వీర్రాజీయ శీలం -2

వీర్రాజీయ శీలం -2

”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి

 

‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట బిందువులు ఆవిరై మేఘాల్లో కే చేరతాయంటారు వీర్రాజు గారు .అవి ఒక్కొక బి౦దువులాగానే కనపడతాయి కాని  అవికాలువలు కట్టి పారి –వాగులూ వంకలై ఏరులై పొర్లి –నదీనదాలై ప్రవహించి –చివరికి సముద్రం లోనే సంగమిస్తాయి .అందుకే సముద్రం ఏడాదికేడాది బలుపెక్కి పోతోంది .ఉన్న చోటు చాలక కొత్త జాగాల వైపు –కెరటాల్ని చాచుకొని విస్తరిస్తోంది ‘’అని వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి సునామీ సృష్టికి కారణం మానవ  అత్యాసేనని ,మానవ పీడనమూ సహేతుకం కాదని కార్మిక  పక్ష పాతిగా  పర్యావరణ వేత్తగా హెచ్చరించారు ‘’ఒక అసంబద్ధ నిజం ‘’కవితలో .ఇదే సంపుటికీ శీర్షిక అయింది .సార్ధకతా తెచ్చింది .

‘’అక్ష రానికి ఆమడ దూరం లో ఉన్నవారికి –ముఖమే కవిత్వ వేదిక ‘’అన్నారు .’’చూపుల్లో తన్మయత్వమే కవిత్వాభి వ్యక్తీ –మాటల్లో పరవశత్వమే –కవిత్వ వాహిక ‘’అని ఏంతో అద్భుతం గా కవితాత్మకం గా చెప్పారు .ప్రతిదానికీ  యంత్రాలపై ఆధారపడ్డ నేటి మనిషి సున్నిత హృదయ స్పందనలకు దూరమవుతున్నాడని గుర్తు చేశారు .బలమైన సంఘటనలు పెద్ద శబ్దాలను  మాత్రమె మనిషి స్పందిస్తున్నాడు .దీనితో రాతి కట్టు హ్రుదయామేర్పడి చెవుల్లో సీసం తో మూసుకుపోయి కుంచించుకు పోతున్నాడు .సున్నితత్వం లోపించి జీవన మాధుర్యం కరువైపోతోంది .అందుకే ఇప్పుడు ‘’ఎటు చూసినా కనిపించేవి –ఏ అభి వ్యక్తీ లేని –ఏ స్పందనా లేని –వట్టి రక్త మాంసాల రోబోలె ‘’అని నేటి ఆధునిక మానవుని కృత్రిమత్వాన్ని వదిలి౦చు కోమని  యదార్ధ జీవిత మాధుర్యాన్ని అనుభవించ మని ఒక రకం గా ఆదేశిస్తున్నారు .కవి ‘’అన్ ఎక్నాలేడ్జేడ్ లెజిస్లేటర్ ‘’అన్న సత్యాన్ని రుజువు చేశారనిపిస్తుంది .

వీర్రాజీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల  కల నేత ఉన్నప్పుడే –జీవన మాధుర్యం తెలిసి వస్తుంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను వివరిస్తే వీర్రాజుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు .’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి తగుల్తుంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తాయి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తోనే మా పేరు ప్రతిష్టలను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు పట్టాలి ఎక్కడ కనిస్తారు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తోపట్టుకొని ఫోటో దిగాటానికో ముస్ష్టివాడికి  కుంటివాడికీ సాయం చేస్తున్నట్లు ఫోటోలు దిగే చోట ,బారు  బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ తెలుగు  గడ్డమీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు .తాను  అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .

బాల్య జ్ఞాపకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ పొడి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపోయింది ఆ ఊరు .’’పక్క నున్న అర్ధాంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు ఇల్లాలిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు౦ది  అని సామెత చెప్పారు .ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపోయారు .

ఒక రైతు రంగయ్య పొలం చెక్క తడపతానికి బావి తవ్వుతూ మూడులోతుల నేలని తవ్వినా చెమ్మతగలక –మరో నిలువు లోతుకు దిగినా నీరుకాక బండరాయి తగిలినప్పుడు –కారడానికి కన్నీళ్లు లేక పొతే కవి మనస్సు చివుక్కుమన్నది .అయిదేళ్ళ తర్వాత వచ్చి చూస్తె పొర్లుతున్న బావినీళ్ళు చూసి పొంగిపోవాలో అతని పెళ్ళాం మెళ్ళో కనిపిస్తున్న పసుపు కొమ్ము చూసి బాధ పడాలో తెలియ లేదు .ప్రకృతిని అంచనా వేయటం లో తానూ రంగయ్యా పొరబాటు పడ్డామని ఒప్పుకొన్నాడు .తప్పంతా తనదే అన్నాడు .రంగయ్యలో ఆశలు రేకెత్తించి తప్పుడు సలహా ఇచ్చి అప్పుల ఊబిలో రంగయ్యను తోసేసినందుకు సిగ్గుతో కుమిలిపోయాడు .ఇది ఒక పోయిట్రీ కద.గొప్పగా చెప్పారు .

జీవితాన్ని చెట్టుతో పోల్చుకొని తనకు అన్వయంచుకొని చెప్పిన సత్యాలు అసంబద్దాలుకావు నిజమైన నిజాలే .’’చెట్టు పచ్చగా ఉన్నప్పుడు –ముఖ పరిచయస్తులు కూడా –ప్రాణ మిత్రులై పలవరించారు .-ఎగి రొచ్చిమరీ పలకరించారు ‘’కాని తానూ అన్నీ కోల్పోయి మోడిన చెట్టులా అగుపిస్తే ‘’ఆకుల్ని రాల్చుకుని అస్తిపంజరంయ్యాక –ఆత్మీయులైన వారు సైతం –కనిపించనంత దూరానికి  వలస పోయారు .’’నిజంగా ఇది పారడాక్స్ ఇన్ లైఫ్ .తాను  ఇంకా ఆశా జీవి కనుక ఏ కాస్త చిగురైనా కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు .మరో జీవిత సత్యం చెప్పారు ‘’చేసిన సాయానికి –ప్రతిఫలాన్ని ఆశించటం తప్పే౦  కాదు –అప్పుడు నువ్వుమానవుడివి –ఆశించక పొతే –పరిపూర్ణ మానవుడివి ‘’ఇదే వేద వేదాంగాల సారం .బాగా ఒంట పట్టింది కవిగారికి ..ఎన్ని తప్పులు చేసినా మనిషికి ‘’ప్రకృతి ఒక్కటే సరైన చికిత్స శాల ‘’అన్న సత్యమూ తెలిపారు .’’నెటిజన్ల’’ ను దృష్టిలో పెట్టుకొని ఒకమ్మాయి ఆంతర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు –‘’నెట్ లో నా ఫోటో పంపటానికి –అభ్యంతరం లేదుకాని –ఎదురు పడి కలుసుకోవటం – ఇష్టమేకాదు ముఖ్యం నాకు ‘’అని నిష్కర్షగా తెలిపిందిందా అమ్మాయి .చివరికి’’ నెట్ నిజం ‘’తెలియ జేస్తూ ‘’అక్షరాల్లో జారని ఆంతర్యాన్ని –ఒకరికొకరు తెలుసుకోన్నాకే –ఫోటోల్లోపడని మనసుల్ని –పరస్పరం చదువుకున్నాకే –ఏదైనా ఒక నిర్ణయం తీసుకొందాం- ఫోటోల నైనా మరింక దేనినైనా –అప్పుడే ఇచ్చి పుచ్చుకుందాం ‘’అని కరాఖండీగా చెప్పిందా అమ్మడు .ఇది వీర్రాజు గారి’’ నెట్ వేదం ‘’.వేదం అందరికీ శిరో దార్యమే కదా. అందరూ పాటించాల్సిందే .

మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్దమైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్దడం కాదు –జీవితానికి కళను   అద్దాలి ‘’అంటారు అప్పుడే అస్తవ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొందుతాయని భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్లను రంగస్థలానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్లను నిజ జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి పోవద్దన్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .

దానగుణం గల దాన శీలురను ‘’దానం చేయండి –ఒక బుక్కు అచ్చేసుకొంటాను ‘-మీ పేరు చెప్పుకొని ఓ పుస్తకం  వెలుగు లోకి తెచ్చుకొంటాను ‘’అని తమాషాగా అన్నారనిపిస్తుంది .అంటే డబ్బును సార్ధకం చేసుకొని కవిని కవిత్వాన్ని రచయితను రచనలను బతికించమని కోరారని భావించాలి .వాతావరణ పాఠం చెబుతూ ‘’కళ్ళ జోడు అతని ఆత్మరక్షణ కవచం –దాని వెనక దాక్కున్న అతని మనసులో –బాధా ,కోపం ఏదైనా ఉండచ్చు ‘’అన్నారు .మిత్ర లేఖ లో ‘’అక్షరాల్లో  దట్టిం చాల్సింది  –ఆగ్రహమే కాని ద్వేషం కాదు –కవికి ఉండాల్సింది –సంయమనమే కాని ఆవేశం కాదు ‘’అని అక్షరోపదేశం గా అక్షర సందేశం ఇచ్చారు .బిరుదులూ ఫ్లేక్సీలు  బేనర్లూ కీర్తికి కొల బద్దలు కావని ‘’కీర్తికి పెద్ద పీటవేసినంత కాలం –నీ ప్రతిభకు జేజేలు పలకరు –నువ్వు నిరాడంబరుడ వైతేనే –నీకూ నీ వ్యక్తిత్వానికి గౌరవం –నీ మాటకూ నీ రాతకూ అప్పుడే విలువ ‘’నిరాడంబరతకు పెద్ద పీట వేశారు వీర్రాజుగారు. తాను  అనుసరించిన బాట ఇదే .ఆచరించి చెప్పిన మాట కనుక గొప్ప విలువ ఉంది .

‘’మరణ భయం చుట్టుముట్టి –నత్తలా మనసు ముడుచుకు పోయినా –‘’అది తనకు తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల వైపు,పూజా పునస్కారాల్లోకి  జారిపోకుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రాంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థలి –నా అక్షర ప్రాంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రాజుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తాలని మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది .ఆ అక్షర ,చిత్రజీవి  మరింత అక్షర రాశిని  మరిన్ని రంగుల చెలువములను   వర్షించాలని ఆశిద్దాం  .

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93

స్టాఫ్ పరిచయం

మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ సేక్షన్లే .అంతా వెనకబడిన విద్యార్ధులే  ఎస్ సి ఎస్ టి లు ఎక్కువ .స్కూల్ ఆదాయం ఏమీలేదు .ఇంచార్జ్ గా ఉన్న ఘంటసాల నేటివ్ అయిన సైన్స్ మేస్టార్  పాలు దగ్గర నేను చార్జి తీసుకొన్నాను .ఆయన నంబర్ వన్ బద్ధకిస్ట్  .బయాలజీ వాడు .ఫిజికల్ సైన్స్ తో ఏ ప్రవేశం లేనివాడు .ఇక పిల్లలకేం చెబుతాడు ?లేక్కలాయనా ఘంటసాల వాడే. వెంకటేశ్వర రావు అని జ్ఞాపకం .వీళ్ళిద్దరికీ కుల వైరం .ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకరిపై ఇంకొరు చాడీలు చెప్పేవారు .సోషల్ మేష్టారు కూడా వెంకటేశ్వరరావు .చాలాకాలం నుంచి ఇక్కడే  పని చేస్తున్నాడు .ఈయన గౌడ. లేక్కలాయన గొల్ల .జాతివైరం వీరిద్దరికీ .తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు  . బందరునుండి రోజూ టివి ఎస్ మీద వచ్చేవాడు .మంచికవి గాయకుడు ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు బాగా చేసేవాడు బాగా ఆయాసం మనిషి ఊపిరి పీల్చతమే కష్టంగా ఉండేది .బందరు లో  బాలానందం అనే స్కూల్ నడుపుతున్నాడు గొడుగు పేటలో .భార్య సీతారావమ్మ కవి తెలుగుపండిట్ ఆవిడే ఆ స్కూల్ చూస్తుంది . క్రాఫ్ట్ మేష్టారు కూడా మల్లికార్జున రావు .చల్లపల్లి  నుండి వస్తాడు .ఇక్కడ యెన్ డి ఎస్ పోస్ట్ కూడా ఉంది .అర్జున రావు అనే ఆయన ఎం.డి .ఎస్ .దగ్గరే ఉన్న పెదకళ్ళేపల్లి నుండి వస్తాడు .డ్రాయింగ్ మాస్టారు బంగారు పని చేసే వ్రుత్తి పాండురంగా చార్యులు ఈయనా కల్లెపల్లినుండే అప్ అండ్ డౌన్ సైకిల్ మీద .చాలా మంచివారు .డ్రిల్ మాస్టారు ఉమామహేశ్వరరావు కమ్మవారు  .చల్లపల్లిదగ్గర రామాపురం నుండి వస్తాడు.డ్రిల్లుకు ఎండిఎస్ కు పడదు. ఎప్పుడూ పితూరీలే  .సెకండరీ గ్రేడ్ టీచర్ లలో ఒకావిడ సోషల్ మేస్టారి భార్య అని గుర్తు . రెండో ఆవిడ  క్రాఫ్ట్ మేస్టారిభార్య అనిజ్ఞాపకం .గుమాస్తా కరీం –బందరు నుండి వచ్చేవాడు. కాలేఖాన్ పేట వాడు .సీనియర్ అయినా భయస్తుడు . కల్లేపల్లి ఆంజనేయులు నైట్ వాచ్ మాన్ ..ఇతనిది  సర్వీస్ అంతా ఇక్కడే మేనల్లుడికి కూతురు నిచ్చి పెళ్లి చేశాడు వాడు అమాయకుడు తన తర్వాత ఆపోస్ట్ అతనికి వేయించాలనే ఆలోచన .అటెండర్ వెంకటేశ్వరరావు లోగడ వత్సవాయి లో నా దగ్గర పని చేసిన లక్ష్మీ పురం వాడు .మంగళాపురానికి లక్ష్మీపురానికి రెండుకిలో మీటర్ల దూరం .అతనికి అక్కడ ఇల్లు పొలం ఉన్నాయి తల్లి ,భార్యా పిల్లలు ఉన్నారు .దారిలోనే రోడ్డుమీదే ఇల్లు .ఇలాంటి అస్తవ్యస్త పరిస్తితులలో స్కూల్ లో చేరాను .ఇక్కడ శాశ్వతం గా ఉండిపోవాలనే కోరిక కూడా నాకు లేదు .కనుక కాలక్షేపం చేసి బయటపడటమే .కాని ఉన్నన్ని నాళ్ళు నాప్రత్యేకత చూపాలి .అదే నా దారి.

ఇంగ్లీషు, సైన్సు బోధన

మెయిన్ బిల్డింగ్ లో  హెడ్ మాష్టారి రూమ్  సైన్స్ రూమ్ ఉన్నాయి . మిగిలిన క్లాసులన్నీ రేకుల షెడ్ లోనే . స్కూల్ కు గేటు కాంపౌండ్ వాల్ కూడా లేవు .వ్యవసాయ భూములున్న ప్రదేశం కనుక పశువులన్నీ పాఠ శాలలోనే ఉండేవి వీటిని రాకుండా చేయటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది .అటెండర్ మంచివాడేకాని జాదూ .అర్జునుడు కస్టపడతాడుకాని కబుర్ల పోచికోరు కోటలు దాటతాయి మాటలు .భారీ పర్సనాలిటీ .ముందు పిల్లలను దారిలో పెట్టాలనుకొన్నాను .నేనే పదవ తరగతికి ఫిజికల్ సైన్స్ ,ఇంగ్లీష్  వేసుకొని బోధించటం ప్రారంభించాను .సాధారణం గా హెడ్ మాస్టర్లు ఒక అయిదు పీరియడ్లు టెన్త్ పోయిట్రీ వేసుకొని కాలక్షేపం చేస్తారు .నేను దీనికి విరుద్ధం గా ఫిజికల్ సైన్స్ కూడా తీసుకొని చాలేన్జీగా పని చేశాను .పిల్లలకు అసలు ఫిజిక్స్ మీద అవగాహన లేదు .అందుకని చాలాకస్టపడాల్సి వచ్చేది.చెప్పటం చెప్పించటం అప్పగించుకోవటం బ్రీఫ్ గా నోట్స్ డిక్టేట్ చేయటం చేసి గాడిలో పెట్టాను .క్లాసుకు వెడితే సబ్జెక్ట్ రాకపోతే ఊరుకొనే వాడిని కాను. రోజూ ఒకటి ర్రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇంటి దగ్గర రాసుకొచ్చి చూపాల్సిందే  .రెండు నెలలు ఆయె సరికి అందరూ దారికోచ్చారు .నెమ్మదిగా మాస్టార్లు కూడా గాడిలోపడ్డారు కంప్లైంట్లు పోయి పని చేయటం మొదలుపెట్టారు .నెలకు రెండుసార్లు స్టాఫ్ మీటింగ్ పెట్టి క్లుప్తం గా ప్రసంగించి కర్తవ్యమ్ చెప్పి చేయిన్చేవాడిని .’’బేఫరవా’’ జీవితం లోంచి మామూలు జీవితం లోకి వచ్చారు అందరూ .ఐకమత్యం సాధించాను .విద్యార్ధులలో గౌరవం పెరిగింది .వాళ్ళు నేనేది చెబితే అది చేసే స్తితికి వచ్చారు .స్కూల్ కు మంచి చేస్తున్నారు హెడ్ మాస్టారు ఇదివరకు ఎవరూ చేయని పనులు చేస్తున్నారని కొత్తపద్ధతులతో ఆకర్షణీయం చేస్తున్నారని వాళ్ళ మనస్సుల్లో పడిపోయింది .కొట్టినా తిట్టినా కిమిన్నాస్తిగా ఉన్నారు .లేక పొతే ఇక్కడ చాలా ప్రమాదం. ఇది కమ్యూనిస్ట్ అగ్రనాయకుడు చండ్ర రాజేశ్వర రావు గారి స్వగ్రామం .ఆయన ఇల్లు స్కూలుకోచ్చేదారిలోనే ఉంది .చండ్ర వారి కుటుంబాలున్నాయి .మైనం పాటి వారూ బాగా సంపన్నులు .

చల్లపల్లి టు మంగళాపురం టు కళ్ళే పల్లి

మంగళాపురం కు ఉయ్యూరు నుండి రావాలంటే అవనిగడ్డ బస్ ఎక్కి చల్లపల్లి లో దిగి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి రావాలి ఈ బస్సు చల్లపల్లిలో బయల్దేరి లక్ష్మీ పురం మీదుగా మంగళా పురం వచ్చి అక్కడినుండి పెదకళ్ళీ పల్లి వెడుతుంది .ఇరుకు దారి చిన్న వంతెనలు .బస్ ఎప్పుడూ రద్దీ .కల్లేపల్లి లో ఒరిఎంటల్ హైస్కూల్ ఉంది .హెడ్మాస్టారు సైన్స్ మేస్టారే నాకు పరిచయం ఉంది ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తూ పంచ అంతా  ముక్కుపొడి తో కనిపిస్తారు .రామభాద్రాచార్యులు ఇంగ్లీష్ లో నిధి అ తర్వాత చాలా ప్రమోషన్లు పొంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఇంగ్లీష్ఓరి ఎంటేషన్క్లాసులు చెప్పేవారు టీచర్స్ కు. చల్లపల్లిలో బస్సు ఒక్కోసారి సమయానికి బయల్దేరదు .ఇది లేకపోతె చల్లపల్లిలో  బందరు బస్ ఎక్కి లక్ష్మీ పురం దిగి అక్కడ ఆతోలేక రిక్షా ఎక్కి మంగళా పురం రావాలి .చల్లపల్లి నుండి ఇక్కడికి రావటం చాలా ప్రయాస తో కూడి ఉండేది సమయానికి ఏవీ అందేవికావు .నేను లక్ష్మీపురం ఏదో రకం గా చేరి అక్కడ అటెండర్ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్ళేవాడిని వాళ్ళ ఇంట్లో కఫీకాని మజ్జిగ కాని ఇచ్చేవారు తాగి అతని సైకిల్ మీద మంగళాపురం చేరేవాడిని .ఉదయం తోమ్మిదిన్నరకల్లా స్కూల్ లో ఉండటం  నాధ్యేయం .అసెంబ్లీ జరిపించి పిల్లల్ని క్లాసులకు పంపటం అలవాటు .దానికే ఇబ్బందీ రాకుండా జాగ్రత్త పడేవాడిని .మేస్టార్లు కూడా సమయానికే వచ్చేవారు .వేసవికాలం లో ఒంటిపూట బడులలో మరీ ఇబ్బందిపడాల్సి వచ్చేది .ఉయ్యూరులో తెల్లవారుజామున మూడింటికే లేచి ప్రభావతి అన్నం వండి కూరలు చేసి కారేజి సర్ది ఇస్తే తీసుకొని హైదరాబాద్ అవనిగడ్డ బస్  ఉదయం నాలుగున్నరకే ఉయ్యూరులో ఎక్కి అయిదున్నరకు చల్లపల్లి చేరి అక్కడినుండి ప్రైవేట్ బస్ కోసం ఎదురు చూపులు చూడటం సరిపోయేది .విసుగొచ్చేది ఎందుకు అడిగాన్రా బాబూ మంగలపురం అనుకొనే వాడిని .

మళ్ళీ ఒకే గదిలో’’అమ్మాయి ఇంట్లో ‘’కాపురం

మామూలు రోజుల్లో స్కూల్ అవగానే కళ్ళేపల్లి  బస్ సాయంత్రం అయిదింటికి వచ్చేది .అది ఎక్కి చల్లపల్లి సెంటర్ లో దిగి బెజవాడ బస్ ఎక్కి ఉయ్యూరు చేరేవాడిని ఒక్కోసారి రాత్రి ఏడున్నర దాటేది .ఎందుకైనా మంచిదని అర్జునుడితో దగ్గరలో ఎక్కడైనా మంచి రూము దొరుకు తుందేమో చూడమన్నాను .చూశాడు మైనం పాటి వేణుగోపాల రావు గారిల్లు స్కూల్ కు అతి దగ్గర .అక్కడ ఒక రూమ్ నాకు ఇస్తామన్నారు .వెళ్లి చూశాను .వేణు భార్య విజయ అతని తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం చాలా మంచిగా ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంతో గొప్ప అనుకొన్నారు .నెలకు యాభై లేక అరవై రూపాయల అద్దె  .పాలిష్ రాయి .విశాలమైన గది .సెప్టిక్ లెట్రిన్ బాత్ రూమ్ .వరండా .చాలాబాగా నచ్చింది .వంట సామాను తెచ్చుకొని దిగాను .నాకు ఉదయమే కాఫీ ,పెరుగు ,మధ్యాహ్నం టీ సాయంత్రం టీ వాళ్ళ ఇంట్లో ఏ టిఫిన్ చేసుకొంటే నాకు అది తెచ్చిపెట్టటం దొడ్లో పండిన కూరలు ఇవ్వటం విజయ నన్ను కన్న తండ్రి ని చూసినట్లు చూసింది .అందుకే విజయను’’ మా అమ్మాయి ‘’అనే అందరికీ చెప్పేవాడిని  చాలా మర్యాదగల వాళ్ళు భార్యా భర్తలు ఏంతో ఆప్యాయతను చూపారు .వేణు తండ్రిగారు కూడా ఏంతో మర్యాదగా ఉండేవారు .వ్యవసాయం పాడి అన్నీ ఉండేవి .వీరి ఇంటికి అటూ ఇటూ కజిన్ బ్రదర్స్ ఇళ్ళునాలుగూ ఒకే మోడల్ గా ఉండేవి .వారూ నేనంటే ఆత్మీయత ప్రదర్శించేవారు .ఒకాయన సంజీవరావు లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీలో ఉద్యోగం .ఇంత అన్నం స్టవ్ మీద ఒండుకొంటే చాలు అన్నీ అమరిపోయేవి .అర్జునుడు పొద్దున్న సాయంత్రం వచ్చి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి వెళ్ళేవాడు .స్వంత ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ నాకు ఇక్కడ ఉండేది .వత్సవాయిలో పుల్లయ్య నాయుడు ,ఇల్లు పెనుగంచిప్రోలులో బాబుగారిల్లు ,ముప్పాళ్ళలో  సీతారావమ్మగారిల్లు ,గండ్రాయి లో భారతమ్మగారిల్లు ,ఇప్పుడిక్కడ ‘’మా అమ్మాయి ఇల్లు’’  నాపాలిటి గొప్ప ఆశ్రయాలవటం నా అదృష్టం కంటే వారి  సౌజన్యం అనే నేను భావిస్తాను .

లక్ష్మీపురం ఫాక్టరీ –చల్లపల్లి రాజా

ఈ ఫాక్టరీ ఉయ్యూరు కే సిపి వారి అధీనం లోనే నడుస్తోంది .ఫాక్టరీ లక్ష్మీపురం లో ఉంది .చిన్నదే .ఒకప్పుడు చల్లపల్లి రాజా శ్రీమంతు రాజా యార్ల గడ్డ శివరాం ప్రసాద్ బహద్దూర్ గారిది .వేలాది ఎకరాలలో చెరుకు పండించేవారు .తర్వాత ఉయ్యూరు షుగర్ ఫాక్ట రీకి అమ్మేశారు .శివగంగ అనే చల్లపల్లి బందరు రోడ్డులో బందరుకు దగ్గర గొప్ప శివాలయం రాజావారిదే .శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరిపేవారు .రాజావారు ఏనుగు అంబారీపై ఊరేగేవారు .గొప్ప రాజ ఠీవి దర్జా ఉన్నవారాయన జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా  కూడా పని చేశారు .రాష్ట్ర ప్రభుత్వం లో ఆరోగ్య శాఖా మాత్యులుగా సేవలందించారు .గొప్ప వితరణ శీలి .ఆయన దగ్గర పని చేసి బాగుపడని కుటుంబమే లేదు .తిరుపతి వేంకటకవులు ఇక్కడికి వచ్చి రాజాగారి సన్మానాలు అందుకోనేవారు .గరికపాటి కోటయ్య ,వగైరా సంగీత విద్వాంసులకు నెలవు చల్లపల్లికోట .కల్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితమైనది .కృష్ణానది ఒడ్డునే ఉంటుంది .ఉత్సవాలు చాలాఘనం గా నిర్వహిస్తారు కదళీ వనమే కళ్ళే పల్లి అయింది .వేటూరి ప్రభాకర శాస్త్రిగారిది ,సంగీత విద్వాంసులు పారుపల్లి  వారిది సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తిగారిది ఈ ఊరే .దీని దగ్గరలోనే ఉన్న టేకు పల్లి లో సుస్వరాల హేల ఘంటసాల వెంకటేశ్వర రావు జన్మించారు .ఆయన శిలా విగ్రహాన్ని బాల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించాడు .వేటూరి సుందర రామ మూర్తిగారిడీ ఈ ఊరేనండోయ్ .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15 –ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

భారత రత్నమే వాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో?

తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో? – జీఎల్‌ఎన్‌ మూర్తి
వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది పోలెండ్‌ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
రెండు తెలుగు రాషా్ట్రల ఆవలివైపు జరుగుతున్న రంగస్థల కార్యకలాపాలపై అంతగా పట్టింపులేని మన నాటక సంస్కృతిలో 64 ఏళ్ళు గడిచిపోయాయి. యునెస్కో సౌజన్యంతో నూరు పైచిలుకు దేశాలు వాటిల్లో మన దేశంలోని ఇతర రాషా్ట్రల వారు పాలుపంచుకుంటున్నా తెలుగు నాటకాల వారిలో ప్రపంచ రంగస్థల దినోత్సవ స్ఫూర్తి కొరవడింది. కొద్దిమందికి మాత్రమే అంతంతమాత్రం తెలిసిన అంతర్జాతీయ నాటకరంగం పోకడలు అందరికీ తెలిసేలా చూసే ప్రయత్నాలు ఏ మాత్రం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. వేల వేదికలపై ఏటేటా ప్రపంచ నాటక దినోత్సవ వేడుకలు జరిగే సందర్భాలు, ఆయా వేదికలపై చోటు చేసుకుంటున్న ప్రదర్శనలపై ఏ మాత్రం ఆసక్తి, సమాచారం లేకుండానే తెలుగునాట నాటకాల వేడుకలు ఎవరికి తోచిన తీరులో వారునిర్వహిస్తూ సంబరపడిపోతున్నారు. తెలుగు నాటక దినోత్సవం కావాలని చాలా ప్రయత్నాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున ్న స్టేట్‌ ఫెస్టివల్‌ హోదా వేడుకలు కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. రెండు రాషా్ట్రలుగా విడిపోయాక తెలుగు నాటకరంగంలో తప్పటడుగులు పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వంలో పలుకుబడి గల నాటక ప్రేమికుల వల్ల నాటక నంది ఉత్సవాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవటంతో నాటక రంగ ఉత్సవాలు ప్రదర్శనలు ఆంధ్ర నాటకరంగ ప్రభావంలోనే తారట్లాడుతున్నాయి. నంది బహుమతులు, ఆ పురస్కారాలు గుర్తించమని, అవి మాకొద్దు అని తెలంగాణ ప్రభుత్వం, అక్కడి మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అయినా తమ ప్రత్యేకతను చాటే పురస్కారం అందుకు సంబంధించిన ప్రతీకలు ఆ ప్రభుత్వం ఎంచుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ వారు రాషా్ట్రల విభజన ఉద్యమాల వల్ల అంతరాయం కలిగిన నాటక నంది పోటీలను క్రమబద్ధీకరించుకుంటూ రాజమండ్రిలో ఉత్సవాల నిర్వహణకు తెరతీశారు. భారీ వ్యయ ప్రయాసలతో అందుకు తగిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఆ ఊపులోనే తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఆంధ్ర నాటక రంగ అభివృద్ధి సంస్థలో చురుకందుకున్నాయి. ఏప్రిల్‌ 16న కందుకూరి వీరేశలింగం పుట్టిన రోజును తెలుగు నాటకం పుట్టిన రోజుగా 1996లో ప్రభు త్వం ఖరారు చేసింది. నందమూరి తారకరామారావు పుట్టిన రోజున నంది నాటక ఉత్సవాలు బహుమతి ప్రదానం జరిగేలా 1998లో ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావటంతో కాంగ్రెస్‌ పెద్దలు నాటక నందిని అస్తవ్యస్తం చేశారు. రాషా్ట్రల విభజన తరువాత ఆంధ్రలో మళ్లా అధికార పగ్గాలు చేపట్టిన తెలుగు దేశం ప్రభుత్వంలో మాగంటి మురళీమోహన్‌ అలనాటి నాటకనంది ఒరవడి మళ్లా తమ పద్ధతిలో జరిగేలా అన్నింటిని సరిదిద్దారు. మే నెలలో రెండుసంవత్సరాలకు చెందిన పోటీలు ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకలతో ముగిసేలా కార్యక్రమాన్ని ఖరారు చేసారు. తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమాలలో పెద్ద గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం తీరును స్వయం ప్రకటిత నాటకరంగ పెద్దల జోక్యం అవగాహన లేని అధికారుల పెత్తనం నుంచి మొత్తంగా తప్పించేలా విధాన నిర్ణయం చేశారు. సాంస్కృతిక శాఖ వారి అవకతవకల నిర్వహణ తెలుగు విశ్వవిద్యాలయం అనవసరపు పాత్రను మొత్తంగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రంగస్థల కళాకారులు సమష్టిగాచేసుకునే వేడుక ఇప్పటి స్థితిలో కుచించుకుపోయింది. ఆంధ్రప్రాంతంలో అయినవారికి కానివారికి సన్మానాలు చేసి నగదు బహుమతులిచ్చి సరిపెట్టుకోవటం తప్ప స్పష్టమైన ప్రణాళిక పద్ధతిలేని తీరును పైరవీలతో భ్రష్టుపట్టిన నాటక దినోత్సవం నిజంగా అర్థవంతంగా జరిగేలా చేయాలన్న సంకల్పం మాత్రం అధికారికంగా చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ వికాసం కోసం చాలా చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంచాలకులు చేసిన ప్రకటనలు విధాన కల్పన అధికారిక ఉత్తర్వులు దశ దాకా రానేలేదు. నాటకరంగానికి నిర్ణయాత్మక అధికారానికి సన్నిహితంగా రెండు రాషా్ట్రల ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన మురళీమోహన్‌, కె.వి. రమణాచారిల ప్రయత్నాలు రెండు ధ్రువాలుగా మారాయి.
తెలంగాణ కళాకారులు ఆంధ్ర ప్రభుత్వం వారి నందుల కోసం దరఖాస్తు చేసుకుని వెంపర్లాడే దశ వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారి ప్రమేయం ఆ విద్యార్థితరం వారిలో తప్ప తెలుగునాటక రంగ కళాకారుల్లో ప్రపంచ రంగస్థల దినోత్సవం పట్ల ఆసక్తి, అవగాహన లేవు. 1961 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంతర్జాతీయ నాటక రంగ ప్రముఖులతో సందేశం ఇప్పిస్తున్న ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి కార్యకలాపాలపై తెలుగు కళాకారులలో అవగాహన చైతన్యం పెంచే ప్రయత్నాలు అధికారికంగా కాని నాటకాలు నిర్వహించే సాంస్కృతిక సంస్థల ద్వారా గానీ జరిగినవి శూన్యం. తెలుగు నాటక రంగం నుంచి ఫ్రాన్స్‌లో గల అంతర్జాతీయ నాటక సంస్థతో పరిచయం పెట్టుకున్న ఏకైక ప్రయోక్త పద్మభూషణ్‌ ఎ.ఆర్‌. కృష్ణ కృషిని కూడా స్మరించుకోవటం పలుచబారి పోయింది. మరుపుమరకల్లో మలిగిపోయింది. మనం 64 ఏళ్ళుగా నాటక రంగంలో ప్రముఖుల్ని గుర్తిస్తున్న ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాబితాలో కన్నడ రాష్త్రం నుంచి గిరీష్‌ కర్నాడ్‌ ఒక్కడు మాత్రమే చోటుచేసుకున్నారు. 2002లో ఆయన ద్వారా వందకు పైగా ప్రపంచ దేశాలవారికి రంగస్థల సందేశం ఇప్పించారు. ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఏటేటా ప్రదానం చేస్తున్న ఆ సంస్థవారికి మన ప్రాంతీయుల సృజన ప్రదర్శనల సంగతులు తెలియచెప్పే ప్రయత్నమే జరగలేదు. 22కు పైగా భాషల్లో అనువాదంతో పాటు ప్రపంచరంగస్థల దినోత్సవం జరిగే అన్ని వేదికలపై కళాకారులు ప్రేక్షకులు అందిపుచ్చుకునే సందేశం మన దేశంలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ భాషల్లో అధికారికంగా అనువాదంతో పాటు ప్రాచుర్యం పొందుతున్నాయి. 2015 ఏడాదికి గాను పోలెండుకు చెందిన డైరెక్టర్‌ క్రిష్టోప్‌ వర్లికోవస్కీ వెలువరించారు. అసలుసిసలు ప్రయోక్తలు రంగస్థలంనుంచి ఎంత ఎడంగా ఉన్నా మంచి ప్రదర్శనలు ప్రక్రియలు రూపొందించి ప్రేక్షకుల అభినందనలు అభిరుచులు ప్రామాణికంగా పెంచుతూనే ఉంటారన్న వివరణల సందేశం ఆయన వెలువరించారు. వార్సాలోని న్యూథియేటర్‌ను నిర్వహిస్తూ షేక్స్‌పియర్‌ నాటకాలను నృత్య రూపాలుగా మలచటంలో ఆయన ప్రపంచ ఖ్యాతి గ డించారు. ఆఫ్రికన్‌ టేల్స్‌, ఏ ఉమన్‌ విథవుట్‌ ఏ షాడో, కింగ్‌ రోజర్‌ రిటర్న్స్‌ వంటి నాటకాలతో అంతర్జాతీయ స్థాయి నాటకకర్తల్లో అగ్రస్థానంలో నిలిచారు. వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అంది పుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ ఏడాది ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా పోలెండ్‌ నాటక రంగ ప్రముఖులు వర్లికోవస్కీ అందించారు.
జీఎల్‌ఎన్‌ మూర్తి
(నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విగ్రహ పూజలు ఎందుకు?

విగ్రహ పూజలు ఎందుకు?

భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం.
వేదాల రచనా పద్ధతిని బట్టి వాటిలో విషయాన్ని మూడు స్థాయిల్లో చెప్పినట్లు విద్వాంసులు చెపుతారు. మొదటిది యజ్ఞాలు, కర్మలు, వాటిని ఎలా నిర్వహించాలి మొదలైనవి. దీనిని కర్మకాండ అంటారు. మనిషి ఒక పద్ధతిలో, క్రమశిక్షణలో నడవడం, యజ్ఞం, దానం మొదలైన వాటి ద్వారా మనసు పవిత్రం కావడం కోసం కర్మలు పనికి వస్తాయి. ఇది చాలా ముఖ్యమే కాని ఇదే పరమాత్మ జ్ఞానం కాదు. రెండవది ఉపాసనకాండ. కర్మల్లో మునిగితేలే వ్యక్తిని క్రమక్రమంగా దైవస్వరూపాన్ని గూర్చి ఆలోచింపజేయడానికి ఉపాసనలు చెప్పబడ్డాయి. ‘ఉప’ అంటే ‘సమీపంలో’, ‘ఆసనం’ అంటే ‘ఉండడం’. వేదమంత్రాలు వివిధ దేవతల స్వరూపాల్ని చెపుతాయి. ఈ దేవతలన్నీ ఒకే చైతన్యంలో వివిధ దృష్టికోణాల నుంచి చూడబడే శక్తులు. అయినా మనిషి తన అభిరుచి ప్రకారం ఒక్కొక్క శక్తిని ఇష్టపడతాడు. ఒకడు విద్యకోసం సరస్వతిని ఉపాసిస్తాడు. మరొకడు ధనం కోసం లక్ష్మీదేవిని ఉపాసిస్తాడు. రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు దుర్గాదేవిని ఉపాసించేవారు. అలాగ ఒక్కొక్క వ్యక్తి తన ఇష్టం మేరకు దేవతామంత్రాలను తీసుకుని అర్థాన్ని మననం చేస్తూ ధ్యానించే సంప్రదాయం వచ్చింది. దీని వల్ల రెండు లాభాలు. తను చేస్తున్న పనిపై శ్రద్ధ ఏర్పడటం, మనస్సు ఏకాగ్రం చేయగలగడం. కేవలం యాంత్రికంగా కర్మలు చేయడం కాకుండా అర్థం తెలుసుకుని చేయడం అనే స్థాయికి వస్తాడు. అర్థం తెలుసుకుని ఉపాసిస్తే ఫలితం అధికంగా ఉంటుందనేది ఉపనిషత్తుల మాట. కర్మలతో పాటు ఉపాసనలు చేయడం రెండవస్థాయి.
దీని తర్వాతి స్థాయి జ్ఞానకాండ. పై రెండింటి వల్ల కలిగిన పవిత్రత ఏకాగ్రత ద్వారా జ్ఞానానికై ప్రయత్నించడం. ఇది పూర్తిగా శాసీ్త్రయమైన పరిశీలన. ఈ వ్యాసంలోని విషయం కాదు.
ఉపాసనకు ఆధారమైంది మంత్రము, దాని అర్థము అని పైన చూశాం. ఈ మంత్రార్థాన్నే రేఖాగణితంలోని సంకేతాల వలె చిత్రీకరించి చూపితే యంత్రం అవుతుంది. శ్రీచక్ర ఉపాసన గూర్చిన పుస్తకంలో దేవీ స్వరూపాన్ని త్రికోణాలు, చతుర్భుజాలు వేసి వివరించడం చూస్తాం. వీటన్నిటికీ సాంకేతిక అర్థాలు చెప్పారు. సరిగ్గా ఇలాంటి అర్థాన్నే ఆంగ్లంలో ఇటీవల వచ్చిన నవల (హాలీవుడ్‌ సినిమా కూడా) ‘డావిన్సీ కోడ్‌’ లో చెప్పిన యంత్రంలో చూడగలం. ప్రాచీన యూర్‌పలోని సోలమన్‌ దేవాలయంలో ఉన్న చిహ్నంగా రచయిత చెప్పాడు. ఒక్కో తత్త్వాన్ని ఒక్కో దేవతగా భావించి మొదటగా దాన్ని వర్ణించే మంత్రం, దానికే ఒక యంత్రం, ఇలాగ తంత్రశాస్త్రం అనే పేరుతో ఒక శాస్త్రమే బయలుదేరింది. ఈ యంత్రాలు కూడా ఉపాసనకు ఒక ఆధారం.
తర్వాతి కాలంలో మంత్రార్థాన్ని సూచించే చిన్న బొమ్మను ఎదురుగా ఉంచుకోవడం, దానిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయడం అనే ఆచారం వచ్చింది. ఇటి బొమ్మనే ప్రతీక అంటాం. ఇది రాను రాను దాన్ని తయారు చేసేవాడి నేర్పరితనాన్ని బట్టి అందమైన విగ్రహరూపంలోకి మార్పు చెందింది. ఈ విగ్రహాల ప్రమాణం కూడా పెరుగుతూ వచ్చింది. విగ్రహాలు వద్దన్న గౌతమబుద్ధుడికే మనవాళ్ళు అతి పెద్ద విగ్రహాల్ని చెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల ధ్వంసమైన బమియాన్‌ బుద్ధవిగ్రహాలు ప్రపంచంలో కెల్లా పెద్ద శిల్పాలని చదివాం. నిజానికి వేదకాలం నాటికి ఈ విగ్రహాలు లేవని పండితుల అభిప్రాయం.
ఈ విగ్రహాలలో కూడా సాంకేతికపరమైన అర్థం ఉంది. మంత్రంలో ఉన్న అర్థాన్నే యంత్రంగా మార్చాం. ఆ తర్వాత చిన్న ప్రతీకగా మార్చాం. దాన్నే విగ్రహంగా మార్చాం. అందుకే మంత్రాన్ని మొట్టమొదటి దేవాలయం అంటారు. మంత్రంలో ఉన్న అర్థాన్ని మనస్సులో భావన చేసినట్లే విగ్రహంలోని విశేషాల్ని కూడా భావన చేయవచ్చు. ఉదాహరణకు గాయత్రీదేవికి ఐదు తలలు అనే మాటకు సంకేతార్థం ప్రార్థనా శ్లోకంలోనే చెప్పబడింది. ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలు, పాశం, వరదముద్ర, అభయముద్ర మొదలైనవాటికి కూడా సాంకేతికార్థాలు చెప్పారు. అలాగే విష్ణువు చేతిలోని శంఖం, చక్రం మొదలైనవి దేన్ని సూచిస్తాయో భాగవతం వివరిస్తుంది. ప్రతి దేవతా రూపాన్ని ఇలాగే తెలుసుకోగలం.
విగ్రహం అనేది ఒక సాధనం మాత్రమే. మనం దాన్నే పూజించడం లేదు అని తెలుసుకోవాలి. దాని ద్వారా దేవతాతత్త్వాన్ని భావిస్తున్నాం. మనస్సును కేంద్రీకరించడానికి ఇదొక సాధనం మాత్రమే. అందుకే రామతాపనీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు- ‘‘చిన్మయస్య అద్వితీయస్య నిష్కలష్య అశరీరిణ:, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా’’. నిజమైన తత్త్వం ఒకే ఒక శుద్ధ చైతన్య రూపం. దానికి శరీరం లేదు. అవయవాలు లేవు. అయినా ఉపాసకులకు సులభంగా ఉండడానికై నిర్గుణమైన తత్త్వానికి ఒక రూపకల్పన చేయబడింది అని ఈ శ్లోకం అర్థం. విగ్రహం అనే మాటలో ‘వి’ అంటే ‘విశేషంగా’, ‘గ్రహ’ అంటే ‘గ్రహించడం’. విశేషంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించేది అని అర్థం. The idea of God becomes the idol of God అని చెప్పవచ్చు. ఇదొక ఆధ్యాత్మిక సాధనం. మూఢ నమ్మకం కాదు, శాసీ్త్రయంగా చేసుకున్న ఏర్పాటు. బ్రహ్మసూత్రాలు అనే పుస్తకం మూడు, నాలుగు అధ్యాయాల్లో వీటి శాసీ్త్రయతపై విచారణ చాలా విపులంగా ఉంది.
మరి మనందరం ఇలాగే శాస్ర్తీయంగా భావన చేస్తున్నామా అనేదే ప్రశ్న. మంత్రాలకు అర్థం తెలియకపోవడం వల్ల ఉపాసన క్రమక్రమంగా యాంత్రికమైన పూజగా మారింది. దీన్ని మనం రోజూ చూస్తూంటాం. ఏదో ఒక విశేష పూజను లేదా వ్రతాన్ని చేయడానికి పట్టుపంచ, పట్టుచీర కట్టుకుని కూర్చోవడం వరకునే మనవంతు. తర్వాత పురోహితుడు మన ఎదురుగా దేవతామూర్తిని కలశం రూపంలోనో, మరొక రూపంలోనో ఏర్పాటు చేస్తాడు. అప్పుడప్పుడూ మనల్ని ‘మమ అనుకోండి’ అంటూంటాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్న మన మనస్సు ఆ మాటలకు ఉలిక్కిపడి ‘మమ’ అని అంటాం. తర్వాత మళ్ళీ మనస్సు దాని దారిలో అది పరిగెడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్న విధానమే మన సంస్కృతిలో ఇంకా నిలిచి ఉంది. యూరోపియన్‌ దేశాల్లో (ముఖ్యంగా ఇటలీలో) మూడవ శతాబ్దం వరకూ మిత్రాయిజం అనే మతం ఉండేది. మిత్ర అంటే సూర్యుడు. మనం ‘శంనో మిత్రః’ అనే మంత్రంలో చెప్పుకునే సూర్యుడే. అనేక దేవుళ్ళు, దేవాలయాలు ఉండేవి. నాల్గవ శతాబ్ది తర్వాత ఈ మతం పూర్తిగా అణచివేయబడింది. దేవాలయాలు చరిత్రలో అవశేషాలయ్యాయి. వారి సంప్రదాయంలో కూడా విగ్రహాలు శాసీ్త్రయంగా ఏర్పడినవా? లేదా అన్న విషయం చరిత్రకారులకే తెలియాలి.
ఈనాటికీ అన్ని మతాల వాళ్ళూ ఏదో ఒక చిహ్నాన్ని గౌరవిస్తారు, దానికి అపచారం జరిగితే ఉద్రిక్తతలు వస్తాయి. ఇలాంటి చిహ్నమే విగ్రహం కూడా. ఉపాసన యొక్క ఉద్దేశమే మనస్సును ఒక చోట నిలపడం, యాంత్రికమైన పూజ అనే స్థాయి నుండి ఆలోచన అనే స్థాయికి రావడం. ప్రవచనాలు చెప్పేవాళ్లు రోజూ దీన్ని గురించి చెబుతూనే ఉన్నారు. అయినా మనకు ఇంకా బోధ పడాల్సిన అవసరం ఉంది. కేవలం యాంత్రికమైన తంతు వల్ల ఆ పూజ పట్ల విశ్వాసం నశించే ప్రమాదముంది. ముఖ్యంగా ఈనాటి బాలబాలికలకు ఈ విషయాన్ని వివరించి చెప్పడం చాలా అవసరం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరామ వైభవము

శ్రీరామ వైభవము
మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం.
మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామాలయాలను ఎలా నిర్మించాలి? రాముడి విగ్రహాలు ఎలా ఉండాలనే విషయం- విష్ణుధర్మోత్తరంలో ఉంది.
రామో దాశరథ కార్యో రాజలక్షణలషితః
భరతో లక్ష్మణశ్చైవ శతృఘ్నశ్చ మహాయశాః
తదైవ సర్వేకర్తవ్యాః కిన్తుమౌలి వివర్జితాః
అంటే రామాలయంలో రాముని విగ్రహాన్ని రాజలక్షణాలతో ఉన్నట్లు నిర్మాణం చేయాలి. అలాంటి లక్షణాలతోనే భరత, లక్ష్మణ, శత్రుఘ్నలను కూడా శిల్పంగా చేయాలి. అయితే శ్రీరాముని శిరస్సుపై కిరీటం ఉండునట్లు భరతుడు మొదలగు వారి శిల్పాలకు కిరీటం ఉండకూడదు. ఆంజనేయుని శిరస్సుకు కూడా కిరీటం ఉండ కూడదు, అయితే ఆయనే ముఖ్యదేవతైన ఆలయంలో ఆంజనేయుడికి కిరీటం ఉండవచ్చు. వీటితో పాటుగా – ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరపడం అనేది ముఖ్య ధర్మమని శాస్త్రం చెప్పింది. అయితే శ్రీరాముడిని ఎలా దర్శించుకోవాలనే సంశయం కలుగుతుంది. దేహోదేవాలయః ప్రోక్తః అనిశ్రతి- అంటే రాముడిని మన దేహమనే దేవాలయంలో ఉన్న ఆత్మారాముడిని దర్శించుకోవాలి. దేహంలో దర్శించుకోవటమనే విషయాన్ని- రామరహస్య ఉపనిషత్‌లో .
అకారక్షర సంభూత సౌమిత్రిః విశ్వభావనః
ఉకారాక్షర సంభూత శ్శత్రుఘ్నః తైజసః స్మృతః
ప్రాజ్ఞాత్మకస్తు భరతో మకారక్షర సంభవః
అర్థమాత్రాత్మకోరామో బ్రహ్మానందైక విగ్రహః
అని చెబుతారు. ఓంకారములో ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారమను అక్షరాలుంటాయి. ‘అ’ కారముతో చెప్పబడినది మన మెలుకువ ఉపాధిగల విశ్వుడే లక్ష్మణుడని, ‘ఉ’కారముతో చెప్పబడినది మన కలలకు ఉపాధి గల తేజస్సుడే శత్రుఘ్నడని, ‘మ’కారముతో చెప్పబడినది మన గాఢ నిద్రకు ఉపాధిగా గల ప్రాజ్ఞుడే భరతుడని, ఈ మూడు కలిపిన ఓంకారమే బ్రహ్మానంద రూపుడైన శ్రీరామచంద్రుడని ఈ శ్లోకార్థం.
జీవితమే రామాయణం..
రామాయణం మానవ జీవితం నుంచి పుట్టినదే. మన పూర్వీకులు- మన దేహాన్ని- ‘‘అష్టాచక్రా నవద్వారా దేవానం పురయోధ్యా తస్యాగేం హిరణ్మయః కోశః.’’ అని నిర్వచించారు. అంటే ఎనిమిది చక్రాలతో తొమ్మిది రంధ్రాలతో కూడిన దేవతల పురమైన ఈ శరీరమే అయోధ్య అని అర్థం. ఆ అయోధ్యకు అధిపతి ఆత్మారాముడు. అంటే ఆ ఆత్మారాముడిని ప్రతి వ్యక్తి తమ హృదయంలోనే దర్శించుకోవచ్చు. ఇప్పటి దాకా మనం రాముడి గురించి చెప్పుకున్నాం. సీత గురించి చెప్పుకోకపోతే- రాముడు పూర్తి కాడు. సీత గురించి ఆధ్యాత్మ రామాయణంలో
రామం విద్దిపరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం
మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యన్త కారిణమ్‌
అని చెబుతారు. అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే రాముడు. సృష్టిస్థితి లయకారిణి అయిన మాయారూపిణే సీత, అందువలన పరమాత్ముని ఆశ్రయించిన శుద్ధ సాత్త్విక ప్రకృతియే అతని సన్నిధిలో సత్త్వ రాజస, తామస సృష్టిని చేస్తున్నది. అయితే మన భక్తి చేత శాంతి వృత్తితో కూడిన మనస్సు మంచి కర్మలు, ధ్యానం చేత శుద్ధ సాత్త్విక ప్రకృతిగా దర్శనమిస్తుంది. ఈ శక్తికే శాంతి అని పేరు. ఈ శాంతి వృత్తియే సీత, అంటే పరమాత్మ వైపు తిరిగిన మనస్సే శుద్ధ సాత్త్విక ప్రకృతి. అదే శాంతి అనే సీత. ఆమే మోక్షరూపిణి.
ఉపసంహారం
శ్రీరామనవమి అంటే శ్రీరాముడు అవతరించిన శుభదినం. అయితే ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తాం? అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. భగవంతుడికి కల్యాణము అంటే అది లోక కళ్యాణం. పరమాత్మ అనే చైతన్యము, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనే ఈ విశ్వముతో కూడిన ప్రకృతిల వల్ల ఈ ప్రపంచం పుట్టింది. దానిని ప్రతీకగా ఈ కళ్యాణాన్ని జరుపుతారు. సీతారామ కల్యాణోత్సవం దేవాలయాలలోనే గాక మన హృదయంలో కూడా జరగాలి. బయట గ్రామాల్లోను, పల్లెల్లోను, పట్టణాల్లోను జరగాలి. అలా జరిగితే కులబేధం లేని, వర్గపోరు లేని, మత ఆవేశం లేని జాతి అభిమానం లేని పరమాత్మ మనందరికి సొత్తుగా నిలిచిపోతాడు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారద పీఠాధిపతి
సెల్‌ : 9966669658
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణుడితో సంభాషణ

కృష్ణుడితో సంభాషణ

మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది..
ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ ఉండటం లేదు. జీవితం చాలా బిజీ అయిపోయింది. దీనికి పరిష్కారమేమిటి?
కృష్ణుడు: పని ఎప్పుడూ మనని బిజీగా ఉంచుతుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితం మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. అందుకే సానుకూల ఫలితాలు వచ్చినప్పుడు ప్రపంచమంతా విశాలంగా అనిపిస్తుంది.
ఆ.జీ: అసలు ఈ జీవితం ఎందుకింత సంక్లిష్టంగా తయారయింది?
కృష్ణుడు: మన జీవితాన్ని మనమే సంక్లిష్టంగా తయారుచేసుకుంటాం. ప్రతి విషయానికి ఆందోళన చెందటం ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే జీవితంలో ఆనందం ఉండటం లేదు..
ఆ.జీ: ఆనందం విషయం పక్కన పెడితే- అసలు మంచివాళ్లకే కష్టాలెందుకు వస్తాయనిపిస్తూ ఉంటుంది..
కృష్ణుడు: సాన పెట్టకపోతే వజ్రానికి కాంతి రాదు. అగ్నిలో కాల్చకపోతే బంగారానికి కాంతి రాదు. అందుకే మంచివాళ్లకు రకరకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల వారి జీవితం బాగా మెరుగుపడుతుంది. ఆ సవాళ్లను కష్టాలనుకోకూడదు..
ఆ.జీ: అంటే ఆ అనుభవాలు మనకు ఉపయోగపడతాయంటావు?
కృష్ణుడు: అవును. కచ్చితంగా ఉపయోగపడతాయి. అనుభవం చాలా గొప్ప ఉపాధ్యాయురాలు. అయితే ఆమె ముందు పరీక్ష పెడుతుంది.. ఆ తర్వాతే పాఠాలు చెబుతుంది..
ఆ.జీ: జీవితంలో ఆనందం.. అనుభవాల విషయం వదిలేద్దాం.. ఎటు చూసినా కష్టాలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి.. అసలు మన ప్రయాణం ఎటువైపు? అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది..
కృష్ణుడు: జీవితం ఒక బస్సు ప్రయాణంలాంటిది. కిటికీలో నుంచి చూస్తే- బయట విషయాలే కనిపిస్తూ ఉంటాయి. నీ ప్రయాణం ఎక్కడికనే విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. అంతర్ముఖుడివై గమ్యం ఏమిటో నీ హృదయాన్ని అడుగు. సమాధానం లభిస్తుంది..
ఆ.జీ: అది అంత సులభం కాదు. గమ్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకోలేకపోతే ఓడిపోతాననే ఆలోచన నన్ను భయపెడుతూ ఉంటుంది..
కృష్ణుడు: విజయం అంటే ఏమిటి? అనే విషయాన్ని నిర్దేశించేది ఇతరులు. ఒకరికి విజయం- మరొకరికి పరాజయమే కదా.. వీటి గురించి ఆందోళన చెందటం కన్నా- ఆత్మ సంతృప్తి ముఖ్యం. ఇది ఉన్నప్పుడు- జయాపజయాల గురించి చింత ఉండదు.
ఆ.జీ: అలా ఉండటం కూడా కష్టమే.. ఎప్పటిప్పుడు మనకు మనమే స్ఫూర్తిని ఎలా పొందుతాం?
కృష్ణుడు: జయాపజయాలకు మన జీవిత ప్రయాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. జీవితంలో అపజయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటే చాలా నిరాశ కలుగుతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అందువల్ల- మనం ఎంత దూరం ప్రయాణించాం? అనే విషయాన్ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనకు లభించిన సౌఖ్యాలు, ఆశీస్సులను మాత్రమే గమనించాలి.
ఆ.జీ: నువ్వు ఇన్ని సమాధానాలు చెబుతున్నావు కదా.. ఇప్పుడో ప్రశ్న అడుగుతా… మానవుల్లో నీకు ఆశ్చర్యం కలిగించే లక్షణమేమిటి?
కృష్ణుడు: ఎప్పుడైనా కష్టాలు వస్తే- ‘‘నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి?’’ అని దేవుడిని ప్రశ్నిస్తారు. వారికి సుఖాలు, సంపద వచ్చినప్పుడు మాత్రం- ‘‘నాకు మాత్రమే ఈ సుఖాలు, సంపద ఎందుకు లభిస్తున్నాయి?’’ అని ప్రశ్నించరు.
ఆ.జీ: నాకు జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభవించాలని ఉంది.. ఎలా?
కృష్ణుడు: గతాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకు. వర్తమానంలో ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయి. భవిష్యత్తు గురించి బెంగపడకు. దానిని ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండు.
ఆ.జీ: ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతా.. తప్పకుండా సమాధానం చెప్పాలి.. కొన్ని సార్లు నా ప్రార్థనలను నువ్వు ఎందుకు పట్టించుకోవు?
కృష్ణుడు: ఫలితం లేని ప్రార్థన ఎప్పుడూ ఉండదు. నాపై నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఆటంకం రాదు. జీవితం ఒక ప్రహేళీ. అంతే తప్ప అదొక సమస్య కాదు. ఈ విషయం తెలుసుకుంటే- జీవితం ఆనందమయమవుతుంది..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )

 

25-నవ్యాంధ్ర రాజధాని –శ్రీ కే .రవి కిరణ్ –విజయవాడ

  రాజదానికేమి నిర్మింప బడవచ్చు భౌగోళికముగ-ఇపుడైనా నెపుడైన ఇచట చట నెచట నైన

రాజు ఉండేడిస్థానమే రాజధాని యని భావిస్తే –అధికారానికి ఆవశ్యకమయ్యే

ప్రజా హృదయమే కదా అసలు సిసలు రాజధాని

సుపరిపాలకుడై పొందాలి స్థానమచట

పాలకుడు పదికాలాలు పాలించ వలెనన్న

పరిమితమవరాదు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ

రాజ్యమంతా చెందాలి ఒకే రీతిగా అభివృద్ధి

మారేకాలానికి ,,మారుతున్న భావాలకి తగురీతిగ

యోచించి చూపాలోయ్ పాలనలో నూతన శైలి

కావాలోయ్ ఆదర్శం ముందు తరానికి .

భాషా ప్రయుక్త రాష్ట్ర మెల్ల భౌగోళికముగా రెండై

నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకోవాల్సిన క్లిష్ట పరిస్తితులలో

హుద్ హూద్ తుఫానూ !గోరు చుట్టుపై రోకటి పోటు

నీ పలకరింపూ ఇప్పుడేనా ?జతగా

అయినా ధైర్య స్తైర్యాలతో ఎదుర్కొని నిలిచాం

నేలమట్టమైన ఉద్యానాలను సుందరీకరిస్తాం

సంకల్ప బలం తో పునర్వైభవం సాధిస్తాం

మనో బలముంటే అసాధ్యమే లేదని రుజూ చేస్తాం

ఈ  మన్మధ ఉగాది

నవ్యాంధ్ర రాష్ట్ర దివ్య యుగానికి నాంది

కవికోకిల కుహూ కుహూ నాదాలతో

పులకిస్తోంది ఎడద ఆశల చివురులేస్తోంది

శుభం భూయాత్ నవ్యాన్ద్రా శుభం భూయాత్ .

26-నవ్యాంధ్ర కు శుభాకాంక్షలు –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ

సీ –ఒక్కటైనా ప్రజల నొక నుదయమ తుఫాను –రెచ్చి పోవుచు తాను  రెండు చేసే

 మిగుల ధనము నింక మింగుడు పడకుండ –హుద్ హూదేతెంచెను మహోద్రుతముగ

ఆర్ధిక ఇబ్బందు లాటు పోట్లను గూడి –గత వత్సరంబింక గడిచి పోయే

మన్మధ వత్సరమైన నిపుడు మన –బాధలు తీర్చేడు బాట వేసి

ఆ .వె .-ఆంద్ర రాష్ట్రమున కిపుడు హాయి నిచ్చి –సకల సంపద లిచ్చుచు సౌఖ్య మిచ్చి

     భోగ భాగ్యములిచ్చేడు భుక్తి నిచ్చి –దేశమందున ఘనకీర్తి తెచ్చుగాక .

సీ –నవ్యాంధ్ర  రాస్ట్రమ్ముభవ్యంబుగా నిల్చి –దేశంబునకు సందేశ మిచ్చి

 కొత్త వత్సర మందు కొంగ్రొత్త యాశతో –ప్రజల కానంద సంపదల నిచ్చి

ప్రగతి పధంబున జగతి లో ముందుండి –భూ జనులందరు పొగడు చుండ

విశ్వ విఖ్యాతమౌ పేరు ప్రతిష్టలు –పొందుచు నీ నేలవిందు సేయ

ఆ.వె.-గాయక కవి నాయక నట బుధ జనులు –ఒక్కటై నిలబడి యొకరికొకరు

సాయ మిచ్చు చుండ సౌహార్ద్ర బుద్ధితో –మనదు రాష్ట్ర మింక వినుతి కెక్కు .

ఉత్పలమాల –మన్మధ నామ వత్సరము మానవ కోటికి మేలు సేయుచున్ –కన్మరుగౌ విశేష మగు గౌరవ సంస్కృతి ,సంప్రదాయముల్

చిన్మయ ముద్ర రీతిగాను చింతలు బాపుచు రక్ష నిచ్చుచున్ –జన్మలు సార్ధకంబయి

విచారము దూరము సేయు నిత్యమున్ .

ఆ .వె.-శుక పిక ముఖ రవము సుప్రభాతమ్ము పల్క –లేత మావి చివురు పూత పూయు

వలపు కులుకు చేర్చి వచ్చే వసంతమ్ము –ఆంద్ర రాష్ట్ర ప్రజకు యశము నిచ్చు .

 

27 –మన్మధ నామ వత్సరమా ! శ్రీ బందా వెంకట రామా రావు –విజయ వాడ

 ఓ ఆంద్ర మాతా !నీకు వందన మంటూ చెపుతున్నా సమకాలీన వేదం –తలపులన్ని మూత పెట్టి –దూర దర్శనాన్ని కట్టి పెట్టి

నాయకులను నొక్కి పట్టి –ఒట్టు పెట్టి చీల్చారు మన భాగ్యాన్ని

నిన్నటి జయనామ వత్సరం లో –వచ్చిన అపజయాలకు సాక్షమిది

ముందు నుయ్యి ఒక పార్టి –వెనుక గొయ్యి మరో పార్టీ

నెత్తి మీద పిడుగు మరోపార్టీ –పక్కలో బల్లాలు మరికొన్ని పార్టీలు

గన్నుపాటు లేకుండా వెన్నుపోటు పొడిచారు –ఉన్నది ఊడ్చేసింది హూద్ హూద్

నవరాస్ట్ర నిర్మాణానికి వాగ్దానాలేకాని సాకారం కాని శుష్క ప్రియాలు

అన్నిటా వీర విజ్రుమ్భణమే –నవ్యాంధ్ర స్వర్నాన్ధ్రగా మారు తుందనే ఆశ సందేహమే

కోకిలమ్మ కూతలు చట్టసభలో బూతులు –భావిష్యవాణి గా సింగపూర్ ,జపాన్ ల కోతలూ

మారునా మన తల వ్రాతలు ?ఇదే మన్మధ వాదం ఈ కాల వేదం ఈ బందా నాదం .

 

28-నానవ్యాంధ్ర మాత –శ్రీమతి పి .పద్మావతీ శర్మ –విజయవాడ

నేనుకలలు కన్నా నా నవ్యాంధ్ర ప్రదేశ్ వచ్చేసింది

నాకలల కొత్త రాజ్యం సాకారమైంది

వలస పక్షుల్లా ఎగురుకొంటూ వెళ్ళిన అందరం

మళ్ళీ మా గూళ్ళకు స్వేచ్చను వెతుక్కొంటూ వచ్చేశాం

హైదరాబాద్ లో ఏముంది నా బొంద ?

హుసేన్ సాగర్ మురికి కంపు తప్ప?

అద్భుతమైన నవ్య రాజధానికి –పునాది వేసి ప్రపంచం అబ్బుర పడేలా

తీర్చి దిద్ది సేబాష్ అని పించు కొంటాం .

భద్రాద్రి రామన్న దూరం అయితేనేమి –తిరుపతి వెంకన్న మా దగ్గరే ఉన్నాడుగా

బాసర సరస్వతి ముఖం చాటేస్తే ఏం ?-అమ్మలగన్న యమ్మ దుర్గమ్మ మాకే స్వంతం

వేముల వాడ రాజన్న వెంట రాకు౦టేనేం?శ్రీశైలం మల్లన్న మాకున్నాడుగా

నల్లబంగారం మనకు నల్లపూసైనా –యెర్ర ,తెల్ల ,పచ్చ బంగారాలన్నీ మనవేగా

కృష్ణా గోదారీ గలగలలు ,మొనగాడు సాగరుడు మనవాడే

నలభై ఏళ్ళకితమే మన రాజ్యం మనకొచ్చి  ఉంటె

బంగారు ఇటుకలతోనే రాజధాని కట్టి ఉండేవారం

అయినా మించిపోయిన్దేమీలేదు మిత్రమా

అందాల మన నవ్యాన్ధ్రకు నవ రత్న ఖచిత కిరీటాన్ని అలంకరిద్దాం

ఏడు వారాల నగలు దిగేసి ,కత్తుల బోనులో తిరిగి అలసిన

ఆ పాదాలకు నవనీతం రాసి అందంగా పారాణి దిద్దుదాం

కానివారికోసం చాకిరి  చేసి చేసిఅరిగిన

ఆ చేతులకు యెర్రని గోరింటాకు పెడదాం

ఆలోచనలకు ఆంధ్రోడు కావాలి –ఆచరణకు ఆంధ్రోడుకావాలి

ఆవేశానికి  విద్యకూ సంస్కారానికీ ఆంధ్రోడేకావాలి ,

మాటకు,సాయానికి మంచి సెబ్బరలకు ఆంధ్రోడేకావాలి ,రావాలి

కాని అక్కడి బిడ్డగా బతకటానికి మాత్రం ఆన్ద్రోడు వద్దు

ఇక్కడ మనకా భయమే లేదు –మనమే రాజూ మంత్రీ అన్నీమనమే

మనమే ప్రజా మనమే పిల్లాపాపా

అంతామనమే  మనదే అంతా .మనకోసమే మనం .

  సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 ఉయ్యూరు

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5

22-నవ్యాంధ్ర వైభవం –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం

సీ.-నవ్యాంధ్ర దేశాన సవ్యమౌ రీతిని –తెలుగు వెలుగ వలే తీరుగాను

విద్యావిధానమే వేయి వేల వెలుగులై –దివ్యమౌ వెలుగును దిశలయందు

భవ్య పాలకు లంత నవ్య రీతుల తొడ –సుపరిపాలన నీయ  సోంపు గాను

కష్ట నష్టము లేక కలిగి సంతోషాన –తిండిగింజలు రైతు పండజేయు

తెలుగు తేజమ్ము వ్యాపించు దిశలయందు –నవనవోన్మేష సుందర నందనముగ

ఈ ఉగాది శుభము గూర్చు ఎల్లరకును –తెలుగు వారలు మది నిండు కలుగు వెలుగు .

మత్తకోకిల -వచ్చుగా ఇక మన్మదుండుమన  వాంఛలన్ని నేర వేర్చగా –తెచ్చేగా ఇపుడు కొత్తభావములు తీరగా కలల  సౌధముల్

యిచ్చెగా మనకు కొత్త రాష్ట్రమును ఎల్లజగము కీర్తిం చగా –హెచ్చుగా సుపరిపాలనంబు ఇక హేమకాలమే వచ్చుగా .

మత్తకోకిల –సింగపూరు గా మారు ఆంధ్రయే సేద తీరగ తెల్గులే – అంగ లార్చేడి రోజులన్నియు అపుడే కను మర్గులే

కుంగి పోయెడి జీవితంబుల కోర్కె లన్నియు తీరులే- మంగళారతి కూర్చవే నవ మన్మదుం డిక ఇచ్చులే .

మత్తకోకిల– వచ్చే నూతన వత్సరమ్మిదె,వంత ఏల కోయిలా ?-పిచ్చి పిచ్చగు ఊహలాపవే ప్రేమతోడుగ పాడవే

మెచ్చు నట్టివరాల పాటను మేలు గూర్చగ నేర్వవే –మచ్చ లేని మనో భావము మా మదిన్ కలిగి౦పవే

.

23-పాటల నీరాజనం –శ్రీమతి ఎస్ .ఉషా రాణి –పెదఓగిరాల

శాతవాహనులూ ఇక్ష్వాకులూ –విష్ణు కుండినులూ చాళుక్యులూ

నడచి వెళ్ళిన నేలమీద మరొక నవ్యాంధ్ర నెరజాణ నడచి వస్తోంది

కృష్ణా జల తరంగిణులతో  చెమ్మగిల్లిన ఈ నేల

కూచిపూడి ఘలంఘలంలతో ఆమెను స్వాగతిస్తోంది .

విరామమెరుగని కళల బేహారి ఒకడు

వారం వారం సింగపూరు వెళ్లి కలల్ని గంపకెత్తుకొని

బెజవాడ వీధుల్లో అమ్మకం పెడుతున్నాడు

మనం కూడా గుప్పెడు కలల్ని కొనుక్కుందాం రండి

ఎందుకంటె కళలు గనలేని వాళ్ళూ

కాంక్షా మధువును చప్పరించ లేని వాళ్ళూ

 నవ్యాంధ్ర కు శ్రీకారం చుట్టలేరు .

అయినా ఒక్క మాట

మన హృదయాల నవ్యాంధ్ర కవితా ఝరులను

పారింప వలసిన చోటు ఇదికాదేమో ?

ఎర్రంచు నల్ల దుప్పట్లు బుజాన వేసుకొని

నడివీదుల్లో నూ తోపుడు బండ్ల వెనకా

పొలం గట్ల మీదా ,గళం విప్పి కదం తోక్కండి

మిత్రులారా

వాళ్ళు పాటకి పట్టం కట్టి తమకు తాము కంచెలు వేసుకొన్నారు

మనం మాత్రం తక్కువా ?

పదునెక్కిన పాటతో అగ్గి రగిలించి కదలండి

తేటగీతుల్నీ ఆట వెలదుల్నీ అవతలకు పెట్టి

పాటల నెగళ్ళతో  నవ్యాంధ్ర కు హారతు లివ్వండి

అప్పుడే మనం మోగించిన కంచు నగారా దిల్లీకి వినిపిస్తుంది .

నదులెండినా కను లెండని గడ్డమీద నిలిచి

అరాచకాన్ని పరాచికం గా చూపిస్తున్న పాలకుల

గుండెల్లోకి గురి చూసి  ఎర్రటి పాటను బాకుల్లా దించండి

అదే  నవ్యాంధ్ర కు మనమిచ్చే నిజమైన నీరాజనం .

 

24-నవ్యాంధ్ర ప్రదేశ్ –ఏ ఏం ఏం కుమార్ –విజయవాడ

 

 తెలుగు భాష మాట్లాడే వారికోసం ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రం

రాజకీయ కారణాలతో విడ గొట్ట బడింది రెండు రాష్ట్రాలుగా

తెలుగు జాతిని రెండుగా విభజించి వినోదం చూస్తున్నారు

అన్ని ఆదాయ వనరులున్న హైదరాబాద్ తెలంగాణాలో

వట్టి పోయిన గొడ్డులా ,బీడు పడ్డ భూమిలా

ఆదాయం ,రాజధాని లేని రాష్ట్రం నవ్యాంధ్ర ప్రదేశ్

పులిమీద పుట్రలా హుడు హూద్ తుఫాన్ అతలాకుతలం

అయినా ఆడారని బెదరని ఉక్కు సంకల్పం గల ఆంధ్రులం మనం

మొక్కవోని ధైర్యం తో ,చెదరని ఉక్కు సంకల్పం తో

చేబడతాం నవ్యాంధ్ర నిర్మాణం –సకల జనుల సంతృప్తిగా

అందరం ఒకటై కదులుదాం ,ప్రపంచాగ్రాన నిలబెడదాం

ఆంధ్రులంటే అభిమాన ధనులని ,అసహాయ శూరులని చాటుదాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీరామనవమి -శ్రీ రామ తీర్ధం

అరణ్యవాసం aranya1 001 aranya2 001 sreeraam 1 001 sriram navami 001 srirama tirdham 1 001 sriramatirdham2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గూడూరు లో శ్రీరామనవమి వేడుకలు

guduru1 001 guduru2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4

16-నవ్యాంధ్ర –దివ్యాంధ్ర –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ

   సమైక్యాంధ్ర వడ్డించిన విస్తరి –షడ్రుచుల భోజనం లా

   సర్వ సంపదలున్న జనం లా

 నవ్యాంధ్ర మాత్రం వట్టి విస్తరి –పదార్ధాలు లేని పళ్లెంలా

గుర్రం లేని కళ్లెం లా

ఆంధ్ర మాత  కన్న బిడ్డలు

వేరు కుంపటి పెట్టినప్పుడు

ఒకరికి ఉన్నవి అన్నీ –ఇంకొకరికి లేనివి ఎన్నో

నవ్యాంధ్ర దివ్యాన్ధ్రగా మార్చటానికి

విదు లెన్నో ఉన్నా నిధులు మాత్రం సున్నా .

ఇప్పుడు నవ్యాంధ్ర ఓ మర్రి విత్తనం

పరిసరాలు ,భూసారం ,గాలి ,నీరు ,వాతావరణం

సమస్తం అనుకూలిస్తే భవిష్యత్తులో

ఒక పెద్ద ఊడల వృక్షమై

ఆంధ్రులకు చల్లని నీడ నిస్తుంది

అప్పుడు ఈ నవ్యాంధ్ర దివ్యాంధ్ర గా మారి

స్వర్ణాంధ్ర గా వెలుగొందు తుంది .

 

17 –దృష్టి—వృష్టి -శ్రీమతి కొమాండూరి కృష్ణ –విజయవాడ

 సిరుల నిచ్చేది శ్రీనివాసుడు ,ఝరుల నిచ్చేది విశాఖాశుడు

సరుల ప్రచ్చేడి ఉమాసుతుడు –మరుల బ్రోచెడి రమా సహితుడు

మనల కిచ్చేడు భోగముల్ –నవ్యాంధ్ర కిచ్చేడు మోదముల్ –‘

ఆపమోసగిన అమర సురపతి –ఆయువోసగిన ‘’అరస ‘’సిరిపతి

ఆవునోసగిన అసుర అరి నుతి –అభయ మొదవిన అర్క గణపతి

మనల కొదవును అన్ని శుభములు –నవ్యాంధ్ర కోసగును మోదమూ

సమత ఊపుల కనక వల్లి –మమత చూపుల నమక మల్లి

నమక పూరిత సరస వెళ్లి –చరిత రూపిత తెలుగు తల్లి

మనల కోసగును సౌఖ్యముల్ –నవ్యాంధ్ర కోసగును మోదముల్ .

చెలువ వరపెడు శోభనాద్రుడు –చలువ సలిపేడు చందనాంగుడు

నెలవు నెరపెడు ఆంద్ర నాధులు –దయను కురిపేడు ‘’చంద్ర’’ఆదులు

మనసు తడిపేడు వెల్లువల్ –నవ్యాంధ్ర కొసగెడు మోదముల్

 .

18-శుభ మన్మధ –ఎస్ .అన్నపూర్ణ –విజయవాడ

జీవనదుల పుణ్య భూమి –సశ్యశ్యామల నా ఆంద్ర భూమి

రాజకీయ కుళ్ళు మురుగు నీరు పార

మోడు వారింది రాష్ట్ర వృక్షం .

శుక పికాల కలరవాలు

కొత్త ఆశ చివురులు వేసిన మామిడి కొమ్మ ఓలె

మన్మధ ఉగాదికి నిత్య నూతన చైతన్యం తో

నవ్య ఆలోచనల విరులు విరిసి

కీర్తి సుగంధాలు ఎల్లెడలా వ్యాపించాలి

 నవ్యాంద్ర ప్రదేశ్ సవ్యాంధ్ర ప్రదేశ్ కావాలి

సుఖ శాంతులనివ్వాలి మన్మధ ఉగాది .

 

19- అమ్మవేరు –శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ

 అపురూప లావణ్యాల అద్భుత వనం –యెనలేని సోయగాల బృందావనం

ఎన్నో వృక్ష రాజాల సమూహం –మరెన్నో పూపోదల సమాహారం

లోకం లో అందాల విరులన్నీ చేరాయి ఒక్క చోటికి

సుమ సౌరభాలతో అవనికే వచ్చింది అందం

చేకూరాయి పేరు ప్రఖ్యాతులు –వచ్చాయి యెనలేని కీర్తి ప్రతిష్టలు

ఇంతలో పట్టాయి ఆ వనానికి స్వార్ధపు చీడ పీడలు

పీక్కు తిన్నాయి పురుగూ పుట్రా

అధికార దాహం తో అలమటిం చాయి లేత కొమ్మలు

ప్రకటించాయి తల్లిమానుపై తిరుగు బాటు

అలుకలు ,ఆందోళనలు –ఉద్యమాలు ,ఊరేగింపులతో

ప్రజ్వరిల్లింది విప్లవం –కాని ముష్కర రాకాసి పద ఘట్టనం తో  

బలై పోయాయి చిగురు మొగ్గలు

వేరుకుంపటి రాచకీయం నెగ్గింది

బిడ్డ ఎక్కడున్నా బాగుండాలన్నదే తల్లి తపన

తన తో బాటు బిడ్డలూ పురోగమించాలని

తనకు మించిన కొమ్మలుగా ఎదగాలని

ఆ కాంక్షిస్తుంది అమ్మ వేరు .

 

20-హూద్ హూద్ తుఫాను –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్నం

తే.గీ. – అంబు దమ్ములు కమ్మే  ఆకాశ మందు –వీచెను పెనుగాలులు విర్రవీగి మరియు

తరువు లలొరిగెను ,కంపించే తనువు లకట –గాలివాన కు స్తంభించె కాలమపుడు .

తే .గీ-పెనుతుఫానుహూద్ తెచ్చిపెట్టే ముప్పు –కడలిని పడి లేచు కెరటాల్ గాంచి నంత

జనులు భయ విహ్వలు లగుటన్ కనులు తిరిగే –అవ్విశాఖ వాసుల గుండె లదరె నపుడు .

తీ .గీ-ఉదధి నువ్వెత్తున తరంగములు పుడమిని –అల్లకల్లోల పరచుచు హడల గొట్టే

        నింగి నేలను చేయుచు నేకముగను –సతత ధారా వృష్టి కురిసే సరిగ నపుడు .

తీ.గీ-బాట మధ్యలో పడియున్న పాదపములు –అంతరాయమయ్యెను రవాణాల కెల్ల

      కష్ట  నష్ట మ్ములను ,అసౌకర్యములను –అధిగమించి రనతి కాలమందే యపుడు .

తీ గీ-ముప్పుతిప్పలు పడి రంత మూడు దినము –లచట విద్యుత్తు కొరత

    ఇక్కటులను పడగ కొందరిళ్ళు కూలి –దాతలును జూపిరుపకార ధర్మమపుడు

.

21-నవ్యాంధ్ర –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం

సీ –నవ్యాంధ్ర వెలసినది నవ నవోన్మేషమై –పుష్పించి ఫలియింప పూనుకొనగ

ప్రతి పౌరుడును కూడ ప్రతిన బూని మరియు –పాటుపడవలెను ప్రగతికొరకు  

భాషాభిమానులై భావితరాలకు –తెలుగులో మధురిమన్ తెలుపనగును

ఐకమత్యంబుగ ఆంధ్రులు సాధించ –ఆనంద మొందును ఆంద్ర మాత

తీ.గీ.-పాలనమ్ము నను ,సమయ పాలనమున –నాయకులు చిత్త శుద్ధి తో చేయు కృషికి

       సిరులు యశమంది మనసీమ శీఘ్రముగను –ప్రజల సుఖ శాంతులను గూడి బ్రతక గలరు .

                     అప్పుడు

సీ –విద్య ,వాణిజ్యముల్ వివిధ రంగమ్ముల –విశ్వ విఖ్యాతిని విధిగ బడయు

వ్యవసాయ మందున వ్రుత్తి విద్యలయందు –శాస్త్ర పరిజ్ఞాన సకల మరియు

రాజ నీతిజ్ఞతన్ రాటు దేలి మరియు –రక్షణ కవచమై రధము నడుపు

కష్టే ఫలే యను కార్మిక వర్గమ్ము-పొందగలుగు నింక పూర్ణ ఫలము

తీ.గీ –నిత్య జీవితమున నిజాయితిగ నుండి –కార్య సాధన పావన క్రతువు వోలె

దీక్షతో నెరవేర్చ సిద్ధించు విధిగ –సకల సంశోభితాంధ్ర దేశమునకు .

 సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3

14-పారిపో కోయిలా పారా హుషార్ –శ్రీమతి గుడ్లవల్లేటి కామాక్షి –కోసూరు

 అమ్మమ్మ చెప్పింది చిట్టికి –కాకి పిచ్చుక కధ

చిట్టికి వచ్చింది సందేహం –పిచ్చుక అంటే కాకి కంటే పెద్దదా చిన్నదా ఏ రంగు అని ?

చిన్న బోయిన అమ్మమ్మ మనసు వెళ్ళింది –తన చిన్ననాటి పిచ్చుక గూటికి

పూరింటి చూరుల్లోని పిచుక గూళ్ళు –వసారాలో కట్టిన వరి కంకులు తినే పిచ్చుక

గదిలో అద్దం లో ప్రతి బింబాన్ని పొడిచే పిచ్చుక

పెరటి తోటలో ఆహారపు వేటలో పిచ్చుక

చిన్ని పిచ్చుకపిల్ల నోటిలో ఆహారం పెట్టె తల్లి పిచ్చుక

నేడు ఏదీ ఏదీ ఏదీ ఆ పిచ్చుక ?

యేమని చెప్పను ?నాగరక ఆధునిక మానవుడి చర్యలే

అయ్యాయి నేడు పిచ్చుక పై బ్రహ్మాస్త్రాలు

కోయిలమ్మ కుహూ కుహూ లతో ఉలికి పడి అరచి౦ది   అమ్మమ్మ

‘’పారిపో కోయిలా పారా హుషార్ ‘’

ఆమని రాకను తెలిపే నీ కమ్మని గొంతు

నేటి మావి చిగురు తింటే ఏమవుతుందో ?

నీ కుహూ కుహూలు  వినక పోయినా ఆనందిస్తా నీవు క్షేమమని

పోనీలే —సరసభారతి కవికోయిలల కుహూ కుహూలతో పరవశిస్తా

పారిపో కోయిలా పారిపో పారాహుషార్ .

 

15-నవ్యాంధ్ర తేజం–విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు

శా-శ్రీ మన్మధ వత్సరాద్భుత శుభాశీర్వాద సౌభాగ్యతన్  -ప్రామాన్యైక నిబద్ద నిత్య నికషా ప్రాగాల్భ్యమున్ బెంచగా

   దీమంతోజ్వల కార్య తంత్ర తతులన్ దేదీప్య మానంబుగా –సీమంతోద్వహ శోభలం దనరుచున్ సీమాంధ్ర వేల్గొందుతన్.

కం –జయ సంవత్సర మిచ్చే ,విజయ మీ సీమాంద్రకు –భువి జయకేతనమై

రయముగ దలుచును సహజ –దయయను గుణముబెరుగుచు  ధన్యత నొందన్ .

తీ.గీ.-వీర బొబ్బిలి సీమయై వెల్గు సీమ –పచ్చనౌ కోనసీమయు ,పట్టిసీమ

      రాయలేలిన సీమ ,పల్నాటి సీమ –పరగ ‘’దివి సీమ ‘’ఏకమై భవ్య రీతి

     ఎన్న సీమాంధ్ర పేరున  సన్నుతి గనె .

తే గీ –ఇట్టి సీమాంధ్ర యాత్మయై కట్టే విడచి  శుభ్ర సుందర యౌవన శోభ దనరు

      నూతన శరీరమున జేరే నాతత శత –పూర్ణ సంకాశ శీర్ణ సంపూజ్య గాగ .

సీ-కలకల కూయు కోకిలములే గలవిట-ఖిలము వెదికేడి గబ్బిలము లేదు –

  చివ్వకు జే సాచు  సింహమ్ము లే గాని -అదరెడు గ్రామ సింహాలు లేవు

ప్రతిభ ప్రదర్శించు ప్రజ్ఞానులేగాని –మంకుతనమనెడు మాట లేదు

త్యాగ ధనము గణన భాగ దేయులే గాని –లేకి మూకల గోల లేనే లేదు

తీ.గీ –ఇన్ని సుగుణమ్ములచ్చటేయేక మగుచు –పుణ్య  గణ్య మౌ నవ్యాంధ్ర పూత చరిత

        స్వచ్చ భారత నిర్మాణ సౌరభంబు –పంచి పెట్టుత నింక ప్రపంచమునకు .

మత్తకోకిల –మంద మారుత సస్య పూర్ణత మాన్యతన్ గలిగి౦చ గా –ఎంద రేడ్చిన గాని  నిత్యము నేపుగా జనువృక్షమై  

           అంద గించెడి పుణ్య భూమిగ  నాంధ్ర సీమ నమేయమౌ –సుందరమ్ముగ సంతరి౦చగ సోదరా !ఇక లెమ్మురా!

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-2

’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-2

          7-  వసంత లక్ష్మి –శ్రీ వేదాంతం శ్రీధరాచార్యులు –రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ –గండిగుంట

           నవ్యా౦ధ్రై నా సమైక్యాంద్రైనా ఉగాది ఉగాదె

          తెలుగు నేల రాజకీయం గా  విడిపోయినా

           హూద్ హూద్ తుఫాను విలవిల లాడించినా

          శిశిరం తర్వాత వసంతం లా

         చిగురులు తొడిగి ,అభివృద్ధి విరగ బూస్తుంది

         నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర గా  మారుతుంది

         మరి  ఈ ఉగాది మనకు ఎలా వస్తోందో చూద్దాం

         చిగురుటాకుల చీర కట్టి –సిగలో వేపపూలు చుట్టి

         మామిడి పిందెల అందెలు గట్టి –ఇక్షు దండము చేత బట్టి

        నవ పల్లవ కేతనమ్ము తో –కలకోకిల స్వనమ్ముతో

        అందాలు మెరయ –అందరి  డెందాలు మురియ

        వచ్చే నా వాసంత లక్ష్మి –తెచ్చే సౌభాగ్య లక్ష్మి .

 

 8- ఉగాది –శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి –గుడివాడ

     మన్మధ ఉగాది వైభవం అవతరించి

    తోలి సంధ్య తొంగి చూసే వేళ

   బహుమతిగా ఇలలో సుఖ శాంతులు పంచి మురిసి పోయే వేళ

 నవ్య ఉగాదికి నాందీ ప్రస్తావన పలికి

 హేమంతం విరిసే వేళ-చిత్రపు రంగు హంగులతో

ధరిత్రి అంతా పులకించి హోలీ ఆడిన వేళ

 చైతన్యపు తళుకు బెళుకు లతో పుడమి తల్లి

 సింగారించు కొనే వేళ

 వెన్నెల కురిసే రాతిరి హొయలతో సన్నజాజులు

జాతర చేసే వేళ

మా మనస్సుల్లో మానవత్వపు మల్లికల మమతల

పందిరి అల్లాలని –మా హృదయ పీఠం పై

సౌభ్రాత్రుత్వపు గులాబీలు  గుబాళింఛి

గుండె లోతుల్ని స్ప్రుశించాలని

మా మదిలో మంచితనపు మందారాలు

మొగ్గలు తొడిగి మురిపించాలనీ

మాలో పరమత సహనపు

పచ్చదనం పరిఢవిల్లి జగతికి నీరాజనం పట్టాలనీ

మా జీవితాలలో హేమంతపు చేమంతులు విరబూసి

పరిసరాలను ప్రభావితం చేయాలనీ

కోకిలమ్మలు కమ్మని గొంతుతో

సమతా గీతాల నాలాపిస్తూ

జనావళిని జాగృతం చేయాలని

కోరుతున్నాను నిన్ను

కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను

 

9-సమైక్య సాధన –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –ఉయ్యూరు

 నవ్యాంధ్ర అభివృద్ధిని సమైక్యం గా సాధిద్దాం

చేయి చేయి కలిపి కలిసీ మేలిసీ మసలీ .

సగర్వంగా అందరూ మెచ్చేలా

దిశల మన ఖ్యాతి మార్మోగేలా

నవ్యాంధ్ర నవ్యతను చాటు కొందాం

నవ్యాంధ్ర  నందన  వనం లో సమైక్యతా సౌరభాలు వెదజల్లుదాం .

10- మాకు ముందే వచ్చింది ఉగాది –ఛి మాదిరాజు బిందు దత్తశ్రీ –ఉయ్యూరు

 ఉగాదికోకిల మా ఉయ్యూరులో

పరవశం తో ముందే కూసింది

పుస్తకావిష్కరణ ,పురస్కార  మహోత్సవాలతో

పులకించి కవి కోకిలలు

ముందే కలస్వనం వినిపించాయి

హాయిగా ఆహ్లాదంగా ఆనందం గా వసంతకాలం

మాకు వచ్చే సిందిక్కడ మీ అందరి రాకతో

ఈ హసిత వసంతం కలకాలం నిలవాలని నిలపాలని

మన్మధుడిని మరీ మరీ వేడుతాను .

 

11—నవ దుర్గాంధ్ర ప్రదేశ్ –శ్రీమతి  సామినేని  శైలజ –విజయవాడ

వెన్నెలలో స్వర్ణ కాంతులతో మెరుస్తున్న రూపం

ఎవరూ అది?ధవళ వర్ణపు ముక్కు పుడక మెరుపులు

ఇంద్ర కీలాద్రి పై నుండి దిగి వచ్చిన దుర్గా మాతలా ఉందే!

అవును ఆమెయే –సందేహమే లేదు

మా నవ్యాంధ్ర ఉగాది శోభ చూడ వచ్చావా తల్లీ !

మనసుల మందారాలు పరచి స్వాగతిస్తున్నాం తల్లీ

అదిగో ఉదయ సూర్యునిలా మా నవ్యాంధ్ర

కృష్ణమ్మ తల్లి తీరాన అమరావతికి తోడుగా మా నవ రాజధాని .

ఎన్ని అవమానాలు అవాంతరాలు భారించామమ్మా

నీ దీవేనలుంటే చాలు ముందడుగేస్తాము తల్లీ

మేము వదిలోచ్చిన చోట  ఏముందమ్మా

హరిత వనాలా ?సశ్యశ్యామల కేదారాలా ?

మాకున్నవి బంగారం లాంటి నేలలు

నిత్య శ్రోతస్వినులైన నదీమతల్లులు

ఏనాడో మేల్కొని ఉంటె –ఈ నాడు స్వర్ణాంధ్ర మనదే అయి ఉండేది .

కవిపండిత వాగ్గేయకారులకు మనకేం కొదవమ్మా ?

వేదానికే కాదు మేధస్సుకు ,శాస్త్ర  సాంకేతికకూ మనమే మిన్న ఎన్నటికీ

నీ ఆవాసం ఒకప్పుడు కనక వర్షం కురిసిన చోటు తల్లీ

సింగపూరు ,మలేషియా నాగరకత మనకెందుకమ్మా ?

అనాది మన సంప్రదాయం సంస్కృతికి సాటి ఎక్కుడున్నదమ్మా?

నీ ఆశీర్వాద బలం మాకు  అస్తైశ్వర్య ప్రదం

అన్నీ ఉన్న లక్ష్మీ సరస్వతీ నిలయంగా మారుస్తామమ్మా

అన్నపూర్ణ అనే మాట కలకాలం నిలిచేలా చేస్తాం

నీ కృపా వీక్షణం అనుక్షణం ప్రసరించమ్మా .

 

12- వచ్చిందోయ్ వచ్చింది –శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ

  ఉగాది పండుగ వచ్చింది –వసంత ఋతువు తెచ్చింది

తీపి వగరు పులుపు  చేదు కారం ఉప్పు  ఆరు రుచులతో

మన్మధ నామ వత్సరం వచ్చేసింది

కష్టాల కడలిలో ఈదా౦ ఇప్పటిదాకా

సమస్యల వలయాల ఊబిలో దిగిపోయాం

అయినా నిశ్చలంగా నిబ్బరం గా నిల బడినాం

ఇకనైనా శాంతి సుఖలతో జీవిద్దాం

అందరి క్షేమం ఆశిద్దాం

సత్సంగం తో జీవిద్దాం

ఆశల పల్లకీలో నిజంగానే ఊరేగి కల నిజం చేసుకొందాం .

 

13-నవ్యాంద్రాలయం –శ్రీమతి కోనేరు కల్పన-విజయ వాడ

సీస –రాక్షసముగా ఈడ్చి రాజధాని యను సా –వాడి నుంచి వేగను వెళ్ళగొట్ట

   నిలచెను నవ్యాంధ్ర నిలువ నీడయు లేక –నడి రోడ్డుమీదనే న్యాయ మేది?

  కేంద్రము వీక్షించే క్రీగంట వేడ్కతో –ఆ ధర్మ మేమందు అనము అనక

 వేవేగ యనుకొని బుద్ధు లికిలిం చిరి  కనక తెలుగు చిమురు శక్తి

తే గీ.-కీర్తి ,కలిమియే యగు పోట్ల గిత్తమాకు –ఆత్మ బలమే నందీశ్వరునాత్మ రూపు

మట్టి గరిపి౦చు  దూర్తుల మట్టగి౦చి –కామదేను వౌ సఖ్యత కలుగ జేయ .

సీ –భయమేమో నిదులివ్వ బలవంతుదగునని –బాస కూడ విడచి ,బాగు మరచె

కూట నీతి వలదు,కుత్సితంబు తగదు –కూడి ఉంటె మేలు ,కూర్మి బలము

అసమర్దులముగాము ,అలుసు చేయక మా క –డుపు  మంట దీర్చరే దొగరు దిద్ది

నవ్యాంధ్ర హక్కుల న్యాయ రక్షను చేసి –విజ్ఞత చూపరే వేగముగను

తే.గీ.కార్మికులు కర్షకులు కార్య కర్తలు ఇక –పౌరులుద్యోగు లందరు ఫౌజు వలెను

అందరొక టైరి ,కట్టి తీరెదముగాక –ఆలసింపక నవ్యాంధ్ర ఆలయమిక .

తే.గీ. అవని కీర్తించు నవ్యాంధ్ర అనఘ ఘనము –దశ దిశలు మనఖ్యాతులే తావి పంచు

        తెలుగు తేజము అగుగాక దిచ్య పదము –భారత దేశము గర్వించు భవ్య వరము .

         సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

1-‘’నవ్య భవ్యాంధ్రప్రదేశ్ ‘’ — శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్

 

అన్ని అవమానాలు భరించి ,అన్నీ వదులుకొని వచ్చి

‘’హూద్ హూద్ ‘’భయంకర జల రాకాసి బారిన పడినా

మొక్కవోని ధైర్యం తో ,ఆత్మ విశ్వాసం తో

ప్రక్రుతి వైపరీత్యానికే వైపరీత్యం కల్గించి నిలబడి

కేరింతలు తుళ్ళింతల మధ్య తుళ్ళూరు లో

నవరాజధాని నిర్మాణం కోసం అహరహం శ్రమిస్తూ

ఆంద్ర తేజం మిన్ను ముట్టగా

తెలుగుజాతి ,భాషా ఒక్కటే నన్న ధ్యేయం తో సాగుతూ

నవ్య భవ్యాంధ్ర ను నిర్మించి ఎదురులేని జాతిగా ఎదుగుదాం .

 

2-నవ్యాంధ్ర ప్రదేశ్ –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీ పట్నం

 

 విగ్రహాలను విధ్వంసం చేసినా నిగ్రహం తో భరించాం

 అడ్డుగోడలు కట్టుకున్న ఆనకట్టలు కట్టుకున్నా సహించాం

తొండముదిరితే ఊసర వెల్లి  అవుతుందో లేదోకాని

భజంత్రీ ముదిరితేనే మంత్రవుతాడని

అధిష్టానానికి సాస్టాంగం చేస్తూ మన అన్నమాట మరచి

ప్రజల ప్రతినిధులను ,మనవి చేసుకొనే వాడే ప్రజా ప్రతినిధులని  స్పష్టం చేసినా తల వంచాం

  కానీ తమ్ముడూ !

సిద్ధాంత కర్తలు భౌగోళికంగా విడగొట్టమంటే

మన రాజకీయ రాకాసి మూకలు రాద్దాంతం చేసి చేసి

మన మనసుల్ని ,మనుషుల్ని విడదీయటమే

అత్యంత బాధాకరం

రమ్య హర్మ్యాలు ,సుందర నగరాలను ,రాచ భోగాల రాజధాని

 తులతూగలేని  సంపదను సొంతం చేసుకోన్నాం

నా నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఆంద్ర పదం (ధం) దక్కించుటకు

నా కన్నిటి  కన్నా మిన్న .

గోలచేసి  దక్కించుకోటం  నీకు కొత్తేమీకాదు

నాకూ ఒదులుకొనే ఔదార్యమూ కొత్తకాదు .

కన్నడ వారి ‘’బళ్ళారి’’ నడుగు

తమిళుల ‘’మద్రాస్ ‘’ నడుగు

తమ్ముడూ ! నీది వేరుపడ్డ రాష్ట్రం కాదు

ఒకే వేరు నుండి పుట్టిన మరోకాండం

పేరేమిట౦టావా?

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన మధ్య వారధిలా

మన ఐకమక్యతకు సారదిలా

కలిపి ఉంచేది ,అవకాశాలు కలిపించేది

మన తెలుగు భాషే తమ్ముడూ !

 

3-నా పూర్వాంద్రే –ఈ నవ్యాంధ్ర –శ్రీ ఎల్ కే .మస్తాన్ వలీ –జువాలజీ లెక్చరర్ –నందిగామ

  ఎవరన్నారు నవ్యాంధ్ర అని

ఇది మన పూర్వాంధ్ర

మద్రాసీలను వీడిన తొలి ఆంద్ర

నవాబు పాలన బురఖా తొలగించి

‘’మనోడి’’వని  ఆలింగనం చేసి –ఆదరించాం

రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోక తప్పదు

అన్నరీతిగా నువ్వు వెళ్ళినా

నా పూర్వాంధ్ర యే ఈ నాటి నా నవ్యాంధ్ర .

పోయి౦దేమీలేదు మిగిలింది

నా పూర్వా౦ద్రే –ఈ నాటి నా నవ్యాంధ్ర .

 

4-నవ్యాంధ్ర ప్రదేశ్ –స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు –రిటైర్డ్ తెలుగు లెక్చరర్ –విజయవాడ

 

నవ వసంత మహోదయం –నవ జాగ్రుత శుభోదయం

నరనారీ హృదయాంతర-చైతన్యపు యుగోదయం .

వసుమతికే అందమైన –ఆభరణం భారతం

వసుధలో వన్నె కెక్కి –వర్ధిల్లును నిరంతరం .

అందులోన పొదగ  బడిన – ఆణిముత్యం ఈ రాష్ట్రం

తెలుగు వెలుగు లీనుతున్న –చెలువమ్ముల తోయ రుహం .

మధుర మధుర మంజుల –మకరందం మన రాష్ట్రం

చైతన్యపు ‘’చంద్రోదయ ‘’-దివ్య దీప్తి కిది నిలయం .

కవిగాయక వైతాళిక –కళారంగ ప్రముఖులకు

వివిధ శిల్ప చిత్రములకు –పేరుగన్న నిధానము .

ఘనమైన కూచిపూడి –నాట్యమ్ముల వెలయించి

విశ్వమంత మారు మ్రోగి –విజయ భేరి  మ్రోగిం పగ .

కృష్ణా గోదావరి పెన్నా-మహానదుల కల్పవల్లి

సేద్యమ్మున మేలు బంతి  -సిరు లంది౦చెడి తల్లి .

పదమూడు జిల్లాల –పదునైనది ఈ రాష్ట్రం

పసిడి కాంతి జగతి నింపి –వాసి గాంచు ఘన వజ్రం .

ఆంద్ర జాతి ప్రగతి అందుకొనే విఖ్యాతి

అన్నిరంగములను అద్భుతముగ

రాష్ట్ర ప్రగతి కోరి రాజిల్లె మన నేత

‘’చంద్ర బాబు ‘’అమిత శక్తి ధనుడు .

పదును బెట్ట గలడు పదమూడు రత్నాల

పట్టు బట్టి తాను ప్రతిన బూని

అంతరంగమందు ఆత్మీయతలు చింద

అందజేయు యశము నద్భుతముగ.

 

5-నవ్యాంధ్ర –నవ సమాజం –శ్రీ మైనేపల్లి  సుబ్రహ్మణ్యం –ఆకునూరు

 

తెలుగువాడు ఎదనున్నా వేలుగువాడే

రాష్ట్రమే చీల్చినా ,గుండెనే చీల్చినా

తనయడనేక నేరములు చేసినా తండ్రి మన్నించు నట్లు

తెలుగుతల్లి ముద్దు బిడ్డలం –ఆంధ్రులను ఆదరించు తల్లి

ప్రక్రుతి రహస్యం తెలీని పీఠభూమిగాడు

బాల్యమునే బలి తీసుకొనే బోరు బావులోడు

రాళ్లనే రతనాలుగా భావించే –తరుగు తోలు వాడు

వాపును చూసి బలమని నమ్మి తుష్కర దండయాత్రనే మరచినోడు

స్థాణువులైన శిల్పాలను కొల్లగోట్టినోడు

కొల్లాయి గట్టిన దిగంబర గాళ్ళకు –గురుశిష్య గుడుంబా ఘాటు కేక్కినోడు

ఆంధ్రుల ఆవకాయ రుచి ఏలరా?

తెలుగు తల్లి ముద్దు బిడ్డలం

అన్నిటా ఆరి తేరి నోళ్లం

నవ్యాంధ్ర నగుమోము ఆణిముత్యం కావాల

తెలుగువాడు ఏడనున్న వెలుగువాడు ,బతుకు వెలిగించువాడు కావాల.

 

6-వచ్చింది వచ్చింది ఉగాది –శ్రీమతి తాతినేని రామ కుమారి –క్షేత్రయ్య పద పరిషత్ –మొవ్వ

 

వచ్చింది వచ్చింది నవ వసంతం –మన్మధ నామ సుమ వసంతం

మన్మధ వసంతులేకమై వచ్చిన విశేష ఉగాది ఇది

వసంత మన్మదులు నవ్యాంధ్ర నిర్మాణం లో సహకరించాలి

ఎక్కడ చూసినా నవ్య వసంతా రామాలు విలసిల్లాలి

మన్మధుడు అదుపు తప్పక ప్రతి ఇంటా దాంపత్య శోభ పెంచాలి

ఉయ్యూరు లో వారం ముందే వచ్చింది వసంతం

గబ్బిట వారి కోకిల ముందే కూసి ఆహ్వానించింది

మనందరినీ కలిసి కవితా కోయిల స్వరాలు వినిపించ  మన్నది

నవ్యాంధ్ర సస్యశ్యామలాంధ్ర గా ,ఆధునిక శాస్త్ర  సాంకేతికాంద్రగా

విశ్వ వీధిలో వెలిగిపోవాలి –మన’’ చంద్రుడు’’ ఆచంద్ర తారార్కం పాలించాలి

తెలుగు భాష ,సంస్కృతీ భారతీయత అన్నిటా పురి విప్పి నాట్యమాడాలి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-15 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా నిర్మాతలలో ఒకరు, సింగపూర్‌ ప్రప్రఽథమ ప్రధాన మంత్రి లీ క్వాన్‌ యూ మరణించారు. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ మరణం పట్ల యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతిని వ్యక్త పరిచింది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆయన మరణం పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. లీ క్వాన్‌ యూ గురించి సింగపూర్‌లో పౌరులు, అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల వాళ్లు అనేక విషయాలు కథలు-కథలుగా చెప్పుకుంటారు.
అతి కొద్ది కాలంలో సింగపూర్‌ అంతగా ఎలా అభివృద్ధి చెందింది? ప్రపంచ దేశాలలో అత్యంత ఆధునిక ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది బహుశా అక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్‌ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్‌ వలస రాజ్యంగా వున్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్య్రం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్రలో సింగపూర్‌ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. లీ క్వాన్‌ యూ రాసిన 800 పేజీల బృహత్‌ గ్రంథం దొరికింది. ‘ఫ్రం థర్డ్‌ వరల్డ్‌ టు ఫస్ట్‌’ అనే ఆ పుస్తకంలో, ఆ దేశ ఆవిర్భావం నుంచి గత శతాబ్దం చివరిదాకా ఎదురైన చేదు-తీపి అనుభవాల గురించి, ఆటుపోట్ల గురించి వివరంగా ఉంది. సింగపూర్‌ అభివృద్ధి ఆషామాషీగా జరిగింది కాదని, దేశ స్థిరత్వానికి, అభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు, తన కాలం నాటి నాయకులు, ఆ తరువాత వచ్చిన వారు ఎంతో కృషి చేశారని ఉదాహరణలతో సహా వివరించారు. కేవలం 640 చదరపు కిలో మిటర్ల విస్తీర్ణంలో, సహజ వనరులనేవి ఏ మాత్రం లేకుండా, చైనా-బ్రిటీష్‌ ఇండియా-డచ్‌-ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారి మధ్య ఐక్యత సాధించుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం వెనుక వున్న సుదీర్ఘమైన చరిత్ర రాశారు.
1942-1945 మధ్య కాలంలో, జపాన్‌ ఆక్రమణ కింద సింగపూర్‌ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్‌ యూ. సింగపూర్‌ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్‌ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్‌ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్‌ యూ, ఆయన సహచరులు, సింగపూర్‌ను మలయాలో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబర్‌ 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్‌ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్ట్‌ 1965 లో సింగపూర్‌, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్‌ యూ దేశ ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్‌ 28, 1990 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్‌ టోంగ్‌ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్‌ మినిస్టర్‌ గా పని చేశారు. కేవలం 67 సంవత్సరాల వయసున్నప్పుడే, నవంబర్‌ 1990 లో, లీ క్వాన్‌ యూ ప్రధాని పదవి నుంచి స్వచ్చందంగా వైదొలగారు. తన వారసుడిగా మంత్రివర్గ సహచరుడైన ‘గో చోక్‌ టోంగ్‌’ నియమించి, ఆయన మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా కొనసాగారు. దేశ ప్రధానిగా పాతిక సంవత్సరాలకు పైగా వున్న వ్యక్తి, సీనియర్‌ మంత్రిగా తన జూనియర్‌ కింద పనిచేయడం బహుశా ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. తన మంత్రివర్గ సహచరులు, తన వారసుడి మంత్రివర్గ సహచరులు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు, సివిల్‌ సర్వెంట్లు, నైపుణ్యంతో, నిబద్ధతతో పాలనా బాధ్యతలు నిర్వహించడం వల్లనే, దేశాభివృద్ధి సాధ్యపడిందని తన పుస్తకంలో రాశాడు లీ. ఆయన, ఆయన సహచరులు, ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను రాజకీయాల్లోకి తేవాలని భావించేవారు. విలువలతో కూడిన వ్యక్తులను తమ వారసులుగా చూడాలనేదే వారి అభిమతం. 1968 ఎన్నికలలో పలువురు పీహెచ్‌డీలను, మేధావులను, ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను, వృత్తి నైపుణ్యం కల ఇంజనీర్‌లను, డాక్టర్లను, లాయర్లను, పాలనానుభవం కల ఇతరులను పోటీకి దింపారు. లీ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. నెగ్గిన 58 మందిలో 18 మంది కొత్త వారే!
ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్‌ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్‌ సానిక్‌ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్‌ నుంచి న్యూయార్క్‌ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. ‘ఆన్‌ ద జాబ్‌ ట్రెయినింగ్‌’ లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్‌ టోంగ్‌ కు బదలాయించారు. గో చోక్‌ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్‌ లూంగ్‌ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశారు. వారిద్దరూ కూడా తమ మంత్రివర్గంలో, తమ ముందున్న ప్రధానులను, ఉప ప్రధానులను సీనియర్‌ మంత్రులుగా కొనసాగించారు.
పారిశ్రామికంగా, సాంకేతికంగా, ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, ఔత్సాహికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సింగపూర్‌ ముందుంది. భవిష్యత్‌ లో సింగపూర్‌ ఇదే విధంగా కొనసాగుతుందా? లీ క్వాన్‌ యూ ఆశయం నెరవేరుతుందా?
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

అవకాశాలను ఒడిసి పట్టుకునే వ్యక్తే జీవితంలో రాణిస్తాడు. కృష్ణాజిల్లా గంపలగూడెం సమీపంలోని గానుగపాడు (కొణత మాత్కుర్‌)లో జన్మించిన కవితా ప్రసాద్‌ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఏడవ తరగతి నుంచే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్‌లోనే చిరు కవితలు, గణితం చేయడంలో అద్భుత ప్రావీణ్యత సాధించి అధ్యాపకుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. మచిలీపట్నంలో బీఈడీ పూర్తిచేసి గణితం మాస్టార్‌గా ఖమ్మం జిల్లా భద్రా చలం నెల్లిపాకలో వెలిశారు. సివిల్స్‌పై దృష్టిపెట్టిన రాళ్లబండికి పీఐబీలో ఉద్యోగం లభించడంతో ఉపాఽ ధ్యాయ వృత్తికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరారు. 1991లో ప్రకాశం జిల్లా డీఎస్‌డబ్ల్యుఓగా నియమితులై ఆ జిల్లాలోని హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి సుపరిచితులే. 1994 డిప్యూటీ డైరెక్టర్‌ (విజిలెన్స్‌)లో పనిచేసిన కాలంలో రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టించి పలువురు అవినీతి అధికారుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి అసెంబ్లీలో ప్రశంసలు అందుకున్న అధికారి రాళ్లబండి. 1995లో రెసిడెన్షియల్‌ పాఠశాల సొసైటీకి డిప్యూటీ సెక్రటరీగా, 1996 వరంగల్‌ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
18వ ఏటనే భద్రాచలంలో అష్టావధానం చేయడం ప్రారంభించారు. దేశ విదేశాల్లో 450కి పైగా అవధానాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 100కు పైగా ఆయన రచనలు ఉన్నాయి. అవధానాల్లో ఎన్నో వైవిధ్యాలు సృష్టించారు. అష్టావధానం, నవరస నవావధానం, అలంకార అష్టావధానం, సాహిత్య ప్రక్రియావధానం, అపూర్వ దశావధానం, విచిత్ర అవధానం, శతావధానం, ద్విశతావధానం, ఆశు కవితా ఝురి (గంటకు 300 పద్యాలు అశువుగా చెప్పడం), భువన విజయం, 2002లో కృష్ణా మహోత్సవంకు కన్వీనర్‌గా, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ ఇంట్లో ఆశు కవితా (ప్రదర్శన), అనేక మార్లు దూరదర్శన్‌, ఆకాశవాణిలో పలు పుష్కరాలు కళ్యాణాలకు ప్రత్యక్ష వ్యాఖ్యాన కర్తగా వ్యవహరించారు. ఏడు తరాల తెలుగు భాష వారసులుగా నిలిచిన చివరి తరం వ్యక్తి కవితా ప్రసాద్‌. అవధాన విద్యా వాచస్పతి, ఆశుకవితా సమ్రాట్‌, అష్టదశావధాని, ద్విశతావధాని తదితర బిరుదులు ఉన్నాయి. 2005లో ప్రతిభ పురస్కారం (అవధాన విద్యకు), 2000లో ముఖ్యమంత్రి పురస్కారం, విజయవాడలో స్వర్ణ కంకణం, విశ్వదాత -200 అవార్డు, మచిలీపట్నంలో కనకాభిషేకం, గుంటూరులో శ్రీనాథ పీఠం డాక్టర్‌ ప్రసాదరాయ కులపతిచే కనకాభిషేకంతోపాటు అనేక అవార్డులు లభించాయి. తన చివరి సేవ తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభకు నిర్వాహకులుగా వ్యవహరించి అత్యున్నతమైన గౌరవం పొందారు. రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజే నేటి కవితా ప్రసాద్‌గా పెదబాబుగా ఽధ్రువతారగా నిలిచి నేటి యువతరానికి మార్గదర్శకులుగా నిలిచారు.
– సరస్వతి చలపతిరాజు
ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో మార్చి 26న తెలుగు ఆచార్యపీఠం ప్రారంభమవనున్నది. విశ్వేశ్వర రావుగారి కోరిక మేరకు ఆయన కుటుంబం ఈ పీఠాన్ని స్థాపించేందుకు సంకల్పించడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు వసంతవాడకి, ఈనాటికీ వాడకంలో ఉన్న కేన్సర్‌ ఔషధం మిత్రమైసీన్‌కి, అమెరికాలో ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక విచిత్రమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం తెలుసు కోవాలంటే, కొప్పాక విశ్వేశ్వరరావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.
కొప్పాక సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు విశ్వేశ్వరరావు (1925-1998) విశ్వేశ్వర రావు. వాళ్ళది వసంతవాడలో ఒక పేద కుటుంబం. విశ్వేశ్వరరావు గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన ఇరవైమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్సిన్‌ యూనివర్శిటీ లో బయోకెమిస్ర్టీలో మరొక డాక్టరేట్‌ డిగ్రీ తెచ్చుకున్నారు. 1954 లో ఆయన, భార్య సీత గారితో సహా అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ ఫైజర్‌ కంపెనీలో పరిశోధకుడిగా చేరారు. సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలను కేన్సర్‌ నివారణకి ఔషధాలుగా ఉపయోగించే విషయమై కొప్పాక వారు పరిశోధన చేసారు. ఆ పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన ‘మిత్రమైసీన్‌,’ అనే మందు ఇప్పటికీ కేన్సర్‌ నివారణకి వాడుతున్నారు.
విశ్వేశ్వర రావు గారికీ, సీతగారికీ ప్రాచీన తెలుగు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం. ఆయన తిక్కన్ననీ, పోతననీ తన పిల్లలకీ ఆప్యాయంగా వినిపించేవారు. ఆయన జీవితం చివరి రెండు సంవత్సరాలలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం – అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆ పని చెయ్యడానికి విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. కాని, అది ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు. ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత గారు, పిల్లలు వెంకటరామారావు, జయ రావు 2000 సంవత్సరంలో కొప్పాక ఫామిలీ ఫౌండేషన్‌ స్థాపించారు.
అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు) కావాలి. అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు. కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగావున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ – ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది. అప్పుడు, కొప్పాక ఫామిలీ ఫౌన్‌డేషన్‌ వారే కల్పించుకొని, ఆ రెండవ భాగం, తామే ఇస్తామని వాగ్దానం చేసారు.
ఇప్పుడు, మార్చి 26, 2015న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది. దాని పేరు ఆధికారికంగా ‘ఖీజ్ఛి ఠిజీటఠ్ఛీటఠ్చీట్చ ఖ్చౌ ్చుఽఛీ టజ్ట్చీ జుౌఞఞ్చజ్చు ్కటౌజ్ఛటటౌటటజిజీఞ జీుఽ ఖ్ఛీజూఠజఠ ఇఠజూఠ్టఠట్ఛ, ఔజ్ట్ఛీట్చ్టఠట్ఛ, ్చుఽఛీ ఏజీట్టౌటడ్‌ విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఇది కాక కొప్పాక ఫౌండేషన్‌ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి అమెరికాలోను, తెలుగునాట విరాళాలు ఇస్తున్నారు.
1998లో విశ్వేశ్వర రావు గారి గుండెకి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లల – ఇద్దరూ వైద్యులే!- వైద్య వ్యవస్థలో ఉన్న లోపం చాలా బాధ కలిగించింది. డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ మధ్యన అన్యోన్యత పెంపొందించడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటివరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం విరాళాలు ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి శాశ్వత నిధి నెలకొల్పారు. (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు గారు కలిసి రాసిన వ్యాసం, ‘‘శాంతి’’ అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య శాఖ పత్రిక (అుఽుఽ్చజూట ౌజ ఐుఽ్ట్ఛటుఽ్చజూ క్ఛఛీజీఛిజీుఽ్ఛ, ఠిౌజూఠఝ్ఛ 137, ూఠఝఛ్ఛట 2002) లో ప్రచురితమయ్యింది. అంతే కాకుండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌండేషన్‌ నిధులు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. కొప్పాక ఫౌండేషన్‌ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.
– వేలూరి వేంకటేశ్వరరావు
ప్రవాస భారతీయులు, రచయిత
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

కీలక ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవన్న వాస్తవానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనం. రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
పార్లమెంట్‌లో ఒక పూట అధికార విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరుగుతుండడం చూసి, మరో రోజు ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింప చేయడం చూసి దేశ రాజకీయాలను అంచనా వేయడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. అసలు ప్రతిపక్షాలు ఈ సభను సాగనిస్తాయా, ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభలో ఆమోదింపచేయ గలుగుతుందా? రాజ్యసభలో మెజారిటీ లేకుండా నరేంద్రమోదీ సర్కార్‌ ఎన్నడు తన ఎజెండాను ఎప్పుడు పూర్తి చేయగలదు? అన్న ప్రశ్నలతో బుర్రల్ని వేడెక్కించుకోవడం అనవసరం అని కూడా చెప్పక తప్పదు. గాలివానల మధ్య ప్రారంభమై, తుఫానుతో హోరెక్కినట్లు సాగే పార్లమెంట్‌ తీరా సమావేశాలు పూర్తయ్యే సరికి ప్రశాంతంగా ముగియడం, అంతా కలిసి రాత్రి పొద్దుపోయే వరకూ ఉండి అనుకున్న బిల్లులను ఆమోదించుకోవడం చూస్తే ఇన్నాళ్లూ ఎందుకంత ఉత్కంఠకు గురయ్యామా అనిపిస్తుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు తొలివిడత పూర్తయ్యే సరికి ఊహించని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదవులపై చిరునవ్వు తళుక్కుమని మెరుస్తుంది. మరునాడు ఆయన భూసేకరణ బిల్లు వల్ల రైతాంగానికి ఎంత ఉపయోగమో చెప్పేందుకు రేడియోలో ప్రజలనుద్దేశించి తన మనసులో మాటను వివరించారు. ఉరితీతకు గురైన స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవ్‌లకు నివాళి అర్పిస్తూ పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో కూడా ఆయన భూసేకరణ బిల్లు గురించే మాట్లాడారు.
పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలు కేవలం 19 రోజులే జరిగాయి. ఈ 19 రోజులు ముగిసే సరికి దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థపై చెపకోదగ్గ ప్రభావం చూపే అనేక నిర్ణయాలపై చట్టాలు జరిగాయి. బీమారంగంలో విదేశీ పెట్టుబడిని పెంచే బిల్లుపై ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు కలిసి ఆమోదించాయి. దేశంలోని బొగ్గుగనులు, ఖనిజవనరుల మైనింగ్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఆమోదించిన బిల్లులు కూడా కొద్ది పాటి అలజడి మధ్య ఉభయ సభలు ఆమోదించాయి. ఒక్క భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై తప్ప నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అన్నిఆర్డినెన్స్‌లకూ సభ ఆమోద ముద్ర వేసింది. ‘కావాలంటే భూసేకరణ బిల్లుపై మరో సారి ఆర్డినెన్స్‌ జారీ చేసుకోండి.. ’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాదే సలహా ఇవ్వడం ద్వారా సంకేతాలు అందించారు. అవసరమైతే ఉభయ సభల్ని మరో వారం పొడిగిస్తాం.. అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చేసిన బెదిరింపుతో దారికి వచ్చిన ప్రతిపక్షాలు అప్పుడప్పుడూ సభలను నాటకీయంగా స్తంభింపచేయడం మినహాయిస్తే ప్రభుత్వ ఎజెండాను అమలు చేసేందుకు సహకరించాయి.
’దేశ, విదేశాలనుంచి బడా మైనింగ్‌ కంపెనీల ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీలో మోహరించారు.. ’అని మోదీ సర్కార్‌లో ముఖ్యుడైన ఒక కేబినెట్‌ మంత్రి సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. పార్లమెంట్‌ ఆవరణలో అనేక కంపెనీల ప్రతినిధులు తచ్చాడడం ఆయన మాటలకు బలం చేకూర్చింది. ‘ఇక్కడ బిజూ జనతాదళ్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఎక్కడ?’ అని ఒక విదేశీయుడు దారిన వెళుతున్న విలేకరులను అడగడం కూడా అసాధారణ దృశ్యం కానే కాదు. ‘మన పార్లమెంట్‌ సభ్యులే ఆయా కంపెనీల తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు..’ అని ఆ కేబినెట్‌ మంత్రి వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపిలంతా కలిసికట్టుగా కూర్చుని, పార్టీలకు అతీతంగా దేశంలో సంస్కరణలను వేగవంతం చేసేందుకు పూనుకుంటే ఇక పార్లమెంట్‌లో అధికార విపక్షాలకు మధ్య తేడాను ఏ విధంగా చూడగలం?
విచిత్రమేమంటే నరేంద్రమోదీ సర్కార్‌ ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఒకరోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ప్రతిపక్షాలతో కలిసి ఊరేగింపుగా వెళితే అదేదో భూమిదద్దరిల్లే వార్తగా భ్రమింపచేసే ప్రయత్నాలు జరిగాయి. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదురుగా సోనియాగాంధీతో పాటు 14 పార్టీలకు చెందిన 26 మంది నేతలు, వందమందికి పైగా ఎంపిలు పోగై, వడివడిగా నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళుతుంటే వందలాది టీవీ ఛానెల్స్‌ ప్రతినిధులు, విలేకరులు వారి వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. గత ఏడాది చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులు ఏకం కావడం ఒక చారిత్రాత్మక ఘటనగా కాంగ్రెస్‌, వామపక్ష, తదితర నేతలు తీర్మానించారు. దీనితో మోదీ సర్కార్‌ పడిపోయినంత హంగామా సృష్టించారు. ‘ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య, అగ్రగామి దృక్పథం కల వారంతా మోదీ ప్రభుత్వ సమాజ వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు..’ అని సోనియాగాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ (యూ), సమాజ్‌వాది పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, ఆప్‌, ఐఎన్‌ఎల్‌డీ తదితర పార్టీల నేతలంతా దాదాపు కిలోమీటర్‌ నడిచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
సరిగ్గా మూడురోజుల తర్వాత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేసరికి ఈ 14 పార్టీల మధ్య ఐక్యత బూటకమని రుజువైంది. రాజ్యసభలో గనులు, బొగ్గు బిల్లులను ఆమోదించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్సుకత ప్రదర్శించాయి. తృణమూల్‌, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేడీ, జేఎంఎం, డీఎంకే తదితర పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతు నిచ్చాయి. అకాలీదళ్‌, శివసేన, టీడీపీ వంటి మిత్రపక్ష పార్టీలు సరే సరి. ఆఖరుకు జేడీ (యూ) కూడా ఓటింగ్‌లో పాల్గొనకుండా బిల్లులను పరోక్షంగా సమర్థించాయి. చివరకు రాష్ట్రపతి భవన్‌ వద్దకు ఊరేగింపుగా వెళ్లిన 14 పార్టీల్లో కాంగ్రెస్‌, వామపక్షాలే బిల్లులను వ్యతిరేకించిన పార్టీలుగా మిగిలాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలు కొందరు గైరు హాజరు కావడంతో ఆ పార్టీ కూడా ప్రతిపక్షాల ఐక్యతకు పరోక్షంగా తూట్లు పొడిచినట్లు స్పష్టమైంది. నరేంద్రమోదీ, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, పీయూష్‌ గోయెల్‌ మొదలైన ముఖ్యనేతలంతా గత కొద్ది కాలంగా వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో స్వయంగా మాట్లాడుతూ నయాన, భయాన అందర్నీ దారికి తెచ్చుకోగలిగారనడంలో అతిశయోక్తి లేదు. సమావేశాలు జరుగుతుండగానే మమతా బెనర్జీ పార్లమెంట్‌కు వచ్చి మోదీ, వెంకయ్యలను కలిశారు. ఒడిషా భవన్‌లో ీజైట్లీ, పీయూష్‌ గోయెల్‌ నవీన్‌ పట్నాయక్‌తో మంతనాలు జరిపారు. ప్రధానితో మాట్లాడించారు. బొగ్గు, గనుల బిల్లులు ఆమోదం పొందితే రాషా్ట్రలకే (మీకే) ఆదాయం పెరుగుతుందని ఆశ చూపించారు. గతంలో వేలాన్ని వ్యతిరేకించిన బీజేపీ పాలిత రాషా్ట్రలు, పశ్చిమబెంగాల్‌, ఒడిషా సర్కార్లు ఇపడు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇక కాంగ్రెస్‌తో బీజేపీ నేతలు మాట్లాడలేదని చెప్పలేం. ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా, గనుల కంపెనీల ప్రతినిధులు అందరితోనూ మాట్లాడుతూనే ఉంటారు కదా.. అయినా కాంగ్రెస్‌ నేతల్లో భూఆక్రమణ జరపని, మైనింగ్‌ వ్యాపారం చేయని, వ్యాపారాలు చేసుకోని వారెందరు? ఒకవైపు బొగ్గు, మైనింగ్‌ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతున్న తరుణంలోనే కాంగ్రెస్‌ ఎంపి నవీన్‌ జిందాల్‌ బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం.
విచిత్రమేమంటే తాము కొత్తగా ప్రవేశ పెట్టిన విధానం ద్వారా గనుల వేలం పారదర్శకంగా జరుగు తుందని,కాంగ్రెస్‌ హయాంలో జరిగినట్లు కొందరికే మైనింగ్‌ ప్రయోజనాలను కట్టబెట్టే ప్రసక్తి లేదని మోదీ సర్కార్‌ చెపకుంటున్న సమయంలోనే జిందాల్‌, బాల్కో కంపెనీలు నాలుగు బొగ్గు గనులను కొత్త విధానంలోకూడా లొసుగులను ఉపయోగించుకుని అతి చవక ధరకు వేలం పాడగలిగాయి. టన్నుకు వేయికిపైగా పలికే ధరను వందల రూపాయల్లోనే చేజిక్కించుకున్నాయి. కొన్ని కంపెనీలు కూడబలుక్కుని తమలో తాము రహస్యంగా మాట్లాడుకుని, నీకది, నాకది (క్విడ్‌ప్రోక్యూ) పద్దతిలో కుమ్మక్కు (కార్టెలైజేషన్‌)అయినట్లు తెలియడంతో సర్కార్‌ ఉలిక్కిపడి ఈ వేలం చెల్లనేరదని ప్రకటించింది. ఇదే కాంగ్రెస్‌ ఎంపి కంపెనీకి కాక బిజెపికి సన్నిహితంగా ఉన్న కంపెనీ చేసి ఉంటే వేలం చెల్లదని ప్రకటించేవారా? ఏమైతేనేం ప్రభుత్వ నిర్ణయంతో జిందాల్‌ కంపెనీ సుప్రీంకోర్టుకెళ్లాల్సి వచ్చింది. ఏమైనా ఏ విధానం ప్రకటించినా అది పూర్తిగా పారదర్శకం కాదని, ఎందులోనైనా లొసుగులు ఉంటాయని, అస్మదీయులకు ఏ పద్దతిలోనైనా అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది.
కీలక ఆర్థిక సంస్కరణలు, విస్తృతంగా ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవని పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనమైతే, రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక కంపెనీ, రాజకీయ నాయకులను, అధికారులను ఏ విధంగా ప్రలోభపెడుతూ తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నదో చెప్పేందుకు ఈ-మెయిల్స్‌ను సాక్ష్యాలుగా ప్రవేశపెడుతూ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిల్‌ దాఖలైంది. ప్రభుత్వ విధానాలను మార్చేందుకు, పార్లమెంట్‌లో తమకు ప్రయోజనం చేకూర్చే ప్రశ్నలు లేవనెత్తేందుకు, ప్రభుత్వ అంతర్గత డాక్యుమెంట్లను, కేబినెట్‌ పేపర్లను డాక్యుమెంట్లను సంపాదించేందుకు పారిశ్రామికవేత్తలు తమ ధనబలాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పిటీషన్‌ పేర్కొంది. సుప్రీం ఈ అంశంపై సిబిఐ, సర్కార్‌లకు నోటీసైతే జారీ చేసింది. కానీ వ్యాపార వర్గాలే సర్కార్‌ను నడిపించడం సహజంగా మారినపుడుసుప్రీం కోర్టు అయినా ఏమి చేయగలదు?
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఎ. కృష్ణారావు  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చక్కని తీర్పు!

చక్కని తీర్పు!
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదిహేనేళ్ళ క్రితం నాటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేకమందిని కాపాడింది. దీనిని ఆయుధంగా చేసుకుని, దఖలు పడిన విస్తృతాధికారాలతో ఇటీవలి కాలంలో పోలీసులు ప్రదర్శించిన దూకుడుతో ఎంతో వివాదం చెలరేగింది. సామాన్యుడి మనోభిప్రాయానికి సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికలుగా ఉన్న కాలంలో అతడికి ఉన్న మౌలికమైన హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించడం సముచితం.
ఈ సెక్షన్‌ లేకపోతే సమాజం సంక్షోభంలో పడుతుందనీ, ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయబోమనీ ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 2009 నాటి చట్టానికి సవరణ చేసి ఈ సెక్షన్‌ చేర్చిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడలేదు. దీనిని ఇప్పుడు సమర్థించుకు వస్తున్న బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగుజాడల్లో నడవదన్న నమ్మకమూ లేదు. అందుకే న్యాయమూర్తులు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయ్‌, పోతుంటాయ్‌ అంటూ ఆ హామీని ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్‌ అనేక పర్యాయాలు దుర్వినియోగం కావడం వల్లనే న్యాయస్థానం కొట్టివేయవలసి వచ్చిన మాట వాస్తవం. ఈ తీర్పుకు ఆధారంగా పనిచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి కారణం కూడా అవధులు దాటిన దుర్వినియోగమే. శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణించినప్పుడు ముంబైలో బంద్‌ పాటించడాన్ని ఒక యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నిస్తే మరొకరు దానిని లైక్‌ చేయడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించే బందులమీద చేసిన వ్యాఖ్యలోనూ, దానిని మరొకరు నచ్చి మెచ్చడంలోనూ ముంబై పోలీసులకు అవమానకరమైన, నేరపూరితమైన అంశాలు ఏం కనిపించాయో అర్ధం కాదు. ఇటువంటి సాధారణ వ్యాఖ్యలకు కూడా విస్తృతార్థాన్ని అన్వయించి, తాము తలుచుకున్నప్పుడు ఈ సెక్షన్‌ను ఎవరిమెడకైనా చుట్టగలిగే అవకాశమూ, అధికారాలు వారికి ఉండటమే ప్రధానమైన సమస్య. ప్రభుత్వాలకు, సమాజంలోని పెద్ద తలకాయలకు ఈ సెక్షన్‌ సునాయాసంగా ఉపకరిస్తుండటం మరింత భయపెడుతున్న అంశం.
‘స్వేచ్ఛను అడ్డుకోవడానికి అర్ధం లేని భయాలు కారణం కాకూడదు. అభిప్రాయాన్ని చెప్పనిస్తే విపత్తు ముంచుకొస్తుందని భావించడానికి కూడా బలమైన ప్రాతిపదికలు ఉండాలి కదా!’ అంటూ న్యాయమూర్తులు ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌, జాస్తి చలమేశ్వర్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రశంసనీయమైనవి. ఒక వ్యాఖ్య, ఒక కార్టూన్‌, ఒక లైక్‌ సమాజాన్ని అతలాకుతలం చేసేస్తాయంటూ వెంటపడి అరెస్టులు చేస్తున్నవారి భయాలకు సముచితమైన ఆధారాలు, అర్ధాలు లేవని న్యాయస్థానం భావించింది. బందులమీద వ్యాఖ్యానించి అరెస్టయిన షహీన్‌ ధద, రీను శ్రీనివాసన్‌లతో పాటు ఈ తీర్పు ఇంకా అనేకమందికి తప్పక సంతోషాన్ని కలిగించివుంటుంది. ‘వాద్రాకంటే కార్తి చిదంబరం ఎక్కువ ఆస్తి కూడబెట్టాడంటున్నారు’ అని ట్వీట్‌ చేసిన రవి శ్రీనివాసన్‌, పార్లమెంటును అవినీతి కేంద్రంగా కార్టూన్‌ వేసిన ఆసీమ్‌ త్రివేది, మమతా బెనర్జీని ఎగతాళి చేస్తున్న కార్టూన్‌ను మరికొందరితో పంచుకున్న జాధవ్‌పూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ మహాపాత్ర, ప్రధానమంత్రిమీద జోకులను మరొకరికి పంపిన ఇద్దరు ఎయిరిండియా ఉద్యోగులు, కొద్దిరోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్‌ ఖాన్‌ను ఫేస్‌బుక్‌లో అవమానించినందుకు అరెస్టయిన ఇంటర్మీడియట్‌ కుర్రాడు వీరిలో మచ్చుకు కొందరు. పుట్టినరోజున ఒక అమ్మాయికి ఆమె ఫోటోను ముద్రించిన కేక్‌ బహుమతి ఇచ్చినందుకు కూడా 2012లో ఒక కుర్రాడిని అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌ నుంచి ఆ అమ్మాయి ఫోటోను డౌన్‌లోడ్‌ చేసినందుకు అతడు ఈ సెక్షన్‌ పరిధిలోకి వచ్చాడు. ఈ సెక్షన్‌లో ఉపయోగించిన భాష, పదజాలం ఏమాత్రమూ నిర్దిష్టంగా లేకుండా, అత్యంత అలవోకగా ఉండటంతో పోలీసులకు అవసరం మేరకు దాని విస్తృతిని పెంచుకోవడానికీ, నచ్చిన భాష్యం చెప్పుకొని, నచ్చిన చోట అమలులో పెట్టగలిగే అవకాశం లభించింది. తీవ్ర మనస్తాపం వంటి అనేక పదాలకు కచ్చితమైన నిర్వచనాలు చెప్పకపోవడం వల్ల తనకు నచ్చిన ఒక వాదననో, ఒక విశ్లేషణనో వాటితో విభేదించేవారికి పంపించడం కూడా నేరంగా మా రే ప్రమాదాలు ఏర్పడ్డాయి. న్యాయమూర్తి నారిమన్‌ స్వయంగా ఉదహరించినట్టు చెబుతున్న మతమార్పిడుల అంశాన్నే తీసుకున్నా దానికి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్య లు చేసిన వారివురూ ఎదుటివారికి తీవ్ర మనస్తాపం కలిగించినవారే అవుతారు.
ఎమర్జెన్సీ నాటి రోజులను మళ్ళీ గుర్తుకు తెస్తూ మూడేళ్ళక్రితం అరెస్టయిన ఆ ఇద్దరు యువతులు దేశంలో ఒక విప్లవానికి కారకులైనారు. భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడాన్ని సవాలు చేసిన న్యాయవాది ఘోషల్‌ సహా ప్రజాస్వామ్య పునాదిని పరిరక్షించడానికి పాటుపడినవారందరూ ఈ సందర్భంగా అభినందనీయులు. ఈ సెక్షన్‌లోని మిగతా రెండు భాగాలతో పాటు, నేరపూరితమైన వ్యాఖ్యలు, పరువు నష్టం ఇత్యాది అంశాలు అలాగే ఉన్నందున డిజిటల్‌ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడటం ఎలాగూ తప్పదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడ్శ+మనస్స్స=మనుష్యుడు

Added At : Tue, 03/24/2015 – 00:25

ఈ లోకంలో ఏది విలువైనదని మనం ప్రశ్నించు కుంటే, సామాన్యంగా ఐహికమైన విషయాలపైనే దృష్టి పడుతుంది. కానీ ఇవేమీ శాశ్వతాలూ కావని తెల్సినా, మనస్సు వాటివైపే లాగుతుంది. మహాత్ములు పలు సందర్భాల్లో పదే పదే చెబుతున్నట్లుగా, మనసంపదా దనరాసులూ పోతే మరలా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైపోతే ఏదో కొంత మనం కోల్పోయినట్లే అవుతుంది. ఇక శీలం పోతే అంతా పోయినట్లే అనుకోవాల్సి వుంటుంది. మనిషి గుణం వక్రించరాదు. బుద్ధి గడ్డితింటే కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ సమాజంలో చరిత్రహీనుడికి, శీలం లేనివాడికీ గౌరవం కలకాలం లభించదు. అయితే ఇలాంటి అధములకు అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. సద్గుణం కలిగి వుండటం కోటాను కోట్ల ధనరాసులకూ, వజ్రవైడూ ర్యాలకన్నా ఎక్కువ విలువ కలవనే చెప్పుకోవాలి.
సద్గుణ వంతులనే అందరూ ఆశ్రయిస్తారు. దుర్మా ర్గుడైన వాడికీ, దుర్గుణవంతునికీ సదా అందరూ దూరంగా వుంటారు. కొందరు పెద్దలు ‘దు’ అనే పదంలోనే దుష్ట స్వభావముందనే అంటారు. ఎందుకంటే మహాభారతం లోని కౌరవుల పేర్లలో దుర్యోదనుడు, దుశ్శాసనుడూ, దుర్మార్గుడూ, దురాచారుడూ అని చమత్కారంగా చెబుతారు.
సద్గుణాలే మనకు నిజమైన సంపదలు, కొందరు కులం కాదు కావల్సింది గుణం అంటారు. సదాచారులై, సత్ప్రవర్తనతో ఉండేవారే ఎల్లప్పుడూ సంతోషంగా వుంటారు. సంతోషమే సగం బలం కదా మరి. ఈ సమాజానికి సద్గుణాలు కలవారి అవసరం ఎంతైనా వుంది. సచ్చీలము, సద్గుణమూ, సదాచారము కలిగి వుండటం దైవకృపగానే భావించాలి. అవన్నీ దైవ సంపదలేమరి.
ఈ విధమైన దైవీక సంపదలు లేకపోవడం దురష్టంగానే భావించాలి. అలాంటి వారి జీవితం చీకటి మయమే. ఫలానా వాడు మంచివాడు, ఉత్తముడు, సద్గుణ సంపన్నుడు, సచ్చీలుడు సదాచార సంపన్నుడు అని లోకంలోని వారు అను కుంటే, వారి జీవితం ధన్యమేకదా! కొందరు చాలా కాలం బతకాలను కుంటారు. కొందరు ఎంతో బల వంతుల్లాగా వుండాలనుకుంటారు. ఎవ్వరికీ ఎందుకూ పనికిరాని వాళ్లు ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి?
ఎంత మంచి పనులు చేశామన్నదే ముఖ్యంగా భావించాలి. ఎవ్వరూ మరణాన్ని తప్పించుకోలేరు. వారు అడవిలో వున్నా, నివాస ప్రాంతాల్లో ఉన్నా, ఆకాశంలో విహరిస్తున్నా ఆ సమయం ఆసన్నమైనదంటే చాలు మరణం తద్యం. ఆ సమయం రాకముందే సచ్చీలాన్ని అలవర్చుకున్న వారు ధన్య జీవులే మరి. పుట్టటం కాదు ముఖ్యం. పుట్టింది ఎందుకో ముందు తెలుసుకోవాలి. పుణ్యకార్యాలను చేయాలి.
సాటి మనిషిని ఆదుకోవాలి. చేయరాని పనులు చూస్తూ, స్వస్వరూప జ్ఞానాన్ని సంపాదించనిచో, మరలా పుట్టడం, మరలా చావడం తథ్యం. ఇలాంటి బాధలనుండి విముక్తి పొందాలంటే సచ్చీలమును అలవాటు చేసుకోవడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ప్రతి ప్రాణియందూ దైవం వున్నాడనుకుంటే మనుష్యుడు అంటే దేవుడ్శుమనస్సు అంటారు. అలాగే మనుష్యుడు – మనస్స్సుదేవుడు అని కూడా చెబుతారు. మనస్సులో ఎలాంటి సంకల్పాలూ లేకుండా వుండాలి. అమనస్క స్థితిని పొందాలి. అలాంటప్పుడు ఆత్మ ఒక్కటే దైవ రూపంలో మిగులుతుంది. అలాంటి అమనస్క స్థితియే మోక్షం. మనస్సులో ఎలాంటి దోషం లేకుండా మహా పవిత్రంగా వుండాలి.
– -డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తి
9949092761

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”శశి ”కి ”దాదా” అవార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ
అహో సాంద్ర భోజా!
కవితా ప్రసాద రాయా!!
కనులకై కలలెన్నో దాచినావు
కనుపాపవే నీవు ఏ కారడవి దాగినావు
మహార్వాటి నుంచి నువ్వు దిగొచ్చిన వాహనం
పద్యపు కులుకు జవరాళ్ళ బండి-
అవధాన మేఘం మీద
లోలోపలి ఉత్సవ వర్షమై, ఉన్నత హర్షమై,
నాలుగు కాలాలే నిలిచి వ్యవధానం లేకుండా
కవి హంసలు పిలుస్తున్నాయని
మానసరోవరాలు దాటి వెళ్లిపోయావు-
పద్యం నీకు తలచినపుడు నర్తించే పదాభినేత్రి
ఆశు శతక గంగ నీ వెను వెనుకే సాగంగా
నగర పుత్రుల, సగటు బతుకుల బూదె కుప్పలు
ముంచెత్తమన్నావు బహు జన్మ పావన మయంగా-
నువ్వు రాయలవైతే నీకోసం
మంత్రులు నిజంగానే మంత్రులయారు
మృదు హృదయ విద్యలో బండలు కరిగించడమే కాదు
బండి పరుగులు తీయించడమే కాదు
రాళ్ళకు పూల వాసనలు తెచ్చిన
రసదండి రాళ్ళబండి –
తాళ వృక్షాంత చంద్రమూర్తి
మేం తేరిపార చూసిన నీదు కీర్తి –
పద్యాలతో ఆడుకునే పిలగాడా!
ఏ స్వర్గ మైదానం పిలిచిందయా
శిశుర్వేత్తి పశుర్వేత్తి యాత్రలో
ఒంటరి పూల బుట్ట ఒకటి
రాళ్ళ బండిలో వేసుకు వెళ్ళిపోయావు
గగన రేఖల లోకంలోకి
నాలుగు పూల రేకలే తీసుకెళ్లావు
అవీ లోకపు ప్రేమ లేఖలని!
వదిలి వెళ్లావు మాకై నీ పద్యాల పూల తోట
కవిలోక గణపతీ, అవధాన స్థపతీ
కవితా రాజ ప్రాసాదాల
స్వేచ్ఛా విహారాల ప్రసాద రాజా!!
కొత్త లోకంలో నీ ఠికాణా
పద్యావధాన ప్రవాహాల షామియానా.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ. ఎండీఆర్‌ అంటే సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్‌ ్సడీఆర్‌, టీడీఆర్‌ అంటే అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన టీబీగా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధమే.
ట ముప్పై మూడు సంవత్సరాల క్రితం (1882, మార్చి 24) నాటి మాట… జర్మనీ రాజధాని బెర్లిన్‌.. ఆ మహానగరంలోని జీవ ధర్మ శాస్త్ర పరిశోధనా సంస్థ సమావేశ మందిరం.. వైద్యశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అది. ఎందుకంటే -వేల సంవత్సరాలుగా మానవుడితో దాగుడుమూతలాడుతూ, మనిషి మనుగడను శాసిస్తూ, అప్పటివరకు అంతుపట్టకుండా ఉన్న ఒక భయంకర వ్యాధికి కారణమైన ‘సూక్ష్మక్రిమి’ని రాబర్ట్‌ కోచ్‌ (1845-1910) అనే జర్మన్‌ శాస్త్రవేత్త కనుగొన్నారు. రాబర్ట్‌కోచ్‌ పరిశోధన ఆధునిక యుగ జీవ, వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో ఒక ప్రధాన మైలురాయి అని ప్రముఖ శాస్త్రవేత్త పాల్‌ ఎర్లిచ్‌ అభివర్ణించారు. ఒక భయంకర వ్యాధి కారక సూక్ష్మ క్రిమిని కనుగొన్నందుకు గాను రాబర్ట్‌ కోచ్‌కు 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ సూక్ష్మక్రిమి కలుగజేసే వ్యాధి ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరిని బలిగొనేది. ఆ వ్యాధే క్షయ (ట్యూబర్‌క్యులోసిస్‌-టీబీ).
మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబరిక్లోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి క్షయ వ్యాధిని కలగచేస్తుంది. రాబర్ట్‌ కోచ్‌ పరిశోధన ఫలితంగా క్షయ వంశపారంపర్యంగా కాక, ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందని ప్రయోగాత్మకంగా, శాసీ్త్రయంగా నిర్ధారితమయింది.
క్షయ వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. క్షయ రోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఉమ్ము ఊసినప్పుడు వెలువడే గాలి తుంపరల ద్వారా చుట్టుపక్కల వారికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినవారికి రెండు వారాలుగానీ, అంతకు మించిగానీ బాగా దగ్గు వస్తుంది. సాయంత్రం/రాత్రిపూట జ్వరం వస్తుంది. జ్వరంతోపాటు చెమటలు పడతాయి. రోగి బరువు తగ్గుతాడు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. శరీరంలోని ఇతర అవయవాలకూ క్షయ సోకుతుంది. రోగి నుంచి ఇతరులకు వ్యాపించేది ప్రధానంగా ఊపిరితిత్తుల క్షయే.
క్షయ ప్రాణాంతకవ్యాధా అంటే నూటికినూరుపాళ్ళూ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, ఖచ్చితమైన మోతాదులో శాసీ్త్రయమైన వైద్యం అందించగలిగితే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. కనీసం ఆరు నెలల పాటు నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి నుంచి బయటపడడం అంత కష్టమేమీకాదు. ఈ మందుల్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘డాట్స్‌’ కేంద్రాల వద్ద ఈ మందులను ఉచితంగా పొందవచ్చు.
ఒక యథార్థ విషాదగాథను తెలుసుకుందాం. లక్ష్మికి ఇరవై ఏళ్ళ వయస్సులో వివాహమయింది. పెళ్ళయిన ఆరు నెలలకే భర్తకు క్షయ సోకినట్టు తెలిసింది. గ్రామంలోని డాట్స్‌ సెంటర్‌కు వెళ్ళితే కళ్ళె పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. రెండు నెలల పాటు మందులు వాడగా వ్యాధి లక్షణాలలో గణనీయమైన మార్పు వచ్చింది. దీంతో వ్యాధి నయం అయిందని భావించి వైద్యుల్ని కూడా సంప్రదించకుండా లక్ష్మి భర్త మందులు వాడడం మానేసాడు. ఆరునెలల పాటు ఎటువంటి సమస్యా రాలేదు. ఆ తరువాత క్షయ లక్షణాలు మళ్ళీ బయటపడ్డాయి. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించగా ఎమ్‌డీఆర్‌ టీడీ అని తేలింది. అప్పటికే రెండు ఊపిరితిత్తులూ పాడయ్యాయి. మందులు ప్రారంభించినప్పటికీ శరీరంలో అన్ని అవయవాలు క్షీణ దశకు చేరడంతో లక్ష్మి భర్త కొద్దిరోజుల్లోనే మరణించాడు. లక్ష్మి అప్పుడు ఆరునెలల గర్భవతి. భర్త సరిగా మందులు వాడకపోవడం వలన లక్ష్మికి కూడా ఎమ్‌డీఆర్‌ క్షయ సోకింది. కాన్పు అయిన నెలలోనే ఆమె కూడా మరణించింది. ‘మందులు మానెయ్యడం’ అనే ఒక చిన్న తప్పు ఒక చిన్నారిని తల్లిదండ్రులు లేని అనాథను చేసింది.
ఇప్పుడు క్షయ వ్యాధిని జయించిన ఒక యువతి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం. అనూష (పేరు మార్చబడినది) వయస్సు 17 సంవత్సరాలు. తండ్రి ఆటో డ్రైవర్‌. ఇంటర్‌ చదువుతుంది. ఏడాది క్రితం అనూష నానమ్మ క్షయ వ్యాధితో మరణించింది. ఇంటర్‌ పరీక్షలకు కొద్దిరోజుల ముందు విపరీతమైన దగ్గు, జ్వరం ప్రారంభమయ్యాయి. దగ్గుతోపాటు రక్తంకూడ పడ్డది. వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో వైద్యుల్ని సంప్రదించగా పరీక్షలు నిర్వహించి ఎమ్‌డీఆర్‌ టీబీ అని నిర్ధారించారు. రెండు సంవత్సరాల పాటు మందులు వాడాలని వైద్యులు సూచించారు. అనూష ఏమాత్రం నిరాశ చెందక, క్రమం తప్పకుండా మందులు, ఇంజెక్షన్లు తీసుకుంది. ఎంత కష్టమయినా టీబీ మందులు వాడడం ఆపలేదు. రెండేళ్ళ అనంతరం ఆమె క్షయ నుంచి బయటపడడమే గాక ఇంటర్‌లో కళాశాల టాపర్‌గా నిలిచింది.
మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ. ఎండీఆర్‌ టీబీ అనగా ‘మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ – ఇది సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్‌ ్సడీఆర్‌ టీబీ అంటే ‘ఎక్స్‌ట్రీమ్లీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ అని, టీడీఆర్‌ టీబీ అంటే ‘టోటల్లీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ’ అని అంటారు. అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం కానీ టీబీ ఇది. టీబీ మందులు సక్రమంగా వాడకపోవడం/మధ్యలోనే మందులు మానెయ్యడం వలన సాధారణ టీబీ కాస్తా ప్రాణాంతకమైన ‘ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ’గా పరిణామం చెందుతుంది. ఇదంతా స్వయంకృత అపరాధం వల్లనే సంభవిస్తుంది.
క్షయ వ్యాధి గణాంకాలను పరిశీలిస్తే భయపడకుండా ఉండడం అసాధ్యం. ఏటా ప్రపంచంలో 90 లక్షల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతుమంది భారతీయులే. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి క్షయ సోకుతోంది. ప్రతిరోజూ మూడు నిమిషాలకు ఇద్దరు, సుమారుగా ఒక్కరోజులోనే 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. 2013 గణాంకాల ప్రకారం ఏటా ఎనిమిది లక్షల మంది మన దేశంలో క్షయ వ్యాధితో మరణిస్తున్నారు.
ప్రతి క్షయ రోగి తాను చనిపోయే ముందు లేక చికిత్స పూర్తయ్యేలోపు పదిహేనుమందికి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడు. కాబట్టి క్షయ నివారణ మందులు మధ్యలోనే అర్థాంతరంగా మానెయ్యడం ఆత్మహత్యా సదృశమే కాక పదిహేను-ఇరవైఐదు మంది ప్రాణాలకు ముప్పు కలుగచేస్తున్న వారవుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మంది సీ్త్రలలో గర్భాశయ క్షయ బయటపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది ఎమ్‌డీఆర్‌ (సాధారణ మందులకు లొంగని) క్షయ రోగులు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యమేమిటి? ప్రతి వ్యక్తి క్షయ గురించిన ప్రాథమిక విషయాల్ని సమగ్రంగా తెలుసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగివుండాలి. ముఖ్యంగా రోగులు చేయాల్సినవి: వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. డాక్టర్ల సలహా మేరకు మందుల్ని క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు వాడాలి. మందులు వాడుతున్నప్పుడు ఏవైనా ఇతర సమస్యలు (వాంతులు, కామెర్లు లాంటివి) తలెత్తినట్లయితే వైద్యుల్ని సంప్రదించాలి. మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదు. బహిరంగ ప్రదేశాలలో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరూమాలు తప్పనిసరిగా వాడాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యసేవనం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
డాక్లర్లూ తమ బాధ్యతలు విస్మరించకూడదు- ఏమిటవి? ప్రతి క్షయ వ్యాధ్రిగస్తుడికి వ్యాధి గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలి. దీర్ఘకాలిక చికిత్స కొరకు రోగిని మానసికంగా సిద్ధపరచాలి. మందులు మానెయ్యడం వల్ల కలిగే నష్టాలను గురించి వివరించాలి. ప్రతి వైద్యుడు తన వద్దకు వచ్చే రోగుల గురించి ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇది ప్రభుత్వ నియమం.
ఇక ప్రభుత్వ కర్తవ్యమేమిటో చూద్దాం. క్షయ వ్యాధి గురించిన అవగాహన సదస్సులను విస్తృతంగా నిర్వహించాలి. గ్రామపంచాయతీలలోని ‘డాట్స్‌’ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఉచిత సేవల గురించి ప్రజలందరికీ తెలియపరచాలి. క్షయ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలి.
క్షయవ్యాధికి కారణభూతమైన సూక్ష్మ క్రిమిని కనుగొన్న తేదీని అంటే మార్చి 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వరల్డ్‌ టీబీ డే’ (ప్రపంచ క్షయ నివారణ దినం)గా ప్రకటించింది. ఈ ఏడాది టీబీ డే సందర్భంగా అందరికీ క్షయ నివారణ చికిత్సలు, ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ‘క్షయను గుర్తించండి, చికిత్స చేయండి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించండి, జీవితాల్ని కాపాడండి’ అనే సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఈ సందేశ స్ఫూర్తితో క్షయ వ్యాధి గురించిన అవగాహనను పెంచుకుంటూ క్షయరహిత భారతదేశ నిర్మాణం దిశగా అడుగులేద్దాం. స్వచ్ఛ భారత్‌! ఆరోగ్య భారత్‌!!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా
ఆవుపేడను ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీని వల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూలత ఏర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది… గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింతగా మెరుగ్గా పొందేందుకు తోడ్పడే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
గోవులను సంరక్షించడానికి ప్రభుత్వం నిబద్ధమయింది. పచ్చిక బయళ్లను మేయడానికి ఆవులు ఆరాటపడతాయి. పంటల నుంచి ఉత్పత్తయ్యే ఎండుగడ్డిని ఆవులకు ఆహారంగా వేస్తారు. అయితే గడ్డి నుంచి తయారయ్యే ఎరువు భూసారాన్ని శ్రేష్ఠంగా ఉంచడానికి సరిపోదు. పచ్చిక మేత నుంచి ఉత్పత్తయ్యే ఎరువును దీనికి అదనంగా చేర్చుతారు.
మన గ్రామాల్లో ఉమ్మడి పచ్చిక భూములు (మేత పొరంబోకులు) ఉంటాయి. ఆ భూముల్లో గోవులతో సహా అన్ని పశువులు మేత మేస్తుంటాయి. ఎండుగడ్డిరూపంలో వాటికి మరింత ఆహారాన్ని ఇవ్వవలసిన అవసరముండదు. గోవులను ఆ భూములకు తీసుకుకువెళ్ళి, రోజంతా మేసిన తరువాత తిరిగి ఇళ్ళకు తీసుకు వస్తుంటారు. ఈ శ్రమకయ్యే వ్యయం అత్యంత స్వల్పం. రైతులకు, గోవులు, ఇతర పశువులు పాలు, ఎరువును ఎటువంటి ఖర్చులేకుండా సమకూర్చుతాయి. తద్వారా రైతులు ఇతోధిక లబ్ధి పొందేవారు. గోవులు పచ్చిక బీళ్ళను మేయడం, గడ్డిని వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తయ్యే ఎరువు భూసారాన్ని పరిరక్షించడానికి, పరిపుష్ఠం చేయడానికి సరిపోతుంది.
మన గ్రామాల్లో ఇదంతా ఒకనాటి పరిస్థితి. వర్తమానం భిన్నమైనది. ఉమ్మడి పచ్చిక భూములను ఇతర ప్రయోజనాలకు మళ్ళించారు. ఆర్థికంగా, రాజకీయంగా శక్తిమంతులైన వారు ఆ ఉమ్మడి భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాలు సైతం పాఠశాలల నిర్మాణానికి, ఇతర ఉపయోగాలకు ఆ ఉమ్మడి భూములను విరివిగా ఉపయోగించుకున్నాయి. తత్ఫలితంగా గోవులకు ఇప్పుడు పచ్చిక భూములనేవే లేకుండా పోయాయి. పచ్చికమేత నుంచి ఎరువు తయారీ గణనీయంగా తగ్గిపోయింది. వ్యవసాయక్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఎండు గడ్డి గోవులకు ప్రధాన ఆహారవనరుగా ఉన్నది. గోవులు ఉత్పత్తి చేసే ఎరువులు బాగా తగ్గిపోవడంతో రైతులు రసాయన ఎరువులపై మరింతగా ఆధారపడసాగారు. రసాయన ఎరువుల వాడకానికి బాగా అల వాటు పడి ఆవు పేడను పోగుచేయడం, నిల్వచేయడం, పొలాల్లో ఎరువుగా ఉపయోగించడం మొదలైన పనులపట్ల విముఖత పెంచుకున్నారు. రసాయనఎరువులను వెదజల్లడం చాలా తేలిక. దీంతో పంటలసాగుకు అవసరమైన ఎరువుల ఉత్పత్తికి గోగణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు లేకుండా పోయింది.
రసాయన ఎరువులపై ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీలు రైతులకు అంతగా తోడ్పడడం లేదు. 1960వ దశకంలో కరువులు, కాటకాలు విజృంభించినప్పుడు రైతులను ఆదుకోవడానికి ఈ సబ్సిడీలను ప్రవేశపెట్టారు. అప్పటి విపత్కర పరిస్థితిని బట్టి ఆ సబ్సిడీలు అత్యావశ్యకమయ్యాయి. అయితే ఆ క్లిష్ట పరిస్థితిని అధిగమించిన తరువాతకూడా ఆ సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. దీంతో రసాయన ఎరువుల ఉపయోగమే బాగా లబ్ధికరంగా ఉం దనే విషయాన్ని రైతులు గ్రహించారు. పొలానికి అవసరమైన పరిమాణంలో ఎరువును ఉత్పత్తిచేసేందుకు పెద్ద సంఖ్యలో ఆవు లను పోషించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు వాజపేయి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేడను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన ఒకటి పరిశీలనకు వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుంచే కాక ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆవు పేడ దిగుమతికి ప్రభుత్వం తిరస్కరించింది. ఆ నిర్ణయం పెద్ద పొరపాటని నేను భావిస్తున్నాను. ఆవుపేడ నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులు భూసారాన్ని పరిరక్షించడంలోను, పరిపుష్ఠం చేయడంలోనూ అత్యంత ప్రభావశీలంగా ఉంటాయి. ఎన్‌-పి-కె వంటి కృత్రిమ ఎరువులు భూసారానికి తోడ్పడే (భూమిలోని) సూ రక్ష్మపాణులను హరించి వేస్తాయి. తత్ఫలితంగా భూసారం క్షీణిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని మనం బాగా తగ్గింంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆవుపేడను దిగుమతి చేసుకొని దాన్ని ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీనివల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూల అభిప్రాయమేర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. వెరసి భూసారాన్ని బాగా కాపాడడానికి ఇతోధిక మేలు జరుగుతుంది.
గ్రామీణ ఉపాధిహామీ పథకంవల్ల వ్యవసాయ కూలీలకు పెద్ద మొత్తంలో కూలీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్ల లందరికీ విద్యను సమకూర్చడానికి తల్లితండ్రులు అధిక శ్రద్ధచూపుతుండడం వల్ల గోవులను మేతకు తీసుకువెళ్ళే బాలల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో గోవులను పోషించడమనేది రైతులకు పెద్ద భారంగా పరిణమించింది. గోవుల కంటే గేదెలను పోషించడం లాభదాయకమని రైతులు భావిస్తున్నారు. గేదెలను రోజంతా చావిడిలోనే కట్టివేసి ఇంత ఎండు గడ్డి పడేస్తే చాలు. అవి భారీగా పాలను ఉత్పత్తి చేస్తాయి. జెర్సీ లాంటి విదేశీ సంతతి ఆవుల కూడా మన గేదెల వలే స్థాన బద్ధంగా ఉంటాయి. ట్రాక్టర్ల మూలంగా ఎద్దుల అవసరం లేకుండా పోయింది. ట్రాక్టర్‌ సహాయంతో వంద ఎకరాలనైనా అతి తక్కువ సమయంలో దున్నే సదుపాయం, సౌలభ్యం లభించింది. తత్ఫలితంగా సాగుచేసే భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
అయితే దీనివల్ల గోవుల పురుష సంతానం సమస్యాత్మకంగా పరిణమించాయి. అవి ఆర్థికంగా ఉపయోగకరమైనవి కావు. అయితే వాటిని హతమార్చడానికి వీలులేదు. కాగా గేదెలకు సంతానాన్ని ఆహారానికి ఉపయోగించుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవు. కనుకనే రైతులు గోవులకు బదులు గేదెలను పెంచి పోషించడానికి మొగ్గుచూపుతున్నాడు. చెప్పవచ్చిన విషయమేమిటంటే గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింత మెరుగ్గా పొందేందుకు దోహదం చేసే విధానాల రూపకల్పన, అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!

ప్రభుత్వ పరిశీలనలో చారిత్రక పట్టణం
ఈ పేరు వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు
ఆంధ్రుల రాజధాని, పంచారామం,
బౌద్ధ నగరం కూడా
ఎన్టీఆర్‌ పేరును ఎలా కలపాలని అంతర్మథనం
ఇంకా కొలిక్కిరాని ఆలోచన
త్వరలో అధికారిక ప్రకటన
జూన్‌ 2లోపు ఖరారు చేసే అవకాశం
హైదరాబాద్‌, గుంటూరు, అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి..! పంచారామాల్లో ప్రధానమైన ఆరామం! ఆంధ్రుల (శాతవాహనుల) రాజధాని! చింతపల్లి జమీందార్‌ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధాని! భారతదేశంలో బౌద్ధుల రాజధాని! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రం! స్వర్గ లోకాధిపతి ఇంద్రుడి రాజధాని పేరు కూడా ఇదే! ఇప్పుడు అమరావతి మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందన్న అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాజధానికి రెండు, మూడు పేర్లు ప్రతిపాదనకు వచ్చినా, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా అమరావతి పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది ఒడ్డున కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో పూర్వ కాలంలో ఆంధ్రుల రాజధాని నగరం ధాన్య కటకం విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాని పేరు అమరావతిగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును కూడా జోడించాలన్న అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన ఎన్టీఆర్‌ పేరును కొత్త రాజధానికి ఏదో రూపంలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారు. అది ఏ రూపంలో అన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోర్‌ రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దానికి ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలని, రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించాలని కొందరు సూచించారు. తారకరామ పురి అన్న పేరు పెట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది జూన్‌ రెండో తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అప్పటికి రాజధాని పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారని, ఇది ఆయన మనసులో ఉన్న అభిప్రాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా చర్చిస్తూ ఈ విషయం చెప్పారు. ఒక దశలో, రాజధాని ప్రాంతంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లోనే ఈ పేరు ప్రకటిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి భావించారని, కానీ, దీనిపై మరి కొంత అధ్యయనం అవసరమన్న అభిప్రాయంతో వాయిదా వేసుకొన్నారని తెలిపారు. కొత్త రాజధానికి దివంగత ఎన్టీఆర్‌ పేరును ఎలా జోడించాలన్న దానిపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.
ఎప్పుడో అంతర్జాతీయ ఖ్యాతి
అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతావనిని పరిపాలించారు. 1795లో చింతపల్లి జమీందార్‌ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి దానికి సమీపంలో అమరావతి అనే నూతన రాజధానిని నిర్మించారు. శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. ఇప్పుడు ఇది నవ్యాంధ్ర రాజధానిగా మారితే, ఆసియా ఖండంలోని వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెడితే బౌద్ధ మత గురువు ద లైలామా ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.
అమరావతి పురాణ గాథ
హిరణ్యాక్షులు, బలి చక్రవర్తి, నరకాసురుడు, రావణుడు తదితర రాజులను మహా విష్ణువు వివిధ అవతారాలతో సంహరించాడు. తమ పూర్వీకులందర్నీ మహా విష్ణువు సంహరించినందున, ఆయనపై పగ సాధించాలని అదే వంశానికి చెందిన తారకాసురుడు నిర్ణయించుకున్నాడు. మహా విష్ణువుతో యుద్ధం చేయడానికి తన బలం చాలదని గ్రహించి పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుని మెప్పించి ఎవరితోనూ, ఎట్టి ఆయుధముతోనూ, ఎప్పుడూ సంహరించకుండా ఉండేలా వరం కోరాడు. దాంతో, దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృత లింగాన్ని ఈశ్వరుడు తారకాసురుడికి ఇచ్చాడు. అది యథాతథంగా ఉన్నంత వరకు నీ ప్రాణానికి ముప్పు లేదని వరమిచ్చాడు. అనంతరం తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి. ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుండడంపై గుంటూరు జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది.
అమరావతి పేరు హర్షణీయం: మాజీ మంత్రి డొక్కా
ఏపీ నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టాలనుకోవటం హర్షణీయం. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అమరావతి వైభవోపేతంగా అలరారింది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టాలి. అసెంబ్లీ ఎదుట జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసి, రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్‌ ప్రాంగణంగా నామకరణం చేయాలి.
ప్రవాసాంధ్రుల హర్షం
బెంగళూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక అమరావతి పేరు నవ్యాంధ్రకు అన్ని విధాలా సరిపోతుందని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి పేర్కొన్నారు. భూగోళం ఉన్నంతవరకు చంద్రబాబు కీర్తి వర్ధిల్లాలని కోరుతున్నట్లు తెలిపారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -3

ఫ్లాబర్ట్ ను మేడం బోవరీ పాత్ర ఎవరు అని అడిగితె నిర్మొహమాటం గా ‘’Madame Bovary is me’’అని స్పష్టంగా చెప్పాడు .ఆ పాత్రలో ఉన్న అన్ని మంచి చెడు లక్షణాలన్నీ ఫ్లాబర్ట్ వే నన్నమాట .ఫ్లాబర్ట్ జీవితంపై రాసిన హేన్రీజేమ్స్ ‘’ఫ్లాబర్ట్ జీవితం ముత్యపు వేటగాని జీవితమే .అంతులేని నిధికోసం ఊపిరి సలపకుండా సాగే కార్యక్రమమే .ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ స్పస్టతనిస్తూ ,పునరుక్తిని పరిత్యజిస్తూ రచనకు అందం తెచ్చాడు ‘’అన్నాడు .తగిన మంచి మాట దొరికే వరకూ ఆలోచిస్తూనే ఉండేవాడు .ఒక సారి రెండు దిద్దుబాట్లకు మూడు రోజుల సమయం తీసుకొన్నానని స్వయం గా ఫ్లాబర్ట్ చెప్పాడు .ఏంతో  గొప్పగా రెండు లైన్లు చెప్పాలని పరితపించి సాధించాడు .బోవరీ నవల లేటెస్ట్ దే అయినా అదే అతని ప్రధమ ముద్రణ రచన అయింది .45 వయసులో దీనివిషయమే కోర్టు కేసు నడిచింది .అందులోని కొన్ని చాప్టర్లు అసంబద్ధం అని తొలగించాలని ప్రభుత్వం వాదించింది .ఎమ్మా బోవరి మరణ దృశ్యాలు మరీ ఇబ్బందికరం గా ఉన్నాయన్నారు .దీనికి ఫ్లాబర్ట్ లాటిన్ లో ఉన్న ఒకే ఒక్క పేజీని ఫ్రెంచ్ భాషలో రాశానే తప్ప తానేమీ అసంబద్దం గా రాయలేదన్నాడు .బోవరి రాసి ప్రచురించిన మూడు నెలలకు బాడేలేర్ రాసిన ఫ్లూర్స్ డూ మాల్ ప్రచురింపబడింది .

బోవరి లోని రచనా శైలికి చదువరి పెద్దగా అబ్బురపడ లేదుకాని  దానిపై వచ్చిన దుమారం తో బాగా పాప్యులర్ అయిన్దినవల .జనం నాలుకల మీద ఫ్లాబర్ట్ పేరే నర్తించింది పాప్యులారిటీ విపరీతంగా పెరిగింది ఈ ఊపులో ‘’సలమ్మ్బో ‘’నవల ప్రారంభించాడు .దీని ప్లాట్ కోసం ఆఫ్రికా సందర్శించాడు ఇందులో మొదటి ప్యూనిక్ యుద్ధం కద ఉంది .తాను రాయబోయే సబ్జెక్ట్ పై తీవ్ర పరిశోధన చేశాడు వందలాది పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు .ప్లినీ ,దియోడరాస్, హెర డోటస్ ,పసానియాస్ ,ఫిలస్త్రాటాస్ మొదలైన క్లాసికల్ రచయితల రచనలన్నీ ఆకళింపు చేసుకొన్నాడు .’’నా మనసులో యేవో అస్పస్టభావనలున్నాయి అవి స్పష్టమైన రూపం లోకి రావటానికి చాలాకాలం నిరీక్షిం చాను ‘’అన్నాడు .

సెంటిమెంటల్ ఎడ్యు కేషన్ పుస్తకాన్ని రాశాడు ఇరవై ఏళ్ళనుంచి ఆ సబ్జెక్ట్ మనసులో ఉంది .వయసు నలభై లో ఉండగా పబ్లిష్ చేశాడు .ఇందులో ‘’సైంటిఫిక్ రియలిజం ‘’లోకి మళ్ళీ ప్రవేశించాడు పార్శియన్ ఉన్నత ,మధ్యతరగతి జీవుల కద ఇది .క్రమంగా ఫ్లాబర్ట్ జీవితం లోకి దురదృష్టం దొంగచాటుగా ప్రవేశించిది.యాభై వ పదడిలో స్వంత దేశాన్ని ప్రష్యన్లు ఆక్రమించారు   .ఫ్రాన్స్ పరాజయాన్ని ప్రపంచ పరాజయం గా భావించాడు .ప్రపంచం అంతమై పోతోందని వ్యధ చెందాడు .అతని దృష్టిలో పగానిజం ,క్రిష్టియానిటి , కాంప్లసేన్సి(సంతృప్తి )అనేవి మానవ చరిత్రలో మూడు పరిణామాలు .(ఇవల్యూషన్స్).1869లో స్నేహితుడు బౌల్హేట్ మరణించాడు .’’నా ఆలోచనలను నా కంటే విస్పష్టం గా అర్ధం చేసుకొన్నవాడు బౌల్హేట్ ‘’అన్నాడు అతనిమరణం ఆశనిపాతమే అయింది .ఇంతలో తల్లి చనిపోయింది మరీ  కుంగిపోయాడు .విధి క్రూర పిశాచం అన్నాడు .ఎలీషా శ్లీసిన్గర్ మానసిక వ్యాధితో శరణాలయం లో ఉంటె ఫ్లాబర్ట్ ను అతని నీస్ దగ్గరుండి సపర్యలు చేసింది .ఎమిలీజోలా టర్గనీవ్ ,మపాసాలు వచ్చి చూసి వెళ్ళారు .

పుస్తకాలలోనే కూరుకు పోయి ఉతర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్నాడు ఫ్లాబర్ట్ .55 వయసులో ‘’ఏ సింపుల్ హార్ట్ ‘’అనే చిన్న కద రాశాడు .ఇతరులకోసం జీవిస్తూ ,విశ్వాసం ,మంచితనం ,ప్రేమ గుణం మూర్తీభవించిన వాడి కదఇది .బావార్డ్ అండ్ పెకూచేట్ అనే రచన పై తీవ్రం గా కృషి చేస్తున్నాడు .కాని పూర్తీ చేసే లోపే మరణించాడు .ఇందులో సగం ఫార్స్ సగం సెటైర్ ఉంది .56 వయసులో పాత జబ్బులు తిరగ బెట్టాయి .నిత్యం నరకమే అనుభవించాడు .అయినా రచనలో శైలికోసం ఆరాటం మాత్రం మానలేదు .బోవార్డ్ నవల సగం పూర్తీ అయింది ,’’అపాప్లేక్సీ ‘’జబ్బు వచ్చి ఒక రోజు పనిమనిషి ఆహారం తీసుకోచ్చేసరికి లైబ్రరీలో ఆఖరి శ్వాస పీలుస్తూ ఉన్నాడు .ఏరకమైన సహాయం అందించే అవకాశం లేకుండాపోయింది.  యాభై తొమ్మిదేళ్ళ వయసులో 8-5-1880 వాస్తవ సాహిత్య సృష్టికర్త గుస్టేవ్ ఫ్లాబర్ట్ వాస్తవం గా ఇహలోకాన్ని వీడాడు .పన్నెండు రచనలు చేసి కీర్తిపొండాడు

సంపూర్ణమైన శైలి కి ఫ్లాబర్ట్ ఉదాహరణ గ నిలిచాడు .అతని రచనలో రోమాన్స్ తో బాటు వాస్తవికత కూడా ఉన్నది చనిపోయిన తర్వాత అతని సాహిత్య కీర్తి మరీ విస్తరించింది .ఫ్రాంజ్  కాఫ్కా కొట్జీ , నేబకోవ్ వంటి ఇరవైవ శతాబ్దపు రచయితలపై ఫ్లాబర్ట్ ప్రభావం బాగా ఎక్కువ .ముఖ్యం గా  ఫ్లాబర్ట్  వారసుడు ఫ్రాంజ్ కాఫ్కా అని చెప్పటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .అందరూ ఒప్పుకొన్న సత్యమే ఇది ..’’సింగ్యులర్ పోఎటిక్ ఎఫెక్ట్ ‘’అనేది ఫ్లాబర్ట్ సాధించిన ఘన విజయం .మేడం బోవరి నవలను మొదట్లో ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు .చనిపోయే నాటికి ‘’ఫ్రెంచ్ రియలిస్ట్ రైటర్ ‘’గా ప్రసిద్ధి పొందాడు ఫ్లాబర్ట్ .ఇరవైవ శతాబ్దపు అన్నిరంగాలలోని మేధావులు ఫ్లాబర్ట్ ను పొగడకుండా ఉండలేక పోయారు. అదీ తను సాధించిన అద్భుత విజయం .

 

Novelists should thank Flaubert the way poets thank spring; it all begins again with him. There really is a time before Flaubert and a time after him. Flaubert decisively established what most readers and writers think of as modern realist narration, and his influence is almost too familiar to be visible. We hardly remark of good prose that it favors the telling of brilliant detail; that it privileges a high degree of visual noticing; that it maintains an unsentimental composure and knows how to withdraw, like a good valet, from superfluous commentary; that it judges good and bad neutrally; that it seeks out the truth, even at the cost of repelling us; and that the author’s fingerprints on all this are paradoxically, traceable but not visible. You can find some of this inDefoe or Austen or Balzac, but not all of it until Flaubert.’’అన్నాడు జేమ్స్ వుడ్ అనే విమర్శకుడు ‘’హౌ ఫిక్షన్ వర్క్స్ ‘’గ్రంధం లో .

Inline image 1 Inline image 2

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చరిత్ర లేకుంటే భవిష్యత్తు లేదు- వకుళాభరణం రామకృష్ణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మన్మధ ఉగాది 21-3-15 శనివారం 4 చోట్ల నా పంచాంగ శ్రవణం రాత్రి 7 గం లకు గండిగుంట దత్త దేవాలయం లో చిత్రమాలిక …

శ్రీ మన్మధ ఉగాది 21-3-15 శనివారం 4 చోట్ల నా పంచాంగ శ్రవణం రాత్రి 7 గం లకు గండిగుంట దత్త దేవాలయం లో చిత్రమాలిక …

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మన్మధ ఉగాది – sakshi నా పంచాంగ శ్రవణం

sakshi 21 - 3 - 15

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -2

లూసీ ని ఎలా ఎందుకు ఫ్లాబర్ట్ ప్రేమించాడో అర్ధం కాక అతని మిత్రులు జుట్టు పీక్కున్నారు .ఆమె స్వతం ప్రకటనా చాతుర్యం లో దిట్ట అని ,అందరి దృష్టిని ఆకర్షించటానికే తాపత్రయ పడుతుందని ‘’she had a natural lack of naturalness ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .ఇవేమీ మనవాడికి కనిపించలేదు ఆమె అంటే ఒక విపరీతమైన ఫాసినేషన్ మాత్రమే ఉంది..తండ్రిని ,సోదరిని కోల్పోయి శూన్యం లో బతుకుతున్న ఫ్లాబర్ట్ ను ఆమె ‘’he was sexually aroused .as an un tamed buffello from the wild of America ‘’.అయినా ఫ్లాబర్ట్ చాలా జాగ్రత్తగానే వ్యవహరించాడు .మొదటిసారి ఆమెతో ప్రేమ విహార యాత్ర చేసి తిరిగి వచ్చాక ‘’నాకు భౌతిక ప్రేమ రెండవ స్థానం .నేను ఆనందాన్ని  కల్గించిన మొదటి స్త్రీవి నువ్వే .ఇంకెవరూ లేరు .చివరిదాకా నన్ను అర్ధం చేసుకొంటావని ఆశిస్తున్నాను .నాదారిలో నిన్ను ప్రేమించే అవకాశం ఇవ్వు .నాకోపాలు తాపాలు ఉద్రేకాలు అన్నీ భరించగలవు అనుకొంటాను .నన్ను బలవంతం గా ఏ పనీ చెయ్య నివ్వద్దు .అప్పుడే నేను ఏదికావాలన్నా చేయగలను ‘’అని కుండ బద్దలు కొట్టి సారీ ‘’గుండె బద్దలు కొట్టి ‘’చెప్పేశాడు..ఇలా పూర్తిగా కొనసాగిందో లేదోకాని ఆమె బలవంత పెట్టినప్పుడు సంకోచించాడు ,ఆమె బాగా అడ్వాన్స్ అయితే వెనక్కి తగ్గాడు .తన తల్లికి ఇబ్బందికలిగించే ఏ పనీ చేయటానికి మాత్రం సాహసించ లేదు ఫ్లాబర్ట్ .ఆమెను తల్లికి తన ‘’లిటరరీ ఫ్రెండ్ ‘’అనే చెప్పాడు .

ప్రేమ వ్యవహారాలను గురించి రాసే విషయం లో ఫ్లాబర్ట్ కొంత  ఆత్మ రక్షణ తోనూ కొంత తప్పించుకొనే పద్ధతిలోను రాశాడు .ఎవరు ఎలాంటి వారైనా ఫ్లాబర్ట్ కోరుకొన్నది ఏకాంతమే ‘’ఏ  కాంతనూ’’ కాదు  .ఎవరొ ఒకరు  భార్యగానో మిస్త్రేస్ గానో ఉండటం అతనికి నచ్చనిపని .తనను తానూ పూర్తిగా పుస్తకాలకే అర్పించుకొన్న వ్యక్తీ ఫ్లాబర్ట్ .’’మంచి పరిశుభ్రమైన గది ,వెచ్చదనం ,కావలసినంత విశ్రాంతి అందుబాటులో అనంతమైన సాహిత్యం  ఉంటె నాకు ఇంక ఏమీ అక్కరలేద’’న్నాడు .అతన్ని మురిపించటానికి మర్చిపోలేదని తెలియ జేయటానికీ లూసీ అప్పుడప్పుడు కానుకలు ,తన బెడ్ రూమ్ స్లిప్పర్లు అనేక రకాల జుట్టు కత్తిరింపులు పంపేది వీటికి బదులుగా ఫ్లాబర్ట్ ఆమెకు ఏమీ పంపేవాడుకాడు .కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ‘’కిస్ ‘’అంద జేస్తున్నట్లు రాసేవాడు .ఆమెలో’’ ప్రేమ త్రాచు’’ బుసలు కొట్టేది .20 మీద పడినా ఫ్లాబర్ట్ ఇంకా ఒక్క పుస్తకమూ ప్రచురించలేదు .ఆతను ప్రాధమికంగా రచయిత ,ఆ తర్వాతే ప్రేమికుడు .సన్నివేశాలు ,సంఘటనలు ,అనుభవాలు ,భావోద్రేకాలు అన్నిటిని జాగ్రత్తగా అక్షర బద్ధం చేశాడు ‘’మేడం బోవరి ‘’నవలలో .ఈ రచనా వ్యాసంగం లో పూర్తిగా అంకితమైపోయి ప్రేమ కు క్రమంగా దూరమైపోయాడు .

రెండు పుస్తకాలు ‘’సెంటిమెంటల్ ఎడ్యుకేషన్ ‘’,టెంప్టేష న్స్ ఆఫ్ సెయింట్ ఆంథోని ‘’అన్న రెండు పుస్తకాల మీద తీవ్రం గా ద్దృష్టిపెట్టాడు .స్నేహితుడు డూకాంప్ తో తూర్పు దేశాలు తిరిగి వచ్చాడు .అలేక్సాండ్రియ ,నైల్ నది ,సిరియా ,కాన్ స్టాంటి నోపుల్ ,రోమ్ మొదలైనవన్నీ తిరిగి చూశారు .తల్లి అనుజ్న ఇచ్చింది .ఈ టూర్ అతని ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు సలహా ఇవ్వగా కొడుకు  డిప్రెషన్ లోంచి బయటపడతాడని తల్లి ఆశించింది .చాలాకాలం గడుపుదామనుకొన్నా ఇంటి బెంగ పడి త్వరలోనే తిరిగి వచ్చాడు .నార్మండిలో ఉండగా నైల్ నదిని కలగనేవాడు .ఈపర్యటనకు ముందే  డూకాంప్  ను ఇంటికి పిలిపించుకొని తాను  రాస్తున్న టెంప్టే షన్స్ చాప్టర్లు చదివి వినిపించాడు .ఇందులో ‘’రోమాం టిజం ‘’ను పీకల్లోతుగా రాశాడు . ఫాంటసీ దట్టించాడు .దీన్నే ‘’ ఫాంట స్మ గోరియా ఆఫ్ మిత్స్ ‘’అన్నారు .ఇందులో దెయ్యం,రుషి కద పురాతనమైనదే ,నరకతీవ్రతలు,ఒలింపస్ దేవతలు ,హిందూ దేవా దేవతలు ,క్రిస్టియన్ మత ప్రీస్టులు ,భవిష్యత్ చెప్పే సూద్ సేయర్స్ ,నాగారాధకులు ,అమరవీరులు ,అద్భుతాలు స్పినిక్స్ వగైరా మసాలా అంతా దట్టించి నూరాడు .ఇదంతా చదివితే’’ ప్రోజ్ పోయెం’’అన్న అనుభూతి కలుగుతుంది .ఇవన్నీ చదివి వినిపించాడు  డూకాంప్ కు  .చదవటం పూర్తవగానే అంతా నిశ్శబ్దమే రాజ్యం చేసింది .చివరికి డూకాంప్ తల ఊపి షేక్ హాండ్ ఇచ్చి ‘’నువ్వు సంగీతం సృస్టిం చా లనుకోన్నావు .కాని రణగొణ ధ్వని తప్ప ఏమీ సాధించ లేకపోయావు ‘’అన్నాడు .అప్రతిభుడై నాడుకాని దీన్ని ఒప్పుకోలేదు .బౌల్హీట్ కూడా ఇదే అభిప్రాయం చెప్పాడు . ఏకీభవించని  ఫ్లాబర్ట్ ఇరవై ఏళ్ళు అతనితో మాట్లాడలేదు ..చివరికి మళ్ళీ తిరగ రాసి ఏడేళ్ళు దాచిపెట్టాడు దాన్ని .1876 మార్పులు చేర్పులు పూర్తీ అయ్యాక ప్రచురించాడు .

ముప్ఫై వయసులో మన్మధ  సౌందర్యం తో చుక్కల్లో చంద్రుడిగా వెలిగిపోయాడు ఫ్లాబర్ట్ .లూసీ మళ్ళీ ఊరిస్తూనే ఉంది .అతని తిరస్కారాన్నేమీ లెక్క చెయ్యలేదామే .ముగ్గులో దించే ప్రయత్నం మానలేదు .’’నువ్వు నా హృదయం వెనక గది లో కొలువై ఉన్నావ్.’’అని చెప్పి అతని తల్లి కి దగ్గరై ప్రయత్నాలు చేయ ప్రారంభించింది .ఆమె ఉన్న ఇంటికి వెళ్లగా తలుపు దగ్గరే నిలవరించి ఫ్లాబర్ట్ ఆమెను వెనక్కి పంపేశాడు .ఇంతమాత్రం చేత ఆమెకు ఉత్తరాలు రాయటం మాత్రం మానలేదు ఫ్లాబర్ట్ .టెంప్ టేషన్’’సబ్జెక్ట్ లాంటిదికాక వేరొక ప్రాజెక్ట్ మీద ఆలోచిస్తున్నాడు .ఫ్లాబర్ట్ స్నేహితుడు డాక్టర్ డిలానీ భార్య వలన ఇబ్బందులు పడి ఆత్మ హత్య చేసుకోన్నాడని తెలిసి మనసు కలత చెంది నాలుగేళ్ళు బాధా తప్త హృదయం తో గడిపి మేడం బావరి ‘’రాశాడు. అంతకు ముందెన్నడూ చూడని గొప్ప సాహిత్యానికి సృష్టికర్త అనిపించుకొన్నాడు ప్రపంచం లోనే గొప్ప నవలా రచయిత అని ప్రసిద్ధి చెందాడు .యదార్ధ వాది గా అవతారం ఎత్తాడు ఫ్లాబర్ట్ .దీన్ని చదివి సోమర్సెట్ మాం గొప్పగా స్పందించి ‘’Flaubert created the modern realistic novel and directly or indirectly influenced all writers of fiction since his day .The characters are  drawn with consummate skill. It never occurs to us that they are figures in a novel..Homais is a creature as humorous as Mr  Micawber as familiar to the French as Micawber is to the English ..అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదర్శ పురుషుడు

ఆదర్శ పురుషుడు

  • 22/03/2015
  •  -పసుమర్తి కామేశ్వరశర్మ

‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’. ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం. ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది ‘ధర్మం’ అనే పదం. ‘ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలుచుట అనే అర్థాలున్నాయి. ధర్మం – ఈ విశ్వానికి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఈ వసుధైన కుటుంబానికి, వ్యక్తికి, ఆధారంగా నిలుస్తోంది. ధరించేది కనుక ధర్మం అన్నారు. ‘సర్వే ధర్మం ప్రతిష్ఠితం’ అన్నారు. ‘ధర్మం’ గురించిన విశేషాలను చెప్పేవి – వేదములు. ‘వేదోఖిల ధర్మమూలం’ ఉపనిషత్తులు, పురాణేతిహాసములు, భగవద్గీత మున్నగు వాటిలో ధర్మ సూత్రములు చెప్పబడ్డాయి. ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పిన ఆదికావ్యం ‘శ్రీమద్రామాయణం’ ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు – వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పదహారు మంచి గుణాలు చెప్పి, ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? అని అడిగాడు, లోకసంచారి అయిన నారద మహర్షిని. నారద మహర్షికి వెంటనే సమాధానం దొరకలేదు. కాస్త ఆలోచించి – ‘ఉన్నాడు, లేకేం’ అని, అన్ని సద్గుణాలు కలిగిన ధర్మస్వరూపుడు, దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడని’ నొక్కి వక్కాణించి చెప్పాడు. వాల్మీకి మహర్షి నారదుడు చెప్పిందంతా విని, సత్యసంధుడు, దృఢవ్రతుడు ధర్మాత్ముడయిన శ్రీరాముని సచ్చరిత్రను ఒక కావ్యంగా వ్రాయాలని సంకల్పించాడు. ఆ ఇరువురు ఒక శుభముహూర్తాన కలిశారు, ఆ సంఘటనే మానవాళికి మార్గదర్శకంగా, మొట్టమొదటి కావ్యంగా, అందింపబడింది శ్రీమద్రామాయణంగా. రామాయణంలోని ఆధ్యాత్మికతను తెలుసుకుందాం. రామ+అయనం = రామాయణం. అంటే, రామ అయనం – అనే రెండు మాటలతో ‘రామాయణం’ ఏర్పడింది. ఆయనము – అనే మాటకు, గమనము, గయ్యము అనే అర్థాలున్నాయి. ‘నాన్యః పంథా అయనాయ విద్యతే’ అన్నది వేదం. అయనం – అంటే అక్కడ చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది – పంథాః అనే మాట. దానే్న పరాయణమని కూడా పేర్కొన్నారు. పరమమైన గమ్యమేదో – అది పరాయణం. ‘సత్యజ్ఞానానంద రూపా, సామరస్య పరాయణ’ అన్నది లలితా సహస్ర నామం. కనుక, ‘రామాయణం’ అంటే – రాముడే గమ్యం. అనగా, ఆత్మ తత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం. ఇదే ఆత్మారామ, తారక రామ తత్త్వం. సత్యము, ధర్మము, త్యాగము, కర్తవ్య నిష్ఠ, పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, భ్రాతృ ప్రేమ, అనురాగము, క్షమ, స్నేహము, సౌశీల్యము, వాత్సల్యము, ఔదార్యము, సహనము, సౌహార్ధము – మొదలగు గుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైనాడు – శ్రీరామచంద్రుడు. రాముని ధర్మ నిరతి నాటికి, నేటికి, ఏనాటికి అందరికీ ఆదర్శప్రాయమే. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా దాసేత్ సాక్షాత్ రామాయణాత్మనా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్మజుడైన రాముడుగా అవతరించగానే, పరమాత్మ గుణ వర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామాయణము రూపములో వెలువడినది. పరిపూర్ణ మానవుడుగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చినా స్వధర్మమును వీడక, ధర్మ పథాన్ననుసరించి, లోకానికి ధర్మమాహాత్మ్యమును చాటి చెప్పిన అవతార పురుషుడు -శ్రీరామ చంద్రుడు. మానవ జీవితంలో స్వార్థానికీ, ధర్మానికీ ఎప్పుడూ సంఘర్షణే. స్వార్థం – మనస్సును ఇంద్రియాల వైపు మళ్లిస్తుంది. ధర్మం, మనస్సును ఇంద్రియాల నుండి దూరం చేస్తుంది. స్వార్థం – స్వసుఖాన్ని కోరుకుంటుంది. ధర్మం – పరహితాన్ని కోరుకుంటుంది. స్వార్థం – భోగాన్ని కోరుకుంటుంది. ధర్మం – త్యాగాన్ని ప్రబోధిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః’ స్వార్థానికీ, ధర్మానికీ జరిగే సంఘర్షణే – జీవితం. జీవితంలో స్వార్థాన్ని త్యజించి, ధర్మాన్ని అనుసరించే మానవుడు – అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు, అందరి మన్ననలను పొందుతాడు, మహోదాత్తుడవుతాడు. అర్థ, కామాల కొరకు, అధర్మ మార్గాన్ని అవలంబించేవారు, స్వార్థబుద్ధితో పతనవౌతారు, పాపాత్ముడవుతాడు. రాముడు – స్వార్థరహితుడు, త్యాగనిరతుడు, ధర్మపరుడు. అందుకే ఎన్ని యుగాలకైనా రాముడు ఆదర్శవంతుడు. నడుస్తున్న కాలానికీ ఆయన మార్గం ఆచరణీయం. ఇదే రామతత్త్వం. పుత్ర కామేష్ఠి యాగం పూర్తి అయిన తరువాత, పనె్నండో నెల అయిన చైత్రమాసంలో, నవమి తిథినాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో గురు, చంద్రులుండగా, ఐదు గ్రహములు ఉచ్ఛస్థితిలో వుండగా కౌసల్యాదేవి, జగత్కల్యాణ కారకుడైన శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. ఇది క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి నెల 10వ తేదీ అని కొందరు శాస్త్ర పండితులు అభిప్రాయం వెలిబుచ్చారు. అనగా రాముడు జన్మించి సుమారు 7130 సంవత్సరాలైనదని ఒక ఆంగ్ల మాస పత్రిక పేర్కొన్నది. శ్రీరాముని జీవితం – ఒక క్షీరసాగర మథనం. ఆయన జీవితంలో ఎన్నో హాలాహలం లాంటి చేదు అనుభవాలు అనేకం ఎదుర్కొన్నాడు. ధర్మాన్ని ఆశ్రయించి, స్వార్థాన్ని త్యజించి, ధార్మికునిగా జీవితాన్ని గరపిన పూర్ణ పురుషుడు – శ్రీరాముడు. రామునిలో ఈ ధార్మికతే వాల్మీకిని బాగా ఆకర్షించింది. ధర్మాన్ని రాశిపోస్తే – రాముడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రాక్షసుడైన మారీచుడి చేత పలికించాడు. వాల్మీకి మసర్షి, ఎవరితో – ధర్మబద్ధం గాని కాముకుడైన రాక్షసరాజు రావణునితో. ఇంతకంటె నేటితరం వారికి రామాయణం, ఇంకా ఏం చెప్పాలి. ‘అతఏవ మున యోశ్చ నాగాః గంధర్వాః గుహ్యకాః తథా ధార్మికం పూజయం తీవ న ధనాఢ్యం న కాముకం’ కాముకులైన వారిని, గుణహీనుడైన ధనవంతుణ్ణి ఈ లోకం పూజించదు, హర్షించదు. ధార్మికులైన వారిని మాత్రమే గౌరవిస్తుంది. ఇదే రామునిలోని ధార్మికతా తత్త్వం. అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్రుడు. యాగ రక్షణకై – రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి. దేహమే శాశ్వతమనుకొన్న దశరథుడు, అంతరార్థాన్ని తెలుసుకోలేక, తానే వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తానంటాడు. అప్పుడు దశరథుని వారించి, విశ్వామిత్రుడు- ‘నీ కొడుకును గైకొని చని మాకాకలియంచు దిందుమా పిచ్చి నృపా, మాకడ బ్తిశస్త మన్త్ర వ్యాకృతికలదద్ది నేర్పెదమింతే’ అని అంటారు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో. దీనినిబట్టి ఎక్కడ ధార్మికత ఉంటుందో, ఎక్కడ స్వార్థరహితం ఉంటుందో, ఎక్కడ విశ్వజనీనత ఉంటుందో, ఎక్కడ అతి పరాక్రమము ఉండి, సత్వగుణంతో నైతిక ధర్మపాలన ఉంటుందో, ఎవరు తనకు ప్రాప్తించిన ‘శక్తి’ని విశ్వ కల్యాణానికి ఉపయోగిస్తారో – వారికి ఆ శక్తి ప్రదానం జరుగుతుంది. తన వద్ద ఉన్న శక్తివంతమైన అస్తశ్రస్త్రాలను జగత్కల్యాణానికి ఉపకరించేవాడు రాముడని గ్రహించి, అతనికి వాటిని ప్రదానం చేసే నిమిత్తం రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి అయోధ్యకు వచ్చాడు – విశ్వామిత్రుడు. ఇన్ని అస్త్ర శస్తమ్రులున్న విశ్వామిత్రుడు, తన యాగాన్ని తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. ఇందులో మనకి రాముని లోకకల్యాణ తత్త్వాన్ని విశ్వామిత్రుని పరంగా విశదపరచబడింది. శ్రీరామునికి, శస్త్రాస్త్ర విద్యను బోధించిన గురువు – పరమ సాత్విక మూర్తి వశిష్ఠుడైతే, ఆయన చేసే దుష్ట విక్షణ శిష్ట రక్షణకు అవసరమైన శస్త్రాస్తమ్రులను అందించిన గురువు – రజస్తమో గుణ రాశియై చివరకు సత్వ గుణాతీతుడైన రాజర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విద్య నేర్పిన గురువు పరమ సాత్విక మూర్తి బ్రహ్మర్షి వశిష్ఠుడు. అందుచేత శస్త్రాస్త్ర సామర్థ్యం లోకోపకారణమయింది. రాముడు లోక పూజ్యుడయినాడు. ఇది ఈనాటి అణు విజ్ఞానాన్ని విశ్వకళ్యాణానికి వినియోగించాలని హెచ్చరిస్తోంది. రాముడు సత్యవాక్య పరిపాలకుడు. రెండు మాటలు మాట్లాడడు. ‘రామోద్విర్నాభి భాషతే’ పితృవాక్య పరిపాలకుడు. ఒక భయంకర శబ్దం వినపడింది. బీభత్స భయానక రూపం కనపడింది. కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది. రామలక్ష్మణులను మ్రింగటానికి మీదికి వస్తోంది – తాటకి. స్ర్తి హత్య, దోషం అని సంశయిస్తున్న రామునితో – ‘వ్యవధి లేదు రామా, దుర్మార్గమైనా, సన్మార్గమైనా, పాతకమైనా దోషమైనా – ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించు అది ప్రభు ధర్మం’ అన్నాడు విశ్వామిత్రుడు. వింట బాణం దూసుకు పోయింది – ప్రాణాలు విడిచింది తాటకి. ‘మా తండ్రి దశరథుడు నన్ను తమతో పంపునపుడు, మీ మాటను వేదవాక్కుగా ఆచరించి శిరసావహించి ఆచరించమని చెప్పారు.’ ఎంత పితృభక్తి, ఎంత వినయం, రామునికి తండ్రి పట్ల ఉన్నదో తెలుస్తుంది. ఒక సందర్భంలో రాముడు తల్లితో తను తండ్రి వాక్యమును ఎన్నడూ అతిక్రమించనని ‘పితృవాక్యం న యతిక్రమితుం మమ’ అన్నాడు. ఎప్పుడూ ఒకే మాట – అదే రామతత్త్వం. రాముడు, స్థూల రూపమున దశరథ రామునిగా, సూక్ష్మ రూపమున అంతరా రామునిగా ఉన్నాడు. అతడే, తారకరాముడు. ఆ తారకరాముని నిజ తత్త్వమును ఉపాసించి తరించిన వారు – ఎందరో మహానుభావులు. ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడని, అన్ని రూపులై యున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపులీ జన్మమున వీడునని, రామమంత్రముచే ఇది కడసారి జన్మమని, శాశ్వత నిత్యానంద మోక్షగతి మొదలగు విషయములను మనకందిస్తూ ‘తారకమంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా’ అని తారకరాముని ఆర్ద్రతతో కీర్తించాడు – భద్రాచల భక్త రామదాసు. ఇది శ్రీరామనవమికి స్ఫూర్తినిస్తుంది. త్రేతాయుగంలో, ధర్మవిరుద్ధమైన కామము ఎంత అనర్థాల్ని తెస్తుందో చెప్పింది – రామాయణం. ఎంతో శక్తిసంపన్నుడైనా, ధర్మవిరుద్ధమైన కామానికి తెగబడిన దుర్మార్గుడు రావణుడు ఎలా నశించాడో, సామాన్య మానవుడిగా ఆవిర్భవించి, ధర్మబద్ధమైన జీవితాన్ని గరపిన రాముడు ఎంత ఉన్నత స్థితిని చేరుకున్నాడో, ఆదర్శంగా నిలిచాడో, చెప్పింది – శ్రీరామకథ. ధనాంధకారం వల్లనో, అధికార దర్పం వల్లనో, మరింకేమైనా గానివ్వండి తమకు ఎదురులేదని అధర్మంగా తప్పుడు పనులు చేసే అహంకారులు ఎప్పటికైనా వాళ్ల అధర్మ ఫలం అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంది – శ్రీరామకథ శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు, జితేంద్రియుడు. దశరథుడు అలా కాదు. ముచ్చటగా మూడవ భార్యను, కైకను పెళ్లి చేసుకొనేటప్పుడు, ఆమెకు పుట్టే కొడుకునే, అయోధ్యా సామ్రాజ్యానికి పట్ట్భాషిక్తుణ్ణి చేస్తానని కేకయ రాజుకి వాగ్దానం చేశాడు – దశరథుడు. అయితే రాముడు ముందు పుట్టాడు. ఆనందోత్సాహాలతో ముందు రోజు కైకేయి మందిరానికెళ్లాడు దశరథుడు. రామ పట్ట్భాషేకం ఆగిపోయింది. వంశ క్రమానుగత రాజధర్మానికి విఘాతం కలిగించింది, దశరథుని మరణానికి కారణమయిందీ – దశరథుని అధర్మకాముకత. ఇది రామాయణం చెప్పే అతిముఖ్యమైన సూక్తి. అరణ్య వాసం చేస్తూ, చిత్రకూటలో ఉన్న రాముణ్ణి మరల అయోధ్యకు తీసికొని వెడదామని, స్వచ్ఛందంగా వచ్చిన బంధువులు, ప్రజావాహినితో వచ్చాడు – తమ్ముడు భరతుడు. ప్రియమార, భరత శతృఘు్నలను కౌగిలించుకున్నాడు. భరతుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, ఉత్తమోత్తమ ప్రభు ధర్మాలు రాజనీతి విశేషాలు, తాత్త్విక విషయాలు, పరోక్షంగా భరతుడికి చెప్పాడు. సూర్యోదయం కాగానే అధర్మంగా ధనార్జన చేసుకోవచ్చని సంతోషించేవారు, సూర్యాస్తమయం అవగానే అధర్మంగా విశృంఖలంగా కామోపభోగాల్ని అనుభవించవచ్చని సంతోషించేవారు, సూర్యోదయ సూర్యాస్తమయముల మధ్య, తమ జీవితాల్లో ఒకరోజు ఆయుష్షు తగ్గిపోతోందని, ఒకరోజు వయస్సు పెరిగిపోతోందని తెలిసికోలేక పోతున్నారని, కాల ప్రాముఖ్యాన్ని తెలిసికొని, ఆత్మ తత్త్వాన్ని దర్శించాలని, ధర్మంతో అర్థకామాల్ని అనుభవించాలన్న ఆత్మ తత్త్వాన్ని బోధించిన – ఆత్మారాముడు – శ్రీరామచంద్రుడు. వాల్మీకి, రామాయణం ద్వారా చెప్పదలచుకొన్న దాన్ని రాముడి చేత ఈ సందర్భంలో చెప్పించాడు. శ్రీరామ నవమినాడు మననం చేసికోవలసిన ముఖ్య విషయం. ధూళిలో వాయు భక్షిణియై, ఇతరులకు కనపడకుండా తపమొనర్చుచూ వేయి ఏండ్లు ఆశ్రమమున పంచభూత సదృశముగా ఉన్నది – అహల్య. హల్య కానిది అహల్య. రాముడింకనూ కొంత దూరమున ఉండగానే, అతని మేని గాలి సోకుట వలన, కాలి సవ్వడి వినుట వలన, దేహ పరిమళము వ్యాపించుట వలన, శరీర నీల రత్నకాంతి గోచరించుట వలననూ, శ్రీరామచంద్రుడు ఆతిథ్యము స్వీకరింపవచ్చుట వలన, శబ్ద స్పర్శ రూప, రస, గంధములుగా పంచభూతముల, పంచతన్మాత్ర లనబడే సూక్ష్మ స్థితులతో పంచేంద్రియములను పొంది స్వరూపమును పొందిన మహాసాధ్వి – అహల్య. గుణాతీత అయిన అహల్యకు నమస్కరించిన మహాజ్ఞాని- శ్రీరాముడు. రాముడొక్కడే దిక్కని భావించి, సంపూర్ణ దాసోహ భావంతో, సాత్విక భక్తి విశ్వాసములతో త్రికరణశుద్ధిగా రామచింతనతో కాలము గడుపుతోంది బక్కచిక్కిన శబరి. ‘తుట్టతుది దాక నెండిన చెట్టుకొమ్మ శేఖరంబున యందు పుష్పించినట్లుగా’ ఫల పుష్పములతో కూడిన మెట్టపళ్లిక తల మీద పెట్టుకొని రామునికి అభిముఖంగా వచ్చింది. రాముడు శబరితో ‘అవ్వ నీ తల యింత ముగ్గు బుట్టయినదేమి?’ అంటే, తల అంతా నెరిసిపోయిందన్న భావంతోను, జ్ఞానవృద్ధురాలవు అన్న అంతర్లీన భావంతో అన్నాడు. శబరి ‘ఆ ముగ్గుబుట్ట నీ ఆత్మవాకిట రంగవల్లులు దిద్దుటకయ్యా’ అన్నది. రాముడు ‘అవ్వా, నీ ఆయువంత ఏర్చి ఎండి ఏకైతివేమి? అని అంటే, ‘ఆర్ద్రంబుగ ఆ ఏకును ఇంత వత్తిగ జేసి వెలిగింపవయ్యా’ అన్నది. ఇది జీవాత్మ – పరమాత్మల సంబంధం. ఉదాత్త గంభీర ఆధ్యాత్మికత. రామాయణంలో తెలిసికోవలసిన ముఖ్య అంశం. శ్రీరామ నవమి పండుగకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. ‘ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము’ అన్నాడు త్యాగయ్య, ముఖారి రాగంలో. సీతారాములు – ఆదర్శ దంపతులు. రావణునితో సంభాషించునపుడు, తృణముకన్న హీనుడన్న భావముగా, ఒక గడ్డిపోచను అడ్డముగా పెట్టుకొని మాట్లాడింది – సీత. ‘నీవు పరాక్రమశాలివే అయితే, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయంలో, అందునా సాధు వేషంలో మోసగించి, అపహరించవలసిన ఖర్మమేమి పట్టినదన్నది. రామ బాణముతో పనిలేకుండా, తన పాతివ్రత్య ధర్మ నిష్ఠా శక్తితేజము, రావణుని సంహరించగలదని హెచ్చరించింది. ఈ చిన్న కార్యానికి అంత పెద్ద శక్తిని వ్యర్థము చేయదలచలేదన్నది. అదీగాక రామాజ్ఞ కూడా లేదన్న, మహోదాత్త శక్తి స్వరూపిణి – సీతామాత. ఇంద్రియాల్ని జయించినపుడు రావణుడు ముల్లోకాలను, గడగడలాడించాడు. ఆ యింద్రియాలు రావణునిపై పగబట్టినాయి. పగ తీర్చుకోవటానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. సీతామాతను, సాధు రూపంలో మోసగించి తీసికొని రావటంతో, ఇంద్రియాలకు లోనయినాడు – పతనం చెందాడు. ఈ మాటలన్నది ఎవరో కాదు – సాక్షాత్తు రావణుని భార్య, మహాసాధ్వి – మండోదరి. సర్వసృష్టికి మూలహేతువైన తత్త్వము – బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది. రామ కార్యమును సఫలము చేసిన బుద్ధి మతాంవరిష్ఠుడు, సీతా ప్రాణదాత, రామాయణ మహా మాలకు రూపు వంటివాడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై, రాముని ప్రతిబింబమే దాస స్వరూపుడుగా వెలసిన వాడు, వాయునందనుడు – హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్నిచ్చాడు – వాల్మీకి ‘పాహి రామ దూత జగత్ప్రాణ కుమార మాం పాహి’ అన్న వసంత వరాళి రాగ కీర్తనలో ఆంజనేయ తత్త్వాన్ని, ముఖ్యంగా సుందరకాండలోని విశేషాల్ని, హృద్యంగా అందించాడు, నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ‘గీతార్థము సంగీతానందము నీ తావున చూడరా మనసా సీతాపతి చరణాబ్జము లిడుకొన్న వాతాత్మజునికి బాగ తెలుసురా…’ అన్న సురటి రాగ కీర్తనలో ఆంజనేయుని వైభవాన్ని, దాసభక్తిని అత్యద్భుతంగా వివరించారు త్యాగరాజ స్వామి, సురటి రాగ, ఆదితాళ కీర్తనలో. సీత పరాప్రకృతి, రాముడు పరాత్పరుడు. వారి అనుబంధం సహజసిద్ధం – సర్వలోక రమణీయం. ‘్ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్ధివం’ అని, విశ్వామిత్రుడు రాజయోగియై, మహాజ్ఞానియైన జనక మహారాజుకి ఆదేశమిచ్చాడు. ‘వత్సరామ ధనుఃపశ్య’ రామా ఈ ధనువును చూడుము’ అని గంభీరంగా పలికాడు. భావమెరిగిన రాముడు శివధనుర్భంగం చేశాడు. ఆ సందర్భంగా శ్రీరాముని ముద్దు మోముపైగల ముంగురులు ‘అలకలు అల్లలాడుట కన్నులార చూచిన విశ్వామిత్రుడు శ్రీరామ ఉపాసనా లక్ష్యసిద్ధిని పొందాడని మధ్యమావతి రాగంలో రూపక తాళ నిబద్ధనలో ‘అలకలల్ల లాడగని ఆరాణ్ముని ఎటు పొంగెనో’ అన్నాడు త్యాగయ్య. ‘ఫెళ్లుమనె విల్లు – గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు – ఝల్లుమనియె జానకీ దేహ మొక నిమేషమ్మునందె నయము, జయము, భయము, విస్మయము గదురగా’ శివధనుర్భంగము గావించిన ధీరోదాత్తుడు రాముడని హృద్యంగా వర్ణించాడు కరుణశ్రీ – సీతారాముల కల్యాణ ఘట్టంలో. ‘సీత పూజడ వెన్నుగ శిరసు వంచె, చెఱకు గడవోలె నడిమికి విరిగె ధనుస్సు’ అని అద్వైత శృంగార భావాల్ని, అద్భుతంగా ప్రదర్శించాడు విశ్వనాథ – రామాయణ కల్పవృక్షంలో. ‘మనస్సును మంత్రధ్యానంతో లయంచేసి, లక్ష్యాన్ని సాధించాలి. ప్రణవమనే ధనుస్సుతో, బాణమనే మనస్సును సంధించి, ముక్తికాంత అనే లక్ష్యాన్ని సాధించడమనేది – ఉత్తమ తత్త్వం. ఇదే జీవిత ధ్యేయం కావాలి. అదే శ్రీరామచంద్రుడు ధనుర్భంగం గావించి, సీతామాతను పరిణయమాడటంలో గల తత్త్వ రహస్యం’. సీతారాములు ముఖ్యంగా తెలుగు వారికి ఆరాధ్య దైవం. తొమ్మిది రోజుల శ్రీరామ నవమి ఉత్సవం, పదవ రోజు పట్ట్భాషేకంతో కన్నుల పండుగవుతుంది. యోగి, అన్ని వాసనలను వదులుకొని, దశేంద్రియముల చిత్తవృత్తులను రూపుమాపుకున్నపుడు, మోక్షానికి అర్హుడవుతాడని చెప్తుంది – శ్రీరామ సామ్రాజ్య పట్ట్భాషేకం. ‘జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా’ – అని నాటరాగం, ఆదితాళం – ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటి కీర్తనగా, బ్రహ్మవిద్యా సార్వభౌముడు సద్గురు త్యాగరాజ స్వామి మనకందిస్తే- ‘సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము, రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజా జీవితా తప తరణిస్వామి’ అని విశ్వనాథవారు సీతారాముల్ని అద్వైత ప్రేమమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా అభివర్ణించారు. ‘రాముడు లోకాభిరాముడని’ రామాయణ కథాగానం చేస్తూ ‘అందరికీ రక్షకుడితని దెలిసి కొలువరో’ అని త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని యందు చూస్తూ, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య చేసిన గానం – శ్రీరామ నవమికి- మనకిస్తుంది – శ్రీరామరక్ష. ……… లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం కల్యాణ వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించినట్లు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.జ్యోతి తెలిపారు. భక్తుల కోసం లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. అందరికీ ఉచిత భోజనం అందజేస్తారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం

  • 22/03/2015
TAGS:

ద్వారకాతిరుమల, మార్చి 21: క్షేత్ర దేవతగా విరాజిల్లుతూ శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు 2 లక్షల గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలతోపాటు గాజుల అలంకరణలో నిండుముత్తయిదువులా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే నిండు సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరం
జంగారెడ్డిగూడెం, మార్చి 21: రాష్ట్ర విభజనతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరమని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆర్డీఒ ఎస్.లవన్న అధ్యక్షతన ఉగాది సందర్భంగా శనివారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో జరిగిన పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి శ్రీ మన్మధనామ సంవత్సరంలో అంతా శుభం కలగాలని ప్రజలు కోరుకోవాలన్నారు. ఉగాది పచ్చడి వలే ప్రతి ఒక్కరి జీవితాల్లో తీపి, చేదువలే సుఖ దుఃఖాలు ఉంటాయన్నారు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోరాదన్నారు. రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ముఖ్యమంత్రి నిరంతర శ్రమ చేస్తున్నారన్నారు. ఆయనకు అందరూ సహకరిస్తే లక్ష్యాలు చేరువ కాగలవన్నారు. భవిష్యత్‌లో పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఉగాది నుండే రాష్ట్రానికి మంచి జరగాలన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాతను ఘనంగా సత్కరించారు. ఆర్డీఒ ఎస్.లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ మహిళా ప్రజాప్రతినిధులతో మంత్రికి సత్కారం జరిపించారు. పంచాంగ శ్రవణం చేసిన గరిమెళ్ళ ప్రభాకరశాస్ర్తీ (్భను), పురోహితులు వెంపరాల ప్రసాదశాస్ర్తీ, రేమెళ్ళ సూర్యనారాయణశాస్ర్తీ, కవి సమ్మేళనం నిర్వహించిన టివి నరసింహారావు, కెఎల్ వీర్రాజు, టి.వి.రామకృష్ణ, వి.అప్పారావు, చావా రమేష్‌బాబు, నాట్యాచారిణి ఎస్.రూపాదేవి, జానపద, పౌరాణిక కళాకారులు ఎల్‌ఆర్ కృష్ణబాబు, నున్న కృష్ణయ్య, జొన్నకూటి వెంకటేశ్వరరావు, బుద్దాల సత్యనారాయణ తదితరులను మంత్రి ఘనంగా సత్కరించారు. పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు తదితరులు మంత్రి సుజాతకు వేదాశీస్సులు అందజేశారు. తహసీల్దార్ జివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, సహకార సంఘ అధ్యక్షుడు వందనపు హరికృష్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, ఎంపిడిఒ పి.శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ బి.సాల్మన్‌రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు మండవ లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, షేక్ ముస్త్ఫా, కొడవటి సత్తిరాజు, రాజాన సత్యనారాయణ(పండు), పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉగాది నవరత్నోపహారం

ఉగాది నవరత్నోపహారం -డా ఎస్ ఏం మహమ్మద్ హుసేన్ -మూసి మార్చిnavaratn 001 ugadi1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజుర్వేద సంధ్యావందనం –

saandhya2 001 sandhya3 001 sandhya4 001 sandhya5 001 sandhya6 001 sandhya7 001 sandhya8 001 sandhya9 001 sandhya10 001 sandhya11 001 sandhya12 001 yajurveda sandhyavandanam 1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 4 Comments

శ్రీమన్మద ఉగాది శుభాకాంక్షలు

img074శ్రీమన్మద ఉగాది శుభాకాంక్షలుUgadi-Telugu Ugadi Festival Story And Significance | infosamay.com - cutmirchi.com

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్

‘’మంచి ,చెడు అనే విషయాలు శైలీ అనేవి  లేవు .వస్తువులను మనం చూసే దృష్టిని బట్టే అవి ఏర్పడతాయి .’’అని ఫ్లాబర్ట్ అన్నా కూడా ఆయన రాసిన సబ్జెక్ట్ వల్లనే ప్రసిద్ధి చెందాడు .ఇదే ఆయన వ్యతిరేకులకు విమర్శనాయుధం గా మారింది కూడా .ఫ్రాన్స్ దేశం లో నార్మండిలోని రోఎన్ లో 12-12-1821న అక్కడే స్తిరనివాసం గా ఉంటున్న ఫిజీషియన్  చీఫ్ సర్జన్ అయిన తండ్రికి జన్మించాడు .తల్లి తండ్రి అయిన తాతకూడా గ్రామ వైద్యుడే .అందుకే పాత్రలను చక్కగా వైద్య రీతిలో కత్తిరించి సొగసు చేకూర్చగాలిగాడు ఫ్లాబర్ట్ . ఫ్రెంచ్ ‘’లిటరరీ రియలిజం కు ఆద్యుడు ఫ్లాబర్ట్ .మొదటినవల ‘’మేడం బావేరి ‘’తో విఖ్యాతుడయ్యాడు.అనితర సాధ్యమైన శైలీ విన్యాసం ,సౌందర్య దిదృక్ష ఫ్లాబర్ట్ సొంతం  .’అన్న అచిల్లీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి డాక్టర్ అయ్యాడు .దీనికి విరుద్ధం గా ఫ్లాబర్ట్ చిన్నతనం నుండి రచనా వ్యాసంగం లో ఉన్నాడు .స్నేహితుడికి ఒక ఉత్తరం ఆనాడే రాస్తూ తనతోకలిసి రచనకు చేయూతనిమ్మని కోరాడు .ఫ్లాబర్ట్ యవ్వన దశలో ఆల్బర్ట్ లీ పోటేవిన్,లూయీ బుల్ హెర్ట్ ,మాక్సిం డు కాంప్ లతో సాన్నిహిత్యం పెంచుకొన్నాడు .అందులో ఆల్బర్ట్ 27 ఏళ్ళకే చనిపోతే తట్టుకోలేక పోయాడు .లూయీ కవి .మాక్సిం జర్నలిస్ట్ .

19 వయసులో లా చదివాడు .ఆ పాఠ్య గ్రందాలంటే  విపరీతమైన విసుగు ,అసహ్యం వచ్చింది  .సివిల్ కోడ్ ను ‘’నాన్సెన్స్ ‘’అన్నాడు .నాటక శాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ దానిపై వ్యామోహం పెంచుకొన్నాడు .తనకొచ్చే అలవెన్స్ డబ్బులన్నీ సరదాగా దీనికే ఖర్చు చేసేవాడు .స్త్రీ వ్యామోహం లో మాత్రం పడలేదు .కాని మిగిలిన జల్సాలన్నీ అనుభవించాడు .అందం గా ఆకర్షణీయం గా ఫ్లాబర్ట్ ఉండటం తో అమ్మాయిలూ బాగానే ‘’వలపుల వల’’ విసిరే ప్రయత్నాలు చేసేవారు.’’యువ గ్రీకు  వీరుడు ‘’గా ఉండేవాడని మనసుపారేసుకొన్న ఒకావిడ అన్నది .అతనిది ‘’హీరోయిక్ బ్యూటీ ‘’.రోమన్ సైనికులతో వీరోచితం గా పోరాడిన ‘’గాలిక్ చీఫ్ ‘’లాగా ఉండేవాడని ఒకామె కామెంట్ చేసింది . అప్పటికే ఫ్లాబర్ట్ ఒక సారి లోతుగా ప్రేమ వ్యవహారం లో దిగి కూరుకుపోయాడు. పదిహేనేళ్ళ వయసులో కుటుంబం తో వేసవిని ట్రౌవిల్ లో గడపటానికి వెళ్ళినప్పుడు పెళ్లి అయి, పిల్లను సాకుతున్న ఇరవై ఆరేళ్ళ ఎలీషా స్లీసిన్గర్ అమ్మాయి కి మనసు పారేసుకొన్నాడు .ఆమె భర్త మన ప్రేమపిచ్చోడి వాలకం కనిపెట్టి తనతో నౌకాయానం చేయించాడు .ఆరేళ్ళ తర్వాత పారిస్ లో చదువుతున్నప్పుడు ఆ దంపతులుఒక  సాయం వేళ తమతో గడపటానికి ఆహ్వానించారు .సిగ్గుల మొగ్గై ముడుచుకు పోయాడుకాని ఆంతర్యాన్ని ఆవిష్కరించలేక పోయాడు ఫ్లాబర్ట్ .ఆమె మాత్రం ఇతని నిజాయితీని ,నిష్కపట ప్రేమను, ఆరాధనను గుర్తించింది .ఆమె జీవితం లో చోటు చేసుకోలేక పోయినా జీవితాంతం ఎలీషా అంటే పరమ ప్రేమారాదనాభావం మాత్రం వదలలేదు .ఆ తర్వాత మూడేళ్ళ దాకా ప్రేమా సెక్సూ లేకుండానే గడిపేశానని రాసుకొన్నాడు .చచ్చేదాకా అలానే ఉన్నానని ఎక్కడో రాసుకొన్నాడు .కాని 23 ఏళ్ళదాకా వర్జిన్ బాయ్ లానే ఉన్నాడు .కాని ఒక పని చేసే అమ్మాయితోనో లేక ఏదో హోటల్ లో ఉంటె వేరొక అమ్మాయితోనో ఒక రాత్రి గడిపాడు అనే పుకారు పారిస్ అంతా షికారు చేసింది .

చదువు మీద దృష్టిపెట్టి ఉన్నా ,అది అబ్బక పరీక్షలు తప్పాడు .ఏదో తన్ను ఆవహించిన ఫీలింగ్ లో ఉండేవాడు .దాని నుంచి బయటపడినప్పుడు ఆ విషయాలను తెలియ జేసేవాడు .యేవో కాంతులు మెరుపులు అస్పష్ట ధ్వనులు అపస్మారక స్తితిలో వినిపించేవని చెప్పేవాడు .ఇవి ప్రముఖ అమెరికన్ రచయిత ఎడ్గార్ అలెన్ పో,సెయింట్ తెరెసా ,జర్మన్ పో అనిపించుకొన్న ఇ టి ఏ హాఫ్మన్ ల  ఫాంటసీ కధల్లా అనిపించేవి . .ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు మూర్చ లక్షణం కాదని అతని ప్రవర్తన ‘’A plethora vitality ‘’అన్నారు ఇదే క్రమంగా హిస్టేరియో –ఎపిలెప్టిక్ ‘’ ఎటాక్స్ గా మారతాయని చెప్పారు .దీనికి తండ్రి చేసిన వైద్య ప్రక్రియ దారుణం గా ఉండేది .రక్తం వచ్చేట్లు కొట్టేవాడు అన్నం లేకుండా మాద్చేసేవాడు ఎప్పుడూ తలనిండా స్నానాలు చేయించేవాడు ..ఈ లక్షణం ఫ్లాబర్ట్ బతికి ఉన్నంతకాలం వెటనంటే ఉండి పోయింది పాపం .తల్లి నిరంతరం అతన్ని కనిపెట్టుకొనే ఉండేది .ఇవన్నీ నెర్వస్ వీక్నెస్ కు, దానినుంచి డిప్రెషన్ కు  దారి తీశాయి .చాలాకాలం తర్వాత జీవితం అంటే తనకు భయమేస్తోందని జార్జ్ సాండ్ కు తెలుపుకొన్నాడు .

సంపాదించిన సొమ్ముతో తండ్రి క్రాసేట్ లో ఒక ఇల్లుకోనుక్కొని కుటుంబాన్ని  ప్రక్రుతి సౌందర్య విలసిత ప్రదేశానికి మార్చాడు ఒకటి రెండు సార్లు తూర్పు దేశ పర్యటనలు తప్ప మిగిలిన కాలమంతా ఫ్లాబర్ట్ ఇక్కడే గడిపాడు .ఒక్కమాటలో చెప్పాలంటే ‘’ఇంట్లోనే ఉండి  రాశాడు ‘’.కొద్దికాలం తర్వాత తండ్రి కేన్సర్ తో మరణించాడు .కొన్ని నెలల తర్వాత సోదరి ప్రసవించి చనిపోయింది .ఈ రెండూ కు౦గ దీశాయి ఫ్లాబర్ట్ ను .దురదృష్టం వెంటాడుతోంది అని భావించాడు .లోపల ఏదో ఆందోళన భయ పెడుతోంది .మేకుల బూట్ల తో మనుషులు విపరీత శబ్దం చేస్తూ మేడ మెట్లు దిగుతున్నట్లు ,సోదరి కరోలిన్ నల్ల వస్త్రదారణ తో తలనిండా గులాబీలతో  చాలా పొడవుగా కనిపించినట్లు భావించేవాడు .

ప్రాడీర్ స్టూడియో లో గడపటానికి పారిస్ వెళ్ళినప్పుడల్లా లూయీ కోలేట్ ను కలిసేవాడు .అప్పటికే ఆమెకు పెళ్లి అయి  ఆరేళ్ళ కూతురు తో ముప్ఫై ఏళ్ళ వయసులో ఉండేది .మనవాడివయసు ఇరవైనాలుగు.ఆమె సెలెబ్రిటి అనిపించేది .భర్తనుండి విడాకులు పొంది ఫిలాసఫర్ ఎకడేమీషియన్ అయిన విక్టర్ కజిన్స్ కు మిస్త్రేస్ గా ఉన్నది .ఆయన ప్రోత్సాహం తో ఆమె అనేక అకాడెమీ ప్రైజులను కవిత్వానికి పొందింది .ఆమె తానను తాను  ప్రాచీన గ్రీకు కవయిత్రి సాపో గా భావించుకొనేది .ఆమెను అందరూ గొప్ప ప్రేరకురాలిగా భావించేవారు .కజిన్స్  ఫ్లాబర్ట్ ను ఆమె అపార్ట్ మెంట్ కు ఆహ్వానించాడు .తనకవిత్వాన్ని కమ్మగా చదివి వినిపించి మురిపించింది .ఇలా కొంతకాలం జరిగి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు .ఫ్లాబర్ట్ ను పారిస్ వచ్చి ఆమెతో ఉండిపొమ్మని కోరిందామే .స్వంత ఇంటినీ ఊరిని తల్లినీ వదిలి వెళ్లాలని పించలేదు ఫ్లాబర్ట్ కు. ‘’ప్రేమించటం కంటే ప్రేమించబడటం  ‘’కు ఫ్లాబర్ట్ ప్రాధాన్యత నిస్తాడు .అప్పుడప్పుడు వెళ్లి లూసీ దర్శనం చేసి సంతృప్తి పడేవాడు .ఆమెతో తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటానని వాగ్దానం చేసి నిలబెట్టుకొన్నాడు ఫ్లాబర్ట్ .

 

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-15 –ఉయ్యూరు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విహారి గారి ”పద చిత్ర రామాయణం ”పై సదస్సు 5-4-15 ఆదివారం సా 3 గం లకు

విహారి గారి ”పద చిత్ర రామాయణం ”పై సదస్సు 5-4-15 ఆదివారం సా 3 గం లకు N T R కళావేదిక పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్

vihari1 001 vihari2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాజకీయ ‘మన్మథులు’

రాజకీయ ‘మన్మథులు’

  • 15/03/2015
  • – కృష్ణ తేజ

తెలుగునేలపై ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. లేలేత మావిచిగుళ్లు తిన్న కోకిలలు కుహూ కుహూ అంటూ గొంతు సవరించుకుంటున్నాయి. వేపపూల గమ్మతె్తైన వాసన గుబాళిస్తోంది. గున్నమామిడి కొమ్మలకు పిందెలు అందంగా వేలాడుతున్నాయి. హోలీరంగుల్లో ఆడిపాడి అలసి సొలసిన తెలుగు లోగిళ్లకు మామిడాకుల తోరణాలు కొత్త కళ తెస్తున్నాయి. విపణివీధిలో తెలుగు పంచాంగాల అమ్మకాలు జోరందుకున్నాయి. పంచాంగ శ్రవణం, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, రాజపూజ్యావమానాలు, ఆదాయ వ్యయాలు, కందాయఫలాల వివరాలకోసం తెలుగువారు ఆసక్తి చూపిస్తున్నారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి నోరూరిస్తోంది. కవిసమ్మేళనాల సంరంభానికి తెరలేచింది. ప్రభవాది అరవై తెలుగు సంవత్సరాలలో ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. పేరులో ఉన్న అందం…జీవితంలోనూ ఉంటే బాగుంటుందని అందరి ఆశ. సగటుజీవి చూపంతా ఆదాయ వ్యయాల పైనే ఉంటుంది. మధ్యతరగతి మనిషి ఆలోచనలన్నీ వీటితోపాటు రాజపూజ్యావమానాల చుట్టూ తిరుగుతూంటాయి. సంపన్నుల దృష్టి ఉగాది వేడుకలపై ఉంటుంది. సాహితీవేత్తలు, కవి పండితులు, పంచాంగకర్తల మనసంతా ఉగాది వర్ణన, మంచిచెడుల విశే్లషణపై నిలిచి ఉంటుంది. వీటన్నింటికి భిన్నం రాజకీయ ఉగాది వేడుకలు. రాజకీయ పార్టీలు వేటికవి పంచాంగశ్రవణాన్ని విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పంచాంగ శ్రవణంలో ప్రభుత్వానికి జరిగే మంచిపైనే ఫలితాలుంటాయి. ఈ మన్మథ నామ సంవత్సరంలో రాజకీయ నాయకుల మనసు ఎలా ఉంటుంది. ఉగాది ఫలితాలపై వారేమనుకుంటున్నారు…రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతల మనోభీష్టం ఎలా ఉంది. ఓ సారి సరదాగా ఊహించుకుని, వాటికి అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ వ్యాసానికి ప్రాణం పోసింది. హాస్యప్రియులైన తెలుగువారి మనోల్లాసంకోసం ఓసారి నేతల మనసులలోకి తొంగిచూద్దాం. కెసిఆర్ జయనామ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడే చెప్పా. వచ్చే ఉగాది తెలంగాణలోనే జరుపుకుంటామని. కేసిఆర్ మాటంటే మాటే. నేనామాట అన్నప్పుడు పిచ్చోనిలెక్కన చూశారు. ఇప్పుడేమైంది? మన్మథ నామ సంవత్సరం మనది. బిడ్డల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణ గడ్డపై తొలిసారి మన ఉగాది మనం జరుపుకుందాం. అలాగని జయనామ సంవత్సరం మనకు తక్కువచేయలే. జయం మనదే. మన్మధుడూ మనవాడే. మన పంచాంగం మనమే తయారుచేసుకుందాం. ఏం మన నేలపై పండితులకు కొదవా. పాండిత్యానికి కొదవా. యాదాద్రి, భద్రాద్రినుంచి అయ్యవార్లను రాయమంటే రాయరా. పంచాంగశ్రవణం అంటే మన బిడ్డలు చెవికోసుకోరా. మంచిచెడులు చెప్పే చేవ మనకు లేదా. సోయిలేనోనికి తప్ప మనకేం తక్కువ. అయినా ఇందులో ఎవరు చెప్పేదేముంటుంది. నేనే చెబుతా. ఇక మనకు అంతా మంచే. మన పరిపాలనలో మనకు అవమానాలు ఏంది? ఆ రోజులు పోయినై. అంతా రాజపూజ్యమే. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తెలంగాణ గల్లాపెట్టె గలగలలాడుతుందని నేను చెప్పలేదా. అది ఇప్పుడు నిజం కాలేదా. మన దగ్గర డబ్బున్నప్పుడు ఇక ఆదాయవ్యయాల లెక్కలు తెలుసుకునేదేంది. మన బిడ్డలకు అంతా ఆదాయమే. బిడ్డా…డబ్బుందని లెక్కాజమా లేకుండా ఖర్చుపెట్టొద్దు. నా లెక్కలు నాకుంటయి. మన బిడ్డలకు ఎక్కువ తక్కువ చేయం. మాటతప్పని నేను దేవుడి మొక్కులన్నీ తీర్చిన. ప్రకృతి కూడా మనకు సాయం చేయాలనే దేవుడికి మొక్కుతున్నా. ఏవరేమనుకుంటరన్న భయం మనకేంది. మన పంచాంగశ్రవణం మన పండితులు చెబుతారు. మంచిచెడ్డలు విని మసలుకోవాలే. మన ఉగాది పచ్చడి తెలంగాణ గడ్డమీద పండిన వస్తువులతోనే చేసుకోవాలె. మన జగిత్యాల మామిడికన్నా ఏ మామిడి బాగుంటది. మన ఆదిలాబాద్ అడవుల్లో పండిన చింతపండుకన్నా రుచి దేనికుంటది. మన నిజామాబాద్ నేలపై విరగబూసిన వేపపూవులో చేదు ఉన్నా, ఆ పూల పరిమళం మనకు తీపిగుండదా. ఆ నేలపైనేకదా మన చెరకు తీపవుతున్నది. గుంటూరు మిర్చికేనా ఘాటున్నది. మన నల్లగొండ నేలలో పెరిగిన మిరపకాయకు కారం తక్కువా. మనకు పౌరుషం తక్కువా. మన ఆలోచనల్లో, మన భావనల్లో ఎదుగుదల రావాలె. మనకు మనం బాస్‌లమన్న భావన పెరగాలే. మన మనసులను ఆ దిశగా మన్మథ నామ సంవత్సరం మలచాలె. మన్మథ నామ సంవత్సరం తెలుగువారిది. తెలంగాణలో ఉన్న తెలుగువారికి అది..ఆది ఉగాది. ఆంధ్రోళ్లు, సీమాంధ్రులు, సెటిలర్లనేవి పిచ్చిమాటలు. నే చెబుతున్నా…మన ఉగాది పచ్చడి వీరికి నేనే స్వయంగా పంచుతా. తెలంగాణ ఉగాది పచ్చడి రుచి చూపిస్తా. మన మనసులోని మమత చాటుతా. గతం మర్వాలె. అంతా కలిసి మనగలగాలె. ఇందులో రాజకీయం లేదు. నేనేమీ టీఆర్‌ఎస్ ఉగాది చేస్తున్నానా. తొలి తెలంగాణ ఉగాది చేసుకోమంటున్నా. ఇందులో తప్పేముంది. పనిపాటాలేని ప్రతిపక్షాలకూ ఇదే చెబుతున్నా…పండగ చేసుకుందాం. పండగలో పాలిటిక్స్ వద్దు. వినకపోతే మీఖర్మ. మన తెలంగాణ మనకు వచ్చాక, జనం వారి తీర్పు చెప్పాక, మీ తీరు మారకపోతే ఏం చేస్తాం. మంచిగ చేసిన మన ఉగాది పచ్చడి తిని, మన పండితులు చెప్పిన మంచిమాటలు విని మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలె. కాదంటే కేసీఆర్ ఒప్పుకుంటాడా. వెంకయ్యనాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మన్మధ నామ సంవత్సరం మంచి చేస్తుందని విశ్వసిస్తున్నా. ప్రత్యేక హోదా దక్కలేదని ఆంధ్ర ఉగాది వేడుకలను మరచిపోనక్కర్లేదు. ప్రధాని మోదీ మనతోపాటు ఉగాది పచ్చడి తిని వేడుకలను రసవంతం చేస్తారు. ఆంధ్రను ఆదుకుంటారు. అసలు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను అనాలి…జయ నామ సంవత్సర ఉగాదికి ఆంధ్రులకు పచ్చడిమెతుకులుకూడా లేకుండా చేశారు. మన్మధలో మేం ఏం చేద్దామన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు చంద్రబాబు కొత్తపంచాంగం చూడాలి. గ్రహగతులను బట్టి ముందడుగు వేయాలి. కొత్త రాష్ట్రం అన్నాక రాజపూజ్య అవమానాలు తప్పవు. రాష్ట్రంకోసం, ప్రజల అభివృద్ధికోసం అవమానాలు దిగమింగాలి. నా వరకు నాకు నాయుడు ముద్రవేసి జయనామ సంవత్సరంలో అవమానించారు. ఇప్పుడిప్పుడే రోజులు మారుతున్నాయి. తిట్టినవాళ్లే కండువాలు కప్పుతున్నారు. చేతులు కలుపుతున్నారు. అభివృద్ధికోసం కలసి పనిచేయడం తప్పదు. అప్పుడు ఉగాది పచ్చడీ కలసి తినొచ్చు. ఇరుగుపొరుగు తెలుగువారు షడ్రుచుల ఉగాది పచ్చడిని ఇచ్చిపుచ్చుకోవాలి. రెండు రాష్ట్రాల నాయకులు ఉప్పూకారం తగ్గించి, కాస్త తీపి ఎక్కువ వేసి పచ్చడి తినాలి. ఆదాయవ్యయాల లెక్కలు పంచాంగ కర్తలకన్నా చంద్రబాబు బాగా నేర్చారు. ఆయనకు మేం కన్పిస్తేచాలు చిట్టా విప్పుతున్నారు. ఇక కేసీఆర్‌కు ఖజానాకష్టాలు లేవు. అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణకు ఇబ్బందులు లేవు. ఉగాది సంబరంలో అసలు విషయం మరిచిపోవద్దు. వచ్చే వేసవికి తెలంగాణ చల్లగా ఉండాలంటే ఆంధ్రతో కలిసిమెలిసి పనిచేయాలి. ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు మాకు సమానమే. తెలుగువారికి రాష్ట్రాలు వేరైనా ఉగాది ఒక్కటే. భాజపా చెప్పే పంచాంగం ఇదే. జానారెడ్డి జయనామ సంవత్సరంలో అరవై ఏళ్ల తెలంగాణ కలం నిజం చేసింది మా పార్టీనే. అయితే మాకు ఏ గ్రహం అడ్డొచ్చిందో తెలీదు. ఫలితం కేసీఆర్‌కు వెళ్లిపోయింది. ఏ గ్రహమో అనుకుని ఏం లాభం. మా గ్రహాలే ఈ పని చేసుంటాయి. ఆ ఎన్నికలప్పుడు నాకు, మా పార్టీకి మంచి జరగలేదు. ఏం చేస్తాం. మన్మథ నామ సంవత్సరమైనా కలిసొస్తుందని అనుకున్నా. సూచనలు అలా లేవు. ఈ ఏడాదికూడా రాజపూజ్యం పూజ్యంలా ఉంది. అవమానం తప్పేట్టు లేదు. పార్టీ పదవి మళ్లీ తప్పిపోయింది. ఇది జయనామ సంవత్సరం ఖాతాలో వేసినా మన్మథ నామ సంవత్సరానికి సంకేతంగా పరిగణించాలేమోనన్న భయం పట్టుకుంది. ఆదాయవ్యయాలతో నాకు పనేం లేదు. ఈ విషయంలో పంచాంగంపై ఆధారపడను. నేను ఒకప్పటి టీచర్‌ను. పాఠాలు చెప్పడం, పాఠాలు నేర్వడం మామూలే. ఎటొచ్చీ ఎవరికి రాజకీయ పాఠాలు చెప్పాలో తేల్చుకునేలోగానే నాకు గుణపాఠాలు ఎదురవుతున్నాయి. నాకన్నా నాలుగాకులు ఎక్కువ చదివినవారు వెళ్లి పదవులు కొట్టేస్తున్నారు. నవ తెలంగాణలో తొలి ఉగాదిని ప్రభుత్వం పెద్దఎత్తున చేయాలి. ప్రతిపక్షానికి అందులో భాగస్వామ్యం కల్పించాలి. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఉగాది జరుపుకుంటే సరిపోదు. అవసరమైతే అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడతా. ఉగాదిపచ్చడిలో ఆరు రుచులుంటాయి. నా మాటల్లోను అంతరార్థం అలాగే ఉంటుంది. నచ్చినవాడికి నచ్చుతుంది. నచ్చనివాడికి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా ఉగాది చేసుకోవాలె. చేదు ఉందని ఉగాది పచ్చడి తినడం మానేస్తామా. అది సరికాదు. ఓడిపోయామనో, అధికారంలోకి రాలేదనో, పదవి రాలేదనో బాధపడితే ఉగాది పచ్చడిలోని తీపి చేదుగానే అన్పిస్తుంది. మనసును బట్టి రుచి. మన్మథుడిని బట్టి మనసు. అర్థమైందనుకుంటాను. నా మాట అర్థంకాకపోతే నేనేం చేయగలను. నిజానికి నేను చంద్రుడిలాంటివాడినని చెప్పుకున్నా. అదే తప్పైనట్టుంది. చంద్రుడికి కళ తగ్గినట్లు…నాకు పార్టీ పదవి తప్పిపోయింది. అసలే నా మాట అర్థంకాందంటారు…చాలామంది. ఇప్పుడు నామాట నాకే అర్థం కాలేదు. మన్మథలోనైనా నా మాట అందరికీ అర్థం కావాలి. చంద్రబాబు ఉగాది అయినా, ఉగాది పచ్చడయినా సమపాళ్లలో సరుకులు పడకపోతే రుచి సరిగ్గా ఉండదు. జయనామ సంవత్సరంలో ఆంధ్రకు ఉగాది చేదునే మిగిల్చింది. మనకు రాజపూజ్యం లేదు. అంతా అవమానమే. మనది రెండు పచ్చళ్ల సిద్ధాంతం. రెండు పంచాంగాల సిద్ధాంతం. ఆంధ్రలో పచ్చడి, ఉగాది బాగోలేదని బాధతప్ప, తెలంగాణకు ఉగాది బాగోలేదని, బాగోకూడదనికాదు దీనర్థం. ప్రతిపక్షాలకు పనేముంది. నేనేం చెప్పినా పచ్చడి చేసేద్దామనుకుంటారు. చతికిలపడతారు. జయనామ సంవత్సరంలో మనకు ఆదాయ వ్యయాలూ సరిగాలేవు. మన గల్లాపెట్ట ఖాళీగా ఉంది. రాష్ట్ర విభజనతో వట్టిపోయాం. కేంద్రం సాయం కావాలి. జయ నామ సంవత్సరంలో కేంద్రం వట్టిచేయే చూపింది. మన్మథనామ సంవత్సరంలో కేంద్రం మనసుమార్చేలే ఈ ఉగాది ఉండాలి. ఆదాయవ్యయాల లెక్క చూస్తే గాభరాగా ఉంది. తెలుగువారి లెక్కాజమా పక్కాగా చూస్తా. చేతికి చిల్లిగవ్వ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. అయితే ఏదోవిధంగా డబ్బు లేదా బాండు ఇస్తా. మన్మథనామ సంవత్సరంలో రాజపూజ్యం కన్పించడం లేదు. అవమానాలు పూర్తిగా తగ్గిన సూచనలు కన్పించడం లేదు. కందాయ ఫలాలు చూస్తే కంగారుపెడుతున్నాయి. అయితే అంతా పకడ్బందీగా నడిపిస్తున్నా. మన్మథనామ సంవత్సరం మనదే కావాలని ప్రణాళిక ప్రకారం ముందుకెడుతున్నా. ఉగాదిపచ్చడి చేయడం, తినడం, అడ్డొచ్చేవారిని పచ్చడి చేయడం తెలుగువారికి, తెలుగుదేశానికి కొత్తకాదు. తిరుమల వేంకటేశ్వరుడి దయతో ఈ ఉగాది తెలుగువారికి మంచినే తెస్తుందని మనవి చేస్తున్నాను. ఆంధ్రను సింగపూర్‌గా మార్చినా ఉగాదిపచ్చడి మరవను. తుళ్లూరు రూపం మారిపోయినా అక్కడే ఎప్పుడూ ఉగాది చేసే ఏర్పాటు చేస్తా. ఐటీ సాయంతో ఆధునిక ఆంధ్రను తీర్చిదిద్దినా తెలుగుసౌరభమైన ఉగాది వేడుకలను మరవను. తెలుగుదేశం పంచాంగం, తెలుగువారి పంచాంగం రెండూ విన్పించే ప్రయత్నం చేస్తా. అటు తెలంగాణలోనూ అదే ఏర్పాటు చేస్తా. మాకు ఆంధ్ర అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ వెలుగు ముఖ్యం. ఎక్కడున్నా తెలుగువారి శ్రేయస్సు ముఖ్యం. అంతేతప్ప, లెక్కాజమా లేకుండా, బొక్కసం నింపుకుని, ఊచలు లెక్కపెట్టొచ్చిన నేతల ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు. వారిచ్చిన ఉగాది పచ్చడి తినొద్దు. తెలుగువారికోసం నేను అవసరమైతే ఒకమెట్టు దిగొస్తా. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే ఉగాదిపచ్చడి తింటా. నాక్కావలసింది తెలుగువారి భవిష్యత్. అంతేతప్ప ఎక్కడి పచ్చడి అన్నది కాదు. హైదరాబాద్‌లో ఉన్నా ఉగాదిని మాత్రం ఆంధ్రలోనే జరుపుకుంటా. జగన్ ప్రజలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అంతా విజయమే అనుకున్నా. జయనామ సంవత్సరం దెబ్బేసింది. అయితే అది బయటకు ఎందుకు ఒప్పుకోవాలి. మా కొత్తపార్టీకి జవసత్వాలు ఇచ్చింది జయ నామ సంవత్సరమే కదా. గతేడాది రాజపూజ్యం, అవమానం సరిసమానమనే అనుకుంటున్నా. ఇక మన్మథ నామ సంవత్సరంలో కొత్తగా వచ్చేదేముంటుంది. కాకపోతే భవిష్యత్‌కోసం మన్మధపైనే ఆధారపడాలి. పంచాంగాలు, పంచాంగశ్రవణాలు నాకన్నా జనానికి అవసరం. ఆంధ్రలో రాజధాని లేదు. ఉద్యోగులకు జీతాల భరోసా లేదు. పేదలు, రైతుల భూములు పోతున్నాయి. ఇక ఉగాది వేడుకలు ఎక్కడ. పచ్చడి తినకముందే చేదెక్కిపోయింది. నేను ఈ మధ్య తుళ్లూరు వెళ్లా. అక్కడి రైతులు ముఖం చూస్తే చేదుమింగినట్లుంది. వేలాది ఎకరాలు భూసేకరణ పేరుతో గుంజుకుంటే..ఆ భూముల్లో మామిడితోటలు ఏమవ్వాలి. కోకిలగానం విన్పిస్తుందా. మన్మధనామ సంవత్సరమేకాదు…ఇక ఏ ఉగాదికీ ఆనందం లేనట్టే. సింగపూర్ తరహా రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. సింగపూర్‌లో ఉగాది ఉంటుందా. ఉగాదిలేని సింగపూర్ మనకెందుకు. నేనడుగుతున్నా…ఉషోదయం, మామిడితోటలు, కోకిలకూతలు, చెరకుపంట, బెల్లం తయారీ లేని నగరం అవసరమా. అభివృద్ధి అవసరమే కానీ…మన సంస్కృతిని చెరిపేసే అభివృద్ధి అవసరమా. జనానికి అదే చెబుతున్నా. ఈ ఉగాది సంగతి చెప్పలేనుకానీ వచ్చే ఉగాదిలోగా నేను అధికారంలోకి వచ్చేస్తా. చూస్తూ ఉండండి నేనే మీకు ఉగాది పచ్చడి తినిపిస్తా. అధికారపక్షాన్ని పచ్చడిపచ్చడి చేస్తా. ఆదాయవ్యయాల లెక్కలు నేను చూసుకునే వీలు లేకుండా పోయింది. ఆదాయపన్ను శాఖే నా లెక్క చూస్తోంది. గ్రహాలు ననే్నం చేస్తాయి. నేను తప్పు చేయలేదు. నా పచ్చడి తిని, నాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన నేతలే నా రోజులు బాగున్నప్పుడు పంచన చేరతారు. అంతవరకూ ఓర్పు, ఓదార్పుతో ముందుకెళతా. చంద్రబాబు, ఇతర నేతలు ఈ ఉగాదిగురించి ఆలోచిస్తున్నారు. నేను అలా కాదు. అధికారంలోకి రావడమే అసలు ఉగాది అని భావిస్తున్నా. అదే జరిగితే ఇంటింటికి ఉగాదియాత్ర చేసి వారి నోటికి తియ్యటి పచ్చడి అందిస్తా. పవన్‌కల్యాణ్ జనం మధ్య జేజేలు పలికించింది జయనామ సంవత్సరం. ఇంతవేగంగా అయిపోతుందని అనుకోలేదు. ఇక మన్మథనామ సంవత్సరంలోనూ మనం స్టార్‌గానే కొనసాగాలి. ఏం చేయాలి. జనంలోకే వెళ్లాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అడుగేయాలి. సింహమైనా, నేనైనా జూలు విదిలించి ముందుకువెళితేనే విలువ. అందుకే ఆంధ్ర రాజధాని ప్రాంతానికి వెళ్లా. జనం తెచ్చిన పెరుగన్నం తిన్నా. రేపొచ్చె ఉగాదికి జనం పెట్టే ఉగాది పచ్చడికూడా తింటా. తినొద్దన్నవారిని పచ్చడిపచ్చడి చేస్తా. జనం వెంట నేనున్నా. జనాన్ని బాధపెట్టే ఏ నిర్ణయాన్నైనా ఎదిరిస్తా. పోరాడతా. చంద్రబాబు, మోదీ..ఎవరైనా జనం కంట కన్నీరు తెచ్చే నిర్ణయాలు వద్దు. మన్మథలో వారి మనసు బాధపెట్టొద్దు. మీకు ఆలోచనలు రాకపోతే నేను చెబుతా. నాక్కొంచెం తిక్కుందని, అయినా దానికో లెక్కుందని ఎప్పుడో చెప్పా. నా పంచాంగం నాది. రాజపూజ్యానికి తిరుగులేదు. అవమానమంటారా. గతంకంటే ఏముంటుంది. కందాయఫలాలు, కందమూలాలు మనకక్కర్లేదు. కవిసమ్మేళనాలు మనకు సరిపడవ్. జన సమ్మేళనమే నాకు సరిపోతుంది. జనసేనే నా ఆయుధం. **

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెంకయ్య ఏకపాత్రాభినయం

వెంకయ్య ఏకపాత్రాభినయం – ఎ. కృష్ణారావు (18-Mar-2015)

నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని ఆయనకు తెలుసు. విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
ఆయన కేంద్రంలో మూడు శాఖలకు మంత్రి. అయినా ఆయన ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహా రాల గురించైనా మాట్లాడగలరు. ఒక సారి హోంమంత్రి రూపంలో, ఒక సారి ఆర్థిక మంత్రి రూపంలో, మరో సారి విదేశాంగ మంత్రి రూపంలో ఆయన మనకు ప్రత్యక్షమవు తుంటారు. ఆయన బీజేపీ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్థ కుడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు సంబంధించిన వ్యవహారా లైతే ఆయన వెంటనే రంగంలోకి దూకుతుంటారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాజ్య సభలో గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, సీతారాం ఏచూరి లతో పాటు ఏ పార్టీ నేతలు తన పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా ఆయన వెంటనే లేచి పదునైన వాగ్బా ణాలు సంధిస్తుంటారు. ఎవర్నైనా చెండాడడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటివరకూ లోక్‌సభలో ఉన్న వ్యక్తి, రాజ్యసభలో కనపడుతుంటారు. రకరకాల ప్రతినిధి వర్గాలను కలుస్తుం టారు. ఉన్నట్లుండి నల్గొండలో శాసనమండలి సభ్యుల ప్రచా రంలో పాల్గొనడానికి కూడా తానే వెళతారు. టీఆర్‌ఎస్‌ అభ్య ర్థిని ఓడించమని పిలుపునిస్తారు. వారాంతం వస్తే దక్షిణా దిన నాలుగైదు చోట్ల ప్రసంగించకపోతే ఆయన ఆరోగ్యం బాగుం డదు. పార్లమెంట్‌ వార్తల కోసమో, తెలుగు వార్తల కోసమో, టీవీ వైపు చూస్తే చాలు ఆయన మాట్లాడుతున్న దృశ్యమే కన పడుతుంటుంది. పోనీ, తన మంత్రిత్వ శాఖల పనులు ఏమైనా చేయరా అనుకుంటే అది కూడా పొరపాటే. స్మార్ట్‌ సిటీల సదస్సులోనో, మరో అధికారిక సమావేశంలోనో మాట్లాడుతూ ఉంటారు. మెయిల్‌ తెరిస్తే చాలు, ఆయన మీడియా అధికారి నుంచి అంచలంచలుగా, కుప్పలు తెప్పలుగా, పుంఖాను పుంఖాలుగా వార్తలు, ఆయన ఉపన్యాస పరంపరలు వస్తూనే ఉంటాయి. ఆయన ఎవరో కాదు, వెంకయ్యనాయుడేనని ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది.
అసలు వెంకయ్యనాయుడుకు ఈ శక్తి ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయే నాయకుడుండరు. బహుశా అంతటా సర్వంత ర్యామిలా తానే కనపడకపోతే, రోజుకు కనీసం పదిసార్లైనా మాట్లాడకపోతే ఆయనకు ఈ శక్తి ఉండేది కాదేమో. పని, మాట్లాడడం రెండూ ఆయన శక్తికి ఇంధనాల్లా కనపడుతాయి. హర్యానాలో ఒక చర్చిని కూల్చివేస్తే, పశ్చిమ బెంగాల్‌లో 72 ఏళ్ల ఒక వృద్ధ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగితే మంగళవారం జీరో అవర్‌లో సభ్యులు గందరగోళం సృష్టిం చారు. నిజానికి ఇలాంటి సంఘటనలపై పార్లమెంట్‌లో హోం మంత్రి ప్రకటన చేయాలి. కాని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌కు రాక రెండు మూడు రోజులైంది. ఎక్కడో జపాన్‌లో ఏదో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. హోంశాఖ సహాయమంత్రి ఉన్నా ఆయనకు ప్రతిపక్షాలకు దీటుగా జవాబిచ్చే శక్తి లేదు. అంతే, అదే సమయంలో లోక్‌సభలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. ఒక్కో సభ్యుడికి దీటుగా సమాధానమిచ్చి వారి నోళ్లు మూయించారు. సంఘటన నిందించదగ్గదే.. కాని రాజకీయం చేయవద్దు. హర్యానా, బెంగాల్‌లో ఏదో జరిగితే కేంద్రం ఏమి చేస్తుంది? ఒకవేళ కేంద్రం ఏమైనా చేసినా మీరు ఊరుకుంటారా.. అని విరుచుకుపడ్డారు. సంఘ్‌పరివార్‌పై ఒక్క మాట కూడా ఆయన పడనీయకుండా అడ్డుకున్నారు. చేసేది ఏమీ లేక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పార్టీ సభ్యులు వాకౌట్‌ అని ప్రకటించి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రాజ్యసభలో సభను స్తంభింపచేసిన కాంగ్రెస్‌ సభ్యులను కూడా వెంకయ్యే ఎదుర్కొన్నారు. అధికారులు ముఖ్య నాయకుల గురించి ఆరా తీయడం మామూలేనని, అది గూఢచర్యం కాదని కొట్టి పారేశారు. మీ హయాంలో మీ ఆర్థిక మంత్రి (ప్రణబ్‌ ముఖర్జీ) స్వయంగా తన కార్యాలయంలో హోంమంత్రి (చిదంబరం) బగ్గింగ్‌ చేయించారని ప్రధానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా.. అని ఎద్దేవా చేశారు. ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని నాటి ఆర్థిక మంత్రి స్వయంగా నియమించుకుని బగ్గింగ్‌ పరికరాలను తీసేసిన విషయం ఆయన గుర్తు చేశారు. పనికిరాని ఆరోపణలు చేసి సెల్ఫ్‌గోల్‌ చేసుకోకండి.. అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు, మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారంటే అర్థం ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన భార్య ఆరోగ్యం బాగులేదని అమెరికాకు వెళ్లారంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కాని అదే జైట్లీ మళ్లీ లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు వెళ్లడం, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జపాన్‌లో జాతీయ విపత్తు సదస్సుకు, ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాలకు వెళ్లడం అవసరమా… అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు. ఆర్థికమంత్రి సభలో లేకుండానే లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించేందుకు పూనుకుంటే ప్రధాన ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ఆర్థిక మంత్రి లండన్‌కు వెళ్లేందుకు అనుమతించిన స్పీకర్‌ తన రూలింగ్‌ను సభ్యులే ధిక్కరిస్తుంటే ఏమీ చేయలేక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వైపు చూశారు. మిమ్మల్ని వారు ధిక్కరిస్తుంటే, మీరు మాత్రం ఏమి చేయగలరు? సభను వాయిదా వేయండి.. అని వెంకయ్య సూచించారు. హమ్మయ్య.. అనుకుంటూ మహాజన్‌ సభను వాయిదా వేశారు. ఇలా రోజుకు పలు సార్లు వెంకయ్య వైపు చూడకుండా స్పీకర్‌ సభను నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. పార్లమెంట్‌ అంటే వెంకయ్యే అనుకునే స్థితి ఏర్పడింది.
స్పీకరే కాదు, పార్లమెంట్‌ నడుస్తుంటే మిగతా కేంద్ర మంత్రులేమయ్యారో, వారేమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మీరు వెంకయ్య చెప్పినట్లు నడుచుకోండి.. అని నరేంద్రమోదీ చెప్పినట్లున్నారు.. అందుకే సభ కార్యక్రమాల గురించి వెంకయ్యతో చర్చించకపోతే సంబంధిత మంత్రి సభలో ఏమీ చేయలేరు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షం చేస్తున్న గందర గోళంపై వ్యూహరచన చేసేందుకు వెంకయ్య పిలిస్తే సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీతో సహా మొత్తం 35 మంది మంత్రులు ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో, నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రచారం చేయాలో ఆయన సూచించారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌కు మీరేమి చేశారో చెప్పండి.. అని ఒక్కొక్కరి నుంచీ ఆయన వివరణలు కోరారు. భూసేకరణ బిల్లుపై ఆర్‌ఎస్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా వెంకయ్యతో చర్చించి సవరణలను చేర్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ ఉన్నప్పటికీ వెంకయ్యే ప్రధాన వక్త. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, పార్లమెంట్‌కు హాజరై మీ బాధ్యతలు నిర్వహించడానికి. గైరు హాజరు చేయడం సరైంది కాదు.. అని ఆయన మోదీ సమక్షంలోనే క్లాసు పీకారు. కీలకమైన భూసేకరణ బిల్లు ఓటింగ్‌ జరిగినప్పుడు ప్రీతమ్‌ ముండే, వరుణ్‌ గాంధీ, పూనం మహాజన్‌, శత్రుఘ్న సిన్హా తదితరులు రాలేదని ఆయన వారందరి పేర్లూ చదివారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏఅంశంపైనైనా, ఆఖరుకు శ్రీలంకలో తమిళుల అంశంపైనైనా వెంకయ్య మాట్లాడగలరు. ఆయన వద్ద ఏ అంశంపైనైనా రెడీమెడ్‌గా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని ఆర్జినెన్స్‌లు జారీ చేశారో, ఎన్ని సార్లు వారి మంత్రులు సభకు రాలేదో.. ఏఏ అక్రమాలు చేశారో.. ఆయన వద్ద సమాచారం సిద్ధంగా ఉంటుంది. మోదీ, మరికొందరు ముఖ్యమైన మంత్రులు సభలో లేరు కదా.. అని ప్రతిపక్షాలు విజృంభించాలని చూస్తే వారికి వెంకయ్య అరివీర భయంకరుడులా, కొరకరాని కొయ్యలా కనపడుతున్నారు. ఒకటి రెండు సార్లు ఆయనను ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు చూశారు. ఆయన తమను అవమానించారని ఆరోపణలు చేశారు. సోనియా కూడా ఆయనపై దాడి చేశారు. వెంకయ్య ఒక్కరోజు వెనక్కు తగ్గినట్లు కనపడ్డారు. కాని మరునాటి నుండి మళ్లీ వెంకయ్య సహజరూపంలో దర్శనమిచ్చారు. ఇప్పుడెందుకురా ఆయనతో పెట్టుకోవడం.. అని భయపడే పరిస్థితిని కల్పించారు. అలా అని వెంకయ్య ప్రతిపక్షాలతో స్నేహం చేయరా అంటే అదీ లేదు. నెయ్యం నెయ్యమే, కయ్యం కయ్యమే.. అన్నట్లుగా ఆయన వైఖరి కనపడుతోంది. ఇదేమిట్రా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే తమను ఢీకొంటున్నారని ప్రతిపక్షాలు అనుకున్నప్పటికీ వెంకయ్య ఇలాగే ఉంటారని వారు సర్దుకోక తప్పడం లేదు. బీమా, తదితర బిల్లులను ఆమోదించక తప్పలేదు. ఇక తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలను మచ్చిక చేసుకోవ డంలో వెంకయ్య సిద్ధహస్తులు. మీ అపాయింట్‌మెంట్‌ లేకుండా మీ ఆఫీసుకు వచ్చాను.. అని మమతా బెనర్జీ అంటే, సోదరీ.. నా వద్ద మీకు అపాయింట్‌మెంట్‌ ఎందుకు. ఎప్పుడైనా రావచ్చు.. అని వెంకయ్య అనగలరు.
నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని కూడా ఆయనకు తెలుసు. మోదీని, సర్కార్‌లో మంత్రుల్నీ ఒప్పించి, విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. కాని దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
– ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు శ్రీ నివాస హైస్కూల్ లో శ్రీ మన్మధ ఉగాదివేడుకలు

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు జర్నలిస్ట్ శ్రీప్రకాష్ వివిధ న్యూస్ చానెళ్ళ కోసం శ్రీ నివాస హైస్కూల్ విద్యార్ధినులతో  మామిడి  మొదలైన చెట్ల వనం లో శ్రీ  మన్మధ ఉగాదివేడుకలు నిర్వహించి ,నాతొ పంచాంగ శ్రవణం చేయించిన చిత్ర మాలిక -బహుశా ఇవి ఉగాదినాడు ప్రసారం కావచ్చు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)
పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని
హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని
సుశబ్దశోభిత సురభిళ సుమహారమని
వేదికలపై చమత్కారమై మెరసి
అనుభూతిని గుండె నిండా కురిసి
తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు
తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు
అతడు ‘కవితాప్రాద’ భాసురుడు
కవితాకాశంలో అస్తమించని ప్రతిభా భాస్కరుడు
జనతా హృదయావిష్కృత విజయశేఖరుడు.
‘రాళ్ళబండి’కి కవిత్వపు రత్నాలను ఎత్తి
ఊరూరా పద్యమై ఊరేగినవాడు.
నిత్యం పద్యమై ప్రవహిస్తూ
తీయని సంభాషణల్లో మెరుస్తూ
‘కందం’లో అందమైన జగణంగా నిలుస్తూ
నన్నయ్య వారసుడిగా ఈ తరాన్ని పలకరిస్తూ
అన్నయ్య నాగభైరవను మనసులో తలుస్తూ
లోకానికి కవిత్వాన్ని
నాలాంటి ఎందరికో దుఃఖాన్ని మిగిల్చి
‘లఘువు’లా మాయమయ్యాడు
రేపటి పద్యానికి ‘గురువు’గా నిలిచాడు
అవధాన విద్యకు ఆధునికతను జోడించి
పద్యానికి సరికొత్త పరిమళాన్ని అద్దినవాడు
స్నేహసౌజన్యాలకు మారుపేరై
కార్యనిర్వహణలో నూతన ఒరవడిని దిద్దినవాడు
అతడు నిత్యప్రససాద భాసురుడు
ఏ భుజకీర్తులూ లేని అచ్చమైన భూసురుడు
– డా. బీరం సుందరరావు
ఇంకొల్లు, ప్రకాశం జిల్లా
నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే’- ఎస్‌.ఎ. కరీమ్‌ (17-Mar-2015)
ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు.
రాళ్ళబండి కవితాప్రసాద్‌ గురించి ఇలాంటి సందర్భంలో రాయాల్సి వస్తుందని నేనసలు ఊహించుకోలేదు. అసలు నాకు ఇలాంటి తలపే ఏనాడూ రాలేదు. మా ప్రసాదరాజు సాధించిన విజయాలపై గొప్పగా రాయాలనుకున్నా… మనం అనుకున్నా… అనుకోకున్నా… మనకు ఇష్టం ఉన్నా… లేకున్నా కొన్ని ఆగవు. జరిగిపోతాయి. నిండు నూరేళ్ళు నవ్వుతూ బతకాల్సిన మా ప్రసాదరాజు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాడని ఎవరనుకున్నారు?
రాళ్ళబండి కవితా ప్రసాద్‌ గురించి చెప్పాలంటే 38 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1976లో ఈ కథ మొదలైంది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నియోజకవర్గం సత్తుపల్లి. అటు పల్లె కాదు, ఇటు పట్నం కాదు. వెంగళరావు అండతో… చొరవతో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఊరది. వెంగళరావు చొరవతోనే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1976లో ప్రారంభమైంది. కొత్త కళాశాల కాబట్టి… విద్యార్థుల్ని ఆకర్షించాలన్న ఉద్దేశంతో మొదటి బ్యాచ్‌ వారికి ఉచిత విద్య – ఉచిత భోజన వసతి కల్పించారు. అది తెలుసుకున్న అనేక మంది పేద విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చి సత్తుపల్లి కాలేజీలో చేరారు. ఇంటర్‌లోనే చదువు ఆపేసిన వాళ్ళు కూడా అనేక మంది పెట్టె బేడా సర్దుకుని సత్తుపల్లి వచ్చేశారు. అందుకే మొదటి బ్యాచ్‌లో ఎంతో వైవిధ్యం ఉండేది. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు… వయస్సులో కూడా చాలా పెద్దవాళ్ళు… పెళ్ళయిన వాళ్ళు… నూనుగు మీసాల వాళ్ళు… ఇలాంటి వాళ్ళంతా కలిసి సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అయ్యింది. ఇక లెక్చరర్లు కూడా ఉద్దండులు. ప్రతి సబ్జెక్టులోనూ మెరికల్లాంటి లెక్చరర్లను సత్తుపల్లి బదిలీ చేయించారు వెంగళరావు. బీఎస్సీ, బీకాం, బీఏ… మూడు క్లాసులు మొదలయ్యాయి. అందులో బీఎస్సీ విద్యార్థి రాళ్ళబండి ప్రసాదరాజు. అప్పుడు అతని పేరు అదే. తర్వాత కవితా ప్రసాద్‌గా మార్చుకున్నాడు.
మా బ్యాచ్‌లో పిన్న వయస్కులు అతి కొద్దిమందిలో ప్రసాదరాజు ఒకడు. ప్రసాద్‌ స్వతహాగా ప్రతిభావంతుడు. మితభాషి. మృదుస్వభావి. సున్నిత మనస్కుడు. లెక్చరర్లు… తోటి విద్యార్థుల మనసు గెలిచినవాడు. ముఖంపై చెరగని చిరునవ్వు ప్రసాదరాజు ట్రేడ్‌ మార్క్‌. అందరిలో చిన్నవాడు కదా? అప్పుడప్పుడూ… కొందరు ఆట పట్టించేవాళ్ళు. ప్రసాదరాజు చిరునవ్వే అందుకు జవాబు. ఇక కాలేజీలో జరిగే వార్షికోత్సవాల్లో… సాహితీ విభాగం బహుమతులన్నీ ప్రసాదరాజు దక్కించుకునేవాడు. అందుకే మా లెక్చరర్లు ‘స్టూడెంట్‌ పండిట్‌’ అని బిరుద్దు ఇచ్చేశారు. ఆనాటి సత్తుపల్లి కాలేజీ నిజానికి ఒక గురుకులం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే వాళ్ళు లెక్చరర్లు. వేమనపైన… నల్లమందు యుద్ధంపైన… ఇలా అనేక అంశాలపై ప్రత్యేక లెక్చర్లు ఉండేవి. శ్రీశ్రీ మహా ప్రస్థానంలో యువత ఉర్రూతలూగుతున్న కాలమది. ఎమర్జెన్సీకి ముందు – తర్వాత రాజకీయ వాతావరణాన్ని కూడా మేం అక్కడే పసిగట్టాం. లైబ్రరీలో నిండా పుస్తకాలు. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు. అవన్నీ చదవండంటూ ప్రోత్సహించే లెక్చరర్లు. ముందు ముందు ప్రసాదరావు మంచి సాహితీవేత్తగా ఎదగడానికి కారణమయ్యింది ఆ వాతావరణం. స్వతహాగా సాహితీ అంశ ఉన్నవాడు. దానికి సత్తుపల్లి కాలేజీ సానపట్టింది. మా బ్యాచ్‌ వాళ్ళందరికి సత్తుపల్లి జీవితం ఒక చెరగని స్వప్నం. సత్తుపల్లి తర్వాత ఎవరి దారి వారిది.
ప్రసాదరాజు ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరోలో అధికారిగా చేరాడు. ఆ తర్వాత గ్రూప్‌-1 పాసై సోషల్‌ వెల్ఫేర్‌లో అధికారిగా వచ్చాడు. ఇక అక్కడి నుంచి ప్రసాదరాజు సాహితీ వ్యవసాయం నిరంతరంగా సాగిపోయింది. సాహితీ పరంగా చూస్తే… ఆధునిక భావాలున్న సంప్రదాయవాదిలా కనిపిస్తాడు ప్రసాద్‌. హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ మాసాబ్‌ట్యాంక్‌ ఆఫీసులో కలిసేవాళ్ళం. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లు, ఈ మధ్య ఒక ఫేస్‌బుక్‌ పలకరింపులు మాత్రమే. సాహితీ రంగంలో కొత్త కొత్త బాటలు వేసుకుంటూ బాటసారిలా సాగిపోయే ప్రసాదరాజులో చిన్న అసంతృప్తి ఉండేది. సోషల్‌ వెల్ఫేర్‌లో కాకుండా… రెవిన్యూలో పోస్టింగ్‌ వచ్చి ఉంటే… ఐఏఎస్‌ అధికారి అయ్యేవాడినని… అన్నాడు నాతో ఒకసారి. కానీ… ఇవ్వాళ ప్రసాద్‌ రావు వాటన్నంటికన్నా, ఎత్తుకు ఎదిగాడు. ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు… నిజం. సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అందరి గుండెల్లో నువ్వున్నావు. అదీ నిజమ్‌. వాళ్ళందరి తరఫున నీకిదే నివాళి. మా బ్యాచ్‌ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాం. ప్రసాద్‌! నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే. నిన్ను మేం అలాగే గుర్తుంచుకుంటాం.
ఎస్‌.ఎ. కరీమ్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు (09-Mar-2015)
‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
తెలుగు వ్యాసప్రస్థానంలో స్వామినీన ముద్దునరసింహనాయని గారి ‘హిత సూచని’ ఒక మైలురాయి. 1862 లో అచ్చయ్యింది. రచన అంతకు ముందెప్పుడో జరిగింది. ఎందుకంటే నరసింహం గారి మరణానంతరం అచ్చుకెక్కిన పుస్తకం అది. వ్యాసం ఇందులో ప్రమేయం అనే పేరుతో ఉంది. అప్పటికింకా వ్యాసానికి వ్యాసం అనే పేరు రాలేదు.
వ్యావహారిక భాషలో వెలువడ్డ వ్యాసాలివి. ఇది తెలుగులో మొదటి వ్యాససంపుటిగా పరిగణింపబడుతోంది. ఆధునిక విద్యా విజ్ఞానాలు కలిగిన మనిషి హేతుపురస్సరంగా విద్య, వైద్యం, మంత్రం, రాక్షసులు, వివాహం మొదలైన విషయాల గురించి చేసిన ఆలోచనలు ఈ వ్యాసాలు. చరిత్ర కారులు ఈ రచనను ఆధునికత ప్రారంభరచనగా గుర్తించారు కాని ఇందులోని సాహిత్య విమర్శాంశను గుర్తించినట్టు లేదు. దీనిని ఆధునిక సాహిత్య విమర్శలో తొలి రచనగా కూడా గుర్తించవలసి ఉంది.
మనుష్యేతర జంతు సంజ్ఞాప్రమేయంలో నరసింహంగారు బంగారు ముంగిస కథను, కేకయ రాజు కథను తీసుకుని వాటిలోని సంఘటనల సాధ్యాసాధ్యాలను విశ్లేషణాత్మకంగా విచారించారు. ఆ కథల మూల లక్ష్యంగా మనం గ్రహించవలసిన విషయాలను, యథార్థాలని భ్రమించకుండా విడిచిపెట్టవలసిన విషయాలను విశదీకరించారు. జంతుజాలం మనుష్యులలాగా ఆలోచించగలదని, మనుష్యులతో మాట్లాడగలదని నమ్ముతున్న జనాన్ని ఉద్దేశించి రాసిన ప్రమేయం ఇది.
భారతంలో కనిపించే బంగారు ముంగిసకథను పరిశీలించిన పద్ధతి ఇలా ఉంది. ముందుగా కథను వివరంగా చెప్పా రు. పేద బ్రాహ్మణుడు అతని కుటుంబం తమకు తినడానికి ఏమీ లేని స్థితిలో చివరకు దొరికిన యవల పిండిని కూడా అతిథి సంతృప్తి కోసం త్యాగం చెయ్యడం, ఆ అతిధికి పాద్యం నిమిత్తం వాడిన నీటిలో తలను, ఒక పక్క శరీరాన్ని తడుపుకున్న ఒక ముంగిసకు ఆ భాగాలు బంగారంగా మారడం, తక్కిన శరీరాన్ని కూడా బంగారంగా మార్చుకోవడం కోసం ఆ ముంగిస వివిధ యాగ ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నించి విఫలం కావడం, ధర్మరాజు చేసిన అశ్వమేధం వద్ద కూడా ఫలితం పొందలేకపోవడం, ఆ ముంగిస అక్కడి విప్రులకు రాజుకు పేదబ్రాహ్మణుడి త్యాగం కన్న ఈ యాగాదులు మిన్నకావని చెప్పడం మొదలైన సంఘటనలన్నిటినీ చెప్పారు. తర్వాత ముంగిసకు మానవ భాష రావడం అసాధ్యమని, దాని శరీరం బంగారంగా మారడం కుదరని విషయమని విశ్లేషించారు ‘న్యాయానుగుణంగా ఆర్జించని సొత్తు ఎంత విస్తారముగా వ్యయము చేసినా న్యాయ కష్టార్జితము తాలూకు స్వల్ప భాగము యొక్క ధర్మముతో సమానము కానేరద’ నేది ఆ కథ నుంచి గ్రహించవలసిన నీతి అని వివరించారు.
అలాగే కేకయ రాజు కధావిమర్శ కూడా చేశారు. ఈ కథ వాస్తవంగా జరిగిందని అనేకులు నమ్ముతున్నారని, అప్పటి వాస్తవ ప్రపంచ మర్యాదకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పూర్వయుగాలలో ఇటువంటి సంగతులు జరిగి ఉన్నట్టు చెబుతున్నారని అది తప్పని రాశారు.
అంటే పురాణ కథలు కల్పిత సాహిత్యం అని, ఒక ధ్యేయంతో రచయితలు సాగించిన రచనలని అంటున్నారన్నమాట.
భారతాంతర్గతంగా ఉన్న పరీక్షిదుదంక తక్షకుల కథను మంత్రప్రమేయములో వివరంగా చర్చించారు. పరీక్షిత్తు మహారాజు చేసిన తప్పు, దానికి మునికుమారుడైన శృంగిచేత శాపానికి గురికావడం మొదలుకుని సర్పయాగ విరమణ వరకూ ఉన్న అన్ని ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేశారు. ఆ తర్వాత ఆ ఘట్టాలలోని హేతుబద్ధతను చర్చించారు. చివరగా ఆ కథ ద్వారా నేర్చుకోవలసిన నీతిని ప్రస్తావించారు. వేట ఒక వ్యసనమని అది తప్పు పనులను చేయిస్తుందని, ప్రభువైన వాడు నేరం పూర్తిగా విచారించకుండా శిక్షించడం తప్పని, తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు స్పందించడం న్యాయమని, జాతిలో ఒక్కడు తప్పుచేస్తే అది జాతి మొత్తానికి హానికరంగా పర్యవసించవచ్చునని వివరించారు. అయితే కథ కూర్పులోని అస్తవ్యస్థతలను ఉపేక్షించలేదు.
ఈ భాగంలో స్వామినీన వారు లేవనెత్తిన ప్రశ్నలు అనేకం. మచ్చుకు కొన్ని
1. తండ్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తండ్రిని అవమానించాడన్నకోపంతో రాజును శపించిన శృంగి దుడుకు మనిషి. శాప ఉపసంహరణ చెయ్యమని చెప్పిన తండ్రి న్యాయబద్ధమైనకోర్కెను పాటించలేని వాడు, అటువంటి మనిషి తిట్టు అమోఘంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం?
2. అతనికి ఆ సామర్థ్యం ఉన్నట్టయితే తక్షణం చనిపోయేటట్టు ఎందుకు శపించలేదు? వారం రోజుల వ్యవధి ఎందుకు ఉంచాడు?
3. భూలోకంలో అనేక సర్పాలు ఉండగా నాగలోక నివాసి అయిన తక్షకుడే కాటు వేయాలని ఎందుకు శపించాడు?
4. బతికి ఉన్న చెట్టును దానిపై ఉన్న పక్ష్యాదులతో సహా తన విషంతో భస్మం చెయ్యగలిగిన తక్షకుడు పరీక్షిత్తు ఉన్న ఒంటి స్తంభం మేడను దానిలో ఉన్న మనుష్యులందరితో సహా ఎందుకు భస్మం చెయ్యలేకపోయాడు?
5. సర్పయాగంలో ముందుగా తక్షకుడే చనిపోయేటట్టుగా రాజు ఎందుకు సంకల్పించలేదు?
మంత్రాలు లేవని వాదిస్తూ రాసిన ఈ వ్యాసం మూఢనమ్మకాలకు సంబంధించినదేగాని ఇందులో సాహిత్య విమర్శ కూడా ఉంది. నరసింహంగారి లక్ష్యం అది కావడం కాకపోవడంతో నిమిత్తం లేకుండానే ఇక్కడ సాహిత్య వస్తువిమర్శ జరిగింది. ఒక సాహిత్య రచనను ఏ విధంగా చదవాలి ఏమి స్వీకరించాలి అన్న వివేచన ఉంది.
శిల్పం, అలంకారం, రసం, వస్తువు, పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ కలిసి సాహిత్యం తయారవుతుంది. వాటిలో ఏ అంశాన్ని విశ్లేషించినా అది సాహిత్య విమర్శ అవుతుంది. స్వామినీన వారు చేసింది పురాణ సాహిత్య వివేచన. ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’ వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యా ల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
– రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు?
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను, భావాలనే చెప్తూ పోయినపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
కథని ఎవరి చేత చెప్పించాలి అన్న విషయాన్ని ప్రతి కథారచయితా ఆలోచించి ఎంచుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రయోగాలూ చేస్తాడు. వృక్షాలూ జంతువులూ వచ్చి మనకి కథలు చెప్పడం జరుగుతూ వుంటుంది. అందుకు ఒక ప్రయోజనమూ ఉంటుంది. కథకుడు రాగద్వేషాలకు అతీతంగా సత్యాన్ని చెప్తున్నాడన్న నమ్మకాన్ని పాఠకుడికి కలిగించేందుకో, లేక పాఠకుడు కథలోని పాత్రలతో తాదాత్మ్యం చెందకుండా కథలోని సత్యాన్ని మాత్రమే గ్రహించే అవకాశాన్ని కల్పించేందుకో బహుశా రచయిత చెట్టునీ, పిట్టనీ కథకుడిని చేస్తాడు. ఒక్కొక్కసారి ‘ఆత్మలు’ చెప్తున్నట్లుగా కూడా కొన్ని కథలు వస్తూ వుంటాయి.వాటి ప్రయోజనం ఏమిటి? అంటే, ‘ఆత్మ’ ద్వారా కథ చెప్పించినందువల్ల ‘కథకి’ ఒనగూడే అధిక విలువ ఏమిటి? ఆ విషయాన్ని పరిశీలించే ప్రయత్నం ఈ వ్యాసం.
నా పరిశీలనకు నాలుగు కథలని తీసుకున్నాను. గొరుసు జగదీశ్వర రెడ్డి వ్రాసిన ‘బతుకుగోస’, సామాన్య వ్రాసిన ‘మహిత’, అరిపిరాల సత్యప్రసాద్‌ వ్రాసిన ‘ఊహాచిత్రం’, మండువ రాధ వ్రాసిన ‘చివరిపూవు’. ఈ కథలు మాత్రమే చర్చకు తీసుకోవడానికి కారణం ఇవి ప్రస్తుతం నాకు అందుబాటులో వుండడం, నేను చెప్పదలచుకున్న విషయాలను చెప్పేందుకు ఈ నాలుగు కథలూ సరిపోవడం. అంతే తప్ప నేను ఈ వ్యాసంలో చర్చిస్తున్న విషయాలు (గుణాలు, దోషాలు కూడా) ఈ నాలుగు కథలలో మాత్రమే ఉన్నాయని కానీ ఈ దృక్కోణంతో వ్రాసిన ఇతర కథలలో లేవని కానీ కాదు. అలాగే, ఈ వ్యాసంలో ఎత్తి చూపిన కొన్ని అంశాలు ఆయా కథారచయితలకి తెలియవనీ కాదు.
ఈ నాలుగు కథలలోనూ కథ మొత్తాన్ని లేదా కథలో కొంత భాగాన్ని ‘ఆత్మ’ చెప్తుంది. ‘బతుకుగోస’లో ఒక కంపెనీ మూసేసినందుకు నిరసనగా ధర్నా చేస్తూ కాల్పులలో చనిపోయిన కార్మికుడి ఆత్మ, ‘మహిత’లో అత్తగారింటిలో భర్త చేతిలో హత్య చేయబడిన పదహారేళ్ళ మహిత ఆత్మ, ‘ఊహాచిత్రం’లో ప్రస్తుతం వేస్తూ వున్న ఒక చిత్రం గురించిన ఆలోచనలతో పరధ్యానంగా స్కూటర్‌ నడిపి యాక్సిడెంట్లో చనిపోయిన చిత్రకారుడి ఆత్మ, ‘చివరిచూపు’ కథలో కరెంటు షాకుతో మరణించిన సూరి అనే త్రాగుబోతు ఆత్మా మనకి కథ చెప్తాయి.
వ్యవహారంలో ఆత్మ అనేమాటని మనం చాలారకాలుగా వాడుతూ వుంటాం. ఒక్కొక్కసారి మనసునే ఆత్మ అంటాం. ఇంకొకసారి మనసుకన్నా వెనుకనున్న ‘మరేదో’ అన్న అర్ధంలో ‘ఆత్మ’ అన్న పదాన్ని వాడతాం. మనిషికి మూడు శరీరాలు- స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు-ఉంటాయని చెప్పుకుంటాం. ఇందులో స్థూల శరీరానికి తప్ప మిగిలిన మూడింటికీ ‘ఆత్మ’ అనే మాటని మనం సంభాషణలలో కొంత అస్పష్టంగా వాడుతూ వుంటాం. సందర్భాన్ని బట్టి తగిన అర్థం తీసుకుంటూ వుంటాం.
మనుషులే కథ చెప్తున్నపుడు, మనుషుల సంభాషణలో ఆత్మ అనే పదం వాడినపుడు, ఈ అస్పష్టతలన్నీ కథలో ఉండవచ్చు. ఎందుకంటే మనం అలా అస్పష్టంగానే మాట్లాడుకుంటాం కాబట్టి. అయితే ఆత్మే కథ చెప్తున్నపుడు ఆ అస్పష్టతలు ఉండవచ్చునా? రచయిత దేనిని ‘ఆత్మ’ అంటున్నాడో, కథకుడిగా వ్యవహరిస్తున్న ‘ఆత్మ’ స్వరూపస్వభావాలు ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి కదా? ఇలాంటి కొన్ని కథలు చదివిన మీదట కొందరు రచయితలతోను పాఠకులతోను ఈ విషయంపై మాట్లాడిన మీదట అందరూ ఏకీభవిస్తున్న, భావిస్తున్న సామాన్య లక్షణాలు కొన్ని కనిపించాయి. అవి ఏమిటంటే, ఈ రకమైన కథలలో బ్రతికున్నపుడు ఉత్తమపురుష కథకుడిలో ఉన్న ‘మనసే’ అతను చనిపోయాక ‘ఆత్మ’ అవుతుంది. శరీరంతో బంధింపబడి లేదు కాబట్టి అది ఎక్కడికైనా ఎప్పు డైనా వెళ్ళిపోగలదు. అది కథలోని మిగతా పాత్రలకి కనబడదు. వినబడదు. దానికి మాత్రం అందరూ కనబడతారు, వినబడతారు. ఇవి ఇలాంటి అన్ని కథలలోనూ కనబడే ‘ఆత్మ’ లక్షణాలు. పాఠకులూ రచయితలూ కూడా అంగీకరించే సామాన్య లక్షణాలు. అప్పుడు మూడు విషయాలను గమనించవలసి అవసరమూ అవకాశమూ ఏర్పడుతుంది. 1. ఈ సౌలభ్యాన్ని రచయిత ఎంతవరకు ఉపయోగించుకున్నాడు? 2. ఎంత విచక్షణతో ఉపయోగించుకున్నాడు? 3. దానివలన కథకి ఏ ప్రయోజనాన్ని సాధించాడు? పైన చెప్పిన నాలుగు కథలనీ ఉదాహరణలుగా తీసుకుని ఈ మూడు విషయాలు పరిశీలిద్దాం.
కథలో ‘ఆత్మ’ తప్ప చెప్పలేని విషయమెంత?
ఆత్మ చెప్తున్న కథలు అయినప్పటికీ నిజానికి ఇవి ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథలే. కథకుడు తాను బ్రతికున్నపుడు జరిగిన విషయాలని, మరణించాక జరిగిన విషయాలని కలగలిపి చెప్పడం మనం వీటిలో చూస్తాం.
కథనం మనసు నుండి ఆత్మకు మారడం (కథకుడు మనిషి నుండి శవంగా మారడం) అనేది కథ మొదట్లో జరగవచ్చు, మధ్యలో జరగవచ్చు చివర్లో జరగవచ్చు. ఎప్పుడు జరిగినప్పటికీ కథలో ఉత్తమపురుష కోణంలో కథ చెప్పబడితే ఏయే విషయాలు చెప్పే అవకాశముందో అవి మాత్రమే చెప్పినపుడు లేదా అవే ఎక్కువగా చెప్పినపుడు కథ ఈ సౌలభ్యాన్ని సరిగా వాడుకోనట్లే. ఆ కోణంలో చూసినపుడు, ఈ నాలుగు కథలలో బతుకుగోస, మహిత కథలు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాయని అనిపిస్తుంది. కథ చెప్తున్నది ఆత్మ అన్న విషయాన్ని బతుకుగోసలో కథ చివర్లోనూ, మహితలో కథ మధ్యలోనూ చెప్తారు. ఊహాచిత్రంలో కథ మొదట్లోనే చెప్తారు. అయినా ఊహాచిత్రంలో కన్నా మిగిలిన రెండు కథల్లోనే రచయితలు ‘ఆత్మ’ని సరిగా వాడుకున్నారు. ఎందుకంటే ఊహాచిత్రం కథలో ఎక్కువభాగం ‘మనసు’ కూడా చెప్పగలిగిన కథే. ఊహాచిత్రం కథలో ‘కథకి అవసరమైన భాగం’ ఆత్మ మాత్రమే చెప్పగలది కాదు. ‘ఆత్మ చెప్పిన భాగం’ కథకి నిజంగా అవసరమైనది కాదు. ఇక చివరిచూపు కథలో అయితే ‘ఆత్మ’ ప్రాధాన్యం అసలే లేదు. ఈ రెండు కథలూ ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని వాడుకుంటాయి.
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను అప్పటి పరిస్థితులను, భావాలనే చెప్తూ పోయినపుడు, ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని ప్రవేశపెట్టినపుడు, మరీ ముఖ్యంగా ఆ చిన్న అంశం కూడా నిజంగా కథకి అంత కీలకమైనది కానపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఆత్మ యొక్క కనీసపు లక్షణాలుగా రచయిత తీసుకునే కొన్ని విషయాలను పైన చెప్పుకున్నాం. రచయిత కనీసం వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందనీ అనుకున్నాం. వాటిలో ఒకటి బ్రతికి ఉన్నప్పటి మనసునే చనిపోయాక ఆత్మ అంటున్నామన్న విషయం. రెండవది ఆత్మ శరీరంలో నుంచి బయటకి వచ్చింది కనుక ఇక దానికి శరీరం లేదన్న విషయం. ఈ అనుకోలుతో కథ చది వితే కథ చెప్తున్నది ఆత్మ అయినపుడు కొన్ని రకాల వాక్యప్రయోగాలు, వ్యక్తీకరణలు చేసే అవకాశం వుండదు. కానీ ఒక్క మహిత కథలో తప్ప మిగిలిన మూడు కథలలోనూ వాటిని రచయితలు విరివిగా చేశారు. బతుకుగోస కథలోని వాక్యాలు కొన్ని చూద్దాము.
‘లోపలికి అడుగేస్తుంటే… శరీరం కంపించింది’, ‘లేత్‌మిషన్‌ చేతికి తగిలింది.’, ‘తుళ్ళిపడ్డట్టు వెనక్కి తిరిగాను.’, ‘ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది.’- ఇవి బతుకుగోస కథలోని వ్యక్తీకరణలు. చివరి చూపు కథలో ‘ఆత్మ’ ప్రవేశించేది కథ చివర్లో. ఒక రెండు మూడు పేరాలు మాత్రమే ఆత్మ చెప్పే కథ వుంటుంది. ఆ చిన్న భాగంలో వ్యక్తీకరణలు ఇలా ఉంటాయి. ‘నా ఆత్మ ఏడుస్తోంది. నా గురించి ఒక్క మంచి మాట వినాలని తపన పడతా అక్కడక్కడే తిరుగుతోంది.’, ‘దిగులుతో నా మనశ్శరీరాలు రెండూ కుంచించుకుపోసాగాయి.’, ‘నన్ను క్షమించండి అని ముందుగా నేనే అందరితోనూ అనాలనుకున్నాను. ముఖ్యంగా నా పెళ్ళాంతో అనబోయేంతలో నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’
సాహిత్యానికి సంబంధించినంతవరకు ఆత్మ కథకుడైనపుడు ఆత్మ=మనసు=నేను అనుకున్నాము కనుక మళ్ళీ ఆ కథకుడు(ఆత్మ) ‘నా ఆత్మ’ అనడం, ‘నా మనశ్శరీరాలు’ అనడం సరి అయిన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది.
ఇక ఊహాచిత్రం కథలోనయితే ఈ వైరుధ్యాలు, అస్పష్టతలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ‘నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా… ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ ‘ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో!, …. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ వంటి మనిషికి కలిగే భావాలనే ఆత్మలకి కూడా కలిగినట్లుగా వ్రాయడంలో ఔచిత్యం లేదు. ఇటువంటి వాక్యాలు ఈ కథలో చాలా ఉంటాయి.
అలా కాదు. మనం తికమకలో ఉన్నట్లే ఆత్మలూ తికమకలో ఉంటాయి, పైగా అప్పుడప్పుడే ఆత్మగా మారినపుడు ఆ తికమక కొంచెం ఎక్కువగా వుంటుంది అని సమర్ధించుకోవచ్చు. లేక ఆత్మ అలాంటి వ్యక్తీకరణ చేసే అవకాశమూ నిజంగానే ఉండవచ్చు. కానీ అపుడు మళ్ళీ మొదటి ప్రశ్నే వస్తుంది. ఉత్తమపురుష కథనానికీ ఆత్మ కథనానికీ అసలేభేదమూ లేనపుడు…భావ వ్యక్తీకరణలో, పదప్రయోగంలో కించిత్తయినా వ్యత్యాసం చూపనపుడు ఆత్మతో కథ చెప్పించడం ఎందుకన్న ప్రశ్న. ప్రయోగం కోసమే ప్రయోగమూ అన్న ప్రశ్న.
ఆత్మ దృక్కోణంలో నడిచే కథకీ మాములుగా ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథకీ ‘వ్యక్తీకరణ’లో, కథనంలో పెద్ద తేడా చూపడం లేదు రచయితలు. మరి ఎందుకు ఆత్మతో కథ చెప్పిస్తున్నారు? అని పరిశీలించి చూస్తే… ఈ కథలలో ఒక వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో జరిగే కొన్ని విషయాలు గమనించడం, వాటి గురించి ఆలోచించడం, కొన్ని భావాలకు లోనవడం, కొన్ని విషయాలు వ్యాఖ్యానించడం వుంటుంది. కథని ఆత్మతో చెప్పించినప్పటికీ వాస్తవానికి రచయితకీ మనకీ కూడా కావలసింది ఆత్మ యొక్క వ్యాఖ్యల నుంచి ఆత్మని అర్థం చేసుకోవడం కాదు. ఆత్మ యొక్క వ్యాఖ్యల ఆధారంగా కథలోని బ్రతికున్న పాత్రలని, బ్రతికి ఉన్నప్పటి కథకుడి మనసుని ఇంకొంత బాగా అర్థం చేసుకోవడం. అలా అర్థం చేసుకునేందుకు మనకి ఆత్మ యొక్క వ్యాఖ్యలు, కథనం ఉపయోగపడాలి. ఆ దృష్టితో ఈ కథలని చూద్దాము.
చివరిచూపు కథలో ఏమవుతుంది? మనం చనిపోయాక కొందరు మనకోసం ఏడుస్తారని, బ్రతికుండగా మన ప్రవర్తన సరిగా లేకపోయుంటే చనిపోయాక మన గురించి ఎవరూ ఒక మంచి మాట మాట్లాడరని, అపుడు మనం ఎవరికైనా క్షమించమని అడుగుదామనుకున్నా ఇక ఆ అవకాశం ఉండదనీ సూరి ఆత్మ తెలుసుకుంటుంది. అంతే. ఇది నిజానికి ఆత్మ చెప్తే తప్ప తెలియని విషయం, మనం ఆత్మగా మారితే తప్ప అర్థం కాని విషయం కాదు.
ఇక ఊహాచిత్రం కథలో రచయిత ఆత్మ గురించి సమాజంలో వున్న మామూ లు నమ్మకాలకన్నా కొన్ని విషయాలు అధికంగా వ్రాస్తారు. ఆత్మ వెళ్ళిపోవాలనుకుంటున్నప్పటికీ వెళ్ళలేక పోతోందనీ, దానిని ఏదో శక్తి ఇక్కడ ఆపుతోందనీ ఒక వాక్యం ఉంటుంది. ఆ శక్తి ఏమిటి? ఏదైనా బాహ్య శక్తా? దానిలోనే ఉన్న కోరికా? దాని కోరికే అయితే ఆ కోరిక ఏమిటో దానికి కూడా తెలియదా? ఇలాంటి విషయాలన్నీ అస్పష్టంగా వుంటాయి. ఆత్మ అంటే శరీరం నుంచి బయటకి వచ్చిన మనసు అన్న అర్థం వరకే కథలో తీసుకుంటే శాస్త్రచర్చలు చేయవలసిన అవసరం వుండదు. ఈ విషయం నిజానికి చివరిచూపు కథకి కూడా వర్తిస్తుంది. ఆ కథలో ‘నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’ అన్న చివరి వాక్యం చాలా ప్రశ్నలకి దారితీస్తుంది. మళ్ళీ ఊహాచిత్రం కథకి వస్తే అందులో ఈ క్రింది వాక్యాలు ఉంటాయి. ‘నాకు అక్కడ వుండబుద్ది కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది. భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది. పోలీసులు వచ్చారు. నా మొబైల్‌ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.’
ఇక్కడ ‘నేను’ ఎవరు? ‘అదే అనుకుంటా నా ఆత్మ ఆరాటం’ అని మనతో అంటున్నది ఎవరు? ఆత్మే కదా! ఆత్మ మళ్ళీ ‘నా ఆత్మ’ అనడం ఒక తికమక అయితే ఆ ‘ఆత్మ ఆరాటం’ ఏమిటో ఈ కథ చెప్తున్న ఆత్మకి స్పష్టంగా తెలియదనడం మరో తికమక. ‘కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.’ ఈ వాక్యం చదివితే బోలెడన్ని సందేహాలు వస్తాయి. తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు? – ఇవి నాకు కలిగిన సందేహాలలో కొన్ని మాత్రమే.
ఇక మహిత కథలో మాత్రమే కథకురాలు ఆత్మగా మారాక కొంత నిర్వికారంగా కథ చెప్పడం మనకు కనిపిస్తుంది. అయితే చిత్రంగా ఈ కథే మన మనసుని ఎక్కువగా కదిలిస్తుంది. పోస్టుమార్టం చేసిన డాక్టరు, తల్లి, తండ్రి, చనిపోయిన మహిత పొడుగాటి జడను తడుముతూ ఏడ్చిన మేనత్త – వీళ్ళందరి గురించీ మహిత ‘నిర్వికారంగా’ చెప్తుంటే… పదహారేళ్ళ పిల్ల అన్ని బాధలకీ అతీ తమైన స్థితికి బలవంతంగా నెట్టబడిందని అర్థమయిన మన గుండెల్లోకి ఆ పిల్ల బాధంతా…. ఇక మహితని అంటుకునే అవకాశం లేని ఆ బాధంతా గోడకి కొట్టిన బంతిలా వచ్చి చేరినట్లవుతుంది.
మహిత కథ చెప్తున్నపుడు శరీరం వుంది. ఇంకో క్షణంలో భర్త వచ్చి ఏం చేస్తాడో అత్త వచ్చి ఏం చేస్తుందో అన్న భయం, వారినుండి తనని తాను కాచుకోవలసిన కర్తవ్యం- ఇవన్నీ ఉన్నాయి. ఇంతలో ప్రాణం పోయింది. ఒక్కసారిగా ‘దృక్కోణం’ మారిపోయింది. ఒకరకమైన నిశ్చింత, నిదానం వచ్చాయి. ‘మహిత ఆత్మ’గా కథ చదువుతున్నపుడు మనం చుట్టూ వున్న మనుషుల్ని (కథలోని పాత్రల్ని) మరో దృక్కోణంతో చూడడం జరుగుతుంది. కొంత స్థిమితంగా నిర్వికారంగా గమనించడం జరుగుతుంది. చాలా చిన్నదే కావచ్చు కానీ ఇందులో ఒక తేడా వుంటుంది.
కథని ‘ఆత్మ’ చేత చెప్పించాలని రచయిత నిర్ణయించుకున్నపుడు వ్యక్తీకరణలో కూడా కొంత భేదాన్ని చూపగలిగితే, అందువలన కథకి ఒక ప్రయోజనాన్ని సాధించగలిగితే అపుడు ఆ కథ పాఠకులపై మరింత గాఢమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగానికి సార్ధకత వుంటుంది.
– ధీర
దారిచూపు – ముకుంద రామారావు (16-Mar-2015)
దేనిని అందుకోవాలనో
ఆకాశం అనాదిగా అలా ఒంగిపోయి ఉంది
చూడటానికి పుస్తకం దగ్గరకు లాక్కున్నట్టు
ఆకాశాన్నీ లాక్కుంటే ఎంత బాగుండును
నిన్ను నన్ను
అమ్మ తొమ్మిది నెలలే మోసింది
పుట్టుకనుంచి గిట్టుకవరకే కాదు
తనలోకి చేరినా మోస్తోంది భూమి
నిన్నూ నన్నేనా
సమస్తాన్నీ తన నెత్తిన పెట్టుకుని
అవిశ్రాంతంగా సూర్య ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది
రోజుకొకమారైనా నిండుగా సూర్యదర్శనం చేయిస్తూనే ఉంది
అదేమిటో ఎప్పటికప్పుడు
కాళ్ళను కెలుకుతూ
తనలోకి రమ్మంటుంది భూమి
విన్నవారితో ఏమేమి మాటాడుతుందో
ఎన్నాళ్ళయినా
తనలోనే దాచుకుంటూ
ఎవరు మరచిపోయినా
భూమి మాత్రం గుర్తుంచుకుంటుందేమో
ఏ రక్తం అయినా చూడు
తాను ఎన్నడూ చూడని
ఎందరు బంధువులో దానికి
శరీరంలో ఆగకుండా ప్రవహించే
రక్తమే ఆత్మనా
ప్రవాహం ఆగిపోతే
గుంపులో ఒకరుగా ఉన్నా
తండ్రులు తెలియని కుక్కల్లా నిద్రలో
ఎక్కడైనా
ఎవరైనా
ఏదైనా
దారి దొరుకుతే
మనలోని నీటికి కూడా
సముద్రాన్ని చేరాలని ఉంటుందా
కిటికీ బయట
కవిత్వాన్ని చూపించకుండా
చెప్పిందల్లా పూవులా వింటూ
కంటి వైద్యుడు చదవమన్నదే చదవడం
పంటి వైద్యుడు చేయమన్నదే చేయడం
ఎంత ఇబ్బందో
నీకైనా నాకైనా
ఎన్నెన్ని మాయల్ని మాంత్రికుల్ని
దాటుకుంటూ వచ్చినా
చివరి మాంత్రికుని
రహస్య స్థావరానికి దారి
ఎవరూ చెప్పలేరా?
ముకుంద రామారావు
99083 47273
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా ఉన్నాను. కాని కిన్నెర శ్రీదేవిగారు రాచపాళెం వారిని గూర్చి మార్చి 9వతేదీ వివిధలో ప్రకటించిన వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో వారు అవధాన ప్రక్రియను కించపరుస్తూ ‘‘అవధానాలు బూర్జువా సంస్కృతి అవశేషాలని చెప్పారు’’- ‘‘రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వాన్ని అంచనా వేసే క్రమంలో జరిగిన లోటుపాట్లకు కార ణం అవధానాలను వదిలించుకోలేని సాహిత్య వారసత్వమే కారణమని ఎంతో నిష్పాక్షికంగా తన అభిప్రాయాన్ని ఆవిష్కరించారు’’- వంటి అంశా లు చూచిన తర్వాత సముచితంగా స్పందించడం నా బాధ్యతని భావించాను.
కిన్నెర శ్రీదేవిగారు ‘అవధానానికి పెట్టనికోటైన రాయలసీమలో’- అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అవధాన ప్రక్రియకు బంగారు బాటలు వేసి ఆబాలగోపాలాన్ని అలరింపజేసిన తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు రాయలసీమవారా? పోనీ, వారి తరం తరువాతనో, కొంత సమకాలికులు గానో వచ్చిన గాడేపల్లి వీరరాఘవ శాసి్త్ర, గడియారం వేంకటశాసి్త్ర మొదలగు మహానుభావులు రాయలసీమవారనుకున్నా, అప్పుడు కూడా వేలూరి శివరామశాసి్త్ర, పిశుపాటి చిదంబరశాసి్త్ర వంటి దిగ్గజాలు కోస్తా జిల్లాలలో ఉన్నవారే. నాడైనా, నేడైనా అవధాన ప్రతిభామూర్తులు అన్ని ప్రాంతాలలో ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తే అవధాన ప్రక్రియకు సంబంధించిన ప్రాంతీయ విశ్లేషణ పట్ల సత్యదృష్టితో కూడిన అవగాహన రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి విమర్శలో లేదన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అవధాన ప్రక్రియను గూర్చి రసజ్ఞపాఠకులకు నేను ఒక అంశాన్ని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం యావత్‌ ప్రపంచంలో అత్యధికులు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు సంబంధించిన క్రీడావిశేషాలు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక క్రీడాకారుడు సిక్సరో, ఫోరో కొట్టినప్పుడు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు చూస్తూ ఉంటాం. కాని ఒక అవధాన ప్రతిభామూర్తి చమత్కార బంధురమైన పద్య కవితా శిల్పధోరణితో ఒక సమస్యాపూరణమో, ఒక దత్తపది పూరణమో నిర్వహించినప్పుడు కూడా ఆయా అవధాన సభలలో హర్షధ్వానాలు వ్యక్తమౌతూ ఉంటాయి. అయితే క్రికెట్‌ క్రీడాకారుని ప్రతిభ టి.వి., ఇతర మాధ్యమ ప్రసారాల వల్ల జగద్వ్యాప్తమై శోభిస్తూ ఉంది. అవధాన ప్రతిభకు కూడా అంతగా ప్రసారమాధ్యమాల ప్రోత్సాహం లభిస్తే ఈ ప్రక్రియ కూడా తప్పక జగద్వ్యాప్తం కాగలదు. ఇది కేవలం నా అభిప్రాయం కాదు. నేను అమెరికా వంటి దేశాలలో పర్యటించి అవధాన సాహిత్య సభలు నిర్వహించిన సభలలో పాల్గొ న్న రసజ్ఞులైన అక్కడి విశ్వవిద్యాలయ ఆచార్యులలో కొందరి అభిప్రాయం. ఇటువంటి సదభిప్రాయాలతో కొందరు ఆచార్యులు, సెనేటరులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రశంసాపత్రాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పవలసివస్తూ ఉందంటే ప్రపంచభాషలలో ఏ భాషకూ లేని ప్రత్యేకత తెలుగుభాషామతల్లికి అవధాన ప్రక్రియవల్ల లభించిన గౌరవం- అని ప్రపంచ భాషావేత్తలందరూ గుర్తిస్తున్న సత్యం.
తెలుగుభాషకు ప్రాచీన హోదాను సాధించుకోవడంలో కొంతకు కొంత మనం కృతకృత్యులం కాగలిగాం- అనుకోవచ్చు. కాని తమిళ సోదరుల లాగా, కన్నడ సోదరుల లాగా మనం సంపూర్ణ కృతకృత్యులు కాలేకపోయాం. కారణం అక్కడి భాషాభిమానులలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపనతోపాటు ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల అపారమైన ఆరాధన, తాత్పర్యం కూడా ఉన్నాయి. ఏమి దురదృష్టమో గాని తెలుగుసీమలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపన ఉన్న స్థాయిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల ఆరాధన లేదని స్పష్టమౌతూ ఉంది.
‘విమర్శలో రాచబాట’ అన్న వ్యాసారంభంలోనే కిన్నెర శ్రీదేవిగారు అతిసాహసంతో కూడిన ఒక వాక్యం రాశారు. అందులో రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారిని అలనాటి విమర్శక దిగ్దంతులు కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ఆర్‌.ఎస్‌. సుదర్శనం-వంటి మహామహులతో సమానంగా ప్రజ్ఞాప్రాభవాలు కలిగిన గొప్పవ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో పూర్తిగా ఔచిత్యం లోపించింది. ఎందుకంటే, పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు గాని, ఆర్‌.ఎ్‌స.సుదర్శనం ప్రభృతులు గాని వారివారి విమర్శనా రచనలలో ఎక్కడా అవధాన ప్రక్రియను కించపరిచే అంశాలు ప్రస్తావించలేదు. పైగా వారీ ప్రక్రియను ఎంతో ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. ‘శిల్పప్రభావతి’ అన్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి సిద్ధాంత గ్రంథం తెలుగు ప్రబంధాలపై పరిశోధనలు చేసేవాళ్ళకు శిల్పసంబంధమైన చర్చ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్న మా గురువుగారు జి.యన్‌.రెడ్డిగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే ఆ సిద్ధాంతగ్రంథం అంత సైద్ధాంతిక శిల్పశోభితం కావడానికి కారకులు, ప్రేరకులు రాచపాళెం వారికి పీహెచ్‌డీ పర్యవేక్షకులైన ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు- అన్న అంశాన్ని రాచపాళెం వారు కూడా త్రోసి పుచ్చలేరు.
‘ఆవేశానికి ఆస్కారం ఉన్న సందర్భాలలో కూడా బ్యాలెన్స్‌ కోల్పోకుండా విమర్శ రాయగలగటం ఆయన ప్రత్యేకత’- అన్న కిన్నెర శ్రీదేవి మాటల్లో సత్యం ఉన్నట్లు నేను భావించలేను. ఎందుకంటే, అవధాన ప్రక్రియను కించపరిచే రాచపాళెం వారి విమర్శనా ధోరణిలో పూర్తిగా బ్యాలెన్స్‌ లోపించింది. ఇక్కడ నేను మరొక అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధునాతన కవితా ప్రకియలను నిబద్ధతతో అధ్యయనం చేసిన పరిశోధక విమర్శకునిగా నేను మనఃపూర్వకంగా అంగీకరిస్తాను. కాని ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయాలను అంతే నిబద్ధతతో వారు అధ్యయనం చేయలేదు- అనడానికి వారి విమర్శన గ్రంథాలలోనే నేను చాల ఉదాహరణలు చూపగలను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు సహృదయంగా ముందుకు వస్తే వారితో నేను ఈ విషయికంగా ముఖాముఖి చర్చకు కూడా సంసిద్ధంగా ఉన్నానని పత్రికాముఖంగా రసజ్ఞ విమర్శకలోకానిక మనవి చేస్తున్నాను.
మేడసాని మోహన్‌
99089 77763
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment