రసమయ కవితా శకటం రాళ్ళ బండి కవితా ప్రసాద్

రసమయ కవితా శకటం రాళ్ళ బండి కవితా ప్రసాద్

ఆ చిరునవ్వు, ఆ ఆత్మీయ పలకరింపు ,ఆ గాఢాలింగనం  చిన్నలపై అమితాసక్తి ,పెద్దల  యెడ అపరిమిత గౌరవ మర్యాద ,మహాకవులెవరైనా పాదాభివందనం చేసే  సంస్కారం  ,కట్టులో బొట్టులో ,భాషలో ,చమత్కారం లో తనదైన హుందా తనం ,అధికారిననే గర్వం కిన్చిత్తు కూడా కానరాని భాషా సంస్కృతీ సేవా పరాయణం ,ఏ హోదాలో ఉన్నా ఆపదవికే గౌరవం సంతరించిపెట్టిన మూర్తి మత్వం స్వర్గీయ రాళ్ళ బండి కవితా ప్రాసాదీయం .ఆయన మనల్ని ఒక సారి చూస్తె చాలు మనసులో చిరస్థాయిగా నిలుపుకొనే జ్ఞాపకం ,మళ్ళీ కనిపిస్తే చక్కగా  పేరు తో సంబోధించి ఆత్మీయతను కురిపించే సౌహార్ద్రత శ్రీ కవితా ప్రసాద్ సద్గుణ లక్షణం .ఆ చిరునవ్వు ఆగిపోయింది .ఆ సహృదయత మాసిపోయినది. ఆ కవితా శకటం ఆగిపోయింది .ఆ దరహాస ప్రసాదం కనుమరగైంది .ఒక మన కృష్ణా జిల్లాకే కాదు ,ప్రపంచం లోని తెలుగు వారందరికీ కడుపు కోతగా మిగిలి పోయింది .ఆ మహా కవి శ్రేస్టూని పాండిత్య  ,ప్రకర్షకు నీరాజనాలు .’’జయన్తితే సుక్రుతా ‘’ అన్నదానికి సరైన నిర్వచనం కవితా ప్రసాద్ .

సుమారు ఇరవై ఏళ్ళ క్రితం బందరులో నా అనుంగు మిత్రులు, గురు తుల్యులు మా కుటుంబ మిత్రులు  ,మార్గ దర్శి ప్రఖ్యాత రచయితా, అందునా కమ్మని తెలుగు కధల రాజనాలు పండించిన స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారి షష్టి పూర్తీ మహోత్సవానికి నన్ను  నా శ్రీమతి ని ఆప్యాయం గా ఆహ్వానించి ,ఆ రోజు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ చేసే  గణిత అష్టావధానానికి ఒక ప్రుచ్చకుడిగా కూడా నన్ను ఉండమని కోరారు .అలాగే మేమిద్దరం ఉదయమే బయల్దేరి బచ్చుపేటలో ఉన్న మూర్తి గారింటికి వెళ్లాం .అప్పటికే క్రతువు జరుగుతోంది .కాఫీ టిఫిన్లు అయిన తర్వాత అక్కడికి చేరిన నాలాంటి వారిని వారింటి దగ్గరలో ఉన్న డా. శ్రీ మాదిరాజు రామ లింగేశ్వర రావు గారింటికి వారి అబ్బాయిని నాకు తోడూ ఇచ్చిపంపారు .అప్పటికే అక్కడ శ్రీ రావి రంగారావు గారు మొదలైన వారంతా సమావేశమై కవితా ప్రసాద్ గారు మధ్యలో పరివేష్టించి ఉండగా కబుర్లు చెప్పుకొంటున్నారు అందరికి కాఫీలు ఇచ్చారు .అదే మొదటి సారి రావి వారిని కవితాప్రసాద్ గారిని రామలింగేశ్వర రావు గారినిచూడటం .ఒకరినొకరం పరిచయం చేసుకోన్నాం శ్రీ కవితా ప్రసాద్ తానూ అమ్మవారిపై రాసిన ‘’కాదంబినీ ‘’శతకం అందరి తో బాటూ నాకూ అందజేశారు .అందులో తానూ రాసిన పద్యాలను ఏంతో  హృద్యం గా చదివి వినిపిస్తూ తానూ అందులో పొదిగిన లోకోత్తర భావాలను అలవోకగా విశదీకరిస్తున్నారు .ప్రతి పద్యానికి మేమందరం ఆనందించి కరతాళ ధ్వనులతో అభినందించాం .   దాదాపు రెండుగంటలపాటు ఆ రసమయ భక్తీ చిన్ముద్రలో ఉండిపోయాం .తర్వాత తానూ చేసే గణితావధానం విశేషాలను ప్రుచ్చకులుగా ఎవరి పాత్ర ఏమిటి అన్న వివరాలను వివరించి  ట్రయల్ గా   అవదానం చేసిమాకు స్పూర్తికల్గించారు .ప్రుచ్చకులలో శ్రీ చింతలపాటి మురళీ కృష్ణ ,పూర్ణ చంద్ర రావు సోదరులు ,స్వర్గీయ కే వి ఎల్ యెన్ నరసింహా చార్యులు వగైరా లున్నట్లు జ్ఞాపకం .చింతలపాటి సోదరులతో అప్పటికే అయిదారేళ్ళనుంచి పరిచయం ఉంది ఉయ్యూరు సాహితీ మండలికి వారిద్దరూ వచ్చి ప్రస్సంగిమ్చటం కవి సమ్మేళనాలలో పాల్గొనటం జరిగింది. అందులో మురళీ కృష్ణ మూర్తిగారికి స్వయానా అల్లుడు .జూనియర్ తెలుగు పండిట్ గా ఉండేవారు .ఆయన వివాహానకి కూడా నేను వెళ్లాను . తర్వాత అందరం కలిసి  నడుచు  కొంటూ వెళ్లి మూర్తిగారింట షడ్రసోపేతమైన  విందు ఆరగించాం .సాయంత్రం ఆరు గంటలకు కవితా ప్రసాద్ గారి అవధానం టౌన్ హాల్ లో ..కాసేపు మూర్తిగారి౦టనే విశ్రమించి  మొహాలు కడిగి అవధానానికి హాజరయ్యాం .Untitled

మూర్తి గారి దంపతుల సమక్షం లో అవధానం జరిగింది .అందరూ వారికి పద్య రూప శుభా కాంక్షలు అందిస్తే నేను  దీర్ఘమైన వచన కవితలో అభినందన సుమమాల అల్లి సమర్పించాను పద్యకవులకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో నాకూ అంతే అభినందన దక్కింది .కవితా ప్రసాద్ నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు తో పట్టు బట్టలు ధరించి ఆసీనులై మందస్మిత వదనార విందులుగా ఉన్నారు .రావి రంగారావు గారు నిర్వాహకులు .ఆయన ప్రసాద్ గారికి బి ఇ డికాలేజిలో గురువు ..ఆ గురు శిష్య బాంధవ్యం వర్ణనాతీతం .అమ్మవారిని స్తుతించి కవితా ప్రసాద్ గారు అవధాన ప్రక్రియ ప్రారంభించారు .ప్రశ్న అడగటం ఆలస్యం పద్యం వారి నోట ప్రవాహమై ప్రవహించింది .అప్రస్తుత ప్రసంగం నరసింహం గారు చేసిన జ్ఞాపకం .అందులో ఆయన ఆరితేరిన వారు .నల్లేరు మీద నడకలా హాయిగా అపరిమిత వేగం గా కవితా వర్షం కురిపించారు .ధారణ కూడా నిమిషాలమీద ,ఎక్కడా తడుము కోకుండా సాగించి అందరి ప్రశంసలను అందుకొన్నారు కవితా ప్రసాద్ గారు .ఇంత త్వరగా అవధానం పూర్తీ అవుతుందని నేనూహించలేదు .అదీ కవితా ప్రసాద్ సామర్ధ్యం  .అందరం అవధానిగారిని ప్రశంసిమ్చాం ..మూర్తిగారు అవధానిగారికి గొప్ప సత్కారం చేసి ప్రుచ్చకులైన మాకు కూడా సన్మానం చేసి తృప్తి పరచారు .రాత్రికి ఉయ్యూరు తిరిగి వచ్చేశాం .అప్పటికి నాకు ఇది రెండవ అవధానం .అంతకు ముందు రెండేళ్ళ క్రితం నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గ ఉన్నప్పుడు నూతులపాటి వారు శ్రీ  వర్దపర్తి వారితో అవధానం చేయిస్తే చూడటానికి వెళ్ళిన నేను అప్రస్తుత ప్రసంగం చేయటానికి ఎవరూ ముందుకు రాక పొతే నేనే చేశాను .ఆ తర్వాత వర్ది పర్తివారి శాతావదాననికి చల్లపల్లి లో ప్రుచ్చకుడిని ఇది చింతలపాటి సోదరులు నిర్వహించిన కార్యక్రమం దీనికి చివరి రోజున శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారు కూడా విచ్చేసి ఆశీర్వదించారు .

ఆ తర్వాత చింతల పాటి సోదరులు భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో కూచిపూడి మొవ్వ కోసూరు చల్లపల్లి అవనిగడ్డ మొదలైన చోట్ల అవధానాలు సాహితీ సదస్సులు నిర్వహించే వారు .రావి వారు ,ప్రసాద్ గారు తప్పక హాజరై ప్రోత్సహించేవారు .ఇలా చాలా సార్లు కవితా ప్రసాద్ గారిని కలుసుకోవటం జరిగింది .ఒక సారి శ్రీ రావి రంగారావు గారు శ్రీ కవితా ప్రసాద్ గారి చేత బందరులో శతావధానం చేయించారు .అందులో నన్ను ప్రుచ్చకునిగా నియమించారు .అందరికి టిఫిన్లు భోజనాలు లడ్డూలు తో పెళ్లి విందు .ఉదయం నుండి సాయంత్రం వరకు అవధానం .మర్నాడు ధారణా దీనికి శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ప్రత్యేకం గా విచ్చేసి అవధాని ధారణకు అబ్బురపడి మనసారా ఆశీర్వదించారు .జ్ఞాపికలు అందజేశారు. రాత్రి భోజనం తర్వాత ఇంటికి వచ్చాను .రెండు రోజుల అవధానం లో కవితా ప్రసాద్ ఎక్కడా ఎప్పుడూ చిర్రు బుర్రూ ఆడింది లేదు .ఎంతటి కష్టతర సమస్య అయినా అతి సునాయాసం గా సమాధాన పద్యాలు అల్లి సెహభాష్ అని పించారు .అప్రస్తుతం శృతి మిన్చుతున్నా ఏమీ అనేవారు కాదు .తన ప్రియ సంభాషణ తో వారి నోటికి తాళం వేసేవారు .ఆ శతావధానం చాలా పేరు తెచ్చింది కవితా ప్రసాద్ గారికి .

దీని తర్వాత కవితా ప్రసాద్ గారి చేత ద్విశతావదానానికి రంగారావు గారు పూనుకొని ప్రుచ్చకులను ఎన్నుకొని రెండు సార్లు బందరులో సమావేశ పరచి అవధానం తీరు తెన్నులను వివరించి కర్తవ్యోన్ముఖులను చేశారు .ఈ ద్విశతావధానం విజయ వాడలో జరిగింది .ఆనాటి  విద్యా మంత్రి శ్రీ కడియం శ్రీహరి మొదలైన ప్రముఖులు వచ్చారు.నేనూ మా ఆవిడా కూడా ప్రుచ్చకులుగా ఉన్నాం .మూడు రోజుల కార్యక్రమం అని గుర్తు .ఏర్పాట్లు ఘనం గా ఉన్నాయి. విందూ అదిరింది .రోజూ ఉయ్యూరు నుండి వచ్చి వెళ్ళేవాళ్ళం ఇద్దరం .మూడవ రోజు ధారణా రాక్షసులు సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహా రావు గారు విచ్చేశారు. వారి సమక్షం లో శ్రీ కవితా ప్రసాద్ పద్యాలను ధారణ  చేసి నరసింహారావు గారితో సహా అందరినీ అమితాశ్చర్యం లో పడేశారు .గరికపాటి ఈ అవధానిగారిని మెచ్చుకొంటూ ఆశీస్సులను ప్రశంసలను పద్య రూపం లో చదివి కవితా విందు భోజనం పెట్టారు .దీనికిఏకాంబరాచార్యులు బేత వోలు వారు ,ఆశావాదివారు వగైరా కవి శ్రేస్టులు కూడా హాజరై నిండుదనం చేకూర్చారు .శత ద్విశత అవధానాల పుస్తకాలు కూడా రంగా రావు గారు తెచ్చిన గుర్తు .  ఈ విధం గా కవితా ప్రసాద్ గారితో సాన్నిహిత్యం ఏర్పడింది .అప్పటి నుండి ఎక్కడ సభలో కనిపించినా ‘’మాస్టారూ బాగున్నారా ?అని ‘’అని పలకరించేవారు చిరు నవ్వుతూ. చిరు దరహాసమే ఆయన సొత్తు .

హైదరాబాద్ లో జరిగే సభలకూ వీలయితే వెళ్ళేవాళ్ళం. అక్కడా వారి అవక్ర  కవితా విక్రమాన్ని ప్రదర్శించి మెప్పు పొందేవారు .కృష్ణా జిలా రచయితల సంఘం జాతీయ సదస్సు నిర్వహించినపుడు వారు వచ్చి పాల్గొన్నారని జ్ఞాపకం .మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభకు ఊహ వ్యూహం  నిర్వహణ ప్రభుత్వ సహకారం అందించటం లోను సభలు అద్వితీయం గా నిర్వహించేట్లు తోడ్పడటం లోను సాంస్కృతిక శాఖ కార్య దర్శిగా శ్రీ కవితాప్రసాద్ చేసిన సేవలు చిరస్మరణీయాలు .గొప్ప కార్య నిర్వాహకులు అనిపించారు .ప్రభుత్వం అందజేసిన ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపం లో అందరి కరతాళ ధ్వనుల మధ్యా రెప రెప లాడిస్తూ వేదిక మీద చూపించి ఉత్సాహ పరచారు .ఆ దృశ్యం మరువలేము .దీని ఆధారం గా రెండో ప్రపంచ సభలూ మనవాళ్ళు నిర్వహించారు .ఇటీవల ఫిబ్రవరి లో జరిగిన మూడవ సభలలో శ్రీ కవితా ప్రసాద్ ను శ్రీ ఇనాక్ గారిని ,ఆచార్య శ్రీ శలాక శర్మగారు వంటి ప్రసిద్ధులను  తప్పించే  వ్యూహం చేసి గొప్ప అపఖ్యాతి పొందారు  నిర్వాకం లో సింహ భాగం లో ఉన్న ఒక పంచ కట్టాయన, .దీనితో వీరికి తీవ్ర నిరాశా .నిస్పృహా ఆవేదనా కల్గింది .’’రచయితల సంఘం సూర్య చంద్రులు’’ చేస్ట లుడిగి తమ చేతుల్లోంచి సభా నిర్వహణ ఎవరో లాగేసుకొని తమను బైపాస్ చేసినట్లు పాపం దీన వదనులయ్యారు .మహా సాహితీ మూర్తులకు తెలుగు నేల మీద తీవ్ర నిరాదరణ జరగటం క్షంతవ్యం కాదు .జరిగిన తప్పు మళ్ళీ జరగరాదు .

ఇలాంటి మనస్తాపమే కాక తనను తెలంగాణా కేడర్ లో చేర్చటం తో శ్రీ కవితా ప్రసాద్ తీవ్రం గా కలత చెంది వ్యాకుల మనస్కులయ్యారు .సాంస్కృతిక శాఖ నుండి మార్చటమూ ఆయన్ను బాగా బాధించింది . ‘’బాస్ ‘’పెత్తనమూ నచ్చి ఉండదు .దీనితో ఆరోగ్యమూ దెబ్బ తిన్నది .మృతువుతో భీకరం గా ఇరవై రోజులు పోరాడి ఓడిపోయి దివిజ లోకం చేరారు .ఆ మహనీయునికి ఈ జాతి ఏంతో రుణ పడి ఉంది .వారికి గౌరవ స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలి .వారి పేరిట ప్రభుత్వం పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి .

అంతర్జాలాన్ని అద్భుతం గా ఉపయోగించుకొని సాహిత్యానికి గొప్ప ఊపు తెచ్చిన వారు శ్రీ కవితా ప్రసాద్ .తన ఫేస్ బుక్ కు ‘’గ్రంధ ముఖి ‘’గా నామకరణం చేసి ‘’లక్ష పద్యార్చనం ‘’చేయించిన కవితా సాహసి. దేశ విదేశాలలో ఉన్న కవులందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేశారు  అలాంటి  గొప్ప వ్యూహ కర్త .విజయవాడ రేడియో కేంద్రం ద్వారా’’ రేడియో అవధానం’’ నిర్వహించిన బయటి ఊరివారు అడిగిన ప్రషణలు పద్య రూపం లో సమాధానాలు చెప్పేవారు .ముఖ్యం గా యువకవులకు యువ అవధానులకు ఆయన గొప్ప మార్గ దర్శి . దీనికి స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సహకారం బంగారానికి వన్నె తెచ్చినట్లయింది .ఆంద్ర ప్రాంతం లోనే కాక తెలంగాణాలోనూ అవధాన ప్రక్రియ నిరంతరం కొనసాగించి 500 అవధానాలు చేసిన ఘన కీర్తి సాధించారు .ఊరికే అవధానాలు చేసి ఊరుకోలేదు అవధాన ప్రక్రియ పై యువకులకు ఉత్సాహం కలిగించటానికి ‘’అవధాన విద్య –ఆరంభ వికాసాలు ‘’,మొదలైన గ్రంధాలు రాశారు .ఒంటరిపూల బుట్ట ,పద్య మండపం ,అగ్ని హంస ,ఇది కవి సమయం ,’’సప్త గిరి ధామ కలియుగ సార్వ భౌమ శతకం ,వేద విజ్ఞాన లహరి ,ఉపనిషత్ సుధాలహరి ,తాను జన్మించిన నెమలి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ వేణు గోపాల స్వామిపై ‘’నెమలి వేణుగోపాల శతకం ‘’మొదలైన రచనలు చేశారు శ్రీ కవితా ప్రసాద్ .వారిఅవదానలో అష్టావధానం గణితావధానం ,నవరసవధానం ,శతావధానం ద్విశతావధానం వంటి వైవిధ్య భరిత అవధానాలున్నాయి .ఎన్నో భువన విజయాలను ఆంద్ర దేశమంతటా ప్రదర్శించి తాను శ్రీ కృష్ణ దేవ రాయలుగా ఉండి సరస కవితా ఝరిని పారించి మిగిలిన కవులకూ తగిన ప్రాదాన్యతనిచ్చి భువన విజయాన్ని గ్రామోత్సవం చేసిన కార్య దక్షులు .అవధాన సరస్వతిని పూజించి ఊరేగించిన ఘన చరిత్ర శ్రీ కవితా ప్రసాద్ గారిది

స్నేహ శీలి సౌజన్య మూర్తి సాహసి రస హృదయులు ,అమితమైన ప్రేమాభిమానాలున్న వారు కర్తవ్య దీక్షా బద్దులు ,కార్య క్రమ విజయానికి  అకుంఠిత దీక్ష తో కృషి చేసినవారు తెలుగు భాషకు సంస్కృతికి భారతీయ ఆత్మకు ప్రతీకగా నిలిచిన పుంభావ సరస్వతి శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ అకాల మరణం ‘’నడి భానుడు’’ అకస్మాత్తుగా కుంగిపోయి కనుమరుగైనట్లు అనిపిస్తుంది ఆ దివ్య కవితాత్మ ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటు క్రమంగా తీరాలని భగవానుని కోరుకొంటున్నాను.వారిఅంతర్ ముఖత్వానికి గొప్ప ఉదాహరణ గా నిలిచే  ప్రసిద్ధ పద్యం తో ముగింపు పలుకుతున్నాను –

‘శ్రీ మాత్రు చిత్కళా శ్రీ వత్స లాంచన –ద్యుతి మణి ద్వీప ప్రయోగ సిద్ధి

శ్రీ చక్ర బిందు కేంద్రీయ సుదర్శన –చక్ర విభ్రమణ ప్రసార శక్తి

శ్రీంకార నాదవిస్తృత తరంగావ్రుత –శంఖాను నాద ప్రచండ గరిమ

శ్రీ పీఠ సంస్థిత సిత పద్మ సమ పాద –సందీప్త దివ్య  ప్రశస్త  శోభ

కలసి తిరు మంత్ర రూపమై వెలసితీవ –వైభవోద్దామ !శ్రీ దాస వార్ధి సోమ

ప్రణవ సుమ దామ !నిగమ పరాగ సీమ –సప్త గిరి ధామ !కలియుగ సర్వ భౌమ ‘’

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17 3-15 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ ”మానర్ ఫుడ్ ప్లాజా ”లో 16-3-15 సోమవారం రాత్రి శ్రీమతి చలసాని వసుమతి గారు ,మహా కధకులు శ్రీ విహారి గారికి మహా చిత్రకారులు శ్రీ వీర్రాజు గారికి చెరొక 25,౦౦౦ రూపాయల నగదు ను ”వసుమతి -మాధవ ”పురస్కారం గా అంద జేసిన దృశ్యమాలిక 

విజయవాడ ”మానర్ ఫుడ్ ప్లాజా ”లో 16-3-15 సోమవారం రాత్రి  శ్రీమతి చలసాని వసుమతి గారు ,మహా కధకులు శ్రీ విహారి గారికి  మహా చిత్రకారులు శ్రీ వీర్రాజు గారికి చెరొక 25,౦౦౦ రూపాయల నగదు ను  ”వసుమతి -మాధవ  ”పురస్కారం గా అంద జేసిన  దృశ్యమాలిక

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతిశ్రీ మన్మధ ఉగాది వేడుకలు -వార్త పత్రిక వార్తాకధానం 17-3-15

varta 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’పై   కవి సమ్మేళనం

సభలోని చిత్రాలు

76 వ సమావేశం గా సరసభారతి 15-3-15 ఆదివారం సాయంత్రం 4 గం .’లకు ఉయ్యూరు ఏ సి లైబ్రరీలో నిర్వహించిన ‘’శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు ‘’ఆద్యంతం నవరస భరితం గా జరిగాయి .విచ్చేసిన సాహితీ ప్రియులకు అతిధులకు ,సన్మానితులకు అందరికి ముందుగా ఆత్మీయ అల్పాహార విందు నిచ్చి తేనీరు తో ఎండవేడిలో శ్రమపడి వచ్చినందుకు కొంత ఉపశమనం కల్గి౦చా౦ . ముందే చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు ‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’అంశం పై  స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు, శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ, శ్రీమతి గుడిపూడి రాధికా రాణి ఆధ్వర్యం లో  కవి సమ్మేళనం ప్రారంభించాం .  ఇందులో స్మితశ్రీ గారిది పండిన అనుభవమైతే దత్తాత్రేయ శర్మగారిది  హాస్య చతుర సంభాషణా భరితం .గుడిపూడి ది బుడి బుడి నడకల అరంగేట్రం .ముందుగా మహిళలకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత పురుష కవులకు అవకాశమిచ్చాం .కవులు తమ తమ ద్రుష్టి కోణం లో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తీరు తెన్నులు ,ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్తితులు ,మిన్ను విరిగి మీద పడినట్లు హూద్ హూద్ తుఫాను సృస్టించిన విలయం దాన్ని తట్టుకొని ఆంధ్రజాతి నిలబడిన తీరు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం వగైరా విషయాలపై నిర్మొహమాటం గా  తమ మనోభావాలను  చక్కని చిక్కని  పది పంక్తులలో,నాలుగు  పద్యాలలో  ,పాటలుగా వచన కవిత్వంగా కవితలల్లి వినిపించి ఆమని హాయిని ఆరు రోజుల ముందే ఉయ్యూరు పట్టణానికి తెచ్చి నవ వసంతాన్ని చిమ్మారు .కవిత చదవగానే నా చేతులమీదుగాను , కవి సమ్మేళన నిర్వాహకుల చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశాం .జ్ఞాపిక కూడా నవ్యాంధ్ర ప్రదేశ్ నేపధ్యం గా బెజవాడ ప్రకాశంబారేజ్ ,తెలుగుతల్లి విగ్రహం ,పైన ‘’చిలక పచ్చని రౌతు మన్మధుని ‘’చిత్రం ,మామిడి పిందెలు ,చిగుళ్ళు ,ఉగాది వేపప్రసాదం ఉన్న  రజత పాత్ర ,అన్నిటికి మించి ఉగాది వచ్చిందని తెలిపే కోయిల కూత ,మధ్యలో ఎడమ చివర అడివి బాపిరాజుగారు , తర్వాత మామిడి పూడి వెంకట రంగయ్యగారు ,ఆ తర్వాత పారుపల్లి రామకృష్ణయ్యగారు కుడి చివర దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ,వీరికి దిగువన సాహితీ సమరాంగణ సార్వ భౌముడు  కృష్ణ దేవరాయలుగారి తో జ్ఞాపిక ను సందర్భోచితం గా తయారు చేసిచ్చారు మా జర్నలిస్ట్ మిత్రుడు ప్రకాష్ .చాలా హుందాగా హృదయంగమం గా జ్ఞాపిక తయారై అందరిని అలరించింది .సుమారు రెండుగంటల సేపు కవి సమ్మేళనం ఆహ్లాదభరితం గా కరతాళ ధ్వనుల మధ్య ప్రశంసా వాక్యాలతో జరిగి విచ్చేసిన కవి బృందానికి అత్యంత ఆనందాన్ని కల్గించిందని వారి  వదనాలలో   ప్రస్పుటిమ్చిన హావ భావాల వలన తెలిసింది. ధన్యోస్మి అనుకొన్నాను .

గ్రందాల  ఆవిష్కరణ

సాయంత్రం ఆరు గంటలకు గ్రంధా విష్కరణ ,పురస్కార ప్రదాన సభ మొదలు పెట్టాం .అధ్యక్షునిగా సరసభారతి ఆవిర్భావం ,ప్రగతిని శ్రీ మైనేని గోపాల కృష్ణగారి వితరణను క్లుప్తం గా వివరించి నేను రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ మైనేని వారికి అంకితం ఇస్తున్నవిషయం ,గ్రంధ రూపం గా వారి మేనకోడలు డా .శ్రీమతి జ్యోతి ,ఆమె సోదర సోదరీమణులు (అమెరికా)ఖర్చు భరించి వెలువరిస్తున్న సంగతి తెలియ జేశాను .ఈ గ్రంధాన్ని ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర మాజీ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆవిష్కరించి మొదటి ప్రతిని ఆచార్య శ్రీ శలాక రఘు నాద శర్మ గారికి అందజేశారు . గ్రంధం పై డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు సంక్షిప్తం గా   అందులోని విషయాలను సభా సదులకు అవగాహన కల్గించే రీతిగా మధుర మంజుల వాక్కులతో కవితాత్మకం గా వివరించి నిండుదనం చేకూర్చారు .146 మంది ప్రాచీన ,నవీన గీర్వాణ కవులపై రాసిన గ్రంథమని ,నాలుగు వందలకు పైన పేజీలతో బృహత్తరంగా వెలువడిందని ,రచయిత కృషి ఆదర్శప్రాయమని అన్నారు .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

త్యాగి కలం పేరుగల ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ గారు  ‘’త్యాగి ‘’పేరే’’డీలు +’పేరిట రాసి ముద్రణ ఖర్చులు భరించి ,సరసభారతి ద్వారా ప్రచురించిన పుస్తకాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఆవిష్కరించి మొదటి ప్రతిని నాకు అందజేశారు .దీనిని ప్రముఖ కవి కధకురాలు శ్రీమతి కోపూరి పుష్పాదేవిగారు సంక్షిప్త పరిచయం చేశారు .ఈ పుస్తకాన్ని స్వర్గీయ బాపు రమణ జంట కు అంకితం ఇవ్వటం ఏంతో సముచితం గా ఉందని వారిద్దరి పేర అంకితమిచ్చిన మొదటి గ్రంధం గా ఆంద్ర దేశం లో చిరస్తాయిగా నిలిచి పోతుందని అన్నారు .ఇందులోని పేరడీలు ,కవితలు రసభరితం అన్నారు . మైనేని వారు బాపు రమణ స్మారక పురస్కారాన్ని ఏర్పరచి సరసభారతి ద్వారా శ్రీ వేదగిరి రాంబాబు గారికి ,శ్రీ శీలా వీర్రాజు గారికి అందజేసి ఆంద్ర దేశం లో ఇలా వారిద్దరి పేరిట మొట్టమొదట పురస్కారం అందించిన ఘనత పొందాం .ఇప్పుడు ఈ  అంకితానికీ మేమే ముందున్నాం .గీర్వాణం ,పెరేడీలు రెండు గ్రంధాలను హాజరైన సదస్యుల౦దరికి అందజేశాం .రామడుగు వారి ముందుమాటలు ‘

ఉగాది పురస్కార ప్రదానాలు

స్వర్గీయ శ్రీమతి గబ్బిట భవానమ్మ శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారప్రదానం

సాయంత్రం ఆరున్నరకు శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది పురస్కార ప్రదానం ప్రారంభించాం .ముందుగా మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీమతి బ్బిట భవానమ్మ ,శ్రీ  మృత్యుంజయ శాస్త్రి గరాల స్మారక ఉగాది పురస్కారాన్ని మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి ప్రత్యేక ఆసనం పై ఆసీనులను చేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ,చందనం చేతులకు అలిమి ,తాంబూలాన్ని ఫల భరితం గా అందజేశాం నేనూ నా శ్రీమతి ప్రభావతి .తర్వాతా సెంట్ చల్లి శాలువా కప్పి పుష్పహారాన్ని వేసి నూతన వస్త్రాలుగా  పంచ ఉత్తరీయ౦  అందజేసి నగదున్నకవర్ చేతిలో ఉంచి, జ్ఞాపిక నందజేసి శిరసుపై గులాబీ రెక్కల వాన కురిపించి మా గౌరవాన్ని చాటుకున్నాం .మా ప్రక్కన  వేదికనలంకరించిన  పెద్దలందరూ నిలబడి వేడుక చేసి తామూ గులాబి రేకులను చల్లి మధురానుభూతి కలిగించారు .ఈ సంఘటన చిరస్మరణీయం గా నిలిచింది .ముందుగా నేనే శ్రీ ఆదిత్య ప్రసాద్ గారిని సభకు వారి సేవలను ప్రస్తుతిస్తూ ఆహ్వానించి ఆసీనులను చేశాను .సంగీత సరస్వతిని సన్మానించిన అనుభూతి గొప్పగా కలిగి కనులు చెమర్చాయి .

తర్వాత  ఆచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారిని శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి వారి పాండిత్య వైదుష్యాన్ని వివరిస్తూ వేదికపైకి ఆహ్వానించింది .మా దంపతులం శ్రీ శర్మగారికి పైన పేర్కొన్న విధంగానే అదే రీతిలో ఘనం గా సన్మానించి సర్సాభారతి ప్రచురణలన్నీ అందించాం .గీర్వాణ వాణిని సత్కరించిన మధురానుభూతికి లోనయ్యాం .

పిమ్మట కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారి సాహితీ ప్రస్థానాన్ని విశదీకరిస్తూ శ్రీ జి వేణుగోపాల రెడ్డి ఆహ్వానించారు .ఉచితాసనాసీనులను చేసి పైన చెప్పిన తీరునననే శ్రీ  సుబ్బారాగారిని సత్కరించి మా సహ్రుదయతను ఆత్మీయతను ,ఆప్యాయతను సాహిత్య సభా నిర్వహణ సామర్ధ్యానికి అందించిన పురస్కారం గా భావించాం .

గీర్వాణ గ్రంధానికి ‘’అంత రి౦ద్రజాలం ‘’పేర ముందుమాటలు రాసి ,వేదిక పై గ్రంధాన్ని పరిచయమూ చేసి  నాకు అత్యంత ఆప్తులైన డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి కవితా శ్రేస్టతను వారుపొందిన పురస్కారాలను వివరిస్తూ  శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ గారు ఆహ్వానించారు .శ్రీ శర్మగారికీ పై రీతిగానే ఘనం గా సత్కరించి మా అభిమానాన్ని చాటు కోన్నాం.తెలుగు కవితా సరస్వతీ సత్కారం చేశామని సంత్రుప్తిపొందాం .

చివరగా ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారి సాహితీ గరిమను విశిష్టతను వివరిస్తూ శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ఆహ్వానించారు .మన్నవ వారిని ఉచితాసీనులను చేసి పై విధం గా అన్ని హంగులతో సత్కరించి మా కున్న గౌరవాన్ని చాటుకున్నాం  .అంతర్ ద్రుష్టి తో లోకాన్ని చదివి విద్యార్ధుల  జ్ఞాన నేత్రాలను వికసింప జేసిన విశిష్ట సాహితీ మూర్తిని సంమాని౦ చామని మహదానందాన్ని పొందాం .

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ఉగాది ప్రత్యెక పురస్కార ప్రదానం

ముందుగా ‘’స్వయం సిద్ధ ‘’పురస్కారాన్ని శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్యవతి గారికి చందన తాంబూలాది సత్కారాలతో ,పుష్పాహారం తో చీరే జాకెట్ లతో శాలువాతో మేమిద్దరం మిగిలిన అతిధుల సహకారం తో అందజేసి సత్కరించాం .శ్రీమతి శివలక్ష్మి ఈమెను సభకు పరిచయం చేసింది .

ఉయ్యూరు పోస్ట్ మాస్టర్ శ్రీ గొట్టుముక్కల రామారావు గారిని ,మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా గారిని స్థాయి ఏమాత్రమూ తగ్గకుండా అందరికీ చేసినట్లే సన్మానించి వారి విశిష్ట సేవలను అందరికి తెలియ జేశాం .

సభ మధ్యలో ఉయ్యూరు ప్రధమ పౌరులు ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గారు విచ్చేసి సభకు నిండుదనం చేకూర్చారు .ఇంతమంది మహా కవి పండితులమధ్య తానూ కూర్చోవటం జీవితం లో మరచిపోలేని ఘట్టం అన్నారు .దుర్గాప్రసాద్ గారు తనకు బాగా తెలుసునని ఇంత పాండిత్యం ఆయనకు  ఉందని ఇంతమంది చెప్పే దాకా తానూ తెలుసుకోలేక పోయానని అని అందరి సన్మానాలు స్వయం గా దగ్గరుండి జరిపించి ఆనందాను  భూతి పొందారు .సన్మానాలు అయ్యేసరికి గులాబీ రేకుల రాసి పోగై  అందరి మనసులలో సంతోష గులాబీలు వికసించి నట్లయింది .

ప్రసంగ ప్రశంశలు

శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘’ఇలాంటి అనుభూతి తనకు చాలా తక్కువ చోట్ల మాత్రమె లభించిందని ఇక్కడి వీరి ఆత్మీయతకు మాటలు రావని సహృదయం తో చేసే సరసభారతి కార్యక్రమాలకు ఎన్నిటికో తానూ హాజరయ్యానని ,దుర్గాప్రసాద్ గారితో ఆత్మీయ మైత్రీ బంధం చాలా కాలం నుండి ఉంది’’అని  ఆనందంగా చెప్పారు .శ్రీ శలాక వారు ‘’తెలుగును మరచిపొవద్దని ,తనది బెజవాడ దగ్గర గొల్లపల్లి అని కృష్ణా జిల్లా వాసినని ఆకిరిపల్లి సంస్కృత కళాశాల విద్యార్దినని తమ వ్యాకరణ గురువు పేరి వారు ప్రపంచం లోనే గొప్ప వ్యాకర వేత్త అని వారిని మించిన వారు లేనే లేరని ,వారి శిష్యుడిని అని చెప్పుకోవటం అందరికి గర్వకారణమని ,ఆకళాశాల స్థాపకుల తల్లిగారు నిరాడంబరం గా జీవిస్తూ కళాశాల విద్యార్ధుల భోజబాలు అయ్యాయి అన్న గంట వినబడిన తర్వాతే భోజనం చేసేవారని అంతటి ఆదరణం విద్యార్ధులపై ప్రేమ ఎక్కడా చూడ లేదని కృతజ్ఞతా భావం గా తెలియజెసి  ఉయ్యూరు లొ తనకు జరిగిన సన్మానం స్వంత ఇంట జరిగినట్లు ఉంది అని సంతోషం గా చెప్పారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు సరసభారతి తాము ఎన్నో కార్యక్రమాలను కలిసి నిర్వహించామని ,ఉయ్యూరు అంటే తమకు సరస భారతి దుర్గాప్రసాద్ గారే గుర్తుకోస్తారని ఇక్కడి వారి ఆత్మీయత ముగ్ధులను చేస్తుందని ఏది చేసినా అంకితభావం తో చేయటం ప్రత్యేకత అని అన్నారు .శ్రీ రామదుగు వారు దుర్గాప్రసాద్ పై అభినందన పద్యాలు రాసి చదివి వినిపించి ప్రత్యేకమైన అనుభూతిని అందరికి కలిగించారు. ఆచార్య మన్నవ గారు తమకూ సరసభారతికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకొన్నారు ఇక్కడి వాతావరణం ఏంతో ఆహ్లాదం గా ,సహృదయం గా ఉందని కృతజ్ఞతలు తెలిపారు .శ్రీమతి సౌభాగ్య లక్ష్మి ఇందరి సమక్షం లో తనను ఆహ్వానించి గౌరవించి సత్కరించిస్వయం సిద్ధ  పురస్కారం అంద జేసినందుకు ‘’ఆంటీ అంకుల్ ‘’లకు కృతజ్ఞతలు అన్నారు .పోస్ట్ మాస్టారు శ్రీ రామా రావు గారు తమ పనిలో తామెప్పుడూ మునిగి ఉంటామని ,కాని అదొక సేవగా దుర్గా ప్రసాద్ గారు గుర్తించి పోస్టాఫీస్ చేస్తున్న సేవలకు ఈ విధం గా గౌరవం కృతజ్ఞత  కలిపించి  సిబ్బంది అందరి తరఫున తనను సత్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు .మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా ‘’సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం కార్యక్రమాలన్నిటిని తాను  వచ్చి రికార్డ్ చేసి మన చానల్ లో ప్రసారం చేశామని ఈ సంస్థ మర్యాదకు మన్ననకు తానూ పరవశించి పోతానని రిపోర్టర్ కు ఇంతటి ప్రాధాన్యతను కల్పించే సంస్కారం సహృదయత దుర్గా ప్రసాద్ గారిలో ఉందని చెమరించిన కనులతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .చివరగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్స్ది డా జి వి పూర్ణ చంద్ ‘’ఇంతటి సహృదయ వాతావరణం లో ఇంతమంది విశిష్ట సంగీత సాహిత్య కవి పండితులను స్వయం గా అభివృద్ధి చెంది ఆదర్శం గా నిలిచినా వారిని నిత్య జీవితం లో ఉద్యోగాలలో ఉంటూ విశిష్ట సేవలు చేసేవారిని గుర్తించి సత్కరించటం అపూర్వ విషయమని  దుర్గాప్రసాద్ గారు రాష్ట్ర దేశ పరిధులు దాటి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొని ఉయ్యూరుకే గర్వ కారణం అని ,సరసభారతి ప్రతి కార్యక్రమాన్ని నిర్దుష్టం గా మహా విశిష్టంగా నిర్వహిస్తుందని 75 ఏళ్ళ వయసులో ప్రసాద్ గారు ఒక ముఖ్య కార్య కర్తగా ,గ్రంధ రచయితగా వక్తగా ,బ్లాగుల నిర్వాహకునిగా విభిన్న పాత్రలలో రాణిస్తూ తమందరికి ఆదర్స్ధం గా ఉన్నారని తెలిపారు .

లైబ్రేరియన్ శ్రీ సంపత్ కుమార్ గారికి ,శ్రీమైనేని గోపాల కృష్ణగారికి ఆంధ్రా యూని వర్సిటీలో సహాధ్యాయి ,గురజాడ మాజీ సర్పంచ్ ,ప్రముఖ సంఘ సేవకులు ,జ్ఞాన వయో వృద్ధులు శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారిని  సత్కరించాం ‘’శ్రీ గురజాడ వారు’’సరస భారతి కార్యక్రమాలకు అబ్బుర పడి  ప్రోత్సాహం గా  సంస్థకు 1,000 రూపాయలు కానుకగా అందజేశారు కృతజ్ఞతలు ..గండిగుంట వాసి ,నాగార్జున విశ్వ విద్యాలయ మాజీ లైబ్రేరియన్ ప్రస్తుత హైదరాబాద్ నివాసి  శ్రీ సుంకర కోటేశ్వర రావు గారు నెల రోజుల ముందే సరసభారతికి రెండు వేలరూపాయలు (2,000-)చెక్ పంపి ప్రోత్సహించారు .వారికి కృతజ్ఞతలు . . శ్రీ గురజాడవారికి  , మాకూ మిత్రులు శ్రీ వీణెం గోపాల క్రిష్ణయ్యగారికి ,మాజీ డ్రిల్ మాస్టారు మా గురువుగారు  శ్రీ ఎస్ వి సుబ్బా రావు గారికి ,శ్రీ వి బి జి రావు ,శ్రీమతి శివలక్ష్మి ,శ్రీనివాస శర్మ ,,వేణుగోపాల్ ,మొదలైన వారందరికీ పుష్పహారాలు వేసి జ్ఞాపికలను అందజేశాం .దాదాపు నాలుగు గంటల సేపు సభ చాలా నిండుగా సుమారు తొంభై మంది హాజరీతో దేదీప్యమానం గా జరిగి అందరికి సంతృప్తి ని కలిగించి సరసభారతి ధన్యమైంది .

సభ అనంతరం పైన అందరికి విందు ఏర్పాటు చేశాం .పదార్ధాలు బాగా రుచికరం గా ఉన్నాయని మెచ్చి తృప్తిగా అందరూ భోజనం చేయటం మాకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని కల్గించింది .ఇలా మా ఉయ్యూరు కు  ఆరు రోజుల ముందే ఉగాది శోభ సరసభారతి కలిగిస్తే మా కవితాకోవిలలు కూడా ముందే హాయిగా నవ్యాంధ్ర ప్రదేశ్ లో నవ వసంత గానం చేసి పరవశాన్ని కల్గించాయి .శుభం భూయాత్ .

సందట్లో సడేమియా

ఎప్పుడూ ప్రార్ధన తో మొదలు పెట్టి ,జాతీయ గీతం తో ముగిసే మా సభలు ఈ సారి ఆ రెండూ’’పర’’వశం లో  మర్చిపోయి గొప్ప తప్పే చేశాం . అంతా అయ్యెదాకా  గమనించక పోవటం నాదే ప్రధాన దోషం అని సవినయంగా నా తప్పును ఒప్పుకొంటున్నాను .

పిలిచిన అతిదులలో  శ్రీ వై వి బి ,శీ  చలసాని  ,శ్రీకలిమిశ్రీ లు పురస్కార గ్రహీతలలో ‘’శ్రీకళాసాగర్ ,శ్రీమతి శిరీష ,,శ్రీ బాషా ,శ్రీ ఫజులాల్ మొయిద్ శ్రీమతి శ్యామలాదేవి ‘’పే’’రెడీ’’ రచయితా ‘’రెడీ’’ గా రాకపోవటం   బాగా నిరాశ పరిచింది .

ప్రపంచ సభలలో ఉయ్యూరు కవి సమ్మేళనానికి మేమొస్తాం మా పేరు రాయండి అని మరీ అడిగి రాయించుకొని ,ఆహ్వాన పత్రం లో పేరు చేర్చినా దాదాపు సగం మంది పైగా కవులు రాకపోవటం కొంత బాధ కలిగించింది .ఎవరికారణాలు వారికి ఉంటాయి .ఇంతే  అని సరి పెట్టు కోవటమే  మంచిది .

ఉగాది వేడుకలను ఇంటర్నెట్ ఉన్నవారందరూ చూసే వీలుగా లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశాం .దూరప్రాంతాలవారు విదేశాలలో ఉన్న తెలుగువారూ చూసి సంతోషించారు .కొందరు ప్రసారం బాగా ఉంది అంటే కొందరు  వీడియో’’ భేష్’’ ఆడియో ‘’ట్రాష్ ‘’అని సన్నాయి నొక్కులు నొక్కారు .ఎక్కువ మందినే సంతృప్తి పరిచింది అని అని పించింది .సరసభారతి కార్యవర్గ సభ్యులు ఇచ్చిన చక్కని సహకారం మరువలేనిది అందరికి కృతజ్ఞతలు .అందరి సమష్టి కృషి ఈ విజయానికి కారణం .’’వన్ మాన్ షో ‘’గా ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోన్నాననే అనుకుంటున్నాను .తీర్పు  చూసిన వారు చెప్పాల్సిన విషయం .

హై టెన్షన్

వ్యవధి రెండు నెలలో లోపే ఉంది మాకు ఈ రెండు గ్రందాల ముద్రణకు .శ్రీ చలపాక ప్రకాష్  గారింట్లో కుమార్తె వివాహం మార్చి 7 వ తేదీ తో బిజీ బిజీ .అయినా పట్టు వదలని విక్రమాదిత్యునిగా పుస్తకం డి టిపి చేయించి ,ముద్రణకు సమయానికి అందించి ఫోటోలుపెట్టి , కవర్ పేజీ డిజైన్ శ్రీకళాసాగర్ తో చేయించి, చివరి వారం రోజులూ పగలూ రాత్రీ విశ్రాంతి కూడా తీసుకోకుండా మాకోసం  శ్రమించి పుస్తకాలను రెడీ చేయించారు .బెజవాడలో పేరడీలను శుక్రవారం రాత్రికి ఏ యెన్ ఎల్ పార్సిల్ సర్వీస్ లో పంపితే అవి శనివారం ఉదయానికి రావాల్సింది రాలేదు నేనూ ప్రకాష్ గారు  ఇక్కడి పార్సిల్ సర్వీస్ ఆతను ఫోన్ల మీద ఫోన్లు పోద్దుటినుంచీ చేస్తూనే ఉన్నాం . శని వారం మధ్యాహ్నం పంపిస్తామని బెజవాడ వాళ్ళు చెప్పటం తర్వాత అక్కడ ఆఫీసులో ఇన్ కం టాక్స్ వారి రైడింగ్ ఉందని కనుక పంపలేదని తెలియటం తో మాకు హై టెన్షన్ వచ్చింది .చివరికి ఆది వారం అంటే సభ జరిగే రోజు పొద్దున  పంపితే ఉదయం పదింటికి వచ్చాయి .అప్పుడు వెళ్లి తెచ్చుకొని ఆవిష్కరణకు పదిపుస్తకాలు పాక్ చేయించాను .

ఇక అసలైన గీర్వాణం గ్రంధాలు చాలా పెద్ద సైజు కనుక  వాటిని అదే పార్సెల్ సర్వీస్ లో వేస్తె ,అందవు అని నేనూ ప్రకాష్ అనుకోని ,సభరోజు ఆదివారం మధ్యాహ్నం  ఒంటిగంటకు  ఆటోలో పంపే ఏర్పాటు చేసుకోన్నాం .అవి సరిగ్గా  రెండు గంటలకు  ‘’కులాసాగా’’ చేరాయి .వాటినీ పది కాపీలుఆవిష్కరణకు  పాక్ చేయించాను ..మొత్తం మీద శని, ఆదివారాలంతా టెన్షనే టెన్షన్.హై టెన్షన్ . అన్నీ తీరిపోయి మధ్యాహ్నం రెండుగంటలకు ఊపిరి పీల్చుకొన్నాం .ఇంతహడావిడి ఇంతవరకు ఎప్పుడూ లేదు .శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఏమిచ్చి మా ఋణం తీర్చుకో గలం  “?ఆయన సౌజన్యం సౌహార్ద్రతలకు జేజేలు పలకటం తప్ప .?మంచి మనీషి శ్రీ ప్రకాష్ .అలాంటి వారు నాకు, శ్రీ మైనేనిగారికి పరిచయమవటం మా అదృష్టం .సరసభారతి అదృష్టం .

శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-15- ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాళ్ళబండి ఇక లేరు

20150316a_002135004 D25550452

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో 76వ సమావేశం ఆదివారంనాడు (15 – 3 – 15 ) మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు, కవి సమ్మేళనం, గీర్వాణ కవుల కవితా గీర్వాణము, త్యాగి పేరడీలు గ్రందావిష్కర్ణ , ప్రముఖులకు సత్కారాలు, పురస్కారాల సభ నిర్వహించబడినది . సభలోని చిత్రాలు తిలకించండి .

సరసభారతి  ఉయ్యూరు ఆధ్వర్యంలో 76వ సమావేశం  ఆదివారంనాడు (15 – 3 – 15 ) మన్మధ నామ  సంవత్సర ఉగాది వేడుకలు, కవి సమ్మేళనం, గీర్వాణ కవుల కవితా గీర్వాణము,   త్యాగి పేరడీలు గ్రందావిష్కర్ణ , ప్రముఖులకు సత్కారాలు, పురస్కారాల సభ  నిర్వహించబడినది . సభలోని  చిత్రాలు తిలకించండి .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

abhinandan - 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1969 లో అంటే 45 ఏళ్ళ క్రితం కవిత -బందరు -సారస్వత సమితి ముద్రించిన తొలి పుస్తకం లో

సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం  ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి  వారు ముద్రించిన  మొదటి పుస్తకం లో చోటు  చేసుకొన్నది .దాన్ని    ,బందరుకు చెందిన సాహితీ మూర్తి శ్రీ జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి గుడిపూడి రాదికారాణి  సేకరించి ,భద్రపరచి జిరాక్స్ కాపీ తీయించి నిన్న జరిగిన శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో పాల్గొనటానికి వచ్చి నాకు ఏంతో  ఆత్మీయం గా ముద్దుముద్దు మాటలతో అందజేసింది ఆ కవిత రాసిన విషయం ఎప్పుడో మర్చిపోయాను అది సమితి వారు ముద్రించిన పుస్తకం లో ఉందన్న సంగతీ నాకు తెలీదు లేక గుర్తు లేదు .ఈ క వితను పది రోజుల ముందు  రాధికా రాణి నాకు  ఫోన్ లో చదివి వినిపించి నన్ను ఆశ్చర్య పరచింది  నా కవిత వేనకే    బాలబందు స్వర్గీయ శ్రీ బి వి నరసింహా రావు గారి ”మంచి గంధము -మల్లెపువ్వులు ”కవిత కూడా ఉంది . ఆకవిత ఆయనలాగానే మంచిగంధపు చల్లదనాన్ని మల్లె పూల సోయగ ,సౌరభాలను వె ద జల్లుతుంది దాన్నికూడా మీ కోసం అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్   69-1 001 69-2 001 balabandhukavita 001

Posted in కవితలు | Tagged | Leave a comment

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

ramadugu4 001 ramadugu5 001 ramdugu1 001 ramdugu2 001 ramdugu3 001 ramdugu6 001 ramdugu7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఉగాది వేడుకలు -వార్తాకధనం

bhumi enadu 001 sakshi 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దొరకునా… ఇటువంటి సినిమా ! ‘శంకరాభరణం’

దొరకునా… ఇటువంటి సినిమా !

Sakshi | Updated: March 15, 2015 00:14 (IST)
దొరకునా... ఇటువంటి సినిమా !

ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు… ఫైట్లూ లేవు. అంతా సంగీతం… అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా… భాషల ఎల్లలు దాటి 35 ఏళ్ళ క్రితమే దేశాన్ని జయించింది. ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది. ఎందరెందరో కళా ఋషుల తపఃఫలమైన ‘శంకరాభరణం’ ఇన్నేళ్ళ తరువాత తమిళంలోకి

డబ్ అయి, మొన్న శుక్రవారమే జనం ముందుకొచ్చింది. మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత ఒక భాష నుంచి మరో భాషలోకి డబ్బింగైన తెలుగు సినీ స్వర్ణాభరణంగా ఇప్పుడు మళ్ళీ చరిత్రకెక్కింది.

– డాక్టర్ రెంటాల జయదేవ

అది 1980… మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్ రోడ్ అణ్ణా ఫ్లై ఓవర్‌కు సమీపంలోని సత్యం సినీ కాంప్లెక్స్… అప్పటికి 20 వారాలుగా అందులో ఒక సినిమా విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. అయినా సరే  కొత్త రిలీజ్‌లా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్ స్టార్ సినిమానో కాదు. ఆ మాట కొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ, పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం… ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష, ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా… ప్రపంచ మంతటా తెలుగువారు ఇవాళ్టికీ శిరసెత్తి సగర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా… జాతీయ అవార్డుల్లో ‘స్వర్ణ కమలం’ (ప్రత్యేక విభాగంలో) అందుకున్న ఒకే ఒక్క తెలుగు సినీ ఆణిముత్యం…. పేరు – ‘శంకరాభరణం’.

అప్పట్లో మద్రాసులో 20 వారాలు ఆడిన ఆ తెలుగు కళాఖండం మదురై, సేలమ్ లాంటిచోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది. మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి, పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళలో 25 వారాలు ఆడింది. లక్షల్లో లాభాలు తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టంగా చరిత్రకెక్కింది.

మూడున్నర దశాబ్దాల తరువాత… మళ్ళీ అదే మద్రాసు. మొన్న శుక్రవారం మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో..! తెలుగు నుంచి అనువాదమైన తమిళ మాటలు, పాటలతో!! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో..!!

నిజానికి, 1979లో రికార్డింగ్, షూటింగ్ జరుపుకొని, అదే ఏడాది సెన్సారై, కొనుగోలుదార్ల కోసం వారాల కొద్దీ వేచిచూసి, చివరకు 1980 ఫిబ్రవరిలో విడుదలయ్యాక సంచలనం రేపిన కళాఖండమిది. ‘‘అలాంటి క్లాసిక్ ఇన్ని దశాబ్దాల తర్వాత… మరో భాషలోకి అనువాదం కావడం విశేషం. అదీ మాతృక రిలీజై విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగై, రిలీజవడం మరీ విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరగలేదు’’ అని ప్రముఖ సినీ, సంగీత, కళా విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు అన్నారు.

మొన్న మార్చి 13న ఏకంగా ఏడు తమిళ చిత్రాలు, 4 ఇంగ్లీష్ సినిమాల కొత్త రిలీజులతో పోటీ మధ్య వచ్చిందీ తమిళ ‘శంకరాభరణం’. ప్రస్తుతం తమిళనాట చెన్నైతో పాటు మదురై, కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో, 18 థియేటర్లలో ఈ తమిళ ‘శంకరాభరణం’ అభిరుచి గల ప్రేక్షకుల ఆదరణతో ఆడుతోంది. మరో విశేషమేమిటంటే, ఇప్పుడు చెన్నైలో తమిళంతో పాటు కొన్ని థియేటర్లలో తెలుగు వెర్షన్‌నూ విడుదల చేశారు. ఈ కొత్త రిలీజ్‌ను కళ్ళారా చూస్తున్న ఎనిమిది పదుల తమిళ సినీ చరిత్ర కారుడు ‘ఫిల్మ్‌న్యూస్’ ఆనందన్‌కు మూడున్నర దశాబ్దాల క్రితం ‘శంకరాభరణం’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ గుర్తే. ‘‘అప్పట్లో ఈ చిత్రానికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంగం)లో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖుల కోసం అక్కడ చిత్ర ప్రత్యేక ప్రదర్శన జరిగేదంటే, అప్పట్లో ఆ చిత్రం అందుకున్న గౌరవాన్ని అర్థం చేసుకో వచ్చ’’ని అప్పట్లో ఆ చిత్రానికి తమిళ పత్రికా సంబంధాలు చూసిన ఆనందన్ అన్నారు. భాషాభేదం లేకుండా ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించడా నికి విభిన్నమైన కథ, దర్శకత్వ ప్రతిభ, కట్టిపడేసే సంప్రదాయ సంగీతం, పాటలు – ఇలా అనేక కారణాలు కనిపిస్తాయి. అప్పుడందరూ కూనిరాగం తీసిన ఓంకార నాదాను సంధానమౌ గానమే… అన్న తెలుగు పాట ఇప్పుడు తాజా డబ్బింగ్ వెర్షన్‌లో ‘ఓంకార నాదంగళ్…’ అంటూ అదే గాయకుడు ఎస్పీబీ నోట తమిళంలో వినిపిస్తోంది. ఇంతకీ, ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాను ఎందుకు డబ్ చేసినట్లు?

ఈ తమిళ అనువాదం వెనుక అప్పటి తెలుగు చిత్ర ప్రదర్శన తాలూకు తీపి జ్ఞాపకాలెన్నో చోదకశక్తిగా పనిచేశాయి. చెన్నైలో బి.ఏ (తమిళ సాహిత్యం) చదువుకున్న నేటి తమిళ నిర్మాత ఎన్. రత్నంకి అప్పట్లో తమ తమిళ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ‘సత్యం’ థియేటర్‌కు తీసుకెళ్ళి తెలుగు ‘శంకరాభరణం’ చూపించిన రోజులు ఈ 54 ఏళ్ళ వయసులోనూ గుర్తే. ‘‘అప్పటి నుంచి ఈ చిత్రానికీ, దర్శకులు విశ్వనాథ్ గారికీ నేను వీరాభిమానిని. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చి, రెండు చిత్రాలకు దర్శకత్వం వహించా. ఆ పైన ఇంగ్లీషు చిత్రాల దిగుమతితో మొదలుపెట్టి, దాదాపు వెయ్యి దక్షిణ భార తీయ భాషా చిత్రాలను హిందీలోకి అనువదించా. డబ్బు సంపాదించా. అయితే, ఆత్మతృప్తి కోసం ‘శంకరాభరణం’ డబ్బింగ్ చేశా’’ అని ఈ తాజా తమిళ డబ్బింగ్ చిత్ర సారథి – నిర్మాత ఎన్. రత్నం ‘సాక్షి’కి వివరించారు.

నిజానికి, అప్పటి ఈ చిత్రానికి ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ నెగటివ్ దొరకలేదు. సౌండ్ నెగటివూ పాడై పోయింది. కానీ, రత్నం – తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లో ఆయనకు భాగస్వాములైన ఇతర మిత్రులు పట్టుదలగా ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రింట్‌ను తీసుకొన్నారు. దాన్ని డిజిటైజ్ చేశారు. కొత్త నెగటివ్‌ను సిద్ధం చేశారు. పాడైపోయిన సౌండ్ నెగటివ్‌నూ పునరుద్ధరించారు. ‘‘అప్పట్లో ఈ సినిమాను ప్రదర్శించిన ఢిల్లీ తమిళ సంఘం దగ్గర ఈ సినిమా ప్రింట్ ఉంది. ఒకే ఒక్క ప్రదర్శన తరువాత ఆ ప్రింట్ అక్కడే భద్రంగా ఉండిపోయింది. ఆర్కైవ్స్‌లోని ఆ ప్రింట్‌ను తీసుకొని, కొత్తగా డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడి యట్) చేసి, కలర్ కరెక్షన్ జరిపాం. తమిళంలో పాటలు రాయించి, రికార్డింగ్ చేశాం’’ అని రత్నం వివరించారు.

తెలుగు మాతృకలో పాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అవే పాత్రలకు తమిళంలోనూ పాటలు పాడించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో ఆ ఉద్దండు లందరూ దాదాపు పారితోషికం తీసుకోకుండానే పాడడం మరో విశేషం. ‘ఏ తీరుగ ననుదయ చూచెదవో’, ‘మానస సంచరరే’ లాంటి సంప్ర దాయ కీర్తనల్ని అలాగే ఉంచేసి, తెలుగులో వేటూరి రాసిన మిగిలిన పాటలన్నీ తమిళంలో కొత్తగా రాయించుకొన్నారు (రచన: రాజేశ్ మలర్ వణ్ణన్, డాక్టర్ నావేంద్రన్). ఓ సంగీత దర్శకుడి (రాఘవ్) సారథ్యంలో కొత్తగా రికార్డింగ్ చేశారు. రత్నం మాటల్లో చెప్పాలంటే, ‘‘దాదాపు 30 రోజుల డబ్బింగ్, డి.టి.ఎస్‌లో రీరికార్డింగ్ – ఇలా అన్ని చేసేసరికి ఒక కమర్షియల్ సినిమాకయ్యే ఖర్చు అయింది.

అయితేనేం, తమిళ (డైలాగ్స్: రామకృష్ణన్) ‘శంకరా భరణం’ ఈ తరంవారికి కొత్త తమిళ సినిమా చూస్తున్న అనుభూతినిస్తుంది.’’ ‘పి.ఎక్స్.డి’ లాంటి ఆధునిక డిజిటల్ ప్రదర్శన విధానంతో ప్రింట్ల ఖర్చు లేకపోవడం, వారు కూడా ఈ కళాఖండాన్ని తక్కువ రుసుముకే డిజి టల్‌గా చూపడం కలిసి వస్తున్నాయి. వెరసి కాసుల కోసం కాక కళ కోసం చేసిన ఈ డబ్బింగ్ విదేశాలకూ వెళుతోంది.

భాష తెలియకపోయినా, తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ చిత్రానికి అప్పట్లో జరిగిన అభినందన సభలో సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస య్యర్ మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించ డానికి నూరేళ్ళలో మా మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ చేయలేని పనిని ఒక్క ‘శంకరాభరణం’ చేసింది’’ అని ప్రశంసించారు. అందుకే, సినీ చరిత్రలోనే ‘శంకరా భరణం’ ఒక చరిత్ర. ఆ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో రావడం మరో కొత్త చరిత్ర. ఈ కొత్త చరిత్రకు దోహదపడ్డ తమిళ నిర్మాత రత్నం అన్నట్లు, ‘‘కావ్యాలూ, ఇతిహాసాలూ ఎన్నేళ్ళయినా నిత్యనూతనం. వెండితెర కావ్యం ‘శంకరాభరణం’ సరిగ్గా అలాంటిదే!’’
అందుకే, దొరకునా… ఇటువంటి…సినిమా!

‘‘అప్పట్లో ‘శంకరాభరణం’ చిత్రం ఇంత గొప్పగా రావడానికి ఎంతోమంది కారణం. ఈ సినిమా కోసం అందరూ ఓ కుటుంబంలా కష్టపడి పనిచేశారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయలేం. మళ్ళీ నన్నే ఈ సినిమా తీయమన్నా ఇంత అద్భుతంగా వస్తుందా అన్నది సందేహమే. మనకున్న ఘన సంగీత వారసత్వం గురించి ఈ తరానికి తెలియజెప్పడానికే ఈ చిత్రం తీశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా చాలామంది ‘శంకరాభరణం’కి ముందు, ‘శంకరా భరణం’కి తర్వాత అంటారు. ఇప్పుడు ‘శంకరాభరణం’ తమిళ రూపం చూస్తుంటే, మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా గురించి మాట్లాడడానికి, చెప్పడానికి ఎన్నెన్నో విషయాలున్నాయి.’’
– ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్, ‘శంకరాభరణం’ చిత్ర దర్శకుడు

‘‘ఆ రోజుల్లో అందరూ నిరుత్సాహపరిచినా మా ప్రయత్నం తెలుగు రూపంలోనే తమిళ నాటా అద్భుత ఆదరణ పొందింది. ఉత్తమ చిత్రం, సంగీతం, గాయనీ, గాయకుల (మహదేవన్, వాణీ జయరామ్, ఎస్పీబీ) విభాగాల్లో జాతీయ అవార్డులందుకున్నాం. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ మాటలు, పాటలతో చూసి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.’’
 – ఏడిద నాగేశ్వరరావు, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత  

‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం ‘శంకరాభరణం’ తెలుగు చిత్రానికి మద్రాసులో రికార్డింగ్ ఎక్కడ జరిపామో (అప్పట్లో విజయా డీలక్స్. ఇప్పటి పేరు ఆర్.కె.వి. స్టూడియో), సరిగ్గా అక్కడే ఇప్పుడీ తమిళ డబ్బింగ్ వెర్షన్ పాటలు విడుదలయ్యాయి. నేను 33 ఏళ్ళ వయసులో ఉండగా, తెలుగులో ఈ పాటలు పాడి, రికార్డ్ చేశా. సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో ఇప్పుడీ తమిళ గీతాలు ఆలపించా. ముప్ఫై అయిదేళ్ళ నాటి సినిమా ఇప్పుడు డబ్బింగ్ చేయడమే ఒక విశేషమైతే, అప్పుడు పాడిన నేనే మళ్ళీ ఇప్పుడివీ పాడడం మరో విశేషం. ఇలాంటి భాగ్యం ప్రపంచంలో నా ఒక్కడికే దక్కిందనుకుంటా. అన్నీ అనుకొని చేసేవి కాదు. ‘శంకరాభరణం’ లాంటి కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి… అంతే!’’
– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ అవార్డందుకున్న నేపథ్య గాయకుడు

ఎల్లలు దాటిన బాక్సాఫీస్ విజయం

⇒తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ సినిమాలు అయిదింటి (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’) తరువాత రూ. కోటి వసూళ్ళు సాధించిన తొలి సినిమా ‘శంకరాభరణ’మే!
⇒తెలుగు నాట 4 (విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్) కేంద్రాల్లో నేరుగా రజతోత్సవం జరుపు కొంది. మరో 5 కేంద్రాల్లో నూన్‌షోలతో పాతికవారాల పండుగ చేసుకుంది. విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు, హైదరాబాద్‌లో షిఫ్టులతో 350 రోజులాడింది.
⇒హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ చిత్రం ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (సఫైర్)లో, ఉదయం ఆటలతో  596 రోజులు ఆడి, చెరగని రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడు అంతటా బాగా ఆడింది.
కన్నడ సీమలో బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు.
⇒ అప్పట్లో తమిళనాడు, కేరళ హక్కుల్ని తమిళ నటులు మనోరమ, మేజర్ సౌందరరాజన్ కొన్నారు. ‘ఏ.వి.ఎం’ చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు హక్కుల్ని మనోరమ వాళ్ళ నుంచి కొన్ని వేలకు కొనుగోలు చేశారు. మలయాళ డైలాగులు, తెలుగు పాటలతో రిలీజై కోట్లలో లాభం తెచ్చింది. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మలయాళ సీమలో ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు వార్త మరియు సాక్షి -పత్రికా కధనం

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు వార్త మరియు సాక్షి -పత్రికా కధనంpaper coverage 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

సాహిత్యాభిమానులందరికీ ఉగాది శుభా కాంక్షలు ,అభినందనలు .సరసభారతి –సాహిత్య సంస్కృతీ సంస్థ 24-11-2009 నప్రారంభమైనది . అయిదేళ్లుగా సాహితీ సేవ చేస్తూ  అరవ ఏడాది లోకి అడుగుపెట్టింది అని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .సరసభారతి ప్రచురించిన ‘’సిద్ధ యోగి పుం గవులు ‘’,మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలలో మొదటి నుంచి అప్పటిదాకా అంటే అరవై వ సమావేశం దాకా జరిగిన ప్రగతిని వివరం గా తెలియ జేశాం .ఆ తర్వాత చేసిన కార్యక్రమాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను .

21-5-2014  బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్ర్రీ మతి కొమాండూరి కృష్ణ గారిచే 61 సమావేశం గ ‘’దాస్య భక్తీ-శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేశాం .శ్రీమతిక్రిష్ణ ఏంతో భావ గర్భితం గా ప్రసంగించి అందర్నీ భక్తీ భావనలో తేల్చారు .యధోచిత సత్కారం చేశాం .62  సమావేశం 22-5-14 గురువారం మచిలీపట్నం సోదరులు ఛి వీరుభోట్ల పవన్ కుమార్,ఛి వరప్రసాద్ లచే ‘’ఏక పాత్రాభినయం ‘’ఏర్పాటు చేయగా ,సోదరులు ఏంతో హుషారుగా ,చలాకీగా ఆయా పాత్రలలో తన్మయులై ధారాళం గా సంభాషణలు చెప్పి ,గొప్ప అభినయాన్ని ప్రదర్శించి ,జీవించి  ఆకట్టుకొన్నారు .వారి తండ్రిగారు మూర్తిగారు వీరిని తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం .సరసభారతి ఈ ముగ్గురిని ఘనం గా సత్కరించి సంస్కృతీ సేవ చేసింది .వర్దిష్ణులైన  ఆ చిర౦ జీవులను అందరూ అభినందించారు .

తెలుగు విద్యార్ధి మాస పత్రికను సమర్ధం గా అరవై ఏళ్ళు  నిర్వహించిన ఆ పత్రిక సంపాదకులు ,శాసన మండలి మాజీ సభ్యులు ,విద్యా రంగం లో ఉపాధ్యాయుల సేవలో తరించిన శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి మరణానికి సంతాప సభగా 23-6-14 సోమవారం ఏ. సి .గ్రంధాలయం లో సంతాప సభను 63 వ సమావేశం గా జరిపి శ్రద్ధాంజలి ఘటించాం .శ్రావణ మాసం లో ‘’శ్రావణ మాసం –నోములు –విశిష్టత ‘’పై మన దేవాలయం లో 64 వ సమావేశం 29-7-14 సాయంత్రం శ్రీమతి వేదాంతం శోభాశ్రీ ప్రసంగం ఏర్పాటు చేశాం . .65 వ సమావేశం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను 17-8-14 ఆదివారం నిర్వహించి చిన్నపిల్లలకు కృష్ణ గోపికా వేషాలలో పోటీ నిర్వహించి బహుమతులను అందించాం .

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేసి , డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి అంకితమిచ్చిన ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గ్రంధా విష్కరణ సభను స్థానిక ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ వారి సౌజన్యం తో  డిగ్రీ విద్యార్ధుల సమక్షం లో 66వ సమావేశం గా 28-8-14గురువారం  శ్రీ రాచకొండ శర్మగారి 90 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహిం చాం సభాధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ,.శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి  గ్రంధా విష్కరణ చేసి తోలి కాపీని విశాఖ పట్నం నుండి విచ్చేసిన   ప్రముఖ రచయిత స్వర్గీయ రా.వి .శాస్త్రి గారికుమారులు శ్రీ రాచకొండ లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారికి అందజేశారు. కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ డా జి వి పూర్ణ చంద్ శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ఆత్మీయ అతిధులుగా విచ్చేసి వేదికను సుసంపన్నం చేశారు .ఉదయం అల్పాహార విందును కాలేజి వారు ఏర్పాటు చేయగా అతిధులకు మధ్యాహ్న భోజనం సరసభారతి ఏర్పాటు చేసింది .ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీమతి జి సోని పుస్తకాన్ని సంక్షిప్తం గా సమీక్షించారు .గ్రంధ కర్తను మైనేని గోపాల కృష్ణగారు ఏర్పాటు చేసిన  బంగారు   బ్రేస్ లెట్ ‘ను శ్రీ సుబ్బారావు గారు రచయితచేతికి అలంకరించారు .సరసభారతి అతిదులందరికి ‘’ఆధునిక ఆంగ్ల కవితాపిత ‘’జియోఫ్రీ చాసర్  చిత్రం ఉన్న  జ్ఞాపిలను అందజేసి శాలువాలతో సత్కరించింది .కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,ఆంగ్ల లెక్చరర్ శ్రీ మతి  అరుణ కుమారి  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు .సాహిత్యం విద్యార్ధులకు చేరువ అవ్వాలన్న సరసభారతి సంకల్పం ఇలా నేర వేరింది .

కవులు ,కళాకారులు జన్మించిన గ్రామాలలో వారి సభలు జరపాలని నిర్ణయించి శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి వర్ధంతిని చిట్టూర్పు లో వారి స్వగ్రామం లో జనవరి పన్నెండు న నిర్వహించిన  సంగతి మీకు తెలుసు .ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర్గీయ శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతిని 67 వ సమావేశం గా వారి స్వగ్రామం కాటూరు లో శాఖా గ్రంధాలయం లో కాటూరు గ్రామ పెద్దల సహకారం తో 31-8-14 ఆదివారం సాయంత్రం జరిపి ఈ తరానికి పరిచయం చేసి కాటూరి ప్రజల మన్ననలు అందుకోన్నాం . శ్రీ వేమూరికోతెశ్వరరావు శ్రీ బాబ్జీ గారు  లైబ్రేరియన్ గారు సహకరించారు 68వ సమావేశం గా ప్రముఖ చిత్రకారులు సినీ దర్శకులు స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి ని ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో 6-9-14సాయంత్రం  నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించాం .

విజయ వాడ రమ్య భారతి ,ఉయ్యూరు సరసభారతి సంయుక్త ఆధ్వర్యం లో ప్రముఖ రచయిత పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతిని విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 14-9-14- ఆదివారం ఉదయం నిర్వహించాం .ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ‘’బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారం అయిదు వేల రూపాయలను సరసభారతి ద్వారా అ౦ద జేశాం .మొదటి సారిగా ఆపురస్కారాన్ని ఆంధ్ర దేశం లో ఏర్పాటు చేసిన ఘనతను శ్రీ గోపాల కృష్ణ గారు ,అందజేసిన ఘనత సరసభారతి ,మొదటిసారిగా అందుకొన్న ఖ్యాతి శ్రీ రాం బాబు గారికి దక్కింది .ఇది సరసభారతి 69 వ సమావేశం .ఒక వారం వ్యవధిలో మచిలీపట్నం మహతి కళా వేదిక పై 21-9-14 ఆదివారం సాయంత్రం 70వ సమావేశాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారం తో జరిపాం .ప్రముఖ చిత్రకారులు కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన బాపు-రమణ ల స్మారక పురస్కారం 10,౦౦౦రూపాయలు అందించాం .జిల్లా ఒకటవ అదనపు  న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ యం రామ శేషగిరిరావు ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కారాన్ని జ్ఞాపికను వీర్రాజు దంపతులకు అందజేయటం శాలువా తో సత్కరించటం  చారిత్రాత్మక విషయం .వారం వ్యవధిలో ఈ పురస్కారాన్ని ఇద్దరు ప్రముఖులకు అందజేసిన ఘనత సరసభారతికి శ్రీ మైనేని వారి వలన దక్కింది. వారి వితరణ శీలతకు కృతజ్ఞతలు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా శ్రీ జి వి పూర్ణ చంద్ గార్లు ఆత్మీయ అతిధులుగా వేదికకు నిండుదనం తెచ్చారు .ఈ సభా నిర్వహణ బాధ్యతా ఖర్చు అంతా కృష్ణా జిల్లా రచయితల సంఘమే భరిం చింది శ్రీ సుబ్బారావు గారు తీసుకొన్న ప్రత్యెక శ్రద్ధకు ధన్యవాదాలు అందజేస్తున్నాం .నెల రోజులలో 5 కార్యక్రమాలు నిర్వహించి రికార్డ్ నెలకొల్పింది సరసభారతి .

71 వ సమావేశం గా కవిసమ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ గారి 38 వ వర్ధంతిని వారి స్వగ్రామం నందమూరులో వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్న పూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14 ఆదివారంసాయంత్రం  ఘనం గా నిర్వహించాం .గ్రామస్తులు విశేషం గా పాల్గొని విశ్వనాధ వారి కీర్తిని ప్రస్తుతించారు శ్రీ వల్లభనేని రమేష్ చంద్ విశ్వనాధ తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు .విశ్వనాధ వారి మనుమలు విశ్వనాధ సత్యనారాయణ  సోదరులు కూడా పాల్గొని నిండుదనం తెచ్చారు .22-11-14 శనివారం శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో 72వ సమావేశాన్ని కార్తీక మాసం సందర్భం గా ధార్మిక ప్రసంగం  ఏర్పాటు చేశాం .రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి రమేష్ గారు ‘’తెలుగు కావ్యాలలో శివ పార్వతి వర్ణన ‘’పై అద్భుత ప్రసంగం చేసి శ్రోతలను భక్తి ప్రవాహం లో తన్మయులను చేశారు .నెల రోజులలో 5 సమావేశాలను నిర్వహించి రికార్డ్ నెల కోల్పింది సరసభారతి .  సాహిత్యం విద్యార్ధులకు అందుబాటు లోకి తేవాలన్న లక్ష్యం 27-12-14 శుక్రవారం సాయంత్రం 73వ సమావేశం లో తీరింది .మా తెనుగుతల్లికి గేయ రచయిత స్వర్గీయ శంకరంబాడి సుందరాచారి గారి శత జయంతి సభను ఫ్లోరా విద్యాలయం లో జరిపాం .మచిలీపట్నం నుండి శ్రీ పి వెంకటేశ్వర రావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గార్లు వచ్చి సుందరాచారిగారి కవిత్వాన్ని సాహిత్య ధోరణులను చక్కగా విద్యార్ధులకు అర్ధమయ్యేట్లు వివరించి వారి ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు .

–   గ్రంధాలయోద్యమ సారధి ,బాల సాహిత్యరచయిత,.గ్రంధాలయ శాస్త్రం పై అనేక సాధికారిక గ్రంధాలు రచించిన వారు ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో పూర్తీ సహకారం అందించిన వారు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,ఉయ్యూరు సాహితీ మండలి సంస్థాపక సభ్యులు, ప్రస్తుతనిర్వాహకులు సాహిత్యోపజీవి శ్రీ గూడపాటి కోటేశ్వర రావుగారి  మృతికి సంతాప సభను  గా ప్రత్యెక సమావేశాన్ని31-12-14 బుధవారం సాయంత్రం ఏ సి లైబ్రరీలోనిర్వహించి వారి సేవను శ్లాఘించి నివాళులర్పించాం .

మైనేని వారి గురుభక్తికి నిదర్శనం గాఏర్పాటు చేసిన  వారి చిన్ననాటి గురువుగారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి స్మారక నగదు పురస్కారం 10,000 రూపాయల ను సరసభారతిద్వారా శాంతినికేతన్ లో పదవ తరగతి చదువుతున్న ప్రతిభ ఉన్న పేద విద్యార్ధిని ఛి లంకె లావణ్య కు ఆ స్కూల్ లో సభ జరిపి అందించాం .భగవద్గీత లో రాణిస్తున్న అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై గీతను వినిపించిన కుమారి మాదిరాజు బిందు దత్త శ్రీ కి ఉన్నత విద్యాభ్యాసం ప్రోత్సాహక  నగదు బహుమతి 15,౦౦౦ రూపాయలనుశ్రీ గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిపంపగా సరస భారతి తరఫున  శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో అందించాం .ఉయ్యూరు హిందూ స్మశాన వాటికను ఆధునిక రీతిలో అభివృద్ధి చేస్తున్న ఉయ్యూరు రోటరీక్లబ్ వారికి సహాయం గా పెద్దమనసుతో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు పంపిన 25000  ల రూపాయలను శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీ యార్ల గడ్డ నాగేశ్వరరావు గారికి సరసభారతిద్వారా అంద జేశాం .ఇన్నిరకాల వితరణలను సరసభారతి ద్వారా అంద జేయించిన శ్రీ గోపాల కృష్ణగారి ధార్మిక సేవను యెంత ప్రస్తుతించినా సరిపోదు .సరసభారతిపై వారికి ఉన్న నమ్మకానికి కైమోడ్పులు .ఒక రకం గా మైనేనివారు మా సరసభారతికి ‘’చీఫ్ పాట్ర‘న్ ‘’’ .అందుకు మాకు గర్వం గా ఉంది .

11-1-15 ఆదివారం సాయంత్రం  ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో 74వ సమావేశం గా శ్రీ మైనేని గోపాల కృష్ణగారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహించాం .సాయంత్రం అయిదు గంటలకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ పి ఇంద్ర కీలాద్రి శర్మ బృందం చే సంగీత కచేరి నిర్వహించాం .తర్వాత శ్రీ దుర్గా ప్రసాద్ రచించిన ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’గ్రంధాన్ని నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ ఆవిష్కరించి మొదటి కాపీని గ్రంధాన్ని అంకితం పొందిన మైనేని వారి మెంటార్ –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి శ్ర్రీ కోగంటి సుబ్బారావు గారికి అందజేశారు .ఈ పుస్తకానికి ,ఆ రోజు మొత్తం ఖర్చుకు స్పాన్సర్ గోపాల కృష్ణ గారే .దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి దేశ విదేశాలలో కంప్యూటర్ ఉన్న వారందరూ చూసే ఏర్పాటు చేశాం .ఒక సాహిత్య సంస్థ ఇలా లైవ్ ప్రోగ్రాం నిర్వహించటం ఇదే మొదలు దీన్ని వీక్షించిన మైనేని గోపాలకృష్ణ  దంపతులు  పులకించిపోయారు . తన ఆత్మీయులు ,స్నేహితులు మార్గ దర్శిఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్దు  శ్రీ సుబ్బారావు గారికి ,సరసభారతి చేత పట్టుబట్టలు శాలువా ,బంగారు శ్రీ లక్ష్మీ నరసింహ కాయిన్  తెనాలిరామాలయం తో సంక్రాంతి వేడుక ఉన్న ప్రత్యెక జ్ఞాపిక ,సరసభారతి గ్రంధాలు అంద జేశారు .కోగంటి వారి కుటుంబ సభ్యులు హితులు సన్నిహితులు తెనాలి నుండి తరలి వచ్చిపాల్గొని ఏంతో నిండు దనం తెచ్చారు .గోపాల కృష్ణగారి బావ గారు శ్రీ అన్నే హనుమంతరావు  చెల్లెలు శ్రీమతి హేమలత ,కోగంటి వారి అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు వారి కుమార్తె శ్రీమతి  శ్రీదేవి,కోగంటివారి పెద్ద కుమారుడు శ్రీ శివప్రసాద్ కోడలు శ్రీమతి పుష్పలత ,స్నేహితుడు శ్రీ అన్నే వెంకటేశ్వర్లు దంపతులు ,కోగంటివారి మనుమలు  వారి శ్రీమతులు మనుమరాళ్ళు అందరూ హాజరై పెళ్లి వేడుకను చేశారు .వచ్చిన వారందరితో బాటు సరసభారతి కోశాధికారి ఈ కార్య క్రమం ఇంత ఘనం గ జరగటానికి కృషి చేసిన  శ్రీ గబ్బిట వెంకటరమణ శ్రీమతి మహేశ్వరి దంపతులకు మైనేని గారు అందజేసిన నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందజేశాం .అందరికీ ఆత్మీయ సత్కారం జరిపాం .గ్రంధ కర్త శ్రీ దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులకు శ్రీ ప్రభాకర్, శ్రీ సుబ్బారావు గార్లు ఘన సత్కారం చేసి నూతన పట్టు వస్త్రాలు శాలువా జ్ఞాపికలను మైనేని వారి తరఫున  అంద జేశారు.  .శ్రీ చలపాక ప్రకాష్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు .500 పుస్తకాలను సభకు వచ్చినవారికి, తెనాలివారికి, మదన పల్లివారికి అందజేశాం .శ్రీ దుర్గాప్రసాద్ గారి గురువుగారు మాజీ డ్రిల్ మాస్టారు శ్రీ ఎస్. వి .సుబ్బారావు గారు శిష్యవాత్సల్యంగా  దుర్గాప్రసాద్ గారికి నూతన వస్త్రాలు శాలువా బహూకరించి సాహితీసేవను ప్రస్తుతించి ఆశీర్వ దించారు .కన్నుల పండువుగా జరిగిన ఈ సమావేశం చరిత్రాత్మకం గా నిలిచింది .

సభ ప్రారంభానికి ముందు అందరికి స్వీటు హాట్ అందజేసి టీ ఇచ్చాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ తేనేరు అందించాం సభానంతరం అందరికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశాం .వచ్చిన వారందరూ సంతృప్తిగా భోజనం చేసి ఆనందించి అభినందించారు .ఇంత గొప్ప సభకు నూటపాతికమందికి పైగా సాహిత్యాభిమానులు పాల్గొని విజయ వంతం చేశారు .కార్యక్రమ నిర్వహణలో శ్రీ వీరమాచనేని బాలగంగాధర రావు గారు శ్రీమతి  శివలక్ష్మి శ్రీ గబ్బిట వెంకట రమణ గారు ,శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులుగారు ఏంతోతోడ్పడ్డారు .వీరందరికీ శాలువా  జ్ఞాపిక ,పుష్పహారం చందన తాంబూలాలతో సత్కరించాం .ఇందరి సమిష్టి కృషియే ఈ విజయానికి కారణం .సరసభారతిపై ఉన్న అభిమానానికి నిదర్శనం అందరికి కృతజ్ఞతలు .

75 వ సమావేశం గా భావ కవి ,ఆంధ్రా షెల్లీ స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని ఈ తరం విద్యార్ధులకు పరిచయం చేసే కార్యక్రమం అమరావాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం జరిపాం . శ్రీ దుర్గాప్రసాద్ –కృష్ణ శాస్త్రి గారితో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని ,మద్రాస్ లో వారింటికి నాలుగైదు సార్లు వెళ్ళిన విషయమూ వారితోవారి కుటుంబం తో మద్రాస్ లో ఉన్న వారి పెద్దక్కయ్య పెద్దబవ గారు కీ .శే.  గాడేపల్లి లోపాముద్ర ,కృపానిధి గారల   బంధుత్వమూ ,వారు తనను తన మేనకోడలు సత్యకళను కారు లో త్యాగరాజనగర్ ,పాండీబజార్ లలో త్రిప్పిన మధురమైన రోజులను గుర్తు చేసుకొన్నారు .కృష్ణశాస్త్రి గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు తమ చిన్న తనం లో ఉయ్యూరు లో వారింటికి వచ్చి రెండు గంటలు తమ తలిదండ్రుల తో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు . శ్రీమతి మందరపు హైమవతి చక్కని ప్రసంగం చేసి విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం వ్యక్తిత్వం రచనలను సుబోధకం గా వివరించారు .’’కృష్ణ శాస్త్రి గారిని చూసి మాట్లాడిన దుర్గాప్రసాద్ గారు ధన్య జీవులు .వీరింటికి వారు వారింటికి వీరు వెళ్లి ణ బాంధవ్యం గొప్పది దుర్గాప్రసాద్ గారికి నా పాదాభి వందనాలు ‘’అని ఉద్వేగం తో  ఆనంద  పులకంకి తం గా  చెప్పారు .వారికి ప్రిన్సిపాల్ శ్రీ  పి. నాగ రాజు , ఉపాధ్యాయ బృదం గొప్ప సహకారం అందజేశారు .కృష్ణ శాస్త్రి గారి జీవితం సాహిత్యం పై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాం .శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ జాన్సన్ గార్లు కృష్ణ శాస్త్రి సినీ సన్ గీతాలను మధురాతి మధురంగా గానం చేసి రస డోలికలో ఊపేశారు . శాస్త్రి గారి గీతం ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘’గానం చేసిన విద్యార్ధులందరికీ సరసభారతి బహుమతులను అందించింది .విద్యార్ధులకు సాహిత్యం చేరువ చేయాలన్న మా సంస్థ ఆశయం ఇలా మళ్ళీ నెరవేరింది .

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలుగా 76 వ సమావేశాన్ని 15-3-15 ఆదివారం నిర్వహిస్తున్నాం . శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ,డా.శ్రీ శలాక రఘునాధ శర్మ ,డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,ఆచార్య మన్నవ సత్యనారాయణ గార్లకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా  ప్రసాద్ గారు తమ  తలిదండ్రులు స్వర్గీయశ్రీమతి  గబ్బిట భవానమ్మ ,శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాలను  అందజేస్తున్నారు  .ప్రోత్సాహక పురస్కారులుగా శ్రీ కళాసాగర్ శ్రీమతి చలపాక -,శ్రీ బాషా (ఈనాడు ) ,శ్రీ రాజా ,(మనచానల్) శ్రీగూడవల్లి రామారావు (పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు ) శ్రీ ఫజులుల్ మొయిద్ (జాగృతి పొదుపు సహకార సంస్థ ఉయ్యూరు)కు అలాగే’’ స్వయం సిద్ధ ‘’ప్రత్యెక పురస్కారాన్ని శ్రీమతి పెద్ది భొట్ల సౌభాగ్య లక్ష్మి-(తెలుగు పండిట్ –ఉయ్యూరు) గారికి శ్రీ దుర్గా ప్రసాద్ దంపతులు  అందిస్తున్నారు .

శ్రీ దుర్గాప్రసాద్ రచాన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ  మంగళ గిరి ఆదిత్య ప్రసాద్                       ఆవిష్కరిస్తారు . ఈ గ్రంధ అంకిత  స్వీకర్త శ్రీ మైనేని  గోపాల కృష్ణ గారికి ,దీన్ని స్పాన్సర్ చేసి సరసభారతి తరఫున ముద్రిస్తున్న శ్రీ మైనేని వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతిగారికి ,వారి సోదర సోదరీ మణులకు (అమెరికా)ధన్యవాదాలు ,కృతజ్ఞతలు .సరస భారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ రచన ‘’ త్యాగి పే రెడీలు+ పుస్తకాన్ని ‘’ను సరసభారతి తరఫున ముద్రించి ఈ సభలో శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిచే  ఆవిష్కరింప జేస్తున్నందుకు ధన్యవాదాలు .దీనితో సరసభారతి ప్రచురణలు 16 ,అందులో శ్రీ దుర్గా ప్రసాద్ గారి రచనలు 10.

80 మంది  ప్రముఖ కవులతో ‘’ నవ్యాంద్ర ప్రదేశ్ ‘’అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం . ముఖ్య అతిదిది గా  విచ్చేసిన శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై . వి .బి .రాజేంద్ర ప్రసాద్ ,ఆత్మీయ అతిధులు  శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు ,(ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ ) శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ఇంచార్జ్ –విజయవాడ )డా.శ్రీ జి వి పూర్ణ చంద్  శ్రీ కలిమిశ్రీ (మల్లెతీగ మాస పత్రిక సంపాదకులు ) మొదలైన వారికి ధన్యవాదాలు ..సరసభారతిఅధ్యక్షులు నితోత్సాహి శ్రీ దుర్గాప్రసాద్ సరసభారతి  ,శ్రీ సువర్చలాంజనేయ స్వామి అనే రెండు బ్లాగులను నిర్వహిస్తున్నారు . .వీటి వీక్షకుల సంఖ్య మూడు లక్షల పాతిక వేలు అంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది .మా గౌర్వాధ్యక్షులు ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,కోశాధికారి శ్రీ గబ్బిట వెంకట రమణ ,సాంకేతిక నిపుణులు శ్రీ వి బి జి రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు వారందిస్తున్న సహకారానికి సేవకు సరస భారతి  కృతజ్ఞతాభి వందనాలందిస్తోంది . సరసభారతి కార్య క్రమాలకు హాజరౌతూ ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమానులకు ,కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చి సహకరిస్తున్న మీడియా మిత్రులకు సదా కృతజ్ఞతలు .మా కార్య వర్గ సభ్యుల సహకారం మరువలేనిది అందరికీ శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో కృతజ్ఞతాభినందన వందనాలు .

 

మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం


నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,

“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం  .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా :  రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు  పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి.  వీరందరికీ నా ధన్యవాదాలు .

–మైనేని గోపాలకృష్ణ-  హన్ట్స్ హిల్  -అలబామా -అమెరికా  

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

మనవి మాటలు

–                   రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత౦  లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో sసంస్కృత  కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి చేస్తున్నాను .146  మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణమే ఇది .

శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి  మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను  .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .    ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు ..వారిని గురించి కూడా రాశాను.

సాహితీ బంధువులకు శుభ కామనలు .‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,146మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించిణ సమాచారాన్ని  మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .

ఇంత మంది సంస్కృత  మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .

మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి ‘’సిద్ద యోగి పుంగవులు’’ను  తమ తల్లిగారు  కీ శే .మైనేని సౌభాగ్యమ్మగారికి ,రెండవది’’మహిళా మాణిక్యాలు ‘’ను  తన అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది ‘’పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు ‘’ను తన బావ గారు డాక్టర్  శ్రీ రాచకొండ నరసింహ శర్మ –ఏం డి గారికి కి  నాల్గవది ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ను తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన  స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని  గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా  వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు  స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి ,  గుర్తింపు గా   10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని  అంకితమిస్తున్నాను  .      ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా  నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే  నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .

ఇది రాసిన సుమారు ఇరవై రోజులకు ఒక రోజు రాత్రి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఫోన్ చేసి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను పుస్తకం గా తీసుకొని రావటానికి తన మేన కోడలు ,తన బావ గారు డా .రాచకొండ నరసింహ శర్మ –ఏం. డి .గారి కుమార్తె  శ్రీమతి డాక్టర్ జ్యోతి ఉత్సాహం గా ఉందని  నేను ఒప్పుకొంటే వెంటనే ఆ పని ప్రారంభిద్దా౦  అన్నారు  .సంతోషం గా అంగీకరించాను .దీన్ని మార్చి 15 వ తేదీ సరసభారతి నిర్వహించే శ్రీ మన్మధ ఉగాది సంబరాలలోఆవిష్కరించాలని భావించాం .మర్నాడు ఉదయం శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పా .మీరందరూ అంత ఉత్సాహం గా ఉంటె సమయం రెండు నెలలే ఉన్నా ప్రయత్నించి గ్రంధాన్ని తెద్దాం .అన్నారు .ఏంతో ఆనందమేసింది ,ఇక పని ప్రారంభించాం ..ఇంతమంది సాహితీ మూర్తుల సహకారం లభించింది .అందుకే పుస్తకం ఈ రూపం దాల్చింది .దీనికి శ్రీమతి జ్యోతిగారినకి వారి సోదరే సోదరీమణులకు (అమెరికా) ,అంకితం తీసుకుంటున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి ,ముద్రణ బాధ్యతలను మా తరఫున స్వీకరించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు .అడిగిందే తడవుగా పెద్ద మనసు తో అంగీకరించి గ్రంధానికి స్పూర్తి దాయక మైన ముందు మాట’’అంతరింద్రజాలం ‘’ రాసిన సహృదయ ఆత్మీయ సాహితీ మూర్తి డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతాపూర్వక సహృదయ ప్రణామాలు  అందజేస్తున్నాను .సరసభారతి వీరందరికీ ఆత్మీయ ధన్యవాదాలు తెలియ జేస్తోంది

ఈ పుస్తకం సరసభారతి ప్రచురించిన 15 వ గ్రంధం నేను రాసిన 10 వ గ్రంధం .అంతర్జాలం లో నేను రాసిన ఆరవ పుస్తకం .ఇదంతా సరస్వతీ దేవికరుణా , మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల అనుగ్రహం ,మా కుటుంబ సభ్యుల అందునా ముఖ్యం గా నా సతీమణి శ్రీమతి ప్రభావతి సహకారమే   అని సవినయం గా  మనవి చేస్తున్నాను ..

ఎందరో మహాను భావులు. అందరికి వందనములు

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధ రచనకు సహకరించిన పుస్తకాలు

1-డా.శ్రీ ముదిగంటి గోపాల రెడ్డి ,డా.శ్రీమతి ముదిగంటి సుజాతాదేవి రాసిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’‘’

2- తెలుగు విజ్ఞాన సర్వస్వం  ,

3–20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ

4-వీకీ పీడియా

మొదలైనవి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు -ప్రత్యక్ష ప్రసారం

live link

సాహితీ బంధువులు శుభ కామనలు ఱెపు అంటే 15-3-15 ఆదివారం సరసభారతి 76 వ సమావేశం గా నిర్వహించే ”శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుక ల ”ను మధ్యాహ్నం 3-30 నుండి మీ కంప్యూటర్లలో  ప్రత్యక్షం గా  వీక్షించటానికి ఏర్పాటు చేశాం .  దూర ప్రాంతాల తెలుగువారు ,విదేశం లో ఉన్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చెసుకో వలసినదిగా మనవి-  దుర్గాప్రసాద్ 10688362_1028981593797438_939230920805912889_o

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

8 – 3 – 2015 ఆదివారం నాడు ఆంధ్రభూమి పత్రికలో మెరుపు పేజిలో సరసభారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన “దర్సనియ దైవక్షేత్రాలు” రచన పై రమ్యభారతి మాస పత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి సమీక్ష.

 

Click to access darsaneeya-punyakshetralu-bo.pdf

For other Books

Download Link


10423296_1028833710478893_5117056530410202525_n

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద sundarachari1 001 sundarachari2 001 sundarachari3 001 sundarachari4 001 sundarachari5 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేర్చుకున్నదిది అన్న పఠాభి -ప్రమిద

pathabhi1 001 pathabhi2 001 pathabhi3 001 pathabhi4 001 pathabhi5 001 pathabhi6 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమారుడు రాహుల్ తో బుద్ధుడు –

rahul-buddha 2 001 rahul-buddha -3 001 rahul-buddha1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

Added At : Sun, 03/08/2015 – 03:11

భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!చఙిిఈడొ ఖిొటసిికోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
dŸ్శdŸా ొ dŸ్శ్ఘŸ్ష‘ిలిి
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!కోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!చఙిిఈడొ ఖిొటసిికోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
dŸ్శdŸా ొ dŸ్శ్ఘŸ్ష‘ిలిి
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం

Added At : Sun, 03/08/2015 – 03:26

వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది.తెలుగు సాహిత్య ప్రక్రియలో శాఖోపశాఖలుగా వికాసం పొందిన కావ్యప్రక్రియలలో శతకం ఒకటి. ప్రాకృత సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ప్రారంభమై కాలక్రమమున విశిష్ట స్థానం పొందింది. తెలుగులో 12వ శతాబ్దంలో శతకం ఆవిర్భవించింది. భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుమఖ వికాసాన్ని పొంది వైశిష్ట్యం పొందలేదు. శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్న సంస్కృత అలంకారికుల్లో 13వ శతాబ్దినాటి అమృతానంద యోగి మొదటివాడు. తెలుగు లాక్షిణుకుల్లో విన్నకోట పెద్దన, అనంతుడు శతక ప్రక్రియను పేర్కొన్నారు.
”శతేన శతకం ప్రోక్తమ్‌” అనే నియమం అనుసరించి శతక కర్తలు శత సంఖ్య గల శతకాలు రచించారు. సంస్కృతంలో మొదట 100 శ్లోకాలతో రాసేవారు. తర్వాత 108,116 సంఖ్యలతో రాయటం జరిగింది. కాని శతక కర్మలు అందరు ఈ సంఖ్య నియమాన్ని పాటించారు. ఒక్కో వేమన మాత్రం పాటించలేదని చెప్పవచ్చు. శతక లక్షణాలలో పద్యం చివర ఒకే మకుటం ఉండటం శతక లక్షణం. ముఖ్యంగా శతకాలు వస్తువును బట్టి భక్తిశతకం, నీతి, శృంగార, వైరాగ్యం, హాస్య, దేశభక్తి, రాజకీయ శతకాలుగా వర్గీకరించారు.
తెలుగులో వేమన సరసన పీఠం వేయదగిన ప్రజాకవి, సంఘ దురాచారాలను తూర్పూరబబట్టిన సంఘసంస్కర్త అయిన చాటుకవి కుందవరప కవి చౌడప్ప. ఈయన నియోగి బ్రాహ్మణుడు. (1580-1640) సంవత్సరం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. చౌడప్ప కడపజిల్లా ‘కుందవరం’ గ్రామానికి కావచ్చు లేక పుల్లూరు గ్రామ నివాసి అయిన ఉండవచ్చు అని పండిత విమర్శకులు నిర్ణయించారు. ఇంకా మట్లి అనంతభూపాలుని చేతనూ, తంజా వూరు, రఘునాథరాయల చేతను మేపుపొందాడని చెప్తారు. చౌడప్ప, ఘంటన అనే ఇద్దరు కవులు మట్లి అనంత భూపాలుని ఆస్థానంలో ఉన్నట్లు ఒక చాటువు వల్ల తెలుస్తుంది. ఆ చాటువు వారిరువురును మంచివారు, విమలాత్ములు, హాస్యకళాదురంధరుల్‌, సన్నుత నీతి పారుగులు ‘జాణలు’ నైపుణ్యాలు అని వర్ణించుచున్నది. కవి చౌడప్ప రచించిన శతకంలోని పద్యాలలో 10,12 తప్ప అన్నీ కంద పద్యాలే. కంద పద్య రచనలో తిక్కన సోమయాజితో తాను సమానుడనని కవి చెప్పుకొనెను. ”నా నీతిని వినని వానిని…వానను తడియని వానిని కాననురా కుందవరపు కవి చౌడప్పా” అని తన కవితకు దక్కిన గౌరవం గురించి ప్రజల మన్నలను పొందిందిగా సగర్వంగా చెప్పుకున్నాడు. ‘హాస్యకవి జాణ’ గాన విద్యాప్రవీణుడు అనే ప్రశంసలు పొందారు.
తెలుగు శతకాలలో అధిక్షేప శతకాలు అధిక ప్రాచుర్యం పొందినవి. తెలుగులో కొందరు వ్యక్తి దూషణ మరికొందరు వక్రోక్తి, వ్యాజోక్తి. సమకాలీన సాంఘీక రాజకీయ వ్యవస్థలో కలిగిన మార్పులు. అధిక్షేప శతక కర్తలలో కొందరు మితవాదులు మరి కొందరు అతివాదు వేరొక కొందరు విప్లవాదులు. చౌడప్ప శతకంలో ఆత్మసంబుద్ధి పరంగా చెప్పిన కవి తెలుగు శతకాలలో ఆద్య్తమైనది. పండితుల, పామర జనురంజకం పొంది బహుళ ప్రాచుర్యం పొందింది. హాస్య చమత్కృతి, బూతులు నీతులు ప్రధానగుణములు పది నీతులు పది బూతులు పది శృంగారాలు గలిగిన పద్యాలు సభలో జదివినవాడే యధికుడు అని చౌడప్ప శృంగారం నీతుల గురించి సభలలో చదివినవాడెె.
నీతుల కేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదని కవి చౌడప్ప చాటినాడు. లోకజ్ఞతను, స్వానుభవం వల్ల ఈయన శతకంలో నీతులు బూతులు లోకఖ్యాతులురా అని కచ్చితంగా నొక్కి చెప్పినాడు. నీతులను బోధించుటలో కవి చౌడప్ప చమత్కారంగా తిట్లను కూడ జోడించాడు. ఇలా హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించిన కవి చౌడప్పని పద్యాలలో బూతులు, అక్కడక్కడ ఆశ్లిdల శృంగారం కనిపించిన, వేమనలా ధర్మకోపంతోనే అతడు సంఘాన్ని తిట్టినట్లు కనిపిస్తుంది.
చౌడప్ప అక్కడక్కడ చంపక ఉత్పలమాల, మత్తేభ శార్ధూల పద్యాలను వాడినాడు. ఈయన అందరి కవులలాగే మకుట నియమం వాడాడు. కుందవరపు కవి చౌడప్పా అని కుందవరపు పావన చౌడ కవీశ్వరోత్తమా అనే మకుటం వాడినాడు. కవిత్వాన్ని మెచ్చుకొనే విధంగా ఉండాలిగానీ, హేళనగా దాన్ని నలుగుర్నీ అవమానం చేయకూడదని ఈ పద్యం ద్వారా కవి తెలుపుతాడు.
వేడుక పడివినవలెనా
దోడుకవిత్వంబునైన తులువనలువురన్‌
గోడిగము సేయువాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా
ఇంకా చౌడప్పా తిట్టును ఎంత సమర్థవంతంగా వాడగలడో చెప్పవచ్చు. ఎద్దులు కొడుకులు గలిగిన /కొద్దిధర్మంబు జేసికొనరు తరించేబుద్ధినెరిగి తమ పిండము/గ్రద్ధలుదిన కుందవరపు కవి చౌడప్పా అని కొడుకులు ఎద్దుల్లాంటి వారు కలిగినవారు తరించాలనే బుద్ధితోనైనా కొద్దిపాటి ధర్మం కూడా చెయ్యరు. అలాంటి వారిని వాళ్ల పిండాలు గద్దలు తినా అంటూ శపిస్తాడు కవి. వేమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది.
చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది. చౌడప్పకు శబ్దంపై గొప్ప అధికారం కలిగి అప్రయత్న సిద్ధంగా శబ్దాలంకారాలను నేర్పుతో కూర్పుతో గ కవిగా పేరుపొందాడు కుందవరపు కవి చౌడప్ప.
ఏవి ప్రశస్తంలో తెలుపు ‘పస’ పద్యాలు కొన్ని, దేనికి రక్షణమో వివరించే పదిలము పద్యాలు కొన్ని చౌడప్ప శతకంలో కలవు. ఇంత గొప్ప ప్రజాకవి పద్యాలు కాలగర్భంలో కలిసిపోకుండా నేటి తరానికి అందించాలని తపన. ఆధునికులతో శ్రీశ్రీవంటి మహాకవులకు ఎందరినో ప్రభావితులను చేసిన అక్షరశిల్పి కుందవరపు కవి చౌడప్ప. కాని ఎందువల్లో ఈయన పద్యాలు ఎక్కువగా నేటి తరానికి అందలేదనే చెప్పాలి. ఇలాంటి కవి సంఘదురాచారాలను, సమాజానికి హితం చేకూరేలాగా ప్రభావితం చేసిన శతకం చౌడప్ప శతకం. ఇంకా నీతులు, రీతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్‌ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం, హజ్‌ హౌస్‌ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముస్లింలకై శాదీఖానాలు ఉర్దూ ఘర్‌లూ ప్రజల సొమ్ముతో అనేక పట్టణాల్లో కట్టింది.
రాష్ట్రంలోని క్రైస్తవులకై ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను పూర్వపు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రభుత్వం నుండి సొమ్ముని పొంది, రాష్ట్రంలో ఆ సొమ్మునుపయోగించి, ఒక్కొక్క గ్రామానికి 2 లక్షలు ఇచ్చి 2013 వరకు చర్చిలను కట్టించింది. ప్రభుత్వపు సొమ్ముతో జెరూసలెంకు తీర్థయాత్ర తీసే ప్రతి క్రైస్తవునికి రూ.25,000 ధన సహాయం చేస్తోంది.
ఈ విధంగా రాజ్యాంగం ప్రకారం సెక్యులర్‌గా ఉండవలసిన ప్రభుత్వాలు, పన్నుల ద్వారా వసూలు చేసిన సొమ్మును, ముస్లిం, క్రైస్తవ మత పోషణకు, వ్యాప్తికి, దుర్వినియోగం చేస్తున్నాయి. కొంతమంది ముస్లిం ప్రభువుల పాలనలో, హిందువులపై జిజియా అనే పన్నువేసి, అలా వచ్చిన సొమ్మును ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించేవారు. స్వతంత్ర భారతంలో, సెక్యులర్‌ ప్రభుత్వాలు తిరిగి, పరోక్షంగా జిజియాను ప్రవేశపెట్టి, హిందువులు చెల్లించే పన్నులను పాక్షికంగా హైందవేతర మతస్తులకై ఉపయోగించడం గర్హనీయం.
ఇక హిందువులపై ప్రత్యక్ష వివక్షతను తిలకిద్దాం. క్రైస్తవుల చర్చ్‌లు, ముస్లింల మసీదులూ, ఆయా మతసంస్థల యాజమాన్యంతో, వారి పాలనలోనే ఉన్నాయి. కాని మంచి ఆదాయం ఉన్న హిందువుల దేవాలయాలు మాత్రం ప్రభుత్వపు యాజమాన్యం, పాలనలో ఉన్నాయి, ఈ సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖలు వీటి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, కమిషనర్లూ, ప్రభుత్వాధికారులు, కొన్ని దేవాలయాల ఇ.వోలు క్రైస్తవులు, ముస్లింలు కొంతమంది తమ మతమార్పిడిని కప్పిపుచ్చుకుని, రిజర్వేషన్‌ ద్వారా ప్రభుత్వోద్యోగం పొందినవారు. ఇలా హిందువుల దేవాలయాలు, హిందూసంస్థల అధీనంలో లేవు. భక్తులిచ్చే కానుకల రూపంలోని ఆదాయంలో కొంత శాతం ముఖ్యమంత్రి ఇష్టానుసారం కేటాయించడానికి కామన్‌ గుడ్‌ ఫండ్‌లో పడుతుంది. ముఖ్యమంత్రి క్రైస్తవులు, ముస్లింలు అయిఉండవచ్చు. సి.జి.ఎఫ్‌. నిధులు మసీదు, చర్చ్‌ల మరమ్మతులకు కట్టడాలకు ఇచ్చిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే హిందూమతాన్ని ద్వేషించి, దాన్ని మటుమాయం చేసే కార్యక్రమాలు చేపట్టే, హైందవేతర మతాల పుష్టికి, హిందూ భక్తులు తమ దేవుళ్ళకిచ్చే

సొమ్ము, మళ్లింపబడుతోంది. ఎంత అన్యాయం? ముస్లింలు, క్రైస్తవులు తమ తీర్థయాత్రలకు ప్రభుత్వపు సొమ్మును పొందుతుంటే, హిందూభక్తులు తమ సొమ్ముతో ప్రయాణం చేయాలి, తమ దేవుణ్ణి చూడటానికి టిక్కెట్‌ కొనుక్కోవాలి! ఎంత దారుణం! హిందువులకు పై చూపబడుతున్న వివక్ష, వారి సొమ్మును అన్యమతస్తులకై ఉపయోగింపబడటాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి.
తి.తి.దే, దే.ధ.శా లు హిందూభక్తులు సమర్పిస్తున్న ధన వనరులను, ప్రతి సంవత్సరం ఒక లక్షమంది హరిజనులను, గిరుజనులను, ఇతర బీద హిందువులను, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, ఉచితంగా వేంకటేశ్వరుని దర్శనం చేయించాలి, ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించాలి.
– సంవత్సరానికి కనీసం వెయ్యిమందిని అమర్‌నాధ్‌ యాత్రకు, దేవాలయ ఆదాయాన్ని వెచ్చించి పంపి తీసుకురావాలి.
– ప్రతి దళిత వాడల్లో, గిరిజన గ్రామాల్లో పట్టణాల్లోని మురికివాడల్లో, నివాసులు కోరిన దేవతకు, దేవునికి మందిరం కట్టి ఆ సముదాయంలోని వారినే అర్చకులుగా తీసుకుని, వారికి పూజా విధానంతో పాటు హిందూ ధర్మాన్ని బోధించి, తత్ప్రసార కర్తలుగా, బోధకులుగా శిక్షణ ఇవ్వాలి. వారికి, నెలకు కనీసం రూ.5,000/- జీతం ఇవ్వాలి. ధూపధీప నైవేద్య, పండుగల నిర్వహణకై, సంవత్సరానికి కనీసం, ప్రతి గుడికీ రూ.50,000/- ఇవ్వాలి.
-తి.తి.దే. పాలక మండలిలో, దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో హిందూ ధర్మరక్షణ, ప్రచారం, అనుష్ఠానమందు అంకితభావమున్న, రాజకీయమే వృత్తిగా లేని, గుణవంతులను, జ్ఞానసంపన్నులను, పాలనా దక్షణ, అనుభవం ఉన్న వారినే, సభ్యులుగా నియమించాలి.
– ఈ సంస్థల యొక్క ఆదాయ వ్యయపట్టికను, వార్షిక పాలన -నిర్వహణ -కార్యక్రమ నివేదికలను, ప్రచురించి, ప్రజలకందేట్లు చేసి, ప్రజాభిప్రాయాన్ని మన్నించే విధిని పై సంస్థలకు నియమించాలి.
చివరిగా, ప్రజాభిప్రాయాన్ని, విజ్ఞుల సలహాలను, సూచనలను ఆహ్వానించి, చట్టం ద్వారా హిందూ దేవాలయాల పాలన, యాజమాన్యం ప్రభుత్వం నుంచి వేరుజేసి, సవ్యమైన ధర్మసంస్థలకు అప్పజెప్పాలి. సిఖ్‌ పంధీయుల గురుద్వారాల యాజమాన్యం, పాలన, నిర్వహణ గురుద్వారా ప్రబంధక్‌ కమిటీలకు, అప్పజెప్పిన చట్టంను ప్రాతిపదికగా తీసుకుని, మరో సర్వాంగ సౌష్టవశాసనం, నియమాలను రూపొందించవచ్చు.
హిందూ బంధువులందరూ, ఈ విషయాలను రాజకీయ పార్టీలకు, నాయకులకు, శాసనసభ్యులకూ తెలియపరచి హిందువులకు, అన్యమతస్తులకున్న, స్వతంత్య్రాన్ని, సంఘటనా సౌకర్యాన్ని, వ్యవస్థనూ, సమకూర్చేలా అర్థించి, కార్యాన్వితం చేయాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, అలాంటప్పుడు స్వీయ ధర్మమేదో తెలుసుకోవడం అంత తేలిక కాదు కదా! మనస్సులో కోరికలు లేనివారు మాత్రమే తలవెంట్రుక వాసిలో గల ధర్మాన్ని తప్పకుండా ఈ లోకంలో చరించగలరు. ధర్మాన్ని అవలంభించడానికి మూడు దృక్పధాలు అవసరం. అసత్యం పలుకకుండుట, ఇతరుల భార్యలను పొందాలని కోరుకోవడం, మూడవది తమకు హాని చేయని వారిని హింసించడం. రామా! నీకు అసత్యమాడుతావన్న నింద లేనేలేదు. మీరంత వరకూ అసత్యమాడలేదు. ఇక ముందు అసత్యం నిశ్చయంగా పలుకవు. కావున రెండవ పాపం కూడా నిన్ను అంటదు. నన్ను తప్ప మీరు ఇంకెవ్వరినీ కన్నెత్తి చూడనైనా చూడలేదు. సీత చెప్పడం ఒక్క క్షణం ఆపింది. రాముడి వంక చూసింది. రాముడు చిరునవ్వు నవ్వాడు.
సీతతో ‘నీవు చెప్పదల్చుకుంది చెప్పు. సంకోచించకు, నేను వింటు న్నాను’ అన్నాడు. సీత ఎంతో సరళంగా చెప్పడం ప్రారం భించింది. ఇక మూడవ పాపం నీకు చుట్టుకుంటుందేమో నన్న భయం కలుగుతుంది. ఎందుకంటే నీవు ఈ అరణ్యంలోని ఋషుల ఎడల పక్షపాత వైఖరి అవలంభించి, నీకు ఏ విధంగానూ, ఎలాంటి హబుూనీ కలిగించని రాక్షసులతో పోరుకు సిద్ధమయ్యావు. ఇందుకేనా నీవు ధనుర్భానాలు చేతపట్టి అరణ్యానికి వచ్చావు. మనకు ఇకముందు కలుగబోయే దు:ఖానికి ఇది సంకేత మను కోనా? నాధా! మీరు అరణ్యంలో వున్న రాక్షసులందర్నీ హత మారుస్తానని మాట ఇచ్చినప్పటి నుండీ నాకు భయం భయంగా వుంది. నాలో ఆందోళన పెరుగుతూంది. ఇక మీరు ఈ అరణ్యంలో ముందుకుపోవడం నాకిష్టంలేదు. ఎందుకంటే మీరు రాక్షసులను చూడగానే వెంటనే ఆచరణలో పెట్టడం మీ నైజం. అగ్నిలో కట్టెలు వేస్తే అగ్నికి ఇంకా బలం చేకూరినట్లుగా, ధనుర్భాణాలు క్షత్రియుని అతిశయాన్ని ఇంకా ఇనుమడింప జేస్తాయి. రామా! నేనిలా మాట్లాడటం నీయందు గౌరవం లేకకాదు. నీకు ధర్మాన్ని బోధించాలని కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నది సరైనదో కాదోనని, నీవు తాపస వేషం ధరించావు. ఆ వేషానికి తగ్గట్లే నీవు నివసించాలి. నీకు ఆగ్రహం కలిగించితే తప్ప మీరు రాక్షసులను సైతం హతమార్చడం సరైనది కాదు. తిరిగి మనం అయోధ్యకు పోయిన తర్వాత, క్షత్రియ ధర్మాన్ని అనుసరించవచ్చును. ధర్మ సారమే ఈ లోకం. ధర్మమే అన్ని పురుషార్థాలనూ ప్రసాదించి ప్రశాంతిని చేకూరుస్తుంది. ధర్మాన్ని తప్పక నడుచుకునే వారికి అన్నీ లభిస్తాయి. రామా! నీవేమి చేయాలో చెప్పుతున్నందుకు నన్ను క్షమించు. ఏమీ జరుగుతుందో నన్న భయం స్త్రీలకు సహజంగా వుంటుందని తెలుసుకదా! ఆభయమే నన్ను ఈ విధంగా మాట్లాడేలా చేస్తున్నది. నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.
వారు సన్యాసి వేషాలు ధరించి, భోగ భాగ్యా లన్నింటినీ త్యజించి తపస్సు చేసుకోడానికి మాత్రమే ఇక్కడకు వచ్చారు. రాక్షసులు వీరిని వేధిస్తూ, భక్షిస్తున్నారు. రాక్షసుల మూలంగా వీరి ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లింది.వారు నన్ను రక్షణ కల్పించమని కోరగా, వారికి సరేనని మాట ఇచ్చాను. తపస్సు అంటే చాలా కఠినమైనది. అలాంటి తపస్సును వారంతా చేస్తుంటే, వారి నమ్మకాన్ని నేను ఎలా వమ్ముచేయడం చెప్పు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, నా ప్రాణాన్నీ, లక్ష్మణునిగానీ, నిన్ను సైతం పోగొట్టు కోవడా నికైనా వెనుకాడను. అసలు అడగక పోయినా, క్షత్రియుడిగా నా అంతట నేనే వారిని రక్షించాల్సి వుంది.
సీతా! నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నాకు ఎంతో ఆనందం వేస్తున్నది. ఇతరుల క్షేమాన్నీ, శ్రేయస్సునూ కోరేవారే హితాన్ని ఉపదేశిస్తారు. నాశ్రేయస్సు కోరి నీవు నీ జన్మను సార్థకం చేసుకున్నావు. ఈ దండకారణ్యంలో నివసించే వారికి సుఖమూ, భద్రతా కల్పించేందుకే నిర్ణయించాను అంటూ సీతారామ వ్యవస్థకు ఆదర్శ దంపతులుగా మనకు దర్శనమిస్తారు సీతారామ చంద్రులు. యుగాలుగా గడిచినా నేటికీ వివాహం అనగానే సీతారామ కల్యాణమే ఆదర్శంగా హిందూ వ్యవస్థ కొనసాగుతూ వుంది. కల్యాణ వేదికపై చేసుకున్న బాసలను జీవితాంతం నిలుపు కోవాల్సి వుంది.
ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించు కుంటూ ముందుకు సాగాలని ఈ రామా యణం లోని అరణ్యకాండలో ఆ దంపతులు లోకానికి చక్కటి సందేశాన్నందించారు.
నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే
ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి
ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది.
కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక భావనకు చేరువైనాడు. ఏదో అంతరంగ శక్తి ఆయనను తపం చేయుటకు ప్రోత్సహించింది. శమంతక పంచ తీర్థంలో నివాసం ఏర్పర్చుకొన్నాడు. ప్రతి రోజు ప్రాత: కాలంలో తపమాచరించిన తరువాత భూమిని ప్రతి రోజు నాగలితో దున్నేవాడు. నియమం తప్పక ప్రతిరోజు ఈ విధంగా చేసేవాడు. ఈ కురుమహారాజు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అనే అనుమానం దేవేంద్రుని మదిలో మొదలాడసాగింది. ఈ మహారాజు తన సింహాసనానికి ఎసరు పెట్టలేదు కదా అని తలచి కురు మహారాజును కలసినాడు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న తరువాత దేవేంద్రుడు మహారాజా మీరు ప్రతి రోజు భూమి దున్నుతూ తపం ఆచరిస్తున్నారు కదా. ఇదుకు ప్రత్యేకించి విశేషమైన కారణం కలదా అని ప్రశ్నించాడు.
అప్పుడు కురుమహారాజు అవును దేవేంద్రా అవును. ఈ క్షేత్ర సందర్శనంతోనే నా మనసు పులకించింది. అందుకని ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారు ఈ క్షేత్రంలో నివసించు వారు వారి మరణానంతరం వారికి స్వర్గ ప్రాప్తి కలుగుటకు తపం చేస్తున్నానని వివరిం చాడు. ఓస్‌ ఇంతేనా ఇంకా పదవికి ముప్పు వాటిల్లిందని అనుకున్నా హమ్మయ్యా అని మనసులోనే నిట్టూర్చి కురు మహారాజు వద్ద సెలవు తీసుకుని తన స్వర్గానికి బయలు దేరాడు.
ఒకసారి మాటల సందర్భంలో దేవ గురు బృహస్పతికి ఈ విషయం దేవేం ద్రుడు వివరించాడు. అప్పుడు బృహస్పతి ఇలా స్పందించినాడు మహారాజా దేవేంద్ర మీరు తక్షణమే కురుమహబుూరాజును కలవండి. ఎందుకంటే ఆయన కోరికను భగ వంతుడు అంగీకరిస్తే ఈ స్వర్గంలో నిలబడటానికి కూడా చోటు ఉండదు ఎందుకంటే ఆ క్షేత్రంలో సందర్శించిన వారు, ఆ క్షేత్రంలో నివసించినవారితో ఈ స్వర్గంలో నిండి పోతుంది. దేవ తలు వెతలు పడవచ్చు కనుక మీరు ఏదో విధంగా కురుమహారాజుతపం ఆపు చేయమని తెలిపి నాడు. దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చిన వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు. ఫలితంగా అమరావతి మనుగడ కష్టం కాగలదు. దేవతల సంఖ్య మిక్కుటంగా పెరిగి పోతుంది. పైగా భూలోకంలో నిర్వహించే యాగాలలో మాకు వచ్చే భాగం మృగ్యమవుతుంది. మా ఉనికి ప్రశ్నార్థకం అవు తుందని తెలియ చేయగా కురుమహారాజు తల పంకించెను. ఈ క్షేత్రంలో నిద్రాహారాలు మాని తపం చేయదలచిన వారికి, యుద్ధంలో వీర మరణం పొందిన వారికి స్వర్గప్రాప్తి కలిగేటట్లు నేను వరం ఇవ్వగలవాడను అని తెలియ చేసెను. కురుమహారాజు ఆలోచించి తన సమ్మతిని తెలియ చేసెను. ఆనందపడిన దేవేంద్రుడు మహారాజా మీ విజ్ఞత ఎన్నదగినది అని ప్రశ్నిస్తూ మహారాజా నేటి నుండి ఈ శమంతక పంచక్షేత్రం కురుక్షేత్రంగా పిలువ బడుతుందని చెప్పి అక్కడ నుండి నిష్క్రమించినాడు. ఇంతటి మహిమ గల ప్రదేశం అవటం వల్ల ఈ ప్రదేశం మహాభారత యుద్ధానికి వేదిక అయింది. మాన్యులైన ద్రోణుడు, భీష్ముడు, అభిమ న్యుడు వంటి వీరుల క్షత గాత్రిములతో తడిసిన నేల ఇది. ఈ క్షత్రెం సందర్శింనంత మాత్రం చేతనే వడలు పులకించునని అనేక మంది విజ్ఞుల అభి పాయం. ఇక్కడ యుద్ధం లో మరణించిన ప్రతి వీరుడు వీర స్వర్గమలంకరించినాడు.
దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చి వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్షేమం పట్టని జైట్లీ బడ్జెట్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు

మన స్మృతులు

న సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం.
శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ శ్రుతులు అంటారు. ఋషులు తపస్సు చేసి గ్రహించిన సత్యాలు, శిష్యులకు వినిపించిన విషయాలు. ఇవి రామాయణం, భారతం మొదలైన వాటిలాగ పుస్తక రూపంలో కాకుండా కేవలం గురువు శిష్యుడికి చెప్పడం. ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్పడం అనే పరంపరలో నడిచాయి. అందువల్ల వీటిని శ్రుతులు అన్నారు. వేల సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డుకుని ఇదే విధంగా రక్షింపబడిన పరంపర ఇది. మాక్స్‌ ముల్లర్‌ వేదాల్ని ముద్రించే వరకూ ఇవి వ్రాత రూపంలో లభించలేదు.
శ్రుతుల్లో చెప్పిన విషయాల్ని గుర్తుంచుకుని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన పుస్తకాలు స్మృతులు. ఇవి రెండు రకాలు. శ్రుతిలో సూత్రప్రాయంగానో, ప్రతీక రూపంలోనో (సింబాలిక్‌గానో) చెప్పిన వాటిని ఉదాహరణలతో విశదీకరించి కథల రూపంలో తెలిపేవి మొదటిరకం. శివపురాణం, విష్ణుపురాణం మొదలైనవి. శ్రుతిలో ఉన్న స్ఫూర్తితోనే సమాజానికి మార్గనిర్దేశం చేయడం, ఆచారవ్యవహారాల గురించి చెప్పడం రెండవరకం. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారదస్మృతి మొదలైనవి. వీటినే ధర్మశాసా్త్రలని కూడా అంటాం.
శ్రుతులు చెప్పే విషయాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. జీవుడి స్వరూపమేమిటి, పరమాత్మ స్వరూపమేమిటి, స్వర్గం, నరకం స్వరూపమేమిటి మొదలైన విషయాల్ని గూర్చి చెప్పడం మొదటిది. దీన్ని సిద్ధాంతస్థాయి అనవచ్చు. సమాజంలో మనిషిని సరైన మార్గంలో నడపడానికై కొన్ని కర్మలను (యజ్ఞం, దానం, వ్రతాలు, యాత్రలు మొదలైనవి) చెప్పడం, వ్యక్తుల మధ్య వర్గాల మధ్య సంబంధాల గూర్చి చెప్పడం రెండవది. దీన్ని సమాజస్థాయి అని చెప్పవచ్చు. దేశ , కాల పరిస్థితులు మారినా, సమాజంలో మార్పులు వచ్చినా సిద్ధాంతంలో మార్పులుండవు. రెండవ అంశంలో మాత్రం మార్పులు సహజంగా ఏర్పడతాయి.
వేదంలోనూ, ఉపనిషత్తుల్లోనూ చెప్పిన సిద్ధాంత భాగాన్ని స్మృతులలో కథలరూపంలో చెప్పినా విషయంలో మార్పు ఉండదు. సామాజికాంశాన్ని చెప్పేటప్పుడు కాల పరిస్థితుల్ని బట్టి కొన్ని మార్పులు రావచ్చు. దీన్ని వేదమే అంగీకరిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులో (1-11) ‘‘అథ యది తే ధర్మ విచికిత్సా వా’’ అంటూ మొదలయ్యే వాక్యం ఇలా అంటుంది. – ‘‘ఒకవేళ నీవు వెళ్ళిన ప్రాంతంలో ధర్మాన్ని గూర్చి గాని, ప్రవర్తనను గూర్చి గానీ సందేహం వస్తే ఆ దేశంలో స్వార్థంలేని వారు, సత్యనిష్ఠ సమబుద్ధి ఉన్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో దాన్నే ధర్మంగా గ్రహించు’’ అని అర్థం. బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరాచార్యులు ఒక చోట ఇదే ధోరణిలో వ్రాస్తారు.- ‘‘ఒకానొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో ఒక విషయం ధర్మమనిపించుకున్నదే మరొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో అధర్మం కావొచ్చు. అందువల్ల దీని నిర్ధారణలో శ్రుతియే ప్రమాణం’’.
భగవంతుడి గూర్చి, జీవుని గూర్చి, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి పుస్తకాలు చెప్పే విషయంలో మార్పు ఉండదు. కానీ స్మృతుల్లో (ధర్మశాసా్త్రలలో) మార్పు కనిపిస్తుంది. మనకు అనేక స్మృతులు ఉన్నాయి. అష్టాదశ (పద్దెనిమిది) స్మృతులు ప్రసిద్ధి చెందినవి కాగా మిగతా అనేక స్మృతులు కూడా ఉన్నాయి. బ్రిటీష్‌ వారు అందించారని భావించే మన న్యాయవ్యవస్థ చాలా మటుకు యాజ్ఞవల్క్యస్మృతి, దానిపై ఉన్న మితాక్షర అనే వ్యాఖ్యపై ఆధారపడి వచ్చిందే. బ్రిటీష్‌ వారు మనుస్మృతిలోని కొన్ని సామాజిక అంశాలను ఎక్కువగా విమర్శించడం వల్ల మనుస్మృతి అందరి దృష్టికీ వచ్చింది. అంతేగాని దీనిలోని విషయాలు దేశమంతటా ఒకే రీతిలో అనుసరించబడ్డవి కావు. మనుస్మృతి కృతయుగానికై (అంటే అనేక వేల యేండ్ల క్రితం) చెప్పబడిన ధర్మం. త్రేతాయుగంలో నారదస్మృతి అనీ, ద్వాపరయుగంలో శంఖ, లిఖితస్మృతి అనీ, కలియుగంలో పరాశరస్మృతి అనీ ఒక సంప్రదాయ శ్లోకం ఉంది. (ఈ శంఖ, లిఖితులు మన తెలుగువారే. కడప జిల్లాలో చెయ్యేరు, అంటే బాహుదానది తీరంలో ఈ ఇద్దరు సోదరులకై కట్టిన గుడిని కూడా మనం చూడగలం). అందుకే ఒక స్మృతికీ, మరో స్మృతికీ కొంత తేడా కనిపిస్తుంది. నేడు విమర్శింపబడే వర్ణవ్యవస్థ పట్ల వీటి దృష్టి కోణంలోని మార్పును గూర్చి ఒక ఉదాహరణ- ‘‘క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శ్రద్ధావంతులు, శుచిగలవారు అయినప్పుడు వాళ్ళ గృహాలలో జరిగే హవ్య, కవ్యాది కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేయాలి’’ (పరాశరస్మృతి 11-13). అంటే యజ్ఞం చేయించినా, శ్రాద్ధ కర్మలు చేయించినా వారి ఇండ్లలో భోంచేయాలి అని అర్థం. మరొక శ్లోకంలో ‘‘మన ఇంట్లో పనిచేసేవారు, గోపాలురు, కులానికి మిత్రులు అయిన శూద్రులందరూ భోజ్యాన్నులు (పరాశరస్మృతి 11-22). భోజ్యాన్నులు అంటే వీరిచ్చిన అన్నం తినవచ్చు అని అర్థం. ఇలా కాలానుగుణంగా పరాశరస్మృతియే కాక తరువాత వచ్చిన స్మృతులు కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, సమాజాన్ని సంఘటిత పరచడానికి అనేక సూచనలు ఇచ్చాయి. బ్రాహ్మణుడు తన వేదాధ్యయనానికి ఎలాంటి భంగం లేకుండా ఆచరించదగిన విషయాలు ఇవి. అలాగే సమాజంలో వర్గాల మధ్య దూరం పాటిస్తున్న మిగతావారు కూడా ఆచరించదగినది.
ఇవన్నీ ఎందుకు అంటే సనాతనధర్మం ఎప్పటికప్పుడు సామాజిక మార్పును దృష్టిలో ఉంచుకొని maximum good for maximum people అనే దృష్టిలో మార్పు చెందగల సామర్థ్యం ఉన్నది అని గ్రహించడానికే. తెలుగు రాషా్ట్రలలో ప్రసిద్ధి పొందిన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ప్రేరణతో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘కౌండిన్యస్మృతి’ (ఎమెస్కో వారి ప్రచురణ) అనే పుస్తకాన్ని రాశారు. ఇది పైన చెప్పిన విషయాల్ని ఇంకా వివరంగా తెలుపుతుంది. ఇది విద్యావంతులందరూ పరిశీలించల్సిన గ్రంథం.
ఒకప్పుడు వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ సమాజంలో మానవ సంబంధాలు, నైతికత (agricultural morality)కు, తర్వాత వచ్చిన పారిశ్రామిక సమాజ నైతికతకూ(industrial morality)కి నేటి సాంకేతిక విప్లవాన్ని సాధించిన సమాజంలోని నైతికతకు చాలా తేడా ఉండడం సహజం. గ్రామీణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పూర్తిగా మారిన సమయంలో నైతిక విలువల్ని నిలపడం చాలా అవసరం.
సమాజం విడిపోకుండా సంఘటితంగా ధరించి ఉండేదే ధర్మం. (ధారణాత్‌ ధర్మ: అన్నారు). కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు, సమాజంలోని వర్గాల మధ్య సంబంధాలు, ఒక సమాజం యొక్క శక్తిని సూచిస్తాయి. సంబంధాలు పటిష్టంగా ఉంటే సమాజం పటిష్టంగా ఉంటుంది. ఈ శక్తినే నేటి భాషలో Social Capitalఅంటారు. సమాజంలోని మార్పుకు అనుగుణంగా మారే శక్తి ధర్మశాసా్త్రల్లో ఉంది. కానీ వీటి అవగాహన మనందరికీ లేదు. అవగాహన ఉన్నా వ్యక్తిస్థాయిలో ఆచరించగలం కానీ విస్తృత స్థాయిలో ఆచరింపజేయడం సాధ్యపడదు. వీటిని అవగాహన చేసుకోవడం, ఆచరణలోకి తేవడం మన ధర్మ సంస్థలు, మతాధిపతులు చేయగల విషయం.
కంచిలో ఆలయ జీర్ణోద్ధరణ విరాళాలకై భక్తులకు పిలుపు

ప్రముఖ శక్తిపీఠంగా విలసిల్లుతున్న కంచి కామాక్షి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయనున్నట్లు కంచి దేవస్థాన ధర్మాధికారి చల్లా విశ్వనాథ శాసి్త్ర వెల్లడించారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే పునరద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే ఆలయ జీర్ణోద్ధరణ జరిగినట్లు వివరించారు. ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నేతృత్వంలో 1975లో పునరుద్ధరణ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ కమిటీకి ఏసీ ముత్తయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ పుణ్యకార్యంలో భక్తులు కూడా పాలుపంచుకోవచ్చని విశ్వనాథశాసి్త్ర తెలిపారు. వారు తాము అందజేసే విరాళాలను ‘‘శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీకామాక్షీ అంబాల్‌ దేవస్థానమ్‌ రినోవేషన్‌ కమిటీ, నెం 1, సాలై, స్ర్టీట్‌ కాంచీపురం, 631502 చిరునామాకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ భారత మోక్షపురి
దక్షిణ భారత దేశంలో ఏకైక మోక్ష పురిగా విలసిల్లుతున్న కంచికి ఎన్నో విశిష్టతలున్నాయి. 64 వేల శక్తి పీఠాలలో అత్యంత ముఖ్యమైన శక్తిపీఠమైన కంచిలో కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కామాక్షి దేవాలయాన్ని పల్లవులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత కాలంలో ఆదిగురువు శంకరాచార్యులు ఇక్కడ శ్రీపీఠాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో 16 వశతాబ్దంలో మరోసారి ఆలయ పునరుద్ధరణ చేశారు. 19వ శతాబ్దంలోనూ, 20 వ శతాబ్దంలో మరో రెండు సార్లు ఆలయ జీర్ణోద్ధరణనను కామకోటిపీఠం పూర్తి చేసింది.
ఆదాయపన్ను మినహాయింపు పొందాలనుకునే భక్తులు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో ఈ కింది చిరునామాకు పంపాలని ఆలయ అధికారులు వెల్లడించారు.
HIS HOLINESS SRI JAYENDRA  SARASWATHI SWAMANGAL GOLDEN JUBLEE
 CHARITABLE TRUST
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు

మంచీ మర్యాదా లతో అనుభూతి

మేము అంటే గబ్బిట దుర్గాప్రసాద్ ,మా శ్రీమతి ప్రభావతి  మా బావమరది టి వి ఎస్ బి ఆనంద్ ,భార్య రుక్మిణి కలిసి 6-3-15 శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ముందే ఏర్పాట్లు చేసుకోన్నాం .మేమిద్దరం సీనియర్ సిటిజన్ లం .టికెట్లు అక్కర్లేదు ..వాళ్ళిద్దరూ ౩౦౦ రూపాయల టికెట్ పై దర్శనానికి వచ్చారు .సీనియర్ సిటిజెన్స్ అయిన మా ఇద్దరినీ బాటరీకార్ పై  దర్శన క్యూ ప్రదేశానికి చేర్చి ఏంతో ఆనందాన్నికల్గించారు దేవస్థానం వారు .అక్కడ  మా ఐడెంటిటి చెక్ చేసి ,లెఫ్ట్ హాండ్ చూపుడు వ్రేలు ప్రింట్ తీసుకొని ,ఫోటో తీసుకొని కంపార్ట్ మెంట్ లో చాలా మర్యాదగా కూర్చోబెట్టారు .మధ్యాహ్నం 1-30 కు అక్కడ కు చేరాం .ఇంతలో వాలంటీర్లు అందరికి చల్లని మంచినీళ్ళు అడిగి అడిగి అందజేశారు .తర్వాత సాంబారు అన్న ప్రసాదాన్ని ప్లేట్ లలో పెట్టి అందించారు .అది రుచికరం గా శుచిగా ఉంది .కడుపార తిన్నాం .కావాలంటే మళ్ళీ పెట్టారు .కొద్ది సేపటి తర్వాత వేడి వేడి పాలను గ్లాసులలో ప్రతి వొక్కరి దగ్గరకు వచ్చి ఆప్యాయం గా అందించారు .మళ్ళీ మళ్ళీ అడిగి అవసరమైన వారికి అందజేశారు. చాలా ముచ్చటేసింది దేవాలయం మర్యాదలకు .2-45 కు దర్శనానికి గేట్ తీశారు .పై నుండి కిందికి స్లోప్ మీద దిగి క్యూ లో నెమ్మదిగా కదిలాం. మా బాచ్ లో వికలాంగులు ,అసలే నడవ లేని వారు దేకుకొంటూ వెళ్ళేవారుకూడా ఉన్నారు .వారికేవ్వరికి ఇబ్బందికలుగాకుండా అందరూ జాగ్రత్తపడ్డారు .ఎగుడు దిగుడులు లేని సమతల ప్రదేశం మీదనే నడక హాయిగా ఉంది .బంగారు వాకిలి వరకు వెళ్లాం .అక్కడి నుండి లోపలి కొద్దిగా రష్ గా ఉంది. ఒక పండుముసలాయన వీల్ చైర్ లో అక్కడికి వచ్చారు .వారికి కదిలే శక్తి ఏడూ అయినా శ్రీవారి దర్శనం తో ధన్యం అవాలని వచ్చారు .వారి అబ్బాయిలు అక్కడినుండి చేతుల మీద మోసుకొని వెళ్లి లోపలి బంగారు వాకిలి ద్వారా లోపలి తీసుకొని  వెళ్లి అత్యవసర దర్శనం చేయించి ఆ ముసలిప్రణానికి గొప్ప  ఆనందాను  భూతి కలిగించారు .దేవాలయ  సిబ్బంది కూడా ఎంతో సహకరించారు .నాకు వారందరిలో మానవత్వం పరిమళించినట్లని పించింది .ముప్పావుగంటలో మాకు శ్రీవారి దివ్య దర్శనం మహా వైభవం గా లభించి మనసునిండా సంతృప్తి తో  బయటికి వచ్చాం .౩౦౦ రూపాయల టికెట్ తీసుకొన్న మా బావమరది భార్య కూడా హాయిగా దర్శనాను భూతి పొంది బయటికి మాతో పాటే  వచ్చారు .ఈ అనుభూతి మరువ రానిదిగా మరచిపోలేనిదిగా   సంతోష సంతృప్తి కరం గా  నిలిచి పోయింది .దీనికి మహా విరుద్ధం గా మర్నాటి దర్శనం కల్లోలం రేపి  దారుణం గా బాధగా నిలిచింది .

వి ఐ పి దర్శనం కాదు వి పి .దర్శనం

మా తిరుపతి పెళ్ళివారు 7-3-15  శనివారం ఉదయం 6 గంటల బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి 500 రూపాయల టికెట్లు కొని మా ఇద్దరికీ ,మ బంధువులావిడ రమాబాయి అనే 85 ఏళ్ళ వృద్ధురాలికి 65 ఏళ్ళ ఆమె కుమార్తెకూ మాతో పాటు రిజర్వ్ చేయించారు .తెల్లవారుజ్హామున రెండున్నరకే లేచి స్నానాలు చేసి నాలుగు గంటలకు పెళ్ళివారు ఏర్పాటు చేసిన ఇండికా కారులో బయల్దేరి అయిదింటికే దర్శనం క్యూ దగ్గరకు చేరుకొన్నాం .మాకు ఇబ్బందికలుగాకుండా మానిటర్ చేయటానికి ఇద్దరు ఉద్యోగులనూ మావాళ్ళు మాతో పంపారు .నాలుగైదు చోట్ల మేడమేట్లు ఎక్కి ,దిగి ముసలీ ముతకా నానా ఇబ్బందిపడ్డారు .కంపార్ట్ మెంట్ లలో కూచుని కూచుని విసుగు కూడా పుట్టింది .అక్కడేమీ శ్రీవారి నామ స్తోత్రాలు కాని ఏవీ పెట్టలేదు .పవిత్రమైన మనసు ఆందోళనకు గురైంది .అలాగే బాధ పడి చివరికి గేటు దగ్గరకు చేరాం .సెక్యూరిటీ చెక్ పూర్తీ చేసుకొని గుంపులో గోవిందలాగా నడకే నడక .ఈ వయసులో ఇంత దూరం నడవాల్సి వచ్చిందని పెద్దవాళ్ళు లబో దిబో .వాళ్ళను బైపాస్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడ్డా ససేమిరా అన్న వాలంటీర్లు .చచ్చీ చెడి బయటి బంగారు వాకిలి దాటాము ముసలివాళ్ళతో .అక్కడ తోపులాట .ఇంకేరకమైన దర్శనం లేకపోయినా సరైన అవగాహన తో అధికార్లు పని చేయక పోవటం తో తీవ్ర ఇబ్బంది .కంపార్ట్ మెంట్ ఖాళీ కాగానే రెండో దానిలోకి వెడితే ముందు వెళ్ళిన వారికే సీటు దక్కింది మిగాతా వాళ్ళందరూ  స్టాండింగ్ .ఇది మరీ కలచి వేసింది .చివరికి లోపలి బంగారు వాకిలి దాటి శ్రీవారి సన్నిధికి చేరాం .అది బాగా స్లోప్ గా ఉండటం తో ముసలివారు చేతిలో కర్ర సాయం తో నడిచేవాళ్ళు చాలా ఇబ్బందిపడ్డారు .మాతో వచ్చిన ముసలావిడను అక్కడి వాలంటీర్లు పక్కి లాగడం తో ఆమె కిందపడి కళ్ళ జోడు జారి పడిపోయి స్వామివారిని చూడలేక పోయింది కళ్ళజోడు కోసం వెతుక్కుంటుంటే వాలంటీర్లు కస్సు బస్సూ .వాళ్ళంతా దడి కట్టి స్వామివారి దర్శనానికి తీవ్ర అవరోధం గా నిలిచారు .వారి సంభాషణ ,ప్రవర్తన అత్యంత హేయం గా అవహేళనగా ,జుగుప్సగా ఉంది .పెద్దలను చేయిపట్టుకొని  ముందుకు తీసుకు వెళ్లి   దర్శనం  చేయించి సాయపడటం పోయి   ,జర్మన్ నాజీ  కాంపులలో చూపిన దారుణమైన ట్రీట్మెంట్ జుగుప్సను కలిగించింది.అప్పటికీ ముసలావిడ కళ్ళ జోడు జారింది అది పెట్టుకొని దర్శనం చేసే దాకా ఓపిక పట్టండి అనిబతిమిలాడినా వినలేదు ‘’ఇక్కడ అంతే .ఎవరూ ఏమీ చెయ్యలేరు .అంత ఇష్టం లేక పొతే పొండి ‘’అన్నారు .మా శ్రీమతి పొట్టి  ఆవిడ కనుక ఆవిడకూ దర్శనం బాగా జరగలేదు. అందరూ దడి కట్టి నట్లు నుంచుని వాలంటీర్లే దర్శనానికి తీవ్ర విఘాతం కలిగించారు .మొదటి నుంచి వీరి తీరు చాలా అమర్యాదకరం గా ఉంది .వి ఐ పి లను ‘’వి పి ‘’లను చేసి అవమాన పరచారు  ఈ తీరు  మార్చుకోవాల్సిన అవసరం ఆలయ అధికారులకు ,పర్య వేక్షకులకు ఉంది .నిన్నటి సీనియర్ సిటిజెన్ దర్శనం పరమానందం గా ఉంటె ,ఇది పరమ ఘోరం గా ఉంది .అసలు ఆమాటలు, వాళ్ళ చేష్టలు మానవత్వాన్ని మరచి రాక్షస ప్రవ్రుత్తి ప్రవేశించిన వారి లాగా ఉన్నాయి ‘’షేం టు టి టి డి’’.

సీనియర్లయినా వికలాన్గులైనా బయటికి వచ్చిన తర్వాత ఏంతో దూరం వెడితెకాని లడ్డూ కౌంటర్లు కనపడవు .అంత దూరం వెళ్ళలేని వారి గతి ఏమిటి ?వారిని అనుసరించేవారు లేకపోతె లడ్డూలు అందవుకదా.కనుక సీనియర్, వి ఐ పి దర్శనాలవారికి లైన్ లోనే లడ్డూలు ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ..

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-15  .

 

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,ఒరిజినల్ తిరుమల ”నామాల కొండ ”

7-3-15 శనివారం మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,వారింటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల ”నామాల కొండ ”

Posted in నా డైరీ | Tagged | Leave a comment

7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య దర్శనం ,సేకరించినభద్రపరచిన ”కళా నికేతనం ”దృశ్యమాలిక 

7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం  మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య దర్శనం ,సేకరించినభద్రపరచిన  ”కళా నికేతనం ”దృశ్యమాలిక

Posted in నా డైరీ | Tagged | Leave a comment

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు 

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు

Posted in నా డైరీ | Tagged | Leave a comment

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి 

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి

Posted in నా డైరీ | Tagged | Leave a comment

9–3-15 , మా అక్కా బావల ఇంట్లో మేము ,వేదవల్లి గాయత్రిలతో మేము –

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

9-3-15 సాయంత్రం హైదరాబాద్ , తమ్ముడు కృష్ణ మోహన్ ఇంట్లో

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి 

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ  తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఆహ్వానం

మార్చ్ 16 సోమవారం సా – Copy0001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్యన జీవితం – శీలా వీర్రాజు

silavi1 001 silavi2 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

10-ఫియోడర్ డాస్టో విస్కీ –2

సెమి పాలంట్ నిస్కి  లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరొకరిని  మనసిచ్చి మనవాడికి నిరాశ కలిగి౦చి౦ది .కాని ఆమె అంటే ఆరాధనమాత్రం తగ్గలేదు .ఆమెనే పెళ్లి చేసుకొని ఆమె కొత్త భర్తను, కొడుకును ,ఆమెను పోషించాడు . ప్రభుత్వం పూర్తిగా క్షమ ప్రసాదించి పీటర్స్ బర్గ్ లో మామూలు జేవితాన్ని గడపటానికి అంగీకరించిం ది.రష్యాలో సంస్కరణ ఉద్యమం ఊపులో ఉంది .సోదరుడు మైకేల్ తో కలిసి దాస్తోవిస్కి ‘’వ్రేమ్యా ‘’(టైం )మేగజైన్ ను నడిపాడు రెండు విలువైన పుస్తకాలు ‘’ది ఇన్ సల్టేడ్ అండ్ ఇంజూరేడ్ ‘’’’ది హౌస్ ఆఫ్ ది డెడ్ ‘’రాశాడు .రెండవ నవలను టాల్ స్టాయ్ బాగా మెచ్చాడు. ఇది ఆయన జైలు జీవితమే జీవిత పోరాటం లోనే జీవిస్తున్నాడు .ఆగిన సృజన ప్రవాహాన్ని కదిలించి వేగవంతం గా రాసేస్తున్నాడు .జర్మని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ టూర్ చేశాడు .అక్కడి భౌతిక వ్యామోహం పై ఏవగింపు కలిగి ‘’వింటర్ నోట్స్ ఆన్ సమ్మర్ ఇంప్రె షన్స్ ‘’రాశాడు వాటిపై .మొదట్లో  ఆంక్షలు విధించినా తర్వాత వదిలేశారు అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది .

40 లో మూర్చ తీవ్రమైనది. జ్ఞాపక శక్తి క్షీణించింది .స్థలమార్పు అవసరమన్న డాక్టర్ సూచన పై విదేశీ యానం చేశాడు .పోలినా సుస్లోవా అనే పిల్లపై పారిస్ లో  వ్యామోహం లో పడ్డాడు .చేతిలో చిల్లిగవ్వ లేని స్తితిలో ఉన్నాడు .జాక్ పాట్ కొట్టి ఏదో లబ్దిపొందాలని జర్మన్  గాంబ్లింగ్ లో దిగాడు .గెలుపు ఓటమిల దోబూచులాటలో పడి అదే వ్యామోహమై తానూ ఎందుకిక్కడికి వచ్చాడో మర్చేపోయాడు .పారిస్ చేరాడు .ప్రేమించిన పోలినా లవర్ ఆమెను మోసం చేసి జంప్ జిలానీ .ఆమె పోషణ కూడా మీదేసుకొన్నాడు మన విశాల హృదయుడు .ఆమెతో వీస్ బెడేన్ వెళ్లి మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చూన్ లో కూరుకుపోయాడు . ఇంటిదగ్గర భార్యకు తీవ్ర అనారోగ్యం గా ఉందని తెలిసి రష్యా చేరాడు .భార్య కు పిచ్చెక్కి చనిపోయింది .కొంతకాలానికి తాను  అధికం గ ప్రేమించిన సోదరుడూ చనిపోయాడు మళ్ళీ డిప్రెషన్ లో పడ్డాడు. మైకేల్ చేసిన విపరీతామైన అప్పులు తీర్చాలనే సంకల్పం తో విపరీతంగా వేగం గా రాశాడు, గాంబ్లింగ్ ఆడాడు .ఉన్నదంతా ఊడ్చుకు పోయింది పోలినాడబ్బును కూడా క్షవరం చేశాడు .కాండిల్స్ కొనే స్తోమతకూడా లేక  రాత్రుళ్ళు  చదవటం రాయటం మానేశాడు .ఒక్క రూబుల్ అప్పుకోసం వీధుల వెంబడి మూడేసి రోజులు తిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి .

అదృష్టం ఒక్క సారిగా తలుపు తట్టింది ‘’ది గాంబ్లర్  ‘’’’క్రైం అండ్ పనిష్మెంట్ (నేరము శిక్ష)నవలలు రాయటానికి పబ్లిషర్ తో ఒప్పందం కుదుర్చుకొని గడువు లోపల పూర్తీ చేయటానికి అన్నా గ్రిగేరేవ్నా ‘’అనే స్టె గ్రాఫర్ ను పెట్టుకొని పూర్తీ చేసి చివరికి ఆమె ప్రేమబంధం లో చిక్కి పెళ్లి చేసుకొన్నాడు .నేరము శిక్ష గొప్ప విజయాన్ని సాధించింది కాసుల వర్షమే కురిపించింది.అప్పులవాళ్ళు మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు.చిప్ప చేతిలో పట్టుకొని కొత్తభార్య తో రాష్యా వదిలి జెర్మని స్విట్జెర్లాండ్ ఇటలీలు తిరిగాడు .సుఖం ఆనందం పొందలేక పోయాడు .స్వంత ఇల్లు ఎర్పరచుకోవాలనే కోరిక కలిగింది .అందులో కూర్చుని హాయిగా స్వేచ్చగా రాసు కోవాలనుకొన్నాడు .రష్యా గాలి అ నీరే తనకు బలవర్ధకం అనుకొన్నాడు ఫిట్లు ,గాంబ్లింగు జోరైనాయి .శక్తి  క్షీణించి పోతోందని సృజన మందగించిందని బాధ పడ్డాడు .సరదా గా మొదలైన జూదం వ్యసనమై పీల్చి పిప్పి చేసింది .ఇడియట్ ,దిపోసేసింగ్ నవలలు రాస్తున్నాడు .జెనీవాలో భార్య గర్భవతి గా ఉన్నప్పుడు చేతిలో 5 ఫ్రాంకులు మాత్రమే ఉన్నాయి .మొదటి బిడ్డ మరణం రెండో బిడ్డ ద్రేస్దేన్ లో జననం .తన దీన స్తితిని తెలియ జేస్తూ స్నేహితునికి ‘’నా భార్య ఒక పిల్లాడిని పోషించాలి .నేను ఎందుకూ పనికి రాని వాడినైపోయాను . ఎప్పుడూ ఆకలి తో ఉంటున్న నేను ఏమి ఎలా రాయగలను .ఆకలి రాక్షసినన్ను కొరికి తినేస్తోంది .చదరంగం ఆడి డబ్బు సాధించటం తప్ప గత్యంతరం లేదు ‘’అని రాశాడు .

వేదనా బాధ దరిద్రం నిర్లక్ష్యం పెనవేసుకు పోయి అతనితో చదరంగం ఆడాయి .ఓడిపోయాడు అన్ని ఆటలలో .విముక్తి భావాలను గాలికి వదిలేశాడు . చాందసం పెరిగింది మతం నరనరానా పాకింది .గురూగారికి 50 ఏళ్ళకు మొకాలిలోని మెదడు అసలు స్థానానికి చేరి చేసిన తప్పులకు చెంపలేసుకొని పశ్చాత్తాపపడి జూదానికి గుడ్ బై చెప్పి మళ్ళీ రష్యాలో అడుగు పెట్టాడు .అప్పులాళ్ళు అతని రచనలకు అడ్డుపడలేదు .స్వేచ్చగా రాయనిచ్చారు .ఊపిరి తీసుకొని మహా రచనలని పించుకొన్న ‘’ది పోసేసేడ్ ‘’’’ది ఎటర్నల్ హస్బండ్ ‘’ది బ్రదర్స్ కర్మ జావ్ ‘’లను క్షణం తీరిక లేకుండా గాంబ్లింగ్ లో వృధా చేసుకొన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని తీక్షణం గా రాశాడు అధిక శ్రమ చేశాడు .చావు మీద పడిన వాడైపోయాడు అలసట తో .

60 మీద కొచ్చాయి .మూడు నెలల తర్వాత మృత్యువు కబళించింది .మనసులో అనుకొన్న పుస్తకాలు రాయటానికి ఇంక ఎక్కువకాలం బతికితే బాగుండును అనుకొన్నాడు .బ్రదర్స్ నవల చివరి భాగం రాస్తూ పెన్ను చేతిలోనుంచి జారిపడి దాస్తోవిస్కి 28-1-1881న మరణించాడు .రష్యా రచయితలూ చాదస్తం గా రాస్తారనే అపప్రధ లోకం లో ఉంది .కాని దాస్తోవిస్కి మనసుపెట్టి రాశాడని ,ప్రతివారితోను మాట్లాడినట్లు రచన చేశాడని మెచ్చుకొంటారు .అతని గొప్ప ఫాన్ అయిన వర్జీనియా ఉల్ఫ్ ‘’his novels are seething whirlpools ,gyrating sand storms ,water spouts which hiss and boil and suck us in .the y are composed purely and wholly of the stuff of the soul .The elements of the soul are seen not separately but streaked ,invoved ,inextricably confused ,a new panorama of the human mind is revealed ‘’అంటూ పరవశం తో చెప్పింది .ఆయన రచనలు పాపులు నేరస్తులు ,ఆత్మ పరాదీనులగురించే రాశాడు .ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టించాడు .సెయింట్ అల్యోశా లాంటి పాత్రలు సృష్టించాడని సోమర్సెట్ మాం పొగిడాడు .ప్రపంచం లో జరిగే ప్రతినేరానికి మన బాధ్యతా ఉంది మన ప్రమేయం లేకపోయినా అనుభవించాల్సి వస్తోంది అంటాడు దాస్తోవిస్కి

కదా నవలా రచయితగా ,జర్నలిస్ట్ గా ఫిలాసఫర్ గా  గుర్తింపు పొందాడు .మత ఆధ్యాత్మిక వేదాంత విషయాలను గురించి రాశాడు .ఎపిగ్రామ్స్ కవితలూ రాశాడు .నవలలో జీవిత చరిత్రను జోడించాడు .తాను  ఫిలాసఫీలో బలహీనుడిని  అని చెప్పుకొన్నా డాస్తో విస్కీ రచనలలో ఫిలాసఫీయే ఎక్కువ గా కనిపిస్తుంది .రష్యన్ స్వర్ణ సాహిత్య యుగం లో టాల్ స్టాయ్ ,డాస్తో విస్కీ లే అధిక ప్రాచుర్యం పొందారు .ప్రఖాత గణిత విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ అతన్ని ‘’గొప్ప మత రచయితఅని ‘’who explores the mystery of spiritual existence ‘’ అన్నాడు .ఆధునిక వచనానికి ఆద్యుడు దాస్తోవిస్కి అన్నాడు జేమ్స్ జాయిస్ ‘’.ఆతని రచనల్లో నమ్మేవి నమ్మలేనివీ ఉన్నా  చదువుతూ పోతే తను చెప్పినవన్నీ యదార్ధమే అనిపిస్తాయి’’అన్నాడు మరో అమెరికన్ లిజెండ్ హెమింగ్ వే .కాఫ్కా ‘’నాకు రక్త బంధువు దాస్తోవిస్కి ‘’అన్నాడు .ఫ్రాయిడ్ ‘’కర్మజారో నవల ఇంతకు  ముందెన్నడూ రాని మహత్తర నవల ‘’ అని పొంగిపోయాడు .సర్రియలిస్టూలు సింబాలిస్ట్ లు ఎక్సేన్శియలిస్ట్ లు  బీట్ సంగీతం వాళ్ళు తమకు ప్రేరణ దాస్తోవిస్కి అన్నారు

1956లో రష్యా ఆయన పేర పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఆయన పేర మ్యూజియం ఏర్పరచారు .బుధ గ్రహం మీద ఒక క్రేటర్ కు ఆయన పేరు పెట్టారు .1991లో కనుగొన్న చిన్న గ్రహాన్ని ఆయన పేరుతొ పిలిచారు .ఆయన పేరుమీద ఎన్నో సంస్థలు ఎన్నో రకాల అవార్డులు అందజేస్తున్నాయి  .170ప్రపంచ భాషలలోకి ఆయన రచనలు అనువాదాలయ్యాయి .ఎన్నో సినిమాలు తీశారు .మొత్తం మీద పదిహేను  నవలలు నవలికలు రాశాడు .,రష్యా విప్లవం లో రెండు మూడు పేరాలు కుదించారు   .17చిన్నకధలు 5 అనువాదాలు చేశాడు .

సశేషం

 

మరో ప్రముఖ వ్యక్తీ తో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి నిజం పత్రిక లో – నా గురించి — ఆధ్యాత్మక సాహిత్యపు “గబ్బిట’ దుర్గ ప్రసాద్

03-04-2015_4

 

http://www.netinizam.com/default.aspxUntitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

10-ఫియోడర్ డాస్టో విస్కీ –

జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే  డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్  డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల సాకారానికి ఆరాటం .భరించ లేని వేదన ,దాని సాఫల్యతకు నిరాశా పూరక పోరాటం .పుట్టిన నాటి నుండీ ఇదే తీరు .27 ఏళ్ళ వయసులో ఉరి శిక్ష ఆఖరి క్షణం లో రద్దు అయి మనకోసం బతికాడు .ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయితగా మిగిలాడు .

30-10-1821మాస్కోలో మురికి చిన్న పబ్లిక్ హాస్పిటల్ లో తండ్రి స్టాఫ్ ఫిజీషియన్ గ ఉన్న చోట ఏడుగురుసంతానం లో ఒకడుగా పుట్టాడు .బాల్యం లో పేదరికం ,జబ్బులు ,అకస్మాత్తు చావుల వార్తలే ప్రతి రోజూ వినేవాడు .తండ్రి తాగుడుకు విపరీతం గా బానిసై ఉద్యోగాన్ని పోగొట్టుకొంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి కొద్దో గొప్పో సంపాదించి కుటుంబాన్ని పోషించాడు ఎనిమిదో ఏటనే దాస్తోవిస్కి కి దుఖం, దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలిసింది .ఈ సమస్య బైబిల్ లోని నీతికద అతని జీవితాంతం గుర్తుండిపోయాయి .54 వ ఏట భార్యకు జాబు రాస్తూ ‘’బుక్ ఆఫ్ జాబ్ చదువుతున్నా .అది మళ్ళీ నాలో పాత దుఖం వేదన దుస్తితి జ్ఞప్తికి తెచ్చింది చదవటం ఆపేసి పుస్తకం పక్కన  పారేసి పచార్లు చేశా .నా కన్నీళ్లు ధారాపాతం గా కురుస్తూనే ఉన్నాయి బలవంతం గా ఆపుకోగాలిగాను ఈ పుస్తకమే మొట్ట మొదటి సారిగా నన్ను ఆకర్షించి పట్టేసుకోన్నది ‘’అని రాశాడు .

16 ఏట సోదరుడు మైఖేల్ తో బాటు సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మిలిటరీ ఇంజినీరింగ్ స్కూల్ లో చేరాడు నాలుగేళ్ళు చదివాడు. రోజూ కవాతు భరించలేకపోయాడు .ఖాళీ దొరికినప్పుడల్లా దొరికినన పుస్తక౦ చదివాడు పుష్కిన్ కవిత్వం పైనా ,బాల్జాక్ వచన రచన రచన మీదా విపరీత మైన అభిమానమేర్పడింది .బాల్జాక్ రచన ‘’యుజినీ గ్రాన్ డేట్ ‘’ను అనువదించాడు .20 కి ఆర్మీలో   సెలెక్ట్ అయ్యాడు .కాని ఇంకో ఏడాది స్కూల్ లోనే చదివాడు  .తర్వాత రెండేళ్ళు మిలిటరీ ఇంజినీరింగ్ లో తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చి చేశాడు .ఇంతలో తండ్రి హత్యకు గురైనాడు .జాగ్రత్త లేకపోవటం వలన సంపాదించిన డబ్బంతా వృధాగా ఖర్చు చేసేశాడు .బాల్జాక్ ను చదవటం వలన ‘’రష్యన్ హ్యూమన్ కామెడి ‘’రాయాలని కలలు కనేవాడు .ఆరు నెలలు కస్టపడి రాసి ‘’పూర్ ఫోక్ ‘’మొదటి నవల పూర్తిచేసి ప్రచురించాడు ..

మొదటినవలె అయినా అది బాగా అందర్నీ ఆకర్షించి నేక్రసోవ్ అనే విమర్శకుడు గోగోల్ తో సమానంగా రాశాడని కీర్తి౦చి ‘’ఇంతకీ  నువ్వేమి రాశావో నీకైనా తెలుసా?’’అని ప్రశ్నించాడు  .ఈ విషయాన్ని 30 ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని దాస్తోవిస్కి ‘’నా జీవితం లో దీనిని మించిన  గొప్ప ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు ‘’అని చెప్పుకొన్నాడు  .పూర్ ఫోక్ లో లో పాత్రలన్నీ ఉత్తరాలద్వారా విషయాలను ఆకలితో అలమటిస్తూ ,కొంచెం పాలు  చిన్న రొట్టెముక్క తింటూ బతుకుతూ  తెలియ జేస్తాయి .ఈ నవల  ఇన్ స్టంట్ట్ సక్సెస్ సాధించటం తో రచయితగా పేరొచ్చింది .అధోజగత్ సహోదరుల జీవితాలే అతని కదా వస్తువులైనాయి .27 వయసులో మెలో డ్రామా జోడించి విషాదపాత్రలతో రెండోనవల మొదలుపెట్టాడు .కొన్నేళ్ళతర్వాత యువ రాడికల్స్ తో పరిచయమేర్పడి ఫోరియర్ రచనలు చదివి సోషలిజం గూర్చి వాళ్ళతో చర్చించాడు .1848 రష్యా విప్లవ కాలం లో ఇలాంటి చర్చలు దేశ ద్రోహ నేరం .దాస్తోవిస్కి తో పాటు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేసి పీటర్ అండ్ పాల్ ఫోర్ట్రెస్ లో బంధించి విచారించారు .ఉరి శిక్ష ఖాయం చేశారు .వద్య స్థలానికి ఒకరోక్కరినే తీసుకోనివేడుతున్నారు .శిక్ష ను చదివి వినిపించి ఒక్కొక్కరినే ఉరి తీస్తున్నారు .అందరిలో నిరాశా నిస్పృహా నిర్వేదం నిండి ఉన్నాయి .ఉరి తీయబదేవారి వరుసలో ఆరో వాడు దాస్తోవిస్కి .కళ్ళు మూసుకొన్నాడు .ఆ సంఘటన గురించి తరవాత రాస్తూ ‘’ఒక్క నిమిషమే నాకు బతికే కాలం మిగిలి ఉంది .ఒక తెల్ల గుడ్డముఖం పై కప్పారు .సైనికులు వెనక్కి వెళ్లి నిలబడ్డారు .ఇంతలో జార్ చక్రవర్తి మా అందరికి ప్రాణ భిక్ష పెట్టినట్లు వార్త చదివారు ‘’.ఉరి శిక్ష నాలుగేళ్ల సైబీరియా  కఠిన జైలు శిక్షగా మార్చారు .ఇది ఒక వ్యక్తీ జీవితం లో అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశం .ఊహించలేనిది రానిది. అలా  మృత్యు ముఖం  నుండి డాస్తో విస్కీ బయటపడి ప్రపంచ ప్రఖ్యాత రచయిత అయ్యాడు  .మనసులో పడిన ఈ మచ్చ జీవితాంతం మరచిపోలేదు ..

ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో సైబీరియా లో శిక్ష అనుభవించాడు .38 వయసులో మళ్ళీ సెయింట్ పీటర్స్ బర్గ్ చేరాడు సృజన జీవితం లో మూడవ వంతు ప్రవాసిగా గడిపిన దురదృష్ట వంతుడు దాస్తోవిస్కి .కోటార్గా,ఓంస్ నేర బందికానాలలో ఉండగా రాళ్ళు పగల కొట్టించారు ,రాళ్ళు  మోయించారు .ఏ పుస్తకమూ చదవ నివ్వలేదు ఒక్క అక్షరం కూడా రాయనివ్వలేదు .ఒక్క బైబిల్ చదవటానికి మాత్రమే పర్మిషన్ ఉండేది .ఆ దుర్భర నరక వేదన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకొందాం ‘’eternally in chains ,eternally under guard,eternally behind bolts and bars and never alone !Total suppression of the mind –that was life in the fortress ‘’ఎన్నో భావాలు వచ్చేవి ఆవన్నీ వాహిక లేక ఇంకిపోయేవి .ఏదేదో రాయాలనిపించేది కాని రాయటానికి పేపర్ కూడా నిషేధమే .ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మూర్చ రోగం వచ్చింది .

జైలు నుంచి విడుదల చేశారుకాని సైబీరియన్ టౌన్ సెమి పాలటిన్ స్క్ కు చేరాడు .కొంత ఆరోగ్యం కుదిరింది .నాలుగేళ్ళు జన జీవితానికి దూరమై ఉన్నాడు బైబిల్ ఒక్కటే అతనికి ఊరట గా ఉండి దైవానికి దగ్గర చేసింది .రాడికల్ భావాలు మార్చుకొన్నాడు .ఆస్నేహితులకు దూరమైపోయాడు. ఆలోచనా విధానం లో పెద్ద మార్పు వచ్చింది .ప్రపంచాన్ని సోషలిజం ద్వారా ఉద్ధరిద్దామన్న భావన తొలగి పోయి౦దిమనసునుండి .మతానికి చేరువైపోయాడు .ప్రజలు నమ్మారుకనుక తానూ నమ్మాను  అని చెప్పాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92

చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై లాస్ట్ పీరియడ్ లో ‘’చెక్కేస్తారు ‘’నేనూ అందుకు మినహాయింపు కాదు .గండ్రాయిలో ఉండగా మరీ .మా హెడ్ గారు మా కంటే ఆయనే తొందర పెట్టి ‘’మేస్టారూ !మీరు చాలా దూరం వెళ్ళాలి కదా .చివరిపీరియడ్ లోక్లాసులుంటే ఎవరికో ఒకరికి అడ్జస్ట్ చేస్తా .మీరు వెళ్ళిరండి ‘’అనే వారు అది బాగా అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకోన్నాము నేనూ అక్కడి డ్రాయింగ్ ప్రసాద్ .ఇప్పుడు నేను హెడ్ మాస్టార్ని కదా వత్సవాయిలో .వెళ్ళే టీచర్లకు పర్మిషన్ ఇచ్చి పంపేవాడిని.వాళ్లకు చివరిపిరియాద్ క్లాసులుంటే నేనో లేక ఇంకెవరో తీసుకొనే వాళ్ళం. ఈ వెళ్ళే బాచ్ లో క్రాఫ్ట్ వెంకటేశ్వర రావు ,నేనే ఉండేవాళ్ళం  .అక్కడ నాలుగున్నర దాకా ఉండి బయల్దేరితే ఉయ్యూరు అంచలంచెల మీద చేరే సరికి రాత్రి ఎనిమిది దాటేది అందుకని మూడుమ్ముప్పావు కే బయల్దేరేవాళ్ళం .ఇంచార్జ్ కి స్కూల్ అప్పగించి వెళ్ళేవాడిని .అదీ మొత్తం మీద చాలా కొద్ది సార్లే వాడుకొన్నాను .లారీలమీడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ,చిన్నకార్లలో ఏది దొరికితే వాటిలో ప్రయాణం చేయాల్సి వచ్చేది .కన్నెవీడు హైస్కూల్ కు వెళ్లి వాలీబాల్ బాద్ మింటన్ ఫ్రెండ్లీ మాచేస్ ఆడి వచ్చేవాళ్ళం అక్కడిహేడ్ మాస్టారు కపిలేశ్వర పురం లో పని చేసిన చలపతిరావుగారే మంచివాడు నిదానస్తుడు

ఒక శనివారం క్రాఫ్ట్ మేష్టారు నేనూ చివరి పిరియడ్ లో చేక్కేసే ఏర్పాటులో ఉన్నాం .ఇంతలో  డి ఇ వొ గారు అకస్మాత్తుగా స్కూల్ విజిట్ కు వచ్చారు .గుండేలాగిపోయాయి .గబగబా ఆయనకు స్వాగతం చెప్పి ,అడిగిన రికార్డ్ లన్నీ చూపించాము .అంతాపర్ఫెక్ట్ గా ఉందని సంతోషించి సంతృప్తి చెందారు .ప్రతిక్లాసుకూ తీసుకొని వెళ్లి చూపించాను .అన్నీ బాగా అబ్సర్వ్ చేశారు .స్కూల్ పెర్ఫెక్ట్ లైన్ లోనే నడుస్తోంది అనే ఇంప్రెషన్ వచ్చింది ఆయనకు .మంచి రిమార్క్ విజిట్ బుక్ లో రాసి వెళ్ళారు .ఆయన వెళ్ళేదాకా లాంగ్ బెల్ కొట్టలేదు అయిదింటి దాకా ఉండి వెళ్ళారు అప్పుడు బెల్ కొట్టి పిల్లల్ని పంపాము .చివరి పీరియడ్ కు పది నిమిషాలముందు ప్రతి రోజూలాగే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆయనతో మాట్లాడించి జనగణమన పాడించి పంపాము .మేము ముందే వెళ్లి ఉంటె మా పరిస్తితి ఏమిటో భగవంతుడికే ఎరిక ఇలా మొదటి  హేడ్మాస్టారి అనుభవం రుచి చూశాను .దేవుడు నా యెడల ఉన్నాడనిపించింది లేకపోతె అభాసుపాలయ్యేవాడిని .

పిఆర్.సి-కొత్త స్కేళ్ళలో ఫిక్సేషన్లు

నేను వత్సవాయి హెడ్ మాస్టారుగా ఉండగానే కొత్త వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చాయి .అందరికి ఆప్షన్లు కోరుకోవటం దానిప్రకారం స్కెల్ లో ఫిక్సేషన్ చేయటం బకాయీలను తయారు చేయటం చాలా పెద్దపనే .మా గుమాస్తా లగడపాటి కృష్ణ మూర్తి బాగా సర్వీస్ ఉన్నవాడేకాని ఎందుకో ఫిక్సేషన్ చేయటానికి కొంత జంకాడు .దాన్ని పోగొట్టటానికి నేనూ ఆయన గండ్రాయి వెళ్లాం. అక్కడ హేడ్మాస్టార్ శ్రీ పి వి సుబ్రహ్మణ్యం గారికి ఇవన్నీ నల్లేరుపై బండినడక.ఆయన దగ్గర కూర్చుని విధానం అంతా ఇద్దరం తెలుసుకొన్నాం .అప్పుడు కృష్ణమూర్తి ‘’సార్ –ఇంతేనా అయితే ఇంక ఎవరి సహాయం సలహా మనకు వద్దు మనమే చేసేద్దాం ‘’అన్నాడు తిరిగి వత్సవాయి వచ్చి అందరి ఫిక్సేషన్లు పూర్తీ చేసి జిల్లాపరిషత్  కు పంపం వెంటనే సాంక్షన్ అయి వచ్చాయి ఎరియర్ లు కూడా బాగా ముట్టాయి .ఇందులో కొంత వసూలు చేసి జిల్లాపరిషత్ గుమాస్తాలకు ‘,ఆడిట్ వాళ్లకు’’ ఆమ్యామ్యా’’ సమర్పించాలి మేమూ అలానే చేశాం .’’భూత తృప్తి’’ అన్నమాట .నాఫిక్సేషన్ గండ్రాయిలోనే హెడ్ మాస్టారు చేసి పంపారు .మేము ఇక్కడ నాన్ ద్రాయల్ సర్టిఫికేట్ రాసి జిల్లా పరిషద్ కు పంపి సాంక్షన్ చేయిన్చుకోన్నాం .నాకు అనుకోకుండా ఒక స్టేజ్ బెనిఫిట్ వచ్చి జీతం బాగా పెరిగింది .

హాఫ్ పే లీవ్ –బదిలీ

ఉయ్యూరులో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పనులకు గాను రెండు సార్లు హాఫ్ పే లీవ్ పెట్టాను. హెడ్ మాస్టారి లీవ్ జిల్లా పరిషత్ పి ఇ వొ గారు సాంక్షన్ చేయాలి .15-6-88నుండి 26-6-88 వరకు సెలవుపెట్టాను మొదటిసారి .ఆలయ పునః ప్రతిష్ట చేశాము .ఇక గండ్రాయి లో ఉండాలని పించలేదు ఇదివరకే రాసినట్లు లాంగ్ లీవ్ పెట్టి ప్రయత్నం చేయాలి అందుకని 5-8-88 నుండి 34 రోజులు 7-9-88 వరకు లీవ్ పెట్టాను .జిల్లా పరిషద్ చైర్మన్ ను వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాను .వత్సవాయి లో అన్ని పోస్ట్ లను నేను చైర్మన్ కోటేశ్వర రావు గారి దృష్టికి తీసుకొని వెళ్లి భర్తీ చేయించాను ఇది ఒక రికార్డ్ .ఎవరూ పట్టించుకోని స్కూల్ ను నేను పట్టించుకోని నేను వచ్చేనాటికి ఒక్క ఖాళీ కూడా లేకుండా ఫిలప్ చేయి౦చ గాలిగాను. నా గొప్పతనం కంటే చైర్మన్ కోటేశ్వర రావు గారి చొరవ బాగా కలిసొచ్చింది .’’మేస్టారూ !మీరక్కడ ఉండాలని లేదంటూనే పోస్ట్ భర్తీ గురించి మీకెందుకు అంట ఆరాటం ?’’అన్నారొకసారి అప్పుడు నేను ‘’సార్ ! అసలే దూరపు ప్రాంతం మన ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడెవరూ ఉండటం లేదు .పోస్టులు ఉంటె ఉండాలన్న తపన ఉంటుంది ‘’అంటే నవ్వి అన్నీ భర్తీ చేశారు అదినాకు గొప్ప సంతృప్తి నిచ్చింది .

స్పాట్ వాల్యు ఏషన్ కు బందర్ వేస్తె హాయిగా ఉయ్యూరు నుండి వెళ్లి వచ్చేవాడిని .అప్పుడు ఆఫీసులోచైర్మన్  గారుంటే కలిసి అర్జీ ఇచ్చి బదిలీ కోరేవాడిని. ఒక సారి నేనూ అడ్డాడ హెడ్మాస్టారు శ్రీ వై .దేవేంద్ర రావు పెదముత్తేవి హెడ్ శ్రీ కోసూరి ఆదినారాయణ జమ్మవరం హెచ్ ఏం శ్రీ పి ఆంజనేయ శాస్త్రి ,మొదలైన వాళ్ళం చైర్మన్ గారిని కలిశాం నేను నా ట్రాన్స్ ఫర్ సంగతి చెప్పా . ఎక్కడా ఖాళీలు లేవు .మంగళాపురం ఖాళీ అవుతోంది అక్కడికి వెయ్యమంటే వేస్తానన్నారు .సరే దూరం తగ్గుతుంది కదా అని ఓకే చెప్పి గుమాస్తా శేషగిరి రాకు తెలియ జేసి ‘’చేపాల్సింది ‘’చేపి లాంగ్ లీవ్ 13-7-89-1-9-89 వరకు 51 రోజులు పెట్టా .అప్పుడు పి ఇ వొ పరమ హం(హిం)స గారు .పైకి స్ట్రిక్ట్ ,లోన లొటారం .నన్ను చల్లపల్లి దగ్గర మంగళాపురం .హైస్కూల్ కు అక్కడి హెడ్మాస్టారు శ్రీ జోశ్యులు గారు రిటైర్ అయితే అందులో వేశారు .పెనం మీదనుంచి పొయ్యిలోకి కాకపోయినా పొయ్యి రాళ్ళమీద పడినట్లయింది నా పరిస్తితి .ఆర్డర్ వచ్చేదాకా ఎవరికీ చెప్పలేదు .బందరు వెళ్లి తీసుకొని మంగళాపురం హైస్కూల్ లో చేరాను ఈ రికార్డ్ అంతా సర్వీస్ రిజిస్టర్ లో జిల్లాపరిషత్ మెయింటేన్ చేస్తుంది .అందులో నేను వత్సవాయిలో రిలీవ్ అయిన తేది మంగళాపురం లో చేరిన తేదీ వాళ్ళే నమోదు చేస్తారు. నాదగ్గర ఆ వివరాలు లేవు .గుర్తుకూడాలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1

అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని తాను నమ్మినదానినే చెప్పి ,రాసి ,ముందుకు సాగిన జీవితం ఆమెది .సత్యాన్వేషణలో మూలాలను  తరచిన సూక్ష్మ బుద్ధి ఆమెది .మార్క్ ట్వేన్ ఆమె పై ఒక పెద్ద పుస్తకమే రాశాడు .ఆమె రాసిన క్రిస్టియన్ సైన్స్ ను హంబగ్ అని ఈసడించి రెచ్చిపోయి రాసిన వారూ ఉన్నారు .నిరు పేద జీవితం గడిపి కానీకి ఠికాణా లేని స్తితిలోంచి ,కోట్లకు పడగలెత్తిన   ఐశ్వర్య  సంపన్నురాలైంది .అదీ క్రిస్టియన్ సైన్స్ అనే వినూత్నవిధానం తో .ఆధునిక ప్రపంచ నిర్మాతలలో తానూ ఒకరి చరిత్ర సృష్టించింది .

ఈమె పూర్వీకులు స్కాట్ లాండ్ ,ఇంగ్లాండ్ దేశీయులు .తల్లి విద్యావంతురాలు .రుజు ప్రవర్తన ఉన్న మహిళ.మగవారి తో సమానం గా కస్టపడి పని చేసే ఓర్పూ నేర్పూ ఉండేది తల్లికి .తండ్రి చాలా పవిత్రుడైన  కాన్గ్రిగేషనలిస్ట్ .అంటే వ్యక్తిగత శుద్ధత  ద్వారానే ఉన్నత స్తితిని ,దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అనే మెథడిస్ట్ పద్ధతికి దగ్గర భావాలున్న వాడు .మత ధర్మాలను చాలా నిద్ధతతో పాటించేవాడు .

మేరీ చిన్నతనం నుంచి ఏదో ఒక జబ్బుతో బాధపడేది .మూర్చలు వచ్చేవి అకస్మాత్తుగా .తీవ్ర స్వభావం ఉండటం వలన ఈ ఫిట్స్ ఆమెకు ఒక శాపమే అయింది .బాల్యం నుండి మత విషయాలలో చురుకుగా ఉండేది .’’ఎవరో నన్ను పేరు పెట్టి మూడు సార్లు పిలిచినట్లుఅంతరాత్మలో  అనిపించింది ‘’అని తన అనుభవాన్ని రికార్డ్ చేసింది .తనను ‘’జోన్ ఆఫ్ ఆర్క్’’ గా భావించుకొనేది .ఆమెతో బంధుత్వం ఉన్నట్లు ఊహించుకోనేది .పన్నెండవ ఏట నే బాల యేసు లాగా తానూ చర్చి పెద్దలతో వాదించానని  చెప్పుకొనేది .కాని యవ్వనం వచ్చేసరికి వీటికి విరుద్ధం గా ఆమె సంచరించింది .

పిల్ల ఆరోగ్యం కోసం తండ్రి కుటుంబాన్ని ఈ నాడు సాన్ బారంటన్ బ్రిడ్జ్  అని పిలువబడే టిల్టాన్ కు మార్చాడు .మేరీ ఆరోగ్యం కొంత మెరుగైంది .తానూ ఒకకవిని అని ఊహించుకొని ఏకాంతం లో కవిత్వం రాసేది .అందులో మంత్రాలనూ కలిపి రాసేది .19 వ ఏట సోదరుడు ఆల్బర్ట్ చనిపోవటం తో డిప్రెషన్ కు లోనైంది .రెండేళ్ళ తర్వాత ఆల్బర్ట్ స్నేహితుడు అయిన ఒక తాపీ పని వాడిని పెళ్లి చేసుకొన్నది .భర్త స్టోన్ మేసన్ గా వ్యాపారమూ చేసేవాడు .సౌత్ కరోలినలోని చార్లేస్టన్ కు నవ వధువును తీసుకొని వెళ్లి కాపురం పెట్టాడు  .అతనితో ఎన్నో సార్లు బిజినెస్ ట్రిప్ లలో పాల్గొనేది .భర్తకు ఎల్లో ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు .చేతిలో పెన్నీ కూడా లేని గర్భ దరిద్రం లో అప్పుడు మేరీ ఉంది .పుట్టింటికి చేరి ఒక కొడుకును కని తండ్రిపేరు పెట్టుకొన్నది .

చిన్నతనం లోనే గర్భం దాల్చటం వలన పిల్లాడు పుట్టే లోపే ఆమె ఆరోగ్యం మరీ క్షీణించి ఇక బతకదేమో ననిపించింది .అందువల్ల పసిపిల్లాడిని సాకే పని కూడా చేయలేక పోయేది .నరాల బలహీనత ఆమె ఆరోగ్యాన్ని తరచుగా దెబ్బ తీసేది .కుటుంబ సభ్యుల తోడ్పాటు తో ,ఆసరా తో ఆమె బతికింది .ఇలాంటి స్తితిలోకూడా కవిత్వం రాసి౦దివీలైనప్పుడల్లా .పిల్లాడిని పెంచలేననే అధైర్యం  ఆమెను కమ్ముకొంటే  విలేజ్ బ్లాక్ స్మిత్ భార్య చేతిలో కుర్రాడి సంరక్షణ బాధ్యత పెట్టింది .ఇరవై ఏళ్ళకు తల్లి చనిపోయింది .తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ఇంట ఇప్పుడుకూడా ఒంటరి జీవి అయిపోయి౦ ది .మగ వారి విషయం లో ఆమె చాలా దురదృష్ట వంతురాలు .బార్లేట్ అనే అతన్ని ప్రేమిస్తే ,అతను కాలిఫోర్నియా కు వెళ్లి చనిపోయాడు .ఆ దుఖమూ కుంగ దీసింది .కొడుకును మారుటి తండ్రి దూర ప్రాచ్యానికి తీసుకెళ్ళిపోయి దూరం చేశాడు పుత్రప్రేమకు .కొడుకు తనకే దక్కాలన్న అరాటమూ ఆమెలో లేదు .కారణం తన పొట్టనే తాను  పోషించుకోలేని దైన్యమే .కొడుక్కి 35 ఏళ్ళు వచ్చి  భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని తెలిసి ‘’మదర్స్ డార్లింగ్ ‘’అనే కవిత రాసింది .’’Thy smile through tears ,as sunshine over the sea –Awoke new beauty in the surge;s roll –Oh !life is dead ,bereft of all,with theee –Star of my earthly hope,babe of my soul ‘’అని తన ఆవేదనను వెళ్ళ గక్కింది .

ముప్ఫైలలో  మళ్ళీ వివాహ సన్నాహాలలో పడింది .డేనియల్ పాటర్సన్ అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకొన్నది .ఆమె అనారోగ్యం గురించి అతనికి పూర్తిగా తెలుసు ,కానీ అతని అభిరుచులు వేరు .జీవన వైవిధ్యాన్ని ఆమె కోరుకోలేక పోయింది .అతని పాశవిక చేష్టలకు తట్టుకోలేక పోయింది .వైట్ మౌ౦టే న్స్ దగ్గరున్న నార్త్ గ్రాటన్ లో ఉన్నారిద్దరూ .అక్కడా ఒంటరిదైపోయి౦దిమళ్ళీ .నిరంతరం సంచార వైద్యం లో ఉండే ఆతను ఇంటిదగ్గర భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు .ఆమె ఇతరులేవరితోనూ స్నేహం చేసేదికాదు

నలభై వ ఏట .పోర్ట్ లాండ్ లోని మైమ్ లో ఫినియాస్ పి.క్విమ్బి అనే ఆయన మెస్మరిజం తో వ్యాధులు నయం చేస్తున్నాడని విన్నది .ఆయనే తన వ్యాధికి దిక్కు అని నమ్మి అక్కడికి చేరింది. మొదటి సెషన్ లోనే క్విమ్బి- మేరీ శారీరక ఆరోగ్యాన్నేకాదు  మానసిక ఆరోగ్యాన్నీ బాగు చేశాడు .ఆమెలో ఉన్న అసాధారణ ప్రజ్న ఆసక్తికి ముచ్చటపడి ఆయన తనకు వచ్చిన సర్వ విద్యనూ ఆమెకు నేర్పించాడు .కొద్ది కాలం లోనే ఆయనతో బాటు సమాన మైన విద్య నేర్చి చాంపియన్ అని పించింది .ఆయన రాసిన గ్రంధాలన్నీ చదివింది .ఆయన ప్రతిభావిశేషాలను పత్రికలో వ్యాసాలుగా రాసి ప్రచారం చేసి౦ది మేరీ బేకర్.ఆయన హిప్నటిజం తోకాని లేక ‘’యానిమల్ మాగ్నేటిజం ‘’తో కాని రోగుల వ్యాధులను నయం చేయటం లేదని ఒక శాస్త్రీయ మైన ఎవరికీ తెలియని విధానం లో నయం చేస్తున్నాడని తెలియ జేసింది .శిష్యురాలి అకు౦ఠిట దీక్షకు  మద్దతునిచ్చి ఆమెను తీర్చిదిద్దటం లో క్విన్బీ ఎక్కువ సమయం గడిపాడు .ఆమె రాసిన వాటిని ‘’సైన్స్ అండ్ హెల్త్ ‘’పేరిట ముద్రించింది .

మేరీ ఆరోగ్యం బాగుపడటమేకాదు ,ధైర్యం సాహసం ,ఆలోచన ,మనో నిబ్బరం యేర్పడి మానసిక వ్యాధులను కూడా నయం చేయగలిగే స్తితిలోకి వచ్చింది .వీటిని స్మ్రుతిగీతాలుగా రాసి ‘’lines on the Death of Dr .P .P. Quimby ,who healed with the Truth that Christ Taught in contra distinctions to all Isms ‘’పేర వెలువరించింది .కొంతకాలానికి ఆమె నడుస్తూ పడిపోయి విపరీతంగా గాయాలైనాయి .అప్పుడు జీసస్ చెప్పిన ‘’physician heal thy self !’’వాక్యాలను మననం చేసుకొని రెండు రోజుల్లోనే లేచినిలబడి నడవటం ప్రారంభించింది .దీనినే క్రిస్టియన్ సైన్స్ అన్నది .1866 ఫిబ్రవరిలో తనకు ‘’డివైన్ మెటా ఫిజికల్  హీలింగ్ ‘’అబ్బిందని దీనినే ‘’క్రిస్టియన్ సైన్స్ ‘’అన్నాని రాసి౦దిమేరి .అన్ని శారీరక బాధలకు మనసేకారణం అని అన్నిటికి ప్రధానం మైండ్ అనీ నిర్ణయించింది .ఇక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగి ఉచ్చ స్తితికి చేరింది .

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2

తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బేకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .

మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారణ చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తొలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్థ లేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి  ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేళ్లు దానిని ఎప్పటికప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసింది.అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .

పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు౦దిమేరి .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయావులెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55  వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ్  ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు, చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోక లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయి౦చు కొనేది

క్రిస్టియన్ సైన్స్ కొద్దికాలం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయితా మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలే  అభూతకల్పనలే  అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో  పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా ,కెనడాలలో ఉన్నాయి  .

ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎడ్డీ బలం, అధికారం మరీ పెరిగింది .ఒక యునిటేరియన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు  బైబిల్ కు ప్రత్యామ్నాయం అయేట్లు చేసింది .దేశం లో  లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్థా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేళ్ళ తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం ,కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా  బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు  .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిందనే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిందా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఏళ్ళు వచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోయేసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చి  కే  దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే  వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .

భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిషయాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె చర్చి  బ్రాంచీలు 76దేశాలలో  వ్యాపించి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళులర్పి౦చారు .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2

తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .

మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారాన చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తోలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్తలేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి  ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేల్లు దానినేప్కటి క ప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసిండి అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .

పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు0ది  .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయాలెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55  వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోకా లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయిన్చుకోనేది

క్రిస్టియన్ సైన్స్ కొద్దికావులం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయిత మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి  అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలె  అభూతకల్పనలే  అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో  పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా కెనడాలలో ఉన్నాయి  .

ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎద్దే బలం అధికారం మరీ పెరిగింది .ఒక యునితెరియాన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు  బైబిల్ కు ప్రత్యామ్నాయం యెట్లు చేసింది .ఎశం లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్తా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేలోల తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా  బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు  .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిండానే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిండా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఎల్లువచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోఎసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చ కే  దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే  వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .

భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిష యాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె  చర్చ్   బ్రాంచీలు 76 దేశాలలో వ్యాపి0చి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళు లర్పి0చారు  .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .engraving

మేరీ పుట్టిన ప్రదేశం 

న్యు హాంప్ షైర్-కాంకార్డ్ లో  మేరీ స్తాపించిన  క్రైస్ట్  ఆఫ్ సైన్స్

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1

అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని తాను నమ్మినదానినే చెప్పి ,రాసి ,ముందుకు సాగిన జీవితం ఆమెది .సత్యాన్వేషణలో మూలాలను  తరచిన సూక్ష్మ బుద్ధి ఆమెది .మార్క్ ట్వేన్ ఆమె పై ఒక పెద్ద పుస్తకమే రాశాడు .ఆమె రాసిన క్రిస్టియన్ సైన్స్ ను హంబగ్ అని ఈసడించి రెచ్చిపోయి రాసిన వారూ ఉన్నారు .నిరు పేద జీవితం గడిపి కానీకి ఠికాణా లేని స్తితిలోంచి ,కోట్లకు పడగలెత్తిన   ఐశ్వర్య  సంపన్నురాలైంది .అదీ క్రిస్టియన్ సైన్స్ అనే వినూత్నవిధానం తో .ఆధునిక ప్రపంచ నిర్మాతలలో తానూ ఒకరి చరిత్ర సృష్టించింది .

ఈమె పూర్వీకులు స్కాట్ లాండ్ ,ఇంగ్లాండ్ దేశీయులు .తల్లి విద్యావంతురాలు .రుజు ప్రవర్తన ఉన్న మహిళ.మగవారి తో సమానం గా కస్టపడి పని చేసే ఓర్పూ నేర్పూ ఉండేది తల్లికి .తండ్రి చాలా పవిత్రుడైన  కాన్గ్రిగేషనలిస్ట్ .అంటే వ్యక్తిగత పైశుధత ద్వారానే ఉన్నత స్తితిని ,దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అనే మెథడిస్ట్ పద్ధతికి దగ్గర భావాలున్న వాడు .మత ధర్మాలను చాలా నిద్ధతతో పాటించేవాడు .

మేరీ చిన్నతనం నుంచి ఏదో ఒక జబ్బుతో బాధపడేది .మూర్చలు వచ్చేవి అకస్మాత్తుగా .తీవ్ర స్వభావం ఉండటం వలన ఈ ఫిట్స్ ఆమెకు ఒక శాపమే అయింది .బాల్యం నుండి మత విషయాలలో చురుకుగా ఉండేది .’’ఎవరో నన్ను పేరు పెట్టి మూడు సార్లు పిలిచినట్లుఅంతరాత్మలో  అనిపించింది ‘’అని తన అనుభవాన్ని రికార్డ్ చేసింది .తనను ‘’జోన్ ఆఫ్ ఆర్క్’’ గా భావించుకొనేది ఆమెతో బంధుత్వం ఉన్నట్లు ఊహించుకోనేది .పన్నెండవ ఏట నే బాల యేసు లాగా తానూ చర్చి పెద్దలతో వాదించానని  చెప్పుకొనేది .కాని యవ్వనం వచ్చేసరికి వీటికి విరుద్ధం గా ఆమె సంచరించింది .

పిల్ల ఆరోగ్యం కోసం తండ్రి కుటుంబాన్ని ఈ నాడు సాన్ బారంటన్ బ్రిడ్జ్  అని పిలువబడే టిల్టాన్ కు మార్చాడు .మేరీ ఆరోగ్యం కొంత మెరుగైంది .తానూ ఒకకవిని అని ఊహించుకొని ఏకాంతం లో కవిత్వం రాసేది .అందులో మంత్రాలనూ కలిపి రాసేది .19 వ ఏట సోదరుడు ఆల్బర్ట్ చనిపోవటం తో డిప్రెషన్ కు లోనైంది .రెండేళ్ళ తర్వాత ఆల్బర్ట్ స్నేహితుడు అయిన ఒక తాపీ పని వాడిని పెళ్లి చేసుకొన్నది .భర్త స్టోన్ మేసన్ గా వ్యాపారమూ చేసేవాడు సౌత్ కరోలినలోని చార్లేస్టన్ కు నవ వధువును తీసుకొని వెళ్లి కాపురం పెట్టాడు  .అతనితో ఎన్నో సార్లు బిజినెస్ ట్రిప్ లలో పాల్గొనేది .భర్తకు ఎల్లో ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు .చేతిలో పెన్నీ కూడా లేని గర్భ దరిద్రం లో అప్పుడు మేరీ ఉంది .పుట్టింటికి చేరి ఒక కొడుకును కని తండ్రిపేరు పెట్టుకొన్నది .

చిన్నతనం లోనే గర్భం దాల్చటం వలన పిల్లాడు పుట్టే లోపే ఆమె ఆరోగ్యం మరీ క్షీణించి ఇక బతకదేమో ననిపించింది .అందువల్ల పసిపిల్లాడిని సాకే పని కూడా చేయలేక పోయేది .నరాల బలహీనత ఆమె ఆరోగ్యాన్ని తరచుగా దెబ్బ తీసేది .కుటుంబ సభ్యుల తోడ్పాటు తో ,ఆసరా తో ఆమె బతికింది .ఇలాంటి స్తితిలోకూడా కవిత్వం రాసి౦దివీలైనప్పుడల్లా .పిల్లాడిని పెంచలేననే అధైర్యం  ఆమెను కమ్ముకొంటే  విలేజ్ బ్లాక్ స్మిత్ భార్య చేతిలో కుర్రాడి సంరాక్షణ బాధ్యత పెట్టింది .ఇరవై ఏళ్ళకు తల్లి చనిపోయింది .తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ఇంట ఇప్పుడుకూడా ఒంటరి జీవి అయిపోయి౦ ది .మగ వారి విషయం లో ఆమె చాలా దురదృష్ట వంతురాలు .బార్లేట్ అనే అతన్ని ప్రేమిస్తే ,అతను కాలిఫోర్నియా కు వెళ్లి చనిపోయాడు .ఆ దుఖమూ కుంగ దీసింది .కొడుకును మారుటి తండ్రి దూర ప్రాచ్యానికి తీసుకెళ్ళిపోయి దూరం చేశాడు పుత్రప్రేమకు .కొడుకు తనకే దక్కాలన్న అరాటమూ ఆమెలో లేదు .కారణం తన పొట్టనే తాను  పోషించుకోలేని దైన్యమే .కొడుక్కి 35 ఏళ్ళు వచ్చి  భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని తెలిసి ‘’మదర్స్ డార్లింగ్ ‘’అనే కవిత రాసింది .’’Thy smile through tears ,as sunshine over the sea –Awoke new beauty in the surge;s roll –Oh !life is dead ,bereft of all,with theee –Star of my earthly hope,babe of my soul ‘’అని తన ఆవేదనను వెళ్ళ గక్కింది .

ముప్ఫైలలో  మళ్ళీ వివాహ సన్నాహాలలో పడింది .డేనియ  ల్ పాటర్సన్ అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకొన్నది .ఆమె అనారోగ్యం గురించి అతనికి పూర్తిగా తెలుసు ,కానీ అతని అభిరుచులు వేరు .జీవన వైవిధ్యాన్ని ఆమె కోరుకోలేక పోయింది .అతని పాశవిక చేష్టలకు తట్టుకోలేక పోయింది .వైట్ మౌన్తెన్స్ దగ్గరున్న నార్త్ గ్రాటన్ లో ఉన్నారిద్దరూ .అక్కడా ఒంటరిడైపోయిన్దిమళ్ళీ .నిరంతరం సంచార వైద్యం లో ఉండే ఆతను ఇంటిదగ్గర భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు .ఆమె ఇతరులేవరితోనూ స్నేహం చేసేదికాదు

నలభై వ ఏట .పోర్ట్ లాండ్ లోని మైమ్ లో ఫినియాస్ పి.క్విమ్బి అనే ఆయన మెస్మరిజం తో వ్యాధులు నయం చేస్తున్నాడని విన్నది .ఆయనే తన వ్యాధికి దిక్కు అని నమ్మి అక్కడికి చేరింది. మొదటి సెషన్ లోనే క్విమ్బి- మేరీ శారీరక ఆరోగ్యాన్నేకాదు  మానసిక ఆరోగ్యాన్నీ బాగు చేశాడు .ఆమెలో ఉన్న అసాధారణ ప్రజ్న ఆసక్తికి ముచ్చటపడి ఆయన తనకు వచ్చిన సర్వ విద్యనూ ఆమెకు నేర్పించాడు .కొద్ది కాలం లోనే ఆయనతో బాటు సమాన మైన విద్య నేర్చి చాంపియన్ అని పించింది .ఆయన రాసిన గ్రంధాలన్నీ చదివింది .ఆయన ప్రతిభావిశేషాలను పత్రికలో వ్యాసాలుగా రాసి ప్రచారం చేసి౦ది మేరీ బేకర్.ఆయన హిప్నటిజం తోకాని లేక ‘’యానిమల్ మాగ్నేటిజం ‘’తో కాని రోగుల వ్యాధులను నయం చేయటం లేదని ఒక శాస్త్రీయ మైన ఎవరికీ తెలియని విధానం లో నయం చేస్తున్నాడని తెలియ జేసింది .శిష్యురాలి అకు౦ఠిట దీక్షకు  మద్దతునిచ్చి ఆమెను తీర్చిదిద్దటం లో క్విన్బీ ఎక్కువ సమయం గడిపాడు .ఆమె రాసిన వాటిని ‘’సైన్స్ అండ్ హెల్త్ ‘’పేరిట ముద్రించింది .

మేరీ ఆరోగ్యం బాగుపడటమేకాదు ,ధైర్యం సాహసం ,ఆలోచన ,మనో నిబ్బరం యేర్పడి మానసిక వ్యాధులను కూడా నయం చేయగలిగే స్తితిలోకి వచ్చింది .వీటిని స్మ్రుతిగీతాలుగా రాసి ‘’lines on the Death of Dr .P .P. Quimby ,who healed with the Truth that Christ Taught in contra distinctions to all Isms ‘’పేర వెలువరించింది .కొంతకాలానికి ఆమె నడుస్తూ పడిపోయి విపరీతంగా గాయాలైనాయి .అప్పుడు జీసస్ చెప్పిన ‘’physician heal thy self !’’వాక్యాలను మననం చేసుకొని రెండు రోజుల్లోనే లేచినిలబడి నడవటం ప్రారంభించింది .దీనినే క్రిస్టియన్ సైన్స్ అన్నది .1866 ఫిబ్రవరిలో తనకు ‘’డివైన్ మెటా ఫిజికల్  హీలింగ్ ‘’అబ్బిందని దీనినే ‘’క్రిస్టియన్ సైన్స్ ‘’అన్నాని రాసి౦దిమేరి .అన్ని శారీరక బాధలకు మనసేకారణం అని అన్నిటికి ప్రధానం మైండ్ అనీ నిర్ణయించింది .ఇక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగి ఉచ్చ స్తితికి చేరింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలు

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలురెండవ రోజు 22-2-15 ఆదివారం దృశ్యమాలిక

కృష్ణాజిల్లా రచయితల  సంఘం ఫిబ్రవరి 21,22 తేదీలలో విజయవాడలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు దిశా నిర్దేశం చేయలేదనే అభిప్రాయం కలిగించింది .సినీ ప్రముఖులు తనికెళ్ళ ,అశోక్ తేజ ,గొల్లపూడి ,బ్రహ్మానందం లు స్టార్ అట్రాక్షన్ మాత్రమే కలిగించారు .దానివలన తెలుగుకు ఒరిగిందేమీలేదు .రెండవ ప్రపంచ సభల చివరి రోజు స్వర్గీయ జాలాది గొప్ప ప్రేరణ స్పూర్తి కలిగిస్తే ,ఈ మూడవ ప్రపంచ సభల మొదటి రోజు రాత్రి సుద్దాల అశోక్ తేజ అదే స్పూర్తిని కలిగించి మనసులో నిలిచిపోయాడు .మిగతా వారి వన్నీ ఊక దంపుడు ఉపన్యాసాలే . శ్రీ కూచి భొట్ల ఆనంద్ బృందం  రెండవ సభలలో  సాంకేతికాంశాన్ని సర్వ సమర్ధం గా చాటి చెప్పిన  దిశా దిర్దేశం చేసిన దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది .ఆరోజు సభ అవగానే అందరూలేచినిలబడి ‘’స్టాండింగ్ ఒవేషన్’’తో   హర్షాన్ని ఆన౦ దాన్ని కృతజ్ఞతలను ప్రకటి౦చటం మరువరాని మరువలేని అనుభూతి .అదే తర్వాత యునికోడ్ ప్రాముఖ్యతకు పెద్ద పీట వేసింది.ఈ సభల్లో కూడా శ్రీ ఆన౦ద్ ఉపన్యాసం మనం అందరం ఏం చేయాలో కర్తవ్య నిర్దేశకం గా సాగింది .బహుశా నా దృష్టిలో ఈ సభల్లో ఇది హైలైట్. ఆయన స్పీచ్ ‘’మైడేన్ స్పీచ్ ‘’.సభలు అంటే అలా ఉండాలి ఉపన్యాసం అంటే అ౦త నిబద్ధత తో ఉండాలి .అందులో ప్రపంచ సభలంటే గొప్ప స్పూర్తి తో ప్రతినిధులు ఇంటికి చేరుకోవాలి ఫాలో అప్ యాక్షన్ లో పడాలి .అంతసీను ఈ సభల్లో దృశ్యమానం కాక పోవటం నిరాశ మిగిల్చింది .ఇంకో విషయం శ్రీ బుద్ధ ప్రసాద్ ను శ్రీ గుత్తికొండను ,శ్రీ పూర్ణచంద్ ను పాసివ్ గా కూర్చోబెట్టి,బైపాస్ చేసి  శ్రీ లక్ష్మీ ప్రసాద్ ఏకపాత్రాభినయం చేశారని పిస్తుంది .మొదటి రోజు 21-2-15 శనివారం దృశ్యమాలిక

కుర్రాడైనా సాహిత్య ఆకేడేమీ కార్య దర్శి ఛి .కృత్తి వెంటి శ్రీనివాసరావు ఎన్నో ఆచరించాల్సిన విషయాలను ,కార్య రూపం దాల్చాల్సిన వాటిని అతి సహజం గా సరళం గా చెప్పాడు .అతని చిన్నతనం పేద ప్రోలు లో నా కళ్ళ ముందు గడిచింది .అతని అన్న మాధవ్ నాకు అభిమాన శిష్యుడు అక్కడ .రావు చెప్పిన దానిలో ‘’కుంచేన్ టూర్ ప్రోగ్రాం ‘’తప్పక సాహిత్య సంస్థలు నిర్వహిచి కేరళ తీసుకొని వెళ్లి ఆసభలలో పాల్గొనే అవకాశాన్ని సాహితీప్రియులకు కలగ జేయటం తక్షణ కర్తవ్యమ్ .అది అమలు చేస్తారో లేదో చూద్దాం .సభా వైరాగ్యం లా మర్చేపోతారో?సభలో ఉన్న శ్రీనివాస్ నేను ఫలానా అని పరిచయం చేసుకోగానే లేచి  నిలబడి షేక్ హాండ్ ఇచ్చిన సహృదయుడు .ఈ రెండు రోజుల సభలలో చివరి రోజు మంత్రుల కవాతు బాగుంది.శ్రీ  చంద్రబాబు రాలేక పోయిన దాన్ని వీళ్ళు చక్కగా కవర్ చేశారు .ప్రసిద్ధ రచయితల పేర్లు సభా వేదికలకు పెట్టి  కనీసం వారి చిత్రపటాల బానర్ కూడా కూడా లేక పోవటం మరీ అవమానకరం గా అందరూ భావించటం లో తప్పేమీ లేదు .ఇదివరకెన్నడూ ఇలా జరగలేదు .బహుశా అసలు సభా వేదిక మన రచయితల సంఘం చేతిలో లేకుండా చేశారేమో ననిపిస్తోంది .మేనేజి మెంట్ అధీనం లో ఉందా అని అనుమానం కలిగించింది .

సభలు అంటే షడ్రసోపేత భోజం ఉండాల్సిందే .ఉన్నాయికూడా వెరైటీ బానే చూపారు రెండవ రోజు మధ్యాహ్న భోజనం లోవె రాత్రికి రంగూ హంగూ మార్చి వడ్డించటం కొంచెం తమాషా అనిపించింది .రెండు రోజులూ సాయంత్రాల్లో ‘’మినపసున్ని ఉండలు ‘’వేసి పొద్దున్నుంచీ సభల్లో పాతుకుపోయినందువల్ల వచ్చిన నీరసాన్ని దూరం చేసి ఇన్స్టంట్ బలం ఇచ్చినట్లనిపించింది .అందరికీ ఇబ్బందికలిగించిన మరో ముఖ్యమైన విషయం టాయ్ లేట్ల నిర్వహణ .కంపు భరించలేకపోయారుజనం .ఒక్క కుళాయి నున్చికూడా నీరు రాలేదు .చేతులు కడుక్కోటానికి పాపం బకెట్లతో నీరు తెచ్చి శుభ్రం చేసేవాల్లున్నారుకనుక సరిపోయింది లేకుంటే రోగాలబారిన పడాల్సి వచ్చేది .

సాధారణం గా కృష్ణా జిల్లారచయితలసంఘం చివరిరోజు సభలో తీర్మానాలు రాసి చదివి ఆమోదాన్ని తెలిపేట్లు చేసే ఆనవాయతీ ఉంది .ఈ సారి ఆ దారిలో నడవ లేదు కారణం ఏమిటో ఎవరికీ అంటూ బట్టలేదు .అయితే మంత్రి శ్రీ ఉమా తెలుగు దేశ ప్రభుత్వ ఎన్నిక వాగ్దానాలు ,నిర్ణయాలు చదివి వినిపించారు .బహుశా మనం కోరినా అవే కోరేవారమేమో ఆలోటు తీర్చిన శ్రీ ఉమాకు అభినందనలు .జ్ఞాపికలు ,బ్యాగులు ఘనంగానే ఉన్నాయి .సంఘం తెచ్చిన రెండు పుస్తకాలు ‘’తెలుగు భారతి ‘’,యువ భారతి ‘’గర్వించదగిన గ్రంధాలే సందేహం లేదు  గొప్ప రిఫరెన్స్ పుస్తకాలే .ఈ రెండూ తీసుకురావటం లో శ్రీ పూర్ణ చంద్ కృషి ,ఆలోచన ,అమలు ,అంకిత భావం అనన్య సదృశం,అసాధారణం .ఆరోగ్యం కొంచెం బాగుండక శ్రీ గుత్తికొండ కొంత డల్ గా కనిపించినా నిబద్ధతకు ఏమీ లోపం రాలేదు .శ్రీ తుర్లపాటి  శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ లను ఒకే శాలువాతో బంధించారు కాని దీనికంతటికి ముఖ్య కారకులు శ్రీ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ద్వయాన్ని కూడా అలాగే బంధించి ఉంటె చారిత్రాత్మకం గా ఉండేది .రావు గారు ఏది చేసినా ఒక ప్రయోజనం ఉంటుందేమో?

పాపం ధిల్లీ నుంచి పిలిపించి మాట్లాడిస్తే శ్రీ వెంకయ్య అచ్చం గా పుస్తక మహోత్సవం లో జనవరి నాలుగవ తేదీన పుస్తకప్రియుల పాద యాత్ర అయి ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ఏమి మాట్లాడాడో ఒక్క అక్షరం బీరు పోకుండా అదే హేళన అదే చీత్కారం అదే ధోరణిలో పాడిందే పాటరా —-పళ్ళ దాసరీ ‘’అన్నట్లు ఎబ్బెట్టు కలిగించింది .మాటల మా౦త్రి కత ఎప్పుడూ చెల్లుబాటుకాదు’’ బోరున్నర ‘’ అనిపించింది .ఇక శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ ల మాటలు కూడా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డే .కొత్తవిషయం మచ్చుకైనా లేక పోవటం .ఒకే మూస దారిలో మాట్లాడటం రక్తి కట్టించాల్సినదిపోయి వెగటుపుట్టించాయి ఎప్పుడు మొదలు పెట్టినా అక్కడినుండే ,ఎప్పుడు ఆపేసినా అక్కడే .రొటీన్ ఉపన్యాసాలే ఇద్దరివీ .ధిల్లీ నుంచి అయన వచ్చి ,రెండు రోజులసభల్లో వీళ్ళిద్దరూ మాట్లాడినదేదీ స్పూర్తి దాయకం గా లేకపోవటం మరీ కొట్టవచ్చినట్లనిపించింది .శ్రీ పూర్ణ చంద్ కు అవకాశమిస్తే ఆ లోటు పూడేది .ఎక్కడో ఎవరో సభలను కబ్జా చేసిన భావం కనిపించింది .ఇది మంచిదికాదు .

1300 మంది ప్రతినిధులు ఏంతో దూర తీరాలనుండి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చారు .వారి మధ్య ఇంటరాక్షన్ కలిపింఛి ఉంటె ఏంతో బాగుండేది .పొద్దున్నుంచీ సాయంత్రందాకా కూర్చుని కూర్చుని విని విని జనాలకు బోర్ కొట్టదా/
?ఏదైనాతెలుగు పైనో రచయితలపైనో మంచి డాక్యుమెంటరీ లు ప్రదర్శిస్తే ప్రయోజనం బాగుండేది వెరైటీగా ఉండేది మనకున్న ఆధునిక సాంకేతికను ప్రతిబింబించే సభలుగా ఉండేవి ఆ దృష్టిలో ఉండకపోవటం బాధకలిగించింది .అయితే తెలుగు దేశం భౌగోళికం గా విడిపోయినా భాషా పరం గా ,మానసిక పరం గా కలిసే తెలుగుప్రజలున్నారు అనే గొప్ప సంకేతాన్ని ఈసభలు మిగిల్చాయి అనే సంతృప్తి మాత్రం కలిగింది . విదేశాంధ్రులు చాలా ఉత్సాహం గా పాల్గొన్నారు .అందులో ఆచార్య డేనియల్ నిగార్స్ అందరితో రెండు రోజులూ చాలాకలుపుగోలుగా ఉండటం ఇంటరాక్ట్ అవటం ఎందరినో  ఆకర్షించింది .అలాగే యువకుడు డా.శ్రీ జొన్నలగడ్డ మూర్తి కలుపుగోలుతన౦ గా చిలిపి కవితలతో అందర్నీ ఆకట్టుకొన్నారు .మిగిలిన వారు వేదికకే పరిమితమైనారు .

తెలుగు వికాసం ,ప్రాచీనహోదా ,ప్రపచ భాష ,రాస్త్రేతర ,ప్రసార మాధ్యమాలు సాహిత్య సంస్థలపై సదస్సులు రొటీన్ గా ఎప్పుడూ పాల్గొనే వాళ్ళతోనే చర్విత చర్వణం గా సాగాయి .కొత్తదనం లేదు .సభల తర్వాత వీటికి ఫాలోఅప్ యాక్షన్ ఎలాగూ ఉండదని నమ్మకం .కవిసమ్మేళనాలు  ఉత్సాహం గా సా—గాయి .మొదటి రోజు కరెంట్ లేక ‘’కపి మ్మేళనం‘’గా ఉందని కొందరు కామెంట్ చేశారు మర్నాడు ఉదయమ్ .ఈ సమ్మేళనాలకు  నేను లేనుకనుక విన్నదే రాశా .ప్రచార మాధ్యమాలు సభల ప్రారంభానికి చాలా రోజుల ముందునుండే చక్కని ప్రచారం చేశాయి .సభలనూ బాగానే కవర్ చేశాయి .మొత్తం మీద హడావిడి ఆర్భాటమేకాని ప్రయోజనాత్మక సభలు అని అనిపించలదనే అందరి అభిప్రాయం .ఒడ్డున ఉండి రాళ్ళు వేయటం తేలికే .దిగితెకాని లోటు, లోతు  తెలియదు .ఏమైనా .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య  దర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ల సంయుక్త కృషి ఫలితమే ఈ విజయానికి శ్రీరామ రక్ష .’’వన్ మోర్ ఫెదర్ ఐ న్ దెయిర్ కాప్ ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

 జననం –ప్రాచుర్యం –వలస

  unnamed గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత సాహిత్యం ఆనాటి ప్రజల మెప్పు పొంది ,ఆరాధనీయురాలై నా ,కాలగర్భం లో చాలా భాగం కలిసి పోయింది .మిగిలిన కవిత్వమే చాలు  ఆమె ప్రతిభకు గీటు రాయి గా నిలిచిపోవటానికి .లిడియా కు చెందిన ప్రముఖ కవి ‘’ఆల్యేటీస్ ‘’.కు సమకాలికురాలని భావిస్తారు .నలభై అయిదు నలభై ఆరు ఒలింపి యాడ్ ల నాటికే ఆమె ప్రాచుర్యం పొందిన కవి అయింది .

తలిదండ్రులు –  సంతానం

  పారియాన్ మార్బుల్ శాసనాన్ననుసరించి సఫో లేస్బాస్ నుండి వలస పోయి  సిసిలీకు క్రీ .పూ604-594 కాలం లో   వెళ్ళింది .ఆమెరాసిన కవితల్లో మిగిలిన వాటిలో 98 వ కవిత ఆమె జీవిత చరిత్ర గా భావిస్తారు .. వలసపోవటానికి   ముందే ఆమెకు ఒక కూతురు ఉన్నట్లు  తెలుస్తోంది . .ముసలితనం దాకాఅంటే క్రీ పూ. ఆరవ శతాబ్దపు మధ్య కాలం వరకు  జీవించింది .’’ఆక్షి రింకస్ పేపరస్’’లో చెప్పబడిన దాని ననుసరించి ఆమె తల్లిపేరు ‘’క్లీస్’’.కూతురి పేరుకూడా  అదే .తండ్రిపేరు ‘’స్కామెండ్రోనిమస్’’.తల్లి జీవించిన కాలం లోనే సఫో కవిత్వం రాయటం ప్రారంభించింది .తండ్రిపేరు ఆమె కవిత్వం లో ఎక్కడా కనిపించదు .సఫో రాసిన ఒక కవితలో ‘’నాకు ఆరుపుట్టిన రోజులు గడిచిపోయాయి మా నాన్న అస్తికలు సేకరించే నాటికి ‘’అని చెప్పుకొంది..

సోదరులు –భర్త

   సేఫోకి ముగ్గురు సోదరులున్నట్లు తెలుస్తోంది .వారిపేర్లు ఈజిరియస్ ,లారికస్,కేరకస్.ఇందులోకేరకస్ అందరిలో పెద్దవాడు .సఫోకు చిన్నతమ్ముడు లారికాస్ అంటే అభిమానం ఎక్కువ .నగరం లో భాగ్య వంతుల కుమారులు తరచూ కలిసే చోట లారికాస్ వారికి  వైన్ పోయి౦చేవాడని   రాసింది .దీన్ని బట్టి సఫోకూడా సంపన్న కులీనురాలే అని నమ్మ్తుతున్నారు .ఆమె జీవితం పై అనేక చరిత్రకారులు విపరీత కధనాలు అల్లారు .కాని అవన్నీ సత్య దూరాలేనని తేలింది .చివరికి సూడా వివరణలో ఉన్నదానిప్రకారం సఫో బాగా ధనవంతుడైన ‘’సేరిక్లియాస్ ‘’అనే అతన్ని వివాహమాడింది .ఆతను ‘’ ఆండ్రోస్’’లో బడా వ్యాపారి అని ఆయనే సఫే కూతురు క్లీస్ కు తండ్రి అని తేలింది .

సిసిలీ జీవితం –మళ్ళీ లేస్బాస్ చేరిక

    సఫో జీవితం ఆనాటి రాజకీయ కల్లోల పరిస్తితులకు గురైంది .లేస్బాస్ రాజకీయ కల్లోలం లో పాటికస్ అధికారం లోకి వచ్చాడు .దీనితో సఫో  సిసిలీకి వలస పోయింది .అక్కడ సిరాక్యూజ్ నగరం లో ఆమె విగ్రహాన్ని స్తాపించారు ..సమకాలీనుడు ఆలికాస్ లాగా  కాకుండా రాజకీయాలకు  కవిత్వం తో చోటుకల్పించ లేదు .కాని  98 వ కవితాఖండిక  లో  తనకు విలాస వంతమైన జీవికకు తగిన సౌకర్యాలు .లేవని మాత్రం తెలిపింది .ఆల్సియాస్ రాజకీయ పక్షానికి మద్దతు తెలియజేసింది .మళ్ళీ లేస్బాస్ చేరి అక్కడే జీవితం గడిపిందని రికార్డులు సూచిస్తున్నాయి .

సఫో జీవితం పై మరో నీలి నీడ

ఫాయాన్ లిజెండ్ ప్రకారం సేఫో కవయిత్రి ‘’ఫాయాన్ అనే ఫెర్రీ నడిపే వాడిని ప్రేమించి అతనికోసం ‘’లూకాదియన్ క్లిఫ్ ల నుండి దూకి ఆత్మ త్యాగం చేసుకొన్నది .ఇది చారిత్రిక అసత్యం అని రుజువైంది .

సఫో రచనల సేకరణ –భద్రత

  అలేక్సాండ్రియా గ్రంధాలయం సేఫో  కవితా ఖండికలను తొమ్మిది పుస్తకాలుగా  సేకరించి భద్ర పరచింది .అందులో ఒకటవ పుస్తకం  లో 330 స్తాఫిక్  స్టాంజాలున్నాయి .రెండవ పుస్తకం  లో గ్లకానిక్ పంక్తులున్నాయి ‘మూడులో యాక్లిపియాద్ స్టిక్స్  పద్యాలు ,నాలుగులో మూడులో ఉన్నట్లుగానే  ఉండేకవితలు ,అయిదులో త్రిపాద కవితలు ,ఆరులో ఏమి ఉందొ తెలియదు .ఏడవ పుస్తకం లో రెండే రెండు కవితలు ,ఎనిమిదిలో 103వ విభాగం లోనివి తొమ్మిదిలో ‘’ఎపి తాల్మియా ‘’మొదలైన ఛందస్సులలో ఉన్నవి కనిపిస్తాయి ఈ పుస్తకాలను సేఫో రాసిన ఛందస్సును బట్టి విభజించి తయారు చేశారు .

సఫో కవితా విన్యాసం

  మొదటి తునక లేక ఫ్రాగ్మేంట్ లో పూర్తీ కవిత ఉంది ‘అది ఆఫ్రో డైట్ కు స్తోత్రం .గోప్పశైలీ ,చక్కని పద బంధం తో అలరారే కవిత ఇది .అందర్నీ ఆకర్షించింది .2014ఫిబ్రవరిలో  ఇదివరకు వెలుగు చూడని సఫో కవితలను ‘’టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ ‘’లో ‘’న్యు పోయెమ్స్ బై సఫో ‘’పేరిట ముద్రించారు .ఆమె కవిత్వం చిక్కగా చక్కగా మంచి పదబంధం తో ప్రాసలతో ఆధునిక ప్రణయ కవిత్వ ధోరణిలో ఉంటుంది .అంత చక్కని కవిత్వం అంతకు ముందెన్నడూ గ్రీకు భాషలో రాలేదని అంటారు .పిచ్చికలు ఆఫ్రొడైట్ రధాన్ని లాగుతున్నట్లు రాసింది .సరైన పదాలను ఎన్నుకొని సూటిగా గుండెలను తాకేట్లు కవిత్వం రాసింది .చదివి యిట్టె ఆకర్షింప బడతారు .మాధుర్యం గల శబ్దాలతో సంగీత ధ్వని కల్గిస్తుంది .చెవులకు ఏంతో ఇంపుగా కవితలుంటాయి .కవిత్వం అంతా ప్రసాద మాధుర్య భరితం .ప్రముఖ  విశ్లేషకుడు డయారిసియాస్ ,సఫో కవిత్వానికి ముగ్ధుడయ్యాడు .

హోమర్ తో పోలిక

    సఫోకవిత్వం లో కొన్ని భాగాలు హోమర్ కవితలను పోలిఉంటాయి . ఇలియడ్’’లోని  కధలను విస్తరించి ,మాధుర్యం అద్ది అందం గా తీర్చింది .హెక్టార్ , ఆన్డ్రో మాక్ వివాహాన్ని మనోహర కవిత్వం తో ముంచేసింది .హెలెన్ పాత్రనూ బాగా పోషించింది .హోమర్ కవి  ట్రాయ్ పట్టణం లాగా, సఫోకవయిత్రి  లేస్బాస్ కూడా లిడియా వలన రాజకీయ అస్తిరత్వం తో ఉండేది .హోమర్ ‘’మిలిటరిజం’’ నుకవిత్వం లో ప్రదర్శిస్తే  సఫో ప్రేమ ,సౌందర్యాలతో కవిత్వాన్ని హృదయాన్ని మనసుని ఆకర్షించింది .అది వీరకావ్యం అయితే ఇది ప్రేమకావ్యం . ..ఇద్దరూ చారిత్రక సంఘటనకు అక్షరాకృతి తమదైన శైలిలో కల్పించారు .వీటివలననే ఆనాటి సాంఘిక రాజకీయ స్తితిగతులు తెలిశాయి .

అలెక్సాండ్రియాలో పాపిరస్ పై  సఫో కవిత్వం –ప్లేటో మెచ్చుకోలు –ఇంగ్లీష్ అనువాదం

  సఫో తనకవితలను ‘’సితార ‘’వాయిద్యం పై వాయిస్తూ పాడేది .క్రీ పూ మూడవ శతాబ్దానికి అప్పటికి వాడకం లోకి వచ్చిన పాపిరాస్ చుట్టలపై సఫో కవితలు గ్రంధస్తమై అలేక్సాండ్రియా ‘’హౌస్ ఆఫ్ మ్యూసేస్ ‘’లో భద్రపరచ బడినాయి  .కాని దానిపై అనేక సార్లు దండ యాత్రలు జరిగి ఎక్కువ భాగం సేఫో రచనలు ద్వంసమైనాయి . సేఫో కవితలను ‘’డివైన్ సాంగ్స్ ‘’అన్నారు ఆనాడు .తత్వ వేత్త ప్లేటో –సేఫోను’’ తెలివైన కవి ‘’అన్నాడని క్లాడియస్ ఆలినాస్ రాశాడు .సఫో సమకాలీన కవి ఆల్కేయాస్ ‘’ఊదా రంగు కురుల స్వచ్చ తేనే మాధుర్య హసిత సఫో ‘’అన్నాడు మూడవ శతాబ్దపు తత్వవేత్త ‘’మాక్షిమస్ ఆఫ్ టైర్ ‘’సఫోను గురించి రాస్తూ ‘’పొట్టి నల్లని అమ్మాయి’’ అని ,’’ఆమె  మహిళా స్నేహితురాళ్ళ తో  మెలిగే విధానం అచ్చం గా సోక్రటీస్ విధానం గానే ఉండేదని’’అన్నాడు  .సఫోకవితలను ఇంగ్లీష్ లోకి జాన్ హాల్ అనువదించి1652లో  ప్రచురించి గొప్ప వ్యాప్తి తెచ్చి ఆమె కవితామాదుర్యాన్ని తెలుసుకొవటానికి సహకరించాడు.2002లో ‘’అన్నే కార్సన్ ‘’సఫో కవితా ఖండికలను ‘’ఇఫ్ నాట్ వింటర్ ‘’పేరిట ముద్రించాడు .ఆ తర్వాత అనేక అనువాదాలోచ్చి సఫో కవిత్వ మాధుర్యం ఆధునిక యుగం లో బాగా ప్రచారమైంది .

సఫో పేరు ప్రభావం

  19 .వ శతాబ్దం నుండి సఫో జన్మించిన లేస్బోస్ దీవి పేరు నుండే మహిళా హోమో సెక్సువల్స్ కు  ‘’లే స్బియన్ ‘’అనే పేరు వచ్చింది .విక్టోరియన్ యుగం లో సఫో పేరు బాలికల ఉన్నత విద్యాలయం హెడ్ మిస్ట్రెస్   పేరు గా మారింది .

            – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0

– See more at: http://vihanga.com/?p=14176#sthash.yTek2EJG.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?

కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల
అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. పదిలక్షల ఆర్థికసాయాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో ప్రతినెలా 10వేల రూపాయలను రాజేశ్వరికి సాయంగా అందించనున్నారు
మాట మరిచావా మోదీ?
అన్నను అన్నావు.. అనాథను కానివ్వను అన్నావు
ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తానన్నావు
సీమాంధ్రను నెంబర్‌ వన్‌ చేస్తానన్నావు కానీ
అధికారంలోకి వచ్చాక తొండిచేయి
2 బడ్జెట్లలో పైసా కూడా నిధుల్లేవు
మరో ‘కర్నూలు’ తప్పదా అన్న ఆందోళన!
నాటి మోదీ మాట..
తిరుపతిలో…
నా కళ్లముందు వెంకటేశ్వర స్వామిని చేరుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలంటే చెప్పండి. నేను మీతోనే ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం!’’
గుంటూరులో…
‘కాంగ్రెస్‌ మిమ్మల్ని అనాథలుగా మార్చిందనే ఆవేదన వద్దు. మీకు అన్నగా, అండగా నేనుంటాను. మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. అధికారంలోకి రాగానే అండగా ఉంటా!’
‘ఒక్కడంటే ఒక్కడు కూడా మా మొర ఆలకించలేదు’ అనే ఆక్రోశం! నిరసనలు, ఆందోళనలు ఎన్ని చేసినా కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం! రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన! కాంగ్రెస్‌పై అంతులేని కసి! ఈ అనిశ్చితి నుంచి బయటపడేసేదెవరు? మమ్మల్ని ఆదుకునేదెవరు? అనే ప్రశ్నలు! ఈ సమయంలో… మోదీ అనే నాయకుడు వారి కళ్లకు ‘మెసయ్య’ (రక్షకుడు)లాగా కనిపించారు. ఆయన మాటలు సూటిగా వారి హృదయాలను తాకాయి. ‘మీరు అనాథలు కాదు. అన్నలా నేనున్నాను’ అని మోదీ చెప్పగానే భావోద్వేగంతో కళ్లు తడుపుకొన్నారు. ‘ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తాం’ అని ప్రకటించగానే… ‘నిజమే కాబోలు’ అని అనుకున్నారు. మోదీ ప్రధాని అయ్యారు. ఒక బడ్జెట్‌ ముగిసింది. ‘ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదులే!’ అని సరిపెట్టుకున్నారు. నిన్నటికి నిన్న మరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ… నవ్యాంధ్రకు ఇచ్చింది ఏమీ లేదు. ‘విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం’ అంటూ మరో హామీ తప్ప! విభజన చట్టంలో ఏముంది? మోదీ ఏం చెప్పారు? నవ్యాంధ్రకు చేయాల్సింది ఏమిటి? ఇప్పటిదాకా ఏం చేశారు? ఇవీ ప్రశ్నలు! ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న వరుస కథనాలు నేటి నుంచి…
(హైదరాబాద్‌ – ఆంధ్రజ్యోతి)  అది.. 2014 మే ఒకటో తేదీ! మండే ఎండాకాలం.. ఆపై రోళ్లు పగిలే గుంటూరు.. రాష్ట్ర విభజన నిర్ణయంతో మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక గంభీర స్వరం అంతకంటే ఉద్రేకంగా ప్రసంగిస్తోంది. ‘‘ఆంధ్రులని అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచీ ఉన్నదే. అప్పట్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి (రాజీవ్‌ గాంధీ) మీ ముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్ట్‌లో అవమానించారు. ఇందిరా గాంధీ తెలుగువారైన నీలం సంజీవ రెడ్డిని పోటీకి నిలిపి వెన్నుపోటుతో ఓడించారు. ఇప్పుడేమో అమ్మా కొడుకుల పాలన మిమ్మల్ని అనాథలుగా వదిలేసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరు, తల్లీ కొడుకుల (సోనియా – రాహుల్‌) వ్యవహారం మీకు ఆవేదన కలిగించింది. మీరు అనాథలు కాదు. మీ అన్నను నేను, మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని ఏనాటికీ అనాథలను చేయను. మీ భవిష్యత్‌కి భరోసా ఇస్తున్నా. మీకు అండగా ఉంటాను. సీమాంధ్ర కోసం పార్లమెంటులో పోరాడి సాధించిన హామీలన్నీ అమలు చేస్తా’’ అంటూ ఆ గంభీర స్వరం మరింత గంభీరంగా ప్రజలకు కొండంత భరోసా ఇచ్చింది. ఆ స్వరం పేరు నరేంద్ర మోదీ. ఒక్కసారి ఎన్డీయే కూటమికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత భవిష్యత్‌ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం చిన్నబోయేలా సీమాంధ్ర రాజధానిని నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. మీ కలలని నెరవేరుస్తా. అధికారంలోకి వస్తే అండగా ఉంటా. ఢిల్లీ మీ వెంట ఉంటుంది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేనా.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల కలిగిన బాధను అర్థం చేసుకోగలనని, హైదరాబాద్‌ నుంచి రావడమంటే తల్లిని వదిలి బిడ్డ రావడమేనని కూడా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి తన మస్తిష్కంలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ, ఢిల్లీలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇవి ముఖ్యమంత్రిని, సర్కారును ఏర్పాటు చేసే ఎన్నికలు కావు. సీమాంధ్రను నిర్మించుకునే ఎన్నికలు. మీరు మంచి నిర్ణయం తీసుకోకుండా… సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారి చేతికి ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఎంపీ సీట్లన్నీ గెలిపించండి. సీమాంధ్ర నెంబర్‌ వన్‌ అవుతుందో, లేదో చూడండి!’’ అంటూ నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి ఆంఽధ్రావని స్పందించింది. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సరైన పునాది కూడా లేకపోయినా.. ఏకంగా రెండు ఎంపీ, నాలుగు అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. అయితే, ఎన్నికలకు ముందు ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ స్వరం ఇప్పుడు మూగవోయింది. ఏ జిల్లాలో అయితే ఆయన ‘మీరు అనాథలు కారు.. అన్నగా అండగా ఉంటా’ అన్నారో అదే జిల్లాలో ఏర్పాటవుతున్న నవ్యాంధ్ర రాజధానికి మాత్రం తొండి చేయి చూపించారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధానిని నిర్మిస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఇప్పుడు.. అందుకు కనీసం ఒక్కపైసా నిధులను కూటా బడ్జెట్లో కేటాయించలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటినీ అమలు చేస్తామని పదే పదే స్పష్టం చేసిన మోదీ ఇప్పుడు చంద్రబాబు పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రులను కాంగ్రెస్‌ అనాథలను చేసినట్లే.. బీజేపీ కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆశల్ని కృష్ణా నదిలో కలిపేసింది. దిక్కూ మొక్కూ లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అనాథగా మిగిలింది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు రాష్ట్రాల రాజధానులు దేశంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో, ఏపీ రాజధాని మాత్రం ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది.
చట్టంలో స్పష్టంగా ఉన్నా…
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి, శాఖాధికారుల కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు, ప్రభుత్వ అతిథి గృహాలు తదితరాలను నిర్మించడానికి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందజేస్తుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఆ మేరకు నవ్యాంధ్ర రాజధాని కోసం కేంద్రం నిధులు ఇచ్చి తీరాలి. రాజధాని నిర్మాణం అంటే నాలుగు భవన సముదాయాలు కట్టడం కాదు. భవిష్యత్‌ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితిని చూస్తుంటే కర్నూలు చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోందని సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రులకు రాజధాని లేదని, గుడారాల్లో ఉన్నారంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తదితరులు పదే పదే ఎద్దేవా చేశారని, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, సీమాంధ్రుల్లో ఇటువంటి మనోభావాలను గుర్తించే.. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. దాదాపు 40 వేల ఎకరాలను సేకరించడమే కాకుండా సింగపూర్‌ సహకారంతో ఆ దేశాన్నే తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని శపథం చేశారు. రైతులను బతిమలాడి, బామాలి, ఒప్పించి భూ సమీకరణను అయితే పూర్తి చేశారు. కానీ, కోట్ల రూపాయల నిధులు ఎక్కడినుంచి తెస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇప్పటికి రెండు బడ్జెట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ, రెండింటిలోనూ పైసా కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సీమాంధ్ర నేతల్లోనూ కేంద్ర సాయంపై ఆశలు అడుగంటుతున్నాయి. అదే సమయంలో, ఏపీ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. రుణ మాఫీని అమలు చేయడానికే తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ సదుపాయాలతో ప్రపంచ శ్రేణి రాజధానిని నిర్మించాలంటే అథమ పక్షం లక్షా పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ కూడా దానికంటే తక్కువే. నాలుగైదేళ్లలో రాజధానిని నిర్మించాలంటే ఏటా కనీసం పాతిక వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. వాటిని బడ్జెట్లో కేటాయిస్తే ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు కూడా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి కేంద్రమే దిక్కు. కానీ, తాజా బడ్జెట్‌తో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చబోదని స్పష్టం కావడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 

భిన్న ధ్రువాల సంకీర్ణం

 

జమ్మూ-కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏడువారాల పాటు చర్చోపచర్చలు జరిపిన తరువాత, ఇరుపక్షాలూ తాము అత్యంత ప్రధానమైనవిగా భావించిన వాటిని ‘వివాదస్పద’ అంశాలుగా నిర్ణయించి అటకెక్కించడంతో అధికారం పంచుకోవడం సాధ్యపడింది. ఏకాభిప్రాయం సాధ్యం కాని అంశాల జోలికిపోకూడదన్న ఏకాభిప్రాయంతో ఉత్తర, దక్షిణ ధృవాలు రెండూ ఏకమయ్యాయి. అధికారంలోకి వచ్చిన కొద్దిగంటల్లోనే వివాదస్పద వ్యాఖ్యలు నిప్పురాజేస్తున్నప్పుడు, ఇరుపక్షాలూ ఎదుటివారి వ్యాఖ్యలతోనూ, చర్యలతోనూ తమకు సంబంధం లేదంటూ ఎంతకాలం నెట్టుకురాగలవో చూడాలి.
ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ఒక చక్కని దృశ్యాన్ని ఆవిష్కరించింది. వేర్పాటువాదుల పట్ల ఒకింత సానుభూతిగా ఉండే ఒక ప్రాంతీయ పార్టీ, హిందూ జాతీయవాదాన్ని బలంగా వినిపించే ఒక జాతీయపార్టీ ఒక సరిహద్దు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. ఇంతకాలమూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి విధేయులమై ఉంటామంటూ బీజేపీ మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ వేర్పాటువాద నాయకుడు, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సజ్జాద్‌ లోన్‌ తన రాష్ట్రంలో బీజేపీ కోటాలో మంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, పీడీపీలు ఈ పొత్తుకు సిద్ధపడటానికి రాజకీయంగా ఏ లెక్కలు కట్టుకున్నాయో, భవిష్యత్తుమీద ఏ అంచనాలకు వచ్చాయో తెలియదు కానీ, ఆ పరిమితులూ, పరిధులతో పనిలేని దృశ్యం అక్కడ కనిపించింది. దీనితోపాటు, రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లోనూ ఆధిక్యం ఉన్న పార్టీలు అధికారాన్ని పంచుకోవడం జమ్మూ, కశ్మీర్‌ ప్రాంతాల అభివృద్ధికి మేలు చేస్తుంది. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమిని తిరస్కరిస్తున్నప్పుడు ఈ రెండు ప్రాంతాలవారూ ఊహించినట్టుగానే భిన్నదారులు ఎంచుకున్నారు. హిందువుల ఆధిపత్యం ఉన్న జమ్మూలో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తే, ముస్లిం ఆధిపత్యం ఉన్న కశ్మీర్‌లో పీడీపీకి ఆధిక్యత లభించింది. కశ్మీర్‌లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోతే, ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి సజ్జాద్‌ లోన్‌ గెలిచారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించారంటూ కొత్త ముఖ్యమంత్రి నేరుగా హురియత్‌కూ, ఉగ్రవాదులకు, సరిహద్దు ఆవల దేశానికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం వివాదం రేకెత్తించినా క్షేత్రస్థాయి వాస్తవం అదేనని ముఫ్తీకి తెలుసు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా మోదీ ప్రభంజనంతో బీజేపీ బలమైన శక్తిగా, 44 ప్లస్‌ అంటూ లక్ష్యం పెట్టుకుని రాష్ట్రంలో కాలుమోపినప్పుడు, అక్కడి అంచనాలు, లెక్కలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. ఈ తరుణంలో, తొలిసారిగా హురియత్‌ ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా కశ్మీరీలకు విజ్ఞప్తి చేసింది. బీజేపీ విస్తరణభయం మిలిటెంట్లూ, హురియత్‌ ఈ ఎన్నికల్లో సానుకూలంగా ఉండేట్టు చేసింది. కశ్మీర్‌లో అన్ని దశల్లోనూ ఓటింగ్‌ అధికంగా జరగడమే ముఫ్తీ ముఖ్యమంత్రి కావడానికి వీలు కల్పించింది. తన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ లోక్‌సభనుంచి వాకౌట్‌ చేసినా, బీజేపీ ఆగ్రహించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడానికి అప్పట్లోనే కాదు, భవిష్యత్తులోనూ ఆ విధమైన సహకారం తనకు అవసరమని ఆయన భావిస్తుండటమే కారణం.
నిత్యం ఉద్రిక్తంగా ఉండే ఈ సరిహద్దు రాష్ట్రంలో సుస్థిర ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రశాంతత కొనసాగాలని రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కోరుకున్నది. కేంద్రంలో బలంగా ఉన్న ఒక జాతీయపార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకభాగస్వామి కావడం ఆ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన బంధాలు ఏర్పడతాయి. అధికారంలో ఉన్న బీజేపీ పనితీరు చూడటానికి కశ్మీర్‌ ప్రజలకు, అక్కడి ప్రజల పట్లా, సమస్యల పట్లా ఒక అవగాహన కలగడానికి బీజేపీకీ ప్రత్యక్షంగా అవకాశం కలుగుతుంది. ఇది ఇంతకాలమూ ఇరువైపులా పేరుకుపోయి ఉన్న అనుమానాలు, అపోహలూ తొలగిపోయేందుకు వీలు కల్పిస్తుంది. కరడుగట్టిపోయి ఉన్న అభిప్రాయాలను కరిగించుకోవడానికీ, వీలైనచోట్ల మార్చుకోవడానికీ దోహదం చేస్తుంది. అలాగే, జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల మధ్య సయోధ్యకు మరింత దోహదం చేస్తుంది. ఎన్నికల బరిలో కత్తులు దూసుకున్న ఈ రెండు పార్టీలూ, కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కొన్ని అంశాలపై కఠినమైన వైఖరులను సడలించుకున్నాయి. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు చెల్లవంటూ నినదించిన పార్టీ ఇప్పుడు 370వ అధికారణ విషయంలో మారుమాట్లాడవద్దని నిర్ణయించుకుంది. సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టం ఎత్తేయాలంటూ ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పెట్టిన పీడీపీ ఇప్పుడు మెట్టుదిగింది. ఒకే ఒరలో ఇమిడిపోవడానికి సిద్ధపడిన ఈ రెండు కత్తులూ ఇకముందు అనవసరపు వ్యాఖ్యలకు, వివాదాలకు స్వస్తిచెప్పి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా అభివృద్ధే లక్ష్యంగా కలసి పనిచేయడం ఆరంభించాలి. తమకు అధికస్థానాలు కట్టబెట్టిన జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాలతో పాటు లద్దాఖ్‌ను కలుపుకోవాలి. రాష్ట్రాన్ని గుజరాత్‌ తరహాలో అభివృద్ధి చేస్తానంటున్న ముఫ్తీకి తన రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియంది కాదు. ఉగ్రవాదం మాత్రమే ఆ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కాదు. అపారమైన వనరులు ఉన్న ఆ రాష్ట్రాన్ని ప్రధాన స్రవంతితో మమేకం చేసి, అభివృద్ధికి బాటలు వేసినప్పుడు ఉగ్రవాదం సహా అనేక వివాదాలు చల్లారిపోతాయి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment