‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3

‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3

  • 14/12/2014
  • |

  • – ఎం.వి.ఆర్. శాస్త్రి

చదువు పట్టదు. జులాయిలా తిరుగుతాడు. చెడు సావాసాలు. మాంసం లేనిదే ముద్ద దిగదు. చెడ తాగుతాడు. సానివాడల చుట్టూ తిరుగుతాడు. పక్కా వ్యభిచారి. దేవుడిని నమ్మడు. పైగా తిడతాడు. పరమ నాస్తికుడు. హిందూ మతమంటే మంట. సాధు సంతులంటే అసహ్యం.
ఇదీ అవతారం! ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు మున్షీరాంను చూసిన వారెవరూ అతడి గురించి ఒక్క మంచి మాట చెప్పరు. వీడు భ్రష్టుడు; పాపాత్ముడు; మంచి కుటుంబంలో చెడబుట్టాడు; జన్మలో బాగుపడడు – అని ఏవగించుకుంటారు. అంతగా కంపరం కలిగించిన ఆ నికృష్టుడే మునుముందు గొప్ప ధర్మవీరుడవుతాడు; దారి తప్పిన వారికి మార్గం చూపిస్తాడు; చదువులను వెలిగిస్తాడు; మహా విద్యా సంస్థను నడుపుతాడు; వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెడతాడు; పవిత్రంగా జీవిస్తాడు; జాతి గర్వించదగ్గ మహా పురుషుడవుతాడు – అని కలనైనా ఊహించరు.

మున్షీరాం పుట్టింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ఏడాది ముందు. 1856 ఫిబ్రవరి 22న. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో. సుక్షత్రియ కుటుంబంలో. వారిది మడి, ఆచారం నిష్ఠగా పాటించే సాంప్రదాయక కుటుంబం. తాతలాగే తండ్రి కూడా శివభక్తుడు. తల్లికీ పూజా పునస్కారాలు జాస్తి. ఐదుగురు పిల్లల తరవాత పుట్టిన కడగొట్టు బిడ్డ కనకేమో మున్షీరాంను (మొదట పెట్టిన పేరు బృహస్పతి. పలకటం కష్టమని దాన్ని మున్షీరాంగా తరవాత మార్చారు) అల్లారుముద్దుగా పెంచింది. తండ్రి నానక్‌రాం ఈస్టిండియా కంపెనీ కొలువులో పోలీసు అధికారి. ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతూండేవాడు. తరచు బదిలీలుండేవి. దానివల్ల పిల్లవాడి చదువు సరిగా సాగలేదు. తండ్రికి క్షణం తీరిక లేకపోవటం, తల్లి గారాబం అబ్బాయిని చెడగొట్టాయి.
దానికితోడు చెడు సావాసాలు. చిన్నతనంలోనే బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరగటం, భంగు, సారా తాగటం, చీట్ల పేక ఆడటం అలవాటైంది. వయసొచ్చాక పడుపుగత్తెలనూ మరిగాడు. కొత్వాలుగారి అబ్బాయి కావటంవల్ల ఎవరూ మందలించేవారుకారు. మొదట్లో కాస్తో కూస్తో దేవుడి మీద గురి ఉండేది. పోనుపోను అదీ పోయింది.
దానికీ కొన్ని కారణాలున్నాయి.
మున్షీరాం విద్యాభ్యాసం ఎక్కువగా కాశీలో జరిగింది. తండ్రి అక్కడి కొత్వాలు. చిన్నప్పుడు దైవభక్తి బాగానే ఉండేది. తరచూ గుడికి వెళ్లి విశ్వనాథుని దర్శనం చేసుకునేవాడు. 19వ ఏట ఓ రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఆలయానికి వెళ్లాడు. ప్రధానాలయం గుమ్మం బయట ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు. లోపల రేవా మహారాణిగారు ఉన్నారు. ఆమె అర్చన ముగిసేదాకా ఎవరినీ పోనిచ్చేది లేదన్నారు.
మున్షీరాం దిమ్మెరపోయాడు. అంతలో ఒక పోలీసు అతడు ఫలానా అని గుర్తు పట్టి దయచేసి కొద్దిసేపు వేచి వుండమని మర్యాద చేయబోయాడు. కుర్రవాడు ఆగకుండా విసురున ఇంటికి వెళ్లాడు. రాత్రి నిద్రపట్టలేదు. ఎంతసేపూ అదే ఆలోచన. దేవుడి దగ్గర కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయా? మనుషులకు భేదభావం ఉండొచ్చు. దేవుడికి ఏమైంది? ఎవరో మహారాణి వచ్చిందని మురిసి మామూలు భక్తులను దగ్గరికి రానివ్వనివాడు ఏమి దేవుడు? అసలు దేవుడనే వాడున్నాడా? మనిషి చెక్కిన విగ్రహమేనా?
ఇలా ఆలోచిస్తూ పోయే కొద్దీ విశ్వనాథుడి మీదే కాదు, అందరు దేవుళ్ల మీదా మున్షీరాంకు అసహ్యం వేసింది. రారుూరప్పలకు మహిమ ఉన్నదని మూర్ఖంగా నమ్మే హిందూ మతమంటేనే విరక్తి పుట్టింది. సరైన దారి ఏదో ఎవరు చూపించగలరా అని ఆలోచిస్తే తనకు పరిచితుడైన ఒక క్రిస్టియన్ మిషనరీ స్ఫురించాడు. పుస్తకాల్లో తాను చదివిన రోమ్ నాగరికత, క్రీస్తు కరుణ గుర్తొచ్చాయి.
కిరస్తానీ మతం మీద కుతూహలం కలిగి, తెలిసిన ప్రొటెస్టంట్ మిషనరీ దగ్గరికి వెళ్లాడు. అతడు బోలెడు సంతోషపడ్డాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్. నీ కళ్లు తెరచుకున్నాయి. ప్రభువు నిన్ను కరుణించాడు. వెంటనే మా మతంలోకి మారు’ అని వెంటపడ్డాడు.
‘అది తరవాత చూద్దాం. ముందు మీ మతం గురించి చెప్పు’ అన్నాడు మున్షీరాం. అతడి ప్రశ్నలకు సందేహాలకు అవతలి వాడు జవాబు చెప్పలేక పోయాడు. అతడి వల్ల కాదనుకొని, మున్షీరాం ఓ రోమన్ కాథలిక్ ప్రీస్టు దగ్గరికి వెళ్లాడు. మొదటి వాడి మీద అతడు నయం అనిపించాడు. క్రైస్తవ మతం గొప్పతనం చెబితే అర్థంకాదు. సందేహాలు పక్కనపెట్టి చర్చికి వస్తూ ఉండు. మెల్లిగా నీకే అంతా తెలుస్తుంది’ అన్నాడు.
మనవాడికి ఆ సలహా నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా చర్చికి వెళ్లసాగాడు. అక్కడి పద్ధతులు, బోధలు అతడిని ఆకట్టుకున్నాయి. ఫాదరీ మంచితనం మరీ నచ్చింది. చేరవలసిన చోటికి చేరాననుకున్నాడు. క్రైస్తవ మతం పుచ్చుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఒక స్నేహితుడిని మాత్రం సంప్రదించాడు. అతడేమో ‘మంచిది. అలాగే కానియ్’ అన్నాడు.
ఇంకేం? ‘మీ మతం తీసుకుంటాను. ఏమి చేయాలో చెప్పండి’ అని అడగటానికి ఫాదర్ ఇంటికి వెళ్లాడు. ఆయన కనపడలేదు. ఇంట్లో అలికిడి లేదు. లోపలికి వెళ్లి తొంగి చూస్తే ఇంకో ఫాదరీ ఎవరో ‘నన్’ (క్రైస్తవ సన్యాసిని)తో అసభ్య భంగిమలో కనపడ్డాడు.
మున్షీరాంకి దిమ్మ తిరిగింది. మళ్లీ చర్చి గుమ్మం తొక్కితే ఒట్టు. ఇంకోసారి మధురలో ఏదో గుడి చూడబోతే ఓ మూల గోసాయి పూజారి భక్తురాలితో సరసమాడుతూ కనిపించాడు. ఈ అనుభవాలతో మున్షీరాంకి దేవుళ్లన్నా, మతాలన్నా మనసు విరిగింది. అందరూ దొంగలే, అసలు దేవుడనేవాడే లేడు అని నిశ్చయానికి వచ్చి పక్కా నాస్తికుడయ్యాడు.
అదే సమయంలో అతడి తల్లి మరణించింది. తండ్రికీ వ్యాపకాలు ఎక్కువయ్యాయి. దాంతో కుర్రవాడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎప్పుడో తప్ప కాలేజికి వెళ్లేవాడు కాదు. పాఠం పుస్తకాలు పక్కన పడేసి వాల్టర్ స్కాట్, చార్లెస్ డికెన్స్ నవలలు తెగ చదివేవాడు. వారణాసిలో పరీక్ష తప్పి, అక్కడ బాగా లేదని అలహాబాద్ కాలేజిలో చేరాడు. అక్కడా క్లాసులు ఎగ్గొట్టి, సావాసగాళ్లను వెంటేసుకుని జూదాలు ఆడేవాడు. భంగు, మద్యం తెగ తాగేవాడు. సానివాడల్లో గానా బజానాలు చేస్తూ కులికేవాడు. పాపం చేస్తున్నావ్ అని ఎవరైనా మందలిస్తే అంతా పాపులే, అంతటా మోసమే, దేవుళ్లూ దొంగలేనంటూ తిట్టిపోసేవాడు. సాధువులను, సన్యాసులను చూస్తూనే మండిపడేవాడు.
ఇలా దేవుడికీ, ధర్మానికీ ఆమడదూరమై, నాస్తికత్వంలో మునిగి తేలుతూండగా మున్షీరాం ఓసారి సెలవులకు బరేలీ వెళ్లాడు. అప్పట్లో అతడి తండ్రి ఉద్యోగం అక్కడ. ఇంట్లో కూడా ఇలాగే రెట్టమతంతో అడ్డదిడ్డంగా వాదిస్తూంటే ఓరోజు తండ్రి అన్నాడు ‘ఎవరో దయానంద స్వామి అట! ఊళ్లోకి వస్తున్నాడు. చాలా గొప్పవాడు అంటున్నారు. ఈ పిచ్చి వాగుళ్లు మానేసి ఆయన సభకి వెళ్లు. అప్పుడైనా నీ తిక్క కుదురుతుందేమో’ అన్నాడు. ‘నేను వెళ్లను’ అన్నా వినలేదు. ‘పెద్దపెద్ద తెల్లదొరలు కూడా హాజరవుతారట. అక్కడ బందోబస్తూ అదీ జాగ్రత్తగా చూసుకోమని పైనుంచి ఆదేశాలొచ్చాయి. కాబట్టి నేను ఎలాగూ వెళతాను. ఇంట్లో కూచుని ఏం చేస్తావ్, నువ్వూ రావలసిందే’ అని తండ్రి పట్టుబట్టాడు.
కుమారుడికి ఉక్రోషం వచ్చింది. ‘సరే వస్తాలే’ అని పైకి అన్నాడు. ‘వచ్చి ఏమి చేయాలో అది చేస్తానులే’ అని లోపల అనుకున్నాడు. తనకు తోడుబోయిన తొట్టిగ్యాంగును కూడగట్టాడు. సభలో అల్లరి చేసి, వచ్చిన స్వాములారిని పరాభవించాలని పథకం వేశాడు. ‘ఉండు నీ భరతం పడతా’ అని సన్యాసి మీద పళ్లు నూరుతూ, జతగాళ్లను వెంటేసుకుని సభాస్థలికి ఈలవేస్తూ వెళ్లాడు.
తన జీవితంలో అదే గొప్ప మలుపు అని అతడికి తెలియదు.
వచ్చినవాడు సామాన్యుడు కాదు.
స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ సంస్థాపకుడు. దేశంలో ఎందరో ఉద్దండ పండితులను శాస్త్ర చర్చల్లో పిండి చేస్తూ, వెర్రిమొర్రి వాదాలను ఖండిస్తూ, వేద ప్రమాణాన్ని అద్భుతంగా నిరూపిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ప్రభంజనంలా ముందుకు దూసుకుపోతున్న వేదమూర్తి.
తిట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ తీరా స్వామి దగ్గరికి వెళ్లాక ఏమైంది?

మొదటిసారి స్వామి దయానంద సరస్వతిని చూడగానే నాకు కొత్త జన్మ వచ్చింది. నాలో ఏదో విశ్వాసం ఉప్పొంగింది. ఆయన వర్ఛస్సు, తేజస్సు అచ్చెరువు కలిగించి నన్ను కట్టి పడేశాయి. రెవరెండ్ టి.జె.స్కాట్, మరి కొందరు యూరోపియన్లు అక్కడ కూచుని స్వామి చెప్పేది మహా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు స్వామి ఓంకారం గురించి మాట్లాడుతున్నారు. ఒక సంస్కృత పండితుడు ఇంత ధాటిగా మాట్లాడి, చదువుకున్న వారిని ఇంతలా ఆకట్టుకోవడమేమిటని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఋషి ప్రభావం వల్ల నా వంటి నాస్తికుడికి కూడా గొప్ప ఆత్మానందం కలిగింది.
[Swami Shraddhanand (Autobiography) Ed.M.R.Jambunathan, p.27]
బరేలీ టౌన్‌హాల్‌లో కొథ్దిరోజులపాటు దయానంద ఋషి వరసగా ప్రసంగాలు చేశాడు. క్రైస్తవ మతాచార్యుడు రెవరెండ్ స్కాట్, కమిషనర్ ఎడ్వర్డ్, కలెక్టర్ రీడ్, ఇంకా డజన్ల కొద్దీ యూరోపియన్లు రోజూ హాజరై ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించేవారు. పుక్కిటి పురాణాల గురించి, పంచపాండవుల పెళ్లి, ద్రౌపది బహు భర్తృత్వం లాంటి అంశాల అసంబద్ధత గురించి స్వామీజీ నిశితంగా ఆక్షేపిస్తూంటే తెల్లదొరలు చెవులు రిక్కించి, ముసిముసిగా నవ్వుతూ బాగా ఆనందించేవారు. అదే ఊపులో కన్యకు గర్భం లాంటి క్రైస్తవ లీలలనూ స్వామి అంతే తీవ్రంగా ఎండగడుతూంటే వారి మొగాలు మాడిపోయేవి. అంత పరుషంగా క్రైస్తవ మతాన్ని ఆక్షేపిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చని వారితో వీరితో కబురు పంపించారు. స్వామి ఆ హెచ్చరికలను కొనగోటితో కొట్టిపారేశాడు. ‘కలెక్టర్లకు, గవర్నర్లకు కోపం వస్తుందేమోనని భయపడేవాడిని కాను. ఆత్మకు చావు లేదని నమ్మినవాడిని. నన్ను ఎవరేమి చేయగలరు?’ అని ఆయన మెరిసే కళ్లతో బహిరంగ సభలో గంభీరంగా సవాలు చేస్తూంటే ఆయన ధైర్యానికి అందరూ అవాక్కయ్యారు. మతాలకు, సంకుచిత అంతరాలకు అతీతమైన స్వామి దివ్యబోధ విదేశీయులను ఎంతగా ఆకట్టుకున్నదంటే రెవరెండ్ స్కాట్ ఆయనను తన చర్చికి సాదరంగా ఆహ్వానించి క్రైస్తవ భక్తులకు ప్రవచనం ఇప్పించాడు.
చెబితే ఎవరూ నమ్మని ఈ ఘటనలన్నీ మున్షీరాం జాగ్రత్తగా గమనించేవాడు. దయానంద ఋషి ఊళ్లో ఉన్నన్నాళ్లూ రోజూ ఆయన బసకు వెళ్లి రాత్రి వరకూ ఆయననే అంటిపెట్టుకుని ఉండేవాడు. వీలు చిక్కినప్పుడల్లా తన సందేహాలను అడుగుతూండేవాడు. మళ్లీ నోరెత్తకుండా స్వామి సూటి జవాబులు ఇచ్చేవాడు. అయినా మున్షీరాంకు మనసు సమాధానపడేది కాదు. ఏదో తెలియని అశాంతి. ‘మీరు ఏమి చెప్పినా ఎంత చెప్పినా నాకు దేవుడి మీద గురి కుదరటం లేదు ఎందుకని?’ అని ఓసారి ఆయననే అడిగేశాడు. ‘నీకు గురి కలిగిస్తానని నేనెప్పుడు చెప్పాను? అది దేవుడు చేయాల్సిన పని. సమయం వచ్చినప్పుడు చేస్తాడు’ అన్నాడు స్వామి.
అలాగే జరిగింది. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేమరేసిన మెమరీస్ -బాపు

bapumemories2 001 memoriesof bapu 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

హిందూజాల చేతికి లండన్ చారిత్రిక భవనం -చాళుక్య వీరభాద్రుడుగా ”రానా

బర్త్‌డే స్పెషల్‌ : చాళుక్య వీరభద్రుడిగా రానా (13-Dec-2014)

గుణశేఖర్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నిడవర్ద్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించబోతున్నారు. డిసెంబర్‌ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియోస్పోపిక్‌ త్రీడీ విధానంలో ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ గెస్ట్‌ రోల్‌ కూడా బాగా ఉపయోగపడేలా కనబడుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్స్‌ పూర్తిచేసుకుంటోంది.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా  రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా  ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా  ఆదిత్యమీనన్, నాగదేవునిగా  బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా  ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా  జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా  ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా  అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాటల నిప్పు జాతికి ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిమ్నోన్నతాలలో నితీష్ కుమార్ – అపూర్వరచయితాకొవ్వలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ యన్ టీ రామారావు – వ్యవసాయ ఋణాలపై వడ్డీ మాఫీ 1984

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 – 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88

131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

విశ్వ బ్రాహ్మణ కుటుంబం లో పులివర్తి శరభాచార్యులు 1912లో జన్మించారు .సువర్ణ రుషి గోత్రీకులు .తండ్రి నాగ భూషణం ,తల్లి శేషమ్మ .తెనాలి తాలూకా కొల్లూరులో పుట్టారు .బి .ఏ .బి .ఇడి పాసై ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించారు .జిల్లా విద్యాశాఖాధికారిగా అంచే లంచేలుగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు .

శరభా చార్యులకు చిన్న నాటి నుండి ఆధ్యాత్మ గురువు లైన తత్వా నందుల  వారి శిష్యులుగా ఉన్నారు .దీనీతో ప్రభుత్వోద్యోగం చేస్తూనే ,ఆధ్యాత్మ భావ పరంపరాలలో ఉన్నత శ్రేణి సాధించారు .బాల్యం లోనే కవిత్వ ధార అబ్బింది . సంస్కృతం లో గొప్ప ప్రావీణ్యాన్ని సాధించి ‘’నివేదనం ‘’,’’మరుత్సందేశః ‘’ ‘’యశోధరా ‘’అనే కావ్యాలను ,’’కలాదర్శః ‘’అనే సంస్కృత నాటకాన్ని రాశారు .తెలుగులో ‘’కల్హార మాల ‘’,’’రత్న గర్భ ‘’,’’కర్మ భూమి ‘’రాశారు .ఆచార్య శ్రీ ఆంగ్ల భాషలోను నిష్ణాతులు .ఇంగ్లీష్ లో ‘’డాక్టర్స్ వార్ ‘’అనే కావ్యం రచించి ఆశ్చర్య పరచారు అంటే త్రిభాషా కవులన్న మాట .అందుకే ‘’త్రిభాషా కవి ‘’కవి బిరుదు నందుకొన్నారు .వీరు రాసిన సంస్కృత కావ్యాలను వంగవోలు ఆది శేష శాస్త్రి తెలుగులోకి సరస సరళ భాషలోకి అనువదించారు .

జిల్లా విద్యా శాఖాదికారిగా ఉంటూనే అస్టావదాన విద్యనూ నేర్చుకొని వందకు పైగా అవధానాలు చేసి రసజ్ఞుల మెప్పు పొందారు .గణితం లోనూ అవధానం చేయవచ్చు నని నిరూపించి ఆ విద్యను కనిపెట్టి ,ఆ విద్యలో ఆద్యులై   సాటి లేని మేటి అనిపించుకొని గణితావధానాలు  చేశారు .’’ఈ వింత అవధానం అందరిని ఆకర్షించింది చాలా ప్రదర్శనలిచ్చారు .’’గణితావదాన శేఖర ‘’గౌరవ పురస్కారాలనందుకొన్నారు .వీరు చేసిన అవధాన విశేషాలు, పద్యాలు అన్నిటిని సంకలితం చేసి ‘’అవధాన వాణి‘’ గ్రంధం గా విడుదల చేశారు .వినయం ,.విజ్ఞత మూర్తీభవించిన అవధాన శేఖరులు ఆచార్యుల వారు .జీవితమంతా ఆధ్యాత్మిక దారిలో  గడిపిన వీరు అతి నిరాడంబరం గా నే ఉండేవారు ఏనాడూ హళ్ళూ పెళ్ళూ, అధికారం ,ఆర్భాటం, హోదా, దర్జా, డాబు ,దర్పం లేకుండా నే  ఉన్నారు .ఎంత ఎదిగారో అంత ఒదిగి ఉన్నవివేక మూర్తి .ప్రజ్ఞా పాటవ ప్రదర్శనా చేయని హుందా తో కూడిన అరుదైన వ్యక్తిత్వం వారిది . అరవై ఎనిమిది సంవత్సరాలు ప్రజాసేవలో సాహితీ సుజనుల మధ్య గడిపిన పులి వర్తి శరభా చార్యుల వారు 1980లో శంభు లోకం చేరారు . .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సీనియర్ సిటిజను వాణి – వార్షికోత్సవం

Aviary Photo_130629517350309929

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87- 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87

130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు

పండిత వంశం

మేడేపల్లి వెంకట రమణాచార్యులు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు .వైష్ణవ మతావలంబులైన ఆచార్యులు .ప్రపత్తి ప్రవరుణులు .ఊరట్ల జమీందారు లైన సాగి వారి ఆస్థానం పండితులైన వీరి వంశం లో తాతరామాచార్యులగారి కమారుడు రఘునాధ దాసు వీరి తండ్రి గారు . అనకా పల్లి లో 1862లో జన్మించారు ..వీరి మూడవ ఏట తండ్రి ఉద్యోగం కోసం విజయ నగరం చేరారు .

తపో నిష్ట తో సర్వం స్వాధీనం

ఆచార్యులవారు తండ్రి వద్దనే పంచాకావ్యాలను చదువుకొన్నారు .విజయ నగరం మహా రాజా వారి హైస్కూల్ లో  విద్య నార్జించి 1877లో మెట్రిక్ పాసైనారు .కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద ‘’కౌముది ‘’,’’కాళికా వ్రుత్తి ,’’తర్క ప్రకరణలు ‘’ అభ్యసించారు .సంస్కృత భాషలో గొప్ప పాండిత్యాన్ని సాధించారు .కాలేజీ లో గుమాస్తాగా ఉద్యోగించారు .రమణాచార్యులు నిత్య తపో నిస్టాపరులు .దీనితో వారికి అలవడని విద్య లేకుండా పోయింది .అన్నిటా అసాధారణ మేధస్సు అలవడింది .

విద్వద్ శిరోమణి ముడుంబై నరసింహా చార్యుల గారి శిష్యులై ,వేదాంత విద్యనూ ,వారి తమ్ముడు వరాహ స్వామి వద్ద’’ ద్రావిడ ఆమ్నాయం ‘’నేర్చారు .1891లో రాజావారి కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయులుగా చేరి 1935వరకు నలభై అయిదేళ్ళ సుదీర్ఘ కాలం పని చేశారు .ఆంగ్ల భాషా పాండిత్యమూ ఉండటం తో ఆచార్యుల వారు తులనాత్మక భాషా శాస్త్రం ను ,(కంపారటివ్ ఫైలాలజి ),సంస్కృత భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అపార విద్వత్తు సాదించుకొన్నారు వీటిని బోధించటం లో వీరి నేర్పు అమోఘం గా ఉండేదని ప్రశంసలు పొందారు .

చతుర్భాషా కవితాచార్యం

ఆచార్యుల వారి ఆంద్ర భాషా వైడుష్యమూ చిన్న నాటి నుండే అలవడింది .విద్వత్ కవిఅయిన మహారాజా వారి  ఆస్థానం లో ఉండటం బాగా కలిసి వచ్చింది .రాజావారు ‘’సతతము సంతస మొసంగు సత్య వ్రతికిన్ ‘’అనే మకుటం ఇచ్చి ఆస్థాన కవులను శతకం రాయమని కోరారు .వాటిలో ఆచార్యుల వారు రాసిన ‘’’’సత్య వతీ శతకం ‘’ఉత్క్రుస్ట కావ్యం గా ఎన్నికై మంచి కీర్తిని తెచ్చి పెట్టింది .ఆచార్యుల వారి తొలిరచనే ఇది .దీనికి ప్రశస్తి రావటం ముదావహమైన విషయం .

‘’నమ్మాళ్వార్ల గాదా సహస్ర మైన ‘’’’తిరు మొళి’’ని పద్యాలుగా ఆంధ్రీకరణం చేసి తన ఉభయ భాషా పటిమను నిరూపించుకొన్నారు .ఈ పద్యాలకే ‘’ఆంధ్రా గీర్వాణ శట కోప సహస్రం’’పేరుతొ సంస్కృత శ్లోకాలు రాసి ప్రచురించారు .’’దేవ వ్రత చరిత్ర ‘’ఆంద్ర కావ్యాన్ని ప్రౌఢ ప్రబంధ శైలిలో రచించి విద్వత్తును ప్రకటించారు .’’నాలాయిరం ‘’అనే నాలుగు వేల  ద్రావిడ భాషా గాధలను తెలుగు పద్యాలుగా మలచారు .

పార్ధ సారధి శతకం ,శ్రీ కృష్ణ చరిత్ర ‘’గద్య ,,’ ఆంద్ర సేతు బంధ మహాకావ్యం ,’’ఆంద్ర హర్ష చరిత్ర ‘’గద్యం రాశారు .అన్నిటికన్నా బాగా అందరినీ ఆకర్షించినది ఆచార్యుల వారు ఆంగ్ల మహా కవి షేక్స్ పియర్ రాసిన చారిత్రాత్మక మైన అద్భుత నాటకాల కధలను సంస్కృతం లో రచించటం .ఎవరూ చేబట్టని గొప్ప ప్రక్రియ .ఇవికాక తెలుగులో ‘’ప్రాకృత భాషోత్పత్తి ‘’,’’నిఘంటు చరిత్ర ‘’,,’’పాండురంగ మహత్మ్య విమర్శనం ‘’,ఆర్ష భాగా విభాగం ‘’,’’అలంకార శాస్త్ర చరిత్ర ‘’అనే అపూర్వ గ్రంధాలను రచించి భాషా శాస్త్రం లో తనకున్న పట్టు ను నిరూపించుకొన్నారు .ముప్ఫై రెండు ఉపనిషద్ విద్యలకు తెలుగులో విస్పష్ట విపుల వ్యాఖ్యానం రాసి చరితార్దులయ్యారు ఆచార్యుల వారు .జీవితాంతం గ్రంధ పఠనం ,గ్రంధ రచనలతోనే కాలక్షేపం చేసిన మహా విద్వద్ వరేన్యులు శ్రీ మేడే పల్లి వెంకట రామణాచార్యుల వారు ఎనభై ఒక్క సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం గా జీవించి 1943 లో వేంకట రమణ ధామం చేరుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం.. .. అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’

కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం..

  • -మార్తి వెంకటేశ్వర శాస్ర్తీ
  • 13/12/2014
TAGS:

మ్యాజిక్
ఆంగ్ల మూలం: రోండా బర్న్
తెలుగుసేత: సత్యవతి
ప్రచురణ: 2014, వెల: రు.295/-
ప్రచురణ: మంజుల్ పబ్లిషింగ్ హౌస్ (పి.)లిమిటెడ్
2 ఫ్లోర్, ఉషాప్రీత్ కాంప్లెక్స్,
42, మాలవియనగర్,
భోపాల్- 462003.

పుస్తకానికి మ్యాజిక్ అని పేరు పెట్టారు గానీ, ఇదేమీ ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకం కాదు. ఒక రకంగా చూస్తే దీనిని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకంగా భావించవచ్చు.
‘‘ఎవరి దగ్గరయితే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువగా పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారు దగ్గరున్నది కూడ పోగొట్టుకుంటారు’’ అని పవిత్ర గ్రంథం బైబిల్‌లోని మాథ్యూ సువార్తలో చెప్పబడిన దానిని కొన్ని శతాబ్దాలుగా చాలామంది సరిగా అర్థం చేసుకోలేకపోయారని రచయిత్రి తెలిపారు. ఇక్కడ చెప్పబడింది ‘సంపద’ గురించి అని ఇటీవలి వరకూ భావించారని, అయితే ‘కృతజ్ఞత’ గురించి చెప్పబడిన సంగతి ఈమధ్యనే బోధపడిందని అన్నారు.
ఈ పుస్తకం మొత్తం ‘కృతజ్ఞత’ అన్న ఒకే ఒక్క పదం చుట్టూ కేంద్రీకృతమయింది. కృతజ్ఞతాభావాన్ని జీవన శైలిలో అలవరచుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఇందులో 28 అభ్యాసాలున్నాయి.
పుస్తకంలో థాంక్యూ అన్నమాట అనేకసార్లు కనిపిస్తుంది. మొక్కుబడిగా థ్యాంక్యూ అనడం వల్ల ప్రయోజనమేదీ ఉండదనీ, మనస్ఫూర్తిగా థాంక్యూ అనడం అలవరచుకోవాలనీ రచయిత్రి అన్నారు.
అంతా మనమంచికే అన్న విశ్వాసంతో సరియైన జీవన విధానం అవలంబిస్తూ మంచి ఆలోచనలుచేస్తూ కృతజ్ఞతాభావాన్ని అలవరచుకున్నప్పుడు మంచి ఫలితాలు చేతికందుతాయని రచయిత్రి స్పష్టపరిచారు.
ఇది విదేశీ రచన కాబట్టి ఇందులో దైవానుగ్రహం, పూర్వజన్మ సుకృతం వంటి పదాలు కనిపించవు. అయితే పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివినప్పుడు సృష్టినీ, గ్రహగతులనూ నియంత్రిస్తున్న పరమాత్మను ఉద్దేశించి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పినట్లుగా బోధపడుతుంది. కోరికలు నెరవేరకముందే, నెరవేరినట్లు విశ్వసించి, కృతజ్ఞతలు తెలుపుకోవటం వల్ల అవి తప్పకుండా నెరవేరుతాయని రచయిత్రి ప్రకటించారు.
జాలి, కరుణ, కృతజ్ఞత వంటి మంచి భావాలను అలవరచుకోవాలనీ, ఎవరినీ నిందించటం గానీ, ద్వేషించటం గానీ చేయకూడదని, అప్పుడే అన్ని రకాల సంపదలూ అప్రయత్నంగా సిద్ధిస్తాయనీ వివరించారు.
ఎవరైనా ఏదయినా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పటం సహజంగా అందరూ చేసేదే. ప్రకృతిలో మనకు తోడ్పడే వాటికి కూడా థాంక్స్ చెప్పాలంటారు రచయిత్రి. మనం తినే ఆహారానికి, తాగే నీటికి, పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞతలు తెలపాలన్నారు. (పే.90)
మనం ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్బు సరియైన సమయానికి చేతికందటం గానీ, అనుకోని పరిస్థితులలో ఎవరో కొత్త వ్యక్తి తటస్థపడి తగిన సహాయం చెయ్యటంగానీ జరిగినప్పుడు దానిని అదృష్టం అనో లేక కాకతాళీయంగా జరిగిందనో భావిస్తుంటామనీ- అయితే అటువంటి సందర్భాల వెనుక ఒక సార్వజనీనమైన సత్యం ఉంటుందని రచయిత్రి అభిప్రాయపడ్డారు. (పే.159)
‘మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చెయ్యటం కూడా ఒకటి. అయితే అందులోనుంచి సరయిన పాఠం మనం నేర్చుకోవాలి’ అని చెప్తూ దీనిని ఉదాహరణలతో ఆసక్తికరంగా 26వ అభ్యాసంలో తెలిపారు.
ఫిర్యాదులు చెయ్యటం, ప్రతికూల ఆలోచనలు చెయ్యటం వంటివి మానెయ్యటానికి కొన్ని సూత్రాలను 7వ రోజు అభ్యాసంలో ఇచ్చారు.
పుస్తకంలోని 28 అభ్యాసాలను రోజుకొకటి చొప్పున ఆచరణలో పెట్టటానికి వీలుగా రూపొందించారు.
‘ఉదయం లేస్తూనే నేలమీద కాలు మోపి భూమికి కృతజ్ఞతలు చెప్పండి’ అని చెప్తూ ఇంకా ఏయే వస్తువులకు థ్యాంక్స్ చెప్పాలో 11వ అభ్యాసంలో తెలిపారు. బాత్‌రూములో అద్దానికి, తొడుక్కునే బట్టలకు, కాళ్లకు వేసుకునే పాదరక్షలకూ థ్యాంక్స్ చెప్పాలన్నారు. ప్రతి వస్తువులోనూ చైతన్యం ఉంటుందని భగవాన్ రమణమహర్షి చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
నిత్య జీవితంలో తటస్థపడే అనేకమందికి ‘్థ్యంక్యూ’ అనాలని వివరించారు. ఈ పుస్తకంలోని విషయాలన్నీ తన అనుభవంలో చేసి చూశానని, అద్భుతమైన ఫలితాలు సాధించానని రచయిత్రి తెలిపారు. తన బంధుమిత్రులలో అనేకమందికి కూడా చక్కటి ఫలితాలు రావటం చూశాకనే ఈ పుస్తకం ప్రకటించినట్లు తెలిపారు. మీరు ఎంతోకాలం కలలుకన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అవలా సాధ్యం కావటానికి ఏయే శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్యసీమలలోనే జరుగుతాయి’’అని రచయిత్రి అన్నారు. (పేజి 3).
అనువాదం బాగుంది. పుస్తకంలోని అంశాలూ బాగున్నాయి.

 

అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’

  • -మానాపురం రాజా చంద్రశేఖర్
  • 13/12/2014
TAGS:

బహుముఖ వర్షం
యక్కలూరి వై.శ్రీరాములు
వెల: రూ.60/-
ప్రతులకు:
కౌండిన్య పబ్లిషర్స్,
15/140, పి అండ్ టి కాలనీ,
దిల్‌సుఖ్‌నగర్,
హైదరాబాద్- 500 060
ఫోన్: 9866171648

భావుకతను ప్రాణవాయువుగా చేసుకుని శ్వాసిస్తున్న యువకలాల్లో కవి యక్కలూరి వై.శ్రీరాములుగారిది ఒక ప్రత్యేకశైలి. పలు రకాల అనుభూతుల్ని వర్షంరూపంలో పలవరిస్తూ కవిత్వంగా కలవరించడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం ఆయన రాసిన ‘బహుముఖ వర్షం’లో ప్రతిఫలిస్తుంది.
‘‘అనుభూతుల మేఘాలనుండి రాలిన
చినుకుల పలుకులతో
వేనవేల వాక్యాల రంగుదారాలు పేనుతూ
ధారగా సాగుతూ/ పుడమి పుటలపై
పంచరంగుల పూల కవితల్ని
అల్లుతున్న వాన’’ అని విశే్లషించి చెప్పడంలో -్యళఆజష ఉనఔళఒఒజ్యశ బయటపడుతుంది. ఈ ముప్పేట అల్లికలో వర్షపు చిక్కదనం చినుకుల సవ్వడితో కవిత్వపు చక్కదనంగా మారిపోతుంది. భావధార రంగురంగుల పూల దారాల కవితల్ని అల్లుతుంది. కాబట్టే వచనానికీ కవిత్వానికి మధ్య దాగిన అడ్డుపొర చిరిగి చినుకుల స్పర్శకు చిత్తడిగా రూపాంతరం చెందుతుంది.
‘‘రాత్రి వచ్చిన వానలో తడుస్తూ
నా కవితలోంచి ఎగిరి వచ్చిన అక్షరాలే
చెట్టు కొమ్మపై/ వాలిన పక్షులయ్యాయి’’ అంటూ అక్షరాల్ని, పక్షులుగా మలిచిన తీరు శ్రీరాములుగారి కవితాదృష్టికి అద్దంపడుతుంది. మామూలు వానకి సాహిత్యపు వానకి తారతమ్యం కొట్టొచ్చినట్టు రూపుకట్టేది ఈ దృశ్యవీక్షణంలోనే! అనుభూతి పరాకాష్ట దశకు చేరుకున్నపుడే ఇది సాధ్యపడుతుంది.
‘వాన నడక వయ్యారం’ కవితలో-
‘‘ఎండిన మట్టిపెంకుల పెళ్ళలతో
నిండిన చెఱువుగట్టుపై నిలబడి
కన్నీరైన మా వూరికి/ నేనో మంచి నీటి సముద్రాన్నవుతాను’’ అని చెబుతుంటే… ధ్వని ప్రధానమైన సమస్యకేదో పరిష్కారమార్గాన్ని కనుక్కొని కవితా పాదాల రూపంలో పరుస్తున్నట్టు అనిపిస్తుంది. పాదరసం లాంటి చురుకైన మనసు గాలికంటే వేగంగా పరుగెత్తి మదిలోతుల్లో మిగిలిపోయిన వెనుకటి దృశ్యానికి ఇక్కడ అక్షరరూపం ఇవ్వగలిగింది. ఇదే దీనికి అదనపు ప్రయోజనం. ఈ ఒడుపును అందిపుచ్చుకునేదే అసలైన కవిత్వం. ఈ లక్షణం శ్రీరాములుగారిలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఇంకోచోట అంతర్ముఖత్వంతో కవి ఇలా ప్రవహిస్తారు.
‘స్వప్నచలన వర్షం’ శీర్షికలో…
‘‘కడలినై పైకెగరి/ మేఘమై ఊగి/ చినుకై రాలి
నదై సాగి/ మీలో నేనై/ నాలో మీరై
నాలోనేను ప్రవహించాలని వుంది’’
తాదాత్మ్యం చెందిన ఒకానొక స్థితిలో చైతన్యస్వరం కవితాస్వరమై క్షణాల మధ్య ప్రవహిస్తుంది. దీని తీవ్రతను ఒడిసిపట్టుకోవడం ఎవరితరమూ కాదు. జ్వలన స్వభావాన్ని కలిగి, చలనగీతాన్ని ఆలపించి, పురోగమన దిశలో ముందుకు దూసుకుపోతుంది. ఇది హృదయ కవిత్వానికి ప్రతిబింబం. నిలువెత్తు దృశ్యసమాహారానికి అక్షరరూపం. కాబట్టి ప్రవాహం అంతర్ముఖత్వమైంది.
మొత్తంమీద చూస్తే ఈ బహుముఖ వర్షంలో తడిసిన పద్య పాదాలు కవిత్వ చరణాలై హొయలుహొయలుగా వంకలుతిరిగి అనేక వయ్యారాలు పోయాయి. ఈ తపనను అనేక సందర్భాల్లోంచి ఏరుకుని ఒకచోట కుప్పబోశారు శ్రీరాములుగారు. అలాంటి విరుపులని మెరుపుల రూపంలో ఒక్కసారి తనివితీరా తడిమి కళ్ళతో పొదివి పట్టుకునే ప్రయత్నం చేద్దాం.
‘‘పిడికిళ్ళ నిండా మేఘాల్ని నింపుకున్న ఆకాశం/ చినుకుల విత్తనాల్ని నేలపై చల్లుతోంది’’ అంటారు. ‘‘వాన పాటకు మేఘపు పైటవేసి/ నదిలో నావగా వదులుతాను’’ అని అంటారు ఇంకోచోట. ‘‘చినుకుల జీవాక్షరాల్ని/ పలుకుల బీజాక్షరాలుగా మలిచి/ మనిషి నాలుకపై లిఖిస్తుంది’’అని చెప్పడం మరో ఎత్తుగడ. ‘‘మట్టికి విత్తనానికి/ పెళ్ళిచేసే అక్షింతలు కదా/ ఈ వాన చినుకులు’’ అంటూ వేరొక శిల్ప నిర్మాణాన్ని ప్రదర్శిస్తారు. వానని ప్రస్తావిస్తూ… ‘‘వానంటే/ మన్నూ, మిన్నూ కలిపే కరచాలనం/ వానంటే/ నిన్నూనన్నూ నిలిపే జీవజాలం’’ అంటారు కవి యక్కలూరి వై.శ్రీరాములు.
ఇలా చెప్పుకుంటూ పోతున్నపుడు… వాస్తవాన్ని వాస్తవంగా
వెలుగు సూర్యుడిగాను/ శ్రద్ధ సహనంగాను
పరిణామం చెందటమే పరమార్థం’’ అనటంలో చాలా దూరదృష్టి కనబడుతుంది. లోచూపునకు పదునుపెడుతుంది. లోపభూయిష్టమైన వ్యవస్థను ఎత్తిచూపుతుంది. అక్షర లక్షల విలువచేసే సారాన్ని, జీవన సారాంశంగా తెలియజేస్తుంది. శిల్పపరమైన ఈ ఎత్తుగడ ఒక పరిణామ దశకు కొనసాగింపుగా వెలుగునీడగా పరుచుకుంటుంది.
కాలం గోరంతల్ని కొండంతల్నిచేస్తే, సామాజిక వ్యవస్థ ఆధునిక జీవన దృశ్యాల్ని బతుకు భూతద్దంలోంచి చూపించి యాంత్రికతను బయటపెడుతుంది. అలా నలిగి, రాటుదేలి, మొనదేరిన చైతన్య శీలత్వమే కవి వీరభద్రాచారిగారు మననుండి ఆశించేది. ఆ ఆశ తీరాలంటే నవనవోనే్మషమైన, నిశ్చల నిర్మలాకృతి మయమైన వర్తమాన సంక్షుభిత జీవన వాస్తవికతను కళ్ళకు కట్టించే ప్రయత్నంచెయ్యాలి. ఆ నమ్మకం కార్యరూపం దాల్చాలంటే ఈ వాక్యాల తడుములాటలోని భావచైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఈ ‘దర్పణం’లోని అంతర్మథనాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి దిశగా ఆశావహ దృక్పథంతో అక్షరానుభవాల వెంట పరుగులుతీద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తిన ఎన్నికల్లో కమలం గుబాళింపు -వెస్ట్ బెంగాల్ లో ”మమత ” బేజారు

బీజేపీకే హస్తిన పీఠం!

– స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం
– మొత్తం 70 స్థానాల్లో 46 కైవసం
– 18 స్థానాలతో రెండో స్థానంలో ఆప్‌
– ఏబీపీ న్యూస్‌-నీల్సన్‌ సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దుమ్మురేపనుంది! తిరుగులేని మెజార్టీతో కమలనాథులు పాలనా పగ్గాలు కైవసం చేసుకోనున్నారని ఏబీపీ న్యూస్‌-నీల్సన్‌ జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అధికారం చేజిక్కించుకోవడానికి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న నేపథ్యంలో… ఈ సర్వే నిర్వహించగా… రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాల్లో బీజేపీ కనీసం 46 సీట్లను గెల్చుకుంటుందని వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బలం గణనీయంగా పడిపోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 28 సీట్లు రాగా… ఈ సారి 18 సీట్లే వస్తాయని సర్వేలో తెలిసింది. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా దిగజారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8 సీట్లు ఉండగా… ఈ సారి ఆ సంఖ్య 5కు పడిపోయింది. పార్టీల పరిస్థితి ఇలా ఉంటే… ముఖ్యమంత్రిగా ఆప్‌ నేత కేజ్రీవాల్‌ వైపే ప్రజలు మొగ్గు చూపారు.
బీజేపీ నేత హర్షవర్ధన్‌(38శాతం) కంటే కేజ్రీవాల్‌(39శాతం)కే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది. కేవలం 49 రోజులు మాత్రమే కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని నడిపినా… ఆ సమయంలో ఆయన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ సీఎం షీలా దీక్షిత్‌ చెప్పినా… ఆమెకు ప్రజల్లో ఆదరణ బాగా తక్కువ(7శాతం)గా ఉంది. ఈ సర్వేలో మొత్తం 6528 మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీ (63శాతం) ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్‌ (25), రాహుల్‌ గాంధీ (12) ఉన్నారు.
తప్పని సెగ
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌లో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మదన్‌ మిత్రను సీబీఐ అరెస్టు చేయడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ. ఈ కుంభకోణంలో ఒక మంత్రిని అరెస్టు చేయడం ఇదే ప్రధమం కావడంతో పాటు, ఆయన మమతకు అత్యంత సన్నిహితుడు కూడా. అంతకంటే ముఖ్యంగా, శారదా గ్రూప్‌ కంపెనీల్లో ఆయన పెట్టుబడిదారు.

ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం మీద దర్యాప్తు కొనసాగుతున్నంత కాలమూ రాజకీయం కూడా రంజుగా సాగుతూంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ పతాకస్థాయిలోనే ఉంటుంది. 15లక్షలమంది అమాయకుల నుంచి వేలాది కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అసలు సంగతి పక్కనబెట్టి, కేవలం ఈ కంపెనీమీదే ఎందుకు కక్షకట్టారని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీ పెద్దలతో పాటు ఇప్పటికే ఒక్కరొక్కరుగా అరెస్టయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటే, ఇప్పుడు సీబీఐ గాలి ఏకంగా మంత్రులమీదకు మళ్ళినప్పుడు ఎదురుదాడి మరింత పెంచక తప్పదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక పిరికిపంద మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనీ, అమిత్‌ షా, సీబీఐ సమావేశంలో మిత్రా అరెస్టుకు రంగం సిద్ధమైందని తృణమూల్‌ నాయకురాలు విరుచుకుపడుతున్నారు. బర్ద్వాన్‌ పేలుళ్ళకు మందుగుండు సమకూరింది ఈ కుంభకోణం సొమ్ముతోనే అంటూ అమిత్‌షా కలకత్తాలో విస్పష్టంగా ప్రకటించి దీదీని గద్దెదించందే వదలనని రణనినాదం చేయడంతో పోరు పతాకస్థాయికి చేరింది.
డబ్బు పోగొట్టుకున్న సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టే, శారదా అధినేత తన కంపెనీల్లో తెలివిగా ఇరికించిన అనేకమంది రాజకీయనాయకులు, సినీనటులు బితుకుబితుకు మంటూ బతుకుతున్నారు. అస్సాం మాజీ డీజీపీ శంకర్‌ బారువా అవమానం భరించలేక ఏకంగా తనింట్లో ఆత్మహత్యే చేసుకున్నాడు. శారదా మీడియా గ్రూప్‌కి ప్రధాన కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయల వేతనం అందుకున్న తృణమూల్‌ మాజీ నాయకుడు, మమతా బెనర్జీ కుడిభుజం కునాల్‌ ఘోష్‌ ఆత్మహత్య చేసుకుంటానని జైల్లోనే హెచ్చరికలు చేశాడు. ప్రధాన లబ్ధిదారు మమతని ఎందుకు వదిలేశారని ఆయన వాదన.

‘మా నాయకులంతా దొంగలు… చివరకు నేను కూడా దొంగనే. మిగతా వారంతా సర్వసంగ పరిత్యాగులన్నమాట’ అని ఏడాది క్రితం మమత ఎగతాళిగా మీడియాతో వ్యాఖ్యానించారు. వరుసగా జరుగుతున్న అరెస్టులు, ఆ కంపెనీకీ, ఆమె పార్టీ నాయకులకూ బలమైన ఆర్థికబంధాలున్నాయన్న ప్రతిపక్షాల విమర్శలను నిజం చేస్తున్నాయి. తన వాగ్ధాటితో ఎంతగా నెట్టుకువస్తున్నప్పటికీ, ఒకపక్క తీవ్రవాదులకు రాష్ట్రం ఆశ్రయమిస్తోందన్న విమర్శలు, మరోపక్క ఈ కుంభకోణంలో ఒక్కటొక్కటిగా బైటపడుతున్న అంశాలు మమతని ఇరకాటంలో పడవేస్తున్నమాట నిజం. శారదా అధినేత సుదీప్తసేన్‌ సీబీఐకి రాసినట్టుగా చెబుతున్న లేఖలో చాలామంది తృణమూల్‌ నాయకుల పేర్లున్నాయనీ, దీనిని ఆధారంగా తీసుకున్నా కాకున్నా అది అందించిన సమాచారంతో ఆధారాలు వెతికిపట్టుకుని మరీ మరిన్ని అరెస్టులు జరగక తప్పదని అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్న సుదీప్తసేన్‌ ఎనిమిదేళ్ళ క్రితం చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని ఆరంభించి, ఇంత తక్కువ కాలంలో వేలాది కోట్లు నొల్లుకోవడడం రాజకీయ అండ లేనిదే ఏమాత్రం సాధ్యం కాదన్నది వాస్తవం. వసూళ్ళలో మూడోవంతు ఏజెంట్లకే ఇచ్చినప్పుడు వారు వేల సంఖ్యలో తయారవకుండా ఉండరు, లక్షల సంఖ్యలో సామాన్యులను ముంచకుండానూ ఉండరు. సమకూరిన వేలాది కోట్లతో కొత్త కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. బెంగాల్‌నుంచి మరో నాలుగు రాష్ట్రాలకు కూడా సంస్థలనూ వ్యాపారాన్నీ విస్తరించాడు. చట్టాలను ఉల్లంఘించి జరుగుతున్న ఈ వ్యాపార విస్తరణని గుర్తించడానికి సెబీకి మూడేళ్ళు పట్టింది. ఇంతలోగా తన రాజకీయ పలుకుబడిని కూడా విస్తరించుకున్న సుదీప్తొ సేన్‌ మమత అనుచరుగణాన్ని తన భూరి విరాళాలతో, హోదాలతో తనవైపు తిప్పుకున్నాడు. మంత్రులను తన కంపెనీల్లో పెట్టుబడిదారులుగా మార్చడం, వారి వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటిని పరోక్షంగా కాపాడటం, మిథున్‌ చక్రవర్తి వంటి నేతలుగా ఎదిగిన నటులను భారీ పారితోషికాలతో బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకున్నాడు. పార్టీతో ఇంతగా మమేకమైపోయిన కంపెనీపై చర్యలు తీసుకోవడానికి మమత ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది? సెబీ విడతలవారీగా హెచ్చరికలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, చివరకు తన అనుమతిలేకుండా ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది. నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలపై కేసులు పెట్టమంటూ రిజర్వు బ్యాంకు చేసిన సూచనలు కూడా ఆదిలో అమలు కాలేదు. చివరకు సెబీ, రిజర్వుబ్యాంక్‌ ఒత్తిడి పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ వేయడంతో శారదా కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. శారదా కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తోనూ,సీబీఐతోనూ విచారించాలని చివరకు న్యాయస్థానాలు చెబితే తప్ప వ్యవహారం ముందుకు కదలలేదు.
ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు సాగుతూ, దాడులు జరుగుతూ, అరెస్టులు కొనసాగుతూ శారదా కుంభకోణం కథ ఇప్పటికీ ముగియలేదు. ఈ మధ్యకాలమంతా ఇది రాజకీయంగా అగ్గి రాజేయడానికి తప్ప సామాన్యుడికి స్వస్థత చేకూర్చిందేమీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది వందల కోట్ల రిలీఫ్‌ ఫండ్‌ వేలాదికోట్లు కోల్పోయిన అమాయక ప్రజలకు పంచడానికి ఏమూలకు సరిపోతుంది? వ్యవహారాన్ని ఎన్నికలతో ముడిపెట్టకుండా సత్వరమే దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు, బాధితులందరినీ ఆదుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగితే నిరాశానిస్పృహల మధ్య ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సామాన్యులను కాపాడినవారవుతారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 -129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86

129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన  ,సర్వోదయ ప్రచారకులు  .-కే నృ .వేం .అప్పారావు

విద్యా వైదుష్యం

Displaying ke nru ve 001.jpg

కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున  తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తీ చేశారు కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం లో విద్య నేర్చారు .హిందీ లో రాష్ట్ర భాష పరీక్ష పాసైనారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి సంస్కృతాంధ్రాలలో ఉభయ భాషాప్రవీణ  డిగ్రీ పొందారు .’’ఇండో యూరోపియన్ భాషా శాస్త్రం’’ పై పరిశోధన చేసి పత్రాన్ని సమర్పించి ఆంద్ర విశ్వ కళాపరిషత్ నుండి పి .ఓ.ఎల్ డిప్లమా తీసుకొన్నారు .నాగ పూర్ యూని వర్సిటీ నుండి ఏం .ఏ.డిగ్రీ సాధించారు .

విద్యా బోధన-రాజకీయ ప్రవేశం

కొవ్వూరు లో వాడ్రేపు జోగాయమ్మ సంస్కృత కళాశాల అంటే ఆంధ్రగీర్వాణ విద్యా పీఠంలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేశారు .దేశ భక్తీ మెండుగా ఉన్న అప్పారాగారు ఉద్యోగం చేస్తూనే 1941 వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్ అయి నాలుగు మాసాలు జైలు శిక్ష అనుభవించిన దేశ భక్తులు .క్విట్ ఇండియా ఉద్యమం లోనూ పాల్గొని ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించారు .గాంధీ గారి పిలుపై స్పందించి ఎన్నో నిర్మాణాత్మక కార్య క్రమాలలో పాల్గొన్నారు .ఆచార్య వినోబాభావేగారి సర్వోదయ  ప్రభావం అప్పారావు గారిపై పడింది .తెనాలి నుండి వెలువడే ‘’సామ్య యోగం ‘’అనే సర్వోదయ పక్ష పత్రికకు గౌరవ సంపాదకులుగా సేవ చేశారు .

సామాజిక సేవ –

కొవ్వూరులో రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ  గారు స్థాపించిన ‘’వీర మందిరం ‘’అనే సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనుల విద్యా సంస్కృతుల అభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి సల్పారు .వారి జీవితాలలో వెలుగులు పూయించారు .

కేశవ నృసింహీయం

1938నుండి పదేళ్ళు కొవ్వూరు సంస్కృత కాలేజి లోఅధ్యాపకులు గా  పని చేసి ,ఉపాధ్యక్షులు గా పదోన్నతి పొందారు .1948 నుండి 1974వరకు ఆంద్ర గీర్వాణ కళాశాలాధ్యక్షులుగా సేవలందిం చారు .1975లో ఆంధ్రా యూని వర్సిటిలో సంస్కృత శాఖలో రిసెర్చ్ ఫెలోగా ఉన్నారు .సంస్కృతం హిందీ భాషలలో ఎన్నో పుస్తకాలు రచించారు .అందులో ఖండకావ్యాలు ,కధలు ,విమర్శనా వ్యాసాలున్నాయి .వీరి సంస్కృత కావ్యాలు  –‘’పంచవటి ‘’,గంగా లహరి ‘’మొదలైనవి .వీటికి తెలుగు అనువాదమూ తామే చేసి ప్రచురించారు .’’బృందావనం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం హిందీ ,తెలుగు భాషలలో రచించి తన పాండిత్య ప్రకర్షను ప్రకటించుకొన్నారు .

గాంధీజీ బోధనలను ఏర్చి కూర్చి ‘’గాంధీ గీతా ‘’గాను ,వినోబా భావే సామ్య వాడ సూత్రాలకు వివరణాత్మకం గా  ‘’సంయోగ కరికాః’’ అనే గ్రంధాన్ని రాశారు .వీరి కధలు’’ ఆకాశ వాణి ‘’ద్వారా చాలా ప్రసారమయ్యాయి .వడ్ల మూడి గోపాల క్రిష్నయ్య గారు  సాంఖ్య  యోగాత్మకం గా మాత్రా చందసులో రాసిన ‘’మనిషి –మహర్షి ‘’అనే గేయ కావ్యాన్ని అదే రాగ తాళ లయలతో మాత్రా ఛందస్సులోనే సంస్కృతం లో రచించి యెనలేని కీర్తిని పొందారు .వినోబా హిందీలో రాసిన ‘’శిక్షణ విచార ధారా’’ను తెలుగులోకి తర్జుమా చేశారు .కాళిదాసుఅభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని తెలుగు నాటకం గా మలిచారు .తెలుగులో ఖండ కావ్యం గా ‘’వసుంధరా సాంత్వనం ‘’రచించారు .తన తెలుగు వ్యాసాల సంపుటిని ‘’వ్యాస పీఠం ‘’గా వెలువరించారు ఆంగ్ల భాషలో ‘’ఎస్సేస్ ఆన్ స సింథేసిస్ ‘’వ్రాసి ముద్రించారు .విజయ వాద ఆకాశవాణి ద్వారా ”అమర భారతి ”పేరిట విద్యార్ధులకు సులభం గా సంస్కృత బోధనా కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్ళుగా నిర్వహించిన ఘనత నృసింహ అప్పా రావు గారిది .”కేయూరాని విభూషితే ”’అనే శ్లోకం తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఎందరినో ప్రభావితం చేసింది . శబ్ద ప్రయోగాలు శ్లోక వివేచనా ,కవితా ప్రతిభా ,కవి చేసిన చమత్కారాలను అప్పారావు గారు  అరటి పండు వొలిచి చేతిలో పెట్టినంత సులువుగా వివరించి ఉత్సుకతను కల్గించేవారు

పురస్కార గౌరవాలు

ఆంద్ర విశ్వ విద్యాలయం ఎకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా నియమింఛి అప్పారావు గారిని గౌరవిం చింది .సంస్కృత బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా సేవ చేశారు .వీరి సాహిత్య సాంఘిక సేవా కార్య క్రమాలను పరిగణన లోకి తీసుకొని ఆంద్ర విశ్వ విద్యాలయం 1974లో ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు గౌరవం అందజేసి సత్కరించింది .అప్పారావు గారు అరవై నాలుగేళ్ళు జీవించి 1977 జనవరి పన్నెండున అకాల మరణం పొంది సాహితీ లోకానికి వెలితి మిగిల్చారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

గత వ్యాసాల్లో దేవుణ్ణి రెండు స్థాయిల్లో తెలుసుకున్నాం. ఒకటి అంతటా వ్యాపించి ఉన్న శుద్ధచైతన్యం. మరొకటి సృష్టికర్తగా మనం భావించుకుని పూజించే దేవుడు. మొదటిస్థాయిలో ఉన్నది తాత్త్విక పరమైన విషయం. రెండవ స్థాయిలోని దేవుడికి సృష్టించడం, పోషించటడం, భక్తుల్ని రక్షించడం మొదలైన గుణాలను అతనిపై మోపి మతం స్థాయిలో నిర్మించుకున్న దేవుడు. 
దేవుడికే సంబంధించిన మరొక ప్రశ్న గూర్చి తెలుసుకోవాల్సి ఉంది. మనకు ముప్పదిమూడు కోట్ల దేవుళ్లనీ, ఏ దేవుణ్ణి పూజించాలో తెలియదనీ వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. గోవును పూజించాలని చెప్పే సందర్భంలో టీవీలలో ప్రవచనాలు చెప్పేవారు కూడా గోవు కడుపులో 33 కోట్ల దేవుళ్లు ఉన్నట్టుగా పురాణాల్ని ఉటంకించి చెబుతూంటారు. అసలు ఈ 33 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇది మనకు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. కాని ఓపికగా గమనిద్దాం.
మనకు ఉపనిషత్తులు మూలగ్రంథాలు. బృహదాకరణ్యకం అనే ఉపనిషత్తు (శాకల్యబ్రాహ్మణం అనే అధ్యాయం) జనకమహారాజు సభలో జరిగిన వేదాంత చర్చను చెబుతుంది. యాజ్ఞవల్క్యుడు అనే బ్రహ్మజ్ఞానితో మిగతా పండితులందరూ దేవుడంటే ఏమిటి అనే విషయమై చర్చిస్తారు. దేవుళ్లు ఎందరు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదంలోని మాటనే ఉటంకించి దేవతలు 3,306 అంటాడు. వాళ్లందరూ ఎవరు అనే ప్రశ్నకు వారందరూ కూడా 33 రకాల దేవతల యొక్క అనేక రూపాలు అని చెబుతాడు. ఆ 33 ఎవరు అనే ప్రశ్నకు ఆరు దేవతల రూపాలు మాత్రమే అంటాడు. ఆ ఆరు ఎవరు అంటే ఇద్దరి రూపాలు మాత్రమే. అలా క్రమక్రమంగా చివరకు ఒక్క దేవుడే అనేక రూపాలలో కనిపిస్తాడని చెబుతాడు. 3,306 అనడం దేవతలు అనంత సంఖ్యలో ఉంటారు అని చెప్పడానికి మాత్రమే.
దేవతలు అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. వేదంలో ఉన్న అర్థం వేరు. దివ్‌ అనే సంస్కృత ధాతువుకి ప్రకాశించేది, చైతన్య స్వరూపమైనది అని అర్థం. ప్రకృతిలోని పృథ్వి, వాయువు, మేఘం మొదలైనవన్నీ చైతన్య స్వరూపాలే. విశ్వంలో ఉన్న జీవశక్తి మొత్తాన్ని పరిశీలిస్తే 33 దేవతలు అనేవి ముప్పై మూడు తరగతులుగా మనం చూడగల్గిన జీవశక్తులే అని తెలుసుకోగలం. అలాగే‘ కోటి ’ అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. నూరు లక్షలు అనేది ఒకానొక అర్థం మాత్రమే . ఈ సందర్భంలో కోటి అంటే తరగతి , category అని అర్థం. ప్రాణికోటి, వృక్షకోటి , జీవకోటి , శిష్యకోటి అన్నట్లుగా. ముప్పదిమూడు కోట్ల దేవతలు అనప్పుడు ముప్పది మూడు తరగతుల చైతన్య స్వరూపాలు అని అర్థం.
33 రకాలు ఏమిటి ? సృష్టిలో కొన్ని శక్తులు మనల్ని పోషిస్తాయి. కొన్ని కష్టపెడతాయి. మరికొన్ని కాలానికి సంబంధించినవి. మనల్ని పోషించి, నివసింపజేసే శక్తుల్ని వసువులు అన్నారు. ఈ కోవకు చెందినవి ఎనిమిది. విశ్వాన్ని మనం పరిశీలిస్తే ప్రాణికోటి బతకడానికి ఆధారమైన ఎనిమిది ఏవి అని గమనించగలం. అవి అగ్ని , భూమి , వాయువు, అంతరిక్షం , సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు మొదలైనవి. కేవలం ఈ ప్రకృతి శక్తులన్నీ మనిషి జీవించడానికి అవసరం. ఇవే పరిణామం చెంది మనిషి శరీరంగానూ, ప్రాణాలుగానూ ఏర్పడ్డాయి. ప్రాణులు దేహం. ఇంద్రియాలను కలిపి microcosm గా భావిస్తే విశ్వమంతా microcosm అని భావించవచ్చు. విశ్వంలో ఉన్నదే శరీరంలోనూ ఉంది. విశ్వంలో ఉన్న పై శక్తులే తాము జీవిస్తూ ప్రాణుల్ని జీవింపచేస్తాయి కావున వీటిని వసువులు అన్నారు ( వసు అంటే సంస్కృతంలో జీవించడం అని అర్థం ).
రోదనం చేయించే ( బాధపెట్టే ) శక్తుల్ని రుద్రులు అన్నారు. రుద్రులు అంటే ఇక్కడ ఈశ్వరుడు అనే అర్థం కాదు. ఏకాదశ రుద్రులు ( పదకొండు రుద్రులు ) అని మనం మామూలుగా వింటూంటాం. ఇవి మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండు. మనిషి మరణించే సందర్భంలో ఈ పదకొండూ నశిస్తాయి. మన దగ్గర వాళ్లైన బంధుమిత్రులను ఏడిపిస్తాయి. అందువల్ల ఇవి రుద్రులు అని ఈ మంత్రానికి అర్థం.
మిగతా కొన్నింటిని ఆదిత్యులు అన్నారు. ఇవి పన్నెండు. పన్నెండుగురు ఆదిత్యులు ఎవరన్న ప్రశ్నపై సంవత్సరంలో ఉన్న పన్నెండు మాసాలే ఇవి అని సమాధానం. కాలం మనందరి ఆయుర్ధాయాన్నీ, కర్మఫలాన్ని మెలమెల్లగా క్షయం చేస్తూ వెళుతూంటుంది. ఆదదానం అంటే సంస్కృతంలో స్వీకరించడం అని అర్థం. మన ఆయుర్ధాయాన్ని తీసుకుంటూ పోతున్నాయి కావున వీటిని ఆదిత్యులు అన్నారు.
వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది.
యాజ్ఞవల్క్యుడి సమాధానాలన్నీ వివిధ దృష్టి కోణాల నుంచి చెప్పిన మాటలే. విశ్వమంతా అనేక రూపాల్లో ప్రకటనమైయున్న ఒకే ఒక చైతన్యశక్తి, హిరణ్యగర్భుడు అని వ్యవహరించబడినది ఒకే దేవతాస్వరూపం అని ఉపనిషత్తు చెబుతుంది.
ఇంద్రుడు, ప్రజాపతి ఎవరు అంటే వర్షించే సమయంలో మెరపు ( వజ్రాయుధం ) ఆయుధంగా గల ఇంద్రుడు లోకరక్షణకు చిహ్నం. ప్రజాపతి అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞం అనేది వైదిక సంస్కృతిలో మనుష్యులకు, ప్రకృతిలోని శక్తులకు ఉన్న సంబంధాన్ని , పరస్పరం ఆధారపడి ఉండటాన్ని సూచిస్తుంది.
మరో దృష్టికోణం నుండి చూస్తే విశ్వమంతా అన్నము, ప్రాణము అనే రెండు శక్తులు మాత్రమే. దీన్నే ఆధునికmatter and energy అనవచ్చు. ఒకటి తినబడేది, మరొకటి తినేది. వైదికభాషలో దీన్నే అగ్ని, సోమము అన్నారు. మనం తినే అన్నమంతా సోమము. ప్రాణుల దేహాల్లో వైశ్వానరుడు అనే పేరుతో ఉన్నదే అగ్ని. మనం రోజూ భోజనం చేసేటప్పుడు ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా అంటూ ప్రాణానికి వేసే ఆహూతులే వైశ్వానరుడనే అగ్నికి వేసే ఆహుతులు . ప్రాణం యొక్క మరో రూపమే అగ్ని. ఈ విధంగా చేయడం భోజనాన్ని ఒక యజ్ఞంగా భావించడమని పెద్దలు చెబుతారు.
చివరగా ఒక్కదేవుడు ఎవరు అంటే అదే హిరణ్యగర్భుడు ( చైతన్యంలో ఏర్పడే మొదటి cosmic being ) అని యాజ్ఞవల్క్యుడంటాడు. ఆ ప్రాణశక్తి ఒక్కటే రకరకాల పేర్లతో రూపాలతో , వివిధ కర్మలతో, గుణాలతో , శక్తిభేదాలతో అనేక రూపాలు పొంది మూడురకాలుగా, 33 రకాలుగా, 3306 గా ప్రకటమవుతూంటుంది. అలాగే ముక్కోటి దేవతలు అన్నప్పుడు మూడు తరగతులుగా ప్రకటమవుతున్న జీవశక్తి అని అర్థం. ఇవే భూమికి సంబంధించిన నీరు, అగ్ని మొదలైనవి, అంతరిక్షానికి సంబంధించిన గాలి మొదలైనవి, ఆకాశానికి సంబంధించిన సూర్యుడు మొదలైనవి.
ఉపనిషత్తులో ఆ తర్వాత జరిగే సంభాషణ గమనిస్తే విశ్వంలో ఉన్న జీవశక్తి అంతా కేవలం హిరణ్యగర్భుడు మాత్రమే అని తెలియడమే కాక ఈ విశ్వమనేదే సత్యం, జ్ఞానం, అనంతం, అనబడే శుద్ధచైతన్యంలో కనిపించే ఒకానొక దృశ్యం మాత్రమే అంటూ యాజ్ఞవల్క్యుని ప్రతిపాదన నడుస్తుంది. ఇది శుద్ధవేదాంత చర్చ. ‘ ఏకం సత్‌ విప్రా : బహుధా వదన్తి ’- ‘ఉన్నది ఒకటే, పండితులు అనేక విధాలుగా వివరిస్తారు ’ అనే మాటలకు పై చర్చయే వ్యాఖ్యానం. ఆవు కడుపులో దేవుళ్లున్నట్లు చెప్పడం పురాణాల ధోరణి.
డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు
భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక విస్తారం పరంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది జనావళి అంతా మానవాళి అంతిమ శ్రేయస్సు కోసమే పరితపిస్తూ వస్తోంది. భౌతికపరమైన శ్రేయస్సును కేవలం జీవితంలోని ఓ చిన్న అంశం మాత్రంగానే ఇక్కడి ప్రజానీకం పరిగణిస్తూ వచ్చారు. ఇంతకు ముందు ఈ భారతావనిలో జన్మించిన వారికి జీవితమంటే వ్యాపారమో, భార్యో, భర్తో, కుటుంబమో కానే కాదు వారి జీవితమంతా కేవలం ముక్తి పొందడం కోసమే జీవితంలోని ప్రతి అంశమూ ముక్తి సాధనకు అనువుగా మలచబడింది. ఈ సమాజ వ్యవస్థ మొత్తం ఇదే విధంగా రూపుదిద్దబడింది.
అందువల్ల ఇక్కడ వారు సహజంగానే తాము రూపొందించిన ప్రతి పరికరాన్ని జీవితంలోని ప్రతి పరిస్థితిని మోక్ష సాధనకు అనువుగా మలచుకోవాలనుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మీ వివాహం జరిగితే ఈ వివాహ క్రతువు నడిపించే సందర్భంగా పురోహితుడు ‘ఇక్కడ మీరు మీ జీవిత సహచరుల కలయిక ముఖ్యం కాదు. ఈ క్రతువు కేవలం మీకు వివాహం జరగడానికి సంబంధించినది మాత్రమే కాదు. మీరు ఉభయులూ కలిసి ఈ వివాహబంధాన్ని మీ అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించుకోండి. మీలోని కొన్ని పరిమితులు, నిర్భందతలను అధిగమించే స్థితిలో లేరు కాబట్టి వాటిని ఈ వివాహం ద్వారా మీ అంతిమ శ్రేయోసాధనకు, పరమాత్మను చేరుకోవడానికి సాధనాలుగా మలచుకోండి’ అని చెబుతాడు. ప్రతీదీ దేశంలో ఇలాగే ఉంటుంది.
ఇదే ఉద్దేశ్యంతో మరెన్నో శక్తివంతమైన సాధనాలు ఈ సంస్కృతిలో సృజించబడ్డాయి. ఇలానే జ్యోతిర్లింగాలు కూడా చాలా శక్తివంతమైన సాధనాలుగా సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ కూడ సజీవంగా , చాలా శక్తివంతంగా విరాజిల్లుతున్నాయి. అవి ఎంతో ప్రయోజనకరమైనవి. ఒక వ్యక్తి తనంతట తాను ధ్యానంలో నిమగ్నుడవగలిగితే అప్పుడు వెలుపలి సాయం అనేది అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ, ఆ స్థితికి ఇంకా చేరని వారికి మాత్రం ఈ సాధకాలు చాలా అవసరమవుతాయి. ఇటువంటి శక్తి రూపాల సన్నిధిలో చాలా శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది.
జ్యోతిర్లింగాలు పరమ శక్తివంతమైనవి. ఎందుకంటే వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్టీకరించి నెలకొల్పారు. ఈ ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్న కేంద్ర బిందువుల్లో వాటిని ప్రతిష్టించారు. ఈ ఉనికిలో ఉన్న కొన్ని శక్తులకు అనుగుణంగా ఈ కేంద్రాలున్నాయి. చాలాకాలం కిందట ఎంతో మహత్తరమైన జ్ఞానం గల మహానుభావులు గ్రహ, నక్షత్ర గమనాల ఆధారంగా ఈ ప్రాంతాలను గణించి ఈ కేంద్రబిందువులను నిర్ధారణ చేశారు. మానవ శక్తియుక్తులనే కాకుండా , ప్రాకృతిక శక్తులను కూడా ప్రాంతాల్లోనే ఏర్పరచారు.
మూర్తులను శక్తివంతం చేసే శాస్త్రం నిర్దేశించిన నియమ నిబంధనలు పద్ధతుల ప్రకారం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రతిష్టాపన జరిగింది. చాలా అసాధారణ అద్భుతమైన రీతిలో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయడానికి జీవ శక్తులను వినియోగించే శాస్త్రమిది. మట్టిని ఆహారంగా మారుస్తున్న ప్రక్రియను వ్యవసాయం అంటాం. ఆహారాన్ని మాసం , ఎముకలుగా రూపాంతరం చెందిస్తున్న విధానాన్ని జీర్ణప్రక్రియ అంటాం. ఈ మాంసాన్ని అంటే ఈ మాంసాయుతమైన శరీరాన్ని మట్టిగా మార్చే ప్రక్రియను దహనం అంటాం. అలాగే శరీరాన్ని , ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియను ప్రతిష్టీకరించడం లేదా ప్రతిష్టాపన అంటాం. ఇది పరమాద్భుతమైన శాస్త్రం దురదృష్టవశాత్తూ , ఇప్పుడు ప్రతిష్టాపన అంటే అసలేమిటో మనం మరచిపోయాం. అందువల్ల ఈ పేరుతో అర్థంపర్థంలేని పరిహాసాత్మకమైన కార్యకలాపాలు ఎన్నో సాగిపోతున్నాయి. దీనితో జనం దీనిని వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
నేను సాధారణంగా గుడులకు వెళ్లను కానీ ఉజ్జయిని లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. ఈ దేవాలయాన్ని అనేకమార్లు ధ్వంసం చేశారు. మనదేశం మీద దండెత్తిన వాళ్లు ఈ దేవాలయాన్ని కూలగొట్టారు. ఈ కారణంగా ఇప్పటికీ రెండు, మూడు మార్లు తిరిగి నిర్మించి పున:ప్రతిష్ట చేయటం జరిగింది. ఏదేమైనా ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్లి ఆ జ్యోతిర్లింగ సన్నిధిలో కూర్చున్నారంటే … వేలాది సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆ చిన్న స్వరూపం . ఆ చిన్న రాతిముక్క మిమ్మల్ని ఒక అద్భుతమైన అనుభూతిలో ముంచేస్తుంది. ఆ మహాశక్తి స్వరూపం కేవలం నిన్ననే ప్రతిష్టింపబడిన దానివలె మహాశక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంది.

జీవితంలో వీటి మహత్తును పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వారికి జ్యోతిర్లింగాలు మహాశక్తివంతమైన సాధనాలు మీ శారీరక, మానసిక వ్యవస్థను పరిపూర్ణంగా పున:వ్యవస్థీకరించుకోగలిగే నేర్పు మీకు తెలిస్తే , ఈ జ్యోతిర్లింగాల సన్నిధిలో మీ వ్యవస్థను సమూలంగా మార్చుకోగలగుతారు. ఈ భూమిమీద ప్రతిష్టించిన ప్రతి లింగానికీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సాధన ప్రక్రియ అనేది మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది. అందువల్ల దేవాలయాలు ఇప్పుడు చాలా కాలం కిందట చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన స్మారక చిహ్నాలుగా మిగిలిపోయాయి. జ్యోతిర్లింగాల్లో కొన్ని సజీవంగా లేవు. కాని మిగిలిన వాటిలో చాలా లింగాలు ఇప్పటికీ మహాశక్తి వంతమైన సాధకాలే.
– సద్గురు
 
 
 
కుండలినీ చక్రాలు – ధ్యానం
వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇద , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూలశరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం .
1. తలనుంచి కటి భాగందాకా వెళ్లే ఈ చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్‌ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అనే బిందువును ప్రతిబింబిస్తుంది. అంతే కాదు స్వీయ జ్ఞానమయమైన ఒక దివ్యానందపు అనుభూతిని, ఒక మహోన్నతమైన ఆలోచనను, విఽశ్వైక్య భావనను కలిగిస్తుంది.
2. ఆజ్ఞ చక్రం
ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండే మూడవ నేత్రం. దీన్ని భృకుటి చక్రంగానూ, మూడో చక్రంగానూ పరిగణిస్తారు. ఇది బాహ్యనేత్రంతోనూ, మనస్సాక్షి ఆధారంగానూ చూసే ప్రక్రియకు సంబంధించినది. ఇది మన మనో విజ్ఞాన అంశాల్ని, ఆర్కీటైపల్‌ స్థాయి అవగాహనా ద్వారాలు తెరిపిస్తుంది. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతాం. ఆజ్ఞచక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. విషయాల్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతాం.
3. విశుద్ధ చక్ర
ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఇది భావ వ్యక్తీకరణ, సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించినది. ఇక్కడ ప్రపంచాన్ని ప్రతీకాత్మకంగా, అంటే శబ్ద, భాష ప్రకంపాల ద్వారా తెలుసుకోగలుగుతాం. సృజనాత్మక ఐక్య భావనను, స్వీయ వ్యక్తీకరణ శక్తినీ ఇది పెంచుతుంది.
4 అనాహత చక్ర
ఈ చక్రాన్ని హృదయ చక్రం అని కూడా పిలుస్తారు. ఇది ఏడు చక్రాలకు మధ్యన ఉంటుంది. ఇది ప్రేమ సంబంధితమైనది. ఇది శరీరానికీ -మనసుకూ, పురుషుడికీ- సీ్త్రకీ , అస్తిత్వానికీ- నీడకు, అహానికీ-ఏకత్వానికీ మధ్యనుండే వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. ఇది గాఢమైన ప్రేమానుభూతికీ, అంకిత భావాన్నీ, లోతైన ఒక ప్రశాంత స్పృహనూ, అందులో మమేకమయ్యే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్నీ, ఽధైర్యాన్నీ నింపుతుంది. విషయాల్ని సహజంగా, యధాతథంగా స్వీకరించే మానసిక దిటవునూ పెంచుతుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమాజంలో మమేకమయ్యే శక్తిని కూడా కలిగిస్తుంది.
5 మణిపూర చక్ర
దీన్ని శక్తి చక్ర అని కూడా పిలుస్తారు. ఇది మన అంతర్గత శక్తిని నడిపిస్తుంది. మన శరీర వ్యవస్థనూ, జీవక్రియల్ని సైతం నియంత్రిస్తుంది. ఇది శరీరానికి అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ప్రభావవంతంగా ఉండేలా, తక్షణమే స్పందించేలా చేస్తుంది. ఎవరి మీదా ఆధిపత్యం లేని నైజాన్ని పెంపొందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, శ్రమ, విశ్రాంతుల తోడ్పాటుతో శరీరంలోని ప్రాణశక్తిని నిలబెడుతుంది. అహాన్ని గుర్తించడంతో పాటు, స్వీయ విశ్లేషణకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది.
7. స్వాదిష్టాన చక్ర
ఇది. పొట్ట, కటి భాగం, లైంగిక అవయవాలకు సంబంధించినది. భావోద్వేగాలకు, లైంగిక విషయాలకు సంబంధించినది. ఇది అనుభూతులు, కోరికలు స్పందనలు, కదలికల ద్వారా ఇతరులతో సంబంధం పెంచుకుంటుంది. ఇది కాంతినీ, అనుభూతుల్లో గాఢతనూ, లైంగిక సంతృప్తినీ, మార్పును స్వీకరించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. స్వాదిష్టాన చక్రం మేధోపరమైన స్వచ్ఛతను, జ్ఞాపకశక్తినీ, సక్రమమైన, స్వచ్ఛమైన ఆలోచనల్నీ కలిగిస్తుంది. భావోద్వేగాలతో మమేకమై, గొప్ప ఆనందానికి పాత్రమయ్యేలా చేస్తుంది.
వెన్నెముక మొదట్లోనే ఈ చక్రం ఉంటుంది. ఇది భూమికి అనుబంధమైనది. ఇది మన మనుగడ గురించిన స్పృహను కలిగిస్తుంది. పునాది లాంటిది. ఇది ఆరోగ్యాన్నీ, సంపన్నతను, బధ్రతను, చలాకీతనాన్నీ కలిగిస్తుంది. నిర్భయత్వాన్నీ, సురక్షిత భావాన్నీ, భౌతిక ఐక్య భావనను, స్వీయ రక్షణా శక్తినీ కలిగిస్తుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిన్నయ సూరి 208 జనందినోత్సవం -తెలుగు భాషా వికాస సదస్సు -కేల్ రావు భవన్ -20-12-14-శనివారం మధ్యాహ్నం 3గం లకు

chinnaya suri1 001 chinnaya suri2 001చిన్నయ సూరి 208 జనందినోత్సవం -తెలుగు భాషా వికాస సదస్సు -కేల్ రావు భవన్ -20-12-14-శనివారం మధ్యాహ్నం 3గం లకు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మరో గిన్నీస్ కు రంగం సిద్దం -కూచి భొట్ల ఆనంద్

మరో గిన్నీస్ కు రంగం సిద్దం

ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర – ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజులు హైదరాబాద్‌లో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. 8500 మంది నృత్యకళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మరోసారి గిన్నిస్‌ రికార్డు సాధించనుంది. ఈ సమ్మేళనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి సిలికానాంధ్ర నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్‌ అనేక విశేషాలు తెలియజేశారు.

‘జగమంత తెలుగుకుటుంబం’ అనేది సిలికానాంధ్ర నినాదం. ఇప్పటి దాకా మేము మూడు సార్లు నృత్య సమ్మేళనాలు నిర్వహించాం. ఈ సారి హైదరాబాద్‌లో ‘నవతరం-నాట్యతరంగం’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది సమ్మేళనానికి బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఇందులో పాల్గొనేందుకు ఇప్పటి దాకా 8 వేల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 18 దేశాలకు చెందిన నృత్య కళాకారులు ఉన్నారు. మన దేశం నలుమూలల నుండి దాదాపుగా రెండువేల ఐదువందల మంది హాజరవబోతున్నారు. వీరికి వసతి, ఆతిథ్య ఏర్పాట్లకు సంబంధించిన కూపన్ల పంపిణీ పూర్తయ్యింది. ‘మహాబృంద’ నాట్యంగా పిలిచే ఈ ప్రదర్శనలో ఇప్పటివారికి చాలా మందికి తెలియని ‘రామాయణ శబ్దం’, ‘బాలగోపాలతరంగం’ అంశాలతో కూచిపూడి మువ్వల రవళి జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు 600 మంది గురువులు, వారి శిష్యబృందం కలిసి కూచిపూడి గ్రామకుల దేవతలైన బాలాత్రిపురసుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో కళారూప శోభాయాత్ర నిర్వహిస్తారు. దీనితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంప్రదాయబద్ధమైన సూత్రధారుల వేషధారణతో కళాకారుల ఊరేగింపు చేశాక పూర్వరంగం – రంగపూజ చేసి ఽధ్వజావిష్కరణ చేస్తారు. ఆ తరువాతి రెండురోజులు 22 నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇవే కాకుండా అభినయపూర్వక ప్రసంగాలు, ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మంచి మనసులు తోడై…
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడమంటే ఖర్చుతో కూడుకున్నదే. అయితే అమెరికా నుంచి ఇక్కడివరకు మంచి పనికి మేమున్నాం అనేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. వారి మంచి మనసుల వల్లనే కార్యక్రమ ఏర్పాటు సాధ్యపడుతోంది. ఈ ఏడాది సమ్మేళనానికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. క్రీడల శాఖ వారు గచ్చిబౌలి స్టేడియాన్ని ఉచితంగా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యాభై లక్షల రూపాయల నిధులిచ్చింది. మిగతాది కళాభిమానుల నుండి సమకూరుతుంది. సమ్మేళనంలో పాల్గొనే వారు 800 రూపాయలు రుసుము చెల్లించాలి.. వాస్తవానికి ఈ కార్యక్రమంలో పాల్గ్గొనే వారికి ఆతిధ్యం ఇవ్వాలంటే నాలుగువేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందుకే రుసుము వసూలు చేస్తున్నాం.
తొలిసారి అమెరికాలో..
కూచిపూడి అంతర్జాతీయ సమ్మేళనాన్ని మొదటిసారి అమెరికాలోని కూపర్టినో నగరంలో నిర్వహించాం. అప్పుడు నాట్యంలో అగ్రశ్రేణి కళాకారుల్ని, మహామహులైన గురువుల్ని పేరుపేరునా ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో యామిని కృష్ణమూర్తి, రాజారెడ్డి వంటి ప్రముఖులు ప్రేక్షకులను అలరించారు. 335 మంది బృందంతో చేసిన నాట్య ప్రదర్శన మొట్టమొదటి ప్రపంచరికార్డు సృష్టించింది. ఆ తరువాత 2010 డిసెంబర్‌లో హైదరాబాదులో నాలుగువేల మంది ప్రతినిధులతో 2850 మంది నర్తకులు చేసిన ‘థిల్లాన’ కూడా రికార్డులకి ఎక్కింది. 2012లో అంతకన్నామిన్నగా 6500 మంది ప్రతినిధులు, 5700 మంది నర్తకులతో ‘దశావతారం శబ్దం’ రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మన రికార్డుల్ని మనమే తిరగ రాసేలా చేసింది.
 జిఎల్‌ఎన్‌ మూర్తి, హైదరాబాద్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెల మీద నడిచిన ఇంద్ర ధనుస్సు -భారత రత్న, ఏం ఎస్-లకుమా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివాలయం పై తాజ్ మహల్ నిర్మాణం !!!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శాంతికాముక సత్యార్ది మలాల ”నోబుల్ సందేశం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85

128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

విద్యోపాసన

పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు .తాతగారైన వేదాధ్యన సంపన్నులు ,నిత్య పార్ధివ లింగ పూజా దురంధరులు ,శ్రీ విద్యో పాసకులైన సుబ్బావదానుల వారు.చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతులు వీరు .తల్లిగారు అన్నీ అయి పెంచారు .అల్లారు ముద్దుగా పెరిగారు .ఎనిమిదవ ఏట శాస్త్రిగారికి ఉపనయనం చేశారు .

పదహారో ఏడు వచ్చేదాకా నైయాకరణ చూడామణి అయిన మందా చెన్నయ్య శాస్త్రి గారి దగ్గర శిష్యులై సంస్కృత కావ్య నాటక ,న్యాయ వేదాంత ప్రకరణాలను క్షుణ్ణం గా అధ్యాయం చేసి కరతలా మలకం చేసుకొన్నారు .దురవ గాహన మైన  శాస్త్ర విషయాలను అతి సునాయాసం గా అర్ధం చేసుకొని వంట బట్టించు కొన్నారు .తన దిషణా సంపదత తో గురువు గారినే ముచ్చట పడేట్లు చేశారు .

విజయ నగరం రాజా వారి సంస్కృత కళాశాలలో న్యాయ శాస్త్ర అధ్యాపకులైన గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి గారు అనే అపర గౌతముల వద్ద పదేళ్ళు ,పిఠాపుర సంస్థాన వైయాయిక సార్వ భౌములని పేరొందిన శ్రీ పాద లక్షీనరసింహ శాస్త్రి గారి  అంతేవాసిగా రెండేళ్ళు మొత్తం పన్నెండేళ్ళు న్యాయ శాస్త్రాన్ని మధించారు .

విద్యా బోధన

తన అసాధారణ వైదుష్యం తో పిఠాపురం ,ఉర్లాం మున్నగు సంస్థానాలను సందర్శించి పండితులను ప్రభువులను మెప్పించి గొప్ప సన్మానాలు అందుకొన్నారు .అన్ని శాస్త్ర పరీక్షలలో సర్వోత్తములుగా ఉంటూ అందరికీ చేరువయ్యారు ఆస్థానం లో న్యాయ వేదాన్తాలను అతి సులభ విధానం లో బోధిస్తూ ఎందరో శిష్యులకు  విద్య నేర్పి తీర్చి దిద్దారు .దీనితో వీరి కీర్తి చంద్రిక దశ దిశలా వ్యాపించింది .

1902లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకులుగా పదవీ బాధ్యతలు చే బట్టారు . 1913లో  .గురువు సంగమేశ్వర శాస్త్రి గారు పదవీ విరమణ చేసిన పిమ్మట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారుప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా నియమింప బడి సేవలందించారు .

వైదుష్య ప్రదర్శన –బిరుద సత్కారాలు

 

1924 లో రాజా గారి ఆజ్ఞ తో రాజస్థాన్ లోని జయ పుర సంస్థానాన్ని దర్శించారు .అక్కడ  మహా విద్వత్ సభలో తన ప్రతిభా సామర్ధ్యాలను వాదనా పటిమను ,ధీశక్తిని ప్రదర్శించి మెప్పించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదాన్ని సత్కారాన్ని అందుకొన్నారు . విజయ వాడలోని ‘’త్రిలింగ విద్యా పీఠం’’వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు శాస్త్రిగారిని ఆహ్వానించి శాస్త్ర ప్రదర్శన చేయించి ‘’న్యాయ స్థాపక ‘’గౌరవ బిరుదు ప్రదానం చేసి ఘనం గా సత్కరించారు .ఈ గౌరవాన్ని పొందిన ఆంధ్రులలో వీరు అయిదవ వారు .అధీతి బోధనా చరణ తో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .అ నాటి బ్రిటిష్ ప్రాభుత్వం శాస్త్రి గారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ను  అందజేసి తగిన గౌరవం కలిగించిది .న్యాయ వేదాన్తాలనే కాకుండా మంత్రం ,జ్యోతిష శాస్త్రాలను  అధ్యయనం చేసి అనుస్టించిన నైస్ష్టికులు శాస్త్రి గారు .వీటిని నిరంతరం శిష్యులకు బోధించేవారు .

రచనా పాటవం

ఒక పట్టాన లొంగని తల పండిన మహా విద్వాంసులకే కొరుకుడు పడని ఉదయ నాచార్యుడు రాసిన ‘’కుసుమాంజలి ‘’ని శాస్త్రి గారు అతి సులువుగా ,సరళం గా ఆంధ్రీకరించారు .గదాధర భట్టా చార్యుని ‘’హేత్వభాస సామాన్య నిరుక్తి ;,’’నవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనబడే నవ్య న్యాయ శాస్త్ర మహా గ్రంధాలకు ‘’లలిత’’అనే సరళ వివరణలు రాసి అందరికి అందుబాటులోకి తెచ్చారు .దీనివల్ల శాస్త్రిగారి అసాధారణ న్యాయ శాస్త్ర పాండిత్యం అవగాహన ,వ్యుత్పత్తి ,అనుసరణ లు తెలుస్తున్నాయి .ఇదేగాక మాధవాచార్యుల ‘’సర్వ దర్శన సంగ్రహం ‘’లోని ఎన్నో భాగాలను అనువదించారు .దురదృష్ట వశాత్తు ఈ గ్రంధం  ముద్రణకు నోచుకోలేదు .డెబ్భై రెండేళ్ళు జీవించిన ఈ న్యాయ శాస్త్ర కోవిదులు ,న్యాయ భూషణులు పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1949లో నారాయణ  సన్నిధానం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85-

127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

సంస్కృతమే అన్నీ

కప్పగంతుల  లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా  వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు

ఉద్యోగం – ఎదుగుదల

.వనపర్తి సంస్థానం లో ఆస్థాన విద్వాంసులుగా గౌరవ స్థానం అలంకరించారు .అక్కడే హైస్కూల్ లో  భాషా పండితులుగా  పని చేశారు .తర్వాత హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో అసిస్టంట్ డైరెక్టర్ గా చేరారు .పిమ్మట ఆంద్ర ప్రదేశ్ విద్యాశాఖ లో డిప్యూటీ  డైరెక్టర్ అయ్యారు .ఈ పదవిలో ఉండగానే ప్రాచ్య కళాశాలల ఉపాయాధ్యాయుల జీతాలను మిగిలిన డిగ్రీ కళాశాలల ఉపాధ్యాయుల జీతాలతో సమానం గా ఉండేట్లు చేసి భాషా పండితులకు గౌరవ ప్రదమైన జీతాలు వచ్చేట్లు చేసి అందరి అభిమానానికి పాత్రులయ్యారు .

సంస్కృత భాష స్పెషల్ ఆఫీసర్ గా కొనసాగి దేశమంతా తిరిగి సంస్కృత భాషా వ్యాప్తికి ఎన లేని కృషి చేశారు .మళ్ళీ సమాచార శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయి ,’’హైదరాబాద్ టు డే’’,’’ఆంద్ర ప్రదేశ్ ‘’మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు .

లక్ష్మణ శాస్త్రీయం

మాదిరాజు విశ్వనాధ రావు అనే తోటి కవితో కలిసి ‘’బిల్హణుని విక్రమామ్క దేవ చరిత్ర కావ్యాన్నీ ‘’,కర్ణ సుందరి ‘’నాటకాలను ప్రబంధ శైలిలో ఆంధ్రీకరించారు ‘’తెలుగు –సంస్కృత కోశం ‘’,’’సంస్కృత వాచకాలు ‘’రచించారు .విజ్ఞాన సర్వస్వం సంగ్రహాంద్ర విజ్ఞాన కోశం ‘’లలోను, వివిధ పత్రికలలోనూ  లెక్కకు మించి వ్యాసాలూ రాశారు .శాస్త్రిగారు మహా వక్త .తెలుగు సంస్కృతం ,కన్నడ ,తమిళ ,మరాఠీ ,హిందీ ఉర్దూ భాషలలో ఉద్దండ పండితులు. ఆ భాషలలో అనర్గళం గా ప్రసంగించే  నేర్పున్న వారు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను తెలుగులోకి అనువాదం చేశారు .భారత ప్రధమ రాష్ట్ర పతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ సందర్శించి నప్పుడు లకష్మ శాస్త్రి గారు కావ్య ప్రబంధ ధోరణిలో స్వాగత శ్లోకాలు రాసి ఆహ్వానించారు –ఆ శోభ చూద్దాం

‘’నిష్ణాతః ప్రాచ్య విద్యా స్వనితర ధిషణే-దుర్గమే రాజ్య తంత్రే –విద్వాన్ పాశ్చాత్యతంత్రే ష్వఖిల భారత భూ –వాసినాంభాగ్య సీమా –రాజ్యానాం పాలనే చ ప్రభురతి నిపుణో-ప్యప్రద్రుష్యోభిగ్యః –జీయత్ రాజేంద్ర విద్వా నతి శత శరదం –భారతం సేవ మానః ‘’

సత్కార పురస్కార బిరుదాoకితాలు

కాశీ  సంస్కృత  విశ్వ విద్యాలయం ,ఆంధ్రా ,ఉస్మానియా విశ్వ విద్యాలయాల బోర్డ్ ఆఫ్  స్టడీ స్ లో సభ్యులై సేవలందించారు .’’సురభారతి ‘’వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపక సభ్యులు ..తిరుపతి లో జరిగిన విద్వత్ సభలో శాస్త్రి గారి కి ‘’ఆంద్ర బిల్హణ’’బిరుద ప్రదానం చేసి గౌరవించారు .ఉత్తర ప్రదేశ్ లోని మదన మోహన మాలవ్యా విద్యా సంస్థాన్ ‘’సుధీంద్ర మౌళి ‘’తో గౌరవించి సన్మానించింది .’’బ్రహ్మ భూషణ ‘’అన్నది వీరి సాహితీ పాండితికి లభించింది .కాశీ విద్వత్ పరిషత్తు శాస్త్రి గారిని ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం తో సన్మానించింది .తిరువాన్కూర్ ,గ్వాలియర్ జగద్గురు శంకరాచార్యుల వారి చేత  కప్పగంతుల వారు ఘనం గా సత్కరింప బడ్డారు .విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి జలగం వెంగల రావు గారి నిర్వహణలో జరిగిన ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలో లక్ష్మణ శాస్త్రి గారు ప్రత్యేకం గా సన్మానం అందుకొన్నారు .దేశం లోని ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ శాస్త్రి గారిని ఆహ్వానించి వారి ఉపన్యాస లహరిలో తడిసి విశేష సత్కార ,పురస్కారాలు అందజేశాయి ..

వీలైనప్పుడల్లా వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడి స్థానిక భాషలైన హిందీ మరాఠీ కన్నడం తమిళం  మొదలగు భాషలలో ప్రసంగిం ఛి వారిని ముగ్ధులను చేసేవారు .వీరి ఆధ్వర్యం లో ఏర్పడిన ‘సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం ‘’కు అధ్యక్షులుగా వ్యవహరించారు .వీరి పాండిత్యాన్ని మెచ్చుకొన్న పండిత ద్వివేదీ శాస్త్రి సంస్కృతం లో వీరిని

‘’మూర్తిర్మత్త గజేంద్ర దర్ప దళినీ వాణీ వినోద ప్రియా –వ్యాఖ్యాలేఖ కవిత్వ కౌశల కళా పారంగతా ,శేముషీ

శక్తి స్సంస్కృత భాషణే ప్యనుపమా విద్వజ్జనే స్వాదరః –శ్రీ మల్లక్ష్మణ శాస్త్రిణాంగుణ గణాః కేషాంన తోషా వహాః’’అని శ్లాఘించారు .

శాస్త్రి గారు తుది శ్వాస వదిలే వరకు ‘’కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’’’ఎమిరిటస్ ప్రొఫెసర్ ‘’గా (సమ్మాన్య  ప్రాచ్యాచార్యులు )గా ఉన్నారు .శాస్త్రిగారు అందరికి మిత్రులే .తర తమ భేదం లేనివారు. అందరూ శాస్త్రి గారికి అత్యంత ఆత్మీయులే మిత్ర బృందం లోని వారే .అదీ వారి ప్రత్యేకత .డెబ్భై సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి 10-1-1981 తేదీన ఈ సంస్కృత సాహితీ  వాజ్మయ శిఖరం నేల వ్రాలింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84

125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు

ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు నేర్చారు .శ్రీ పాద రామ శాస్త్రి గారి దగ్గర తర్క ప్రకరణాలు ,నిరుక్తి ,పక్షత ,వ్యదికరణం ,సిద్ధాంత లక్షణం ,అవచ్చేదకత్వ నిరుక్తి ,పక్షత ,సామాన్య నిరుక్తి అనే తర్క గ్రందాలనన్నిటినీ అవలోడనం చేసు కొన్నారు .కాశీ వెళ్లి కర్నాటక సీతా రామ శాస్త్రిగారి వద్ద ‘’నవ్యభిచారం ‘’,’’సత్ ప్రతి పక్షం ‘’’’,అవయవం ‘’అనే మహోద్గంద్రాలు పఠించారు .వంగ దేశీయులైన వజ్ర కుమార విద్యా రత్న భట్టాచార్యుల వారి నుండి ‘’వ్యుత్పత్తి వాదం ,శక్తి వాదం ‘’,ప్రామాణ్య వాదం ‘’,’’విధి వాదం ,’’ముక్తి వాదం ‘’అనే అపూర్వ గ్రంధాలన్నీ నేర్చుకొన్నారు .అంటే తర్క శాస్త్రాన్ని ఆమూలాగ్రం మదించి ,శోధించి అంతు చూసిన తర్క మార్తాండులన్న మాట .కలకత్తా లో ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ‘’తర్క తీర్ధ ‘’బిరుదం తో పాటు ,అయిదు వందల రూపాయల ‘’నవ రత్న రూప ‘’బహుమతిని పొందారు .

వేదాంత ధిషణ

ఇంతటితో సంతృప్తి చెందకుండా రామ మూర్తి గారు కాశీ లో ద్రావిడ సుబ్రహ్మణ్య దీక్షితులు గారి దగ్గర వేదాంత సూత్ర ,శంకర భాష్యం లో చతుస్సూత్రి వరకు అద్యయనం చేశారు గీతా భాష్యాన్ని ,సూత్ర భాష్యాన్ని ,అద్వైత సిద్ధిని ,గౌడ బ్రహ్మానందాన్ని స్వీయ ప్రతిభ తో స్వయం గా అధ్యయనం చేసి నేర్చుకొని అసమాన  ధిషణతో అగ్రగామి అయ్యారు .

బోధనా సామర్ధ్యం

కర్నాటక దేశం లో చిత్రాపూర్ లో ఉన్న శంకర పీఠ స్వామికి వేదాంతాన్ని బోధించారు విద్యార్ధులకు తర్కాన్ని నేర్పారు .అక్కడే మూడేళ్ళు ఉండి తర్వాత దర్భంగా ,మండిమొదలైన సంస్థానాలను దర్శించి పండిత ప్రకాండులను  శాస్త్ర చర్చలో మెప్పించి విశేష గౌరవాదరణలు పొందారు .ఉర్లాం సంస్థానం లో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .మూడేళ్ళు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ,పన్నెండేళ్ళు రాజ మండ్రి లో ,రెండేళ్ళు విజయనగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉంది వందలాది విద్యార్ధులకు తర్కాన్ని బోధించి తీర్చిదిద్దారు .

అక్కడి నుండి తిరుపతి చేరి సంస్కృత కళాశాలకు ప్రధానాచార్యులుగా అమూల్యమైన సేవలు కొద్దికాలమే అందజేశారు ..తర్వాత దక్షిణ దేశ సంచారం చేస్తూ పండితులతో శాస్త్రార్ధ చర్చలు చేస్తూ చివరికి ‘’లుకులాం ‘’అగ్రహారం చేరుకొన్నారు .అక్కడ వితరణ శీలురైన బ్రాహ్మణులు బూర్లె శ్రీరాములు గారు ..శాస్త్రిగారికి భూమిని, వసతి గృహాన్ని ఏర్పాటు చేసి గౌరవించారు .అక్కడే సుఖ జీవనం సాగిస్తూ విద్యార్ధులకు విద్యా బోధన చేశారు .

సన్యాసాశ్రమ స్వీకారం –ముక్తి

రామ మూర్తి శాస్త్రి గారు ‘’శక్తి వాదం ‘’పై ఒక వ్యాఖ్యాన గ్రంధం రచించారు .ఆదినుండి శ్రీ విద్యోపాసకులైన వీరు జీవితాంతం కొనసాగించారు .జీవిత చరమాంకం లో రాజ మండ్రి చేరి గోదావరీ నది తీరం లో ఆవాసం ఏర్పరచుకొని సన్యాసాశ్రమం స్వీకరించారు .యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమె జీవించినా జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొని ఎదురు లేని తర్క పండితునిగా రాణించి న రామ మూర్తి శాస్త్రి గారు 1920లో ముక్తి పొందారు .

 

126-రావు బహదూర్ –కిడాంబి రామానుజాచార్యులు

జిహ్వాగ్రాన సరస్వతీ తాండవం

సంస్కృతం లో ఆశు ధార గా కవిత్వం చెప్పి ,ఏక సందాగ్రాహిగా గుర్తింపు పొంది ,న్యాయ శాస్త్ర మధనం చేసి అసాధారణ ప్రజ్ఞా వంతులుగా పేరు పొందిన కిదాంబి రామ చంద్రా చార్యులవారు పశ్చిమ గోదావరి జిల్లా పెంట పాడులో 1853లో జన్మించారు .స్వగ్రామం లోనే సంస్కృతాన్ని అధ్యయనం చేశారు .కావ్య ,నాటక ,అలంకార వ్యాకరణాలలో ఇరవై ఏళ్ళ వయసుకే అపార పాండిత్యాన్ని సాధించారు .వీరి సునిశిత మేధాశక్తి అందరినీ ఆకర్షించింది .

‘’నానార్ధ రత్నమాల ,’’మేదిని ‘’వంటి నిఘంటువులు వీరికి కంఠోపాఠంగా ఉండి జిహ్వాగ్రాన తాండవ మాడుతూ ఉండేవి .వీరి ఏక సందాగ్రాహనం వల్లనే ఇది సుసాధ్యమైంది .పదహారు ,పదిహేడేళ్ళ వయసులోనే అష్టావధానాలు చేసిన చిచ్చర పిడుగు ఆచార్యుల వారు .సంస్కృతం, తెలుగులలో కవితాదారను మహా ఆశువుగా చెప్పి మెప్పించే నేర్పు వీరిది .అనేక రాజాస్థానాలు సందర్శించి ప్రభు సత్కారాలు అందుకొన్న కవీశ్వరుడు .

మహా విద్యా వేత్త

గ్రంధ రచన కంటే విద్యా వేత్తగా విశేషం గా గుర్తింపు పొందారు . వీరి రచనలో ముఖ్యమైనవి ‘’హేస్టింగ్ చరిత్ర ‘’,మత విద్య’’వంటి తెలుగు ఇంగ్లీష్ గ్రందాలున్నాయి .1873లో విజయ నగరం చేరి ఆస్థాన ప్రదానామాత్యులు పెను మత్స జగన్నాధ రాజును ,ప్రభువు ఆనంద గజపతి మహా రాజును దర్శించారు .తన అసాధారణ వైదుష్యం తో వీరిద్దరి మెప్పూ పొంది ,ఆదరణకు లోనై అక్కడే హైస్కూల్ లో చేరి 1874లో ప్రవేశ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .రాజా వారి ఉపకార వేతనం పొంది మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఏం .ఏ .చదివి ఉత్తీర్ణులైనారు .ఆ నాటి మొదటి బాచీ విద్యార్ధులలో  వీరున్నారు .న్యాయ శాస్త్రం పై మక్కువ ఎక్కువవ్వటం తో దానినీ చదివి బి ఎల్ పట్టా పొందారు .

విద్యా సేవ

విద్యాభ్యాసం మద్రాస్ లో పూర్తీ చేసుకొని మళ్ళీ విజయనగరం చేరుకొన్నారు .వీరిని మహా రాజావారు తమ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా నియమించి గౌరవించారు ,కొద్దికాలానికే ఆచార్యుల వారు పదోన్నతి పొంది 1887లో ప్రధానాచార్యులు అంటే ప్రిన్సిపాల్ అయ్యారు .1920వరకు ఆ పదవిని అత్యంత సమర్ధ వంతం గా  నిర్వహించారు .తర్వాత విజయ నగర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా నియమిమ్పబడ్డారు .విద్యా రంగానికిరామానుజా చార్యుల వారి సేవను గుర్తించిన అ నాటి ఆంగ్ల ప్రభుత్వం 1912లో ‘’రావు బహదూర్ ‘’బిరుదు నిచ్చి గౌరవించి సత్కరించింది  .డెబ్భై ఏడేళ్ళు యశో జీవితాన్ని సార్ధకం చేసుకొని ఆచార్యుల వారు 1928లో కీర్తి శేషులయ్యారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 74వ సమావేశం జనవరి11 న దైవ క్షేత్రాలు పుస్తకావిష్కరణ లైవ్ ద్వారా వీక్షించండి సమయం : సాయంత్రం 5 గంటలనుండి ప్రారంభం (IST)

<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by photo9india</a>

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

మూసి -డిసెంబర్ – మెతుకు సీమ మెదక్ ను నందన వనం చేసిన కవిరాజులు- విశ్వనాధ కల్ప వృక్షం లో రామ బాల్యం – దాశరధీ శతకం-

ds1 001ds2 001ds3 001medak1 001medak2 001ramabalyam 1 001 ramabalyam2 001 ramabalyam3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్తృత బౌద్ధ సిరి -దంతపురి -బుద్ధ భూమి -డిసెంబర్

dantapuri1 001 dantapuri2 001 dantapuri3 001 dantapuri4 001 dantapuri5 001 dantapuri6 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుమతి పొందిన చలపాక ప్రకాష్ కద-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83

124-కళానిధి ,విద్యా వాచస్పతి  –విక్రాల రామ చంద్రా చార్యులు

బాల మేధావి

కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు  విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున  ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా  కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల  రాఘవాచార్యులు తల్లి కనకమ్మ .వీరి వంశం లో’’ కవిపంతారామం ‘’గా ప్రసిద్ధులైన విక్రాల వంశ మూల పురుషులు విక్రాల నరసింహా చార్యుల వారు భగవద్ రామానుజులకు ప్రత్యక్ష శిల్యులు .వారి తర్వాత అరవైనాలుగు పురుషాంతరాలు గడిచి పోయాయి .వంశం లో జన్మించిన వారంతా ప్రసిద్ధ కవి పండితులే అవటం మరో విశేషం .

రామ చంద్రా చార్యుల వారు బాల మేధావిగా పరిగణింప బడ్డారు .బాల్యం లోనే అసాధారణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించారు .అయిదవ ఏట అక్షరాభ్యాసం జరిగిన ఒక్క రోజులోనే ఒత్తులు  గుణింతాలుతో సహా తెలుగు అక్షరాలన్నీ నేర్చేసి అందర్నీ ఆశ్చర్య పరచారు .ఏడవ ఏటనే ‘’లీలావతీ గణిత సార సంగ్రహం ‘’మొదలైనవి ఆపోశన పట్టేశారు .ఒకే ఒక్క రోజు రాత్రి పంచాంగ రచనకు అవసరమైన లేక్కలన్నిటినీ  గ్రహించే చే శారు  ..పదమూడవ ఏట తండ్రిగారి వద్దే షట్ శాస్త్రాలు అభ్యసించి తిరుగు లేని పండితులని పించుకొన్నారు .తర్వాత మేనమామ పర్ణ శాల రాఘవాచార్యుల వద్ద సాహిత్య ,వ్యాకరణ ,తర్క శాస్త్రాలను నేర్చుకొన్నారు .అనంతరం శ్రీ కాళహస్తి వెళ్లి అక్కడ సింగా రాజు సూర్య నారాయణ ఉపాధ్యాయుల వారి వద్ద కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేశారు .రామ దత్తా నంద తీర్ధుల వద్ద సిద్ధాంత ,జాతక ,ముహూర్త ,వాస్తు ,ప్రశ్న భాగాలు నేర్చుకొన్నారు .

యవ్వన విజయం

పద్దెనిమిదేళ్ళ వయసులో ‘’శూల మేని ‘’లో జరిగిన యాగానికి సదస్య బాధ్యతా వహించి యాగాన్ని నిర్విఘ్నంగా యదా విధిగా నిర్వహించి మహా మహా వాళ్ళకే సంభ్రమం కలిగించారు .మద్రాస్ వెళ్లి మహా భారత రహస్యాలను ,జ్యోతిష్ శాస్త్రాన్ని గూర్చి మహోపన్యాసాలు  చేసి అందరిని అలరించి స్స్వర్ణ సింహ తలాటపు మురుగులు ,గడియారం బహుమతులుగా పొందారు .

పూనా లో మొదటి ఓరిఎంటల్ సమావేశం జరిపితే మద్రాస్ నుండి ఆచార్యులవారు ప్రతి నిదిగా హాజరై ,అక్కడి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలను పొందారు .తిరువనంతర పుర విద్వత్ సభలో తలపండిన విద్వాం సులనే తన ఉపన్యాస ఝరి తో తల పంకింప జేసి ‘’విద్యారణ్య పంచానన ‘’గౌరవాన్ని ,తిరువాన్కూర్ మహా రాజా వారి ఘన సన్మానాన్ని అందుకొన్నారు .

నడి వయసు సూరీడు

1922కలకత్తా ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో సాధికార పూరిత ప్రసంగం చేసి ,గవర్నర్ నుండి విశిష్ట సత్కారం పొందారు ..నవ ద్వీపం లో విద్వన్మండలి లో ప్రసంగించి ,తన సర్వ శాస్త్ర విజ్ఞానం వక్రుత్వాలకు విశేష ఆదరాన్ని పొంది సర్ ఆశుతోష్ ముఖర్జీ నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు ను ,మహా గౌరవ ప్రదమైన సత్కారాన్ని అందుకొన్నారు .మరో సభలో ‘’కళానిధి ‘’బిరుదు వరించింది .1923లో నండూరి గ్రామం లో జరిగిన ఆంద్ర సాహిత్య పరిషత్ వార్షిక సభ ఆచార్యులవారికి ‘’మహోపాధ్యాయ ‘’గౌరవం కల్పించి కీర్తించింది .చాలా రాజాస్థానాలను సందర్శింఛి  ప్రభువులను మెప్పించి విద్వాంసులను ఆశ్చర్య పరచి  అఖండ  సన్మానాలందు కొన్నారు .

గీర్వాణ రచనాచార్యం

విక్రాల రామ చంద్రా చార్యుల వారు సంస్కృతాంధ్రాలలో మొత్తం 89 గ్రంధాలు రాసి ,సాహిత్య  రచనలో మేటి అనిపించుకొన్నారు .అందులో ముఖ్యం గా సంస్కృతం లో 16 ఉద్గ్రంధాలు రచించారు .వాటిలో  ‘’త్రేతాకాండ మంత్రం భాష్యం ‘’,’’అపస్తంభాది షట్ శాఖా నిరూపణం ‘’,’’అనువాక నిర్ణయం ‘’,ఉన్నాయి ఇవికాక గీర్వాణ భాషలో రాసిన ‘’అబ్దనామ నిర్వచనం ‘’,సంఖ్యాను శాసనం ‘’,జ్యోతిర్దశా నిర్ణయం ‘’, ‘’మానాంతర బోధం ‘’మొదలైన జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన పద్నాలుగు గ్రందాలున్నాయి .మానాంతర బోధనం అనే వీరి జ్యోతిష్ శాస్త్ర ఉద్గ్రంధం ఇంగ్లీష్ లోకి ‘’దిడేట్ కాల్క్యు లేటర్’’పేరు మీద అనువాదం పొంది విశ్వ వ్యాపితం గా కీర్తి చంద్రికలను వెలయించింది .

ఆచార్య ఆంద్ర రచనోత్సవం

ఆచార్య శ్రీ తెలుగులో 40గ్రంధాలు రాశారు .అందులో ‘’కల్ప సూత్రసంగ్రహం ‘’, ‘’దివ్య దేశ మార్గ బోధిని ‘’,’’వేదాంతపు జడ్జి మెంట్ ‘’,’’వర్దిష్ణుహితోపదేశం’’,రెండుభాగాలలో’’ రామ జాతకం   ‘’,’’స్త్రీ పునర్వివాహ శాస్త్రీయతా నిరూపణం ‘’,మొదలైనవి ఉన్నాయి .

రాజకీయాచార్యకం

విక్రాల వారు రాజ కీయ ప్రవేశం చేసి ,అక్కడా తమ అవక్ర పరాక్రమం చూపి ,సాహిత్య సేవతో బాటు సంఘ సేవలోనూ పునీతులయ్యారు .1904లో ఒంగోలు తాలూక బోర్డు సభ్యులుగా నియమితులై రాజకీయ అరంగేట్రం చేశారు .పిమ్మట తొమ్మిదేళ్ళు నెల్లూరు జిల్లా బోర్డు సభ్యులుగా సేవలందించారు .1911లో  ‘’దక్షిణ భారత సంస్థ ‘’లో సభ్యులయ్యారు .1912లో మద్రాస్ పచ్చయప్ప కాలేజి ప్రెసిడెంట్ గా ఇతోధికం గా విద్యా సేవ చేసే అవకాశం పొంది సంతృప్తిగా విద్యా సేవ చేశారు .తన స్వంతగ్రామం కలికి వాయి లో  ఇంట్లోనే ‘’సరస్వతీ పుస్తక భాండా గారం ‘’సమకూర్చుకొని  వాణీ మాత నిత్య సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .సుమారు అర్ధ శతాబ్ది కాలం మాత్రామే అంటే యాభై మూడేళ్ళు మాత్రమె జీవించిన ఈ కళానిధి  మహోపాధ్యాయ ,విద్యా వాచస్పతి శ్రీ విక్రాల రామ  చంద్రాచార్యుల వారు 7-4-1932 గీర్వాణ లోకం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ 

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజమండ్రి నగరం’ ఇంకా నరకమే!

నగరం’ ఇంకా నరకమే!

  • -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి
  • 09/12/2014
TAGS:

ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన ఆ గ్రామానికి తిరిగి జవసత్వాలు ఎలా ఇవ్వగలం..? అత్యంత భయానకమైన ఆ ప్రమాదం నుంచి నేర్వాల్సిన పాఠాలను మన పాలకులు ఇంకా ఒంటపట్టించుకోలేదు.. కొంతమందిని విగతజీవులుగా, మరికొంత మందిని వికలాంగులుగా చేసి, జనజీవనంపై పెను ప్రభావం చూపిన ఆ ప్రమాదం అప్పటితో సమసిపోలేదు.. బాధిత కుటుంబాల వారసులు, క్షతగాత్రులు పూర్తిస్థాయిలో సహాయానికి నోచుకోక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు.. ఆర్థిక సమస్యలతో, పలురకాల వైకల్యాలతో సతమతమవుతున్న వారికి ఎలాంటి భరోసా కనిపించడం లేదు.. ఒకప్పుడు స్వర్గసీమలా విలసిల్లిన ఆ గ్రామం ఇప్పటికీ- మానని గాయమే..! గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన ఆ గ్రామస్థులను నిత్యం ఓ పీడకలలా వెంటాడుతోంది.. పాలకులు ప్రకటించిన ‘పునరావాస ప్రక్రియ’ నేటికీ కొలిక్కిరాలేదు.. ఈ ఏడాది జూలై 27న తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన అనంతరం అక్కడి పరిస్థితులు వ్యవస్థల వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి..
================
ఎటు చూసినా పచ్చదనం, ప్రశాంత వాతావరణం.. ఠీవిగా నిలబడ్డ కొబ్బరి చెట్లు.. పగలు, రాత్రి తేడా లేకుండా రోజంతా సందడిగా కనిపించే రహదారులు.. ఇవన్నీ కోనసీమలోని ‘నగరం’ గ్రామంలో ఒకప్పటి పరిస్థితులు.. ఇపుడు అక్కడ శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఈ ఏడాది జూలై 27న తెల్లవారక ముందే జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుతో ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. పైప్‌లైన్ పేలుడుతో వ్యాపించిన అగ్నికీలల్లో 15 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన 27 మందిని ఆస్పత్రుల్లో చేర్చగా చికిత్స పొందుతూ మరో 8 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) 25 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారు ఇప్పటికీ వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలనాటి భీతావహ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థులు నేటికీ భయం నీడలో కాలం వెళ్లదీస్తున్నారు.
ఊరు బావురుమంటోంది…
గ్యాస్ పైప్‌లైన్ పేలుడు తర్వాత నగరం గ్రామం వైపు ఎవరూ కనె్నత్తి చూడడం లేదు. అత్యంత సారవంతమైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎకరం భూమికి కోటి రూపాయల ధర పలకగా, ఇపుడు పదిలక్షలకే ఇస్తామన్నా కొనేవారు కానరావడం లేదు. దుర్ఘటన తర్వాత చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. అద్దెకు ఉంటున్న వారు ఇళ్లు ఖాళీ చేశారు. ఫలితంగా గ్రామంలో చాలా ఇళ్లు బోసిపోతున్నాయి. భోజనం హోటళ్లు, కూల్‌డ్రింకు షాపులు, టీ దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు తాము రోజూ నాలుగు బస్తాల బియ్యం వండి వార్చేవారమని, ఇపుడు నాలుగు కుంచాల బియ్యం ఉడికించడం గగనంగా మారిందని గ్రామంలోని ఓ హోటల్ యజమాని చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవతుంది. కుటుంబం మొత్తాన్ని రాజాలా పోషించే తమ కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని భోజనం హోటల్ నడుపుతున్న బోణం నరసింహ మూర్తి, ఆయన భార్య పళ్లాలమ్మ కంటతడి పెడుతూ చెబుతున్నారు. నష్టపరిహారం కింద ఇచ్చిన అయిదు లక్షలు మందుల ఖర్చుకి చాలడం లేదని, ఇక తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. తక్కువ అద్దె ఇచ్చి ఇళ్లలో ఉండమన్నా ఎవరూ ఉండడం లేదని, తమ ఊరి పేరు చెబితే ఇతర ప్రాంతాల వారు హడలెత్తిపోతున్నారని నగరం గ్రామ పెద్ద వానరాశి రాంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎంతోమంది నేడు జీవనోపాధి లేక ఆర్థిక సమస్యలతో అలమటిస్తున్నారు. ఇపుడు రోజూ సాయంత్రం చీకటి పడితే చాలు.. జన సంచారం లేక వీధుల్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఒకప్పుడు నగరంలోనే విడిది చేసేవారు. పేలుడు తర్వాత ఇక్కడ బస చేసేందుకు భక్తులు జంకుతున్నారు.
‘గెయిల్’కి భారీ నష్టం..
నగరం వద్ద పేలుడు సంభవించి నెలలు గడుస్తున్నా పైప్‌లైన్‌ను పునరుద్ధరించడంలో జాప్యం కారణంగా ఓఎన్‌జిసికి రోజుకు 75 లక్షల రూపాయల మేరకు నష్టం జరుగుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సమీపంలోని పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. గత ఆరునెలల్లో సు మారు 135 కోట్ల రూపాయల విలువ చేసే గ్యాస్ వినియోగం కాకుండా పోయిందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని ఓఎన్‌జిసి ఉన్నతాధికారులు పేర్కొనడంతో పునరుద్ధరణ పనులను ‘గెయిల్’ అధికారులు చేపట్టలేదు. తాటిపాక, పాశర్లపూడి చమురు బావుల నుంచి గ్యాస్ సరఫరాను చాలావరకూ నిలిపివేశారు. చమురు బావులు మళ్లీ కళకళలాడాలంటే ‘ప్రొడక్షన్ డ్రిల్లింగ్’ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అధికారుల నిర్వాకం ఫలితంగా పైప్‌లైన్ పనులకు, డ్రిల్లింగ్‌కు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఆధారిత పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం కావడంతో మరికొంత మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల ‘గెయిల్ టెర్మినల్స్’ మూత పడడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనాలకు అందడం లేదు. ఓఎన్‌జిసి, గెయిల్‌లకు పూర్వ వైభవం మళ్లీ సాధ్యమా? అన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.
చేతలు కాలాక..
నగరం దుర్ఘటన నేర్పిన గుణపాఠంతో భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా గెయల్ కొన్ని దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. కెజి బేసిన్‌లో పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ ఒత్తిడిని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేలుడు నేపథ్యం లో 2015 జూన్‌కు గానీ విజయవాడ వైపు గ్యాస్‌ను సరఫరా చేసే అవకాశం లేదని గెయల్ ప్రతినిధులు చెబుతున్నారు. పైపులెన్ల పరిస్థితిని, భద్రతా చర్యలను సమీక్షించే బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్)కు గెయిల్ అప్పగించింది. పైప్‌లైన్లను తనిఖీచేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖ వైపు పైపులైన్లకు తనిఖీలు నిర్వహిస్తుండటంతో గ్యాస్ రవాణా దాదాపు స్తంభించింది. ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకు, వంట గ్యాస్‌కూ కొరత ఏర్పడింది. పేలుడు ఘటనకు గెయల్ అధికారులదే బాధ్యత అని విచారణ సంఘాలు తేల్చి చెప్పడంతో నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఆ సంస్థ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా నాలెడ్జ్ యూనివర్సిటీని నెలకొల్పాలని నిర్ణయించినట్టు గె యిల్ ప్రతినిధులు చెబుతున్నారు. సామాజిక బాధ్యత కింద ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వారు అంటున్నా, అది కార్యరూపం దాల్చేదెపుడో..? *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్

  • 09/12/2014
TAGS:

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్ పేరిట ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధికి కార్పొరేషన్లు పనిచేస్తుండగా, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. తరువాత నేరుగా కార్పొరేషన్‌కు విధివిధానాలు రూపొందిస్తారు. రాష్ట్రంలో అగ్రవర్ణంగా ఉన్న బ్రాహ్మణులు చాలా ప్రాంతాల్లో ఆర్ధికంగా మాత్రం వెనుకబడి ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అభివృద్ధికి ఆర్ధికంగా ఆదుకోవాలని చాలాకాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విజ్ఞప్తులకు కార్యరూపం వచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో బ్రాహ్మణుల అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అదే మూలధనంతో ఒక్కొక్కటి పది రూపాయల షేర్ విలువతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అవసరం మేరకు అదనంగా నిధులు సమకూర్చేందుకూ నిర్ణయించారు. ఈ సంస్థకు తొలి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్‌ను నియమించారు. అలాగే తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా బీసీ సంక్షేమ కమిషనర్ వాణిప్రసాద్‌ను నియమించారు. తొలి షేర్ హోల్డర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, టి.నారాయణరెడ్డి, వాణిప్రసాద్, రాజా పుష్ప, వైవి అనురాధ, కె.శ్రీనివాసరావు ఉంటారు. ఇక డైరెక్టర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, వాణిప్రసాద్ ఉంటారు. రాష్ట్ర బీసీ సహకార ఆర్ధిక సంస్థ కార్పొరేషన్‌లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

శంకరాభరణం రాజ్య లక్ష్మి మనోగతం- శంకరాభరణం ఇంటిపేరైంది

శంకరాభరణం ఇంటిపేరైంది
రాజలక్ష్మి అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. కానీ శంకరాభరణం రాజలక్ష్మి అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరైన రాజలక్ష్మిని- శంకరాభరణం తమిళ అనువాదం విడుదలవుతున్న నేపథ్యంలో నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే.. ‘‘మాది తెనాలి. అమ్మ సభా రంజని రంగస్థల నటి. ఒకప్పుడు తెనాలి నాటకాలకు చాలా ప్రసిద్ధి. అమ్మ కూడా ఎప్పుడూ నాటకాలలో బిజీగా ఉండేది. అమ్మను చూస్తుండటంతో నాకూ నటనపై ఆసక్తి కలిగింది. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసేదాన్ని. స్కూల్లో చదువుకునేటప్పుడు భరతనాట్యం నేర్చుకోవటంతో నాట్యం చేసేదాన్ని. అమ్మ నటి కావటం వల్ల అనుకుంటా- స్టేజి మీద నటించటానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడేదాన్ని కాదు. పదవ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత సెలవల్లో- మాకు తెలిసిన వారు విశ్వనాధ్‌ గారు తన సినిమాలో ఒక పాత్రకు కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారని చెప్పారు. అమ్మ కూడా సరేనంది. దాంతో వెళ్లి విశ్వనాధ్‌ గారిని కలిసాం. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను. అలాంటి డైరక్టర్‌ దగ్గర నటించాలంటే .. చాలా భయం వేసింది. తొలిసారి కలిసినప్పుడు ఆయన నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆ సమయంలో నేను లంగా, ఓణిలో పల్లెటూరి పిల్లలా ఉండేదాన్ని. బహుశా నన్ను చూడగానే ఆయనకు శారద గుర్తుకొచ్చి ఉండాలి. అంతే కాకుండా ఆయనకు తన సినిమాల్లో నటించే వారి నుంచి నటన ఎలా రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆ తర్వాత ఏడిద నాగేశ్వరరావు గారు కూడా నన్ను ఓకే చేశారు. దాంతో శంకరాభరణంలో శారద పాత్ర నటించే అవకాశం వచ్చింది.
విడుదల కాకముందే అవకాశాలు!
నాపై తీసిన తొలి పాట సామజ వరగమన.. మొదట్లో బెరుగ్గా ఉన్నా నెమ్మదిగా యూనిట్‌తో కలిసిపోయా. విశ్వనాధ్‌ గారు తన ఆరిస్టుల దగ్గర నుంచి నటనను రాబట్టుకోవటంలో దిట్ట. ఒకవైపు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంటేనే మరో వైపు నాకు ఇతర చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. రాఘవేంద్రరావు గారు ‘నిప్పులాంటి నిజం’లో మురళీమోహన్‌కి హీరోయిన్‌గా కొత్తమ్మాయిని వెతుకుతున్నారు. నా గురించి ఎవరో చెప్పటంతో నన్ను స్ర్కీన్‌ టెస్ట్‌ చేసి ఎంపిక చేశారు. దాంట్లో నాది పూర్తి మోడ్రన్‌ క్యారెక్టర్‌. దీంట్లో ఎంపిక అయిన వెంటనే రామారావుగారు ‘రౌడీరాముడు కొంటె కృష్ణుడు’లో బాలకృష్ణకు జోడీగా ఎంపిక చేశారు. అందులో ఎన్టీఆర్‌-శ్రీదేవి ఒక జంట అయితే బాలకృష్ణ-నేను మరో జంట. ఈ రెండూ ప్రారంభమైన తరువాతనే ‘శంకరాభరణం’ విడుదలైంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. శంకరాభరణం పూర్తయిన తర్వాత విశ్వనాధ్‌ గారు – ‘కొత్తమ్మాయివి.., ధైర్యంగా చేశావు. బాగా వచ్చింది. వెరీ గుడ్‌’ అన్నారు. నాకు అదే పెద్ద అవార్డు అనిపించింది. వెనువెంటనే మరో అవార్డు కూడా దక్కింది. అది రామారావుగారి కాంప్లిమెంట్‌. ‘శంకరాభరణం’ ప్రివ్యూ అయిన మరుసటి రోజు రామారావుగారి కాళ్లకి దణ్ణం పెట్టి, ఎలా చేశానండీ ? అనడిగాను. ‘బాగా చేశావురా. నిన్నే చూశాను’ అన్నారు. నా ఆనందానికి హద్దులు లేవు.
34 ఏళ్ల తర్వాత కూడా అదే స్పందన…!
శంకరాభరణం’ సినిమాను తమిళంలోకి అనువదించారు. దాని ప్రివవ్యూకు వెళ్లాను. ఇప్పటికీ అందరూ ఆ సినిమాను ఆస్వాదించటం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. 34 ఏళ్ల తరువాత కూడా అదే స్పందన. సినిమా అయిపోయాక కొందరు తమిళ డైరక్టర్లు నా దగ్గరకు వచ్చి-‘చిన్నప్పుడు ఎప్పుడో చూశాం. ఈ రోజు మళ్లీ స్వయంగా మీతోపాటు చూడడం చాలా సంతోషంగా ఉందండి’ అన్నారు. ఇన్నేళ్ల తరువాత తెరపై నన్ను నేను చూస్తుంటే నిజంగా నేనేనా అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మా పాత్రలు ఇంకా బాగా చేసుండొచ్చేమో అనిపిస్తుంది. నేను చేసిన కొన్ని పాత సినిమాలు చూస్తున్నప్పుడు ఫీలవుతుంటాను కూడా. అయితే ‘శంకరాభరణం’ చూసినప్పుడు అటువంటి భావనే లేదు. ఆ గొప్పతనం విశ్వనాథ్‌గారిదే. శారద పాత్రకి ఎంత కావాలో అంతే చేయించుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉంది. శంకరాభరణం రాజలక్ష్మి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వపు మెరుపు తీగ -జాన్ హైడ్ -శిఖామణి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సగీత కళానిధి నేడు నూరి కృష్ణ మూర్తిగారి మృతి –

అజరామర స్వరమూర్తి!

  • 09/12/2014
TAGS:

ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో అజరామర అనుభూతులను పండించాయి! ఆయనే నేదునూరి కృష్ణమూర్తి…కర్నాటక సంగీత సామ్రాజ్యానికి చెరగని కీర్తి, సుస్వర వైభవ దీప్తి, తరతరాలకు తరగని రసస్ఫూర్తి! ఆయన విశుద్ధ విద్వాంసులలో విలక్షణుడు, ప్రసిద్ధులలో ప్రసిద్ధుడు. తెలుగునాట మాత్రమేకాదు దాక్షిణాత్య సంగీత వాటిక అంతటా పరుగులు తీసిన ఆయన మంగళ గళ వినిర్గత గాన మాధుర్య స్రోతస్విని స్వరాల తోటలను పూయించింది.. ఆ పూతోటల పరిమళం సంగీత ప్రియుల గుండెలలో గుబాళిస్తోంది, గుబాళిస్తూనే ఉంటుంది! సప్త దశాబ్ద సంగీతారాధ్య, అధ్యాపన యజ్ఞవేదిక ఆయన జీవన భూమిక! సప్తస్వర ‘సామ’గానంతో నిత్యం సరస్వతీ సమారాధన సాగించిన ప్రణవమూర్తి కృష్ణమూర్తి!! ‘ఇట్టి ముద్దులాడె బాలు డేలరాడు..? వాని పట్టితెచ్చి పొట్టనిండ పాలుపోయరే!’ అన్న అన్నమాచార్యుని గీతాన్ని స్వరపరిచినా..దాశరధిని కరుణాపయోనిధిని కొలచిన గోపన్న అక్షర ‘కదళీ, ఖర్జూరాల’ను శ్రోతలకు రుచి చూపించినా, ‘ఆరగింపవే పాలు, ఆరగింపవే..’ అంటూ త్యాగరాజ రూపమెత్తి ఇష్టదేవత ఎదుట తిష్ఠవేసినా…నేదునూరి వారు అశేష శ్రోతలకు మోదం కలిగించారు, మహావిద్వాంసుల ఆమోదం పొందాడు! మూడున్నర దశాబ్దులకు ముందు తిరుపతి త్యాగరాజ మంటపం వేదికపైన, అన్నమాచార్య కళా మందిర రంగస్థలిపైన ఆయన గొంతెత్తిన నాటి దృశ్య మాలికలు..మూడు నెలలకు ముందు దృశ్య మాధ్యమ పటంపై ప్రస్ఫుటించిన ఆయన స్వర సృజన విన్యాసాలు..ఎడతెగని నాద యోగ శ్రమకు నిదర్శనాలు…వాడని స్మృతుల సుమసరాలు! ఎనబయి ఏడేళ్ల పార్ధివ జీవన ప్రస్తావన గీతంలో కృష్ణమూర్తి సోమవారం చివరి చరణాన్ని ఆలపించి ఉండవచ్చు గాక…ఆయన ఆవిష్కరించిన సంగీత మకరంద ధుని మాత్రం అజరామరంగా పరుగులు తీస్తునే ఉంటుంది! ఆయన ‘శ్రుతి’కి మృతి లేదు. ఆయన స్మృతికి చ్యుతి లేదు! వాగ్గేయ వసుంధర చరిత్రలో నేదునూరి కృష్ణమూర్తి సనాతనుడు, శాశ్వతుడు..మహనీయుడు, ‘్భరతి’ వరాల బిడ్డడు!
నేదునూరి విజయలక్ష్మీ రామమూర్తి దంపతుల పుణ్యఫలం కృష్ణమూర్తి. తెలంగాణలోని కొత్తపల్లిలో క్రీస్తుశకం 1927 అక్టోబర్ 10వ తేదీన పుట్టిన కృష్ణమూర్తి పూర్వాంధ్రలోని పిఠాపురంలో పెరిగాడు, ఉత్తరాంథ్రలోని విజయనగరంలో విద్య నేర్చుకున్నాడు! రాయలసీమలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాల ప్రధాన ఆచార్యునిగా ప్రసిద్ధికెక్కాడు! సంగీత స్వరూపంగా నడయాడి తెలుగువారి భావ సమైక్య స్వభాన్ని నిలబెట్టాడు! కర్నాటక సంగీత సాధన ద్వారా కృష్ణమూర్తి ‘తరాల‘ మధ్య వారసత్వ వారధిని నిర్మించాడు! ఆయన గురువులు ప్రసిద్ధులు, ఆయన శిష్యులు కూడ ప్రసిద్ధులు..ప్రసిద్ధిని, విశుద్ధ సంగీత సంప్రదాయాన్ని ఆయన గురువులనుండి స్వీకరించాడు, శిష్యులకు ప్రదానం చేసాడు! ఆయన తొలి గురువు ద్వారం నరసింహరావునాయుడు! ‘ద్వారం’ కుటుంబం కర్నాటక సంగీత సౌధానికి నిజంగానే ‘ద్వారం’ వంటిది! ద్వారం వెంకట స్వామి నాయుడు విజయనగరం సంగీత శిఖరానికి పతాకం వంటివాడు. ఆయన అన్న కుమారుడు ద్వారం నరసింహారావు…నరసింగరావు సంతానమైన దుర్గాప్రసాద్, మనోరమ, సత్యనారాయణరావు వంటివారు కూడ సంగీత సరస్వతీ సమారాధకులు! ఈ ‘ద్వారం’ కుటుంబంలో ప్రసిద్ధుడైన నరసింగరావు 1940వ దశకంలో కృష్ణమూర్తికి స్వరాక్షరాలు నేర్పించాడు. శ్రీపాద పినాకపాణి ఆచార్యత్వంలో నేదునూరివారు మహా విద్వాంసుడుగా పరిణతి చెందారు! అనితర సాధ్యమైన విలక్షణ సంగీత శైలికి అద్వితీయ ప్రతినిధి…ఇలా ప్రసిద్ధుల వద్ద విద్య నేర్వడం గొప్పతనం కాకపోవచ్చు! ప్రసిద్ధులైన శిష్య గణాలను రూపొందించడం నేదునూరి వారి నిజమైన గొప్పతనం! ఆయన సమకాలంలోనే గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాదు, శోభరాజు వంటి ఆయన విద్యార్థులు విశ్వవ్యాప్త విఖ్యాతిని గడించారు. ఇదీ కృష్ణమూర్తిగారి ఆచార్యత్వ ప్రభావం..రసమయ ప్రపంచంలో ఆయన నిలబెట్టిన సజీవ ప్రతీకలు ఆయన శిష్యులు..
పదకవితా పితామహుడైన అన్నచారార్యుని గీతాలను భాండాగార విముక్తం బ్రహ్మాండమంతా మారుమోగించిన పరిశోధక త్రయంలో కృష్ణమూర్తి చిన్నవాడు! కానీ ఈ కృషిలో అన్నలిద్దరితో సమానంగా ఎన్నదగినవాడు. వేటూరి ప్రభాకర శాస్ర్తీ, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ప్రారంభించిన పరిశోధక ప్రక్రియను ఆ తరువాత కొనసాగించిన స్వరాక్షర మూర్తి నేదునూరి కృష్ణమూర్తి! కృష్ణమూర్తి స్వరపరిచిన అన్నమాచార్యు కీర్తనలు అనేక దశాబ్దులుగా సామాన్య శ్రోతలను, సంగీత కోవిదులను సమానంగా అలరిస్తున్నాయి! ‘అదివో అల్లదివో హరివాసము’ అన్న అన్నమాచార్య సుప్రసిద్ధ కృతికి ‘శ్రుతి’ని కల్పించినవాడు నేదునూరి! ‘హరివాసము’ అన్న పదజాలం ‘శ్రీహరివాసము’గా మారడం తరువాతి కథ! అన్నమాచార్యుడు ‘హరివాసము’ అని మాత్రమే పద ప్రయోగం చేసాడన్నది నేదునూరి వారు చేసిన నిర్ధారణ! అంతేకాదు ‘అదివో..’ అన్న పదంలోని మొదటి అక్షరానికి ‘హరివాసము’లోని మొదటి అక్షరానికి అన్నమయ్య ‘యతి’ సామ్యం కల్పించాడు! ‘శ్రీహరి వాసము’ అని మార్చినప్పుడు ‘యతి’ గతి తప్పిపోతుంది! అందువల్ల నేదునూరి వారి నిర్ధారణకు అనుగుణంగా సంగీత ప్రస్ధానం సాగించడం వర్తమాన వాగ్గేయకారుల, సంగీత విద్వాంసుల విధి! అదే నేదునూరి వారికి మనం ఘటించగలిగిన నిజమైన శ్రద్ధాంజలి…పదునాలుగవ శతాబ్ది నాటి పురందరదాసు కర్నాటక శాస్ర్తియ సంగీత అధ్యయనానికి ‘పాఠ్యక్రమాన్ని’ నిర్ధారించిన మార్గదర్శకుడు! అన్నమాచార్య గీతాలాపనకు ‘స్వర’ మార్గాన్ని సుగమం చేసిన అభినవ పురందరదాసు నేదునూరి కృష్ణమూర్తి! ఈ ‘స్వర’ మార్గాన్ని రాళ్లపల్లి వారు ఆరంభించారు. నేదునూరి కొనసాగించారు! ‘ఏకైవ మూర్తిః బిభిదేత్రిధాసా’-ఒకే మూర్తి మూడు విభిన్న రూపాలుగా కనిపిస్తోంది-అని మహా కవి కాళిదాసు చెప్పినట్టు వేటూరి, రాళ్లపల్లి, నేదునూరి-ఈ ముగ్గురూ ఒకే సంగీత సాహిత్య స్వభావానికి మూడు విభిన్నమైన స్వరూపాలు! నేదునూరివారు ఆలపించిన అజరామర కృతుల సమాహారం ‘అన్నమయ్య అంతరంగ తరంగం’ ‘అన్నమయ్య పదకదంబం’, ‘అన్నమయ్య పదకమలం’, ‘్భద్రాచల రామదాసు కీర్తనలు’, ‘త్యాగరాజ అపురూప కృతులు’ వంటి దృశ్య మాధ్యమ సంపుటాలుగా విస్తరించి ఉంది! ఇవి అనేక సంపుటాలు! ఆయనకు దాదాపు నలబయి పురస్కారాలు, బిరుదులు లభించాయి! ఆయన నాదయోగి..కీర్తి పరాన్ముఖ విరాగి!
తన కవిత్వంలోని ‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’ని కవీంద్రులు మెచ్చుకుంటారని ఆదికవి నన్నయ చెప్పుకున్నాడు. మరి కవీంద్రులు కాని ఇతరుల మాట ఏమిటి? వారు అక్షర రమ్యతను చూసి మురిసిపోతారు! నేదునూరి వారి సంగీత సరస్వతి ఇలా విద్వాంసులను సంభ్రమాశ్చర్య స్రవంతిలో ముంచెత్తింది! ‘ఆరోహణ’ ‘అవరోహణ’, ‘ఆలాపన’, ‘శ్రుతి, లయ’ ‘సంగతి’, ‘స్వరం’, ‘రాగం’ మేళకర్త వంటి సంగీత పరిభాష తెలియని సామాన్య శ్రోతలను సైతం నేదునూరి వారి గాత్రం అలరించింది. అలరిస్తునే ఉంటుంది! అతడు అజరామరుడు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 – 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82

123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం

మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు అష్టా దశ భాషా ప్రవీణులు .తండ్రి నాట్య శాస్త్ర వ్యాఖ్యాత .కవిగారు చెన్నై లో బి ఏ .పాసై సంస్కృతం లో ఏం .ఏ .చేశారు .మద్రాస్  చింతాద్రి పేట మిడిల్ స్కూల్ ,క్రిస్టియన్ కాలేజి హైస్కూల్ లో ,పచ్చయప్ప కళాశాల ఉన్నత పాఠ శాలలో అధ్యాపకులుగా పని చేశారు .ఆరు భాషలో పాండిత్యం సాధించటం వలన వీరిని ‘’కవిగారు ‘’అని సంబోధిస్తారు మర్యాదగా .

తర్వాత కవిగారు వన పర్తి సంస్థానం లో గ్రంధ ప్రచురణ కార్య నిర్వాహకులుగా పదేళ్ళు పని చేశారు .పిమ్మట మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం ప్రాచీన తాల పాత్ర గ్రంధ సంపాదన శాఖకు అధ్యక్షులుగా ఆరేళ్ళు సేవలందిం చారు .మద్రాస్ ప్రభుత్వ విద్యా శాఖలో చేరి ,రాజ మండ్రి ప్రభుత్వ కాలేజి లో అధ్యాపకులుగా కొంతకాలం ఉన్నారు .అనంతరం తిరుపతి దేవస్థాన విద్యా శాఖాదికారిగా 1935 వరకు కోన సాగారు .మద్రాస్ విశ్వ విద్యాలయ చరిత్ర శాఖలో మెకంజీ రికార్డుల పరిశోధనాలయం లో   ఆరు సంవత్సరాలుఉన్నారు . దశాబ్ద కాలం  తిరుపతి  పరిశోధనాలయ సంస్కృత శాఖలో రీడర్ గా ,ఉండి  కొంతకాలం డైరెక్టర్ పదవినీ చేబట్టారు .

ప్రాచీన  గ్రంధ సేకరణ –పరిశీలన –ముద్రణ

ద్రావిడ ,కన్నడ ,ప్రాచ్య మళయాళాది భాషలలో గొప్ప పాండిత్యం పొందారు .ప్రాచీన సంస్కృత ,ఆంద్ర సాహిత్య మన్నా ,ఆ భాషా చరిత్ర విమర్శా పరిశీలనం అన్నా కవి గారికి పరమ ప్రీతి .ప్రాచీన గ్రంధ సంపాదనకోసం  పరిశీలనకోసం ఏంతో స్వంత ధనాన్ని వెచ్చించిన సాహితీ ప్రియులు .ప్రాచీన గ్రంధ పరిశీలన ,సంస్కరణ లలో శబ్దార్ధ స్వరూప నిర్ణయం లో వీరి ప్రజ్ఞ సునిశితమై అనితర సాధ్యమైనది .సంస్కృతాంధ్రాలలో సరస సహజ సుందరం గా కవిత్వం చెప్పే నేర్పు కవి గారిది .బహు శాస్త్రాలలో వీరి  ప్రవేశం,పాండిత్యం  మహా విశేషమైనవి .సౌజన్యం ,సహృదయత కవిగారికి సహజాతాలు .వన పర్తి  లో  ఉండగా ‘’విస్మ్రుతికవులు ‘’శీర్షిక తో అనేక ప్రాచీన గ్రంధాలను సంస్కరించి ప్రచురించారు .వీటిలో నన్నే చోడుని కుమార సంభవం ,వల్లభ రాయని క్రీడాభిరామం ,మడికి సింగన సకల నీతి సారం ,బద్దె భూపాలుని నీతి శాస్త్ర ముక్తావళి ,భైరవి కవి రాసిన శ్రీ రంగ మహాత్మ్యం ,ప్రబంధ మణిభూషణం ,వేంకటేశ ఉదాహరణం ,ఆంద్ర తిరువాయ్ ,ఉన్నాయి . కవిగారు ‘’దక్షిణ భారత సంస్కృత గ్రంధ మాల ‘’అనే సంస్థను స్థాపించి అతి ప్రాచీన సంస్కృత గ్రంధాలను పరిశీలించి ముద్రించారు .ముద్రించిన వాటిలో దండి రచించిన ‘’అవంతి సుందరి కద‘’,’’చతురర్భాణీ అంటే శూద్రకుని పద్మ ప్రాభ్రుతకం ,ఈశ్వర దత్తుని ‘’ధూర్త విట సంవాదం ‘’,వరరుచి రాసిన ‘’ఉభయాభిసారిక ‘’,శ్యామలకుని ‘’పాద తాడితం ‘’అనే భాణ చతుస్టయం ,భోజుని ‘’శృంగార ప్రకాశం ‘’,దిజ్ఞాగుని ‘’కుందమాల నాటకం ‘’,విజ్జిక రాసిన ‘’కౌముదీ మహోత్సవ నాటకం  ‘’,’’వత్స రాజ చరితం ‘’,.ఇంత శ్రద్ధగా ప్రాచీన గ్రంధాలను సేకరించి పరిష్కరించి పరిశీలించి ముద్రించారు రామ కృష్ణ కవిగారు .సాహిత్య లోకం వారికి ఏంతో రుణ పడిఉంది .

కవిగారి రచనా పాటవం

కవిగారు కొన్ని స్వతంత్ర కావ్యాలు రచించారు .అందులో ‘’మృగవతి –రసవత్కావ్యం ‘’,వసంత విలాసం ‘-,కళా పూర్ణోదయాన్ని పోలిన తొమ్మిది ఆశ్వాసాల ఉత్తమ కావ్యం అముద్రితం .’’పాటలీపుత్రకం ‘’అనేది మరొక పద్య కావ్యం .’’కలింగ సేన ‘’,మాలతీమాధవం ‘’,అనేవి ప్రకరణాలు .భరతుని నాట్య శాస్త్రాన్ని అభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తో పరిష్కరించి గైక్వాడ్ ఓరిఎంటల్ గ్రంధ మాలలో మూడు భాగాలుగా ప్రచురించారు .ఇంకో భాగం అముద్రితం గానే ఉండిపోయింది .ఇది కవిగారి నాట్య శాస్త్ర జ్ఞానానికి ,సర్వం కష ప్రజ్ఞకు ఉదాహరణ .అలాగే ‘’భారత కోశం ‘’అనే మరో అపూర్వ గ్రంధం లో నాట్య శాస్త్ర సంబందాలైన పదాలన్నిటినీ అర్ధ వివరణ తో ,లక్షణ ఉదాహరణలతో అకారాదిక్రమం గా కూర్చారు .జ్ఞాన వయో వృద్ధులైన కవిగారు రాసిన  ఈ గ్రంధాన్ని  తిరుపతి దేవస్థానం ప్రాచ్య పరిశోధనాలయం ముద్రించి గౌర వించింది.

కవిగారు భాస నాటకాలను కొన్నిటిని అనువదించారు .ఇవికాక ఇంకా చాలా గ్రంధాలను రాశారు .కవి గారు సేకరించి సంస్కరించిన అనేక సంస్కృత గ్రందాలెన్నో ఇంకా అముద్రితాలుగానే ఉండిపోవటం బాధాకరం .ఇంత సరస్వతీ సేవ చేసిన కవి గారికి లక్ష్మీ ప్రసన్నం మాత్రం కాలేదు .ఇది లోకం లో సహజమే కదా .జీవిత చరమాంకం లో ఈ పండిత కవి ఆర్ధిక బాధలను ఎదుర్కొన్నారు .ప్రభుత్వం అంద జేసిన ఉపకార వేతనం తో జీవించాల్సి  వచ్చింది పాపం .రామ క్రిష్ణ  కవిగారు పూనుకొని ఉండక పొతే అమూల్య ప్రాచీన గ్రంధాలు వెలుగు చూసి ఉండేవికాదు .తొంభై ఒక్క ఏళ్ళు జీవించిన ఈ సాహిత్యోప జీవి మానవల్లి రామకృష్ణ కవిగారు 21-9-1957లో మద్రాస్ లో మరణించి సరస్వతీ సాయుజ్యంపొందారు

Inline image 1      Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 – 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81

121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే .కనుక చిన్ననాడే రామ శాస్త్రిగారిక్ ఆంద్ర గీర్వాణాలు సహజం గానే అబ్బాయి .పాండిత్య కవితా ప్రావీణ్యం అలవడ్డాయి .మనోహర కావ్యనిర్మాన నైపుణ్యం ఉభయ భాషల్లోనూ ఇరవై ఏళ్ళకే పట్టు బడింది .

శాస్త్రి గారు కౌముది పాఠ ప్రవచనం లో ఉద్దండులని దేశమంతా మార్మోగింది .తెలుగులోనూ సమానమైన పాండిత్య గరిమ ఉంది .విస్పష్టంగా బోధించే సామర్ధ్యమూ ఉన్నది .ఆంద్ర ప్రబంధాలు రూపకాలు రచించే నేర్పు వచ్చేసింది .ఉర్లాం సంస్థానం లో రాజా మంత్రి ప్రగడ భుజంగ రాయుని ఆస్థాన పండితులయ్యారు .

సంస్కృతం లో అహోబల పండితీయం కు తెలుగులో వ్యాఖ్య రాశారు .లఘుకౌముదిని ఆంధ్రీకరించారు .వసుచరిత్రకు భూమిక రాశారు .సంస్కృతం లో ముక్తావళి అనే రూపకం ,శంబరాసుర విజయం అనే చంపువు ,శ్రీరామ విజయ చంపువు ,రాశారు .స్వీయ తెలుగు కృతులు –కాళిందీపరిణయం,చిత్ర సీమ ,జగన్నాధ క్షేత్ర మహాత్యం ,మల్లికా ,శంతనూపాఖ్యానం ,శివరామ శతకం ,శ్రీ రామ స్తవం  ముక్తావళి నాటకం ,శ్రావణ మహోత్సవ తారావళి .అరవై అయిదేళ్ళు జీవించి భద్రాద్రి రామ శాస్త్రి గారు 1915లో శ్రీరామైక్యమైనారు .

 

122-పండిత ప్రవర –మల్లాది రామ కృష్ణ చయనులు

1885లో మల్లాది రామ కృష్ణ చయనులుగారు గుంటూరు జిల్లా సత్తెన పల్లి లో వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో రాఘవయ్య ,అచ్చమ్మ  దంపతులకు  జన్మించారు .వీరిని హైదరాబాద్ వాస్తవ్యులు దత్తతకు స్వీకరించగా అక్కడ పార్శీ ఉర్దూలను నేర్చుకొన్నారు .గోరంట్లకుతిరిగి వచ్చి సంస్కృత భాష నేర్చారు .కావ్యాలు చదివి అమలాపురం వెళ్లి ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యం నాటకం సాహిత్యం అభ్యసించారు .పేరూరు లో మందా చెన్నయ్యగారి నుండి తర్కం నేర్చారు .పేరి నరసింహ శాస్త్రి గారి వద్ద వ్యాకరణం శ్రీపాద రామ మూర్తి శాస్త్రి గారి దగ్గర ,విజయనగరం లో భీమాచార్యుల వారి దగ్గర తర్కాన్ని మెరుగు పరచుకొన్నారు .ఇరవై రెండవ ఏటనే వాదాలు చేసి పండితులను గెలిచే సామర్ధ్యం పొందారు .అమరావతికి చెందిన గుడి మెళ్ళ వెంకట సుబ్బయ్య గారి కుమార్తె కృష్ణ వేణమ్మను పెండ్లాడారు  .

ఇరవై నాలుగో ఏట మైసూర్  వెళ్లి పజమాని సుందర రామ శాస్త్రి గారి వద్ద  బ్రహ్మ సూత్రా శంకర భాష్యాన్ని చదివివారు. అప్పయ్య దీక్షితులకు తోమ్మిదవ తరం వారైన త్యాగరాజ శాస్త్రి దగ్గర ,కల్ప తరువు ,వ్యుత్పత్తి వాద  వాచాస్పత్యాది గ్రంధాలు చదివారు .

విజయవాడలో నివాసం ఉన్నారు .ముప్ఫై ఆరవ ఏట తిరువయ్యూర్  వెళ్లి స్థల పురాణం బాల కృష్ణ శాస్త్రి గారి వద్ద ఉపనిషద్ భాష్యం  మొదలైనవి నేర్చుకొన్నారు పుష్పగిరి ,హంపి విరూపాక్ష పీఠాలకు ఆస్థాన పండితునిగా నియమింప బడ్డారు .వైదిక  కర్మాను స్టానం వీరు యదా విధి గా పాటించారు .అమరావతిలో జ్యోతి స్టోమం ,బెజవాడలో చయనం చేశారు .అప్పటి నుండి  రామ కృష్ణ చయనులు అయ్యారు

వేదాంత విషయాలను అతి సూక్ష్మగా సూటిగా తేలికగా అర్ధం అయ్యేట్లు చెప్పగల సామర్ధ్యం చయనులుగారిది .మహా వక్తగా విఖ్యాతి పొందారు .వేదాంత ప్రవచనానికి కాశీ పండితులు మెచ్చుకొని  ‘’పండిత ప్రవర ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .పంజాబు రాష్ట్రం లో సంచారం చేసి అక్కడి వారిని మెప్పించి ‘’వ్యాఖ్యాన వాచస్పతి ‘’బిరుదును అందుకొన్నారు .బాల బోధిని ,భ్రమ మంజరి అనే వేదాంత గ్రంధాలను సంస్కృతం లో రచించారు .ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంధాలనూ మహా భారత కదా తత్వ నిర్ణయం ‘’అనే గ్రంధాన్ని చయనులు గారు రచించారు .డెబ్భై ఆరేళ్ళు జీవించి రామ కృష్ణ చయనులుగారు 1941లో స్వర్గం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 – 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80

120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా దిగ్గజాలైన సంస్కృతాంధ్ర కవి పండితులే ,శాస్త్ర నిధులే .ఏడు తరాలకు పూర్వం వీరి వంశం లో మోటప్ప ఆనే ఆయనకు ‘’పల్లెలాంబ ‘’అనే గ్రామ దేవత ప్రత్యక్షమై బంగారు ,పలకా బలపం ఇచ్చి ఆ వంశం లో ఏడు తరాల వరకు అందరూ పండితులే అవుతారని దీవించిందిట .శాస్త్రిగారి భార్య సుబ్బమాంబ .అత్తా కోడళ్ళది ఒకే పేరు అవటం విశేషం .

బాల విద్యా కిశోర

నాలుగవ ఏట వీధి బడికి పంపించారు అ రోజు సాయంత్రమే ఉపాధ్యాయ్డు ఈ బాలుడిని వెంట బెట్టుకొని ఇంటికి వచ్చి తండ్రిగారితో తనకు వచ్చిన విద్య నంతా ఒక్క రోజులోనే ఆ బాలుడు నేర్చేసేడని,ఇక తానూ బోధించటానికి ఏమీ లేదని చెప్పి అప్పగించాడు .అంతటి బాల మేధావి శాస్త్రిగారు .  తండ్రి వెంకట రామ శాస్త్రులుగారి దగ్గరే నాకాంతక సాహిత్యం ,తత్వ బోధినీ వ్యాఖ్యాన సహితం గా కౌముదిని ,న్యాయ వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు .తండ్రిగారి వెంట గద్వాల ,వనపర్తి ,ఆత్మకూరు సంస్థానాలను బాల్యం లోనే దర్శించి  తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి పండిత బృందం చే మెప్పు పొంది ‘’భారతీ బాల లీలా రూపుడు ‘’అనే బిరుదు పొందారు .

సకల శాస్త్రాభిజ్నులు

తండ్రిగారి మరణం తర్వాత గడేహోతూరు వెంకట రామ శాస్త్రులు గారి వద్ద శిష్యరికం చేసి జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .కాళహస్తి చేరి విక్రాల  రాఘవాచార్యుల అంతేవాసి అయి మహా భాష్యంత వ్యాకరణం ,ముహూర్త జాతక సిద్ధాంత స్కంద త్రయ జ్యోతిష శాస్త్రాలలో సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులైనారు .గురువు రాఘవాచార్యు లవారు’’కన్ను స్వామి ‘’అనే మారు పేరుతొ ‘’indian Ephimeries రాశారు .గురువు గారి అనుమతితో కలియుగం దశ సహస్ర వర్షాల(పది వేల సంవత్సరాలు )కు సరిపడా  తిది ,వార ,నక్షత్ర ,యోగ ,కరణ ,ఘటికా ,విఘటికల ప్రమాణాన్ని అతి వేగం గా అత్యంత సులభం గా బోధించే మహా గ్రంధ రాజం ‘’ఖచర మణి పేటి’’‘’అనే బృహత్తర పంచాంగం రచించి జ్యోతిషం లో కొత్త దారి చూపారు .గురు ఆశీస్సులతో కాళహస్తి దేవాలయం లో నిష్టగా కూర్చుని ‘’శని వర్గు ‘’గుణిస్తుంటే శనీశ్వరుడు ప్రత్యక్షమై నాడు . ఈ గ్రంధాన్ని గురుదేవులకు  అంకిత మిచ్చి  తన గురు భక్తిని చాటుకొన్నారు .శాస్త్రి గారి తమ్ముడు రామ శాస్త్రిగారు గొప్ప సూర్యోపసకులు .సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండుగంటల వరకు సూర్యుని తదేకం గా చూస్తూ ధ్యానమగ్నులై ఉండేవారు .మన శాస్త్రిగారి లాగానే ఆయనా త్రికాలజ్ఞాని .

స్వగ్రామం ఆలూరు కు తిరిగి వచ్చి తాతగారైన సుబ్బా శాస్త్రుల వారి వద్ద సమగ్ర వేదాంత శాస్త్రం నేర్చుకొని ఇరవై వ ఏట విద్యా వ్యాసంగాన్ని ముగించారు .ఇంత పిన్న వయసులో ఇన్ని విద్యలు నేర్వటం ,అన్నిటా ప్రతిభ చూపటం శాస్త్రి గారి ప్రత్యేకత .బళ్ళారి ,కడప వగైరా సంస్థానాలు పర్యటించి  శతావదానాలతో మెప్పించి సన్మానాలు పొందారు .గద్వాల ,వనపర్తి ,ఆత్మ కూరు సంస్థానాలలో తన పాండిత్య ప్రదర్శన తో ఆకర్షించి గౌరవ సత్కారలందు కొన్నారు .

బిరుదులు –సన్మానాలు

కవి సార్వ భౌమ ,సకల శాస్త్రాభిజ్న బిరుదులూ వీరి కవితా ప్రాగాల్భ్యానికి సకల శాస్త్ర పారంగత్వానికి పొందారు .శాస్త్రి గారు ‘వాసు దేవా నంద ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రచిం చారు .కాని ఇది ముద్రితం కాలేదు కాని ఇది చిత్ర ,విచిత్ర కవితా భాండారం .ఇందులో అమితాస్చార్యపరచేది ‘’సహస్ర దళ పద్మ బంధం ‘’1008దళ పద్మంలో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వ సృష్టి .అయిదు వందల శ్లోకాలతో పదహారు ప్రకరణాలతో ఉన్న అపూర్వ గ్రంధం ఇది .ఇందులో ఉన్న నూరు శ్లోకాలతోనే గ్రంధం ప్రచురింప బడింది .దీనిని నలభై రోజుల్లో శాస్త్రిగారు రాశారంటే అమితాస్చర్యం వేస్తుంది ..వివిధ ఛందస్సులతో ‘’పురుషోత్తమ శతకం ‘’రాశారు .’ధర్మ శాస్త్ర రాత్నాకరమూ రాశారు .’పతంజలి భాష్యార్ధం అనే గోప్పరచనా చేశారు .

దీర్ఘ సత్ర యాగం

శాస్త్రి గారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరు లో ఒక ఏడాది పాటు ‘’దీర్ఘ బ్రహ్మ సత్ర యాగం‘’నిర్వ హించారు .వందలాది పండితులు ,రాజులు ,మంత్రులు  ధన వంతులు ,వేలాది మంది పేదలకు కుల  మత భేదం లేకుండా  అన్న సంతర్పణ జరిగింది .అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీ విరూపాక్ష స్వామి కలలో కన్పించి’’అవబ్రుధ స్నానం ‘’కాశీ లో చేయమని ఆజ్ఞా పించాడు .బంధు జనం తో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తి గా నిర్వహించి ప్రయాగ ,గయాది క్షేత్ర సందర్శనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు .

జగద్గురువుల ఆశీః ప్రశంస

.జ్యోతిష శాస్త్ర సుధర్మ సారం ‘’అనే మరో గ్రందాన్నీ రాశారు .ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలమైన కర్నాటక దేశం లోని ‘’కాలడి ‘’గ్రామం లో శృంగేరీ పీఠాదిపతులు శ్రీ నృసింహ భారతీ తీర్ధ స్వాములవారు శంకరా చార్యుల విగ్రహ ప్రతిష్టచేసినప్పుడు జరిగిన పండిత సభలో శాస్త్రి గారు తాను  రచించిన ‘’జ్యోతిష శాస్త్ర సుధర్మ సార’’గ్రంధాన్ని మహా స్వాములకు అంకితమిచ్చారు .ఆ సభలో  జగద్గురువులు ఆ గ్రంధం లోనుండి 2000సంవత్సరంలో స్వామివారు అడిగిన తిదికి పంచాంగ గణన చేయమని సభాసదులను కోరారు .చాలా మంది చెప్పలేమని చేతులెత్తేశారు. కొందరు కనీసం మూడు గంటల వ్యవదికావాలన్నారు .అప్పుడు మల్లికార్జున శాస్త్రి గారు ఇరవై నిమిషాలలో గణన చేసి స్వామివారితో సహా అందరినీ ఆశ్చర్య పరచారు . వీరి విద్వత్తును అభినందించి జగద్గురువులు ‘’పండిత సార్వ భౌమ ‘’బిరుద ప్రదానం చేసి సత్కరించారు .అప్పుడు జగద్గురువులు ‘’ఉపాధి భేదం చేత మీరు అక్కడ .మేము ఇక్కడ .మీరేమేము .మేమే మీరు ‘’అని ప్రశంసించారు .

శాస్త్రి గారి మహిమలు

గద్వాల రాజు రాంభూపాల్ మరణించగా  సంస్థానం పదేళ్లు ‘’కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ‘’ లో ఉంది .అప్పుడు వారసుడైన సీతా రాం మల్లి కార్జునుని శరణు వేడాడు .ఈయన ఏడాది గడువు పెట్టి ,హంపీ విరూపాక్షునికి‘’అగ్ని స్టోమ ,కోటి బిలార్చన చేయ సంకల్పించి అందరి సహకారం తో ఆ పని పూర్తీ చేశారు .గడువు లోపలే సీతా రాం కు గద్వాల రాజ్యం దక్కింది .

ఒక సారి యవ్వనం లో శాస్త్రి గారు ఎండలో నడిచి వస్తున్నాడు .ఒక పేద రైతు కనిపించి వర్షాలే లేవని కరువు తో జనం అలమటిస్తున్నారని చెప్పాడు .’’పెద్ద వర్షం వస్తుంది .ఇంటికి పో ‘’అన్నారు శాస్త్రి .అంతే కుండ పోత గా వర్షం కురిసింది .ఇంకో సారి స్వగ్రామం బయట ఏటి ఇసుక లో  ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతం గా వర్షం కురిసి ఇసుకలో శాస్త్రి గారు కూరుకు పోయారు  .కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండి పోయింది .మంచి నీటి కోసం చలమలు తవ్వు తుంటే శాస్త్రి గారు పద్మాసనం లో అలానే చలించ కుండా కని పించారు .ఏదైనా మహిమ చూప మని ఒక శిష్యులు  అడిగితే ‘’ఒక శివా లయం లో నాలుగు స్తంభాల మద్య శివుడికి ఎదురు గుండా కూర్చొని కనులు మూసు కొని ఒక్క సారిగా శరీరాన్ని గాలి లోకి లేపి, ఆ స్తంభాల మద్య చుట్టూ  వేగం గా గిర గిరా తిరిగి  ,మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు .

 

మరో సారి మల్లేశ్వరాలయం లో బావ మరది దోనే కంటి రామయ్య భాగవతం లో ‘’పురంజనో పాఖ్యానం‘’చదువు తుంటే శాస్త్రి గారు ఆధ్యాత్మ పరం గా వ్యాఖ్యానం చేస్తున్నారు .పూర్తీ అవగానే రామయ్య‘’అంతేనా బావా?’’అన్నాడు .శాస్త్రి గారు ‘’అంతేరా’’అన్నారు .అంతే- రామయ్య వెంటనే లేచి భుజం పై ఖండువా దులిపి  మళ్ళీ బుజం మీద వేసుకొని అదే పోత పోయాడు .తల్లీ, శాస్త్రి  భార్యా మొత్తు కొన్నావెను తిరిగి చూడ లేదు ‘’’’వాడిక రాడు లే అంతే ‘’అని వారికి సమాధానం చెప్పారు  శాస్త్రి .అంటే ఆత్మ బోధ అయిందన్న మాట బావ మరది కి .

శాస్త్రి గారి లీల ఇంకోటి .గద్వాల రాజు మూడు రోజుల పండిత గోష్టి లో ఉండగా ఒక రోజు   నిజాం  ప్రభువు తాను రాయ చూరు వస్తున్నానని తనను అక్కడ కలుసు కోమనిరాజుకు  ఫర్మానా పంపాడు .ఏమి చేయాలో తోచక శాస్త్రి గారిని అడిగాడు రాజు .కంగారేమీ పడక్కర లేదని నిజాం  రాడనీ  రేపే ఆవిషయం తెలుస్తుందని చెప్పాడు ఇరకాటం లో పడ్డాడు రాజు .అనుకోన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చే సరికి కడుపు నొప్పి ఎక్కువై హైదరాబాద్ తిరిగి వెళ్లి పొయ్యి నట్లు మర్నాడు వార్త వచ్చింది .అంతటి వస్య వాక్కు శాస్త్రి గారిది .

1917 లో అలుకూరు గ్రామం లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించింది .శాస్త్రి గారు మల్లికార్జున పుష్కరిణి ని  ‘’అష్ట దిగ్బంధం ‘’చేసి .ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు .’’మారికా దేవి‘’ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికి రాదనీ అది తనకే నష్టం అనీ చెప్పింది .అందర్నీ ధర్మవరం పంపించి ,తానొక్కడే ఆ ఊర్లో ఉండిపోయారు ..గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించే శాడు .తాను కుటుంబం తో తుంగ భద్రా నది ఒడ్డున ఉన్న రామా పురం వెళ్లారు .శాస్త్రి గారికి ప్లేగు సోకింది .కుండ పోతగా వర్షం కురుస్తోంది .ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు .శాస్త్రి గారికి సమయం లో వైద్య సాయం అంద లేదు .అంతే 5-9-1917 నాడు చని పోయారు .ధర్మ వరం లో ఉన్న అల్లుడు శ్రీని వాస శాస్త్రి  టెలిగ్రాం చూసి వచ్చాడు .అప్పటికే ఆలస్య మై పోయిందని శవ దహనం చేశారు .చితా భస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకు పోయింది .చితా భస్మం కూడా మిగుల కుండా చేసి ,నలభై ఆరేళ్ళ  వయసులో చని పోయిన మహా జ్ఞాని కవి ,పండిత సార్వ భౌములు అలుకూరు గొల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు

.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే–డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే

  • – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం
  • 08/12/2014
TAGS:

దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. ఇంతకాలం పాటు వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత చరిత్రను, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరులు, యోధుల గాధలను, కవులు, రచయితల రచనలను పాఠ్యాంశాలలో చేర్చాల్సి ఉంది. అదే సమయంలో జాతికి నీతినీ, రీతినీ బోధించిన రామాయణ, భారతాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పదవ తరగతి తెలుగు ఉపవాచకంగా సులభశైలిలో ఉన్న వచన రామాయణాన్ని బోధిస్తున్నారు. పునస్సమీక్షలో దీనిని ఉంచుతారో లేదో అన్న అనుమానాలు విద్యావేత్తలలోనూ, విద్యాభిమానుల్లోనూ పొడసూపుతున్నాయి. ప్రాథమిక పాఠశాల నుండి పి.జి. వరకు వివిధ స్థాయిలలో ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా, అధ్యాపకుడిగా పనిచేసిన నా ముప్ఫయి ఏళ్ల బోధనానుభవంలో రామాయణ, భారత కథాంశాలను బోధిస్తున్నప్పుడు విద్యార్థులు అత్యంత ఆసక్తితో వినడంతోపాటు అభ్యాసన ప్రక్రియలో క్రియాశీలంగా స్పందించడం చూశాను. అందుకే ఇతిహాసాలు పాఠ్యాంశాలుగా ఉండాలన్న ధృఢమైన అభిప్రాయం అనేకమంది విద్యావేత్తలలో ఉంది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ తానూ ఎనిమిదవ తరగతిలో చదివిన మహాభారత పద్యాన్ని పలు సభలలో ప్రస్తావించి, తానూ గొప్ప వక్తగా ఎదగడానికి సాహిత్యం ఎలా దోహద పడిందో చెబుతుంటారు. ఇది బాల్యంలో విద్యార్థి చిత్తక్షేత్రాలలో పడే సంస్కార బీజాలు వారి జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి ఇతిహాసాలు పురాణాలూ కావు, మతగ్రంథాలు అంతకంటే కావు. అవి జాతికి తరతరాల వారసత్వ సంపదగా నిలుస్తున్న తరగని నిధులు, ఎన్నటికీ చెరిగిపోని మానవతా మహోదధులు, సి.జి.యూంగ్ లాంటి ప్రపంచ ఖ్యాతి చెందిన మనస్తత్వ శాస్తవ్రేత్త ఇతిదిహాసాలు ఒక తరం నుండి మరో తరానికి సహజంగా వ్యాపిస్తాయని పేర్కొనడం వాటికున్న ప్రాధాన్యతకు అద్ధం పడుతుంది. భారతీయ సాహిత్యంలో రామాయణ, భారతాలు ఇతిహాసాలుగా బహుళ ప్రజాదరణను పొందాయి. తెలుగు సాహిత్యంలో మార్గదేశీ పద్ధతులతో పాటు వౌఖిక ప్రచారంలో కూడా విస్తృతంగా రామాయణ గాధలు కనిపిస్తాయి. భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలు మార్గ పద్ధతిలో వస్తే రంగనాథ రామాయణం వంటి ద్విపద రచనలు దేశీ పద్ధతిలో వచ్చాయి. జనప్రియ రామాయణం, ఉషశ్రీ రామాయణం విశేష ప్రజాదరణ పొందిన విషయం అందిరకీ తెలిసిన సత్యమే. ఇవేకాక ఇంకా అక్షరబద్ధం కాని రామాయణ సంబంధ కథలు గిరిజనులలో వౌఖిక ప్రచారంలో విరివిగా కనిపిస్తాయి. జానపద బాణీలో విదువౌళి శాస్ర్తీ వెలువరించిన తందనాన రామాయణం తెలంగాణ ప్రాంతంలో విశేష ప్రజాదరణ పొందింది. సుమారు ముప్ఫయి ఏళ్ళ క్రితం రేడియోలో ప్రసారమైన ఎమ్మెస్ రామారావు సుందరకాండ ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతోంది. అందుకే ఈనాటికీ రామాయణం ఎంత పరిశోధించినా తరగని గనిగా నిలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ లాంటి రాజకీయవేత్త కన్నడ సాహిత్యాన్ని అధ్యయనం చేసి రామాయణ మహానే్వషణం వంటి పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించడం పరిశోధనా రంగంలో ఈ ఇతిహాసానికున్న ప్రాధాన్యతను తెలుపుతోంది.
తెలుగు సాహిత్యంలో మొదటి జ్ఞానపీఠ పురస్కారం కవిసామ్రాట్ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షానికి లభిస్తే, కన్నడ సాహిత్యంలో కూడా సుప్రసిద్ధ పండితులు కె.వి.పుట్టప్ప రచించిన రామాయణ దర్శానానికే లభించడం రామగాధకు ఉన్న సార్వాకాలీనతకు ఉదాహరణగా చెప్పవచ్చు.
రామాయణం సార్వకాలికమైన, సార్వజనీనమైన మానవీయ విలువలు ప్రబోధించిన విశ్వమానవ మహేతిహాసం. ఈనాటికీ భారతీయులలో అత్యధుకులు రాముడిలాంటి కొడుకు, సీతాలాంటి భార్య కావాలని కోరుకుంటారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం కలలుగన్నది రామరాజ్యం కోసమే గదా! రామాయణం మనిషి మనీషిగా ఎదిగే మార్గాన్ని చూపించింది. ఆదర్శవంతమైన జీవన విధానాన్ని నిర్దేశించింది. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ హితమే మిన్న అని బోధించింది. స్వర్గం కన్నా జన్మభూమినే మిన్నగా చూపించింది. బంగారు లంకను కోరుకోవడం కన్నా కన్న నేల ఋణం తీర్చుకోవడమే గొప్ప అన్న సందేశాన్ని జాతికి అందించింది. ఏక పత్నీవ్రతమే శ్రేష్టమని ఎలుగెత్తి చాటింది. మహిళలను అవమానించినా, చెర పట్టాలని చూసినా ఎంతటి వారికైనా పతనం తప్పదని హెచ్చరించింది. జాతి హితం కోసం, దేశ క్షేమం కోసం అల్పజీవులు సైతం ఎలా సహకరించి వచ్చో ఉడుత, జటాయువు, సంపాతి వంటి సజీవ పాత్రల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించింది.
విచ్చలవిడి శృంగారం అనర్థ హేతువని వేలకోట్లు ఖర్చుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. సమాజంలో నానాటికీ నైతిక విలువలు లోపిస్తున్నాయన్న భావన సర్వత్రా కనిపిస్తోంది. పాశ్చాత్య విష సంస్కృతీ ప్రభావం, మీడియా, అంతర్జాలాల ప్రభావం పిల్లలను చెడు దారి పట్టిస్తున్నాయన్న వార్తలు విరివిగా వస్తున్నాయి.
మహిళలకు రక్షణ కొరవడిందన్న అంశాన్ని పత్రికలలో వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. ఇటీవల మన ముఖ్యమంత్రి మహిళా రక్షణ కోసం హైపవర్ కమిటీ వేసి అధ్యయనం కూడా చేయించారు. ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు ఏక పత్నీవ్రతం ప్రబోదించిన రామాయణ గాధను ఉత్తర కౌమార దశలో ఉన్న విద్యార్థులకు బోధించడం ఎంతో ప్రయోజనకారి కాగలదు. పర స్ర్తిని తల్లితో సమానంగా చూడాలని సందేశమిచ్చిన రామాయణం, చెడు తలపెడితే సోదరున్ని అయినా సరే వదిలిపెట్టి ధర్మం పక్షాన నిలబడి పోరాడాలని చెప్పిన గాధను వివిధ స్థాయి విద్యార్థులకు పద్య, గేయ, వచన రూపాలలో అందించవలసిందే. తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్, పేదల పక్షాన నిలిచి పోరాడిన కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి వంటి మేధావులు, యోధులు, త్యాగధనుల చరిత్రలు ఎంత ముఖ్యమో, విశ్వమానవాళి మహేతిహాసంగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడిన రామకథ కూడా అంతే ముఖ్యం. అంతేకాకుండా తెలంగాణ ప్రజానీకానికి భద్రాచల రాముడితో, రామదాసు కథతో ఎంతో భావాత్మక సంబంధం ఉంది. నవాబుల కాలం నుండి భద్రాచలంలో జరిగే రామకల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపే సంప్రదాయం ఈ ప్రాంత మతసామరస్యానికి ప్రతీకగా చెప్తారు. తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడి ప్రజలు భద్రాచల రాముడిని దక్కించుకోవడానికి ఏ రకమైన భావావేశంతో పోరాడారో అందరికీ తెలుసు.
రామాయణం ఒక నీతి, రామాయణం జన జీవన రీతి. ప్రపంచీకరణ క్రమంలో వెర్రితలలు వేస్తున్న వింత పోకడల నుండి భావితరాన్ని రక్షించే రక్షణ కవచం. అందుకే రామాయణాన్ని పదవ తరగతి ఉపవాచకంగా కొనసాగించాలని ఎస్.సి.ఆర్.టి.కి ఒక విజ్ఞప్తి చేయడంతోపాటు ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే
ఈ ఏడాది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్‌, రచయిత అయిన అతుల్‌ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు లభించింది. ఆధునిక వైద్యంపై అతుల్‌ రాసిన ‘బీయింగ్‌ మోర్టల్‌: మెడిసిన్‌ అండ్‌ వాట్‌ మేటర్స్‌ ఇన్‌ ది ఎండ్‌’ పుస్తకం నాన్‌ ఫిక్షన్‌ విభాగంలో రెండో స్ధానం సాధించింది. ఈ పుస్తకం వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఈ ఏడాది ఎంపిక చేసిన అత్యుత్తమ 10 పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన షాపింగ్‌లో ఈ పుస్తకాన్ని ఇష్టపడి మరీ కొనటం విశేషం. ఇక బుధవారం విడుదల అయిన రామచంద్ర గుహ తాజా రచన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’ మరో ప్రముఖ రచనగా నిలిచింది. కవిత్వ విభాగంలో ఢిల్లీకి చెందిన అఖిల్‌ శర్మ పుస్తకం ‘ఫ్యామిలీ లైఫ్‌’ ఉత్తమ రచనల్లో ఒకటిగా నిలిచింది. కళ, సాంకేతికత మధ్య సంబంధాన్ని హృద్యంగా వర్ణించిన ‘గీక్‌ సబ్‌లైమ్‌: ద బ్యూటీ ఆఫ్‌కోడ్‌, ద కోడ్‌ ఆఫ్‌ బ్యూటీ’ పుస్తక రచయిత విక్రమ్‌ చంద్ర కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ రచనకు ఆయన 1996లో కామన్‌వెల్త్‌ రచయితల బహుమతి పొందారు. ఈ జాబితాలో రచయిత, పాత్రికేయుడైన ఆనంద్‌ గోపాల్‌ అఫ్గానిస్థాన్‌లో అమెరికా యుద్ధంపై రాసిన పుస్తకంతో బాటు 9/11 ఘటన ఆధారంగా కాలమిస్ట్‌, పేరొందిన రచయిత ఆనంద్‌ గిరిధర్‌రాసిన పుస్తకాలకూ చోటు దక్కింది
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెరుకు ,ఆవరణ కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బోయలె తోలి తెలుగు చోళులు -భీమనాధుని శ్రీనివాస్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివాదాస్పదుడు యు ఏ అనంతమూర్తి -నందన రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

216అడుగుల రామానుజా చార్య విగ్రహం ,మరో విజయవంత క్షిపణి ప్రయోగం ,జాతీయ గ్రంధం గా భగవద్గీత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

           అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు 
            మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు
             అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు 
             సంస్కారానికీ అవుతుంది పెట్టుకొంటే  హిట్టు . 
             గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు
Posted in కవితలు | Tagged | Leave a comment