నూతన సంవత్సర ,సంక్రాంతి ,మన్మధ ఉగాదులకు శుభాకాంక్షలు -పద్య రూపం లో అందజేస్తున్నారు-శ్రీ పంగులూరి హనుమంతరావు శ్రీ యల్లాప్రగడ ప్రభాకర రావు

2015 sankranti manmadha greetings 001

Posted in కవితలు | Tagged | Leave a comment

సమగ్ర విమర్శకుడు -రాచపాళెం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ కారణజన్ముడి జీవితకథ- – వంశీ

ఓ కారణజన్ముడి జీవితకథ

Sakshi | Updated: December 22, 2014 03:34 (IST)
ఓ కారణజన్ముడి జీవితకథ

అందుకే… అంత బావుంది!
నటీనటులు: ఎఫ్. ముర్రే అబ్రహం, టామ్ హల్క్, ఎలిజబెత్ బెరిడ్జె, సైమన్ కలౌ తదితరులు.
కెమెరా: మిరోస్లవ్ ఆండ్రిక్, దర్శకుడు: మిలాస్ ఫోర్‌మేన్,నిర్మాత: సౌల్ జీంట్జ్, విడుదల: 1984 సెప్టెంబర్ 19 సినిమా
నిడివి: 161 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 18 మిలియన్ డాలర్లు (దాదాపు  113 కోట్ల రూపాయలు),
వసూళ్లు: 51.97 మిలియన్ డాలర్లు (దాదాపు 327 కోట్ల రూపాయలు)

ఇళయరాజాగారు తన జీవితంలో చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఈ ‘ఎమేడియెస్’. ‘‘నువ్వూ చూడు’’ అన్నారు నాతో. నా అభిమాన దర్శకుడు మిలాస్ ఫోర్‌మెన్ తీసిన అద్భుతమైన సృష్టి ఇది. ఆరు సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ వందల ఏళ్లనాటి వాతావరణంలోకి నన్ను తీసుకెళ్లిపోయారు. ఆనాటి వేష భాషలూ, కట్టుబాట్లూ – అన్నీ నా కళ్ల ముందు బొమ్మకట్టాయి. ఆ తర్వాత మొజార్ట్‌కి అభిమానినైపోయి అతని సింఫనీలు చాలా విన్నాను.

ఇళయరాజాకి ఈ సినిమా అంతగా నచ్చడానికి కారణం… ఇదొక మ్యూజికల్, మనసును మా గొప్పగా పట్టేసుకున్న మొజార్ట్ కేరెక్టర్. పదిహేడు వందల ఏభై ఆరులో ఆస్ట్రియాలో సాల్జ్‌బర్గ్ అనే టౌన్లో పుట్టి పదిహేడువందల తొంబై ఒకటిలో ఆ దేశానికి కేపిటల్ అయిన వియన్నాలో కేవలం ముప్ఫై రెండేళ్లు మాత్రమే బతికి, చనిపోయిన గ్రేట్ కంపోజర్ మొజార్ట్ ఆత్మకథ ఈ ‘ఎమేడియెస్’ సినిమా. ఆ కాలంలో బెతోవెన్, బాక్, మొజార్ట్ ఉన్నట్టే మన సౌత్‌లో ముగ్గురు వాగ్గేయకారులుండేవారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్.

ఇక మొజార్ట్ ఆత్మకథ సినిమాగా తీయబడిన ‘ఎమేడియెస్’ సినిమా విషయానికొస్తే… పీటర్ షాఫర్ రాసిన స్టేజ్‌ప్లేను స్క్రీన్‌కి అనువదిస్తే, అమెరికాలో సెటిలయిన జెకోస్లోవేకియా వాడయిన ప్రొఫెసర్ మిలాస్ ఫోర్‌మేన్ డెరైక్ట్ చేశారు. మొజార్ట్ వేషాన్ని టామ్‌హల్క్ అద్భుతంగా చేస్తే, అంతకంటే అద్భుతంగా శైలోరి కేరెక్టర్ని ముర్రే అబ్రహమ్ చేశాడు. చాలా ప్రతిభగలవాడయిన మొజార్ట్‌ను చాలా జెలసీతో చూస్తూ ఇంకో పక్క నుంచి ఆరాధించే సాటి మ్యూజీషియన్ కేరెక్టర్ అతన్ది. సినిమా టైటిల్స్‌లో మొదట ముర్రే అబ్రహమ్ పేరే వేశారు. అలా వేయడం చాలా సబబు. ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా కంపోజ్ చెయ్యలేదు. ఆనాడు మొజార్ట్ రాసిన సింఫనీలు, సొనాటోలూ, శాంటాటాలు, ఒపేరాలు పేర్లల్ చేశారు. మ్యూజిక్ డెరైక్టర్ లేని ఈ సినిమాకి ద గ్రేట్ సర్ నేవిల్లే మారినర్ కండక్టర్‌గా వ్యవహరిస్తూ సూపర్‌వైజ్ చేశారు.

ఇక కథ విషయానికొస్తే… క్రిస్టొఫ్ ఓల్ఫ్‌గేంగ్ ఎమేడియస్ మొజార్ట్ అతని అసలు పేరయితే… ఉల్ఫీ అనేది ముద్దు పేరు. మూడో ఏట నుంచే సంగీత సాధన చేస్తుంటాడు మొజార్ట్. కళ్లకు గంతలు కట్టి వదిలేస్తే పియానో, వయోలా అత్యంత అద్భుతంగా వాయిస్తుంటాడు. అలా పెరిగి పెద్దవాడయిన మొజార్ట్ ఎనిమిదో ఏట కంపోజ్ చేసిన మొదటి సింఫనీ – ఇ ఫ్లాట్ మేజర్ కె. 16…. ఆఖరి సింఫనీ – సి. మేజర్ కె 551. చాలా పొడుగైన ఆ సింఫనీకి ‘జూపిటర్ సింఫనీ’ అని పేరు పెట్టాడు. శైలోరి అనే అతను రాత్రీ, పగలూ సాధన చేస్తుంటాడు. మామూలు సాధన కాదు రాక్షస సాధన కానీ, సింఫనీలో నాలుగు బార్ల లెంగ్త్ ఉన్న చిన్న ఫ్రేజ్ కూడా పక్కాగా వాయించలేడు. ప్లేయింగ్‌లో ఒక ఫ్లో రాదు.

రాత్రీ పగలనక పిచ్చి పిచ్చిగా ఆకతాయిగా తిరుగుతాడు మొజార్ట్. తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. అలా కలతిరిగి, తిరిగి సడన్‌గా పియానో ముందు కూర్చుని పరమాద్భుతంగా వాయిస్తాడు. ఒకోసారి చేతులు వెనక పెట్టి, కళ్లు మూసుకుని కాళ్లతో వాయిస్తుంటే మహరాజే మతిపోయి చూశాడదంతా. అదంతా చూసిన శైలోరికి బుర్ర పనిచేయడం మానేస్తుంది. జీసస్ ముందుకెళ్లి ‘‘ఇంత సాధన చేసిన నాకు అబ్బని విద్య ఏ కృషీ చెయ్యనివాడికెలా అబ్బుతుంది? అసలు వాడికెలా ఇస్తున్నావ్ అంత టేలెంట్‌ని?’’ అని క్రాస్‌ని ఫైర్ ప్లేస్‌లో పారేస్తాడు.

మొజార్ట్ ఎంత ప్రతిభ గలవాడయినా అతను చేసే పిల్ల చేష్టలకీ, పిచ్చి చేష్టలకీ రాజుగారి ఆస్థానంలో ఎవరూ గొప్పోళ్లా చూసేవారు కాదు. కొందరైతే పట్టించుకునేవారు కాదు. చాలా విచ్చలవిడిగా తిరుగుతూ, తాగుతుండడం వల్ల విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయిన మొజార్ట్ ఆ బాధల్ని మర్చిపోవడానికి మరింతగా తాగడం మొదలెట్టాడు. మొజార్ట్ ఆర్థిక బాధల్ని చూస్తున్న శైలోరి ఆ మొజార్ట్‌కి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసి అతని ప్రతిభను దోచుకోవాలనుకుంటూ ఇంకో పక్క తనకు అన్యాయం చేసిన దేవుడి మీద కక్ష సాధించాలనుకుంటాడు. మారువేషం వేసుకుని మొజార్ట్ దగ్గరకొచ్చిన శైలోరి ‘‘నీ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాను. దానికి ప్రతిఫలంగా నా పేరు మీద ఒక సింఫనీ రాసిపెట్టాలి’’ అన్నాడు.

దానికి సరే అన్నాడు మొజార్ట్. రాత్రీ పగలూ తాగుతా… ఒక అద్భుతమైన సింఫనీ రాసి శైలోరీకిచ్చాడు మొజార్ట్.ఇంకిక్కడ నుంచి మొజార్ట్‌లోని ప్రతిభను వాడుకుంటా, రాజుగారి కొలువులో గొప్ప సంగీతకారుడిగా వెలిగిపోతున్నాడు శైలోరి. అలా వెలిగిపోవడం వెనకాల మొజార్ట్ ఉన్నాడని అక్కడి వాళ్లెవరికీ తెలీదు.మొజార్ట్‌లో ప్రతిభను వాడుకుని ఎదిగిపోతున్న శైలోరి ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా మొజార్ట్‌ను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెడుతా, మానసికంగా చాలా దిగజార్చే ప్రయత్నం చేస్తుంటాడు. మొజార్ట్‌కీ, అతని భార్యకీ మాటామాటా పెరగడంతో కొడుకును తీసుకుని పుట్టింటికెళ్లి పోయింది.

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మొజార్ట్ శారీరకంగా, మానసికంగా చాలా క్షీణించిపోతున్నాడు. ఒకసారి ఒక స్టేజిషో క్లైమాక్స్‌లో పడిపోయిన మొజార్ట్‌ని ఇంటికి మోసుకెళ్లాడు శైలోరి.నీరసంగా మంచం మీద పడిపోయున్నాడు మొజార్ట్.
అది చూసిన శైలోరి మనసు ఆనందంతో గంతులేస్తుంది. నెమ్మదిగా మొజార్ట్ దగ్గర కొచ్చిన శైలోరి, ‘‘చూడు మొజార్ట్! ఇప్పుడు నువ్వు హెల్త్ బాగోక చాలా చాలా బాధపడుతున్నావు. నువ్వు ఈ మంచం మీద విశ్రాంతి తీసుకుంటా కూడా ఒక సింఫనీ రాయొచ్చు… అలా రాయొద్దు. నువ్వు డిక్టేట్ చేస్తుంటే నేను రాసుకుంటాను’’ అని మొజార్ట్‌ను ఒప్పించేడు. ఓ పక్క నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మొజార్ట్ అద్భుతంగా కంపోజ్ చేసి చెప్తుంటే రాసుకుంటున్నాడు శైలోరి.

తెల్లవారుజామున బిడ్డతో పాటు ఇంటికొచ్చిన మొజార్ట్ భార్య దూరంగా చిన్న మంచం మీద శైలోరి పడుకుని ఉండడం చూసి విస్త్తుపోతుంది. తన భర్త టాలెంట్ వీడు దోచుకుంటున్నాడని అర్థం చేసుకున్న ఆమె… చిందరవందరగా పడి ఉన్న కాయితాలు పోగేసి, బీరువా లోపల దాచేసి తాళం వేసి, భర్త వైపు తిరిగేసరికి చనిపోయి ఉన్నాడా మొజార్ట్.అలా వియన్నా నగరంలో వర్షం కురుస్తున్న ఆ ఉదయం పూట కాఫిన్ బాక్స్‌లో పెట్టిన మొజార్ట్ శవాన్ని ఒక అనాథ శవంలా శ్మశానానికి తీసుకెళ్లి, తీసిన గోతిలో ఆల్రెడీ పారేసి ఉన్న శవాల మధ్య ఈ శవాన్ని కూడా వేసి చేటడు ఉప్పేశాడు కాటికాపరి.

కొన్నేళ్ల క్రితం మొన్న కాలం చేసిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రిగాడు, నేను ఆస్ట్రియా వెళ్లినప్పుడు మొజార్ట్ పుట్టిన సాల్జ్‌గర్గ్ వెళ్లాం. ఇరుకైన సందుల్లో ఉన్న ఒక బిల్డింగ్‌లో అతి చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక గదిలో చిన్న ఉయ్యాల, అందులో చంటిబిడ్డ బొమ్మ, గమ్మత్తుగా లైటింగ్ చేశారు. వందల ఏళ్ల క్రితం ఆనాడు అక్కడ పుట్టాడట మొజార్ట్. వేలాది సందర్శకుల మధ్యనున్న మేం చాలా థ్రిల్ ఫీలయ్యాం. ఒక చోట ఆనాటి మొజార్ట్ సింఫనీలని సి.డి.లు చేసి అమ్ముతున్నారు. కొని డిస్క్‌మేన్లో వింటా… ఆ కాలానికెళ్లిపోయాం. ఆ సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ కొత్త కొత్త అనుభూతుల్నిస్తూ కొత్తగానే రాజిల్లుతుంది, విరాజిల్లుతుంది.

ఇంకక్కడినించి ఎక్కడికెళ్లినా మొజార్ట్ పేరే. కేవలం మొజార్ట్ పేరు మీద బతుకుతుందా నగరం… ఎక్కడ చూసినా మొజార్ట్ పేరే.
హోటళ్లు, వైన్ షాపులూ, గన్నులూ, పెన్నులూ, దువ్వెనలూ, గుండుసూదులూ – ఇలా ఒకటేమిటీ… అన్నీ ఆ గ్రేట్ మొజార్ట్ పేరు మీదే!ఆ వైభవం చూస్తా… అందరూ అనుకున్నట్టే మేమూ అనుకున్నాం. ‘‘మనం మామూలు మనుషులం. ఈ మొజార్ట్ ఆ దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన మనిషి… మహామనిషి’’. అలాంటి కారణజన్ముడి జీవిత కథను ఆండ్రిక్ ఫొటోగ్రఫీతో, సెర్నీ ఆర్ట్ డెరైక్షన్‌లో, పిస్టెక్ కాస్ట్యూమ్స్‌లో, ఫోర్‌మెన్ డెరైక్షన్‌లో ఒక అద్భుత కావ్యంగా సృష్టించారు.

పేరొందిన నవ్య చిత్ర దర్శకుడు
చెకొస్లోవేకియాకు చెందిన 82 ఏళ్ళ మిలాస్ ఫోర్‌మేన్ దర్శకుడే కాక రచయిత, స్వయంగా నటుడు కూడా! నవ్యచిత్రాల రూపకర్తగా, ‘చెకోస్లోవేక్ న్యూ వేవ్’ దర్శకుల్లో అతి ముఖ్యుడిగా చరిత్ర కెక్కారు. ఆయన రూపొందించిన ‘ది ఫైర్‌మ్యాన్స్ బాల్’ (1967) చిత్రం ఆయన స్వదేశంలో అనేక సంవత్సరాలు నిషేధానికి గురైంది. మోజార్ట్ మీద తీసిన ఈ ‘ఎమేడియస్’తో పాటు, ‘వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్’ చిత్రానికి కూడా ఆయన ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులందుకున్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులందుకొన్న ఫోర్‌మేన్ కవి కూడా! కవితలు రాయడంతో పాటు ‘మై టు వరల్డ్స్’ పేరిట ఆత్మకథ కూడా రాశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా వ్యవహరిస్తున్నారు.

– వంశీ
ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పారాహుషార్ !పెషావర్ -ఎండ్లూరి సుధాకర్ కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాసం మాస పత్రిక లో కొన్ని కోణంగి విషయాలు

హైదరాబాద్ మోతీనగర్ నుండి హాసం అనే అన్నిరకాల అభిరుచులతో హాస్య మాస పత్రిక కొన్నేళ్ళు నడిచి పాఠకాదరణ లేక ఆగిపోయింది . నడిచినంత కాలం మాత్రం హాస్యం ఏరులై పారింది అందులోనే తనికెళ్ళ భరణి ”ప్రసి ద్ధ సంగీత విద్వాంసుల పై ధారావాహికం గా చాలా మంది మరుగున పడిన విద్వాంసుల గురించి కొత్త కోణం లో రాశాడు .దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ”ఆంద్ర వేద శాస్త్ర విద్యా లంకారులు ”రాసి సరస భారతి ప్రచురణ గా తెచ్చాను  అంత ప్రభావం చూపించింది ఆ శీర్షికా, భరణి రచనా .యెన్నొ సినిమాలలోని మధుర గుళికల్లాంటి పాటలన్నిటిని ఆ పత్రిక వరుసగా ప్రచురించిందని జ్ఞాపకం  అలాంటిఅభిరుచి ఉన్న పత్రిక బతికి బట్ట కట్టక పోవటం మన దురదృష్టం ఽ  ఆంధ్రులు  చేసుకొన్న దురదృష్టం .

     ఇవికాక హాస్యానికి పెద్ద పీట వేసింది హాసం .పేరును నిల బెట్టుకోంది  హాసం పోషకులు ప్రసిద్ధులైన మందులకంపెనీ యజమాని రెడ్డిగారని జ్ఞాపకం .యెమ్బి ఎస్ ప్రసాద్ ,,విఎన్ రామారావు మొదలైన హేమా హేమీలు సంపాదక వర్గం లో ఉన్న జ్ఞాపకం ..కొన్ని సంచికలు చదివాను .కలకాలమ్ దాచుకోదగ్గ మాసపత్రిక హాసం .
          అందులో ”చౌ చౌ చౌరాస్తా ”అనే శీర్షిక లో సరదాఅయినవి ,తమాషా అయినవి ఉండేవి .దాని ఉపశీర్షికలు -1కొంటె క్వేస్చన్లు  -వింత జవాబులు .2-చిలిపి లిపి 3-ఈ రూటే వేరు 4-చిలిపి కవిత 5-షార్ట్ కట్స్ నాకు బాగా నచ్చినవి కొన్ని రాసి జాగ్రత్త  చేసుకొన్నాను .వాటినే  మీ ముందు ఉంచుతున్నాను .  

                         చిలిపి లిపి
-ACDT-ఎసిడిటి
CBRUM-శిబిరం
GOLAW–గోల
                          ఈ రూటే వేరు
కప్పు గంతుల చంద్ర  ప్రకాష్  -Frog jumps Moon light
గాజుల బంగార్రాజు –Bangles golden king
గాలి ఏక దంతం -Air single tooth
                  డబుల్ రోల్
గున్న ఎనుగులాగున్న వాడికి
ఇందిరా?-అది కాలేజీకి పోయిందిరా
                 షార్ట్ కట్స్
ఆలపాటి కుటుంబ రావు –ఆ .కు .
గోవిందరాజు కరుణాకర రావు -గొ.క రా
చింతల పాండు జీవన్ -చిం పాం జీ .
మేడార కుటుంబం –మే.కు.
గోపరాజు చిదంబరం –గో.ఛి.
మాంబళం సంబంధన్ -మాం సం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )

‘’కల్పనా సాహిత్యం లో బలీనమైన ఆకర్షణ ,సామాన్య పాఠకులలో దానికున్న విశేషాదరణ వల్లనే  వల్లనే కధలు రాస్తారు ‘’’’short story is the national art form ‘’.అందుకే కధకు అద్వితీయ గౌరవం కలిగింది.’’అన్న ప్రఖ్యాత కధకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత శ్రీ ముని పల్లె రాజు అన్న మాటలు  నిత్య సత్యాలు .’’కద రాయాల్సింది కలం తోకాదు ,హృదయం తో ‘’అన్న శ్రీపాద వారి మాటలు శిరోధార్యం గా భావిస్తూ ఈ  సంకలనం లోని కధలు అచ్చంగా హృదయం తో రాసినవే అనిపిస్తాయి .’’జీవితాన్ని ప్రేమిస్తే ,దాని అర్ధం తర్వాత అదే తెలుస్తుంది ‘’అని చెప్పిన పెద్దల మాటలకు అద్దంపట్టిన కధలు ఇవి .’’కద ఆకలి లాంటిదే .ఆ ఆకలి తీర్చుకోవటానికే కద రాస్తాడు రచయిత.కొత్త ప్రయోగాలు రావాలి .అవి ప్రజల హృదయాల్లో చొచ్చుకు పోవాలి .

‘’వికలాంగులు తమ ఉనికిని నిల బెట్టుకోనేందుకు చెయ్యాల్సిన  ప్రయత్నాన్ని కాల్పనిక సాహిత్యం ద్వారా ఈ సమాజానికి తెలియ జెప్పాలనేదే నా ప్రయత్నం ‘’అని శ్రీ నాగ రాజు నాకు రాసిన లేఖ  లో తెలియ బర్చారు .తానూ వికలాంగుడే కనుక ,తన లాంటి వారి భావ ప్రకటనలతో ,కదా ప్రక్రియ ద్వారా వారినే వస్తువుగా చేసిన సాహసమే ఈ ప్రయత్నం .వికలాంగు లపై వచ్చిన సాహిత్యం చాలా అరుదుగా ఉన్న కాలం లో   ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’ఆ లోటును భారీగానే భర్తీ చేసిందని పిస్తుంది .ఇందులో పది మంది మహిళలు రాసిన కధలూ ఉన్నాయి .ఇదీ ఒక ముందడుగే .తమ లోని సృజనను వెలువరించే అవకాశమూ వికలాంగు లకు లభించింది .ఇలాగే వికలాంగుల రచనలతో చిన్న నవలలు ,నాటికలు ,కవితలు తీసుకొని వస్తే ఆ సాహిత్యం మరింత పరి పుస్టమౌతుంది .

ఈ కధల్లో ‘’నారేటివ్ ‘’శైలి ఎక్కువ గా ఉంది .బహుశా ఇలాంటి కధలకు ఇది తప్పని సరేమోనని పిస్తుంది . వాచ్యం ఎక్కువైంది .అంటే అన్ని విషయాలు కధకులే చెప్పేయటం జరిగిందని ,పాఠకుల ఊహకు ,ఆలోచనకు అవకాశమే  లేదని అర్ధం ..ఇదే మొదటి మెట్టు కనుక ఫరవా లేదు .తరువాత వచ్చే వాటిలో ఈ మార్పు వస్తే మరింత బాగుంటుంది .అందరు తమ ప్రతిభను పణంగా పెట్టి రాశారు .అందరూ అభినంద నీయులే .శ్రీ మునిపల్లె రాజు గారన్నట్లు ‘’ఏ విషాదమైనా ,మన విషాదమే .విషాదానికి జాతి ,కుల ,మత , జండర్ అనే రంగులు లేవు .ఒక్కటే రంగు –విషాదమే .’’ ఈ విషాదాన్ని అధిగమించే శక్తి ఉన్న కధలే ఇవన్నీ ‘.’’తన దుఖం ,విషాదం ,ఒంటరి తనం రచయితకు మొదటి గురువులు .గురువైనా కొంత దూరమే నడిపిస్తాడు .మిగతా ప్రస్థానమంతా వ్యక్తిదే ‘’అన్న సూక్తికి నిదర్శనలే ఈ కధలు .

వీరందరూ కదా స్వరూపాన్ని కళాత్మకం గా ,వాస్తవంగా చెప్పే ప్రయత్నమే  చేశారు ..’’మన జీవితపు ప్రతి బింబం లాగా వాస్తవిక వాద కద నడవాలి’’ .అలానే నడిచాయి ఈ కధలు .దిగులు ,దరిద్రత ఒంటరితనం ,అభద్రతా,భయం ,ఆందోళన ప్రతి ఫలించిన కధలివి .పరిష్కార మార్గం చూపిన కధలు కూడా .’’పాజిటివ్ అవుట్ లుక్ ‘’ఉండటం వలన జీవితానికి భరోసా నిచ్చాయి .లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాసిన కధలే .శాప గ్రస్తులకు ,బలహీనులకు ఆశావహ మైన భవిష్యత్తును చూపే కధలే ఇవి .

‘’profoundly  personal of all arts ‘’అయిన కధలు చదివి ,భావ స్పూర్తి పొందాలి కాని ,నా లాంటి మూడవ వ్యక్తీ పరిచయం ,ముందుమాట ,వత్తాసు కావాలా?’’అన్న సందేహం ఉన్నా ,ఆత్మీయుడు శ్రీ నాగ రాజు మాట కాదన లేక పోయి రాశాను అంతే.ఈ పాతిక కధలూ చదవండి .అనుభవించండి .వారితోబాటు ఆనందం పంచుకోండి .ధైర్య మివ్వండి .సహవేదన చెంది మానవులం అని పించుకొందాం రండి .

గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎక్స్ రే కవితా పోటీ విజేతల కు పురస్కార ప్రదాన సభ

xray1 001 xray2 001 xray3 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా నటి సావిత్రి కి హాలీవుడ్ నటి ,ఆస్కార్ గ్రహీత -సూసన్ హేవర్ట్ అభిమానం గా రాసినట్లు రాసిన గార్లపాటి పల్లవి ఊహాలేఖ

savitri1 001 savitri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

వికలాంగోపనిషత్

ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే సక లాంగు  లైన వికలాంగులు .వికలాంగ పిల్లలు సద్గుణాలతో సమాజానికి తోడ్పడిత తలిదండ్రులకు అంతకంటే కావల్సినదేముంది ?’’అని ‘ఆణిముత్యం ‘’కధలో విశ్వం ప్రభాకర్ అంటాడు .’’మనవ జీవితానికి కావాల్సిన పరమార్ధం ‘’తృప్తి ‘’.దీన్ని కోట్లు ఖర్చు చేసినా పొందలేం .ప్రతి జీవీ ఇతరులకు ఉపయోగ పడుతుంది .మనిషి మాత్రం తన ఇష్టాల పంట కోసం ఎన్నిటినో బలి తీసుకొంటాడు .’’అని ‘’గమ్యం ‘’లో ప్రసూన శరత్ అంటాడు .’’మా కళ్ళతో మా కలలు కన నివ్వండి ప్లీజ్ .విధికి ఎడురీదగలిగే కెరటాలం మేము .అధైర్యం ఉంటె ముందుకు సాగలేం.విజయాల తీరామ్రుతాన్ని సేవించలేం .’’అంటాడు నరసింహం ‘’చాంపియన్స్ ‘’లో చాంపియన్ లాగా .

‘’అతడే ఒక స్పూర్తి ‘’కదలో ముళ్ళపూడి  ‘’మనిషిని మనిషిగా పుట్టించలేని ఆ బ్రహ్మ ను సృష్టించింది ఎవరో నాకు తెలిస్తే వాడిని ,యా నాలుగు తలల రాక్షసుడిని ఎవరు సృస్తిన్చామన్నారు ?అని అడిగే వాడిని ‘’’’   ఆకాశం లా ఉంటె మేఘమై అలుముకోవాలి,మెరుపై మెరిసిపోవాలి ,ఉరుమై గర్జించి ,,చినుకై వర్షించి పులకింప జేస్తేనే ఆకాశానికి  ఆ గొప్పతనం .నెల వంక వంకరగా ఉందని వెన్నెలను వద్దను కొంటామా ? .ఎదోరకమైన వంకరను కాదు చూడాల్సింది .హృదయంలో వెలుగుల్ని ‘’అన్నాడు.ఘాలి లలిత’’మనో నేత్రం ఉండీ ప్రపంచాన్ని చూడలేని అందునికన్నా ,మనో నేత్రం తో ప్రపంచానికి వెలుగులు పంచెదే వ్యక్తిత్వ పు వెలుగు ‘’అంటుంది .’’సమాజం నిన్ను చూసి జాలిపడితే ఎదిరించే ధైర్యం  కావాలి. ప్రేమకు వైకల్యం లేదు అని చెప్పగలిగే సత్తా ఉండాలి ‘’అంటుంది శివలెంక నాగ లక్ష్మి ‘’కళ్ళున్న ప్రేమ ‘’లో . కమల పాటి వెంకట శాంత లక్ష్మి ‘’తెలివితో ప్రకాశించే ‘’కధలో ‘’నా శరీర లోపం నాతప్పుకాదు .భగవంతుడి తప్పు .సంపూర్ణ ఆరోగ్య ప్రదమైన హృదయంఉంటె చాలు’’ అన్నది. అడవి బాపిరాజు ‘’తిరుపతికొండ మెట్లు ‘’కధలో ‘’ఉడుకు మోతుతనం కాశ్మీర దేశాన్ని ఎడారిగా చేయగల శక్తితో విజ్రుమ్భించింది .జపాన్ వాడు మంచూరియాను ఆక్రమించి చైనా వాడిని తరిమి కొట్టినట్లు బిచ్చగాళ్ళ సంఘం ‘’పున్నెడిని’’ కొండ మీద నించి  నేట్టేయాలని ఉద్యమించింది ‘’అన్నారు  ‘’పిల్లలకు లోపాలున్నాయని నిరుత్సాహ పడ కూడదు . .వారిలోపం మరో రూపం లో పూడ్చ బడుతుంది .వారికి నచ్చిన దారిలో పిల్లలను పోనివ్వాలి .కాని ,జాగ్రత్తగా గమనిస్తూండాలి .వారిని ప్రోత్స హించ క పోవటం  పోవటం మన లోపమే అవుతుంది తప్ప ,వారిలోని లోపం ఒక లేక్కలోనిదికాదు’’అన్నది గుమ్మా శశికళ ‘’ఆదర్శం ‘’కధలో .

నయాబ్ రసూల్ ‘’వికల మనసులు ‘’కధలో ‘’అవిటి వారు  బాగా తెలివి గల వాళ్లై నేర్పరులై వ్యక్తిత్వంలో ,కళల్లో. సామాన్యుల కంటే మేధావులుగా ఉంటారు .వారిపై జాలి చూపించి వారి అంగ వైకల్యం గుర్తుకు తెచ్చి ,భవిష్యత్తును అగమ్య గోచరం చేయద్దు . మామూలు మనుషులుగా చూస్తె చాలు .అన్నిటిని అధిగమించి అద్భుతాలు సాధిస్తారు ‘’అంటారు .’’పడమటి కొండల్లో సూర్యుడుకూడా కులం లేని వాని బాధను చూడలేనట్లు కనుమరుగై  ,వెలుతురూ సన్న గిలింది .’’అని ‘’నిచ్చెన మెట్లు ‘’కధలో డాక్టర్ వసునూరి రవీందర్ అన్నారు . ‘’లైఫ్ అంటే మేధా మేట్రిక్స్ కాదు..అన్నిటికీ  అన్సర్లు ఉండవు .ఉద్వేగాలు మోతాదు మించితే కష్టం .అనుమానం నీకే కాదు  అందరికీ  అశాంతి అల్గిస్తుంది .’’ అని ‘’నిజం ‘’లో నాగరత్నం అంటే ,’’పోరాటంలో  ఆనందమూ తృప్తీ ఉన్నాయి ‘’.’’ఛీకటి ఎరుగని కళ్ళకు నిత్య సూర్యోదయమే ‘’అంటుంది జ్యోత్స్నా ఫణిజ  .’’సువర్ణోదయం ‘’లో .ఇవన్నీ నిత్య సత్య ఉపనిషత్ సూక్తులే .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక 

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం

  • – ముక్తేవి భారతి, 9989640324
  • 15/12/2014
TAGS:

వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి వారి సంస్కరణోద్యమ ప్రభావం ఆనాటి యువ రచయితలపై వుంది. వృద్ధ వివాహాలు, కన్యాశుల్కం, వేశ్యాలోలత్వం, కుహనా సన్యాసినులు, మతం మార్పిడులు, విభిన్నమైన స్ర్తిల సమస్యలు కొవ్వలి నవలల్లో ముఖ్యమైన విషయాలు. సామాజికంగా, కుటుంబ పరంగా స్ర్తిలకు జరుగుతున్న అన్యాయాలను చూపిస్తూనే, వాటినుండి బయట పడేందుకు స్ర్తిల పక్షాన కవి గొంతు విప్పటం స్పష్టంగా తెలుసుకొంటాం. వారికి జరగాల్సిన న్యాయంకోసం పోరాటం చేయటానికి సాహసం చూపటానికి కొవ్వలి వారి పాత్రలు వెనుకాడలేదు.
‘ఆడ మళయాళం’, ‘మా ఆవిడ రూపవతి’, ‘బర్తు కంట్రోలు’ వంటి నవలల్లో వ్యంగ్యం, సందేశాలతో కూడిన వస్తువైవిధ్యం ఉంది. కొన్ని నవలల్లో (ఆడ మళయాళం) మత మార్పిడి అంశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తెచ్చిపెట్టే మతం చాలా శక్తిమంతమని బోధిస్తారు కొవ్వలి. ‘ఆడ మళయాళం’ నవలలో జ్యోషి పాత్రలో మానవత్వాన్ని రంగరించారు. మతాంతర వివాహం చేయించారు. ఈ నవలలో భగవతి అనే ఆమె బోధనలలో, మత విశ్వాసాలలో ఎంత మోసం వుందో చెప్పి స్ర్తిల కళ్ళు తెరిపించారు. అప్పుడే చెప్పిన దొంగ సన్యాసులు… సన్యాసినుల్ని నేడూ చూస్తూనే వున్నాం గదా! కొవ్వలివారి ‘మా ఆవిడ’ నవలపై గురజాడ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో సామాన్యంగా కనిపించే వృద్ధ వివాహం అంశానికి నవలా రూపమిచ్చారు. ఇందులో యాభై ఏళ్ళ పాపయ్య పధ్నాలుగేళ్ళ అన్నపూర్ణని పెళ్ళాడటానికి రెండువేల రూపాయలు పిల్ల తండ్రికిస్తాడు. స్నేహితులందరూ పాపయ్యని ‘‘నీ కర్మంగాలా! ఇంత బతుకు బతికి చివరికి డబ్బిచ్చి పిల్లను కొనుక్కుంటావురా’’ అని ఈసడిస్తారు. ఆ వృద్ధుడు అయిదు రోజుల పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. మేజువాణీ, బాణాసంచా, ముత్యాల పల్లకి కోరినట్టు రాశారు. ‘‘నా ముద్దూ ముచ్చటా తీరాలి’’ అంటాడు పాపయ్య. ఇది చదువుతుంటే నాకు వీరేశలింగం, చిలకమర్తివారల ప్రహసనాలు గుర్తుకు వచ్చాయి. అమ్మయిలే గొంతు విప్పి మనసులో మాట చెప్పి ధైర్యంగా ముందడుగు వెయ్యాలని కొవ్వలి సందేశమివ్వటం ప్రగతి శీలత్వమే!
రూపవతి అయిన భార్య భర్తను అవమానపరుస్తూ, ఇంటి చాకిరీని భర్తచేత చేయిస్తూ, పర పురుషులతో అతి చనువుగా వుండే రూపవతి భార్యకన్నా గుణవంతురాలయి రూపురేఖలు బాగా లేకున్న భార్యే కుటుంబంలో శాంతి సౌఖ్యాలను చేకూరుస్తుందని కొవ్వలి ‘రూపవతి’ అనే నవలలో బోధిస్తారు. అందుకే మనవారు ‘‘రూపవతీ భార్యా శత్రుః’’ అన్నారు. రూప సంపద తాత్కాలికం- గుణ సంపద శాశ్వతమన్నదే కొవ్వలి ఉద్దేశం.
ఘోరమైన, మూఢమైన దురాచారాల్ని పోగొట్టేందుకు కథలు, నవలలు, ప్రహసనాలు, గేయాలు, నాటికలూ వెలువడ్డాయి. అటువంటి రచనల వల్లనే సమాజంలో మార్పు వచ్చింది. కొవ్వలి రచనలు కూడా ఆ కోవకి చెందినవే. ‘బర్త్ కంట్రోలు’ నవలలో కొవ్వలి భర్తల పక్షం వహించినట్టు అనుకుంటాం గానీ భర్తల్ని మోసంచేసే భార్యలూ ఉన్నారని కళ్ళు తెరిపించటానికే ఈ నవల రాసినట్టు భావించాలి. ‘బర్త్ కంట్రోల్’ అనే నెపంతో గున్నమ్మ భర్తను శారీరక సుఖానికి దూరంగా వుంచుతుంది. అయితే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకొంటుంది. గర్భం దాల్చి- తనకు పుట్టిన పిల్లని సంబంధం పెట్టుకొన్న వాడి భార్యకి అప్పగించి భర్తతో ‘‘నేను మీకు అన్యాయం చేశాను’’ అన్నప్పుడు పశ్చాత్తాపం వచ్చిందని పాఠకుడు గున్నమ్మపై సానుభూతి చూపించేలా రాశారు కొవ్వలి!
కొవ్వలివారి ‘దాసీ పిల్ల’ రెండవ నవల. చెళ్ళపిళ్ళవారు మెచ్చుకొన్న నవల. ఇందులో లక్ష్మి దాసీ పిల్ల. సంఘం చేత నీచంగా చూడబడుతూ, సేవక వృత్తిలో తనువు తెల్లార్చుకొనే తక్కువ కులాలలో కూడా నీతి, ప్రేమ, ఆత్మగౌరవం వంటి ఉత్తమ గుణాలుంటాయని ఈ నవల చెప్తుంది. ఎంతటి అభ్యుదయ దృక్పథం! ఈ ‘దాసీపిల్ల’ నవలలో చాలా మలుపులున్నాయి. చివరకు సుఖాంతం చేస్తారు. ఈ నవలలో సత్యవతి బాల వితంతువు. ఆ అమ్మాయికి కేశఖండన చేయించాలని తల్లిదండ్రులు అనుకోవటంతో సత్యవతి అత్త కొడుకుతో లేచిపోవాలనుకొంటుంది. ఇందులో క్రైస్తవ మత ప్రచారాన్ని, కొందరి దొరసానుల దయాహృదయాల్ని, చదువుకొన్నవారి అభ్యుదయ భావాల్ని వివరిస్తూ యువత సమాజాన్ని తీర్చిదిద్దగలదన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు కొవ్వలి.
‘‘కూడు లేక ఏ మానవుడూ చెడిపోడు. పూటకు లేని వాడయినా గుణవంతుడయితే కోటికి పడగలెత్తగలడు. గుణహీనుడయిన కోటేశ్వరుని జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు. ఈ నిజమును తెలుసుకొని బతికినవారు ధన్యులు’’ అంటారు, ‘నిశానీదార్’ నవలకి ముందు మాటలో! ఈ నవలలో నిరక్షర కుక్షి అయిన రంగనాయకులు ఇంగ్లీషు బాగా చదివానని గొప్పలకి పోతూ డాంబికాలు చెప్తూ భార్యని, అత్తని మోసం చేస్తూ వుంటాడు. ఈ నవల ఇంగ్లీషు వ్యామోహాన్ని ఒక కోణంలోనూ, మోసకారితనాన్ని మరో కోణంలోనూ చూపించి ఆడవారు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సానుకూలపరచుకోవాలని హితవు చెప్తారు కొవ్వలి. ఈ రంగ నాయకులు పాత్ర గురజాడవారి గిరీశం పాత్రను గుర్తుకు తెస్తుంది. ఇద్దరూ సమాజానికి కీడు చేసేవారే!
‘విడాకులు’ నవలలో సాంఘిక సమస్యలు చాలా చూపించారు. దాంపత్యం, ప్రేమ, స్నేహం, స్ర్తి ఆశయాలు వంటివి వెల్లడించారు. స్ర్తిల సమస్యలకి ఎవరు కారకులు? తల్లిదండ్రులా? సమాజమా? ఎవరు? అన్నదే కొవ్వలి వారి తపన!
కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారి నవలల్లో సంఘ సంస్కరణలు విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. వీరి నవలలు చదువుతుంటే ఏ నవలకి ఆ నవల ప్రత్యేకమైనదే అనిపిస్తుంది. సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో వీరి నవలల్లోనూ అంతటి వస్తువైవిధ్యం వుంది. ‘రూపం కాదు, గుణం ముఖ్యం’, ‘కుహనా సంస్కారవంతులుంటారు జాగ్రత్త’, ‘కుల మతాల ఉచ్చుకు దూరంగా వుండండి’, ‘్భర్యాభర్తల అనుకూలత’….. ఇలా ఎన్నో అంశాల్ని తమ నవలల్లో వివరించి మనకి కనువిప్పు కలిగించారు. కొవ్వలివారు కేవలం వ్యవస్థలోని లోపాలనే చెప్పి ఊరుకోలేదు- వాటిని సరిదిద్దాలని తపన చెందారు. ఇటువంటి గొప్ప నవలా రచయిత మన తెలుగువాడవటం గర్వించదగినది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చౌరస్తా’లో తెలుగు భాష

చౌరస్తా’లో తెలుగు భాష

  • – ఎ. రజాహుస్సేన్, 9505517052
  • 15/12/2014
TAGS:

భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార భాష తెలుగే. రాష్ట్ర విభజన ముందువరకు అంటే అవిభక్త రాష్ట్రంలో తెలుగు మాట్లాడే 23 జిల్లాల్లో వేరే వేరే మాండలికాలు, రకరకాల యాసలున్నా స్థూలంగా ప్రామాణిక భాష ఒకటే వాడుకలో వుంది. తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాష చిన్నచూపునకు గురవుతోందన్న విమర్శ వుంది. తెలంగాణ భాషను మోటు భాషగా, అనాగరిక భాషగా ముద్రవేశారన్న ఆరోపణ కూడా వుంది. ప్రామాణికత ముసుగులో కోస్తాంధ్రకు చెందిన రెండున్నర జిల్లాల భాషే తెలంగాణ ప్రాంతంలో పెత్తనం చేస్తోందన్న భావన బలంగా వుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇపుడు వ్యావహారిక భాషలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలు, యాసను వ్యవహారంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఇప్పటిదాకా అధికారికంగా కొనసాగుతున్న ప్రామాణిక తెలుగుకు బదులు తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలతో కూడిన భాష దశలవారీగా వ్యవహారంలోకి రాబోతోంది. మాండలిక భాష ప్రధాన స్రవంతిలో కలువబోతోందంటే మాండలిక యాస కూడా భాషలో చోటుచేసుకుంటుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాష, యాస అధికారిక రూపును సంతరించుకోబోతున్నాయి. తెలంగాణ భాష తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నంగా దీన్ని భావించాలి. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దీనివల్ల రాష్ట్రం రెండుగా చీలినట్లే తెలుగు భాష కూడా రెండుగా చీలిపోవాల్సి వస్తుందా? అంటే ఆంధ్ర ప్రాంతంలో ‘ఆంధ్ర తెలుగు’ (ప్రస్తుతం ప్రామాణికంగా అమల్లో వున్న భాష) తెలంగాణ ప్రాంతంలో ‘తెలంగాణ తెలుగు’ (కొత్త రూపును సంతరించుకోబోయే తెలంగాణ భాష)ను చూడబోతున్నామా? ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో ప్రామాణికంగా పరిగణింపబడే తెలుగు భాషే ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా వ్యవహారంలో వుంది. అయితే ఇకమీదట ఈ ప్రామాణిక భాష కేవలం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకే పరిమితం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తెలంగాణ మాండలికాలతో కూడిన ‘తెలంగాణ భాష’ సాక్షాత్కరించనుంది. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలలు, ఇతర విద్యాలయాల్లో అలాగే అధికారిక కార్యకలాపాల్లో ఇక తెలంగాణ భాషే కనిపించవచ్చు. అలాగే పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రస్తుత ప్రామాణిక భాషకు బదులు తెలంగాణ భాష చోటుచేసుకోబోతోంది. అంటే తెలుగు భాష ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా, తెలంగాణలో మరోవిధంగా వుండబోతోంది. రెండు రాష్ట్రాల్లో మాట్లాడేది, రాసేది తెలుగే అయినా అవి రెండు రకాలుగా వుండటంవల్ల ఏమైనా చిక్కులువస్తాయా? అన్నది భాషా పండితులు ఆలోచించాలి.
మాండలికాల్లో మట్టివాసన
ఏ భాషకైనా మాండలిక పదాలే మూలం. మాండలికాల్లో మట్టివాసన గుప్పుమంటుంది. శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఏ భాషకైనా జీవధాతువు మాండలికమే.. వృత్తి పద పరిశీలన ఆధారంగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుదేశాన్ని నాలుగు భాషా మాండలికాలుగా విభజించారు. అందులో ఉత్తర మండలాన్ని (తెలంగాణ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా – రాయలసీమలకు ఆనుకొని వున్న ప్రాంతం) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా మండలంగా భాషా శాస్తవ్రేత్త భద్రిరాజు గుర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రత్యేక భాషా మండలంలో మాట్లాడే మాండలికాలతో తెలంగాణ భాష కొత్త రూపు సంతరించుకునే ప్రయత్నం మొదలైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో మాండలిక పదాలతోపాటు, తెలంగాణ ప్రాంత నుడికారాలు, జాతీయాలు, ఇతర వాడుక పదాల్ని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే తన పని ప్రారంభించింది. అయితే హడావుడిగా ఏదో ఒకటి చేశాం అన్నట్లు కాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే తెలంగాణ మాండలిక పదాల్ని పాఠశాలల్లో పుస్తకాల్లో విస్తృతంగా వాడుక లోనికి తేవాలంటే ముందుగా మాండలిక పదకోశాల్ని సిద్ధం చేసుకోవాలి. వృత్తి పదకోశాల్లో ప్రస్తుతం కొన్ని మాండలిక పదాలు అందుబాటులో వున్నాయి. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’ కొంతవరకు ఉపయోగపడుతుంది. 1999లో ‘సామాజిక భాషా పరిశీలన’ అనే పథకం ద్వారా తెలుగు అకాడమీ జిల్లాల వారీగా ప్రచురించిన తెలుగు మాండలికాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. వీటితోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాడుకలో వున్న మాండలిక పదాల్ని విస్తృతంగా సేకరించాల్సిన అవసరముంది. దీనికి సంబంధించి ఓ బృహత్ప్రయత్నం జరగాలి.
అలాగే తెలంగాణ మాండలికంలో వచ్చిన కవిత్వం ఇతర రచనల్లోని పదాల్ని పలుకుబళ్లను, పదబంధాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసిన వారున్నారు. తెలంగాణ పదాల సొగసు, మాధుర్యం, నాదం, ఆత్మ, ఆత్మీయత, సృజనాత్మకత, వౌలికత, సార్థకత, మట్టివాసనలు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతపు ఉద్యమ జానపద సొగసులు తెలంగాణ భాషలో సమగ్రంగా ఆవిష్కరించబడాలి. నూతన భాషా విధానంలో వీటన్నిటిని క్రోడీకరించాలి. అలాగే ఇంట్లో పరిసరాల్లో నేర్చుకునే ‘ఇంటిభాష’ను విస్మరించకూడదు. ఇక తెలంగాణ నుడి, నానుడి పలుకుబడిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే తెలంగాణ జాతీయాల్ని, సామెతల్ని పొడుపు కథల్ని విస్మరించకూడదు. కరీంనగర్‌కు చెందిన వేముల పెరుమాళ్లు సుమారు 3000 జాతీయాల్ని సేకరించారు. వాటిని తెలంగాణ భాషా స్రవంతిలోకి తీసుకురావాలి. అలాగే తెలంగాణలో పాటకు, పద్యానికి కూడా ప్రత్యేక స్థానముంది. ఉద్యమకారులకు జానపదులకు ‘పాట’ ఊపిరైంది. అలాగే పల్లె పట్టుల్లో పద్యాలు హృద్యాలుగా అలరారాయి. మందార మకరంద మాధుర్యంలో పోతన భాగవత పద్యాల్ని ఇప్పటికీ పాడుకునే పల్లె ప్రజలున్నారు. పోతన పద్యాల్లోని తెలంగాణ మాండలికాల్ని బయటకు తీయాలి. సురవరం ప్రతాపరెడ్డి సీసపద్యాల్ని పాలమూరు మాండలికంలో రాసి మట్టి రుణం తీర్చుకున్నారు. ఈ విధంగా మాండలికాల్లో పద్యాలు రాసినవారు అనేకమంది వున్నారు. వీరి పద్యాల్ని సేకరించి అందులో మాండలికాలకు ఊపిరిపోయాలి. ఇక ‘కథ’ విషయానికొస్తే తొలితరం తెలంగాణ కథల్లో నాటి తెలంగాణ వ్యావహారికం కనిపిస్తుంది. తొలితరం తెలంగాణ కథలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. వీటిని సేకరించాలి. ఈ కథల్లో అరవై యేళ్ళ కిందటి తెలంగాణ జీవితం కనిపిస్తుంది. అప్పటి మాండలికం వినిపిస్తుంది.
నూతన భాషా విధానం ప్రకటిస్తారా?
తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాషలో చేపడుతున్న మార్పులు- చేర్పులకు సంబంధించి ఓ నూతన విధానం (పాలసీ) ప్రకటిస్తే బాగుంటుంది. దీనివల్ల బహిరంగ చర్చకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల భాషా నిపుణులు, పండితులు, భాషాభిమానులు తదితర వర్గాలనుంచి గుణాత్మకమైన సూచనలు, సలహాలు లభించే అవకాశముంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ‘బడిపలుకుల భాష’కు ‘పలుకుబళ్ల భాష’కు మధ్య చాలా వ్యత్యాసముంది. వ్యత్యాసాన్ని సవరించాలని ప్రభుత్వం భావించడం సహజమే. అయితే ఈ ప్రయత్నాన్ని ఏ కొందరికో పరిమితం చేయకుండా అందరినీ కలుపుకుపోవాలి. ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా అవసరమైన వారందరినీ సంప్రదించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘చౌరస్తాలో’ వున్న మన తెలుగు సరైన మార్గంలో పయనించడానికి దిశా నిర్దేశం చేసినట్లవుతుంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

  • – దాసరి దుర్గాప్రసాద్
  • 15/12/2014
TAGS:

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. అంతటి మహిమాన్వితుడైన ఆ స్వామి కొలువుదీరిన క్షేత్రమే పావగడ. దేశంలో ఉన్న ప్రముఖ శనైశ్చర స్వామివారి క్షేత్రాలలో పావగడ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వర స్వామివారు, శీతల అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండల నడుమ ఉన్న ఈ దివ్య క్షేత్రం శ్రీ శనీశ్వరస్వామి లీలా విశేషాలతో, మహత్యాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అహంభావ హీనం, ప్రసనాత్మభావం కల భక్తుల్ని శనీశ్వరుడు రామరక్షయై కాపాడతాడని పురాణాలు చెబుతున్నాయి. సత్యం, న్యాయం శనీశ్వరుని రెండు కళ్ళు. శని అంటే శక్తి. మహాశక్తి. శనీశ్వరా అంటే శివశక్తి. ఆ శివశక్తి ఆశీస్సులు పొందడానికి భక్తి ప్రధానమైనది. పరిపూర్ణ అహింసామూర్తిగా, సర్వంతర్యామిగా ఆ స్వామి పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత స్వామి కొలువుదీరిన పుణ్యప్రదేశమే పావగడ. ఇక్కడ ఆ స్వామి శని మహాత్మస్వామిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు.
పూర్వకాలంలో ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక సాధువు శనీశ్వరస్వామి వారి పటాన్ని ఉంచి పూజలు నిర్వహించేవాడట. అయితే స్వామి వారి దృష్టి తమపై పడకూడదనుకున్న భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి దూరంనుంచే స్వామివారిని దర్శించుకునేవారట. అనంతర కాలంలో కట్టా కృష్ణయ్యశెట్టి, ఎ.నర్సింగరావు అనే భక్తులు విరాళాలు సేకరించి స్వామివారికి ఒక చిన్న మందిరాన్ని కట్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
అనంతర కాలంలో ప్రఖ్యాత శిల్పకారుల సహకారంతో నిర్మించిన నవగ్రహాలను తిప్పయ్య అనే భక్తుడి నేతృత్వంలో ప్రతిష్టించారట. ఆనాటి నుంచి నేటివరకూ ఈ ఆలయం దినదిన ప్రవర్థమానమవుతూ భక్త జన సందోహంతో అలరారుతుంది.
మనోహరమైన దేవతా శిల్పాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న శనీశ్వరస్వామి వారి ప్రధానాలయ గోపురం భక్తులలో భక్తి భావాన్ని ప్రోదిచేస్తుంది. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం శనైశ్వరస్వామినే నమః అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో ముందు గా ప్రధానాలయానికి వెలుపల శని దేవుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. కాకి వాహనారూడుడైన ఆ స్వామిని భక్తులు భ్రక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే ఆలయంలో మరో పక్క పంచముఖ హనుమంతుడు కొలువుదీరాడు. ప్రధానాలయంలోని ప్రాకారాలన్నీ వివిధ దేవీదేవతల సుందర శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తాయి.
గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవి సుందర మూర్తులు దర్శనమిస్తాయి. పంచలోహ సమన్వితంగా ఉన్న ఈ మూర్తులను భక్తులు భక్తితో దర్శించుకుని
సత్యశక్తి స్వరూపం…….
సంకట హరణం దేవాం
శనీశ్వరాం ప్రణమామ్యహమ్
అంటూ భక్తిశ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. స్వామివార్లకిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
శనీశ్వరస్వామి గర్భాలయానికి మరోపక్క శీతలామాత ఆలయం ఉంది. ఈ ఆలయానికి ముందు చండి, ప్రచండి మూర్తు లు దర్శనమిస్తాయి. ప్రధానాలయంలో ఎడమవైపున సత్యనారాయణస్వామి, కుడివైపున వినాయకుడు, దత్తాత్రేయుని మూ ర్తులు కానవస్తాయి. గర్భాలయంలో శ్రీ శీతలామాత వారి దివ్య మంగళ రూపం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఈ ఆలయంలోనే శనీశ్వరస్వామి, శీతలామాత, జ్యేష్టాదేవి, సీతారామ లక్ష్మణుల పంచలోహ మూర్తులు కానవస్తాయి.
పావగడ శ్రీ శనైశ్చరస్వామి ఆలయం శనిదేవుని విశేష పూజలకు ప్రత్యేక వేదికగా అలరారుతోంది. ఇక్కడ నవగ్రహ మండపంలో శని దేవునికి, ఇతర గ్రహదేవతలకు రోజూ వందలాది మంది భక్తులు నిర్వహించే అర్చనాది అభిషేకాలు నయన మనోహరం. ఆద్యంతం ఆధ్యాత్మికానురక్తిని ప్రోదిచేసే ఆయా పూజల్లో పాలుపంచుకోవడం భక్తులు తమ అదృష్ట్భాగ్యంగా భావిస్తారు. అత్యంత భక్తివిశ్వాసాలతో ఇక్కడ స్వామి వారిని తిల తైలాభిషేకాలతోపాటు అఖండ హారతి నిర్వహిస్తే సమస్త గ్రహ బాధలనుంచి శని దేవుడు విముక్తి కల్గిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి ఆయా పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పిస్తారు. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు. ఆసక్తిని గొలిపే ఈ తంతు చూడడానికి రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కానేరదు. ఈ ఆలయంలో శని త్రయోదశికి, శని జయంతికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆయా పర్వదినాలలో స్వామివారి ఆలయం భక్తసంద్రంలా అగుపిస్తుంది.

దండంపట్టుకో.. సుఖదుఃఖాలను దింపేసెయ్
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోరుకున్న పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పించడమే ఈ ప్రదక్షణ, దండంసమర్పణంలోని అంతరార్థం. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు.

దేవాలయానికి మార్గం
ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం జిల్లా హిందూపురం వరకు వచ్చి అక్కడనుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే కళ్యాణదుర్గం నుంచి అరవై కిలోమీటర్లు దూరంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రం చేరుకోవడానికి ప్రయివేటు బస్సులు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ భక్తులకు కావాల్సిన భోజన వసతి సదుపాయాలున్నాయి. పావగడ శ్రీ శనీశ్వరస్వామి ఆలయ దర్శనం సర్వగ్రహ పీడా నివారణం. స్వామి దర్శనం సర్వశుభకరం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

 

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

  • -గోపగాని రవీందర్
  • 20/12/2014
TAGS:

వటపత్రశాయి,
రచయిత: సింహప్రసాద్,
పేజీలు: 240, వెల: రూ.175/-
చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు,
401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650,
హైదరాబాద్- 500 085.
సెల్: 9849061668

ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు సింహప్రసాద్‌గారు. పతనమవుతున్న మానవత్వ విలువలపై ఆవేదనతో రాస్తున్న అతికొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. వర్తమాన జీవనంలోని సున్నిత అంశాలపై హృద్యంగా రాస్తున్న కథలు, నవలలు ఆకట్టుకుంటున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో వివిధ దిన, వార, మాస పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో పురస్కారం పొందిన ఇరవై కథలతో ‘వటపత్రశాయి’గా ఏడవ కథాసంపుటిని వెలువరించారు. పోటీకి వచ్చిన కొన్ని వందల కథలనుండి ఎన్నుకున్న కథ అంటే సహజంగానే ఆసక్తి కల్గుతుంది. మన చుట్టువున్న రకరకాల వైవిధ్య జీవితాల్ని పరిచయం చేస్తాయి.
మానవ సృష్టి నిరంతరంగా సాగుతూనే సమాజముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా పిండదశలోనే పిల్లలను తొలగించుకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నాం. మాతృత్వం చాలా గొప్ప సంప్రదాయమని చాటిచెప్పిన కథ ‘వటపత్రశాయి’. పిల్లలను కనడానికి అనువైన యవ్వన కాలాన్ని కాదనుకొని డబ్బు సంపాదనకై పరుగుపెడ్తున్న దంపతులకు చెంపదెబ్బలాంటి కథ ఇది. కుటుంబ జీవనంలో స్ర్తిని ఒక సంపాదన వనరుగాకాక జగన్మాతగా చూడాలని, ప్రతి బిడ్డా వటపత్రశాయేనని చెప్పిన కథ ఆలోచింపజేస్తుంది. ఇతర పనులను వాయిదావేసుకున్న ఫర్వలేదుకాని తల్లికావడాన్ని వదులుకోవద్దని నేటి తరానికి హితవుచెప్పిన కథ ఇది. మనం సుఖంగా ఉంటేనే సరిపోదు మన చుట్టు ఉండేవాళ్ళుకూడా బాగుండాలి. అనాథ పిల్లలకోసం నడుపుతున్న ఆశ్రమానికి సహాయం చేయడంకోసం అన్నపూర్ణమ్మ రోజు వండుకునే బియ్యంలో పిడికెడు తీసి పక్కనపెట్టి, నెల రోజుల తర్వాత ఆ బియ్యాన్ని నిర్వాహకులకు ఇచ్చి, వాళ్ళకు కొంత సహాయపడ గలిగినందుకు తృప్తిచెందుతుంది. తమ పిల్లలు తమకు పెట్టకపోయినా పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న వృద్ధులు వాళ్ళు. తాము రోజు తినే తిండిని తగ్గించుకుని సహాయం చేస్తారు. మానవీయతకు అద్దంపట్టిన కథ ‘గుప్పెడు.’
‘వంశవృక్షం’ కథలో నీ ఎదుగుదల మూలాలను తెలుసుకోవాలని సూచిస్తారు. ఉద్యోగ జీవితంలో అవినీతి అక్రమ సంపాదనలో కూరుకుపోయి, తమకు నీడనిచ్చిన కుటుంబానే్న మరిచిన ఉదంతం బాధను కల్గిస్తుంది. పేద పురోహితుడి అశక్తికి కారణం తనదగ్గర డబ్బు లేకపోవడం. తన పూర్వికులు సహాయంకోరిన వాళ్ళను ఆదుకొని ఆస్తులను కోల్పోతారు. ఆ రెవెన్యూ అధికారి కుటుంబం కూడా వాళ్ళు అందించిన సహకారంతోనే నిలిచింది. ఆ కుటుంబం కష్టాల్లోఉంటే సహాయం చేయాల్సిందిపోయి డబ్బులకోసం సతాయించడం చూస్తాం. నేటి మానవ నైజానికి నిదర్శనమీ కథ. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న అత్యాచార యత్నాలను ధైర్యంగా తిప్పికొట్టి, తగిన బుద్ధిచెప్పిన కథ ‘ఓ సీతకథ.’ ఒక లంబాడీ మహిళ బతుకుకై ఆర్ట్స్ విద్యార్థులకోసం తన అందమైన యవ్వనాకృతుల్ని అర్పించిన దీనగాథ ‘మోడల్’కథ. ఆమె దేహాన్ని చిత్రించి ఎంతోమంది గొప్ప చిత్రకారులైనారు. ఆమె ఆకలి మాత్రం తీరలేదు. చివరికి ఆమె శవంగా మారినా మోడల్‌గా ఉండి దహన ఖర్చులను సంపాదించుకున్న తీరు ద్రవింపజేస్తుంది.
కార్పొరేట్ విద్య అందించే డబ్బుకు దాసోహమన్న గణిత మేధావి సూరిబాబు గుర్తింపుకై పడిన తండ్లాటలో చదువుచెప్పిన గురువునే తక్కువచేసి ఆలోచించుకుంటాడు. పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆ గురువుకు సన్మానం చేయాలను కుంటారు. గురువు మాత్రం నాకన్న విశేషమైన కృషిచేసిన నా శిష్యుణ్ణి సన్మానం చేస్తానని సూరిబాబుకు సన్మానం చేస్తాడు. దాంతో అతనిలోని అహంకారం పటాపంచలవుతుంది. గురువు ఔన్నత్యాన్ని చాటిచెప్తునే నేటి విద్యారంగంలోని అవలక్షణాలను కూడా చర్చించిన కథ ‘పరబ్రహ్మం.’
రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలు వేయమని సమ్మెచేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కథ ‘రోమ్-నీరో-్ఫడేలు’. ఆడపిల్లల జనాభా తగ్గడంతో పెళ్ళికోసం పరీక్షలురాసే రోజులు రానున్నాయని హాస్యంగా చెప్పిన కథ ‘రేపింతే’. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రతీది వినోదభరితంగా ఉండాలనే మీడియా ప్రభావంవల్ల మానవత్వం మసకబారుతున్న వైనాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు ‘విష పరిష్వంగం’ కథలో. ఒక నిరుద్యోగి ఉరిని ఈవెంట్‌గా మార్చుకున్న వ్యాపార కోణాన్ని చూపి నివ్వెరపోయేట్లు చేశారు. మార్పు సహజం. రెండు దశాబ్దాల క్రితందాక కూడా కంప్యూటర్ల ప్రభావం లేదు. టైపు మిషన్‌లతో ఉపాధి చూసుకున్నవారు ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా వచ్చిన ప్రగతితో ఆ కుటుంబాలవారు ఉపాధికి దూరమయ్యారు. ఐనా నమ్ముకున్న వృత్తే కాపాడుతుందని నమ్మిన వృద్ధుని కథే ‘పాతనీరు’. పాతది పనికిరాదనే దృక్పధాన్ని నిరసించే కథ ఇది. ఒకప్పటి పాత నీరు కొత్తదే అని తెలిపిన కథ. దేని ఉపయోగం దానికి ఉంటుందని తెలుస్తుంది. నేటి అవినీతి ఉద్యోగులకు బుద్ధిచెప్పటానికి ఒక తెలివైన పౌరుడు లంచంగా దొంగనోట్లును ఇస్తాడు. దాంతో ఆ ఉద్యోగి పడిన అవస్థల కథే ‘గాంధీతాత నవ్వేడు’. నగరంలో పెరిగిన సెల్‌టవర్ల మూలన అంతరిస్తున్న పక్షుల గూర్చిన కథ ‘వాయసం.’ పిండాలు తినే కాకులు కనబడవు. మారిన అలవాట్లు కాకులకు తిండి లేకుండా చేశాయని ఆవేదన చెందుతారు. చివరికి పిండాలు తినడానికి కాకులు రావు కాని కుక్కలు ఎగబడుతున్నాయని వాస్తవ స్థితిని చిత్రీకరించారు. సర్‌గోసి మదర్ గూర్చిన కథ ‘తల్లీ నిన్నుదలంచి..’ పేదరికంలో మగ్గుతున్న ఒక కుటుంబం గర్భాశయాన్ని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో బతకాలనుకుంటే, బిడ్డను కన్న తర్వాత వీసా సమస్యతో బిడ్డను వదిలించుకుంటే ‘విత్తనం నాదికాకపోయిన భూమినాదే’ కాబట్టి నేనే పెంచుకుంటానని ఆ తల్లి ధైర్యంగా బిడ్డను స్వీకరిస్తుంది.
మనిషికి నిజమైన ఆనందం సంపాదనలో లేదని పదుగురికి సహాయం చేయడంలోనే ఉందని చెప్పే కథ ‘మనిషి దేవోభవ’. అత్తాకోడళ్ల పోట్లాటలు కొత్తకాదు కాని టీవిల దగ్గరనుండి నేటి ఫేస్‌బుక్ వాడకం దాకా వాళ్ళ రుసరుసలు, తిట్టుకోవడాలు హాస్యంగా వివరిస్తూనే కొడుకుగా, భర్తగా పాత్రలను పోషిస్తూ ఆ పురుషుని బాధలను వర్ణించారు ‘ఒక యుద్ధం ఒక సంధి ఒక శాంతి’ కథలో. భార్యభర్తల మధ్య ఉండే చిన్నచిన్న సంఘటనలకు విపరీతంగా ఆలోచించి చిన్నాభిన్నం అవుతున్న ఇతివృత్తాలు అనేకంగా ఉన్నాయి. అందుకే తొందరపడి కఠిన నిర్ణయాలను తీసుకోవద్దని చెప్పేకథ ‘మనసా! తొందరపడకే.’ విలాసానికి బానిసైన ఒక బ్యాంకు ఉద్యోగి పతనావస్థకు దర్పణం ‘జారుడుమెట్లు’కథ. ‘రెయిన్‌రెయిన్ గో అవే’ రైమ్స్ నేర్పే కానె్వంటు చదువులను నిరసిస్తూనే వాన అవసరాన్ని చాటిచెప్పిన కథ ‘వాన వాన వల్లప్ప’. కుటుంబం ఆనందాల హరివిల్లు అంటారు. ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉమ్మడి కుటుంబంగూర్చి పెద్ద ఉపన్యాసం ఇస్తే, ఒక చానల్ రిపోర్టర్ ఆయన అబద్ధాలను బట్టబయలుచేసి, తల్లిని మరిచిన నీది ఒక ఉమ్మడి కుటుంబమా? అని నిలదీస్తుంది ‘ఆత్మపదార్థం’ కథలో. ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని, కష్టాల్లో ఉన్నవాళ్ళకు వాటి పట్టింపు ఉండదని, ఉత్తరాఖండ్ వరదల్లో యాత్రికులను సైనికులు కాపాడిన సాహస విధానాన్ని చక్కటి కథనంతో వివరించిన కథ ‘గబ్బిలం’. మొత్తంమీద విభిన్న సామాజిక అంశాలపై రాసిన సింహప్రసాద్ కథలు ఒక్కసారైన చదవాల్సిందే. కొలకలూరి ఇనాక్, పోరంకి దక్షిణామూర్తి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముందుమాటలు ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.

  • భాషా, సాహిత్యాలకు సరైన పథ నిర్దేశం

    • -వెలుదండ నిత్యానందరావు
    • 20/12/2014
    TAGS:

    సాహిత్య విమర్శకు
    ‘కోవెల’ సంపత్కుమార సాహిత్య దర్శనం
    వెల: రు.100.. పేజీలు: 104
    ప్రతులకు: డా.టి.రంగస్వామి
    శ్రీలేఖ సాహితి, ఇంటి.నెం.14-5/2,
    మండల కార్యాలయం ఎదురుగా
    శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి,
    వరంగల్లు-506371
    తెలంగాణ రాష్ట్రం
    ఫోన్: 0870-25647222

    విమర్శకునిగా, వక్తగా, కవిగా ఆచార్యునిగా కోవెల సంపత్కుమారాచార్య వారు జగమెరిగినవారు. వారు కీర్తిశేషులై అపుడే నాలుగేళ్లు దాటుతుంది. కోవెల సంపత్కుమార పర్యవేక్షణలో డాక్టరేటు పట్టం గ్రహించిన ప్రియ శిష్యుడు శ్రీలేఖ సాహితీ సంస్థ నిర్వాహకుడు డా.టి.రంగస్వామి ఈ నివాళి గ్రంథాన్ని ప్రకటించారు. ఇది ఒక ఉత్తమ గురువునుంచి సంక్రమించిన ఉత్తమ సంస్కార లక్షణంగా భావిస్తూ శ్రీరంగస్వామిని అభినందించవచ్చు.
    సంపత్కుమార ఛందఃపరిశోధన పారమ్యతను ఉగ్గడిస్తూ పల్లె శీను, ఆముదాల మురళి, ఆముక్త కావ్యాన్ని విశే్లషిస్తూ ఎస్.రాజేంద్రప్రసాద్, శ్రీరంగస్వామి గార్లు రాసిన వ్యాసాలున్నాయి. చింతయంతి, శతకాలు, కాలస్పృహ, అపర్ణ లాంటి కావ్యాల గురించి పి.వీరస్వామి, ఆకునూరి విద్యావతి, భిక్షపతి మొదలైనవారు రాసిన వ్యాసాలు, పెన్నా శివరామకృష్ణ, టి.ఉదయవర్లు సంపత్కుమార గారితో గతంలో చేసిన ఇంటర్వ్యులను ఈ సంకలనంలో పొందుపరిచారు.
    విశ్వప్రేమ అనే వృత్తానికి ప్రేమ కేంద్రబిందువని వైవాహిక జీవితమంటే ఐహిక సౌఖ్యమొకటే కాదు, మేధాపరమైన సహవాసం. ఇరువురు కలిసి సేవామార్గంలో, నివృత్తి మార్గంలో పయనించవచ్చు (పుట 66) అంటూ సంపత్కుమార రాసిన అపర్ణ కావ్యాన్ని విశే్లషిస్తూ పెన్నా శివరామకృష్ణ వ్యక్తీకరించిన అభిప్రాయాలు విశిష్టమైనవి, ఔచితీమంతమైనవి.
    సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో దాన్ని సన్మార్గంలో పయనింపచేసిన మహామనీషి, భారతీయమైన ఆధ్యాత్మిక తత్వాన్ని భూమికగా స్వీకరించాలని వ్యక్తిగా జీవించడం మాత్రమే కాదు సమాజంలో ఒక సంఘ జీవిగా ఇతరుల సమస్యలకు ప్రతినిధిగా ఉండాలి. కాని వాటినుండి దూరంగా పరిగెత్తకూడదని సంపత్కుమార స్పష్టంగా ప్రబోధించారని (పుట 45) డా.ఆకునూరి విద్యాదేవి అభిప్రాయపడ్డారు.
    పల్లేరు వీరస్వామి సంపత్కుమార రచించిన చింతయంతి కావ్యంలోని ఆర్త్భక్తి, లోకరీతులు, సంస్తుతి, భాగవతాంశాలు మా తృత్వం, వ్యాజస్తుతి, కృష్టానురక్తి, గోదావచస్సుధలను సోదాహరణంగా వివరించిన తీరు పాఠకులకు సంతృప్తి కలిగిస్తుంది. తెలంగాణ ప్రజల వ్యావహారిక భాషలోనే పాఠ్య గ్రంథాలుండడంవల్ల కలిగే లాభనష్టాలేమిటని పెన్నా శివరామకృష్ణ అడిగిన ప్రశ్నకు కోవెల సంపత్కుమార ఇచ్చిన జవాబు చూడండి.
    రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్ర విభజన ఉద్దేశాలు ఏమైనా కావచ్చు. కాని భాషాపరంగా మొత్తం తెలుగువారిలో ఒక ఏకీభావం ఉండడం అవసరం. నిజానికి మాండలికాలనేవి భాషాపరంగా యాసలు. భిన్నమైన వ్యావహారిక పద సముదాయం ఉండవచ్చు. అందువల్ల ఒక ప్రాంతపు భాష పాఠ్యగ్రంథ భాషగా ఉండడంవల్ల ఈ ఏకీభావం ఆ ప్రాంతంలోనే దెబ్బతినడానికి అవకాశం ఉంది. తెలంగాణలోనే వేరు వేరు జిల్లాల్లో వేరు వేరైన పలుకుబడి, యాసలు ఉన్నాయి. అందువల్ల వీటిలో భాషా సమత్వం కోసం ఒక సాధారణత్వాన్ని సాధించడం అవసరం. బోధన ఎట్లాగు ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఆయా యాసలోనే సాగుతుంది. మాండలిక పదాలు భాషలో చేరడం భాషా సమృద్ధికి దోహదం చేస్తుంది. కాని ఆ యాసలే పాఠ్యభాషలో కూడ రావాలనడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదేమో! ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. పాఠ్యభాష, బోధన భాష రెండూ కలిసి విద్యార్థి భాషా శక్తిని పెంపొందిస్తాయి. భాషా, సాహిత్యాల విషయంలో ఎవరికైనా విశాల దృక్పథం అవసరం. భాషా, సాహిత్యాలు యాక్షన్- రియాక్షన్ల విషయాలు కావు (పుట 95)
    ఇప్పుడు ఉద్యమావేశంలో ఉన్నాం. క్రమేపీ ఒక నాలుగయిదేళ్ల తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ఈ భావనకే అందరూ చేరక తప్పదు. కోవెల సంపత్కుమార గారి వనంలోని ఫోటో అందవైంది ముఖ చిత్రంగా అలంకరించినందుకు మంచి పుస్తకాన్ని అందించినందుకు శ్రీరంగస్వామి అభినందనీయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 20/12/2014
TAGS:

నృహరీ!
పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ;
పుటలు: 224, వెల: తెలుపలేదు;
ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ,
1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట,
హైదరాబాదు- 500 044

కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన మనోవిహార యాత్రాఫలాలు. యావత్తు పుస్తకం చదివితే అక్కిరాజు సుందర రామకృష్ణ నాటక, కావ్య పద్య పఠనంలోనే కాదు, పద్య రచనంలో కూడా రాణించదగిన వారనిపిస్తుంది.
దశావతారాల్లో నరసింహావతారం ఒక విలక్షణ అవతారం. సగం నరుడూ, సగం సింగమూ. నృహరీ మకుటంతో ఇప్పుడు శతక సింహాసనంపై అక్కిరాజు భాసిస్తున్నారు. ఆమూక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు నరసింహస్వామిని ‘దంభకేసరి’ అన్నాడు. ‘లక్షాధికారైన లవణమన్నమెకాని, మెరుగు బంగారంబు మింగబోడు’వంటి శాశ్వత సూక్తిరత్నాకరమైన నరసింహ శతకం వేమన శతకం వంటి శతకాల వెంబడిని ప్రజావాఙ్మయ విలీనమైంది. ఆమధ్య రామడుగు వెంకటేశ్వరశర్మ చెంచులక్ష్మి అనే ఒక మనోహర కావ్యంలో నృసింహస్వామి కథాభివర్ణనలు చేశారు. ఇలా నరసింహస్వామి ఇప్పటికీ సాహిత్యంలో అవతరిస్తూనే వున్నాడు.
వర్తమాన కాలంలోని ఈ పంచశతి ఆకట్టుకునే సామాజిక అయస్కాంతాల్ని స్వంతం చేసుకుంది.
‘కొడుకులు సింహాసనముల/ కడునేర్పున కూర్చొనంగ కావించెడి ఆ/
చెడుగుల యత్నములక్కట/ అడుగడుగునా గాంచుచుంటి
మయ్యా నృహరీ’ అంటూ కుటుంబ పాలనల్ని నిరసిస్తారు. ‘పుడమిని మాత్రమె కాదుర/ కడు కంపునుగొట్టు మురికి కాల్వలగూడన్/ చెడుగులు కబ్జాచేసిరి/ సడిసప్పుడు చేయకుండ చతురతన్నహరీ’ అంటూ భూకబ్జాదారుల నిస్సిగ్గు పనుల్ని నిరసించారు.
భాషా సంపద పుష్కలంగా ఉంటే యతి, ప్రాస, గమక, గమనాల్లో వీర విహారం చేయగలం- ఎటొచ్చీ శోధనా నైపుణ్యం, సమయ సందర్భ పద క్రీడారహస్యాలు తెలిస్తే అని కవి నిరూపించారు. దేవుళ్ళపై భలే చమత్కారాలు చేస్తారు. డ్రెస్సులు గడిగడి మార్చుచు/ కస్సూబుస్సులను చూప ఘనునీకంటెన్/ డ్రెస్సే ఎరుగని శివుడే/ లెస్సగు దైవంబు తెలిసెలేరా- నృహరీ’ అటువంటిదే.
గణగుణాలూ, గుణగణాలూ రెండిటా నిండుదనాన్ని పొందిన త్రిశతి, యిది.
‘తలకాయలు తమతమ జే/బులలోపల వేసికొనుచు పోలింగు కు, పో/వలసిన రోజులు వస్తే/ సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా’ అంటూ ఆధునిక భావాలతో సిరిసిరిమువ్వ శతకంలో కందకందుక క్రీడాకారుడయ్యాడు. ప్రశంసని హృదయంలోంచి కంఠంలోకి తెచ్చుకుని మాటల్లోకి తెచ్చుకోలేనివారు తప్ప ఎవ్వరైనా ఈ త్రిశతిని మెచ్చుకు తీరతారు ఇందులోని తలపు మువ్వల సవ్వడులకి.
‘పక్కింటివారి లోగిట/ చక్కగా తెగ పూచినట్టి చామంతి పువుల్;/ కుక్కలు కాపలయున్నను/ పక్క ప్లానేసి జయము వడసితి- నృహరీ అంటారు సహజ చమత్కారంగా.
‘ఇప్పుడు పెద్దమగాడను/ చెప్పగ, బాల్యాన సిసలు చిల్లరగాడన్/ తప్పులు దండిగ చేసితి/ అప్పామన్నించు నీ ప్రియాత్మజు- నృహరీ’ అనడంలో నీ ప్రియాత్మజుడను అనడంలో ఆత్మీయత, కొంటెతనం గడుసుదనం మేళవించాయి. ఈ నృహరి త్రిశతిలో ‘వీరస్తుతులు!’ లేవుగాని వైరభక్తివుంది. నరసన్నను కన్నతండిరిగా భావించిన చనవు మాటలుంటాయి.
‘ఈ మధుమేహమదేమో/ భామలపై తరుగనట్టి వాంఛలవేమో! శ్రీ మహిళాధవ, భువి/ కడు/ ధీమహితుడు చెప్పలేడు- తెలియుర నృహరీ!’ అంటూ ‘మధు’మోహాన్ని’ కూడా దాపరికం లేకుండా చెబుతారు.
‘ఎంచగ గతమున నెంతో/ మంచిగ పలుకాడు నీవు, మార్చితె మోటౌ చెంచుల ‘కుర్రో’యనివి/న్పించెడి ‘బేవర్సు’ బాస బిత్తరినృహరీ!’ అన్నారు. బేవర్సు బాస అని యధాలాపంగా అనేశారు, చమత్‌‘కారం’గా.
ఉత్తిచమత్కారాలు శక్తిచమత్కారాలై విభిన్న భావ విహారాలై చమత్కారాల చిందుల్తో కందాల విందుల్ని చేసింది ఈ త్రిశతి.
చమత్కారమంటే ‘లోకాతీతమగు వస్తువును చూడగా చిత్తమునకు కలుగు ఆనందహేతువైన వికాసం’ అని అర్థం. ఈ త్రిశతి అటువంటి హృదయ వికాసాన్ని కలిగిస్తుంది. కవిగారు సుమారు అరవై పుటల్లో ‘నామాట’అని వ్రాసింది పఠన యోగ్యమవడం విశేషం. అందులో అనుభవాలు అనుభవసారాలూ వున్నాయి.
‘‘ఇది భక్తికావ్యం కాదు, ఇది అధిక్షేపకావ్యమే. భగవంతునికి తనను తాను అర్పించుకునే ఆర్తినివేదనం, కైవల్య ప్రాప్తికై ఆరాటంకాదు, చెడుపై చెడుగుళ్ళూ ఆడడం, మాటల తూటాలను పేల్చడం బాధ్యతగా కర్తవ్యంగా తలపోస్తూ భగవంతుని నిలదీయడం’’అని ఆచార్య నిత్యానందరావు ‘పద్య పరశువు’ అనే తమ అభిప్రాయంలో అన్నది యదార్ధ వాక్యాలు.
మంచి కవిత్వాలు వస్తున్నాయి. కని పూర్వంలా రసజ్ఞులు, కవితాభిమానులు కవిత్వ ప్రచారం పంపిణీలు చేయలేకపోతున్నారనిపిస్తుంది. చేస్తే ఈ పొత్తం ప్రయోజనదాయకం. ఈ పంచశతి కందాలవిందుల్ని చేస్తూ మనపై చమత్కారాల పన్నీటి చుక్కల్ని చిందిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

  • 21/12/2014
  • -కె.వి.జి. శ్రీనివాస్

అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో అడుగుపెడితే.. లేలేత ఎరుపుతో నవనవలాడే యాపిల్ కాయలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తోటలు కన్పిస్తాయి. స్వర్గానికి నిచ్చెనలు ఇక్కడినుంచే వేయొచ్చన్న భావన మనసును తాకుతుంది. ఇదంతా చూస్తే మీకు అందాల కాశ్మీరం కళ్లముందు కదలాడుతుంది. కానీ ఇది కాశ్మీర్ కాదు. అక్కడున్న అందాలను తనవి చేసుకున్న లమ్మసింగి సొబగులు ఇవి. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఉన్న ఈ గిరిజన పల్లె అందరికీ లంబసింగిగా సుపరిచితమే. ఎముకలు కొరికే చలికి..అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదుతో వార్తల్లోకి ఎక్కింది. పర్యాటకులనూ, ప్రకృతి ప్రేమికులను, శాస్తవ్రేత్తలను రా..రమ్మని పిలుస్తున్న లమ్మసింగి కథాకమామిషు ఇది…. ఆ గిరిజన పల్లె చలికి పుట్టినిల్లు.. కొండకోనల మధ్య ప్రకృతి అందాలు ఆరబోసుకున్న ఓ చిన్నపల్లె… మిట్ట మధ్యాహ్నమైనా ఆ ఊరివేపు తొంగి చూసేందుకు సూరీడు కూడా కాస్తంత జంకుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చలికే వెన్నులో వణుకు పుడుతుంది. శీతాకాలం వస్తే అక్కడ నీరు గడ్డకట్టుకుపోతుంది.. పట్టపగలే చలిమంటలు వేసుకోవాలి. కొండలను ముద్దాడుతూ దిగివచ్చే తేలికపాటి తెల్లమబ్బులు మనను తాకుతూ వెళుతూంటే గుప్పిట్లో బంధించేద్దామా అన్న కోరిక పుట్టుకొస్తుంది. పోగులు పోసినట్టు కనిపించే మంచు ముత్యాలు.. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసుకున్నాయా.. అనిపించే ప్రాంతమది. ఈ సోయగాలను కెమెరాల్లో బంధించాలనుకున్న వారికి.. ఈ సోయగాలను తనివితీరా తిలకించాలనుకునేవారికి అనువైన లోయ ఇది. కొంతకాలం వరకూ ఈ గ్రామం గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రామం ప్రధాన వార్తల్లోకెక్కింది. డిసెంబర్-జనవరి నెలల్లో ఇక్కడ జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇందుకు కారణం. విశాఖకు సుమారు 105 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో లమ్మసింగి ఉంది. ఇక్కడికి ఒక్కసారి అడుగుపెడితే…అదో నవలోకంలా కన్పిస్తుంది. కాశ్మీర్ అందాలన్నీ ఇక్కడ కన్పిస్తాయి. సూరీడు నడినెత్తిమీదకొచ్చినా ఇక్కడ తెల్లవారు జామున ఉండే వాతావరణమే కనిపిస్తుంది. మధ్యాహ్నం దాటితే కానీ వెలుతురు కనిపించదు. ఇంతలోనే చీకట్లు ముసురుకుంటూంటే సూరీడు ఇక సమయం లేదనుకున్నట్లు పడమటి దిక్కుకు పరుగులు తీస్తాడు. కాశ్మీరు, కులుమనాలికి దీటైన అందాలు మన మధ్యనే ఉన్నాయి. తలచుకుంటే కొద్ది గంటల్లోనే ఆ అందాల వాకిట్లోకి వెళ్లిపోవచ్చు. కొడైకెనాల్, ఊటీకో వెళితే ఎలా తన్మయత్వంలో తడిసిపోతామో, సరిగ్గా అలాంటి అనుభూతే లమ్మసింగిలో కూడా కలుగుతుందంటే అతిశయోక్తికాదు. సూర్యుడు నడినెత్తిన ఉన్నా గడియారం చూస్తే తప్ప, ఎంత పొద్దెక్కిందో ఎవ్వరికీ తెలియదు. మనిషి ఎదురుగా నిలిచినా ఆనవాలు పట్టలేనంత దట్టమైన మంచు. పట్టపగలు లైట్లు వేసుకుని తిరుగాడే వాహనాలు.. ఇదీ.. లమ్మసింగి ప్రత్యేకత. నర్సీపట్నం-చింతపల్లి మధ్య లమ్మసింగి ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ ప్రాంతం కాశ్మీరు లోయలా కొత్త అందాలతో మెరిసిపోతుంది. సాధారణ రోజుల్లో రాష్ట్రం అంతా ఎండలు మండిపోతున్నా, అక్కడమాత్రం ఐదు నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇక్కడ రాత్రి పూట దుప్పటి కప్పుకోవలసిందే. ఇక ఈ సీజన్‌లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలోకి వాతావరణం చల్లగా జారుకున్నప్పుడు చెట్టు.. చేమ.. కొండ.. కోన అన్నీ మంచు తో చేసినట్లు కన్పిస్తాయి. ప్రకృతి కాన్వాస్‌పై గీసిన అద్భుత దృశ్యమిది. ప్రకృతి అందాల మాటున కష్టాలెన్నో కేవలం 500 మంది జీవించే పల్లె ఇది. లమ్మసింగి పంచాయతీ పరిధిలో 18 చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఇక్కడి ఇళ్ళు విసిరేసినట్టు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. విపరీతమైన చలి, మంచు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నా, ఇక్కడి గిరిజనులకు మాత్రం ఈ చలే శాపంగా పరిణమించింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఇక్కడి గిరిజనులవి. బయటకు వెళ్లి కాయకష్టం చేయకపోతే కానీ కడుపునిండదు. అలాంటి వీరికి చలి అవరోధంగా నిలిచింది. చలికి భయపడి పనుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. బయటకు రాలేక, పనులు చేసుకోలేక సతమతమవుతున్నారు ఇక్కడి అడవి బిడ్డలు. వృద్ధులు, చిన్న పిల్లలు చలికి పండుటాకుల్లా వణికిపోతుంటారు. పర్యాటకశాఖ చిన్న చూపు అందచందాల్లో కాశ్మీర్‌ను తలదనే్న లమ్మసింగి పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడికి కొద్దిపాటి దూరంలోనే ఉన్న అరకు ప్రపంచ పర్యాటకలను ఆకర్షిస్తోంది. ఆంధ్రాలో ఓ కాశ్మీరు దాగి ఉందని బాహ్య ప్రపంచానికి తెలిసేట్టు మన పర్యాటక శాఖ చేయలేకపోయింది. ప్రకృతి అందాలు ఆహ్వానిస్తున్నా పర్యాటకులు ఒకటి, రెండు రోజులు ఇక్కడ గడిపేందుకు తగిన వసతులు లేవు. పర్యాటకులు ఇలా వచ్చి, అలా వెళ్లిపోవలసిందే తప్ప, మంచుతెరల చాటున దాగిన లోయ అందాలను తనివితీరా చూద్దామంటే తగిన వసతి లేక వెళ్లిన కొద్దిసేపటికే వెనుదిరగాల్సి వస్తోంది. ఇక్కడ కనీసం కాకా హోటళ్ళు కూడా కనిపించవు. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు తమ వెంట తినుబండారాలు విధిగా తీసుకువెళ్లాల్సిందే. ఈ గ్రామంలో కూరగాయలు కూడా దొరకవు. వారానికోసారి జరిగే సంతకు వెళ్లి ఇక్కడి గ్రామస్తులు కూరగాయలు కొనుగోలు చేసుకుంటారు. స్వచ్ఛమైన పల్లె అంతా వ్యాపారమయమైన రోజుల్లో.. అలాంటి వాసనలు సోకని స్వచ్ఛమైన అడవి పల్లె ఈ లమ్మసింగి. చెట్లమీద పూలతో పోటీ పడుతూ రంగు రంగుల చీరలతో అందంగా.. అమాయకంగా కనిపించే యువతులు చెట్ల కొమ్మల చాటు నుంచి తొంగి చూస్తూ కనిపిస్తారు. మంచు తెరల మధ్య నుంచి నీళ్ళ కడవలతో వరుసగా నడిచివచ్చే గిరిపుత్రికలు చూడ ముచ్చటగా ఉంటారు. కట్టు..బొట్టు నుంచి ప్రత్యేకంగా కనిపించే వీరిని కెమెరాల్లో బంధించాలనుకునేవారికి ఇంతకు మించిన రమణీయ దృశ్యాలు ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అసలు పేరు కొర్రుబయలు లమ్మసింగికి మరోపేరు కొర్రుబయలు. ఈ పేరు వెనుక చిన్న కథ ఉంది. కొర్రు అంటే బిగుసుకుపోవడం అని, బయలు అంటే బయట అని అర్థం. ఓసారి ఈ గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి ఆరు బయట చలిలో కూర్చుని బిగుసుకుపోయాడట. అప్పుడు ఆ వ్యక్తి పెట్టిన పేరే కొర్రుబయలు. కాలక్రమేణా ఈ పేరు తెరమరుగై, లమ్మసింగిగా రూపాంతరం చెందింది. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి గ్రామం ఉంది. ఇది సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తున ఉంది. దీనికి మరో 2,000 అడుగుల ఎగువన లమ్మసింగి ఉందన్నమాట. అంటే లమ్మసింగినుంచి చూస్తే కాళ్లకింద ఉన్నట్లు తాజంగి పల్లె కన్పిస్తుంది. అక్కడ కూడా ఇదే వాతావరణం దర్శనమిస్తుంది. చల్లని గాలితెమ్మెరలు మనసును ఉత్సాహపరుస్తాయి. ఇక్కడి నుంచే పొగమంచు లమ్మసింగి వైపు పరుగులు తీస్తుంటుంది. లమ్మసింగి యాపిల్ వస్తోంది… యాపిల్ అంటే కాశ్మీర్, సిమ్లా గుర్తుకు వస్తాయి. సీజన్‌లో ఇబ్బడిముబ్బడిగా యాపిల్స్ అక్కడి నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇకపై మనం సిమ్లా నుంచో కాశ్మీర్ నుంచో యాపిల్స్ దిగుమతి చేసుకోనక్కర్లేదు. లమ్మసింగిలో ఇంతకన్నా నాణ్యమైన యాపిల్స్ దొరకనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత, ఏటా 1000 నుంచి 1200 మిల్లీ మీటర్ల వరకూ కురిసే వర్షం ఈ ప్రాంతానికి కలిసి వచ్చింది. అదే యాపిల్ సాగుకు ఉపకరించింది. సాధారణంగా గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ పసులు, క్యారెట్, పైనాపిల్, క్యాబేజీ పండిస్తుంటారు. వీటితోపాటు యాపిల్ కూడా ఇక్కడ పండించగలమని నిరూపించారు. ఐదు డిగ్రీకల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట యాపిల్ సాగుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వాతావరణం లమ్మసింగిలో ఉండడంతో సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సంస్థ ఇక్కడ యాపిల్ పండించే విషయమై అధ్యయనం చేసి, పరిశోధనలు ప్రారంభించింది. యాపిల్ సాగుకు ఇది మంచి ప్రాంతమని నిర్ధారించింది. 60 మంది రైతులతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇప్పుడు యాపిల్స్ ఇక్కడ కాస్తున్నాయి. నాలుగేళ్ల కిందట రాంబాబు అనే రైతు యాపిల్ విత్తనం నాటారు. అది మొక్కగా ఎదిగింది. నాలుగు సంవత్సరాలకు కాయలు కాశాయి. కాశ్మీర్ యాపిల్‌ను తలదనే్న యాపిల్ చేతికందింది. ఇంకేం..కాశ్మీర్, సిమ్లా మాదిరి యాపిల్, స్ట్రాబెర్రీ కూడా పండించగలమన్న ధీమా ఇక్కడి రైతుల్లో వచ్చింది. అంటుకట్టిన మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు కాపు మొదలై 40 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి. అదే రూట్ స్టాగ్ మొక్కలను నాటితే రెండేళ్లకే పంట మొదలై, 20 ఏళ్లవరకూ పంటనిస్తాయి. ప్రస్తుతం గిరిజనులు యాపిల్ సాగులో నిమగ్నమై ఉన్నారు. లమ్మసింగి యాపిల్ తినేందుకు సిద్ధంగా ఉండండి మరి! బాక్సైట్ బాంబ్ పేలుతుందా? లమ్మసింగికి కొద్దిపాటి దూరంలోనే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. చాలాకాలంగా పెద్దల కళ్ళు వీటిపైనే ఉన్నాయి. ఈ ఖనిజాన్ని వెలికి తీయడానికి పర్యావరణవేత్తల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు కార్పొరేట్ సంస్థలు కాస్త వెనుకంజ వేస్తున్నాయి. కానీ సమీప భవిష్యత్‌లోనే ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ఇక్కడున్న ప్రకృతి రమణీయత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ చల్లని వాతావరణం కాలుష్యమయమవుతుంది. ప్రకృతి కన్నీరు కార్చకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెన్సీ చెట్ల కథ తెలుసా…? లమ్మసింగికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏపుగా పెరిగే కొన్ని చెట్లను కరెన్సీ నోట్లను తయారు చేయడానికి మాత్రమే వాడతారు. లంబసింగికి సమీపంలోని జాలికొండ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కన్పిస్తాయి. ప్రస్తుతం దాదాపు 30 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కలను మరిన్ని ప్రాంతాల్లో పెంచేందుకు ప్రయత్నించినా పరిస్థితులు సానుకూలంగా లేక ఫలితమివ్వలేదు. కారణాలు ఇతమిత్థంగా తెలీదు. ఇక్కడివారు మాత్రం వీటిని కరెన్సీ చెట్లనే పిలుస్తారు. వాటి శాస్ర్తియనామం వారికి తెలీదు. ఇటీవలి హుదూద్ తుపాను తీవ్రతకు కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. వీటి పరిరక్షణకు అటవీశాఖ రంగంలోకి దిగింది. రెండోస్థానం ఆదిలాబాద్‌దే తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఏపీలోని లంబసింగి మొదటి స్థానంలో ఉంటే తెలంగాణలోని ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉంది. ఆ జిల్లాలో 90శాతం అటవీప్రాంతమే. దట్టమైన అడవులు, చుట్టూ ఉన్న చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని అటవీప్రాంతాలవల్ల శీతల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉట్నూరు, ఆసిఫాబాద్, బోధ్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ. ఈఏడాది ఇప్పటికి కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదైంది. ఈనెలాఖరుకు, జనవరి తొలివారంలో అది 2 డిగ్రీలకు పడిపోవచ్చు. దట్టమైన పొగమంచు కప్పుకుని, ఎండ పొడకూడా పడని తండాలు ఈ జిల్లాలో ఎన్నో. రోజుల తరబడి సూరీడు తలెత్తి చూడని పల్లెలకు లెక్కేలేదు. కాఫీ.. మిరియాలూ ప్రత్యేకం లంబసింగిలో మంచు, పొగమంచు, చల్లనిగాలులు ఎంత సాధారణమో కాఫీ, మిరియాల సాగూ అంతే. అందమైన కాఫీ మొక్కల పూలు ధవళవర్ణంతో మంచుతో పోటీపడుతూ ధగధగలాడుతూ కనువిందు చేస్తాయి. నిజానికి వీటిని చూస్తే పెద్దపెద్ద తెల్లని చామంతుల్లా కన్పిస్తాయి. కాఫీ తీగలకు దండ గుచ్చినట్లు అందంగా విరిసి ఉంటాయి. గబుక్కున చూస్తే వాటిని చామంతులనే అనుకుంటాం. కడిగిన ముత్యంలా తెల్లటి పూలను చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది. లంబసింగితోపాటు చింతపల్లి ఏజెన్సీ అంతటా మిరియాల సేద్యం పుంజుకుంది. ఇక్కడి మిరియాలకు ఘాటుకూడా ఎక్కువే. కాఫీ సేద్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. మన కాఫీ గింజలు ఎగుమతికి తగిన నాణ్యతతో ఉన్నాయంటే లంబసింగి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. లంబసింగి కథ చదివాక మీకు అనిపిస్తోంది కదూ అక్కడికి వెళ్లాలని. బయలు దేరండి మరి. లమ్మసింగికి దారేదంటే.. అతి శీతల ప్రాంతమైన లమ్మసింగికి వెళ్లాలంటే నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా 32 కిలో మీటర్లు ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి లమ్మసింగికి 240 కిలోమీటర్లు. భద్రాచలం నుండి నెల్లిపాక, జికెవీధి మీదుగా ఇక్కడికి చేరుకోవాలి. ఒంపుసొంపుల ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించి లమ్మసింగి చేరుకోవలసి ఉంటుంది. అక్కడికి వెళ్లాలనుకునేవారు ఒకటికి రెండు స్వెట్టర్లు, లేదా జర్కిన్‌లు ఎక్కువ తీసుకోవలసిందే. అచ్చమైన అమాయకత్వం లమ్మసింగిలో ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలూ అలాగే ఉంటారు. మాయామర్మం ఎరగని గిరిపుత్రులు కొత్తగా వచ్చే వారిని విచిత్రంగా చూస్తారు. పలకరించడానికి సిగ్గుపడతారు. మనం చొరవచూపితే మొహం చాటేస్తారు. వారిని ఫొటోలు తీద్దామని ప్రయత్నిస్తే, ముఖం దాచేసుకుంటారు. భయంతో పారిపోతారు. ఇదంతా పరిచయం అయ్యేవరకే. మనపై నమ్మకం కుదిరేవరకే… ఒక్కసారి వారితో మాట్లాడి మచ్చిక చేసుకుంటే, వారి ఆదరాభిమానాలకు మనం మురిసిపోవలసిందే. అంత చల్లదనం ఎలా… భూ ఉపరితలం నుంచి 18-20 కిలోమీటర్ల వరకు టోపోస్పియర్ ఉంటుంది. భూ ఉపరితలం నుండి 164 మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూంటుంది. నిజానికి లంబసింగి నైసర్గికంగా కీలక ప్రాంతంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉంది. దీంతో చల్లదనం మామూలే. చుట్టూ ఎత్తుగా తూర్పుకనుమలు విస్తరించడం, లోతైన లోయలు, చిక్కటి అడవి, శీతలగాలుల తీవ్రత, బొగ్గుపులుసు వాయువు తక్కువగా ఉండటం వల్ల లమ్మసింగిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మంచి శీతాకాలంలో జీరో అంతకన్నా తక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. 2007నుండి మార్పు మరింతగా కన్పిస్తోంది. 2010లో తొలిసారిగా, అధికారికంగా జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలికి గజగజలాడాల్సిందే. -డి.శేఖర్, శాస్తవ్రేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, చింతపల్లి రూ. 5 కోట్లతో రిసార్టు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన లమ్మసింగిని అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఆరు ఎకరాల్లో 25 గదులతో కూడిన రిసార్ట్‌ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఈ రిసార్ట్ బయటకు పూర్తిగా గిరిజన సంప్రదాయంతో కనిపిస్తుంది. లోపల మాత్రం ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ రిసార్ట్ మధ్య ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయనున్నాం. ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్‌గా దీన్ని తీర్చదిద్దాలని భావిస్తున్నాం. సీజన్‌లో చాలామంది అరకు వెళ్లాలనుకుంటారు. అంతకన్నా రమణీయ దృశ్యాలు ఉన్న లమ్మసింగిని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఓ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పాడేరు-చింతపల్లి-లమ్మసింగి-కెడి పేట మధ్య ఈ టూరిజం సర్క్యూట్ ఉంటుంది. విశాఖ నుంచి పర్యాటక శాఖ ప్యాకేజి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. -భీమ శంకరం , డివిజనల్ మేనేజర్, పర్యాటక శాఖ **

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏపీలో భాజపాకు మంచి రోజులు?

ఏపీలో భాజపాకు మంచి రోజులు?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 21/12/2014
TAGS:

ఇప్పటికే ఉన్న సూచనలు గత ఆదివారంనాడు స్పష్టమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా మారేందుకు బిజెపి నాయకత్వం ఇక తుది నిర్ణయం తీసుకున్నట్లే. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినరాంమాధవ్ డిసెంబర్ 14న హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ‘‘స్థానిక సంస్థలనుంచి లోక్‌సభ వరకు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ బిజెపి అభ్యర్థులు రంగంలో ఉంటారు’’, అని అరమరికలు లేని విధంగా ప్రకటించారు.
దీనిపై ప్రస్తుతం వారి మిత్రపక్షమైన టిడిపి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా వారు ఆ విషయమై చర్చించుకునే ఉంటారు. అందుకు తమ ప్రతివ్యూహం ఏ విధంగా ఉండాలన్న ఆలోచన సీరియస్‌గా చేయవలసిన దశ ఇంకా వచ్చిందనలేము గాని, అధినాయకుడు చంద్రబాబు మనసులో ఒకచోట రాంమాధవ్ ప్రకటన తప్పక నమోదై ఉంటుంది. అట్లా నమోదుకావడమంటే అర్థం వ్యూహరచన దిశగా నెమ్మదిగా ఆలోచనలు జరుగుతాయని. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో ఈ కోణంనుంచి ఆసక్తికరమవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలహీనమైన పార్టీ అని అందరికీ తెలిసిందే. తెలంగాణలోకన్నా బలహీనమైనది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రత్యామ్నాయం కాగలమని పార్టీ నాయకులు పైకి అంటున్నప్పటికీ, అందుకు అవకాశాలు తమ పరిస్థితి మెరుగ్గా ఉన్న తెలంగాణ కన్న, నామమాత్రంగాగల ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. ఇదొక చిత్రమైన స్థితి అయినా వాస్తవం. అందుకు కారణాలు ఊహించేందుకు రాజకీయ పాండిత్యం అవసరం లేదు కూడా.
అధికారంలోగల పార్టీల మాట అట్లుంచితే, ప్రతిపక్ష క్షేత్రంలోగల శూన్యత ఎటువంటిదన్నది ఇటువంటి వ్యూహాలకు ప్రధానమవుతుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపికి టిడిపితో పొత్తు ఉన్నా, అది బిజెపికి కలిసిరాని బంధంగా మాత్ర మే కొనసాగుతున్నది. మొత్తానికి టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానంలోకి రాగల అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇందుకు భిన్నం. అక్కడ కాంగ్రెస్ లేదు. రాగల అవకాశాలు స్వల్పం. వామపక్షాలకు అవకాశం శూన్యం. ప్రతిపక్ష క్షేత్రంలో మిగిలింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. అది యథాతథంగా బలంగానే ఉంది. అటువంటి స్థితిలో టిడిపికి బిజెపికి ప్రత్యామ్నాయంగా కాగలగటం ఎట్లా సాధ్యం?
ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. బిజెపి ఎదుగుదలకు రెండు లక్ష్యాలుంటాయి. అది వీలైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్థానంలో రెండవ శక్తిగా మారటం కావచ్చు, లేదా రాజకీయ రంగాన్ని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలతో కలిపి ముక్కోణంగా మార్చటం కావచ్చు. ప్రస్తుతం ద్వికోణంగా ఉన్న స్థితిని మిత్రపక్షమంటూ లేకుండా తనంతట తాను ముక్కోణంగా మార్చగలిగినా అది చెప్పుకోదగ్గదే అవుతుంది. లేదా అన్నీ కలిసివస్తే 2019నాటికో, తర్వాతనో తమదే రెండవ స్థానమైనా కావచ్చు.
ఇంతకూ బిజెపిని ఏ మార్గంలో శక్తివంతం చేయనున్నారు? తమ సిద్ధాంతాలు ప్రచారంచేసి, ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసి సంస్థను ఒక్కొక్క ఇటుకగా పేర్చుకుంటూ అభివృద్ధిపరచటం ఒక పద్ధతి. తాము కేంద్రం లో అధికారంలో ఉన్నందున దానిని ఆకర్షణగా చూపి ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులను, ఏ పార్టీకి చెందని వారిని చేర్చుకోవటం ద్వారా ఆ పనిచేయటం రెండవ పద్ధతి. మూడవ పద్ధతిగా ఈ రెండు మార్గాలనూ మేళవించవచ్చు.
ఇక ప్రజల సమస్యలపై ఉద్యమాలకు సంబంధించి గల ఇబ్బందులేమిటో తెలిసిందే. తాము భాగస్వామిగాగల కూటమి అధికారంలో ఉన్నపుడు ఉద్యమాలంటే తమపై తాము ఉద్యమించుకోవటమే. ప్రచారాల ద్వారా విస్తరించబూనటం తెలుగుదేశం పార్టీకి సరిపడదు. అది తమకు ప్రమాదకరమని భావిస్తారు వారు. అపుడు రెండుపార్టీల మధ్య ఘర్షణలు కాకపోయినా ఉద్రిక్తతలు తలెత్తుతాయి. మిత్ర సంబంధాలు దెబ్బతింటాయి. అంతమాత్రాన ఒక పార్టీ తననుతాను బలోపేతం చేసుకోకుండా మిన్నకుంటుందని కాదు. కాని పరిస్థితి కొంత సున్నితంగా ఉంటుంది. దానిని ఎదుర్కొంటూ పని చాకచక్యంగా సాగించటం తిరిగి సమయం తీసుకునేదే. మరొకవైపు ఏవో ఒక ఎన్నికలు, చివరకు 2019 ఎన్నికలు వచ్చిపడతాయి.
ఈ స్థితిలో, మనకు వినవస్తున్న మాటలు నిజమే అయిన పక్షంలో, బిజెపి నాయకత్వం ఇతర పార్టీల నాయకులను, తద్వారా ఆయా సామాజిక వర్గాల వారిని, ప్రాంతాలవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందనుకోవాలి. అట్లా కొద్దిమంది ముఖ్యులు ఇప్పటికే చేరారు. కావూరి సాంబశివరావు, పురంధీశ్వరి వంటి వారి ప్రాబల్యం గురించి తెలిసిందే. మరికొన్ని పెద్ద పేర్లు వినవస్తున్నాయి. వీరు ప్రధానంగా కాంగ్రెస్ కుటుంబీకులు. ఆ పార్టీ పరిస్థితి అక్కడ దయనీయంగా మారినందున అక్కడినుంచి, అదే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి అనిశ్చయంగా మారుతున్నందున రానున్న కాలంలో చాలా చేరికలు ఉండగలవన్నది అంచనా. ఇటువంటి వారికి వేరే మార్గం లేదు కూడా. టిడిపిలోకి వెళ్లటం కష్టం. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలహాలున్నాయి. అందరూ కలిసి స్వంత పార్టీ కొత్తగా ఏర్పాటుచేయలేరు. కనుక బిజెపి ఒక్కటే మార్గం. పైగా అది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇతరత్రా దేశంలో ఇంకా బలపడుతున్నట్లు తోస్తున్నది. మరొకవైపు చూస్తే, బిజెపి ఈ పద్ధతిలో బలపడటం టిడిపికి బెరుకుపుట్టించవచ్చు.
మొత్తానికి ఇందువల్ల జరిగేది ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఒక స్వతంత్ర శక్తిగా ముందుకు రావటం. అయితే అందుకు ఇతర పార్టీల వారిని ఆకర్షించగల ఏకైక అయస్కాంతం జాతీయ స్థాయిలో బిజెపికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండగల బలం. ఒకవేళ ఏ కారణంవల్లనైనా అది బలహీనపడితే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఇసుక గూడు అవుతుంది. కనుక రాష్ట్ర బిజెపి నాయకత్వం కీడెంచి మేలెంచే పద్ధతిలో దీనినికూడా పరిగణనలోకి తీసుకుంటూ కనీసం ఒకమేరకైనా ‘ఒక్కొక్క ఇటుక’ నిర్మాణ సూత్రాన్ని అనుసరించటం వారికే మేలుచేస్తుంది.
పోతే, టిడిపి నాయకత్వానికి ఇది నచ్చగల పరిస్థితికాదని వేరే చెప్పనక్కరలేదు. ఏ పార్టీఅయినా తమకు ఎదురులేని అధికారం కావాలని కోరుకుంటుంది. తాము ఇకనుంచి అన్ని ఎన్నికలలో తమంతట తాము పోటీచేయగలమని ప్రకటించిన రాంమాధవ్‌కు ఇది తెలియనిది కాదు. దీని అర్థం రెండు పార్టీల పొత్తు తెగిపోగలదని ఎంతమాత్రం అనుకోవద్దు. కాకపోతే బిజెపి బలం పెరిగినకొద్దీ టిడిపి ఎక్కువ సీట్లు కేటాయించవలసి వస్తుంది. అంగీకారాలు కుదరనపుడు ‘మైత్రీపూర్వక పోటీలు’ జరుగుతాయి. ఇదంతా మనం ఇతర పార్టీల మధ్యనేగాక బిజెపి-శివసేన, బిజెపి- బిజూజనతాదళ్ సంబంధాల విషయంలో కూడా చూసిందే.
దీనికి కీలకం ఇక్కడ టిడిపి, ఢిల్లీలో బిజెపి ఎంత జనాకర్షకంగా పాలిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధిపరచి, గతంలోవలెగాక మానవాభివృద్ధి మార్గంలో అన్నివర్గాల ప్రజలకు మేలుచేసిన పక్షంలో, బిజెపి పెరుగుదలవల్ల కలిగే సవాలును ఎదుర్కొనగలుగుతారు. అదే విధంగా పైన చెప్పుకున్నట్లు, ఎన్‌డిఎ ప్రభుత్వపాలన ఇక్కడ బిజెపికి ప్రాణాధారమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కడ పట్టుతప్పినా ఏమి జరిగేదీ ఊహించటం పెద్ద కష్టం కాదు. అది వైఎస్‌ఆర్‌సిపికి, కాంగ్రెస్‌కు కొత్త ఊపిరులిచ్చినా ఆశ్చర్యం ఉండదు.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

  • 21/12/2014
TAGS:

ముషీరాబాద్, డిసెంబర్20: దేశంలో సోషలిస్టు భావాలకు ఒక భూమిక ఏర్పడటానికి సంత్‌గాడ్గే బాబా మహరాజ్ భోదనలు, కీర్తనలు ఎంతగానో ఉపకరించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సంత్‌గాడ్గే బాబా మహారాజ్ అంబేద్కర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాడ్గేబాబా 58వ వర్థంతి కార్య క్రమం నిర్వహించారు. సంస్ధ చైర్మన్ అందోల్ నర్సింగ్‌రావు ఆధ్వర్యంల సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో జరిగిన కార్యక్రమానికి చిలకలగూడ సిఐ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర సంచారి అయన గాడ్గేబాబా జనం మదిలో చిరస్తాయగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో డా. సి. రాజా, రజనీకాంత్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సంత్‌గాడ్గే వర్థంతి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20: వాగ్గేయకారుడు సంత్‌గాడ్గె బాబా 58వ వర్థంతి సభను పట్నంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంత్‌గాడ్గె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జన సమితి కన్వీనర్ కంబాలపల్లి సాయినాథ్, టిఆర్‌ఎస్ నాయకులు భర్తాకి రాజు, ఎల్లేష్, ఎండి అస్లం, బిఎస్పి నాయకులు మేడిపల్లి మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కప్పాటి రఘు మాట్లాడుతూ రజక కులంలో పుట్టి వాగ్గేయకారునిగా ఎదిగిన సంత్‌గాడ్గె మహనీయుడని కొనియాడారు.

గాడ్గేబాబాకు ఘన నివాళి
నల్లకుంట, డిసెంబర్ 20: స్వఛ్చతను పరిశుభ్రతను ప్రతి పౌరుడు ఆచరించాలన్న గాడ్గేబాబా అన్నారని సెయింట్ గాడ్గే బాబా మహారాజ్ మిషన్ అధ్యక్షుడు అమరజ్యోతి, ప్రధాన కార్యదర్శి కొండేటి నాగేశ్వరరావుఅన్నారు. శనివారం డిడీ కాలనీలోని సంహయోగ కేంద్రంలో గాడ్గేబాబా 58వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసిన అనంతఠం వారు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పారిశుద్ధ్య ప్రాముఖ్యతను చాటి చేప్పి ప్రజలలోచైతన్యం కలిగించిన మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. గాడ్గేబాబా తన కీర్తనలతో సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలడానికి కృషి చేశారన్నారు. నేటి యువత ఆయన ఆలోచన విధానాలను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బాబాసాహెచ్ అంబేద్కర్ కూడా గాడ్గేబాబా ప్రవచనాలు ఆదర్శనీయమని ఎన్నో సందర్భాలలో పేర్కొన్నట్టు తెలిపారు. చీపురు పట్టుకుని స్వఛ్చ్భారత్‌లో భాగంగా గ్రామగ్రామాన తిరిగి గ్రామాలను తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలకుస్ఫూర్తినింపారన్నారు.ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు డా.సి.రాజు, వి.సత్యనారాయణ, జి.మస్తానయ్య, ఆంజనేయులు, టి.సాంబశివరావు, ఆర్‌ఎన్. విశ్వాస్, ఎంఎన్ రావు, రజనీకాంత్, కనకయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం

నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం

  • 21/12/2014
TAGS:

హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సాయంత్రం సికిందరాబాద్ టివోలి గార్డెన్స్‌లో ‘శివానంద ఎమినెంట్ అవార్డు- 2014’ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుల పక్షాన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి కె.బసవరాజు తెలిపారు. ఈ పురస్కారాలను ఈ సారి భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు, పద్మభూషణ్ మహామహోపాధ్యాయ డా.సత్యవ్రత్ శాస్ర్తీలకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సద్గరు శివానందమూర్తి అనుగ్రహభాషణం చేయనున్నట్లు వివరించారు.
పురస్కార గ్రహీతలు వీరే!
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన పలువురు ప్రముఖులకు ప్రతి ఏటా శివానంద ఎమినెంట్ అవార్డులను ప్రదానం చేసి సత్కరించుకునే ఆనవాయితీని చాలా కాలంగా ట్రస్టు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పురస్కారాలు స్వీకరించిన ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. వీరిలో భారత రత్న ప్రొఫెసర్ సి.ఎన్.రావు బనారస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్‌సి, యుఎస్‌ఏలో పిహెచ్‌డి చేసిన తరువాత అనేక పరిశోధనలు చేసి 63 విశ్వవిద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్‌లు పొందారు. అనేక విజ్ఞానశాస్త్ర అకాడమీలకు సభ్యులుగా వ్యవహరించారు. అనేక సేవలందించి పతకాలు, అవార్డులు స్వీకరించి, ప్రముఖులచే మన్ననలు పొందారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులనిచ్చి సగౌరవంగా సత్కరించిందని నిర్వాహకుల పక్షాన బసవరాజు తెలిపారు.
పురస్కారాన్ని స్వీకరించనున్న మరొక ప్రముఖులు డాక్టర్ సత్యవ్రత్ శాస్ర్తీ సంస్కృతంలో బి.ఎ ఆనర్స్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ సంస్కృతం మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బనారస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారని, 45 సంవత్సరాలుగా బోధనా శాఖలో డీన్‌గా, సంస్కృతిశాఖ అధిపతిగా, ఒడిషా రాష్ట్రంలోని పూరిలోని శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అత్యుత్తమ సేవలందించారు. సంస్కృతంలో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి విద్యావేత్త సత్యవ్రత్ శాస్ర్తీ అని బసవరాజు పేర్కొన్నారు. వీరికి పురస్కారాలను ప్రదానోత్సవం చేసేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో తొలుత సాయంత్రం 5 గం. ల 45నుండి 45 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
chitram..
సద్గురు శివానంద మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరికీ న్యాయం చేసే రాజధాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మాభిమానమే అసలు సమస్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జార్ఖండ్ కాశ్మీర్ లలో ఎవరికెన్ని?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1

ముందు మాట  –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14

డా.శ్రీ అసిలేటి నాగ రాజు -ప్రముఖ కధకులు  స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటి పై పరిశోధన చేసి రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో శర్మ గారి అభ్యర్ధన మేరకు నేనూ పాల్గొన్నాను .అదే నాగరాజు గారితో మొదటి పరిచయం .సుమారు వారం క్రితం నాగ రాజు గారు ఫోన్ చేసి తానూ ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’కదా సంకలం తెస్తున్నానని ,ముందుమాట రాయమని కోరగా సరేనన్నాను .ఇరవై అయిదు కధలను వివిధ వయసులలో ఉన్నవారు రాసిన కధలు ఇవి .అందులో ఆరుగురు వికలాంగులు కూడా ఉండటం సంకలనానికి నిండు దనం తెచ్చింది .నాగరాజు కూడా వికలాంగుడే. లబ్ధ ప్రతిస్టూ లైన అడవి బాపిరాజుగారు ,  ,జూపాక సుభద్ర గారల కధలు కూడా ఉండటం తో మరింత శోభ చేకూరింది .కద కద కోసం కాకుండా జీవిత సత్యాన్వేషణ కోసం రాసిన కధలివి .వికలాంగుల మానసిక వేదన ,సమాజం వారిపట్ల చూపే నిరాదరణలను అధిగమించి నిత్య చైతన్యం తో విధి ఎర్పరచిన వక్రత ను అవక్ర పరాక్రమమైన ధైర్యం తో ఎదుర్కొని ,లక్ష్యాన్ని ఎన్నుకొని ,గమ్యం చేరే విధానం దాదాపు అన్ని కధల్లోనూ స్పుటం గా కన్పించింది .ఆశా దీపం ఆరిపోకుండా కాపాడుకొనే చిత్తస్థైర్యం ముగ్ధులను చేస్తుంది .తాత్కాలికం గా  కుంగి పోయినా బంతి లాగా మళ్ళీ ఎగిరేపాత్రలుదిశా నిర్దేశం చేస్తాయి .వికలాంగు లైనా వారి మనసు వికలాంగం కాదు .అందులో సంపూర్ణ వికసనం దర్శిస్తాం .హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్ ,స్టీఫెన్ హాక్ లాంటి వారి జీవితాలను తెలుసుకొని స్పూర్తి పొందిన వారికధలే ఇవి .,నిరాశా ,నిస్పృహలతో ఆత్మ హత్య చేసుకో కుండా ,ఆత్మ స్థైర్యం తో జీవించిన వారి కధలు, గాధలే  ఇవి .అందుకే ‘’సర్వాంగ సుందరం ‘’అన్నాను .

ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రక మైన ఆత్మ ఘోష .జీవితపు మాధుర్యాన్ని జుర్రుకోవాలనే ఆలోచన ,తానూ ఎదిగి తన లాంటి నిర్భాగ్యులకు సేవ చేయాలనే కృత నిశ్చయం ఈ కధల్లో ఉన్న అంతస్సూత్రం .కృత్రిమత మచ్చుకు కూడా కనపడ కుండా సహజ సుందరం గా రాసిన ఈ కధల్లో ఆయా పాత్రల అస్తిత్వం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది .పాత్రల మనో నిబ్బరానికి ,ఆదర్శాలను ఎంచుకొన్న వైనానికి ముచ్చట పడతాం .ఇవికధలు కావు –జీవితపు సత్య చిత్రణలే అనిపించేంత గొప్ప గా దాదాపు అందరూ రాశారు .మాండలికం లో రాసినా ,లంబాడీ తండా భాషలో రాసినా కధలు అందం గా వచ్చాయి .మనసుకు పడతాయి ఆలోచింప జేస్తాయి .’’మన కర్తవ్యం ఏమిటి ?’’అనే దుగ్ధను రేకెత్తిస్తాయి .ఈ కదాసంకలనం చదవటం నాకు గొప్ప అను భూతిగా ఉంది .దీనిపై నాలుగు మాటలు రాయటం నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇవి ముద్రణ పొంది మిగిలిన వారికి స్పూర్తి ,ప్రేరణ కలిగిస్తాయన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాజకీయం కట్టిపెట్టి అభివృద్ధి చేయండి -సీనియర్ పాత్రికేయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్రమార్కుల పాలిటి రుద్రకళ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

స్పానిష్ మహిళ

‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం ,ప్రగతి శీల స్వభావం  నటనా  అన్నిటికి మించి ఆప్యాయతా మూర్తీభవించిన స్నేహలతా రెడ్డి ఆరేబియా దేశంలో ఆడెన్ నగరం లో సంపన్నస్పానిష్  క్రైస్తవ కుటుంబం లో 1934లో జన్మించింది .పేరు స్నేహలతా పావెల్ .ఆమె తండ్రి రాయల్ ఆర్మీ సర్వీస్ కోర్ లో మేనేజర్ .

నేర్చిన నాట్య రీతులు

జబల్పూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి  మద్రాస్ లో చదివి డిగ్రీ పాసైంది .బెంగుళూరు లో కదక్ నృత్యాన్ని సోహన్ లాల్ దగ్గర ,భారత నాట్యాన్ని మీనాక్షి సుందరం ఎల్లప్ప  ల వద్ద అభ్యసించి మెరుగులు దిద్దుకొంది .ఈ రెండు నాట్యాలలో గొప్ప ప్రావీణ్యం సాధించి దేశ వ్యాప్తంగా పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చి ప్రతిభా పాటవమూ ప్రదర్శించి మెప్పునూ పొందింది .పాశ్చాత్య నృత్య రీతులనూ తెలుసుకోవాలనే కాంక్ష ఆమెకు బాగా ఉండేది .అందుకోసం స్పెయిన్ దేశం వెళ్లి రెండేళ్ళు ఉండి వివిధ  పాశ్చాత్య నృత్య విధానాలను నేర్చి ఆకళింపు చేసుకొన్నది .

నాటక సమాజం –ప్రదర్శనలు

1959లో మద్రాస్ కు తిరిగి వచ్చి స్థిర పడింది .అక్కడి కళా కారులను సమీకరించి ‘’మద్రాస్ ప్లేయర్స్ ‘’అనే నాటక సమాజాన్ని నెల కోల్పింది .చాలా నాటక ప్రదర్శనలిచ్చి గుర్తింపు పొందింది. ఇబ్సన్ రాసిన ‘’పీర్ జ్యంట్ ‘’,షేక్స్పియర్ రచించిన ‘’ట్వెల్ఫ్త్  నైట్’’,టేన్నీసీ విలియమ్స్ రాసిన ‘’నైట్ ఆఫ్ ది ఇగూనా ‘’మొదలైన నాటకాలను ప్రదర్శించి పేరు తెచ్చుకోంది .ప్రసిద్ధ దర్శకులు డగ్లాస్ అల్జీర్స్ పీటర్ కో  వీటికి దర్శకత్వం వహించారు . తానూ స్వయంగా నటించి డైరెక్ట్ చేసిన నాటకాలలో ముఖ్యమైనవి –‘’ఏ వ్యూ ఫ్రం దిబ్రిడ్జ్ ‘’,’’దిహౌస్ ఆఫ్ బెర్నార్డా అలబా ‘’మొదలైనవి ఉన్నాయి.

తిక్కవరపు తో పెళ్లితో అయిన  –ఆంధ్రా కోడలు

.  .నెల్లూరుకువాసి తిక్కరపు పటాభి రామ రెడ్డి  అనేకవి సంపన్నుడు సామాజిక సేవకుడు స్నేహలతను వలచి వలపింప జేసుకొని ,ఆమెకోసం ఆస్తినీ త్యాగం చేసి  పెళ్లి చేసుకొన్నాడు  .అప్పటి నుండి స్నేహలతా రెడ్డి అయింది .వీరికుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్య కారుడు .కూతురు నందనా రెడ్డి కార్మిక న్యాయ వాది,సంఘ సేవకురాలు .అప్పటికే రెడ్డి ‘’పఠాభి ‘’పేరు తో అభ్యుదయ వాద సంచలన  కవిత్వం రాసి ప్రాచుర్యం పొందాడు .ఛందస్సు ను అటకెక్కించి చిన్నయ సూరికి పాడే కట్టించి ,కొత్త సంప్రదాయాలతో కవిత్వం లో దూసుకు పోయాడు .‘’ఫిడేలు రాగాల డజన్ ‘’పఠాభి పంచాంగం ‘’లతో’’ పన్ ‘’(శ్లేష)ను పండించాడు .భర్త మార్గం లోనే స్నేహలత నడిచింది అభ్యుదయ భావాల తో మమైకం అయింది .

సంస్కార

పఠాభి కన్నడ భాషలో ‘’సంస్కార ‘’అనే గొప్ప చలన చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు .దీనికి ఆధారం   జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత యు. ఏ .అనంత మూర్తి  రాసిన సంస్కార నవల . అందులో స్నేహలత నాయిక పాత్ర పోషించింది .  గిరీష్ కర్నాడ్  . ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది .రాష్ట్ర పతి స్వర్ణకమలం అవార్డు తో బాటు అంతర్జాతీయ ప్రశంసలూ దక్కాయి .రెండవ సినిమా’’సోనే కంసారి ‘’ఒ నటించింది భర్త దర్శ కత్వం లో .ఆ సినిమా స్నేహలత మరణానంతరం 1977 లో విడుదలైంది .పఠాభి –చండ మారుత ,శృంగార మాస, దేవర కాడుకన్నడ  సినిమాలు కూడా తీసి డైరెక్ట్ చేశాడు .తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు , శ్రీకృష్ణార్జున యుద్ధం భాగ్య చక్రం సినిమాలు నిర్మించాడు .పఠాభి ని ”ఫాదర్ ఆఫ్ పారలల్ సినిమా ” సంబోధిస్తారు గౌరవంగా

సోషలిస్టు స్నేహలత-పౌరహక్కుల ఉద్యమం

స్నేహలత పై సోషలిస్ట్ నాయకుడు రామ మనోహర్ లోహియా ప్రభావం పడింది .ఆ భావాలకు ఆకర్షితురాలైంది .లోహియా నడుపుతున్న ‘’మ్యాన్ కైండ్’’మాస పత్రిక సంపాదక వర్గ సభ్యురాలైంది .పత్రిక ప్రచురణ బాధ్యతను స్వయం గా నిర్వహించి సోషలిస్టు భావ వ్యాప్తికి దోహద పడింది . ప్రసిద్ధ సోషలిస్ట్ నాయకుడు కార్మిక సంఘాల నేత జార్జి ఫెర్నాండెజ్ కు అత్యంత సన్నిహితురాలైంది స్నేహలత .ఈ సాన్నిహిత్యమే ఆమె మరణానికి దారి తీసింది .’’పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ‘’ను భార్యా భర్తలు స్థాపించి పౌరహక్కుల ఉద్యమాన్ని సోషలిస్ట్ పంధాలో నడిపారు .

 

పత్రికా వ్యాసంగం –

స్నేహలత ‘’ఫోకస్ ‘’అనే రాజ కీయ పత్రికను ,’’బాలల కోసం ‘’మ్యూజిక్ గార్డెన్ ‘’అనే బాల మాస పత్రికలను కూడా తన సంపాదకత్వం లో వెలువరించి తనకు ,ఆ పత్రికలకూ చిర కీర్తి నార్జించింది .

గౌరవ స్థానం

1956-57లో మద్రాస్ లో బాల నేరస్తుల కోర్టుకు ‘’గౌరవ మాజిస్త్రేట్ ‘’గా వ్యవహరించింది .1964 బ్రిటిష్ రాణి ఎలిజబెత్ భారతదేశం లో పర్యటిస్తూ మద్రాస్ వచ్చినప్పుడు స్నేహలత వ్యాఖ్యాతగా పని చేసింది .1967-68కాలం లో మద్రాస్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉంది .

ఎమర్జెన్సీ లో వీరమరణం

1977 లో ఇందిరా గాంధితన ప్రాబల్యం కోసం  దేశం లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ ని వ్యతిరేకించిన జయప్రకాష్ నారాయణ ,అటల్ బిహారీ వాజ్ పాయ్ లాల్ కృష్ణ ఆద్వానీ ,ఫెర్నాండెజ్   మధు దండా వతే ,స్నేహలతా ,పఠాబి  మొదలైన వారందరినీ అరెస్ట్ చేసి జైలు లో పెట్టించిన చీకటి రోజులు మనకు ఇంకా గుర్తు ఉంది .ఆ చీకటి రోజుల్లో ఆ రాక్ష ప్రభుత్వం స్నేహలత   కుటుంబాన్ని  కూడా జైలు లో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసింది .ఫెర్నాండెజ్ పై బరోడా డైనమైట్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు .ఫెర్నాండజ్ తో సాన్నిహిత్యం ఉన్నందున స్నేహలతనూ ఆ కేసులో ఇరికించారు .కాని ఫైనల్ చార్జి షీట్ లో స్నేహలతపేరు లేదు .అయినా ఆమెను బెంగుళూరు  జైలు లో నానా ఇబ్బందీ పెట్టారు .మనుషులు ఉండలేని పరమ దారుణమైన గదిలో ఆమెను ఉంచారు. అసలే అతి సున్నితం గా ఉండే ఆమె దీర్ఘకాలంగా ఉబ్బస వ్యాధితో బాధ పడుతూ  ఇవి తట్టుకో లేక పోయింది .ఆమె జైలు లో ఉండగానే అనారోగ్యం పెరిగిపోయింది .లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకింది . .సమయానికి తగిన వైద్య సేవలను ప్రభుత్వం అందించ లేదు .ఆరోగ్యం విపరీత్ర్హం గా క్షీణించి పెరోల్ పై15-1-1977న విడుదల అయింది .అదే జైలు లో మరో సోషలిస్ట్ నాయకుడూ మాజీ రైల్వే మంత్రి మధు దండావాతే కూడా ఉన్నారు .స్నేహలత శ్వాస పీల్చుకోలేక పడుతున్న బాధ  అంతా ఆయనకు వినిపించేదని జ్ఞాపకాలలో రాశాడు .సరిగ్గా అయిదు రోజుల తర్వాత 20-1-1977 నస్నేహలతా రెడ్డి అసువులు బాసింది .  ఇందిరా ఎమర్జన్సీ బాధితులలో అసువులు బాసి వీర మరణం పొందిన మొదటి బాచీ నాయకులలో స్నేహలత ఒకరు .

పఠాభి నివాళి

2003పఠాభి అరవిందుని సావిత్రి కావ్యాన్ని ఆధారం గా చేసుకొని ‘’ఇన్ దిఅవర్ ఆఫ్ గాడ్ ‘’అనే నాటకం రాసి భార్య స్నేహలతకు అంకితమిచ్చాడు .ప్రేమ కోసం యముడినే ఎదిరించిన సావిత్రి తో స్నేహలతను పోల్చిరాశాడు.

మనవి- దాదాపు వారం రోజులుగా నేను మహిళామతల్లుల పై రాసిన పదికి పైగా వ్యాసాలన్నిటికి ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురించిన ‘’20  వ శతాబ్దపు తెలుగు వెలుగులు (ఒకటి రెండు భాగాలు ) తెలుగు విజ్ఞాస సర్వస్వం ,వీకీ పీడియాలు  అని మనవి చేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

తులసీ దాస దాసి  –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి

తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల  కృష్ణ మూర్తిగారి తో వివాహమై పార్వతీ కృష్ణ మూర్తి అయ్యారు .పెళ్లినాటికి పార్వతి చదువు మూడవ తరగతిమాత్రమే .

Inline image 2

భర్త కృష్ణ మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం తో రెట్టింపు ఉత్సాహం తో ,ఆమె ఆయన గురుత్వం లోనే హిందీ తమిళ ,తెలుగు సాహిత్య మధనం చేశారు .తులసీ దాసు అంటే విపరీతమైన అభిమానం ఆమెకు. ఈ ఆరాధనా భావం తోనే ఆయన రచించిన ‘’శ్రీ రామ చరిత మానస’’ ను సరళ సుందర మైన శైలిలో తెలుగులోకి ‘’శ్రీరామ చరిత మానసామ్రుతం ‘’గా అనువాదం చేసి ,1961లో ప్రచురించారు..అంతేకాదు తన కలం పేరును ‘’తులసీ దాస దాసీ ‘’అని పెట్టుకొని ఆయనపై ఉన్న అనన్య భక్తీ ప్రపత్తులను తెలియ జేసుకొన్నారు .దీనితో ప్రముఖ ఆంద్ర కవయిత్రుల సరసన స్థానం పొందారు .తన పేరును ఎప్పుడూ అజ్ఞాతం గానే ఉంచుకొని ‘’తులసీ దాస దాసీ ‘’పేరుతోనే రచనలు చేశారు .

ప్రాచీన తెలుగు భాషలోని సంప్రదాయాలను అవగాహన చేసుకొని ,వచన రచనలో కొత్త మార్గాలలో ప్రయాణించారు .ధ్వని ప్రాధాన్యం ఉన్న పలుకు బడులతో ,సలక్షణ భాష తో భావ గాంభీర్య మున్న చిక్కని చక్కని వచనాన్ని రాశారు .భాషకు కొత్త సోయగాన్ని ,అందాన్ని అలంకారాన్ని సంతరించారు .చమత్క్రుతికి ప్రాధాన్యం ఇచ్చారు .కాశ్మీరీ భాషలో ప్రముఖ కవి మాలిక్ మొహమ్మద్ జాయ్సీ రాసిన ‘’పదుమావత్’’అనే హిందీ గ్రంధాన్ని ‘’పద్మావతి ‘’గా తెలి గీకరించారు .’’పవిత్ర గోదావరి ‘’మోనోగ్రాఫ్ రాశారు .దీన్ని బెంగుళూర్ లోని ఇండియన్ బుక్ హౌస్ ముద్రించింది .

తీరిక ఉన్నప్పుడు ‘’కల్కి ‘’,’’ఆనంద  వికటన్ ‘’తమిళ పత్రికలూ చదివి ఆ భాషలో వస్తున్న రచనలను ఆకళింపు చేసుకొనే వారు .పెళ్లి నాటికి మూడవ తరగతిమాత్రమే చదివిన పార్వతీ స్వయం కృషితో ఇంత సాహిత్య మధనం చేసి అపూర్వ సాహిత్యాన్ని సృజన చేసి అబ్బుర పరచారు .కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా సాయపడుతూ ,ఆదర్శ గృహిణి అయ్యారు .రోజూ నృత్యం ,సంగీతం ,సాహిత్యం చరిత్ర పరిశోధనలో భర్త కృష్ణ మూర్తిగారు క్షణం తీరిక  లేకుండా ఉండేవారు .ఆయన బహుముఖీన వ్యాసంగానికి ఏ మాత్రం భంగం కలుగ కుండా ,ఇతోధిక సహకారం అందజేసి భర్త ఔన్నత్యానికి వన్నె తెస్తూ నిజ ధర్మ పత్ని అనిపించుకొన్నారు .20-10-1993నఎనభై ఒక్క సంవత్సరాల వయసులో భర్తచేతుల మీదుగా శ్రీమతి  పార్వతీ కృష్ణ మూర్తి పరమ శివ సాన్నిధ్యం చేరారు .

దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

Inline image 3

పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలియని సౌజన్య మూర్తి ముత్తాఆండాలమ్మ గారు 1923లో ఒక చిన్న ఇంట్లో ఏడుగురు బాలికల తో తమళనాడులో మద్రా స్ నగరం లో   ఏర్పాటు చేసిన సేవాసదనం ఇంతింతై పెరిగి అనాధ బాలికల పాలిటి వట వ్రుక్షమైంది .దుఃఖ భాగినులైన స్త్రీలను సాంత్వన పరచి స్వయం కృషితో వారు  జీవించాలి అన్న  ముందు చూపుతో ఆమె ఏర్పరచిన సేవాసదనం ఇది .ఒక శరణాలయం గా విద్యాలయం గా  వృద్ధి చెందింది .తమిళ నాడుకే శ్రీలంక బర్మా దేశాల నుండి కాక ఇతర రాష్ట్రాలనుంచి , వచ్చి చేరే బాలికలకు ఆశ్రయ స్థానమైంది .విద్యతో బాటు చేతిపని కూడా నేర్పే ఏర్పాటు జరిగింది .గిల్టు పూత ,లక్క పూత ,ఎలక్ట్రికల్ దీపాలకు రంగు రంగుల డోమ్ లను ఏర్పాటు చేయటం ,పట్టు గుడ్డలతో షెడ్ లు కల్పించటం ఇక్కడ నేర్పించేవారు .కుట్టుపని ,అల్లిక ,జలతారు నగిషి ,దుస్తుల తయారీ  ఫేం కుర్చీలు అల్లటం అన్నీ కొత్త విధానాలలో విద్యార్ధినులకు నేర్పుతున్నారు .

ఈ సేవాసదనం ఆదర్శ ప్రాయం గా నడవటం చూసి మెచ్చుకొన్న దాతలు స్వయం గా ముందుకు వచ్చి ఆర్దికసాయమేకాకుండా వనరులను కూడా కల్పించి అభివృద్ధికి చేయూత నిస్తున్నారు .ఇందులో పని చేసే ఉపాధ్యాయినులు ఆదర్శం గా అంకిత భావం తో పని చేసి విద్యార్ధినులను తీర్చిదిద్దటం ఇక్కడి ప్రత్యేకత .ఇప్పుడు పాతిక మంది ఉపాధ్యాయినులు ఇక్కడ పని చేస్తున్నారు .వారి వసతి భోజనం జీతాలు అన్నీ సేవాసదనమే భరిస్తుంది .ఈ నాడు రెండు వందల పది మంది విద్యార్ధినులకు ఆశ్రయం గా ఉంది .తమిళ నాడు మొత్తం మీద ఇలాంటి సంస్థ ఇదొక్కటే నని అంటారు .పాసశ్చాత్య దేశాలనుండి కూడా ఆర్ధిక సాయం అందుతోంది ఇప్పుడు .విద్యార్ధుల ఆర్ధిక స్థాయిని బట్టి రుసుము వసూలు చేస్తారు .ఏమీ లేని వారికి అన్నీ ఉచితం గానే ఏర్పాటు చేసి ఆదుకొంటారు .నిజానికి వీరి సంఖ్యే బాగా ఎక్కువ . ఇలాంటి  వారికి సేవ చేయటానికే ఆండాళమ్మ గారు దీన్ని ఏర్పాటు చేశారు కదా .

వీరి భర్త  జస్టిస్ ముత్తావెంకట సుబ్బా రావు గారు మద్రాస్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సేవాసదనం ఇది .దిక్కులేని మహిళలను ఆదుకోవటమే ధ్యేయం .అ నాటి గవర్నర్ జనరల్,మద్రాస్ గవర్నర్ భార్యలు దీనిపై ప్రత్యెక శ్రద్ధ తీసుకొని నిర్వహణ కు అన్నివిధాలా సహాయం అందించేవారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ

Inline image 1

అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది వారి వద్దనే తెలుగు నేర్చుకొన్నది కవితా ప్రతిభా పంతులుగారి ఆశీర్వాద బలం తో అబ్బింది .వీరేశ లింగం గారి జీవిత చరిత్రను పద్య కావ్యం గా సీతమ్మ గారు రాసింది .రాణి అహల్యాబాయి జీవిత చరిత్రను కూడా కావ్య బద్ధం చేసింది .

సీతమ్మ గారు ‘’సాదు రక్షక శతకం ‘’,’’ఒక మహమ్మదీయ వనిత ‘’అనే కరుణ రస భరిత పద్య రచన చేసింది .చిన్నకావ్యాలలో ఆమె రాసిన ‘’లేడీ జేన్ గ్రే ‘’పేరు పొందింది .తానూ వివిధ సందర్భాలో  వైవిధ్య విషయాలపై చేసిన ఉపన్యాసాలను సేకరించి ఒక సంపుటిగా ప్రచురించింది .1913లో బాపట్ల ఆంద్ర మహిళా సభకు అధ్యక్షురాలై సేవలందించిందిజీవిత చరమాంకం లో పిఠాపురం మహా రాణి చిన్న మాంబ గారికి విద్య నేర్పే అరుదైన అవకాశం పొందింది ఈ విధం గా ఆ ఆస్థాన గురు పీఠం అలంకరించి గౌరవం పొందింది .వీరేశ లింగం గారి అంటే వాసిగా జీవిస్తూ స్త్రీ సంక్షేమం కోసం అవిరళ కృషి చేసింది . అరవై రెండేళ్ళు మాత్రమె జీవించిన సీతమ్మగారు 1936లో మరణించింది .

రాత్రి పాఠశాల నడిపిన -జయంతి సూరమ్మ

శ్రీకాకుళం జిల్లా కవట అగ్రహారం లో 1887లో సీతారామయ్య ,కనకమ్మ దంపతులకు జన్మించారు .ఎనిమిదవ ఏట బరంపురం వాస్తవ్యుడు జయంతి వెంకట నారాయణ గారితో సూరమ్మ గారి వివాహం జరిగింది .ఇద్దరూ శుద్ధ శ్రోత్రియ  కుటుంబీకులే .భర్త తన పందొమ్మిదవ ఏట బ్రహ్మ సమాజం లో చేరారు .బంధువులు అడ్డు చెప్పినా వినలేదు .భర్తతో బాటు సూరమ్మ గారు కూడా  బ్రహ్మ సమాజం లో చేరి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు .ఇద్దరూ రాజమండ్రిలో  స్థిర పడి వీరేశలింగం గారి ప్రభావానికి లోనైనారు .వారి నుండి సంస్కారం ,సంఘ సంస్కరణ నేర్చుకొన్నారు .

దంపతులు కలకత్తా వెళ్లి సాధన ఆశ్రమం లో శిక్షణ పొంది ,కాకినాడ లో పిఠాపురం రాజ స్థాపించిన ‘’బ్రహ్మ మందిరం ‘’,అనాధ శరణాలయాలను నిర్వ హించే బాధ్యత తీసుకొన్నారు .హరిజన సేవ చేస్తూ ,వారి విద్యకై కృషి చేశారు . చెన్నై వెళ్లి అక్కడ ప్రచారకులుగా ఉండి రాత్రి పాఠశాలలు నడిపారు .రామ మోహన రాయ్ పేరుతొ ఒక లాడ్జి నీ నడిపారు  .బ్రహ్మ సమాజ యువకులకు ఇది విశ్రాంతి భవనం గా ఉండేది .వేశ్యా వ్రుత్తి నిర్మూలన కార్య క్రమంలో సూరమ్మ గారు ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నారు .అనిబి సెంట్ ప్రభావానికి లోని సభ్యులై కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనారు .

సూరమ్మ గారు పిల్లల చదువులకోసం బరంపురం వెళ్ళారు .ఇంగ్లీష్ చదువులపై విరక్తి కలిగి తమ పిల్లలను చదువు మాన్పించారు .వ్రుత్తి విద్య నేర్పే జాతీయ విద్యాలయం లో చేర్పించారు .భర్త ‘’హ్యుమనిటి ‘’అనే ఆంగ్ల వారపత్రిక నిర్వహించేవారు .దానిలో హిందీలో వ్యాసాలూ రాసేవారు సూరమ్మ గారు .విదేశీ వస్త్రా బహిష్కరణ ఉద్యమం లో చేరి తన ఇంట్లోని విదేశీ వస్త్రాలన్నీ తగల బెట్టారు .రాట్నాలు ,యేకులు కొని కొని ఊరంతా పంచిపెట్టారు .అప్పుడు ఊరు ఊరంతా రాట్నాల సవ్వడే వినిపించేది. సూరమ్మ గారు నూలు వడకటం లో ప్రవీణురాలు .అతి సన్నని నాజూకైన నూలు తీసి బట్టలు తయారు చేయించేవారు ప్రతి ఇంటికి ఖద్దరు బట్టలను తీసుకొని వెళ్లి అమ్మేవారు .

1922లో బరంపురం కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు .భర్త ,ఆయన సోదరులు అరెస్టయ్యారు .అయినా భయపడక ఖాదీ ప్రచారం చేస్తూ ఖాదీ బట్టలు అమ్మేవారు .’’కల్లు మానం డోయ్ బాబూ’’ అంటూ కల్లు  దుకాణాల వద్ద పికెటింగ్ చేసేవారు .తాగుడు వల్ల వచ్చే అనర్ధాలను తెలియ జేస్తూ పాటలు రాసి పాడి ప్రచారం చేశారు .తాగు బోతుల వెకిలి చేస్టలను ప్రాహసనాలుగా చేసి వారిముందే ప్రదర్శించి బుద్ధి తెచ్చుకోనేట్లు చేసి వారితో నే  స్వయం గా ఒట్టు వేయించి  కల్లుజోలికి పోము అని శపథం చేయించే వారట. ఆమె మాట మీద అంట గౌరవం అన్నమాట.ప్రాక్టికల్ మనిషి అని రుజువు చేసుకొన్నారు .

బరంపురం లో జాతీయ విద్యాలయం స్థాపించి తమ పిల్లలను అందులోనే చదివించారు .జీతం, భత్యం లేని కాంగ్రెస్ వాలంటీర్ గా చాలా చురుకుగా పని చేశారు భర్త అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పిల్లల చదువుచూస్తూ  వారిని తీర్చి దిద్దుకోవటం లో శ్రద్ధ వహించేవారు .’’మా కొద్దీ తెల్ల దొరతనం ‘అనే గరిమెళ్ళ వారి గీతాన్ని ఊరూరా తిరిగి పాడుతూ ప్రబోధించి దేశ భక్తీ రగుల్కొల్పేవారు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ఆరు నెలలు కఠిన జైలు శిక్ష అనుభవించారు .జైలులో కనీస వసతులకోసం పోరాటం జరిపారు .విడుదల అవగానే మళ్ళీ ఉత్సాహం గా ఉద్యమాలు నడిపారు .కాంగ్రెస్ విరాళాల కోసం జోలె పట్టి మిగిలిన వారినీ సంఘటిత పరచి గ్రామాలు తిరిగి చందాలు వసూలు చేసి పార్టీకి సమర్పించేవారు .’’గాంధీ టోపీనే జోలెగా’’వాడి కొత్త తరహా జోలెకు దారి చూపారు .తెలుగు హిందీ ఒరియా భాషల్లో పాటలు రాసి ప్రచారం చేసేవారు .ప్రజలను బాగా ఉత్తేజితులను చేయటం లో సూరమ్మ గారికి  గొప్ప చాకచక్యం ఉండేది .

చదివి డిగ్రీలుపొందక పోయినా లౌకికజ్ఞానం పుష్కలం గా ఉండేది సూరమ్మ గారికి. తన పిల్లలను విద్యా వంతులను చేసి ప్రయోజకులను చేశారు .సంస్కారం ఆత్మ విశ్వాసం ఆమెకు పెట్టని ఆభరణాలు .స్వతంత్ర జీవనం పై అందరికి అవగాహన కల్పించేవారు .ఆమె కుమారులు ,అల్లుళ్ళు అందరూ స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొని జైలుకెళ్ళిన వారే .అదీ ఆమె తర్ఫీదు ప్రభావం .సూరమ్మ గారి కుటుంబం అంతా దేశ సేవలో పునీతులైన వారే .మనం గర్వం గా చెప్పుకోదగ్గ చరిత్ర సాధించిన వారే .జీవితాన్ని సేవగా ,అభ్యుదయ పధం లో నడవాలన్న ధ్యేయం గా ,సంస్క్రణాభి లాషిగా   జాతీయతా స్పూర్తిగా గడిపిన సూరమ్మ గారు ఎనభై రెండేళ్ళు సార్ధకం గా జీవించి 10-2-1969న అనాయాసం గా మరణించారు. ఆమె పేరిట హైదరాబాద్ లో ఆంద్ర మహిళా సభ వారు నిర్వహిస్తున్న నర్సింగ్ హమ్ లో ఒక వార్డుకు ‘’జయంతి సూరమ్మ వార్డు ‘’అని పేరుపెట్టి గౌరవించారు .అది పది మంచాల వార్డు అందులో  జయంతి  సూరమ్మ గారి ఫోటో ఉంటుంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆర్గానిక్ “రామారం”

 ఆర్గానిక్ రామారం

‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా గుండాల మండలంలోని రామారానికి ఎన్నడూ లేని ప్రత్యేకత వచ్చింది. ఇదివరకు అది అన్ని ఊర్లలో ఒక ఊరు. ఇప్పుడు అనేక ఊర్లకు స్ఫూర్తి ఈ ఊరు..
ఊర్లో మూడొందల రైతులు ఉన్నారు. వరి, కంది, పెసర, కూరగాయలు ప్రధాన పంటలు. చుట్టుపక్కల ఊళ్లలోని రైతుల్లాగే వీళ్లు కూడా రసాయన మందులు, ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ‘‘మా జిల్లాలో ఇప్పటికే అధిక ఫ్లోరైడ్‌ నీళ్లు తాగుతున్నాం. దీనికి తోడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల తినేతిండి విషతుల్యమైపోతోంది. దీనికొక మార్గం కనిపెట్టాలనుకున్నాం’’ అన్నారు జైకిసాన్‌ మహిళా సంఘం సభ్యులు స్వప్న, అనిత. కార్బండిజంతో వరికి విత్తనశుద్ధి చేస్తారు. దమ్ము చేసేప్పుడు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ, నాట్లు వేశాక రెండు, మూడుసార్లు యూరియా, ఆ తర్వాత క్రిమిసంహారక గుళికలు వేయడం సహజం. దోమపోటు రాకుండా పలుమార్లు మందులు పిచికారి చేయక తప్పదు. కూరగాయల్లో బెండకు అయితే రెండు మూడు రోజులకు ఒకసారి మందుల్ని కొట్టాలి. ప్రతి గ్రామంలో చేసే పనే ఇది. అయితే మందుల మీద ఆధారపడి సేద్యం చేసే అలవాటు రైతుల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతికి కొంత వరకైనా అడ్డుకట్టవేయాలన్నది గ్రామీణ్‌మాల్‌ ఫౌండేషన్‌ ఆలోచన.
సీతారాం కృషి..
రామారం గ్రామాన్ని పూర్తిస్థాయి సేంద్రీయ సేద్యపు గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కె.సీతారం. ‘‘మీరు ఏ పంట పండించినా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయకండి. కేవలం సేంద్రీయ పద్ధతుల్లోనే పంటలు పండిద్దాం’’ అని చెబితే నేడు ఏ రైతు ముందుకు రాని పరిస్థితి. ఇవన్నీ గమనించిన సీతారాం.. ముందుగా గ్రామంలోని మహిళారైతులందర్నీ ఒక చోటకు చేర్చారు. అవగాహన కోసమే కొన్ని రోజులపాటు తరగతులు నిర్వహించారాయన. ‘‘మార్పు అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు. దానికి కొంత సమయం పడుతుంది. అసలు సేంద్రీయసేద్యం రైతులకే కాదు, భూమికి, పర్యావరణానికి, ఈ దేశప్రజల ఆరోగ్యానికి ఎంత అవసరమో రైతులందరికీ విడమరిచి చెబుతున్నాం. కేవలం రసాయన మందులతోనే అధిక దిగుబడులు సాధ్యమన్న అపోహల్ని ఆచరణాత్మకంగా తొలగిస్తున్నాం..’’ అన్నారు సీతారం. గ్రామంలో ఎనిమిది నెలలు కష్టపడి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలను పల్లెకు తీసుకొచ్చి తరగతులు నిర్వహిస్తుండటం విశేషం.
మహిళలు కలిసికట్టుగా..
గ్రామంలో జైకిసాన్‌ మహిళా సేంద్రీయ పరస్పర సహాయ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం సేంద్రీయ సేద్యానికి కావాల్సిన సహాయ సహకారాలను, పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ‘‘మొదట్లో సేంద్రీయ సాగు చేస్తే పంటలు పండుతాయో లేదోనన్న అపోహలు ఉండేవి. అయితే కొంత అవగాహన వచ్చాక ధైర్యంగా ముందడుగు వేశాం. వరి, కంది, పెసర మూడు పంటలను ఎంచుకున్నాము. మా ఊళ్లో మూడొందలకు పైగా రైతులుంటే నాన్‌ ఫెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌పీఎం) పద్ధతిలో సాగు చేసేందుకు రెండొందల యాభై మంది రైతులు ముందుకు వచ్చారు. వరి, కంది, పెసరలతోపాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు’’ అన్నారు మహిళా సంఘ సభ్యులు.
ఏ పంట పండించినా మార్కెటింగ్‌ చేయడమే పెద్ద సమస్య. ఇక, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన పంటను ప్రత్యేకంగా అమ్ముకుంటేగాని గిట్టుబాటు కాదు. అందుకోసం గ్రామీణ్‌మాల్‌ ఫౌండేషన్‌ ఊళ్లోనే మార్కెటింగ్‌ సదుపాయం కల్పించింది. దీంతో అక్కడే ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటైంది. రసాయన మందులతో పండించిన వరి ధాన్యం మార్కెట్‌లో క్వింటాలు రూ.1700 పలుకుతోంది. అందులో బస్తాకు హమాలికి ఆరురూపాయలు, వందకు రెండు రూపాయలు చొప్పున ఇరవై నాలుగు రూపాయల కమీషన్‌, మరో, ఇరవై రవాణాఛార్జీలు కలిపి.. యాభై అవుతోంది. అలాంటి భారం రైతుల మీద మోపకుండా రూ.1750 కి కొని వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే సీతారం కృషి వల్ల.. మరింత అధిక ధరలకు కొనేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయిప్పుడు. ఫ్యూర్‌ అండ్‌ హానెస్ట్‌ సంస్థ ప్రతినిఽధులు క్వింటాలుకు రూ.2100 చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రామారంకు వస్తున్న గుర్తింపు చుట్టుపక్కల ఊళ్లకు పాకింది. దీంతో ఇప్పుడందరు ఆ ఊరి రైతులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.
గ్రామంలో మహిళా సంఘం సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న పంటలను ప్రోత్సహించేందుకు.. సెర్ఫ్‌ సంస్థ అయిదు లక్షలు రుణం మంజూరు చేసింది.
సీజన్‌లో సాగుకు శ్రీకారం చుట్టాలంటే ఏ రైతుకు అయినా విత్తనాల సేకరణే పెద్ద సమస్య. ఆ ఇబ్బంది రామారం గ్రామస్థులకు ఎదురవ్వలేదు. ఎందుకంటే వారే స్వయంగా విత్తనబ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు.
రసాయన మందులకు ప్రత్యామ్నాయం పశువులపేడ, చెట్ల ఆకులు, పచ్చిరొట్ట ఎరువులు. ఇక, మోనో, క్లోరోఫైరిపాస్‌, గుళికలకు బదులు లింగాకర్షణ బుట్టలు, దీపపు ఎరలు, చెట్ల ఆకులు, గోమూత్రంతో తయారైన కషాయాలు వాడుతున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతోంది.
‘‘రైతులను వ్యవస్థీకృతం చేసి, విత్తనబ్యాంకును పటిష్టం చేయడం నా లక్ష్యం. రైతుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే.. ఆర్థిక ఎదుగుదల దానంతట అదే వస్తుంది. వాళ్లల్లో వ్యవసాయం మీద నమ్మకం ఏర్పడుతుంది’’
– సీతారాం,
గ్రామీణ్‌మాల్‌ ఫౌండర్‌
‘‘మా గ్రామాన్ని ఎన్‌ఐఆర్‌డి దత్తతకు తీసుకుంది. ఇది మాకు మరింత ప్రోత్సాహకరం. మహిళా రైతుల్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శన క్షేత్రాలు చూపిస్తున్నారు. దీనివల్ల సేద్యం పట్ల మా పరిధి మరింత విస్తృతం అవుతోంది.’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్క్రుతమంటే భయమెవరికి ?డా అరవింద రావు ,తిరుప్పావై వగైరా

సంస్కృతమంటే భయమెవరికి…

గత సంవత్సరం జూన్‌ మాసంలో అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పిహెచ్‌.డి డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్లాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్‌భాషలో వాళ్ల ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్‌ భాషలోనే ఉన్నాయి. అదేమిటని విచారిస్తే కేవలం అక్కడే కాకుండా అమెరికాలోని టాప్‌ యూనివర్శిటీలలో అది పరిపాటి అని తెలిసింది. అమెరికా దేశానికి కేవలం అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అయినా తమకు గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకోవడానికి ఆ విధంగా లాటిన్‌ తమ భాషగా చెప్పుకుంటున్నారు.
అమెరికాకు, రోమ్‌కూ మతం తప్ప మిగతా ఏ సంబంధమూ లేదు. వారి మతగ్రంథాలు లాటిన్‌ భాషలో ఉండడమొక్కటే వారికి సంబంధం. సంస్కృతం అలా కాదు. సంస్కృతమంటే కేవలం హిందూమతం కాదు. ఇంగ్లీషు అంటే క్రైస్తవమతం ఎలా కాదో అలాగే సంస్కృతమంటే హిందూమతం అని అర్థం కాదు. వేదాల్నీ, దేవుడిని అంగీకరించని బౌద్ధులు, జైనులు, అలాగే పూర్తిగా నాస్తికులైన చార్వాకులు మొదలైన వాళ్లందరూ సంస్కృతంలోనే రచనలు చేశారు. మొదట్లో బౌద్ధులు పాళీభాషలో పుస్తకాలు రాశారు. అయితే అవి ఒక చిన్న ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఈనాడు ఇంగ్లీషులో రాయటం వల్ల ప్రపంచమంతా ఎలా చదవగలరో అలాగే ఆనాడు వారందరూ పాళీభాష వదిలి సంస్కృతంలో రాయటం మొదలుపెట్టారు. లాజిక్‌, తత్త్వశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, దండనీతి శాస్త్రం, ధర్మశాసా్త్రలు, ఆయుర్వేదం లాంటి విషయాలపై రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకే వర్గం వారే దీన్ని నేర్చుకున్నారనడం బొత్తిగా అవగాహన లేని వాదన. ప్రపంచంలోనే మొట్టమొదటి నిఘంటువు శ్లోకాల రూపంలో రాసిన అమరసింహుడు జైనుడు. పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యలు రాసినవారు బౌద్ధులు, జైనులు. అనేకమంది రాజులు కావ్యాలు, నాటకాలు రాశారు. క్రమక్రమంగా సంస్కృతం భరతఖండం మొత్తానికి జూజీుఽజు జ్చూుఽజఠ్చజ్ఛ గా బ్రిటీష్‌వారు వచ్చేవరకూ కూడా కొనసాగింది.
మన ప్రాచీన గ్రంఽథాల్ని చాలా వాటిని వెలికితీసిన ఘనత బ్రిటీష్‌ వారికి ఇవ్వాలి. వారి పాలనలో బౌద్ధ గ్రంఽథాలనేకం ఆఫ్ఘనిస్తాన్‌లో లభించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సమగ్రప్రతి కేరళలో లభించింది. దేశంలో విద్యార్థులు ఒక మూల నుండి మరొక మూలకు వెళ్లి చదువుకున్నారు. సంస్కృతం జాతి మొత్తానికి చెందిన భాష కేరళ నుండి గాంధార దేశం (ఆఫ్ఘనిస్తాన్‌) వరకూ వ్యాపించిన భాష స్వతంత్రం వచ్చిన సమయంలో పార్లమెంటులో జాతీయభాష ఏది ఉండాలి అనే ప్రశ్నపై అంబేద్కర్‌ కూడా సంస్కృతాన్ని సమర్థించడం మనం గమనించాలి.
‘ఈ దేశం సంస్కృతిని పెకలించే ఉద్దేశంతో పనిచేస్తున్న మన మిషనరీలందరూ సంస్కృతాన్ని బాగా చదవాలి. ఆ భాషలోని, శాసా్త్రల్లోని మెళకువల్ని గమనించి మన కార్యకలాపాలు చేయాలి. సంస్కృతం అనే ఆయుధంతో పాటు లాజిక్‌ కూడా చదవాలి. ఇక్కడ పండితులు, తెలివైనవాళ్లు. ఇది చాలా కష్టమైన పని అయినా ఇష్టంగా చేయాలి’. (పేజీ 4849) అని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు మోనియర్‌ విలియమ్స్‌ ‘‘అ ట్టఠఛీడ ౌజ ట్చుఽటజుటజ్టీ జీుఽ ఖ్ఛజ్చ్టూజీౌుఽ ్టౌ ఝజీటటజీౌుఽ్చటడ గిౌటజు జీుఽ ఐుఽఛీజ్చీ’’ అనే ప్రసంగంలో 1861లో ఆక్ప్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చెప్పాడు. ఈ ప్రసంగంలో ప్రారంభమయిన ఆయన మాటలు గమనించదగ్గవి. ‘(ఐుఽఛీజ్చీ) ్చ్ట్ట్చజీుఽ్ఛఛీ ్చ జిజీజజి ఛ్ఛీజట్ఛ్ఛ ౌజ ఛిజీఠిజీజూజ్డ్చ్టీజీౌుఽ ఠీజ్ఛిుఽ ౌఠట జౌట్ఛజ్చ్టజ్ఛిటట ఠ్ఛీట్ఛ ఛ్చటఛ్చటజ్చీుఽట, ్చుఽఛీ జ్చిఛీ ్చ ఞౌజూజీటజ్ఛిఛీ జ్చూుఽజఠ్చజ్ఛ ్చుఽఛీ జూజ్ట్ఛీట్చ్టఠట్ఛ ఠీజ్ఛిుఽ ఉుఽజజూజీటజి ఠ్చీట ఠుఽజుుఽౌఠీుఽ’’. ఈ ప్రసంగం మొత్తం పుస్తకరూపంలో ఇంటర్‌నెట్‌లో మనం చూడవచ్చు. మ్యాక్స్‌ముల్లర్‌ లాంటి పండితులందరూ భారతీయ సంస్కృతిని నిర్మూలించాలనే ధోరణితో సంస్కృతాన్ని చదివారు. అంతవరకూ ముద్రించని వేదాల్లాంటి గ్రంథాల్ని ముద్రించడం. వాటిపైన ఇంగ్లీషులో వ్యాఖ్యలు రాయటంతో భారతదేశంలోని విద్యావంతులందరూ వాటినే ప్రమాణ గ్రంథాలుగా, ఞటజీఝ్చటడ టౌఠటఛ్ఛిట గా భావించే వాతావరణం ఏర్పడింది.
మోనియర్‌ విలియమ్స్‌ చెప్పినదే అతనికి ముందు వచ్చినవారూ, తర్వాత వారూ కూడా ఆచరించారు. రాబర్ట్‌ నొబిలి అనే ప్రచారకుడు జందెం వేసుకుని రోమన్‌ బ్రాహ్మణుడు అని పరిచయం చేసుకుని అయిదవ వేదం అంటూ ఒక పదాన్నే సృష్టించాడు. ఆయన మతానికి అనుకూలంగా ఉన్న గ్రంథమిది. సాక్షాత్తూ నేడు మనం ఇంటర్‌నెట్‌లో ఈశావాస్య ఉపనిషత్‌ కోసం చూస్తే ఒకానొక తమిళ పండితుడు రాసిన ఈ వ్యాఖ్య కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులో ‘ఈశ’ అంటే ‘జీసెస్‌’ అని చెప్పి ఒక పి.హెచ్‌.డి. కూడా తీసుకున్నాడు. సన్మానాలు కూడా పొందాడు. యూట్యూబ్‌లో ్ఖఐఖఇ అనే వెబ్‌సైట్‌ చూస్తే కొందరు ముస్లిం సోదరులు కూడా ఉపనిషత్తుల్లోని మంత్రాలు చెబుతూ మీ పుస్తకాల్లో ఉన్నది మా దేవుడే అని ప్రచారం చేయడం చూడగలం. ఇదంతా మనం చిన్నప్పుడు చదివిన బ్రాహ్మణుడు మేకపిల్ల కథకు చక్కని ఉదాహరణ. కుక్క అనే భ్రమతో బ్రాహ్మణుడు మేకపిల్లను పారవేసినట్లే మనం ఈనాడు మన సంస్కృతిని పారవేస్తున్నాం.
ప్రభుత్వం సంస్కృతాన్ని స్కూళ్లలో ప్రవేశపెడితే హిందూత్వం పెరిగిపోతుందని కొందరి ఆందోళన. సంస్కృతం నేర్చుకోవడం వల్లనే హిందుత్వాన్ని పెకలించి వేయగలమని మరికొందరి వాదన. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఈ రెండోవర్గం వారు పట్టుదలగా సంస్కృతం నేర్చుకుంటూనే ఉన్నారు. మూడోవర్గం, అంటే హిందూత్వం గురించి మాట్లాడే వాళ్లు గొప్పగా సంస్కృతం నేర్చుకున్న దాఖలాలు లేవు. అసలైన సంస్కృత పండితులకి ఈ గొడవంతా అసలే తెలియదు. ఎవరు ఎలాంటి రచనలు చేస్తున్నారో అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వీరికి బొత్తిగా తెలియదు. అన్ని విమర్శలకూ సమాఽధానం చెప్పగలిగే అనర్గళమైన పాండిత్యం మాత్రం వీరి దగ్గర ఉంది. వివేకానందుడు చెప్పినట్లు వీళ్లందరూ బంగారు నిధిపై కూర్చు ని పేద బతుకులు గడుపుతున్నా వారు.
సత్యమేవ జయతే- ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. అనేది మన సిద్థాతం. అయితే సత్యమేమిటో మనమే తెలుసుకోవాలంటే ఇతరులు ఎవరు చెప్పిన మాటలు కాకుండా మనమే దాన్ని పరిశీలించాలి. మనల్ని పాలించడానికి వచ్చినవాళ్లు, వాళ్ల సంస్కృతిని మనపై రుద్దాలని వచ్చిన వాళ్లూ మనల్ని గురించి నిజాలు రాస్తారని భావించడం మన అమాయకత. అందమైన ఆంగ్లభాషలో అసత్యాలు చెపితే అవి నిజం కావు. మన పుస్తకాల్లో ఎలాంటివి నెగిటివ్‌గా చెప్పగలరో అవన్నీ ఇతరులు చెప్పేసారు. ఆ ప్రచారం అలాగే ఉండాలి. మంచి విషయాలు బయటకు రాకూడదు అనుకునేవాళ్లు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తారు. మీ పుస్తకాల్లో ఏముందో మేము అందంగా చెప్పేశాం. అందమైన పుస్తకాల్లో అందించాం. మీరు మీ మూలగ్రంథాల్ని చదవాల్సిన పనిలేదు అనే వాళ్లు వ్యతిరేకిస్తారు.
ప్రభుత్వం సంస్కృతాన్ని నిర్బంధంగా ప్రవేశపెటాలి. ఎవరో చదవాలి, నాకు మాత్రం టైమ్‌ లేదు అనడం పలాయనవాదం. మన సంస్కృతిలో రుషి రుణం అనే భావన ఒకటి ఉంది. మన ప్రాచీనులు మనకు చెప్పిన విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడం, ఆ సంస్కృతిని నిలపడం మన కర్తవ్యం అనేది ఈ పదం యొక్క అర్థం. ఆధునిక ప్రపంచంలోని ప్రచార ధోరణుల నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా సత్యమేమిటో తెలుసుకోవాల్సిన కర్తవ్యం చదువువుకున్న మనందరిదీ. కొత్త వేదాన్ని రాసే స్థాయికి నొబిలి మహాశయుడు వెళ్లినపుడు మనమెందుకు ఈ భాషను తెలుసుకోలేం? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.
గోదాదేవి పాశురాలు
ఆళి మళైక్కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్‌
ఆళియుళ్‌ పుక్కుముగన్దు కొడార్‌ త్తేరి
ఊళి ముదల్‌వన్‌ ఉరువమ్‌ పోల్‌ మెయ్‌కరుత్తు
పాళియన్‌ తోళుడైప్పర్పనాబన్‌ కైయిల్‌
ఆళిపోల్‌ మిన్ని, వలంబురి పోల్‌ నిన్రు అదిర్‌న్దు
తాళాదే శార్‌ఙ్గ ముదైత్త శరమళైపోల్‌
వాళ ఉలగినిల్‌ పెయ్‌దిడాయ్‌ నాంగళుమ్‌
మార్గళి నీరాడ మగిళ్‌న్దు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌
ఠి ఠి ఠి
సిరి చిరునవ్వులతొ నారి కట్టాలి
హరి! విల్లు శార్‌ఙ్గాన్ని ఎక్కుపెట్టాలి
వరపాంచజన్యంబు ఉరుములురవాలి
గురు సుదర్శనంబు మెరుపుల్లు మెరవాలి
శరపరంపరలాటి వానచినుకుల్లు
కురవాలి కురవాలి మూడు వరసల్లు
వరిచేలు పండాలి గాదెల్లు పొర్లాలి
చిన్నపిల్లల నవ్వులూ కన్నెపిల్లల కోర్కెలూ
అన్ని పువ్వుల రంగులూ ఆకుపచ్చ హొరంగులూ
కర్పూరనీరాజనాలుగా – అందుకో
నల్లనయ్యా – మా పల్లె నీలిమేఘమా
దివినుంచి భువిముంచ వర్షించు వర్షించు
మా నోము పండాలి మన పెళ్లి జరగాలి
అనుచు కన్నయ్యనూ వరములడగాలి
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే- పల్లెపిలాల మేలుకో
ఏకాక్షర వేదాంతం!

కం!! నేనను నేనున్నానా?
నేనని నన్నేన్ని నన్నునేనన్నానా?
నేనే నేననినేనన
నేనని నన్ననని నేనునేనౌనాన్నా?
(దేహాభిమాని అయిన అహం నిజమైన నేను కాదనీ, నేను అని చెప్పుకోని సాక్షిభూతమైనన ఆత్మ నిజమైన నేను అనీ చెబుతుంది భారతీయుల ఆత్మతత్వం. దానిని గ్రహించిన ఆత్మజ్ఞాని దానిని తండ్రికి తెలియజేస్తున్నాడు. ఉపనిషత్తులలో తండ్రీకొడకులు గురుశిష్యులుగా ఉంటారు కూడా..)
– ధనికొండ రవిప్రసాద్‌, ఖమ్మం
ఇస్లాం ఏం చెబుతోంది?

ప్రపంచంలో ఏ మతం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదు. ఇస్లాంలో కూడా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ అనేక భావాలున్నాయి. వీటిలో కొన్ని తెలుసుకుందాం..

1. ఉగ్రవాదం అంటే హతమార్చటం. ఇస్లాం దీనిని నిషేధించింది. ఖురాన్‌లోని 6ఫ 151 ప్రకారం- సృష్టికర్త పవిత్రాత్మను సృష్టించాడు. దీనిని ఎటువంటి పరిస్థితుల్లోను చంపకూడదు. న్యాయబద్ధంగా దీనిని కాపాడాలి. (అయితే రాజ్యం విధించే మరణశిక్షను ఖురాన్‌ సమర్థించింది)

2. భయం ద్వారా మతాన్ని ఆపాదించటాన్ని ఖురాన్‌ నిషేధించింది. మత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించింది. 2: 256 ప్రకారం- అనివార్య పరిస్థితుల ద్వారా మతంలోనికి మారకూడదు.
3. ఇతరులపై దాడులు చేయటాన్ని కూడా ఖురాన్‌లో వ్యతిరేకించారు. ‘‘శత్రువులు శాంతి మార్గంలో ప్రయాణించాలనుకుంటే.. ముందు ఆ మార్గాన్నే ఆచరించాలి. దేవుడిని పూర్తిగా నమ్మాలి.. ఆయనే అన్నీ చూడగలుగుతాడు..వినగలుగుతాడు.
4. యుద్ధం కూడా ఎవరుపడితే వారు ప్రకటించటానికి వీలు లేదు. ఖురాన్‌ ప్రకారం- ఇస్లాం మత పెద్దలు మాత్రమే యుద్ధాన్ని ప్రకటించాలి లేదా ఒక రాజ్యాధినేత యుద్ధాన్ని ప్రకటించాలి.
5. అమాయకులను, నిరాయుధులను హతమార్చటాన్ని నిషేధించారు. సున్నీ మత తొలి కాలిఫా- అబూ బకరల్‌ సిద్ధఖీ తన సేనలను- ‘‘మహిళలను, పిల్లలను, ముసలివారిని, వికలాంగులను హతమార్చవద్దు. పళ్లను ఇచ్చే చెట్లను కొట్టేయవద్దు. ఏ నగరాన్ని నాశనం చేయవద్దు..’’ అని ఆజ్ఞాపించాడు.
6. గెరిల్లా పద్ధతిలో దాడులు చేయటాన్ని కూడా ఖురాన్‌ నిషేధించింది. శత్రువులకు ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఒక సమయంలో మహ్మద్‌ ప్రవక్త తన శత్రువులకు నాలుగు నెలల ముందే హెచ్చరికలు జారీ చేశాడు.
7. చెడు చేసిన వారికి కూడా మంచి చేయమని మహ్మద్‌ ప్రవక్త ప్రవచించాడు. సొంత తెలివితేటలతో ఆలోచించండి. ఇతరులు మేలు చేస్తే మేము మేలు చేస్తాం.. వారు హాని చేస్తే మేము హాని చేస్తాం అనే బదులుగా- ఇతరులు మేలు చేస్తే మీరు మేలు చేయండి. వారు హాని చేసినా మీరు మేలు చేయండి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల్ని చంపేశాం ఇప్పుడెం చేయాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ ముస్లిం ఐక్యతా స్పూర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతుల్ని కాపాడే దెట్ల?కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇస్రో మార్కు విజయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొట్టు పెట్టనివాడు

బొట్టు పెట్టనివాడు 

తుపాకి నెక్కు బెట్టి  
 బొట్టికాయల ఉసురుతీసి   
పైశాచికా నంద మనుభవించి 
నెత్తుటిబొట్టు  పెట్టినాడు . 
వీర తిలకమ్మని వాడు పొంగిపోవ 
బుద్ధి  చెప్పగ  బుద్ధి జీవులంత  
ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి 
నాగరక సీమలొ రాక్షస విహారమ్ము  
మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము 
ఉద్య మించి  గట్టిగ కదల  వలయు  
 
 గబ్బట  దుర్గా ప్రసాద్ 
Posted in రచనలు | Tagged | Leave a comment

స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి

స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి

1-1-1911 లో జన్మించిన యల్లాప్రగడ సీతాకుమారి హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు .సికంద్రా బాద్ కీస్ బాలికా విద్యాలయం లో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగించారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం ,ప్రచారం విస్తృతం గ చేశారు .1934నిజాం రాష్ట్ర ఆంద్ర మహాసభకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లో ఆంద్ర యువతీ మండలి స్థాపనలో భాగస్వాములయ్యారు .’’ఆంద్ర ‘’అనే మాటను తెలంగాణా ప్రాంతం లో విస్తృతంగా ప్రచారం చేయటానికి విస్తృత ప్రయత్నం చేశారు .చిక్కడ పల్లి ‘’ప్రమదావనం ‘’స్తాపకురాలై ప్రమదల సేవ లో చొరవ చూపారు .

స్త్రీ విద్య ,మహిళా స్వాతంత్ర్యం ,వరకట్న నిషేధం ,వితంతు వివాహం మొదలైన విషయాలపై తీవ్ర కృషి చేశారు .నిజాం నిరంకుశ పాలనలో ‘’అక్కి రెడ్డి పల్లి ‘’ గ్రామం లో జరిగిన స్త్రీ ల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘం లో సభ్యురాలైనారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్త్రీలకు ధైర్యం చెప్పారు సీతాదేవి .అనాధలకు వితంతువులకు భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు .ఆంద్ర ,తెలంగాణా రాష్ట్రాలను ఏకీకృతం చేసి విశాలాంధ్ర ఎర్పడాలన్ను ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు .నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి పోటీలేకుండా 1957లో ఆంద్ర ప్రదేశ్ శాసన సభ కు ఎన్నికయ్యారు .ఆంధ్రులకు సంబంధించిన అన్ని ఉద్యమాలలో ముందు ఉండి నడిపించారు .సీతాదేవి గారి భర్త వై వి.ఎల్ నారాయణ రావు గారు పేరు పొందిన సర్వోదయ కార్య కర్త .Inline image 1

సీతాదేవి కధానికలు రచించి సాహిత్యాన్ని పండించారు .ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ గా ‘’గోల్కొండ పత్రిక ‘’లో రాసేవారు .సంస్కరణ ద్రుష్టి నిండుగా మెండుగా ఉన్న విదుషీమణి సీతా దేవిగారు .నిర్భీకత ఆమె సొమ్ము .స్త్రీ జనాభ్యుదయమే  ధ్యేయం గా డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన సంస్కర్త ,విదుషీమణి  ఏకీక్రుతాంధ్ర దేశంకోసం  పాటు పడిన మహిళ శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారిగారు2-1-1986న మరణించారు .

దేశ బాంధవి –దువ్వూరి సుబ్బమ్మ

తూర్పు గోదావరిజిల్లా రామచంద్రా పురం తాలూకా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ,పంచారామాలలో ముఖ్యమైనది అయిన దాక్షారామం లో సువ్వూరి సుబ్బమ్మ గారు 1880లో జన్మించారు .తండ్రి మల్లాది సుబ్బావధాని గారు .దువ్వూరి వెంకయ్యగారితో ఆమె వివాహమైంది . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్య యుద్ధం లో మార్గ దర్శి గా పని చేసిన వారిలో సుబ్బమ్మ గారిది ప్రధమ తాంబూలం .ఆమె ధైర్య సాహసాలు చొరవ అనితర సాధ్యం గా ఉండేవి .

సహాయ నిరాకరణ ఉద్యమం లో ఆమె ప్రముఖ పాత్ర వహించారు .ఉద్యమ శిక్షణ పొందిన భారతీయ మహిళలో సుబ్బమ్మ  గారు రెండవ వారు .అంతగా ఆమె వ్యక్తిత్వం  భాసించింది అన్నమాట .1922ఉద్యమం లో నాయకత్వం వహించి బ్రిటిష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. ఆమె ను అరెస్ట్ చేసి ఏడాది కాలం జైలు శిక్ష వేశారు .రాజ మండ్రి జైలులో ఈ శిక్ష  అనుభవించారు సుబ్బమ్మగారు .విడుదలై మళ్ళీ విజ్రుమ్భించి ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయి 31-3-1930 నుండి ఆరు నెలలు వెల్లూరు జైలులో కారాగార వాసం అనుభవించారు .శిక్ష పూర్తికాగానే క్విట్ ఇండియా ఉద్యమం లో చేరి పెద్దాపురం లో గొప్ప ప్రదర్శన నిర్వహించి లాఠీ చార్జీకి గురైనారు .

సుబ్బమ్మగారు పదహారు సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు .1923లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సుబ్బమ్మగారికి ‘’దేశ బాంధవి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రాజమండ్రిలోని సనాతన విద్యాలయ మేనేజర్ గా కొంతకాలం సేవ చేశారు .1964లో సుబ్బమ్మగారికి తీవ్రం గా జబ్బు చేసింది .ఆ జబ్బులోనే నెహ్రు మరణించాడన్న వార్త విన్నారు .దీనితో మానసికం గా కుంగిపోయి మందులు తీసుకొనే లేదు .ఎనభై నాలుగేళ్ళు దేశ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నా ధైర్య శీలి దువ్వూరి సుబ్బమ్మగారు 31-5-1964న నెహ్రు చనిపోయిన నాలుగు రోజులకే మరణించారు .

Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-12-14-ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

సమాజంలో అనాథలకు ఆదరణ లభించటం అంత సులువు కాదు. అదే అనాథ బాలికలయితే వాళ్లకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక వేళ ఏదైనా అనాథాశ్రమంలో చేరినా… వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభించటం అసాధ్యం. ఈ జఠిలమైన సమస్యను తీర్చటానికి ‘యశోదా పౌండేషన్‌’ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది.
సాధారణంగా అనాథాశ్రమాలు తమ వద్ద ఉన్న పిల్లలకు పదో తరగతి వరకు మాత్రమే విద్యను అందించగలుగుతాయి. ఆ తర్వాత ఏదో ఒక వృత్తి పనిచేసుకొమ్మని ప్రోత్సహిస్తాయి. చాలా సార్లు ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి దొరకాలంటే రకరకాల నైపుణ్యాలు అవసరమవుతాయి. ఈ నైపుణ్యాలను పెంపొందించే సంస్థలు ఎక్కుగా లేవు. ‘‘దీనిని మేం గుర్తించాం. అందుకే ఈ ఫౌండేషన్‌ను స్థాపించాం. పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించటం, వారు మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా మారేలా శిక్షణ ఇప్పించటం, ఆ తర్వాత మా సంస్థల్లోనే ఉద్యోగం ఇవ్వటం మా ప్రధానోద్దేశం’’ అంటారు యశోద హాస్పిటల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.రవీందర్‌ రావు. ఇప్పటి దాకా ఈ సంస్థ నుంచి 2108 మంది శిక్షణ పొందితే, వారిలో 1882 మందికి ఉద్యోగాలు లభించాయి.
రాష్ట్రంలోని వివిధ అనాథాశ్రమాలలో 16-20 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను ఎంపిక చేసి ఫౌండేషన్‌లో 65 రోజుల శిక్షణ ఇస్తారు. ‘‘మా దగ్గర శిక్షణ పొందే వారిలో 80 శాతం మంది అమ్మాయిలే. సాధారణంగా అనాథాశ్రమాలలో ఉన్న అబ్బాయిలను ఎక్కువగా దత్తత తీసుకుంటుంటారు. అమ్మాయిలను దత్తత తీసుకొనేవారు తక్కువ. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వారికి రక్షణ ఉండాలంటే ఉపాధి తప్పనిసరి. అందుకే మేము అమ్మాయిలనే పౌండేషన్‌లో చేర్చుకుంటామ’’ని రవీందర్‌ రావు వివరించారు. ఫౌండేషన్‌లో చేరిన వెంటనే వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లీషు, గణితం మొదలైన సబ్జెక్టులలో, ఉద్యోగానికి అవసరమైన కొన్ని మౌలికాంశాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటుగా ఉపకార వేతనం కూడా చెల్లిస్తారు. పిల్లలలో ఉన్న ప్రత్యేక ఆసక్తులను గమనించి డీఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఈసీజీ టెక్నీషియన్‌, సీఎస్‌ఏలాంటి సాంకేతిక వృత్తి విద్యా కోర్సులతోపాటు ఎలకి్ట్రషియన్‌, ప్లంబింగ్‌, డ్రైవింగ్‌, కార్పెంటరీ లాంటి వృత్తుల్లో కూడా శిక్షణ ఇస్తారు. 60 రోజుల తర్వాత శిక్షణ పొందిన వారికి మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఒకసారి శిక్షణ పొందిన తర్వాత వారికి యశోదా ఆసుపత్రి గ్రూపులో ఉద్యోగాలు ఇస్తారు. మరికొన్ని సంస్థలు కూడా ఉపాధి కల్పిస్తున్నాయి.
మానసిక కౌన్సిలింగ్‌
ఫౌండేషన్‌లో శిక్షణ కోసం అనాథలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్లు పెరిగిన వాతావరణం, పరిస్థితులు, మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అనాథలమనే ఆత్మన్యూనత, అగమ్యగోచరమైన భవిష్యత్తు అనాథలను మానసికంగా కుంగదీస్తుంటాయి. దాంతో తామేమీ చేయలేమని, తమకేమీ చేతకాదనే నిరాశలో కూరుకుపోతుంటారు. వాళ్లలో నెలకొనే ఈ భావనలను వదిలించి ఆత్మస్థయిర్యాన్ని నింపాలంటే తప్పనిసరిగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. అందుకే యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఉపాధి శిక్షణలో భాగంగా పిల్లలకు మానసిక కౌన్సిలింగ్‌ కూడా ఇస్తోంది. దాంతో జీవితం పట్ల సానుకూల ధృక్పథాన్ని అలవరచుకోవటానికి వీలవుతుంది. వారికి మానసికంగా సాయం చేయటం ఉపాధి పొందిన తర్వాత కూడా కొనసాగుతుంది. కొన్ని సార్లు ఉద్యోగం చేసే సమయంలో వారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేవారు ఎవరూ ఉండరు కాబట్టి ఫౌండేషనే ఆ సాయాన్ని అందిస్తుంది.
సమస్యలనేకం..
మన దేశంలో అనాథలకు సంబంధించిన చట్టాలపై అవగాహన చాలా తక్కువ. చాలా మంది అనాథాశ్రమాలను సేవా భావంతోనే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకున్న సంస్థలు కూడా తక్కువే. ‘‘మన రాష్ట్రంలో ఉన్న అనాథాశ్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మేము సేకరిస్తున్నాం. అంతే కాకుండా అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభించాం.
ఉదాహరణకు మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కల్పించటానికి ప్రయత్నిస్తున్నామ’ని రవీందర్‌ రావు వివరించారు.
అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గూగుల్ లో ”అన్న ”గారి ఫాంట్

ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్

విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది.
ఎన్టీఆర్ ఫాంట్ కొరకు ఈ లింకు క్లిక్ చేయండి : http://www.google.com/fonts/earlyaccess

NTR (Telugu)

NTR is a Telugu font, made available by Silicon Andhra under the SIL Open Font License v1.1.

Link

@import url(http://fonts.googleapis.com/earlyaccess/ntr.css);

Example

font-family: 'NTR', serif;

SIL Open Font License, 1.1 | Download

Nanum Brush Script (Korean)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదాదేవి పాశురాలు

ఆంధ్ర జ్యోతి

గోదాదేవి పాశురాలు
ఓంగి ఉలగళంద ఉత్తమన్‌ పేర్‌ పాడి
నాంగళ్‌ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్‌
తీంగిన్రి నాడెల్లామ్‌ తింగళ్‌ ముమ్మారి పేయ్‌దు
ఓంగు పెరుం శెన్నల్‌ ఊడు కయల్‌ ఉగళ
పూంగువళై ప్పోదిల్‌ పొరివండు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి
వాంగక్కుడమ్‌ నిరైక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్‌ పశుక్కళ్‌
నీంగాద శెల్వమ్‌ నిరైందు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌.
ఛఛఛ
పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా
చెయిజోచి అర్థించి కాలితో మర్దించి
బలిని పాతాళానికంపెనమ్మా
భువనమే మాధవునిదైనా – భూమి మాత్రం తనది అనుకొని
స్వామికే భూదానమిచ్చిన – బలిని పాతాళమునకణచిన
స్వామి వీడమ్మా – అంతర్యామి వీడమ్మా !
మూడు అడుగులమేర అడిగీ- ముజ్జగాలను ఆక్రమించీ
సంహరించక సంస్కరించీ – పాతాళమును పాలించమంటూ
తానె రక్షగ నిలిచినట్టీ – పొట్టివాడమ్మా చాలా గట్టివాడమ్మా !
అట్టివాడిని తట్టిలేపీ – గట్టిగా తలపెట్టినట్టీ
నోముకోసం సంభారాలను కోరుదామమ్మా !
నెలకు మూడు వానల్లు నందనందనా !
గోలచ్చిమి పాలవరద గోవర్ధనా
పూలు విరగబూయాలి చేలన్నీ పండాలి
చేలలోని నీటిలోన మీలు తుళ్ళి ఎగరాలి
బాలపాపలందరూ పూలమల్లెనవ్వాలి
కన్నెపిల్లలందరూ కాత్యాయని నోముపట్టి-
గోపబాలుని చేయిపట్టీ ఆ గడపమెట్టాలీ
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే- పల్లె పిల్లా మేలుకో
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాక్ ,ఇరాక్ లలో నర మేధ పర్వం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కినేని ఒక వ్యక్తీ కాదు -వ్యవస్త్గ, ,కత్తి కాంతారావు భార్యకు పెన్షన్

 anr statue1 001 anr2 001 anr3 001
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం

17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం లో ణా అధ్యక్షతన  జరిగిన కార్యక్రమం -మరియు సాయంత్ర శ్రీ సువర్చలాంజ నేయ స్వామి గుడిలో ”శ్రీ అగ్ని హోత్రం చక్ర వర్తి గారి చే తిరుప్పావై ప్రవచన ప్రారంభం  దృశ్యాలుpapercoverage- 001

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి   –శ్రీమతి  గోళ్ళమూడి రత్నమ్మ

Inline image 3

1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా  జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది .స్వయం గా నేర్చి తెలుగు కవిత్వం అల్లేవారు .చేబ్రోలుకు చెందిన గొల్లమూడి చంద్ర మౌళి గారితో రత్నమ్మ గారి వివాహం జరిగింది .1921లో గాంధీజీ చేబ్రోలు సందర్శించారు .ఆయన ఉపన్యాసాలకు ప్రభావితురాలైనారు .దేశ సేవలో పాల్గొని తానూ ధన్యత చెందాలని నిశ్చయించుకొన్నారు .గాంధీ ప్రభావం తో రాట్నం వడకటం నూలు తీయటం ఖాదీ ధరించటం చేశారు .

దురదృష్ట వశాత్తు రత్నమ్మ గారి భర్త అకస్మాత్తుగా చనిపోవటం తో ఆమె జీవితం లో శూన్యం ఏర్పడింది .సంతానమూ లేదు .ఈ బాధ భరించలేక తల్లడిల్లి పోయారు .క్రమంగా కోలుకొని 1928మద్రాస్ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో ఉత్సాహం గా పాల్గొన్నారు .తానూ ,తన తల్లిగారు సన్నని నూలు వాడికి దానితో వస్త్రాలు నేయించి కాంగ్రెస్ నేతలకు కానుకగా ఇచ్చేవారు .విదేశీ వస్త్ర బహిష్కరణ లోనూ తీవ్రం గా పాల్గొని విదేశీ వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్ నిర్వహించి వాటిని మూయిన్చేవారు .చక్కగా ఉపన్యాసాలు చేస్తూ తోటివారిని ప్రోత్సహించి ఉద్యమం లో పాల్గొనే నేర్పు రత్నమ్మ గారికి ఉండేది .ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి కారం రాసినట్లనిపించేవి .ఆమెను ‘’విప్లవ వనిత’‘గా ముద్ర వేసి అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలు శిక్ష వేశారు .పది హీను రోజులు జైలులో గడిపిన తర్వాత గాంధి –ఇర్విన్ ఒడంబడిక ననుసరించి జైలు నుండి విడుదలయ్యారు ..

అయినా రత్నమ్మగారు ఉద్యమ కార్యక్రమాలను ఆపలేదు. మరింత ఉత్సాహం గా నిర్వహించారు కాంగ్రెస్ వాలంటీర్ లతో కలిసి గ్రామాలు పర్య టించి స్వాతంత్ర సముపార్జన అవసరాన్ని తెలియ జేసేవారు ఖాదీ ప్రచారమూ నిర్వహించారు .శాంతి సైనికుల శిక్షణ కోసం శిబిరాలు నిర్వహించారు.పురుషులపై పోలీసులు లాఠీ చార్జి చేసి అరెస్ట్ చేస్తే స్త్రీలతో కలిసి పికెటింగ్ చేశారు .ఆమె మహా చురుకుగా ఆలోచించి అంతే వేగం గా కదిలేవారు .ఎక్కడ పికెటింగ్ జరిగినా రత్నమ్మ  గారు ముందు ఉండేవారు .మార్గ దర్శనం చేసేవారు .ప్రోత్సాహం ఇచ్చి ముందు నిలిచేవారు .

1923శాసనోల్లంఘన సమయం లో ఆమె ముందుండి ఉద్యమించి ,పికెటింగ్ చేస్తే అరెస్ట్ చేసి వదిలిపెట్టారు  .ఏ మాత్రం భయ పడకుండా మళ్ళీ స్త్రీలతో 75 ఏళ్ళ వృద్ధురాలైన తల్లిగారితో కలిసి సత్యాగ్రహం చేశారు .పోలీసులు మళ్ళీ వీరందర్నీ అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆరు నెలలు ఖైదు విధించారు .విడుదల వగానే తీవ్రంగా మళ్ళీ ఉద్యమాలు నిర్వహించారు .

1935గుంటూరు ‘’ఆంధ్ర రాష్ట్ర మహిళా సభ ‘’కు అధ్యక్షత వహించి ఉద్యమ తీవ్రతను తన ప్రసంగం లో వివరించారు .ఆమె కృషికి మెచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ సంఘం  రత్నమ్మగారిని ‘’మహిళా నియంత లందరిపైనా ‘’దళాది పతిగా ,ప్రధాన నియంతగా’’ నియమించింది .రెట్టించిన ఉత్సాహం తో స్త్రీలందరినీ అధిక సంఖ్యలో ప్రోత్సహించి శాసన ధిక్కారం చేయిన్చారామే .ఇక ఆమెను ఆపటం కష్టం అనుకొన్న బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి పది నెలలు శిక్ష విధించింది .రైతు బాంధవుడు ఆచార్య రంగా నిడుబ్రోలు లో ప్రతి ఏడాది నిర్వహించే రాజ కీయ పాఠశాలో రత్నమ్మ పాల్గొనేవారు .దేశం లో ఏమూల కాంగ్రెస్ సమావేశాలు ,సభలూ జరిగినా తప్పకుండా వెళ్లి హాజరయ్యేవారు  .జిల్లా కాంగ్రెస్ ,రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలై కాంగ్రెస్ ప్రచారం చేశారు.

1936ఎన్నికలలో గుంటూరు జిల్లా బోర్డుకు తెనాలి రెవిన్యు ఫిర్కా నుండి రత్నమ్మగారిని కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక చేశారు .1939లో గుంటూరు జిల్లాబోర్డు సభ్యలయ్యారు .1939లో చేబ్రోలు లో మహిళా గ్రంధాలయాన్ని స్థాపించి అధ్యక్షురాలైనారు .మహిళాభి వృద్ధే దేశాభి వృద్ధి అని త్రికరణ శుద్ధిగా నమ్మి పని చేసేవారు .చేబ్రోలు లో మరుసటి ఏడాది స్త్రీలకూ హిందీ విద్యాలయం ఏర్పాటుకు సాయపడ్డారు .అదే తర్వాత గుంటూరు హిందీ మహా విద్యాలయం గా పేరు పొందింది .ఏది చేపట్టినా అభి వృద్ధి చేసి చూపి సామర్ధ్యాన్ని నిరూపించిన మహిళా మాణిక్యం రత్నమ్మ గారు .ఆమె చొరవ ,పూనిక అలాంటిది .ధన సహాయం విరాళాల సేకరణ వనరుల చేకూర్పు లలో ఆమె తోడ్పాటు మరువ లేనిది .

1940వ్యక్తీ సత్యాగ్రహం లో ముందున్నారు .క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని అరెస్ట్ అయి శిక్ష పడకుండానే విడుదలయ్యారు రత్నమ్మగారు .1944జనవరి 26స్వతంత్ర దిం వేడుక లను పెద్ద ఎత్తున బ్రహ్మాండం గా జరిపారు .దీనికి ఫలితం ఆరు నెలల కారాగార శిక్ష అనుభవం .1945నిడుబ్రోలు ఆంద్ర మహిళా శిక్షణ కేంద్రం ఏర్పరచారు .గురువుగా ఉండి అన్నీ పకడ్బందీ గా చేశారు .అదొక పండుగ లాగా జరిగిందని ఇప్పటికీ జనం చెప్పుకొంటారు .1946 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి తీవ్ర కృషి చేశారు .

సత్తెన పల్లి లో తన గురువు గారి మఠానికి విరాళాలు ఇచ్చి ,సేకరించి తోడ్పడ్డారు .శాశ్వత ఆదాయం లభించే ఏర్పాటు చేశారు . చేబ్రోలు లో గురువుగారి పేర మఠం కట్టించినిర్వహణ కోసం  భూమిని ,నిధిని సమకూర్చారు .స్వయం గా బ్రహ్మ విద్య బోధించారు .ఇక్కడే మహాత్ముని కస్తూరి బాయిల చిత్రపటాలను ఆవిష్కరించారు .గ్రందాలయాన్నికూడా స్థాపించి స్వాతంత్ర్య సమరయోధులను ఆహ్వానించి గౌరవించి సత్కరించేవారు .రత్నమ్మ గారి తల్లిగారు స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .ఆమె 91 ఏట గాంధీజీ జయంతి నాడు మరణించారు .అప్పటినుండి రత్నమ్మ గారు గాంధి జయంతిని ,తల్లిగారి వర్ధంతిని కలిపి ఘనం గా నిర్వహించేవారు  .తనకున్న సంపద నంతటినీ దేశం కోసం వినియోగించిన త్యాగ మూర్తి రత్నమ్మగారు .88ఏళ్ళ ధన్య జీవితాన్ని గడిపి దేశ భక్త గొల్లమూడి రత్నమ్మ గారు 5-7-1972న స్వర్గస్తులయ్యారు .రత్నమ్మ గారి జీవితం స్పూర్తిదాయకం ,చిరస్మరణీయం .ఆమె ఒక మహిళా మాణిక్యం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-14-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ముళ్ళపూడి &బాపు తో కాసేపు గడపిన క్షణాలు

IMG_5360 IMG_5361 IMG_5362 IMG_5363 IMG_5364 IMG_5365 IMG_5366 IMG_5367 IMG_5368 IMG_5369 IMG_5370 IMG_5371 IMG_5372 IMG_5373 IMG_5374 IMG_5375 IMG_5376 IMG_5377 IMG_5378 IMG_5379 IMG_5380 IMG_5381 IMG_5382 IMG_5383 IMG_5384 IMG_5385

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ – శంకరంబాడి శత జయంతి

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ

Inline image 1

శంకరంబాడి శత జయంతి

‘’అయ్యా !మీ విద్వత్తును తెలుసుకొన్నాను .మీకు ఏ విధమైన సన్మానం కావాలో చెప్పండి ?రాష్ట్ర పతి

‘’అయ్యా  గుర్తించి నందుకు  ధన్యవాదాలు. అది మీ విజ్ఞత .నాకు  116 రూపాయలు ,ఒక శాలువాచాలండి ‘’కవి జవాబు .ఆ ప్రశ్నించిన రాష్ట్ర పతి  అకలంక దేశ భక్తులు ,భారత దేశ ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు .ఆ జవాబు చెప్పిన కవి ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’గీతం రాసి నేటి మన రాష్ట్ర గీతం గా గౌరవిం అందుకొనేట్లు  చేసిన వినయ మూర్తి అయిన తెలుగు కవి స్వర్గీయ శంకరం బాడి సుందరా చారి గారు  .ఇది  వారి శత జయంతి సంవత్సరం .మన ప్రభుత్వాలకు పెద్దగా పట్టి నట్లు లేదు .బడా బడా సాహిత్య సంస్థలూ బుజాన వేసుకోలేదు .ఏదో ఇంకా సాహిత్యాభిమానం ఉన్న మధ్య తరగతి  సంస్థలు మాత్రం భక్తిగా ఆరాధనా భావం తో నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకొంటున్నాయి .సరస భారతి కూడా ఉడతా భక్తిగా ఈ నెలలో 27వ తేదీ శనివారం73వ సమావేశం గా  ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో శంకరం బాడి సుందరా చారి గారి శత జయంతి వేడుకలను విద్యార్ధుల మధ్య జరుపుతూ వారికి అవగాహన కల్గించటానికి వ్యాస రచన పోటీ ని నిర్వహిస్తూ అభిమానాన్ని తెలియ జేస్తోంది .అలాంటి మహా నీయుని ఒక సారి గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నమే ఈ వ్యాసం .

అచ్చిరాని చదువు

ఇంతటి మహాకవి జన్మ దినం కూడాచరిత్రలో మనం నమోదు చేసుకోలేక పోవటం దురదృష్టం .వారు 10-8-1914 న తిరుపతి  దగ్గర తిరు చానూర్ లో  శంకరం బాడి అనేసంప్రదాయ  వైష్ణవ కుటుంబం లో సుందరాచారిజన్మించారు .తిరుపతిలోనే  దేవస్థానం పాఠ శాలలో చదివి  తెలుగు  సంస్క్రుతాలను నేర్చుకొన్నారు .ఆయన్ను బాగా ప్రభావితం చేసిన గురువు గారు ‘’పాతాళ భేది సుబ్రహ్మణ్య శర్మ ‘’ ‘’అల్లసాని రామనాధ శర్మ ‘’గార్లు  అని ఆయన ఎప్పుడూ భక్తితో తలపోస్తూ ఉండేవారు . ఇక్కడ ఎస్ ఎస్ ఎల్సి చదువుతుండగానే నాస్తిక భావన లో కొట్టుకుపోయారు .తలిదండ్రులు మందలించారు .ఇంట్లో ఉండలేక బయటికి వచ్చి స్వతంత్రం గా జీవిస్తూ హోటల్ సర్వర్ గా కూడా పని చేశారు   .చిన్ననాటి కవి మిత్రుడు శ్రీ రంగాచారి పాతికేళ్ళ లోపే చనిపోయాడు యా దిగులు వీరిని నిరంతరం బాధిస్తూ ఉండేది .

నిలకడ లేని జీవితం

ఈ చిలక్కొట్టుడు ఉద్యోగాలు విసుగు తెప్పించాయి .ఆంద్ర పత్రికలో ఉద్యోగం సంపాదించాలనే కోరికతో దాని వ్యవస్థాపకులు కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారిని మద్రాస్ వెళ్లి కలిశారు .వీరి ప్రతిభను గుర్తించిన ఆయన పత్రికలో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలమే చేసి స్వతంత్ర జీవనం అలవాటు పడ్డ అయన రాజీనామా చేసేశారు ..బి ఏ పాసైన ఆచారిగారు చిత్తూరు జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ గా కొద్దికాలం పని చేశారు .విధి నిర్వహణ లో చాలా కఠినం గా ఉండేవారు అందరిని ప్రోత్సహించేవారు .దీనితో ఆచారి గారంటే అభిమానం ఎక్కువైంది అందరిలో .

ఆకస్మిక నిర్ణయం –ఫలితం

ప్రతి ఆదివారం కంచి వెళ్లి కామాక్షీ అమ్మవారిని సందర్శించి శని ఆదివారాలు అక్కడే గడిపి రాత్త్రికి  ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని సోమవారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవారు .ఒక సారి అలా పడుకొని ఉన్న సమయం లో ఆ ఇంటిలోని భార్యా భర్తలు తమ కుమార్తె పెళ్లి విషయమై తగాదా పడటం విన్నారు .తలుపు కొట్టి లోపలి వెళ్లి వారు పోట్లాడుకోవాల్సిన పని లేదని వారి అమ్మాయిని తానూ వివాహం చేసుకొంటానని తిరుపతి వచ్చి తన తల్లిదండ్రులను సంపర దించమని ఆకస్మిక నిర్ణయాన్ని ప్రకటించి  తగాదాను తీర్చి అన్నమాట ప్రకారం ఆమెనే వివాహం చేసుకొన్నారు .త్వరలోనే భార్యకు మతి స్తిమితం తప్పిపోవటం తోకొద్దికాలం లోనే చనిపోయింది . ఆచారిగారు మొదటి సారిగా కుంగిపోయారు .విరక్తి కలిగి ఉద్యోగానికి రాజీనామా చేసేశారు .

దేశ దిమ్మరి జీవితం

అప్పటికే వారికి జిల్లా అంతటా కవిమిత్రులు స్నేహితులు చాలా మంది ఉండేవారు వారి దగ్గరకు తిరుగుతూ ఏదీ పట్టించుకోకుండా తిరిగారు .వీలైనప్పుడు నాటక సమాజాలకునాటకాలు రాసి ఇస్తూ వారి వెంట దేశ ద్రిమ్మరిగా తిరిగారు  స్థిర మైన ఆదాయం ,నిలకడ అయిన జీవితం కోల్పోయారు .1940-50మధ్య కొన్ని సినిమా లు  .బిల్హణీయం ,మహాత్మా గాంధి దీన బంధులకు సంభాషణలు రాసి దీనబందులో నటించారు కూడా .

మా తెలుగు తల్లికి గీతం  ఆవిర్భావం

ఒక సారి ‘’దీన బంధు ‘’ చిత్ర దర్శకుడు తెలుగు తల్లిపై పాట రాయమని కోరాడు .అప్పుదు  వీరి కలం నుండి జాలువారిన అద్భుత గీతమే  ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’కాని ఆ సినిమాలో ఆ పాటను డైరెక్టర్ వాడుకోలేక పోయాడు అలానే ఉండిపోయింది .

ఇంటింటా మారు మోగిన మా తెలుగు తల్లి

హెచ్ ఏం వి. గ్రామ ఫోన్ కంపెని ఆ పాటకు సుందరాచారి గారికి నూట పదహారు రూపాయలు ముట్ట జెప్పి  ఎస్ బాలసరస్వతి ,మధుర గాయిని టంగుటూరి సూర్య కుమారి గారి చేత బాణీ కట్టించి  సూర్య కుమారితో  పాడించి రికార్డ్ చేసి దేశానికి అందజేసి మహోపకారమే చేసింది .ఇంటింటా ఆ పాట ఆమె గాన  మాధుర్యం తోనూ ఆయన గీత మాధుర్యం తోనూ మారు మొగి పోయి యేన లేని ప్రచారాన్ని తెచ్చింది .

ఇతర రచనలు

ఆచారిగారు భారత ,రామాయణ ,భాగవతాలను  సరళమైన ఆట వెలది పద్యాలలో ‘’సుందర రామాయణం, సుందరభారతం, సుందర భాగవతం ‘’గా రాసి తమ ప్రతిభను చూపించారు .దాతల ఆర్ధిక సాయం తో వాటిని ముద్రించి ఊరూరు తిరిగి పాఠశాలలో అమ్ముకొని జీవించేవారు .అడిగిన వారికి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితం గా అందజేసేవారు .  . ‘’ బుద్ధ గీత  ను రాసి పది వేల కాపీలు ముద్రిస్తే హాట్ కేకుల్లాగా చెల్లిపోయాయి .వారిపై అంత గొప్ప అభిమానం అన్న మాట .ఏకలవ్యుడు ఖండకావ్యం,బలిదానం కెరటాలు ,సుందర బిందువులు ,జానపద గీతాలు స్థల

సాహిత్య రాజకీయ ప్రోత్సాహం

కపిస్థలం శ్రీ రంగా చారి గారితో నిరంతర సాన్నిహిత్యం ఏర్పరచుకొని వారితో సాహిత్య విషయాలను సుందరాచారిగారు చర్చిస్తూ ఉండేవారు .రాజ కీయ విషయాలను లోక సభ  స్పీకర్ మాడ భూషి అనంత శయనం అయ్యంగార్ తో చర్చించేవారు .వీరిద్దరూ అదే వీధిలో ఉండేవారు .

నిరుపేద జీవితం

‘అంతటి కవికి ఎంతటి కస్టాలోచ్చాయో తలుచుకొంటే గుండె బరువెక్కుతుంది  . నిరాడంబర జీవితమే గడిపిన దేశ భక్తులు .బీద తనమే ఆచారి గారి ఆరోగ్యాన్ని కబలిమ్చింది దీన్ని మర్చిపోవటానికి మద్యానికి బానిస అయ్యారు .ప్రతిభ ఉన్నా ఆదరించి ఆదుకొనే సహృదయత ఎవరూ చూపలేదు నిరాదరణకు గురైనారు .ఎన్నో అవకాశాలు దీనివల్ల చేజారిపోయాయి .ఎన్నో గౌరవ పురస్కారాలూ దూరమైపోయిన మిక్కిలి దురదృష్ట వంతులు .

మొక్కుబడి గౌరవ పురస్కారాలు

ప్రధమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ,ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకొన్న శాలువా ,116 రూపాయలు మాత్రమె వారి జీవితం లో ఘనం గా చెప్పుకోదగిన బహుమతి పురస్కారం .తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ‘’ప్రసన్న కవి ‘’ బిరుదు నిచ్చి సత్కరించింది .ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగినపుడు ఆచారి గారిని సగౌరవం గా ఆహ్వానించి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సన్మానించింది .తిరుపతి నగరపాలక సంస్థ వారి కాంశ్య విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించి గౌరవించింది .వీరిపై ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీ  ఆర్ అనంత పద్మ బాభ రావు గారు విపుల పరిశీలనతో గొప్ప గ్రంధం రచించారు

1977లో  తెలుగు తల్లికి కవితా మల్లె పూదండ అల్లిన శంకరంబాడి సుందరాచారి గారు 1977లో మరణించారు.

Inline image 2 Inline image 3    Inline image 4

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment