీవితాన్ని సులభం చేసింది కాని మానవసంబంధాలు కుటుంబవ్యవస్థపై చాలా ప్రభావం చూపింది. అలాగే మతవిశ్వాసాలపై కూడా ప్రభావం చూపింది.
పాశ్చాత్యదేశాల్ని చూసి మనం జాగ్రత్తపడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాల్లో నలభై శాతానికి పైగా పిల్లలు పెళ్ళికాని జంటలకు పుట్టేవారు. సింగిల్‌ పేరెంట్‌, అంటే తల్లికాని, తండ్రికాని మాత్రమే పిల్లల బాధ్యత చూడటం పరిపాటి. దీన్ని ఆ సమాజాలు అంగీకరించాయి. అలాగే పద్దెనిమిదేళ్లు రాగానే ఇంటిని వదిలి వెళ్ళే యువతను పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వృద్దుల్ని పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. సమాజ భద్రతకై(టౌఛిజ్చీజూ ట్ఛఛిఠటజ్టీడ) ప్రభుత్వాలు తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి. దీనికి తోడు స్వలింగ వివాహాలు ఒక సమస్య. ఎన్నికల సమయంలో ఇదొక ముఖ్య విషయం. మనదేశంలో నాయకులు రాయితీలు ప్రకటించినట్లే ఆ దేశాల్లో స్వలింగవివాహాలు చేసుకున్న వారికి నేతలు రాయితీలు ప్రకటిస్తారు. ప్రభుత్వ పన్నులలో రాయితీలు ఉండటం, కుటుంబాలకు ఇచ్చే రాయితీలన్నీ వీరికి ఇవ్వడం ప్రభుత్వాలకు తలనొప్పి. సమాజ జీవనం ఇలా ఉండగా మత విశ్వాసాలు కూడా క్షీణించడం మరొక తీవ్ర సమస్య. ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కుటుంబవిలువలు నశించడం వల్ల ప్రభుత్వాల ఆర్ధికవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపడం గమనించగలం.
మన సమాజంలో మార్పులు ఇంతటి తారాస్థితికి రాలేదు. దాదాపు తల్లిదండ్రులందరూ తమ పిల్లల విద్యకు ప్రాధాన్యమివ్వడం ఒక ప్రశంసనీయమైన విషయం. ఇందులో తల్లుల పాత్ర ఎక్కువగా ఉంది. ప్రతి సీ్త్ర తన పిల్లలు తన భర్తకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటుందని ఒకానొక విశ్లేషకుడు చెప్పాడు. ఈ ఉద్యోగం మా ఆయనకే చాలు, మా పిల్లవాడు పెద్ద ఉద్యోగం చేయాలి అనే భావన ఇల్లాలిది. అలాగే మన వివాహ సంబంధాల్లో తీవ్రమైన ఒడుదుడుకులు రాలేదు. కుటుంబాల్లో పొదుపుచేసి అలవాటు ఉండడం వల్ల కుటుంబ బాధ్యత ప్రభుత్వం తలపై పడడం లేదు.
ఈ రోజుల్లో ఆర్థికశాస్త్రవేత్తలు జాతీయ రుణం గూర్చి చెబుతూ ప్రతి మనిషికీ పుట్టుకతోనే కొన్ని వేల రూపాయల రుణం తలపై ఉంటుందని చెబుతారు. అలాగే మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే. ముఖ్యంగా ఋషిఋణం మన పెద్దలు, గురువులు అందించిన జీవన విధానాన్ని, విలువల్నీ రాబోయే తరాలకు అందించేది. మనం ఆచరిస్తూ, మన తర్వాతి తరంచే ఆచరింపచేయడం. ఇదొక రిలే పరుగుపందెం లాంటిది. రిలే పందెంలో ఒక వ్యక్తి పరిగెడుతూ తన చేతిలో ఉన్న కర్రముక్కను రెండో వ్యక్తికి అందిస్తాడు. రెండోవాడు మూడోవాడికి అందిస్తాడు. ఆ విధంగా పరుగుపందెం సాగుతుంది.
సంప్రదాయాన్ని నిలపడం ఆర్ధిక దృష్టికోణం నుండి కూడా అవసరమైన విషయం అని పైన గమనించాం. పారిశ్రామిక విప్లవం సమాజంలో కొంత మార్పు తెచ్చింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం, కంప్యూటర్‌ రంగం మరింత మార్పు తెచ్చాయి. ప్రపంచీకరణ ప్రపంచ సంస్కృతిలోనే తీవ్రమార్పుల్ని తెస్తూంది. ప్రచార మాధ్యమాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల అధీనంలో ఉండటం వల్ల ఆ దేశాల సంస్కృతే ప్రపంచమంతటా విస్తరిస్తూంది. ప్రేమికులదినం మొదలైనవి ఉదాహరణలు. ఒక ప్రాంతం యొక్క భాష మరొక ప్రాంతంపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే ఒక సంస్కృతి మరొక సంస్కృతిపై ప్రభావం చూపుతుంది. దీన్ని ఇటీవలికాలంలో టౌజ్ట ఞౌఠ్ఛీట (దీన్ని మనం సాత్త్వికశక్తి అనవచ్చునేమో) అంటున్నారు. ఒౌట్ఛఞజి ూడ్ఛ అనే రచయిత ఈ పేరిట ఒక పుస్తకం కూడా రాశారు. (ఇంటర్నెట్‌లో దీని గూర్చి తెలుసుకోగలం). సైన్యాల్ని పంపి యుద్ధం ద్వారా ఒక సంస్కృతిని వ్యాప్తి చేయడం అనేది జ్చిటఛీ ఞౌఠ్ఛీట. దీని వల్ల అనేక నష్టాలు ఉంటాయి. శతృత్వం పెరిగి ఉగ్రవాద ప్రతీకారచర్యలకు దారితీయవచ్చు. పాశ్చాత్యదేశాలు దీన్ని బాగ గ్రహించాయి. అందువల్ల అన్ని విధాల ప్రచార మాధ్యమాల ద్వారా తమ టౌజ్ట ఞౌఠ్ఛీట ను బలపరుచుకుంటూ ప్రపంచదేశాల మీడియాలని నియంత్రించే వ్యూహాల్లో ఉన్నాయి. దండోపాయం కన్నా సామం మంచిదనే అభిప్రాయంలో ఉన్నాయి.
పై సవాళ్ళను భారతీయ సంస్కృతి ఎలా ఎదుర్కొంటోంది? ఇటీవల  అనే ఆంగ్ల వ్యాసాల సంపుటిని రామకృష్ణ మిషన్‌ వారు ప్రచురించారు. వివిధ సంస్కృతులవారు తమతమ సంస్కృతుల విషయంలో ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తున్నారు అన్నది ఇందులో విషయం. ఇతర సంస్కృతులు ప్రపంచాన్ని వ్యాపించే వ్యూహంలో ఉండగా భారతీయ సంస్కృతి తనను రక్షించుకునే వ్యూహాన్ని కూడా రచించడం లేదని ఇందులో చూడగలం. దీనికి సంబంధించిన వ్యాసాన్ని కూడా ఒక భారతీయ సంస్కృతిని అభిమానించే పాశ్చాత్య రచయిత వ్రాశాడు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజల్లో మిగిలి ఉన్న సంస్కారం కూడా కొంతవరకూ మన సంస్కృతిని నిలబెట్టి ఉంది. సంప్రదాయం అంటే పిలక, విభూతి పెట్టుకుని చాదస్తంగా ఉండాలని కాదు. మతవిశ్వాసాలకు అతీతంగా ఉన్న సిద్ధాంతం మన వేదాంత గ్రంథాల్లో ఉంది. మన ధర్మంలోని విలువలు రామాయణం, భారతం, సుభాషితాలు లాంటి పుస్తకాల్లో ఉన్నాయి. ఇటీవలికాలంలో కొన్ని మీడియా వర్గాల్లో ఈ అవగాహన రావడం సంతోషించదగిన పరిణామం. అలాగే తమ పిల్లలకూ, మనుషులకూ వేమనశతకం, సుమతిశతకం, భర్తృహరి సుభాషితాలు, భగవద్గీతలోని శ్లోకాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు ఈ సంస్కృతిని నిలబెడుతున్నారనడంలో సందేహం లేదు. ఈ పద్యాలు, శ్లోకాలు చిన్న పిల్లల మనస్సుల్లో నాటే విత్తనాలలాంటివి. ఇవి ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ తర్వాత ఫలాల్ని ఇవ్వవచ్చు. ఇవి దేశ భవిష్యత్తుకు పెట్టుబడిలాంటివి.
మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothi.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
 
‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి వద్ద నిత్యదీపారాధనలో… భక్తుల సేవలో తరిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం కఠారు పల్లిలో ఉన్న వేమన జీవసమాధి వద్ద సోమేశ్వరమ్మ ప్రస్తుతం మహిళా అర్చకురాలిగా అంకితమైంది…
‘‘దాదాపు 150 ఏళ్ల క్రితం వేమన రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారని మా పూర్వీకులు చెబుతారు. ఊరూరూ తిరుగుతూ మూఢాచారాలు, కుటుంబ విలువలు, విగ్రహారాధన, కులతత్వం వంటి అంశాలపై ప్రజలను తన పద్యాల ద్వారా చైతన్యపరిచారు ఆ మహానుభావుడు. ఎక్కడికి వెళ్లినా సందర్బానుసారంగా ఆశువుగా పద్యాలు చెప్పి అందరినీ మెప్పించిన వేమారెడ్డి (వేమన) గారి వంశంలో పుట్టడం మా అదృష్టం. ఈ తరంలో వసంతరెడ్డి, వేమారెడ్డి, చండ్రాయుడు, వేమారెడ్డి, నాగిరెడ్డి, అయ్యవారు మొదలైన మూడు కుటుంబాలకు చెందినవారు ప్రధానంగా ఉన్నారు. నా భర్తపేరు వేమారెడ్డి. మాకు సంతానం లేదు. వేమన సమాధికి సమీపంలోనే ఉంది మా ఇల్లు. ఆలయంలోనే పూజలు చేస్తూ, భక్తులకు వేమన తత్త్వాన్ని చెబుతూ కాలం గడుపుతున్నాను. స్వామి సన్నిధిలో సేవలందిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.
పౌర్ణమి నుంచీ.. పౌర్ణమి వరకు..
మా మూడు కుటుంబాల్లోని వాళ్లందరం వంతులవారిగా వేమన సమాధి వద్ద పూజలు చేస్తాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మేము అర్చన చేస్తే… ఆ తర్వాత ఇంకో కుటుంబం వారు చేస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది. మేమందరం సఖ్యతగా ఉంటూ ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. వేమన ఉత్సవాలు మాకు పెద్ద పండగ కన్నా ఎక్కువ. అందుకే అత్యంత నియమనిష్ఠలతో నిత్యం పూజలు చేస్తాం. వేమన చరిత్రను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈ ఉత్సవాలకు నెల్లూరు, గుంటూరు, కడప, కర్ణాటక, చింతామణి, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఉత్సవాలలో మహా కుంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఆదివారం మాంసం వండి సమాధి వద్ద కొలువు చేస్తాం. ఇది మా సంప్రదాయం. ప్రతీ ఉదయం మంగళవాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు, పద్యాలు పాడతాం. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి పెడతాం.
నిత్య దీపారాధన.. పవిత్రంగా పూజలు..
రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానాదులు ముగించి దీపారాధన చేస్తాను. ప్రత్యేక అర్చనలు చేసి.. గ్రామస్తులు, సందర్శకులకు తీర్థప్రసాదాలు అందజేస్తాను. ఇవన్నీ చాలా పవిత్రంగా జరిగే పూజా కార్యక్రమాలు. ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతాను. నా భర్త గుర్రాలకు కడుపునిండా దాణా పెట్టి ఆలయానికి వస్తాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి వంటపనులుపూర్తీ చేస్తాను. ఉదయం నుంచీ సాయంత్రం దాకా గుడి పక్కనే టెంకాయ, తాంబూలాలు, వేమన సాహిత్య పుస్తకాలను విక్రయిస్తాం. వీటితో పాటు హారతి పళ్లెంలో భక్తులు వేసిన కానుకలే మాకు జీవనాధారం.
వేమన నడయాడిన నేలపై నిత్య కరువు..
గొప్ప దార్శనికుడుగా పేరుగాంచిన వేమన నడయాడిన నేల ఇప్పుడు భయంకరమైన కరువుతో తల్లడిల్లిపోతోంది. ఆ మహానుభావుడి సమాధి వద్ద.. ఆలయ ప్రాంగణంలో కనీసం తాగడానికి మంచినీళ్లూ కూడా దొరకవు. బోర్లన్నీ ఎండిపోయాయి. వానలులేక వ్యవసాయ భూములన్నీ బీళ్లుగా మారాయి. మాకు కొంత సేద్యం భూమి ఉంది. గతంలో కొంత పంట పండేది. కొన్నేళ్లుగా అదీ లేదు. ఇప్పుడు నాకూ, నా భర్తకూ ఆలయంలోని చిరువ్యాపారంతోనే జీవనోపాధి.
భక్తుల ఆకలి తీరుస్తున్నాం..
కఠారుపల్లెకు వచ్చే పేద భక్తులకు మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తున్నాము. మేం వండుకున్న దాంట్లోనే వారికీ పెడతాం. భక్తుల ఆకలి తీర్చడంలో చాలా సంతృప్తి ఉంటుంది. మాకు పిల్లలు లేరన్న బాధను మరచిపోవడానికే భక్తులకు, పేద పిల్లలకు వంటలు వండి పెడుతున్నాను. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిని తరతరాలుగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. చారిత్రక ఆనవాలు దెబ్బతినకుండా సహజత్వానికి భంగం కలగకుండా సమాధిని, పరిసరాల్ని రక్షించుకుంటున్నాం. అందుకే ప్రభుత్వం అడిగినా గర్భగుడిని పర్యాటక శాఖకు అప్పగించలేదు. ఆలయం బయటి ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. క్యాంటీన్‌, కాటేజీలు, పార్కు, రెస్టారెంట్‌, ఇలా మంచి వసతులు కల్పించారు. కానీ ఆలయంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయంలో కళ్యాణకట్ట, వంటగది నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
వేమన జీవితాన్ని వివరిస్తున్నా…
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. నాకన్నా ముందు ఇక్కడ ఒక అవ్వ పూజలు చేసేది. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయింది. అందుకే వేమన జీవితసారాన్ని, భావజాలాన్ని పుస్తకాల ద్వారా చదివి, మా పూర్వీకుల ద్వారా విని… ఆ…. విశేషాలను సందర్శకులకు నాకు తెలిసిన మేరకు వివరిస్తున్నాను. భవిష్యత్తులో కఠారుపల్లె ప్రపంచ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని నా నమ్మకం. ఇదే నా ఆకాంక్ష కూడా!
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను.
డాక్టర్‌ ఉద్దండం చంద్రశేఖర్‌, అనంతపురం
ఫోటోలు : అమరనాథ్‌, గాండ్లపెంట
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’

 స్వర్గీయ కవితాప్రసాద్ కు  ‘’కవితాంజలి ‘’

మధురకవితా ప్రసాదీయం –గబ్బిట దుర్గాప్రసాద్

బందరు కవుల చేత ,గుంటూరు కులపతుల చేత  కనకాభిషేకాలు పొంది

ప్రధమ చతుర్ధ ప్రపంచ తెలుగు సభా నిర్వహణ సామర్ధ్యం చూపి

స్వర్ణ కంకణ ధారియై  ,భువన విజయ ‘’రాయలై’’

ఆశుకవితా ఝరి పారించి రసప్లావిత మొనర్చి

అవ్యవధాన అవధాన విద్యలోసాటిలేని మేటియై ,ధారణా బ్రహ్మయై

నవరసావదాన ,సాహిత్య ప్రక్రియావదాన మార్గ దర్శియై

‘’గ్రంధ ముఖి ‘’(ఫేస్ బుక్ )లో లక్ష పద్యార్చనం చేసి

‘’రసవదమృత పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య శిరస్సు లిడగ

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహాయజ్న వేదికి –దివ్య హవిస్సులిచ్చి ‘

‘’ భూమాత హృదయమ్ము పూర్ణ కుంభమై-శ్రీంకార శబ్ద రోచిస్సు లివ్వగా ‘’

ద్విశతావధానం తో బాటు శతాధిక గ్రంధ రచన చేసి

‘’పలకరిస్తే పద్యం’’ తో ఆంధ్రావనిని పులకరింప జేసి

యువతకు అవధాన ప్రక్రియలో స్పూర్తిగా నిలిచి

శ్రీకాదంబినీ మాత’’ వర ప్రసాద రాజమై’’

కలియుగ సార్వ భౌముడు సప్త గిరి ధామునికి

భక్తీ తన్మయత్వం తో ఆత్మ నివేదన చేసి

సాంస్కృతిక శాఖకే వన్నె తెచ్చి

విభజన భజనలో తెలంగణ పాలై

‘’దొర ‘’పెత్తనానికీ ,’’బాస్ ‘’దాస్తీకానికీ బలై ,అనారోగ్యం పాలై

కమ్మని తెలుగు నేలకు ,ఆప్యాయతకు దూరమై

మానసిక క్షోభ ,అవమానం ,పెత్తనాలకు నీరుగారి

దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ

దివికేగిన  ‘’పెదబాబు ‘’ద్రువతార

మహాకవి –మధురమంజుల రవి

రసమయ కవితా శకటం కవితా ప్రసాద్ కు

కవితాంజలి ఘటిస్తున్నా –వినమ్రంగా .

గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94

త్రుటిలో తప్పిన —

నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా కొట్టుకొంటోంది .ఎమీపాలుపోవటం లేదు .ఇంతలో ఒక చిన్నకారు నా దగ్గరకు వచ్చి ఆగింది .డోర్  తీసి అందులోని పెద్దమనిషి ‘’నమస్తే హెడ్మాస్టారు .మీకు అభ్యంతరం లేకపోతే మాకారులో వెళ్దాం రండి ‘’అన్నారు అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు .రక్షించావురా దేవుడా అనుకోని కారు ఎక్కాను .స్కూల్ దగ్గరే నన్ను దింపి వెళ్ళిపోయారు .అప్పుడే మొదటిగంట కొడుతున్నారు అంటే పావుతక్కువ పది అన్నమాట హమ్మయ్య అనుకొన్నాను .అసెంబ్లీ జరుగుపుతున్నాను .ఇంతలో  జీప్ శబ్దం వినబడింది .ఎవరా అని చూస్తె ‘’జిల్లా పరిషత్ లో మా మొగుడు ‘’అంటే పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ .మా జుట్టు అంతా ఆయన చేతిలోనే ఉంటుంది .ఆయన పేరు ‘’పరమ హంస ‘’కాని అప్పటికే ఆయనకు ‘’పరమ హింస ‘’అని పేరొచ్చింది .అందర్నీ ఇరికించి బాధపెడతాడని పుకారు .సరే గేట్ దాకా వెళ్లి ఆయన్ను ఆహ్వానించి నా కుర్చీలో కూచోబెట్టాను .పై అధికారివస్తే హెడ్ మాస్టర్ కుర్చీలో కూచోవటం ఒక ఆచారంగా వస్తోంది .హాజరు పట్టీ తెప్పించి సంతకాలు వెరిఫై చేశాడు .సైన్స్ మాస్టర్ పాల్ ఇంకా రాలేదు. సాకు దొరికింది ఆయనకు .రోజూ పాల్ లేట్ గా వస్తాడా అని అడిగాడు .లేదు అని టైం కే వస్తాడని కొంచెం ‘’కలర్’’ ఇచ్చాను .ఆయన సెలవు ముందే చెప్పి పెడతాడా అని రెండోప్రశ్న.అవునని నా సమాధానం .పాఠాలు బాగా చెబుతాడా అని మరొ బాణం .నేచురల్ సైన్స్ చెబుతాడని నా సమాధానం .ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు నేనే చెబుతున్నానన్నాను .సంతోషించినట్లు మొహం కనిపించింది .టీచింగ్ నోట్స్ రాస్తాడా అంటే రాస్తాడని నేను’’ పూత ‘’.మీకు సహకరిస్తాడా అని అడిగితె ఇంచార్జ్ గా ఆయన సహకారం బాగా ఉంటుందని నా సమాధానం .మిగతా విషయాలన్నీ గుమాస్తా చూశాడు .పాల్ తప్ప అందరూ సమయానికి రావటం లెసన్ ప్లాన్లు అన్నీ వారం వారం నేను చెక్ చేసి సంతకం పెట్టటం అన్నీ హంసగారు గమనించారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ కూడా చూపించాను రికార్డ్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని సంతృప్తి పొందాడు .పాల్ కు ఆబ్సేంట్ మార్క్ చేసి సాయంత్రం తనను ఆఫీసులో కలుసుకోమని చెప్పమని జీపెక్కి తుర్రు మన్నాడు ఆఫీసర్ హంస .నన్ను లక్ష్మీపురం లో ఆయనెవరో దేవుడిలాగా వచ్చి కారు ఎక్కించుకు రాకపోతే నా పని గోవిందో హారి .గొప్ప ప్రమాదం తప్పించాడు భగవంతుడు .

పాల్ వచ్చాడు .సారీ చెప్పాడు .ఆఫీసర్ చెప్పమన్నది చెప్పాను వణికాడు. మనిషి మినీ ఎస్వీ రంగా రావు లాగా ఉంటాడు. కాని భయపడ్డాడు .’’సార్ !నాకు ఇది కొత్త .ఆయనతో మాట్లాడటం భయం గా ఉంది .నాతొ పాటు మీరుకూడా వచ్చి నన్ను కాపాడాలి ‘’అన్నాడు .సరే నని ఆయన స్కూటర్ మీదనే సాయంత్రం స్కూల్ అయినాక ఇద్దరం జిల్లాపరిషత్ ఆఫీస్ కు వెళ్లాం .పరమహంసను కలిశాం .ముందు ఫైర్ అయ్యాడు .నెమ్మదిగా మాట్లాడి కూల్ చేశా .కొంత దిగాడు .అప్పుడు అసలు విషయం చెప్పాడు .’’మీ స్కూల్ లో పాల్ గురించి లెక్కల మేష్టారు గురించీ రోజూ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయిచాలా రోజులుగా .అందుకని ఎంక్వైరీ కి వచ్చాను అన్నాడు .వాళ్ళు రాసినదేమీ నాకు అక్కడ కనిపించలేదు .స్కూల్ బాగా రన్ అవుతోందనే సంతృప్తి కలిగింది ‘’ అని నాతొ చెప్పి పాల్ ను ‘’నీ ప్రవర్తన మార్చుకో .మళ్ళీ కంప్లైంట్ వస్తే యాక్షన్ తీవ్రం గా ఉంటుంది ‘’అని హెచ్చరించాడు .అప్పటి నుంచి పాల్ పిల్లి అయ్యాడు భేషజం చూపించలేదు. నేను ఆయన్ను రక్షించాననే క్రుతజ్ఞతలో ఉండి పని చేశాడు ..వత్సవాయిలోస్కూల్ వదిలి ఇంటికి వచ్చేలోపు  అకస్మాత్తుగా డి ఇ వొ రావటం, ఇప్పుడు మంగళాపురం లో  హంసగారి విజిట్ లో నేను సమయానికి స్కూల్ లో ఉండటం దైవం కాపాడిన ఘటనలే నని నమ్ముతాను లేకపోతె సర్వీస్ రిజిస్టర్ లో యెర్ర ఎంట్రీ పడేది .

ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మా సూల్ మీద హంసగారి నిఘా కనపడింది .ఒకసారి ఏదో సందర్భం గా సెలవు ప్రకటించాను .అది ఆయన  దృష్టి కి వెళ్లి నోటీస్ పంపటం జరిగింది. నేను ముందే పర్మిషన్ కోసం ఆయనకు రాశాను కాబట్టి సరిపోయింది .ప్రయర్ పర్మిషన్ లేకుండా సెలవు డిక్లేర్ చేయకూడదని ఒక సలహా పారేశాడు .సరేనన్నా.పాల్ గారికేసు రెండు నెలల దాకా నలుగుతూనే ఉంది .చివరికి ఏదో కొంత చేతులు తడిపి పాల్ బయట పడ్డ జ్ఞాపకం .

మా వివాహ రజతోత్సవం

మా వివాహమై 25 ఏళ్ళు అయింది .నేను మొదటిసారిగా మోపిదేవి హైస్కూల్ లో నా ఉద్యోగ జీవితాన్ని 1963లో ప్రారంభించాను .1964 ఫిబ్రవరి 21.అందుకని మా శ్రీమతిని ముందు రోజుకే మంగళా పురం రమ్మన్నాను .వచ్చింది పిల్లలూ వచ్చారు .21 ఉదయం మేమిద్దరం మోపిదేవి వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్యీశ్వర స్వామి దర్శనం చేసుకోచ్చాం .సాయంత్రం ఇంటి దగ్గర చేసిన స్వీటు హాటూ గారెలు పులిహోర ,పాయసం  ఆవడలు తో స్కూల్ స్టాఫ్ కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాను .అప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు.అందరూ ఆశ్చర్య పోయి అభినందించారు .ఇది ఒక కొత్త వరవడిని సృష్టించింది .అ తర్వాత డ్రాయింగ్ మేష్టారు పాండురంగా చార్యులగారు కూడా ఏదో సందర్భం గా గ్రాండ్ పార్టీ చేశారు . తర్వాత మరికొందరు టీచర్లు చేసి ఉత్సాహ వాతావరణాన్ని కలిగించారు .

అప్పటికే నన్ను టెన్త్ పిల్లలు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పమని వొత్తిడి చేశారు .ఎలాగూ గది తీసుకొన్నాను కనుక ఉన్న సమయం లో చెబుతానని చెప్పి ప్రారంభించా .చండ్ర ఉమా ,చండ్ర శిరీష ,మాలెంపాటి వెంకటేశ్వరరావు ,లు చేరారు అందులో ఉమా చాలా చురుకైన తెలివైన పిళ్ళ .వెంకటేశ్వరరావు మా అమ్మాయికి దగ్గర బంధువు మంచికుర్రాడు .ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి కూడా చేరింది .డబ్బులేమి తీసుకొన్నానో జ్ఞాపకం లేదుకాని ఏదో కాలక్షేపం గా సాగుతోంది .సాయంత్రం అరున్నరనుంది రాత్రి తోమ్మిదివరకు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిది వరకు నేను ఉండే రోజుల్లో చెప్పేవాడిని .లెక్కలు,ఫిజికల్ ససిన్స్ ఇంగ్లీష్ పై ఎక్కువ శ్రద్ధ  చూపేవాడిని .ఒకసారి ఏదో పనిమీద బందరు వెళ్లి మాజీ హెడ్ మాస్టారు జోశ్యుల గారింటికి వెళ్లి పలకరించాను .దంపతులిద్దరూ నన్ను గౌరవం గా ఆదరించారు .అక్కడినుంచి మా పిచ్చాలక్కయ్య వాళ్ళింటికి అంటే వారణాసి వారింటికి వెళ్లి చూసి వచ్చాను .స్పాట్ వాల్యుయేషన్ కు కాని పదవ తరగతి పరీక్షలకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా కాని వేస్తె పిచ్చాలక్కయ్య వాళ్ళింట్లోనే ఉండేవాడిని. స్వంత తమ్ముడిలాగా ఆదరించేది అక్కయ్య బావగారు కూడా అదే సౌజన్యం చూపేవారు .పిచ్చాలక్కయ్య అంటే మా రేపల్లె బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులుగారి పెద్దమ్మాయి .మా రెండోఅక్కయ్య దుర్గ కు సహాధ్యాయి .ఉయ్యూరులో  మా ఇళ్ళలో కార్య కరామతులకు  ఎప్పుడూ వస్తూండేవారు .పిచ్చాలు, బాల,సీత అక్క చెల్లెళ్ళు ,బాల , సీత గుంటూరు లో ఉంటారు .అన్నయ్యా అన్నయ్యా అంటూ  మహా ఆప్యాయం గా ఉండేవారు .

స్కూల్ వార్షికోత్సవం

మంగళాపురం స్కూలు వార్షికోత్సవం అంతకు ముందెవరూ చేసినట్లు లేదు .నేను కొత్త సాంప్రదాయం ప్రవేశ పెట్టాలనుకొన్నాను స్టాఫ్ మీటింగ్ లో చెప్పి ఒప్పించాను .అసెంబ్లీలో చెప్పి పిల్లలకు తెలియ జేశాను .ఆటలలో పోటీలు వ్యాసరచన ,వక్తృత్వం   డ్రాయింగ్ ,లలో పోటీలు నిర్వహించాలని పై తరగతులలో ను కింది తరగతులలోనూ అన్నిటా ముందున్న ఉత్తమ విద్యార్ధులకు ,స్కూల్ పరీక్షలలో కన్సలిడేటేడ్ మార్కులను బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిక్లాస్ లోను బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం .మరి దీనికి డబ్బు కావాలి .స్కూల్ ఫండ్స్ ఏమీ లేవు .అప్పుడు చండ్రఉమా స్కూల్ పీపుల్ లీడర్ గా ఒక సలహా చెప్పింది .ఊర్లోకివిద్యార్ధులే  వెళ్లి విషయం చెప్పి చందాలు వసూలు చేసి ఇస్తామని అంది .అందరూ ఒప్పుకొన్నారు .స్టాఫ్ అంతా జీతాలను బట్టి చందాలు వేశారు .వసూలు చేశాం .ఉమా ఐడియా బాగా పని చేసింది .స్వచ్చందంగా తలిదండ్రులు ముందుకు వచ్చి వాళ్లకు డబ్బులు అందజేశారు .ప్రెస్ వాళ్ళు ఆహ్వాన పత్రికలూ ,సర్టిఫికెట్లు ఉచితంగా ప్రింట్ చేసి ఇస్తామన్నారు .ఇవన్నీ చక్కగా కుదిరాయి .ఊళ్ళో చండ్ర ప్రసాద్ గారు అనే పెద్ద భూస్వామి కుర్రాడు ఉన్నారు .ఆయన్ను ఆహ్వానించాం .లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీ మేనేజర్ గారినీ పిలిచాం పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ పోటీలు జరిపించం గొప్ప పండగ వాతావరణం ఏర్పడింది .అందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు .ఎన్నడూ లేని ఐక్యత వచ్చింది .వార్షికోత్సవం పరమ వైభవం గా జరిగింది .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పాకెట్స్ ఇచ్చాం స్టాఫ్ కు ఊరి పెద్దలకు  టీ పార్టీ ఇచ్చాం .పిల్లలందరికీ దాదాపు ఏదో ఒక బహుమతియో సర్టిఫికేట్తో వచ్చేట్లు చేయటం తో వారి ఉత్సాహానికి అంతే లేకపోయింది .ఈ  యానివర్సరి చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది .

డ్రాయింగ్ మాస్టారు పదవీ విరమణ

డ్రాయింగ్ మాస్టారు పా౦డు రంగాచార్యులు గారు ఉత్తములు .గొప్ప సహాయ కారి .సేక్రేటరిగా సమర్ధం గా పని చేశారు అందరి తోనూ సంప్రదించి చక్కని నిర్ణయాలు చేసేవారు .ఒకే కుటుంబ భావన కలిగించారు .ఆయన పదవీ విరమణ అందరికి బాధ కలిగించింది ఘన సన్మానంవీడ్కోలూ  చేశాం  నేను ఆయన మీద ఒక కవిత రాసి చదివానుకూడా .తెలుగు మేష్టారు కూడా పద్యాలు రాశారు ఆయనా అంతే గొప్పగా ఇంటి దగ్గరే  అన్నీ వండించుకొని వచ్చి గొప్ప పార్టీ ఇచ్చారు .ఒకటి రెండుసార్లు సాయంత్రం స్కూల్ అవగానే తనతో పెదకల్లెపల్లికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి భార్య చేత గారెలు వండించి టిఫిన్ పెట్టించేవారు అక్కడినుండి దేవాలయానికి తీసుకొని వెళ్లి దర్శనం చేయంచి బెజవాడ బస్ ఎక్కించేవారు .చాలా గౌరవం ,మర్యాదా ఉన్న పెద్దమనిషి .రిటైర్ అయిన రెండేళ్ళ లోపే చనిపోయారని తెలిసి విచారించాను .

తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు ఆరాధ్యులు .ఒక సారి సాహితీ మండలి  సమావేశం మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరిగితే వచ్చి మంచి సాహిత్యోపన్యాసమిచ్చారు .ఆయన పాండిత్యానికి అందరం అబ్బురపద్దాం .ఆయాసం తోనే అతగోప్పగా మాట్లాడారు .ఇన్ షర్ట్ వేసేవాడేప్పుడూ .వేసవికాలం లో గుంటూరు వెళ్లి అక్కడే అకస్మాత్తుగా చనిపోయినట్లు తెలిసింది .

రంగా యాజిటేషన్

వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష బెజవాడలో చేస్తుంటే ఏంటి రామారావు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులతో దీక్ష భగ్నం చేయించాడని ,రంగా మరణం తో అట్టుడికిపోయిన కాపులు కోపావేశం తో కమ్మవారి ఆస్తులన్నీ ధ్వంసం చేయటం దానికి ప్రతిగా కాపుల ఆస్తుల్ని వీరు ధ్వంసం చేయటం రాష్ట్రం లో ముఖ్యం గా కృష్ణా జిల్లాలో గొప్ప విపత్కర పరిస్తితిని తెచ్చింది .స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. సెలవులు పొడిగించారు .కమ్యూనికేషన్ కూడా లేదు .ఒక సారి రివోపెనింగ్ కు బస్సులు లేక నేను నా లూనా మీద ఉయ్యూరు నుండి మంగళాపురం వెళ్లాను .పేపర్ చూసిన వారందరూ వచ్చారు .కాని ఎన్ డి ఎస్ అర్జునరావు మాత్రం హైదరాబాద్ లో చిక్కుకు పోయి రాలేదు .మర్నాడు బడికి వచ్చాడు .ఇప్పుడు ఏం చేయాలి ?అన్నది పెద్ద సమస్య రివోపెనింగ్ రోజున రాకపోతే సెలవులన్నీ జీతనస్టమై జీతం రాదు ,ఆయన వచ్చి బిక్క మొహం తో కూర్చున్నాడు. సంతకం పెట్ట నివ్వలేదు. డియి వొ  నుంచి పర్మిషన్ తెచ్చుకొంటేనే హాజరు లో సంతకం చేయాలి .అందరం తలలు పట్టుకు కూర్చున్నాం .డియి వొ ఆఫీసు కూదాకాలి బూదిదయింది .రికార్డులు ఏవీలేవు ఆధారానికి .దీన్లోంచి ఎలా బయటపడాలి .స్టాఫ్ మీటింగ్ వేసి అందర్నీ సంప్రదించాను .ఒకరిద్దరు ఆయనకు వ్యతిరేకం గా మాట్లాడారు .ఆ ఇద్దరినీ విడిగా పిలిచి నేను వారితో మాట్లాడాను ‘’ఇప్పటిదాకా స్కూల్ లో మంచి ఐక్యత కాపాడుకోన్నాం .మనం అందరం ఒకటిగా ఉంటె ఎవరూ మనల్ని ఏమీ చెయ్యలేరు .ఆయన ఏడుస్తున్నాడు .ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం .లీవ్ అదీ సాంక్షన్ కావాలంటే ఎంతోకాలం పడుతుంది.రికార్డులే తగలబడ్డాయి .జీతం రాకపోతే ఎవరికైనా ఇబ్బందేకదా మీరుకూడా సరే నంటే నిన్ననే ఆయన మనతో బాటు స్కూల్ కు వచ్చినట్లు సంతకం పెట్టిస్తాను ‘’అని నచ్చ చెప్పాను వాళ్ళిద్దరూ కూడా మెత్తబడి చివరికి ఆయనతో సంతకం చేయించటానికి అంగీకరించారు .అందరి సమక్షం లో అర్జున రావు తో ఆ కిందటి రోజు సంతకం చేయించాను .అందరూ కిమిన్నాస్తి .నన్ను అందరూ అభినందించారు .అర్జున రావు నాకాళ్ళమీద పడేంతగా కృతజ్ఞత మాటల్లో చేతల్లో చూపించాడు .హమ్మయ్య మళ్ళీ ఒక గండం గడిచి పిండం బయట పడిందని సంతృప్తి చెందాం .హెడ్ మాస్టారికి కొంత చాకచక్యం, కలుపుకు పోయే తత్త్వం ఉండాలని తెలిసింది .నావిజయ రహస్యం అదేనని పిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కశ్మీర్‌ కష్టాలు!

కశ్మీర్‌ కష్టాలు!
కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ కావడం కూడా మరో కారణం. జీలం నది ఉధృతి తగ్గుతూండటం ఉపశమనాన్ని ఇస్తున్నా, బుధవారం నాటి కుంభవృష్ఠిని చూసినప్పుడు ప్రమాదం తొలగిపోలేదని అనిపిస్తున్నది. మరో మూడురోజుల పాటు వర్షాలు తప్పవనీ, అందులోనూ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవని వాతావరణశాఖ చేసిన హెచ్చరిక ముప్పును తెలియచెబుతున్నది.
కశ్మీర్‌లో మార్చినెలలో ఇంతటి భారీ వర్షాలు కురవడం దాదాపు మూడుదశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి. గతంలో మాదిరిగానే జీలం నది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఆ నది పొడవునా ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అర్ధరాత్రి కమ్ముకొచ్చిన వరద వారిని భయపెట్టినా, గత అనుభవం దృష్ట్యా అధికశాతం ప్రజలు తమను తాము కాపాడుకోగలిగారు. కానీ, ఇళ్ళు కూలిపోయిన కారణంగా ప్రాణాలు పోతున్న వారి సంఖ్యే ఆందోళన కలిగిస్తున్నది. వరదలో కొట్టుకుపోయినవారు, ఆచూకీ తెలియనివారి లెక్కలు తేలడానికి సమయం పట్టవచ్చు. కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ధ్వంసం కావడంతో పాటు, జమ్మూ నుంచి శ్రీనగర్‌ వరకు జాతీయ రహదారిమీద రాకపోకలు నిలిచిపోయి వందలాదిమంది ఇరుక్కుపోయారు. వరదనీరు నిలిచిపోయిన కారణాన కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి కశ్మీర్‌లో వరదల గురించి ఇంతగా విప్పిచెప్పడం ఇప్పుడు పీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నది. మీడియా ఈ బీభత్సాన్ని వర్ణించడం వల్ల కశ్మీర్‌కు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పీడీపీ ఎంపీ తారిఖ్‌ హమీద్‌. ఆయన వాదనలో వేదన లేకపోలేదు. మొన్నటి వరదల వల్ల మిగతా రంగాల్లో తప్పని నష్టంతో పాటు, మీడియా విస్తృత ప్రచారం కారణంగా కశ్మీర్‌ తన పర్యాటక ఆదాయాన్ని ఎన్నడూ లేనంతగా కోల్పోయింది. ఈ ఏడాది కాస్తోకూస్తో కూడదీసుకోవచ్చనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చి పర్యాటకులు పెద్దసంఖ్యలో ప్రయాణాలు రద్దుచేసుకుంటున్నారు. ఆదాయం దెబ్బతింటున్నదన్న ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగినదే అయినప్పటికీ, అధికారంలో ఉన్న తాము కర్తవ్యాన్ని నెరవేర్చినదీ లేనిదీ ఓసారి ఆలోచించుకోవడం ముఖ్యం. వేసవి రాజధాని శ్రీనగర్‌లోనే రోజుల తరబడి వరద నీరు నిలిచిపోతున్నప్పుడు పర్యాటకుల రాకమీద దాని ప్రభావం ఉండకుండా పోదు. ఇటువంటి కుంభవృష్టికి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలే మునుగుతున్న మాట నిజమే కానీ, పర్యాటకులు రావాలనుకున్నప్పుడు దానికీ పరిష్కారాలు చూడక తప్పదు. ఏడునెలల క్రితం నాటి వరదలకు పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ శుభ్రపరచకుండా వదిలేసి, విమర్శలతో కాలయాపన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
గత అనుభవం దృష్ట్యా ఇప్పుడు కూడా ప్రజలే తమ బాధలేవో పడుతున్నారు కానీ, వరద హెచ్చరికల దశ నుంచి ఆశ్రయం అందించే వరకూ అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలు లేని తనం తెలిసిపోతూనే ఉంది. కశ్మీర్‌లోయను తరచూ ఇటువంటి ఉపద్రవాలు ముంచెత్తుతున్నప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం ముఖ్యం. వందేళ్ళ తరువాత మార్చినెలలో దేశం మొత్తంమీద అసాధారణ రీతిలో వర్షాలు కురిస్తే, కశ్మీర్‌లో ఇది మరింత అధికంగా ఉంది. పర్యాటకాభివృద్ధి పేరిట ఆ రాష్ట్రంలో ఎంతటి ప్రకృతి విధ్వంసం జరిగిందో తెలిసిందే. నదీ మార్గాలు, వరదనీటి మార్గాలు ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు నిలయమైపోయాయి. ఇటువంటి ప్రాంతాల్లో మరింత అధిక జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి, గతంలో పడిన గండ్లనే ఇంకా పూడ్చకుండా వదిలివేయడం దుర్మార్గం. వరదలు వచ్చినప్పుడు కనబరిచే ఆదుర్దా, హడావుడీ ఆ తరువాత ఉండవు. గత వరదల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమిని ముంచేసి అధికారంలోకి వచ్చిన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే రీతిన చేష్టలుడిగి కూర్చుంది. ఈ ఏడునెలల కాలంలో అధికభాగం అధికారంలోకి రావడానికే సరిపోయింది.
వరదలను ప్రకృతివిపత్తుగా మాత్రమే చూసినప్పుడు రాష్ట్రాన్ని దాని ఖర్మానికి దాన్ని వదిలేయడమే అవుతుంది. కశ్మీర్‌లోయను వరద ప్రాంతంగా మార్చిన పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, ఇటువంటి సందర్భాల్లో సహాయక చర్యలను సత్వరమే అందించేవ్యవస్థలను ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన సమకూర్చుకోవడం అవసరం. గత కాలపు వరదల్లో సామాన్యులతో పాటు సైన్యం కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంది. సైన్యం తప్ప ఆదుకోగలిగే వ్యవస్థంటూ అక్కడ లేదు. కేవలం విద్యుదుత్పత్తి కోసమే కాక, వరదల నివారణ కోసం కూడా డ్యాముల వంటివి నిర్మించడం వల్ల నష్టాన్ని తగ్గించగలం. గండం నుంచి గట్టెక్కిన ప్రతిసారీ ఊపిరిపీల్చుకుని కూర్చోకుండా భవిష్యత్తు గురించి కాస్తంతైనా ఆలోచించడం అవసరం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment