G.D.P.-1

G.D.P.-1

 

జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది .అది నిజమేనా ?అనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి .ఈ విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .దీనికీ  మార్క్ టుల్లి రాసిన పుస్తకమే ఆధారం .

ఈ జి డి.పి. పేదరికాన్ని పార ద్రోల గలుగుతుందా అని భారత ఆర్ధిక వేత్త సుర్జీత్ భల్లా తాను  రాసిన పుస్తకం ‘’పావర్టి—ఇనీక్వాలిటి అండ్ గ్రోత్ ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ ‘’లో ప్రశ్నించాడు .పేదరికం తో తలపడ టానికి అభి వృద్ధి సరిపడా జరిగింది అనీ అన్నాడు .ఆస్ట్రేలియా శాస్త్ర వేత్త సంపద గురించి పట్టించుకోనక్కరలేదు సంతృప్తి ముఖ్యం అని తేల్చాడు .ఇక్కడే భూటాన్ రాజ్య ప్రస్తావన చేస్తూ దాని రాజు ఆ దేశం లో  భూటాన్ ఆరోగ్యం దాని స్థూల జాతీయ సంతోషం తో సరిపోలుస్తారని తెలియ జేసిన విషయం వివరించాడు .’’సంతోషంఎక్కడ  ఉంటె ఆరోగ్యం అక్కడ ఉంటుంది అని ‘’లైఫ్ బాయ్ సబ్బు యాడ్ లాగా .అనేక శోధనలలో బీదరికం లో స్వేచ్చ వికసిస్తున్దనుకోవటమూ భ్రమే అని తేలింది .ధిల్లీ లో మురికి వాడలు పెరిగాయే కాని తగ్గ లేదు .పేదల విద్య ఇంకా మిధ్య గానే ఉంది .రచయిత ధిల్లీ దగ్గరలో ఉన్న గుర్గావ్ గ్రామం లోని పేద రైతు జీవితాన్ని తరచి చూసి అతని చిన్నతలం లో ‘’పశువుల పేడ  తో బాటు బయటికి వచ్చిన గింజలను ఏరుకొని నీళ్ళతో కడుక్కుని తినే వారని తెలిసింది .ఇప్పుడు పనికి ఆహారం పధకం వచ్చి కొంత నయం గా ఉంది .ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తున్నా అందులో దళారీలు బ్యూరోక్రాట్ ల వలన రావాల్సిన డబ్బు పూర్తిగా పేద వారికి అందటం లేనే లేదు .దొంగ పేర్ల తో దొంగ లిస్టులు తయారు చేసి డబ్బు నొక్కేస్తున్నారు .పాత తరం వారి జీవితాలలో స్వాతంత్ర్యం లేక పోయినా ఇప్పటి బీదలకు కొంత స్వేచ్చ లభిస్తోంది .అమెరికా లో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ అయినప్పుడు   ధన వంతుల పై పన్నులను తగ్గించి అధిక సంపదను సృష్టించి పేదలకు అందించమని కోరితే అది ఉల్టా పల్టా అయి ధనికులు మరీ ధన వంతులు బీద వారు మరీ పేదవారు అయి పోయారు .

భారత దేశం లో అమెరికా రాయ బారి జాన్ కెన్నెత్ గాల్  బ్రైత్,భారతీయులకు చాలా సన్నిహితుడు .ఆయన రాసిన ‘’ది ఎఫ్ఫ్లు ఎంట్ సొసైటీ ‘’లో’’ ప్రైవేట్  సంపద పబ్లిక్ మురికి కూపానికి దారి  తీసింది ‘’అన్నాడు   (private affluence led to public squalor).అయన మాట ను పెడ చెవిని పెట్టారు .2006-7ప్రపంచ పట్టణాల నగరాల  పరిస్తితి పై అమెరికా అధ్యయన రిపోర్ట్ లో వంద మిలియన్ ల జనం ప్రపంచ వ్యాప్తం గా ఇంకా మురికి వాడలలోనే జీవిస్తున్నారు .చివరి పది హేను ఏళ్ళలో ఆసియాలో అభి వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నా ,మురికి వాడల సంఖ్య పెరిగిందే కాని తగ్గ క పోవటం విశేషమే కాదు విచారకరం కూడా .ఇండియాలో గాల్  బ్రైత్ అమెరికా రాయ బారి గా ఉన్న కాలం లో ధిల్లీ లో మురికి వాడను కనీ పెట్టటం కష్టం గా ఉండేది .ఇప్పుడు వాటిని తప్పించుకు పోలేని స్తితి .మురికి కాలనీ వాసులు ఏదో నేరం లో ఇరుక్కొని జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు .ఇప్పుడు స్థానికులు వారిని వేరే చోట పునరావాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .దిల్లీలో జన సాంద్రతని జన సముద్రాన్ని తట్టుకోలేక దిల్లీకి పాతిక కిలో మీటర్ల దూరం లోఉన్న గుర్గావ్ కు  భారతీయ ,విదేశీ సమస్థలు వలస పోయాయి .అది చిన్న పట్ట్టణమే  అయినా’’ ఆకాశ హర్మ్యాలు ‘’నిర్మించి శాటి లైట్ టౌన్ గా అభి వృద్ధి చెందించారు .

అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘’మైక్రో సాఫ్ట్ ‘’గుర్గావ్ లో ఆఫీసులు ఏర్పాటు చేసు కొన్నది .దాని చైర్మన్ అయిన రవి వెంకట రామన్ మూడు విషయాలపై అధ్యయనం చేసి తన అభిప్రాయాలను విడుదల చేశాడు .ఇండియా పార దర్శకం గా వ్యవహరించి లంచ గొండితనాన్ని తగ్గించింది అన్నాడు కంప్యూటర్లు. బ్యూరో క్రాట్ ‘’బాబుల ‘’బండారం బయట పెట్టాయి .ఆన్ లైన్ లావా దేవీలు ఎలా జరుగుతునన్నాయో తెలిపే ఉదంతం ఒకటి చెప్పాడు .ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఐ టి వలన వేరి హాపీఅనీ  వాళ్లకు వారానికి వచ్చే  మామూళ్ళు,  లంచాలు ఠంచన్ గా  ‘’ఈ మెయిల్’’ లో నమోదై చేతికి అందుతున్నాయని ఆనందం గా చెప్పాడు .కంప్యూటర్ గొప్ప తనం ఇదా అని ముక్కున వేలేసుకో కండి మరి .

రామన్ చెప్పినదానిలో మైక్రో సాఫ్ట్ మిగిలిన వాటికంటే ఎక్కువ సమానత్వాన్ని సాధించింది .అక్కడ బాస్ కు మామూలు ఉద్యోగికి ఒకే భోజనం .ఐ టి విప్లవం పారిశ్రామిక విప్లవం కంటే గొప్ప విప్లవమైంది .ఇండియా ఇప్పుడున్న పధం లోనే ప్రయాణించి ఆర్ధికాభి వృద్ధిని వేగ వంతం చేసి మైనారిటీజనాల సంక్షేమం కోసం పాటు పడాలి .ఇందులో మూడు మార్గాలున్నాయి .మొదటిది ‘’ఇండియా ఫస్ట్ ‘’అనేది .అంటే అన్నిట్లో ఇండియా అగ్రగామి గా ఉండాలన్నది .దీనివలన అందరూ కలిసి ఇండియాని మొదటి స్థానం లో నిలబెట్టాలి .దేశం మొత్తం అభి వృద్ధిలో భాగస్వామ్యం పొందాలి దాని ఫలితాలు అనుభవించాలి .రెండోది ‘’ఇండియా అక్కడే ఆగిపోవటం ‘’(India getting stuck).ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మంద గించటం ,భారతీయ ఎగుమతులకు అవకాశాలు తగ్గి పోవటం  దేశం లో కూడా అభి వృద్ధి అసమానం గా ఉండటం .మూడవది ఐ టి ప్రయోజనాలను కమ్మ్యూనిటి టెక్నాలజీ ,లెర్నింగ్ సెంటర్స్ ను ఏర్పరచి అట్టడుగు వర్గాలకు చేర్చటం .విద్యార్ధుల స్థాయి పెంచటం, వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచటం ,వారికి  కొత్త టెక్నాలజీ తో పరిచయం కల్గించటం ,వాళ్లకు స్థానికం గానే శిక్షణ ను కల్పించటం .ఎక్కడఆర్ధిక  వ్యవస్తలో లోపాలున్నాయో గమనించి వాటిని సరిదిద్దటం .గ్రామీణ ఆర్ధిక స్తితిని శక్తి వంతం చేయటం .పట్టణాభి వృద్ధి తో  గ్రామీణా భివృద్ధి పోటీపడి సాధించటం .చిన్న ,,మధ్య తరగతి వ్యాపార సంస్థలను గ్లోబల్ గా పోటీ పడే ట్లు చేయటం .వీతన్నిటి కోసం మైక్రో సాఫ్ట్ పని చేస్తోందని రవి చెప్పాడు .మైక్రో సాఫ్ట్ పూర్తిగా ఒక ప్రైవేట్ సెక్టార్ కాదు .గవర్న మెంట్ తో సంబంధం లేకుండాను లేదు .దాని అన్ని ప్రాజెక్టులు ప్రైవేట్ –పబ్లిక్ భాగ స్వామ్యం తో పని చేస్తాయి .ఇందులో వ్యక్తికీ తగిన స్థానం ఉంటుంది బిజినెస్ ,ప్రభుత్వమూ అతి సన్నిహితమవుతాయి .అభి వృద్ధి నిరోధకులు ,కాపిటలిజానికి వ్యతి రేకులు మైక్రో సాఫ్ట్ విధానాలను స్వంత ప్రయోజనాలకోసం చేస్తున్నవే నని విరుచుకు పడుతున్నారు .ఇండియాలో సమతుల్య ఆర్ధిక వ్యవస్థకు మైక్రో సాఫ్ట్ మీద ఆధార పడితేనే మంచిదని పిస్తోంది .బిజినెస్ ఉత్సాహం ఉన్న వారు సంపద సృష్టికి పెద్ద పాత్ర పోషించాలి .బిల్ అండ్ మెలిండాఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్అసమానత ను  అమెరికా లోను ప్రపంచ మంతటా తగ్గించటానికే అంకితమయ్యాడు .ఆయనది లాభ నష్టాల మీద నడిచే సంస్థకాదని,షేర్ హోల్డర్ విలువను పెంచుకోవటానికి కాని కాదని గ్రహిం చాలీ . ‘’ఇండియా ఫస్ట్’’ప్లాన్ లో అభి వృద్ధి యెలాఉన్దని రవిని అడిగితే ఇండియా పాశ్చాత్య దేశాలను అనుకరిస్తే విషాదమే మిగుల్తుంది అన్నాడు .ఉదాహరణకు రోడ్డు రవాణా సంస్థను తీసుకొంటే పెరుగుతున్న జనాభా కోసం పెరిగిన రావాణా వ్యవస్థ వలన శక్తి వనరుల వాడకం ఎక్కువై పర్యావరణ సమస్యలు పెరిగి పోయాయని చెప్పాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా  పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి  ఆర్దికంపై    కంట్రోల్ లను  సడలించే దాకా తాము ఏమాత్రం ఆదుకోలేమని చెప్పింది .అప్పటిదాకా అమలు లో ఉన్న సోషలిస్టు భావాలను పద్ధతుల్ని వదులుకోటానికి ఆయన మంత్రులు  ఇష్టపడలేదు .అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్ మోహన్ సింగ్ సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిస్తే తప్ప గండం గడవదు అని అర్ధం చేసుకొని ప్రధానికి చెప్పాడు ,పేద దేశమైన ఇండియా ప్రభుత్వానికి  మార్కెట్ కు మధ్యే మార్గాన్ని అనుసరించి బయట పడాలని సూచించాడు .బంగారాన్ని అమ్మేసి ఆర్ధిక స్తితి మెరుగు పరచి సంస్కరణలు అమలు చేసి ఆర్ధికం గా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దారు ప్రధాని రావు మన మోహన్ .సింగ్ ప్రధాని అయి ఈ విధానాన్నే కోన సాగించాడు .గ్రామీణ ప్రజలకు పని కల్పించటం ,విద్యా విధానాలలో మార్పులు తేవటం ద్వారా కొంత మెరుగు పరచాడు సింగ్

సోషలిజం ఓడి పోవటం ,మార్కెట్ బల బడటం వలన మళ్ళీ ఆర్ధిక అసమానత్వం ఏర్పడింది .ప్రపంచీకరణ విజయమై ప్రపంచమంతా మార్కెట్ మయం అయింది.సోషలిజం పతనం తో బాటు ప్రపంచీకరణ ప్రాధాన్యత పెరిగింది .1991 తర్వాతా ఇతర దేశాలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి .కోకా కోలా సామ్రాజ్యం విస్తరించింది .జనతా ప్రభుత్వ హయాం లో దీన్ని నెట్టేశారు .’’కోక్ ను కిక్ చేయటం భారత దేశ స్వాతంత్రయానికి చిహ్నం ‘’అయిందప్పుడు .ఇప్పుడు మళ్ళీ వచ్చి తిష్ట వేసి ఇండియాను లొంగ దీసుకోంది.ఇండియా గ్లోబలై జేషన్ వలన  లాభ  పడింది  ఇన్ ఫర్  మేషన్ టెక్నాలజీ ,బిజినెస్ అవుట్ సోర్సింగ్ లకు అంతర్జాతీయ మార్కెట్ లభించింది .భారత్ కూడా ఉత్పత్తి లో ముందడుగు వేసి ‘’ఇంటర్నేషనల్ ప్లేయర్ ‘’ పాత్ర పోషిస్తోంది .ఇంతకీ ప్రపంచీకరణ  పేదలకు ఏమి లాభం కలిగిస్తుంది అనే ఆలోచనా సాగింది .

సోవియట్ యూనియన్ పతనం తర్వాతా రష్యాలో ‘’బిగ్ బాంగ్ గ్లోబలైజేషన్ ‘’పెరిగి పోయింది .రోరింగ్ నైన్ టీస్ పుస్తకంలో  జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’ఆర్ధిక ప్రపంచీకరణ రాజకీయ ప్రపంచీకరణ ను తోసి రాజైంది ‘’అన్నాడు .’’ఆన్ గ్లోబలైజేషన్ ‘’పుస్తకం లో ఫైనాన్సేర్ ,దాత అయిన జార్జ్ సారోస్ ‘’మార్కెట్ ఫండ మెంటలిస్టూలకు అంటి గ్లోబలైజేషన్ కార్య కర్తలకు మధ్య ఒక తమాషా ఒడంబడిక కుదిరింది .ఇది శుభ పరిణామం .అంతర్జాతీయ సంస్థలు బలోపేతం గా ఉండాలి .సంస్కరణలకు అంగీకరించే వారితో జతకలవాలి .అంతర్జాతీయ పద్ధతులు బలపడాలికాని బలహీన పడరాదు ‘’అన్నాడు .ఇవాళ గ్రామాలలో కూడా మనిషి తో చేసే వ్యవసాయం కంటే యంత్రం తో చేసేదే ఎక్కువైంది .అమెరికా వ్యవ సాయ దారులు కూడా ప్రభుత్వం తమకు సబ్సిడీలిచ్చి ఉత్పత్తికి సహకరించాలని కోరుతున్నారు .పంజాబ్ లాంటి రాష్ట్రాలలో భూమి ఉప్పు బారి పోయి పంటలకు అనుకూలమవ్వటం లేదు .వీరు తాయ్ ల్యాండ్ మొదలైన దేశాలలో బియ్యం మొదలైనవి హాయిగా పండించుకొనే ఆలోచనలో ఉన్నారు  .

ఇండియా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ లకు ఆహ్వానం పలుకుతోంది .అంబాని వాల్ మార్ట్ టేస్కో లాంటి సంస్స్తలను ఆహ్వానించి మార్కెట్ రంగం లో దూసుకు పోయే ఆలోచన తో ఉన్నాడు .భారతీయ చిల్లర దుకాణాలు దీని వల్ల  కనుమరుగౌతాయి .ఉపాధి పోతుంది .చిల్లర వర్తకులు స్వయం సమృద్ధి గా యాజమాన్యం వహించి కస్టమర్ల్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు .వీరి పొట్ట కొట్టటం భావ్యం కాదు .వీరంతా భారత జాతీయతకు వెన్నెముకలే .గ్లోబలై జేషన్ వలన జాతీయత దెబ్బ తింటుంది అని కొందరి వాదన .పాశ్చాత్య సంస్థలు ఇక్కడ బల పడితే భౌతిక నాగరకత పెరిగి ఆధ్యాత్మికత దెబ్బ తింటుందనే భయమూ ఉంది .

ఆస్ట్రేలియా కు చెందిన ఆర్ధిక వేత్త ,రాజకీయ శాస్త్రజ్ఞుడు క్లైవ్ హామిల్టన్ తన ‘’గ్రోత్ ఫిటీష్ ‘’పుస్తకం లో ప్రపంచీకరణ అంటే ఆపకుండా వృద్ధిని వ్యాపించ చేయటం ,వినియోగ దారుల పెట్టుబడిని అభివృద్ధి పరచటం ‘’అని అన్నాడు .గ్లోబలైజేషన్ అనేది సాంస్కృతిక పరం గా ఒక ప్రత్యెక సిద్ధాంతం ,మాత్రమేకాక ఒక స్వేచ్చా శక్తి కూడా ‘అన్నాడు రాస్ ..మీడియా లో ప్రకటనల జోరు వ్యాపారాలను బాగా పెపెంచింది .ఇండియాలోని ఒకప్పుడు మద్రాస్ కే పరిమిత మైన శరవణ భవన్ హోటల్ ఇవాళ చాలా దేశాల్లో స్తానం సాధించింది .ఢిల్లీ లోని కన్నాట్ సర్కస్ లో ఉన్న ఆ హోటల్ ముందు జనం క్యూలు కట్టి నిలబడతారు .పక్కనే ఉన్న మాక్దోనాల్ద్ స్టాల్ వెల వెల బోతూ  కని  పిస్తుంది .పాశ్చాత్య దేశాలలో గ్లోబల్ సంస్కృతీ తప్పని సరి అంతకంటే వారేమీ చేయలేరు .నియంత్రించనూ లేరు .

ఇండియా లో కమ్మ్యూనిస్ట్ లు మాత్రమె ప్రపంచీకరణ ను అడ్డుకొంటున్నారు .దీని వలన నష్టమే కాని లాభం లేదు .వారి వాదం కాలం చెల్లిన వాదమే అయి పోయింది .వీరు అధికారాలలో ఉన్న దేశాలలో ప్రపంచీకరణకు పెద్ద పీట వేస్తున్నారు .ఊరికే బయటి షో వారి ప్రదర్శనలూ స్లోగాన్లూ .మన్ మోహన్ సింగ్  మాట్లాడుతూ కాపిటలిజం ఇండియా కున్న అవసరాలను తీర్చేదిగా ,క్రమ విధానం లో ఒక దాని తర్వాతా ఒకటిగా పని చేయాలన్నాడు .మోరల్ ఎకనామిక్స్ విషయం లో నిస్పృహ చెందరాదన్నాడు .ఇవాళ సోషలిస్ట్ ఏకనా మిస్ట్ లే ఒంటరి వారై పోయారని చెప్పాడు సింగ్ .మోరల్ ఎకనామిజం వస్తే మార్కెట్ ఎకనామిజం వెనకడుగేస్తుందని నమ్మకం గా చెప్పాడు .

ఇండియా ఎకానమిస్ట్ రాజీవ్ కుమార్ మోరల్ ఎకనామిక్స్ పై అధారిటి .నక్సల్ భావాలు బాగా జీర్నిచుకు పోయిన వాడు .ఆయన ఆక్స్ ఫర్డ్ విద్యార్ధి గా ఉన్నప్పుడు ‘’డి సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ‘’పుస్తకం చదివి ఏంతో మారిపోయానని చెప్పాడు .పదార్ధానికి అవతల ఏదో ఒక గొప్ప విషయం ఉంది .అదొక స్పిరిట్ ఆత్మా శక్తి అన్నాడు. మొక్కలు మాట్లాడుతాయని ,తెలుసుకోన్నానన్నాడు .ఆయన  మోరల్ ఎకనామిజం  గురించిచెబుతూ మార్కెట్ ను గాడిద తో పోల్చాడు .గాడిద వెనక ,అదే మన లీడర్ అనుకోని నడుస్తుంటే లాగి తంతుంది .మనం దాని మీద కూర్చుని స్వారి చేస్తూ దానికి దారి చూపిస్తే అది మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది .కనుక మనం పెట్టుకొనే రూల్స్ ,విధి విధానాలు పకడ్బందీ గా ఉంటె ఆహార వస్తు సరఫరా సవ్యం గా జరిగి ,సేవ అత్యున్నత నైపుణ్యం తో నిర్వహించ వచ్చు .మనకేమి కావాలో స్పష్టం గా మనకు తెలిస్తే ఆ దిశలో కృషి చేస్తే కావలసింది సిద్ధిస్తుంది .’’అని చెప్పాడు .జపాన్ కొరియాలు మార్కెట్ ద్వారా ప్రజలకు మంచివిద్య నిప్పిస్తున్నాయి .ఇండియా కూడా దీన్ని వాళ్ళ లాగే సాధించాలి .మార్కెట్ సేవను ముఖ్యం గా విద్యా రంగానికి ఉపయోగిస్తే సమస్య పరిష్కారమవుతుంది .మార్కెట్ తక్కువ ధరకు పేదవారికి  అందు బాటు ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలి .ఎగుమతి కోసం ఖరీదైన వస్తువుల్ని తయారు చేసి అమ్ముకో వచ్చు .స్థానికం గా మాత్రం చీప్ అండ్ బెస్ట్ వి అందుబాటులోకి తేవాలి .

రోరింగ్ నైన్టీస్ లో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’మా అమెరికా విధానం లో ఇతర దేశాలలో అసమానత్వం ,కొన్ని సందర్భాలలో స్థానిక విలువలను సంస్కృతిని త్రునీకరించటం  జరుగు తోంది ఇది మంచిది కాదు .  గ్లోబల్ సోషల్ జస్టిస్ అంటేప్రాపంచిక సాంఘిక న్యాయం మీద ద్రుష్టి పెట్టాలి .ప్రభుత్వం ,మార్కెట్ కలిసి సమ తూకం లో పాత్ర నిర్వ హించాలి .దానికోసమే అందరి దృస్టీ కేంద్రీకరించాలి ‘’అన్నాడు .దీన్ని బట్టి మనకు తేలేది ఏమిటి?పూర్తిగా గుడ్డిగా ప్రపంచీకరణ ను త్రుణీక రించరాదు. ప్రపంచీకరణ లోచాలా దూరం ముందుకు వెళ్లాం ఇక వెనక్కి మరలే ప్రశక్తి లేదు .ఇప్పుడు సమస్య దాన్ని ఎలా మన అవసరాలకు పని చేయించుకోవాలి అన్నదే .నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ కూడా గ్లోబలైజేషన్ ను ,ట్రేడ్ ఎకనామిక్స్ ను ఇక ఆపలేము అన్నాడు .మరి గ్లోబలైజేషన్ ను ఎలా పని చేయించాలి?దీనికి ఒకటే పరిష్కార మార్గం ఉంది .విధాన నిర్ణయాలు గ్లోబల్ స్థాయలో తీసుకొని జాతీయ స్థాయిలోఅమలు జరపాలి .  సమతుల్యతను సాధించాలి .దీనివల్ల అంతర్జాతీయ సంస్థలను బలీయం చేయాలి .మార్కెట్ మనల్ని ముక్కుపట్టుకొని ముందుకు లాక్కెళ్ళ కుండా జాగ్రత్త పడాలి .ప్రభుత్వము ,మార్కెట్ల పాత్రకూడా సమతుల్యం గా బాలన్స్ గా ఉండాలి .అలాంటి మధ్యేమార్గ సమతుల్యత సాధించాలంటే ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ,చర్చలు అర్ధవంతం గా అభివృద్ధికి మార్గ దర్శకం గా జరుగుతూ ఉండాలి .మార్కేట్ ఫండ మెంటలిస్టూలను, గ్లోబలైజేషన్ వ్యరిరేకులను ఒక కంట కని  పెడుతూ వారి  స్లోగన్ల కు అరుపులు కేకలకు అదరక బెదరక సమతుల్యతః తో   మధ్యే మార్గాన్ని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించగలం .

ఆధారం –ఇండియా అన్ ఎండింగ్ జర్నీ –రచయిత మార్క్ టుల్లి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -7

శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం .

సంజీవినీ విద్య

అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు .ఈయన ప్రాపంచిక సుఖాలకు దూరమై ప్రశాంతం గా ఒక ఆశ్రమం లో ముని వ్రుత్తి తో జీవితాన్ని గడుపుతున్నాడు .తపస్సు, విద్యార్ధులకు అధ్యాపనం మాత్రమె ఆయన నిత్య కృత్యాలు .ఈ మహర్షి ధార్మిక జీవితాన్ని గమనించిన ఇంద్రుడు సంప్రీతుడై మహర్షి దగ్గరకు వచ్చి ,అతిధి పూజలందుకొని మహర్షి సచ్చీలత ,ధర్మ తత్పరత తనకు ఏంతో ఆనందాన్ని కల్గిన్చాయని వరం ఇవ్వాలని పిస్తోందని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు .తనకు కాంతా కనకాలపై వ్యామోహం లేదు .కాని బతిమాలి ఇంద్రుడు వరం ఇస్తానంటే వద్దన రాదనుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందే ‘’మధు విద్య ‘’ను ఉపదేశించమని కోరాడు . ఇంద్రుడు  సంకటం లో పడ్డాడు .అయినా మాట నిలబెట్టుకోవాలని విద్యను ఇంద్రుడు మహర్షికి ఉపదేశించాడు .ఆ మధువిద్య  ను ఇంకెవరికైనా ఇస్తే మహర్షి శిరస్సును వజ్రాయుధం తో ఖండిన్చేస్తానని ఇంద్రుడు మహర్షిని హెచ్చరించి వెళ్లి పోయాడు .

కొంతకాలానికి ఇంద్రుడి చేత యజ్న భాగం లేకుండా బహిష్కరింప బడిన శ్వినీ దేవతలకీ  విషయం  తెలిసింది .పోయిన తమ ప్రాభవాన్ని మధు విద్య ద్వారా మళ్ళీ సాధించుకోవచ్చనే ఆశా కలిగి దధ్యజాచార్త్యుని చేరి మధు విద్యను ఉపదేశించమని కోరారు .ఇంద్రుని శాసనాన్ని మహర్షి వారికి తెలియ జేశాడు ..అప్పుడు అశ్వినులు ముందుగా మహర్షి తలను నరికి గుర్రపు తలను అతికిస్తామని ,విద్య ఉపదేశం చేసిన తర్వాత ఇంద్రుడు గుర్రం తలను ఖండిస్తాడని  తర్వాత తాము మహర్షికి మామాలు తలను అంటించి సంజీవనీ విద్య తో బ్రతికిస్తామని తెలిపారు .సరిగ్గా అలానే జరిగింది .మహర్షి మధు విద్యను  ఆశ్వనిలకు ఇస్తే ,ఇంద్రుడు వచ్చి మహర్షి శిరస్సు ఖండించినందుకు దుఃఖ పడ్డాడు మహర్షి ఇంద్రుడిని ఓదారుస్తాడు .కనుక విద్యలను అత్యంత గోప్యం గా కాపాడుకోవాలని ఈ ఉపాఖ్యానం తెలియ జేస్తోంది .అలాగే పాత్రల నెరిగి విద్యాదానం చేయాలనే సూచనా ఉంది .

ఊర్వశీ పురూరవులు

ఇళుడుఅనే మహా రాజు పార్వతీ దేవి శాపానికి గురై ఆరు నెలలు స్త్రీగా ఉండాల్సి వచ్చి ఇళాదేవి అయాడు  .ఈమె మీద బుధుడి ద్రుష్టి పడి వారిద్దరి సంగమం తో పురూరవుడు జన్మించాడు .పురూరవుడు తలిదండ్రులను మించిన ప్రజ్ఞా శాలి .ఒక రోజు దేవ సభలో చక్ర వర్తి ఊర్వశిని చూసి మోహించాడు .ఆమెకూ అతనిపై ఆకర్షణ కలిగింది .మిత్రావరుణ శాపం వలన ఊర్వశి మానవ కాంత గా ఉండాల్సిన సమయమూ వచ్చింది .ఊర్వశి తాను ఎప్పుడూ నేతినే ఆహారం గా స్వీకరిస్తానని ,తనవద్ద ఎప్పుడూ ఒక మేకల జంట ఉండాలని ,పడకకు అవతల ఎప్పుడూ పురూరవుడు నగ్నం గా కని  పించరాదని మూడు షరతులను పెట్టి,పురూరవ చక్ర వర్తి పట్టపు రాణిగా అతనితోకలిసి భూలోకానికి ఊర్వశి వచ్చింది .వారిద్దరి దాంపత్యం చాలా ఏళ్ళు ఆదర్శ వంతం గా గడచి పోయింది .గంధర్వుల మాయో పాయం వలన చివరి రెండు షరతులు భగ్నం అయ్యాయి. వెంటనే ఊర్వశి తానూ చెప్పిన మాటకు కట్టు బడి స్వర్గ లోకం చేరింది .విరహ వేదనతో జ్వలిస్తున్న పురూరవుడు నిర్మధనం  ద్వారా అగ్ని సృష్టించి గార్హపత్యం ,ఆహవ నీయం  ,దక్షిణాగ్ని స్థలాలలో త్రేతాగ్నులను అర్చించి స్వర్గానికి చేరి ఊర్వశి పొందు సౌఖ్యం పొందాడు .ఈ కధలో పురూరవుని నిష్కళంక ప్రేమ తెలుస్తుంది విధిని ఎవరూ తప్పించలేరని అర్ధమౌతుంది .వ్రుత్రాసురో పాఖ్యానం కూడా ఈ  బ్రాహ్మణం లోనిదే .

జైమిని బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

మేడిచెట్టు పుట్టుక

సామ వేదానికి చెందినా జైమిని బ్రాహ్మణం లో అసంఖ్యాక ఉపాఖ్యానాలున్నాయి .అందులో మేడి చెట్టు పుట్టుక కద తెలుసు కొందాం .మేడికి ‘’ఉదుంబర ‘’అని పేరు .ఇది చాలా సారవంతమైన వ్రుక్షం .ప్రజాపతి అన్నం సారాన్ని అంతటినీ ఒక చోట చేర్చి ప్రజలకు పంచటం ప్రారంభించాడు .అప్పుడు కొన్ని చుక్కలు నేల మీద పడి మేడి చెట్టు పుట్టిందట .అందుకే మేడి పండు మంచి పుష్టి నిచ్చేఆహారం అని  ఆయుర్వేదం చెబుతోంది .

ప్రజా పతి ప్రజా సృష్టి చేయటం ,అగ్ని ని ముఖం నుండి సృష్టించటం ,.ప్రజా పతి ముఖం నుండి అగ్ని భయంకర జ్వాలలతో బయటకు వచ్చి ప్రజాపతి శిరస్సుకు హాని కలగటం ,దేవతలు ఈ అగ్నిని బృహస్పతి ద్వారా గ్రహించటం కూడా వివరింప బడింది .

తాండ్య బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు గురించి తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు  ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం కాపాడు కొంటున్నాయి .ఇలాంటి పరిస్తితులలో భారత దేశం ఎటు వైపు వెళ్ళాలి ?ఏ విధానం అవలంబించాలి అని మేధావులు ,మతాధిపతులు సాంఘిక శాస్త్ర కోవిదులు సామాన్యులు ఆలోచించి తలలు బద్దలు కొట్టుకొంటున్నారు .ఈ సమస్య పూర్వా పరాలను ఒక సారి ఆలోచిద్దాం .

ఇవాళ ఆర్ధికం అన్నిటిని శాసిస్తోంది .మార్కెట్ కాపిటలిజం ,ప్రైవేట్ వ్యాపార సంస్థలు ప్రభుత్వం యొక్క  శాసనాదికారాలకు దూరమై ఇస్టా రాజ్యం గా వ్యవహరిస్తున్నాయి .వాటిపై నియంత్రణను ప్రభుత్వం దాదాపు కోల్పోయి నట్లే .ఇప్పుడు విజయం అనేది జి డి పి .పెరుగుదల తో ముడి పెడుతున్నారు .సోషలిస్ట్ ఆర్ధిక వేత్తలు దేశ ప్రభుత్వాదికార సంస్థలకే  అత్యధిక అధికారాలిచ్చారు .ప్రైవేట్ రంగాన్ని నమ్మనే లేదు .మార్కేట్ కేపిటలిజాన్ని తిరస్కరించారు .ఇప్పుడుత్రాసు సిబ్బెలు ఒక చివరి నుండి ఇంకో చివరికి ఊగిపోయాయి .ఆర్ధిక వేత్తలు మధ్యే మార్గాన్ని కనుక్కో లేక పోయారు .అదే ఇప్పుడు మనల్ని ఆదుకొనే దారి అని పిస్తోంది .సోషలిస్ట్ భావాలున్న మొదటి ప్రధాని నెహ్రు ప్రభుత్వ రంగ సంస్థలపైనే ఆధారపడ్డాడు .దిగుమతులపై ఆధారపడకుండా ఉత్పత్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు చేశాడు .నెమ్మదిగా సోపానాలు నిర్మిస్తూ ఆర్ధిక పరి పుష్టి సాధించే ప్రయత్నాలు అమలు చేశాడు .రష్యా దీన్ని సమర్ధించింది .దీనివల్ల బ్యూరాక్రసి పెరిగింది .వీరే ఆర్దికాన్ని నియంత్రించేవారు .రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్ లకు బాసులయ్యారు .ఇద్దరు కలిసి స్వంత ప్రయోజనాలకోసం ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు .ఇందిరా గాంధి పాలన లో ఆర్ధికం మీద పట్టు సాధించింది  .బ్యాంకులు జాతీయం చేయ బడ్డాయి .ఆమె ఆహారాన్ని జాతీయీకరణ చేసింది .దీనితో పరిస్తితి పెనం లో నుంచి పొయ్యిలో పడినట్లయింది .తప్పు తెలుసుకొని ‘’బాక్ టు పెవిలియన్’’ చేసి మళ్ళీ పాత విధానానికే పట్టం కట్టింది .ఆర్ధిక కట్టు బాట్లను సడలించింది .’’ఆర్ధిక శిఖరారోహణం ‘’పేరు తో ఆమె నిర్ణయాలు గా పబ్లిక్ యాజమాన్యం అప్పటికే బల పడింది .ఉత్పత్తిలో దాదాపు నలభై అయిదు శాతం ప్రభుత్వ రంగ సంస్థలే సాధించాయి .

సోషలిస్ట్ ల ‘’లైసెన్స్ పర్మిట్ రాజ్ ‘’రాజ్యం అధీనం లో లైసెన్సులు పర్మిట్ల సామ్రాజ్యమై పోయింది . ‘’  ఎంబాసిడర్ కారు ‘’ముతకగా ఉన్నా ఇండియా రోడ్ల మీద ‘’కింగ్ ‘’అయి విజయమైంది .దాని మన్నిక అందరికి నచ్చింది .హిందూ స్తాన్ మోటార్స్ సాధించిన సృష్టీ విజయం ఇది .దానికోసం జనం క్యూలు కట్టారు .సప్ప్లై కంటే డిమాండ్ ఎక్కువైంది .ఇతరదేశీయులు అంబా సిడ ర్ భారతే దేశ వెనక బడ్డ తనానికి చిహ్నం అని భావించి ఈసడించినా  ఇది యదార్ధం ..ఇ ప్రపంచీకరణ తో అనేక మోడల్ కార్లు ఇండియా లో తయారవుతున్నాయి .సూక్ష్మ ఆర్ధిక సంక్షోభం తర్వాత  ఆటో మొబైల్ పరిశ్రమ పది హేడు శాతం అభి వృద్ధి సాధించింది .ఇప్పుడు ఇండియా ‘’గ్లోబల్ ప్లేయర్ ‘’.అయింది .2016కు ఇండియా కార్లు తయారీ సంస్థలలో ప్రపంచం లోనే ఏడవ పెద్ద దేశం అవుతుంది . 34బిలియన్ డాలర్ల నుండి 145 బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ సాధించే దిశగా ఇండియా ప్లాన్ వేసింది .కాని లైసెన్స్ పర్మిట్ రాజ్ లోని లోపాల వలన అది సాధ్యం అవుతుందని పించటం లేదు .

నెహ్రు హయాం లో భారీ పరిశ్రమలకే అగ్ర తాంబూలం .అవి అనుబంధ సంస్థలకు దారి ఏర్పరచాయి .నెహ్రు తర్వాత ‘’హరిత విప్లవం ‘’సాధించింది ఇండియా .రైతులకు అనేక ఇన్సెంటివ్ లనిచ్చి ప్రభుత్వం ఆదుకోన్నది .అధిక రాబడి విత్తనాలను కనీ పెట్టి రైతులకు సబ్సిడీ గా అందించింది క్రిమి సంహారక మందుల్ని ,రసాయనిక ఎరువులను  తక్కువ ధరకు అంద జేసి రైతుకు ప్రోత్సాహాలనిచ్చింది .సాగు నీటిని సమృద్ధిగా అందించింది .దీని ప్రభావం 1970తో పూర్తయింది .ఇందిరా విధానాలను బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ గమనించి ‘’కొంచెం అతివాద ధోరణి ‘’అంది .కాని ‘’తాచరమ్మే’’1981లో జపాన్ ,జెర్మని ఫ్రాన్స్ లు సాధించిన ఆర్ధిక విజయాలను మెచ్చుకోంది.కాని ఈ మూడు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తీ నియంత్రణలో ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించలేక పోయింది .టోనీ బ్లెయిర్ ప్రధాని గా బ్రిటన్ కు ఉన్న కాలం లో తమ సోషలిస్ట్ భావాలను ‘’న్యూ లేబర్ ‘’గా పేరు పెట్టుకొన్నాడు .’’తాచరిసం ‘’ను అత్యున్నత స్తాయికి తీసుకు వెళ్లి నట్లు గొప్పలు చెప్పుకొన్నాడు .

2003లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ‘’ఇరవై వ శతాబ్ది మధ్యలో కేంద్ర ప్లానింగ్ ,సాంఘిక నియంత్రణ అనే దగ్గర మార్గం వల్లనే జాతీయతః బల పడుతుంది .సంక్షేమం ,సౌభాగ్యం సాంఘిక ప్రాణప్రద వ్యవస్థ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల మీదే ఆధారపడి ఉంటాయి .స్వేచ్చ గౌరవాన్నిస్తుంది .మానవ సృజన శక్తికి దోహదం చేస్తుంది .సృజన దేశం ,జాతి యొక్క శక్తిని ,సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది .స్వేచ్చ అనేది మానవునికి భగవంతుడిచ్చిన ప్రణాళిక ,మాత్రమే కాదు ఈ భూమి మీద అభి వృద్ధికి ఆశ కూడా ‘’ అన్నాడు .నోబెల్ ప్రైజ్ విన్నర్ ,ఆర్ధిక వేత్త జోసెఫ్ ష్టిగ్లిచ్ ప్రభుత్వవిధాన నిర్ణయాలపై  పై మార్కెట్ ఎకనామిక్స్ ప్రభావాన్నిఅధ్యయనం చేసి ‘’దిరోరింగ్  నైన్టీస్ ‘’అనే పుస్తకం రాశాడు .అందులో అమెరికా సాధించిన ఆర్ధిక వృద్ధి విశ్లేషించాడు .పూర్తిగా ప్రభుత్వ నిర్బంధం ఉండకుండా నూ, పూర్తిగా లేకుండా ఉండ కుం డాను  ఉండే మధ్యే మార్గమే కారణం అన్నాడు .దీనినే ‘’విజన్ ‘’అన్నాడు .ఇది బిల్ క్లింటన్ అన్న ‘’ది ఎకానమీ స్టుపిడ్ ‘’కాదు .అన్నిటికీ మధ్యే మార్గం .

1980లో ఇండియా తన మార్గాన్ని మార్చుకొంది.సోషలిస్ట్ సంకెళ్ళను చేదించింది .అమ్మో కొంప మునిగి పోతుందని గుండెలు బాదుకొన్నారు సోషలిస్ట్ లు కమ్మీలూ .బీదలకు వ్యతిరేకం అన్నారు .రాజకీయ నాయకులు తమ అధికారాలను కోల్పోవటానికి ఇష్టపడలేదు .ప్రభుత్వ అధీనం లో ఉన్న ఆర్ధికం తో వారంతా పండగ చేసుకొని బాగు పడ్డ వాళ్ళేకదా .అందుకే వద్దని వాదించారు .

సశేషం

ఆధారం –శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు చదవమని పంపిన పుస్తకం – India;s un ending journey –by Mark Tully

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం .ప్ర.జ .-2

డిం .టిం .ప్ర.జ .-2

డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే?

టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ?

డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ?

టిం –కిరణ్ కుమార్ రెడ్డి గురించేగా ?ఆ చెప్పులాయన కు వేసవిలో అవే గతి అయ్యాయి .కాని సైజు ఇబ్బందిగా ఉందట .ఏ పార్టీకి వెళ్ళినా సైజు చాలదు పోమ్మంటున్నారట .చివరికి మోడీ సైజు నచ్చి అచ్చి రావచ్చని కాషాయ గుడారం  చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు మీడియా కధనం .

డిం –సరే కానీ –సుప్రీం కోర్టులో విభజన పై కేసు వేశారు కదా ఏమైంది స్వామీ ?

టిం –వేయటం మాత్రం ఆర్భాటంగా అందరూ అధికారం లో ఉండగా వేశారు .అక్కడ వాదించాలంటే రోజుకు లక్షల్లో పని .ఇప్పుడెవరు ఆ డబ్బు పెట్టె స్తోమత గల వారున్నారు? అయిపోయిన పెళ్ళికి బాజాలెవరు వాయిస్తారు ?చేతి చమురు భాగోతం .

డిం –ఉండవల్లి అక్కడ లాయర్ గా నమోదు చేసుకోన్నాడుగా ?

టిం –నిజమే .ఆయనకూ చేతిలో ఏదైనా పెడితేకాని నోరు విప్పడేమో ?లగడపాటి కాడి పారేశాడు .శైలజా నాద్ పే రుకు తగ్గట్లుశివుడి విభూతి పూసుకొని కాన్గీల్లో కలిసిపోయాడు .చేతిలో బూడిదే తప్ప కాసులు రాలవుకదా. అందులోనూ ఆంధ్రాలో ఒక్క సీటూ’’ చేతికి ,చెప్పుకీ’’ రానే లేదాయే .’’చేతికి చెప్పు ‘’తోడుక్కున్నట్లయిన్దాయే .అయినా కేసు అంటే వాయిదాల పర్వం అవన్నీ గడిచి కొలిక్కి వచ్చే దెన్నడో ?

డిం –జగనన్న ఏమీ సాయం చేయలేడా?

టిం –ఎందుకు చేయలేడుద? సంపాదించిన దాంట్లో ఒక వంద కోట్లు వదిలేసి కోర్టులలో వాదనల కోసం ఖర్చు పెడితే కేసు త్వరలో నిర్ణయం ప్రకటించటానికి దారి దొరకచ్చు.పాపం ఆయన కేసులకే ఖర్చు చేస్తాడా ఎన్నికలకే పెడతాడా సభ్యులు జారి పోకుండా  మళ్లేయ్యటానికి ఖర్చు చేస్తాడా,  ఈ కేసు సంగతే చూస్తాడా ?అయ్యే పనికాదని పిస్తోంది .

డిం –ముఖ్య మంత్రిగా బాబు ప్రమాణం చేయటానికి అన్ని రోజులేందుకుఆగటం  గురూ?

టిం –వయసు మీద పడిన కొద్దీ చాదస్తాలు పెరుగుతాయి .ఒకాయన పెట్టిన ముహూర్తం ఇంకో ఆయనకు నచ్చలేదు .చివరికి చీపురుపల్లి సిద్ధాంతి ముహూర్తమే ఖాయం చేసి చెక్కులు, కౌంటర్ చేక్కులూ చేసి ఖాయం చేసుకొన్నాడు .దీనితో రాష్ట్రం లో పాలన ఆరు రోజులు వెనక్కి వెళ్ళింది .

డిం –ఈ మధ్య ఆయనెవరో బాబా దగ్గరికి వెళ్దామని బయక్దేరాడట బాబు ?

టిం –నిజమే నని చానెళ్ళు పత్రికలూ కోళ్లు కూసి నట్లు కూశాయి . విషయం లీకై,,షాకై విరమించుకొన్నాడు  .

డిం – ముఖ్య మంత్రి తో బాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మళ్ళీ ముహూర్తాలు చూసుకొని గద్దె నేక్కారు?

టిం –అదే అతి చాదస్తం అంటే .ప్రమాణ స్వీకారం చేసిన నాడే మంత్రి అయిపోతే  మళ్ళీ సీటులో కూర్చోవటానికి మంచీ చెడూ కొబ్బరికాయలు పూజలు పురోహితులు ఎందుకు ?ప్రజాస్వామ్యాన్ని ఆవ హేళన చేయ రాదు .ఈ చాదస్తాలు తగ్గించుకొని అసలైన ప్రజా సేవలో నిమగ్నమవ్వాలి కాని మంచి పేరిట కాలయాపన చేసి ప్రజా పరిపాలనకు దూరం కావటం మంచి పద్ధతికాదు .

డిం –యెర్ర చందనం స్మగ్గ్లింగ్  జోరైంది గురూ

టిం –పిల్లి గుడ్డి దైతే ఎలుక ఏదో చేసిందని సామెత .ప్రభుత్వం గట్టి నిఘా పెడితే ఎవరూ తప్పించుకోలేరు శిష్యా .అది చేసే దమ్ము ఉన్న ప్రభుత్వాలు తక్కువే అందులో ఇప్పుడు ‘’ట్రాన్సిటరి ‘’పీరియడ్ .పూర్తీ పగ్గాలు కొత్త ప్రభుత్వం  చేబట్టాక ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాం .లేక పోతే’ దొందూ దొందే’’ అనుకొందాం .

డిం –తమకు ఒక ప్రత్యెక చానల్ లేక పోవటం వలననే దారుణం గా ఓడి పోయామని ఆంధ్రా, తెలంగాణా కాన్గీలు నెత్తి  నోరూ బాదుకొంటున్నారు ?

టిం –ఏడిసి నట్లుంది .ఆడ లేక మద్దెల వోడుఅన్నట్లుంది రా .10 చానల్ ,99చానల్  పెట్టి కమ్యూనిస్టులు ఏం పొడి చేశార్రా?తొంభై తొమ్మిది కాదుకదా ,కనీసం పది సీట్లు కూడా సాధించలేదు .కేవలం నాలుగింటితో సరిపుచ్చుకొన్నారు .రోజూ వారి తరఫున’’ వాయించ’’టానికి ఆ చానల్స్ లో’’ తెలక పల్లి రవి ‘’గారు తెగ కష్టపడ్డాడు .ఆర్ ఎస్ ఎస్ ను, బి జే పి ని  మోడీ ని తెగ దుమ్మెత్తి పోశాడు .ఏమైనా—కదిలించగలిగారా? చానల్ పెట్టిన మాత్రాన ఓట్లు కురవ బాబూ !కస్టపడి పని చెయ్యాలి.ప్రజా హృదయం గ్రహించాలి. కాలం తో కలిసి ప్రయాణించాలి .ఉస్ట్ర పక్షి విధానం ,చౌకబారు విమర్శలు ,అధిష్టానానికి అంటకాగడాలు అధినేత్రికి స్తోత్రపాఠాలు  ,తెలుగు తెలియన జేజమ్మలను ఇంచార్జి లుగా నియమించటాలు ,వారి అడుగులకు మడుగు లొత్తటాలు,ప్రజల్లోకి వెళ్ళ లేక పోవటాలు,ఇవన్నీ వారి కొంప ముంచితే చానళ్ళు లేవని ఏడిస్తే ఏం ప్రయోజనం శిష్యా ‘మనదగ్గర ‘’చాలెంజి’’ లేదని తెలుసుకోవాలిగానీ .

డిం – ఇక వెళ్ళొస్తా గుర్రూ

టిం –సర్రే శిష్యా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6

ఉపాఖ్యానాల్లో కధలు -2

’కాల కంజుల యాగం

తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు మారు వేషం లో వెళ్లి వారిలో ఒకడుగా ఉండి ‘’చిత్ర’’అనే పేరుగల ఇటుకను ఉంచాడు .యాగం పూర్తయింది స్వర్గానికి ఆ ఇటుకల మీదుగా కాల కంజ రాక్షసులు నడిచి వెడుతున్నారు .ఇంద్రుడు తాను పేర్చిన’’ చిత్రేస్టక ‘’ను తీసేశాడు .చితి కూలి పోవటం తో రాక్షసులు నేల మీద పడిపోయి సాలీడు మొదలైన క్రిమి కీటకాలై పోయారు .అందుకే సాలీళ్ళు పూర్తిగా నేల మీద ఉండక ,ఆకాశం లో ఎగరలేక మధ్యలో గూళ్ళు నిర్మించుకొని ఉంటాయి .ఈ ఉపాఖ్యానం లో ధర్మ రక్షణ ,ఆత్మ రక్షణ రెండూ కానీ పిస్తాయి .శత్రువును మాయోపాయం తో జయించ వచ్చుననే సందేశం ఉంది .కనుక చిత్రా నక్షత్రం లో ‘’ఇష్టకాచాయనం ‘’చేసే వాడి శత్రువులు నశిస్తారనే అంతరార్ధం ఇందులో ఉంది .

బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు

సురాసురులకు ఒకప్పుడు ఘోర సంగ్రామమే జరిగింది .సురులు తాము అసురుల చేతిలో ఓడిపోతామేమో నన్న భయం తో సమస్త వస్తు సామగ్రిని,ధనాన్ని  ‘’అగ్ని షోములు  ‘’(అగ్ని సోముడు )ల  వద్ద  దాచి యుద్ధానికి తరలి వెళ్ళారు .ఈ ధనాన్ని చూసి కళ్ళు కుట్టి  ఆ ఇద్దరూ ఆ దనం తో జీవితాంతం హాయిగా బతక వచ్చునని, దేవతలు జయించలేరని నమ్మకం తో దేవతలు తమ  దగ్గర దాచిన దాన్ని అంతా తీసుకొని ఉదాయిన్చేశారు . .దేవతలే యుద్ధం లో రాక్షసులని జయించారు .అగ్నిని వెతికి పట్టుకొని కొంత ప్రతిఫలం ముట్ట చెప్పి సామ దాన  ఉపాయాలతో తమ సంపదను రాబట్టుకొన్నారు .అలాగే సోముడిని కూడా పట్టుకొని కొట్టి ,దండోపాయం తో ధనాన్ని స్వాధీనం చేసుకొన్నారు .తర్వాతాఆ ధనమే ఇంద్రుడు వాయువు మొదలైన గ్రహాలుగా మారటం వలన యాగం లో యజమానుడు ఈ గ్రహాలను తప్పని సరిగా ఉంచి యాగం చేయాలని తైత్తిరీయం చెబుతోంది .

సృష్టికి ఆది

సృష్టిని గూర్చి ఉన్న ఉపాఖ్యానం లో ఈ జగత్తు లో మొదట అరణ్యాలు ,పర్వతాలు ఉండేవికావు .అంతా జలమయమే .ప్రజాపతికి సృష్టి చేయాలని సంకల్పం రాగానే ఆ జలం పై ఆయనకు ‘’పద్మ లత’’కనిపించింది .వెంటనే వరాహ రూపం దాల్చి ఆ లతకు దగ్గర నీటిలో మునిగి మట్టిని పైకి తెచ్చి భూమిని ,మిగిలిన సృస్తినీ పూర్తీ చేశాడు .

అనుభ విన్చిందే మనది

ప్రజాపతి ప్రజా సృష్టి చేయాలనే కోరిక తో తపస్సు చేశాడు .ఆయనకు బంగారం కనీ పించింది .అది తన కోర్కె తీరుస్తుందని భావించి అగ్నిలో హోమం చేశాడు .జరగలేదు .మళ్ళీ చేశాడు లాభం లేదు .తర్వాత ఆ బంగారాన్ని తన కడుపులో ఉన వైశ్వానరాగ్నికకి ఆహుతిగా మింగేశాడు .వెంటనే ఆయనకు ప్రజోత్పాదన శక్తి వచ్చేసింది .అందుకే లోకం లో  ‘’దాచి పెట్టిన దానికంటే ఉపయొగిన్చిన్దెఉత్తమమైన్ది ‘’ అనే సామెత దీనివల్లనే వచ్చింది .సువర్ణ భస్మం సంతాన ప్రాప్తి కల్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది .

అంతం లేని వేదాలు

వేదాలు అనంతాలు అని చెప్పే ఉపాఖ్యానం కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .భరద్వాజ మహర్షి తన జీవిత కాలమంతా తపస్సులోనే గడిపి ,ఇంకా చాలా నేర్వాల్సింది ఉందని గ్రహించాడు .ఇంద్రుడిని ప్రార్ధించి మరొక జీవితకాలాన్ని వరం గా పొంది మళ్ళీ నేర్వటం మొదలు పెట్టినా ఇంకా నేర్వాల్సిన వేదాలు మిగిలే ఉన్నాయి .మరోజీవితకాలమూ చాల లేదు .300సంవత్సరాలు వేదాధ్యయనం చేసి అలసిపోయి వృద్ధుడై పోయి పడిఉన్న మహర్షి దగ్గరకు ఇంద్రుడు వచ్చి మూడు పెద్ద పర్వతాలను చూపించి అవే వేదాలని చెప్పి ఆ మూడింటిలో నుంచి మూడు గుప్పెళ్ళ ధూళి తీసి ఇచ్చి అంతటి తో సంతృప్తి పడమన్నాడు .అందులోని ఒక్కొక్క రేణువు ఒక్కొక్క వేదం శాఖ అని ఎరుక కలిగించాడు అందుకే ‘’అనంతావై వేదాః ‘’అన్నారు .

మోదుగ చెట్టు పుట్టుక

భూమి పైన మూడవ లోకం లో ఉండే సోమాన్ని గాయత్రీ దేవి బలాత్కారం గా తీసుకొని వెళ్ళింది .అప్పుడు సోమాన్ని రక్షించే వారికి ఆమెకు యుద్ధం జరిగింది .ఆ యుద్ధం లో సోమలతః కు చెందిన యొక ఆకు ఒకటి నేల మీద పడింది .దాని నుండి పలాశ లేక మోదుగ చెట్టు పుట్టింది .అలాగే దర్భ ,మర్రి ,మెది జమ్మి ,వికంకత మొదలైన వృక్షాల పుట్టుక కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .

దీని తర్వాతా శత పద బ్రాహ్మనం లో ఉన్న ఉపాఖ్యానలలోని కధలను తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

  • – హెబ్బార్ నాగేశ్వరరావు

ఇప్పుడు స్వజాతీయత గురించి ఎవ్వరూ పట్టించుకొనడం లేదు. అన్నింటికీ అంతర్జాతీయ ‘ఉపమానాలు’ మాత్రమే నడిచిపోతున్నాయి. అంతకంటే పై స్థాయి ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ, ‘సూపర్’ ‘డూపర్’ ‘మెగా’ ‘దగా’ వంటి పదాలను వాడేసి, అంతర్జాతీయ స్థాయికంటే ‘విస్తృతమైన’ ‘ఉన్నతమైన’ది ఇంకా ఏదో ఉందన్న భ్రమను కల్పించడానికి ఊదర గొట్టేస్తున్నారు… బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి పదజాలం సృష్టిస్తున్న సహజమైన అనుభూతిని ‘అంతర్జాతీయ’ కృత్రిమ అనుబంధం ఆలింగనం చేసుకుంటున్న క్షణాలు ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి!! ‘సశక్త భార త్’ను ‘సమృద్ధ భారత్’ను ‘స్వావలంబక స్వర్ణ భారత్’ను నిర్మించడానికి నడుములు బిగించిన వారు సైతం ప్రత్యేక ఆర్థిక మండలాలు- సెజ్‌ల-ను రద్దు చేశామని చెప్పడం లేదు… విదేశీయ సంస్థల ప్రత్యక్ష నిధుల – ఎఫ్‌డిఐ – అవసరం లేకుండా స్వదేశీయ నిధులలోనే ‘సశక్త భారత్’ను నిర్మించడం గురించి ప్రచారం చేయడం లేదు. రైల్వేలలో ‘విదేశీయ నిధుల’ను ‘విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని’ అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ప్రభుత్వ సంస్థల వాటాలను భారీగా అమ్మేస్తారట… స్వదేశీయ సంస్థలకు మాత్రమే అమ్ముతామన్న ‘స్వావలంబక’ సిద్ధాంతం మాత్రం ఈ అమ్మకాలను నిర్వహించదలచిన ప్రభుత్వ నిర్వాహకులకు గుర్తు రావడం లేదు!! ‘‘వాల్‌మార్ట్ వంటి అమెరికా సంస్థను మన దేశంలో చిల్లర దుకాణాలను తెరవనివ్వం…’’ అని ఎన్నికలకు పూర్వం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుషమా స్వరాజ్ కఠోర ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు విదేశ వ్యవహారాల అమాత్య పదవిని నిర్వహిస్తున్న ఈ నాయకురాలికి ఆ సంగతి గుర్తుందా?? ‘వాల్‌మార్ట్’ను వెళ్లగొట్టినట్టు ఆధికారిక ప్రకటన ఏదీ వెలువడినట్టు లేదు…
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేసినట్టు క్రీస్తుశకం 2004 నాటి ఎన్నికల పరాజయానికి పూర్వమే ‘్ఢమఢమఢమ’ అని ‘డప్పు’ మారుమోగిపోయింది! 2004 శాసనసభ ఎన్నికల నాటికే మన భాగ్యనగరం ‘మోడల్ సిటీ’! కనీసం అప్పటి ముఖ్యమంత్రి, వారి వందిమాగధ బృందమైనా గుర్తించిన మహా విషయమిది… పారిశుద్ధ్యపు గొట్టాలు పగిలిపోయినచోట, మురికినీటి గుబాళింపు ముక్కుల పుటాలను మత్తెక్కించినచోట, ‘మధుర’ గీతాలను వినిపించిన ‘మశక’ మహాశయలు ఈ సంగతిని గుర్తించి ఉండకపోవచ్చు! ఆ ‘మశక’ సమూహాల దాడికి విలవిలలాడి రుధిరగీతాలను ఆలపించిన మధ్యతరగతి జనం సైతం ఆ ‘ఆదర్శ నగరాన్ని’ లేదా ‘నమూనా నగరాన్ని’ గుర్తించి ఉండకపోవచ్చు!! అంతర్జాతీయ స్థాయిలో ‘దోమలు’, ఇతర లోకాలకు చెందిన ‘వైతరణి’ స్థాయిలో మురికికాలువలు విస్తరించడం కూడా అంతర్జాతీయ స్థాయి హైదరాబాదు నమూనా నరకానికి నిదర్శనం…. పదేళ్లు గడిచిపోయాయి! ఒక రాష్ట్రం స్థానంలో రెండు రాష్ట్రాలు వెలసి ఉన్నాయి. అందువల్ల అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం అనివార్యమైంది! ‘హైదరాబాదు’నకు దీటుగా కొత్త రాజధానిని నిర్మించగలమని అవశేషాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం బాగుంది! ఎందుకంటే హైదరాబాద్‌ను ‘నమూనా నగరం’గా తీర్చిన ‘ఘనత’ పదేళ్లకు పూర్వమే ఆయన గరిమలో భాగం. కాని అంతటితో ఆయనకు తృప్తికలగడం లేదు!! ‘‘సింగపూర్ స్థాయి’’లో నూతన రాజధానిని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు! ఆదర్శప్రాయమైన నగరాలు తెలుగు నేలపై ఎక్కడ కూడా ఆయనకు కనిపించలేదు. ‘‘తెలుగువారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం’’ అని అంటే ఇదేనేమోమరి! భారత జాతీయ భౌగోళిక సీమల పరిధిలో సైతం చంద్రబాబునాయుడికి నూతన రాజధానికి స్ఫూర్తినివ్వగల సుందర నగరం కాని పట్టణం కాని కనిపించక పోవడం వర్తమాన చరిత్ర! అందువల్ల ఆయన ‘సంకుచిత’ జాతీయతా దృష్టిని విదిల్చుకొని అంతర్జాతీయ అనే్వషణను సాగించాడు! సింగపూర్ సాక్షాత్కరించింది… అందంగా కనిపించింది! ‘సింగపూర్’ను చూడని సామాన్య జనాలకు భాగ్యనగరాన్ని చూసిన మధ్య తరగతి వారు వివరిస్తున్నారట! ‘‘అయితే దోమలు, మురికికాలువలు ఉండవా?’’ అన్నది విన్న వారి సందేహం… ఈ ‘మామూలు’ నాసిరకం దోమలుండవు. అంతర్జాతీయ స్థాయి ‘జిఎం’ – జన్యుసంకరమైన – మహా ‘మశకాలు’ దిగుమతి అయిపోతాయి…’’ అన్నది సందేహ నివృత్తి! ప్రతి దానికి ముందు ‘‘అంతర్జాతీయ’’ పదాన్ని తగిలించందే మనకు గుర్తింపు ఉండబోదన్న ఊహ రాజకీయ మేధావులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతర్జాతీయ రసాయనాలు, అంతర్జాతీయ వ్యాధులు…!
అక్కడ ఆయనకు సింగపూర్ నగర రాజ్య – సిటిస్టేట్ – శోభ స్ఫురిస్తే ఇక్కడ ఈయనకు న్యూయార్క్ బృహత్ నగర పటిమ ప్రస్ఫుటించింది! హైదరాబాద్ మహానగర పోలీసు వ్యవస్థను ‘న్యూయార్క్’ తరహా పోలీసు వ్యవస్థ తరహాలో తీర్చిదిద్దనున్నదట తెలంగాణ ప్రభుత్వం! వెంటనే మన రచయితలు రంగంలోకి దిగిపోయి ‘ఇంటర్ నెట్’ నుంచి సరకు దించేసి – డైవ్ లోడింగ్ – న్యూయార్క్ సిటీ పోలీసు డిపార్ట్‌మెంట్ – ఘనతను చరిత్రను పటిమను వ్యూహరచనా నైపుణ్యాన్ని, కుక్కల బృందాన్ని గురించి కథనాలను దృశ్యమాధ్యమ అక్షరమాధ్యమ వీక్షకులకు పాఠకులకు వివరించి తన్మయత్వానికి గురి చేస్తున్నారు. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేయడం తమ లక్ష్యమని మన రాజకీయ వేత్తలు చెప్పుకొస్తున్నారు! మన దేశం నుండి ఇతరులు స్ఫూర్తిని పొందినప్పుడు మనకు ‘సగర్వమైన తల ఎత్తుకునే స్థితి’ సంభవించవచ్చు! కానీ అరవై ఆరేళ్ల స్వతంత్రం తరువాత కూడా ‘న్యూయార్క్’ ను చూస్తే కాని హైదరాబాదు పోలీసులకు పని చేయడం రాదన్న ‘కీర్తి’ మనదేశాన్ని తల ఎత్తుకునేలా చేస్తుం దా?? నాలుగు వందల ఏళ్ల చరిత్ర అమెరికా దేశానిది… భారతదేశానికి నాలుగు యుగాల చరిత్ర ఉంది, వెయ్యి మహాయుగాల చరిత్ర ఉంది! సింగపూర్ ఎలా ఉందో? న్యూయార్క్ ఎలా ఉందో? అక్కడ పోలీసులు సగటు ఎత్తు ఎంతో కనిపెట్టగల ‘మేధావులు’ మన దేశంలో ప్రపంచానికి ‘నమూ నా’లుగా పనికొచ్చే మహా విషయాలను మాత్రం కనిపెట్టరు. ఎవరైనా కనిపెడితే సహించలేరు, కనిపెట్టిన వారిని మూఢ విశ్వాసాలకు, ప్రగతి నిరోధక విధానాలకు ప్రతినిధులుగా చిత్రీకరిస్తారు! ఎప్పటికీ మనం ఇతర దేశాలను చూసి అనుసరించే ‘జాతి’గానే మిగిలిపోవాలన్నది ఈ మేధావుల లక్ష్యం! ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు దేశమంతటా ‘న్యూయార్క్’ పోలీసుల బొమ్మలను చూసి జనం మురిసిపోతున్నారట! పాపం హైదరాబాద్ పోలీసులు…!
పోలీసు వ్యవస్థను మార్చడమంటే పనితీరు, సామర్థ్యం, పటిష్టమైన వ్యూహాలు, నేరనిరోధక పద్ధతులు, నేర పరిశోధక విధానాలు మెరుగుపడడమని సామాన్యజనాలకు సైతం తెలుసు! కానీ ఇవేవీ కాదట! మన పోలీసులు ‘బట్టలు’ మార్చుకుంటే చాలు… సర్వం మారిపోతుందట! ఇంతవరకు హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు ధరిస్తున్న ‘గణవేషం’ పనికిరాదట! ఐక్యరాజ్య సమితి దళాల తరహాలోని గణవేషం – యూనిఫారమ్ – మన పోలీసులు ధరించాలట! చీకటి నీలం – డార్క్ బ్లూ – రంగు ట్రౌజర్లు, ఆకాశపు నీలం – స్కైబ్లూ – రంగు షర్టులు హైదరాబాద్ పోలీసులు తక్షణం ధరించడం ఆరంభం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారట! పోలీసులలో కర్తవ్యనిష్టను, నైతిక నిష్టను, బౌద్ధిక శారీరక పటిమను పెంచడం ద్వారా వారి స్వభావంలో గుణాత్మక ప్రగతిని కలిగించడానికి ప్రయత్నాలు జరుగవలసిన సమయంలో బట్టల రంగును మాత్రం మార్చి వేస్తే ఏమి సాధించగలరు?? ఇప్పుడున్న ‘యూనిఫారమ్’ ఈ కర్తవ్యనిష్ఠకు, నైతిక నిష్ఠకు, పనితీరునకు పటిమకు అవరోధంగా మారిందా?? న్యూయార్క్‌పట్ల, సింగపూర్‌పట్ల, జిబ్రాల్టర్ శిలపట్ల టింబక్టూ నగరంపట్ల గౌరవం ఘటించే విధంగా జనాన్ని తీర్చిదిద్దడంవల్ల ఈ కర్తవ్య నిష్ఠకాని, నైతిక పటిమ కాని పెరగవు…
బ్రాండ్ హైదరాబాద్‌కాని గ్రాండ్ హైదరాబాద్ కాని పోలీసుల బట్టలను వాటి రంగును మార్చినంత మాత్రాన ఏర్పడదు! ఆవును, అడవినీ రక్షించడంవల్ల మాత్రమే భవ్యమైన భాగ్యనగరం మాత్రమే కాదు దివ్యమైన భారతదేశం కూడా అవతరించగలదు! నూతన రాజధానిని నిర్మించడానికి పూనుకుంటుంటున్న నీ పెద్దలు నైతం గుర్తించవలసిన అంశమిది! ఆవులున్న చోట అడవులున్నచోట ఆరోగ్యం వెల్లివిరుస్తుంది, అమరిన ప్రగతి పరిమళిస్తుంది. రెండువందల ‘జాతు’ల దేశవాళీ ఆవులలో ఇప్పుడు భారతదేశంలో మొత్తం మీద ఇరవై తొమ్మిది ‘జాతు’ల అవులు మాత్రమే మిగిలి ఉన్నాయట!
అందువల్ల ‘బిటి’ పత్తి, ఎండోసల్ఫాన్, చైనీస్ సిజ్లర్, కెంచుకీ చికెన్ – అమెరికాలోని ‘కెంటుకీ’ రాష్ట్రంలోని కోడిమాంసమట – వంటి ‘నత్తల’ గురించి తెలిసినవారికి ఆవులు, అడవుల వంటి ‘వౌక్తిక మణుల’ సంగతి కూడా తెలుసుకోవడం ఇప్పుడైనా అనివార్యం! భారతీయ ప్రాచీన రాజధాని నగరాలు ‘నిలువున’ పెరగలేదు, అడ్డంగా విస్తరించాయి. ముంబయి ‘కంపాకోలా’ ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన ఇరవై ఆరు అంతస్థులను కూల్చివేయమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. నిలువునా అంతస్థుల భవనాలు నిర్మించడం కొత్త రాజధాని శోభనీయదు! హంపీ విజయనగరం ఏడు ప్రాకారాలుగా విస్తరించి ఉండేదట! కాకతీయుల రాజధాని ఓరుగల్లు కూడా ఏడు ప్రాకారాలుగానే విస్తరించి ఉండేది! ఈ ప్రాకారాలలో కొన్నింటిలో పొలాలు, కొన్నింటిలో ఆవులు అడవులు (వనాలు) కూడా ఉండేవి!! శాతవహన రాజదాని ధాన్యకటకం – అమరావతి – కూడా ఇలా అడ్డంగానే విస్తరించి ఉండేది! ‘నిలువున’ అంతస్థుల భవనాలు పెరగడంవల్ల కాలుష్యం కేంద్రీకృతమైపోతుంది. అడ్డంగా విస్తరించడంవల్ల అమరిక, స్వచ్ఛమైన పరిసరాలు నెలకొంటాయి! న్యూయార్క్, సింగపూర్ వంటిని నిలువున పెరిగిన నగరాలు! అమరావతి, హంపీ, ఓరుగల్లు – ఏకశిలానగరం – వంటి మన ప్రాచీన నగరాల నమూనాలను అనే్వషించండి!!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

  • -బి.వి.ప్రసాద్

‘గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని ఆనాడే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అంత నమ్మకం ఉన్నా నేడు గంగానదికి వచ్చేవారంతా అందులో గంగమ్మను చూసి ఉలిక్కి పడుతున్నారు. విదేశీయులు అయితే చెప్పనక్కర్లేదు సిగ్గు, జాలి పడుతుండగా భారతీయులు సైతం గంగానదిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పాపాలు పోవడం దేవుడెరుగు, ఆ అపరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు, రోగాలు ప్రబలుతాయోనని భయపడుతున్నారు. హిమాలయాల్లోని గంగోత్రి నుండి బంగ్లాదేశ్ లోని సుందర్‌బన్ డెల్టా వరకూ 2,500 కిలోమీటర్లు దూరంపైగా ప్రవహించే గంగానది ప్రతి రోజు అనేక రకాలుగా కోట్లాది మందికి ఉపయోగపడుతోంది. భారతదేశ ప్రక్షాళన- గంగానది ప్రక్షాళనతో వారణాసి నుండి మొదలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడంతో ప్రపంచం అంతా తాజాగా మరో మారు గంగానది ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటోంది. ‘భరత్‌ను ప్రక్షాళన చేద్దాం దానికి వారణాసి నుండి నాంది పలుకుదాం’ ఈ వ్యక్తి వ్యర్థపదార్థాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రజలు అంతా ఆలోచిస్తారు, కాని అదే భారత్‌ను మారుస్తుంది అని పరమ పావన గంగానదికి హారతి ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడం భారతదేశ మాతకు సేవ చేసిన దానితో సమానం , చిన్న చిన్న ప్రయత్నాలే లక్ష్యాలను సాధిస్తాయి అని కూడా నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ ప్రయత్నం ఈనాటిది కాదు. కాలుష్యం కోరల్లో చిక్కున్న గంగానదిని 2020 నాటికి ప్రక్షాళన చేస్తామని ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ కూడా చెప్పారు. యుపిఎ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని, మరో తొమ్మిదేళ్ల నాటికి శుద్ధి చేయని నీరు గానీ, పారిశ్రామిక కాలుష్యాలు కానీ గంగానదిలో చేరే అవకాశాలు ఉండవని గంగశుద్ధి కార్యక్రమం ద్వారా 2020 నాటికి ప్రక్షాళన చేయని నగర పాలక సంస్థ నీరు గంగానదిలో చేరే అవకాశం ఉండదని కూడా మన్మోహన్‌సింగ్ 2010లో చెప్పారు. ఆ మాటలు చెప్పి అపుడే నాలుగేళ్లు గడిచిపోయింది. తర్వాత ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది. వస్తూ వస్తూనే గంగానది శుద్ధిపై గంభీరమైన హామీలను ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ప్రపంచ నాగరికతలు అన్నీ నదీ తీరాల్లో పురుడుపోసుకున్నవే. జీవజాలం, మనిషి ఉనికి- విస్తృతి- అభివృద్ధి అన్నీ నీటిమీద ఆధారపడినవే. ఎడారిలో గొంతు తడారిపోతున్నా జీవికి కావల్సింది నీటి చుక్కే తప్ప సంపదలు కావు. నీటిని నీలి బంగారమని ఊరికే అనలేదు, వాస్తవ బంగారం కంటే ఇది చాలా అమూల్యమైనది కనుకనే అలా అంటారు. ప్రాణావసరమైన ఈ నీరు నేడు విషతుల్యమై ప్రాణాంతకంగా మారింది. భారతదేశం నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో, నదులు మన దేశ ఆర్ధిక సాంస్కృతిక స్రవంతిలో భాగమైపోయాయి. నదులు అన్నీ మానవుని మనుగడకు మూలాధారాలే. నాగరికతకు పుట్టినిళ్లు నదులు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రధాన నగరాల నాగరికతకు కారణం అవి నదుల తీరాన వెలసినవి కావడమే, సింథునాగరికత సింథు నది తీరాన వెలసింది. మానవ అవసరాలకు, రవాణాకు, విద్యుత్ ఉత్పత్తికి, చేపల పెంపకానికి, ఇలా అనేక విధాలా ఉపయోగంలో ఉన్నవే. సాధారణంగా నదులన్నీ భూభాగంపై ప్రవహిస్తుంటాయి. భారతదేశంలో ప్రవహించే నదులు ప్రధానంగా హిమాలయాల్లో పుట్టినవి, దక్కను నదులు. వర్షపు నీటివల్ల లేదా ఎత్తయిన పర్వతాల్లో మంచు కరిగి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణిస్తాం. సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాల్లో అంతవౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికాలోని ఎడారుల్లోనూ, సౌదీ అరేబియా ఎడారుల్లో ఇలా భూమిలో ఇంకిపోయే నదులు ఎన్నో ఉన్నాయి. ఇవి వర్షం పడేటపుడు మాత్రమే పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండిపోతాయి. మన వైపు ఉండే దొంగ ఏర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేలలోకి ఇంకిపోగా మిగిలిన నీరే జీవనదుల్లో ప్రవహించేది , ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపురాయి ఉంటే ఎక్కువ నీరు ఇంకే అవకాశం ఉంటుంది. కాని నల్లసున్నపు రాయి అంటే గ్రానైట్ ఉంటే అంతగా నీరు ఇంకదు. హిమాలయాల్లో పుట్టిన నదులు ఎండాకాలంలో సైతం నీటితో ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి సింధూనది, గంగానది, బ్రహ్మపుత్ర నది. సింధునది హిమాలయాల్లో కైలాస పర్వతసానువుల్లో పుట్టి ప్రవహిస్తోంది. మార్గాంతరంలో జీలం, చీనాబ్, రావి, బీయాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులను తనలో కలుపుకుని పాకిస్థాన్‌లోని అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదికి ఉన్న ఉపనదుల వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. ఇక బ్రహ్మపుత్రనది చూసుకుంటే ఇది హిమాలయాల్లోని మానస సరోవరంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది అత్యంత పొడవైన నది, భారత్‌లో ఇది 885 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక గంగానదికి వస్తే భారతదేశంలో ఇది అత్యంత ప్రధానమైనది, పవిత్రమైనది కూడా . ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయాల్లోని గంగోత్రి అనే హిమనీనదంలో భాగీరధి నది ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకానంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగానది అంటారు. కొంత దూరం ప్రవహించాక హరిద్వారం వద్ద మైదానమార్గంలోకి వస్తుంది. జన్మస్థలంలో దీని ఎత్తు 7756 మీటర్లు. భారతదేశ ఆర్ధికవ్యవస్థ చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాధాన్యత చాలాముఖ్యమైనది. గంగమ్మతల్లి, పావన గంగ, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. గంగానది మొత్తం పొడవు 2510 కిలోమీటర్లు, గంగా నది దాని ఉపనది యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తాయి. సారవంతమైన ఈ గంగా యమునా మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. ఈ గంగానది తీరాన ఎన్నో పుణ్య క్షేత్రాలు వెలిశాయి. ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉన్న ఉపనదుల్లో ముఖ్యమైనవి యమున, కోసి, చంబల్, బెత్వా, సోన్, దామోదర్ ముఖ్యమైనవి. అలహాబాద్ తర్వాత ఎన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హుగ్లీ నది ప్రారంభం అవుతుంది. విశాలమైన గంగా హుగ్లీ డెల్టా అక్కడితో మొదలవుతుంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తర్వాత పద్మ నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో కలిసిన తర్వాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తర్వాత మేఘనా నది కూడా దీంతో కలుస్తుంది. ఇంత పవిత్రమైన గంగానది నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా 445 నదుల నుండి సేకరించిన నీటినమూనాలను సాకల్యంగా విశే్లషించిన కేంద్ర కాలుష్య నియంత్రణా సంస్థ ఇటీవల ప్రకటించిన అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. వాటి ప్రకారం సగానికి పైగా నదుల్లో నీరు మనిషి నేరుగా తాగడానికి పనికిరావు. చాలా చోట్ల నదుల జలాలు స్నానానికి సైతం పనికిరానంత మురికిగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని నివాస గృహాల నుండి దాదాపు 40వేల మిలియన్ లీటర్లు మురికి నీరు నదుల్లోకి చేరుతోంది. 2050 నాటికి అది లక్ష మిలియన్ లీటర్లు స్థాయికి చేరుకుంటుందని మరో అంచనా. అపుడిక నదుల్ని రక్షించడం ఎవరి తరం కాదు, ఆ గరళకంఠుడు భువికి దిగాల్సిందే. దేశంలో జనాభాతో పాటు వనరుల వినియోగం పెరిగిపోతోంది. నీటి లాంటి సహజ సంపదలపై వత్తిడి కూడా ఎక్కువవుతోంది. పెరుగుతున్న జనాభా జల అవసరాలను జీవనోపాధిని నదులే తీర్చాల్సి వస్తోంది. నివాస ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న మురికి నీరు నదుల్లో వచ్చి చేరుతోంది. మరో పక్క దేశంలో 70 శాతం నీరు కలుషితమైనదేనని అనేక సంస్థలు చెబుతున్నాయి. దేశంలో 86 శాతం మేర ప్రజలకు వచ్చే వ్యాధులకు కలుషిత నీరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యుల జీవన ప్రమాణాలను పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యమని రాజ్యాంగంలోని 47వ అధికరణ ఉద్దేశిస్తోంది. రక్షిత నీటిని అందించకపోవడం ద్వారా ప్రభుత్వం తన విధిని కూడా విస్మరిస్తోంది. పెరుగుతున్న పేదరికం కూడా నదీతీర వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మరో పక్క తీర ప్రాంతాల్లో ఉన్నవారు అన్ని అవసరాలకూ అసంకల్పితంగానే కాలుష్యానికి కారకులవుతున్నారు. పట్టణీకరణ దుష్ప్రభావం కూడా నదులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశంలో పట్టణాల్లో జనాభా 30 శాతం దాటింది. ఢిల్లీతోపాటు ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్‌కతా, లక్నో వంటి పట్టణాలు నదీతీరానే్న వెలిశాయి. అక్కడి ప్రజల వాడకం అంతా నదులను కలుషితం చేస్తున్నాయి. మురికివాడలు లేని నగరాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నా లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోతున్నాయి. నదీజలాల కాలుష్యానికి కారకులవుతున్న జనం చివరికి ఆ కలుషిత జలాలే తాగి వ్యాధిగ్రస్తులవుతున్నారు. దేశప్రగతికి వెన్నుదన్నుగా ఉంటున్న పారిశ్రామిక రంగం కూడా వ్యర్ధాలను నదుల్లోకి విసర్జిస్తోంది. ఎరువులు, చమురుశుద్ధి, కాగితం, చర్మశుద్ధి, లోహాలు, రసాయనాలు, ఔషధాలు రంగుల తయారీ పరిశ్రమలు నదీతీరాలను ధ్వంసం చేస్తున్నాయి. వ్యవసాయానికి అధికంగా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుల మందులు, సేంద్రీయ పదార్ధాలు, పంట అనంతర వ్యర్ధాలు సైతం పెద్ద మొత్తంలో నదుల్లోకి చేరి జలాలను విషతుల్యం చేస్తున్నాయి. సాగులో ఉపయోగించే రసాయన పదార్ధాల దుష్ప్రభావాలను తొలగించేందుకు వ్యర్ధాలు నదుల్లో చేరి నీటిని విషతుల్యం చేస్తున్నాయి. ఇన్ని కారణాలతో కాలుష్యకారకంగా మారిన గంగానది ప్రక్షాళనకు గత మూడు దశాబ్దాల్లో 20వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం లేకపోయింది. ఇంత శాపగ్రస్తం కావడానికి కారణం ఎవరు? పవిత్ర గంగానది కలుషితానికి ప్రథమ ముద్దాయి మనిషే. ఈ మహాపరాధం స్వయంకృతమే. పారిశ్రామిక వ్యర్ధాలు, ఆవాసాల మురుగునీరు, అక్రమ కట్టడాలు, మతవిశ్వాసాల పేరిట ఆచరించే నిర్హేతుక చర్యలు అన్నీ కలగలిపి పవిత్ర నది కాస్తా అపవిత్రంగా మారిపోవడానికి కారణమైంది. గంగా యమున పేర్లు చెబితే చాలు మనసు పులకరించిపోతుంది. చల్లన గంగమ్మ ఒడిలో తడిసి స్వాంతన చెందినట్టు నమ్మి కొలిచే దేవతలు పాపాలను ప్రక్షాళన చేసి ఆశీర్వదిస్తే చాలు పునీతులైనట్టు గంగానదిలో మునిగే ప్రతి ఒక్కరికీ కలిగే భావన అది. గంగానది పరిసరాలు, ప్రకృతి రమణీయత, సుందరమైన ఆకుపచ్చని వనాలు, దట్టమైన వృక్షాలతో కూడిన పర్వతసానువులు మైమరపింప చేసేవి, జీవితకాలం అనుభవంలో ఉండిపోయేవి. కాని ఇపుడు ఆ దృశ్యాలే కనిపించడం లేదు. కనువిందు చేసే దృశ్యాలు కానీ, మైమరపింప చేసే అందాలు కాని లేకపోవడంతో సుమధుర భావనలే రావడం లేదు. పవిత్రకాసారం కాస్తా మురికి కూపంగా చూడాల్సి వస్తోంది. జలాల వద్దకు వెళ్తే చాలు చల్లని గాలికి బదులు కంపుకొట్టే దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. 30 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, ఎన్ని చర్యలు చేపట్టినా గంగానది స్థితి యథాతథంగానే ఉంది. ఇపుడు గంగానది ప్రక్షాళనకు కంకణబద్ధమైనట్టు కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ భారీ స్థాయిలో నిధులను కుమ్మరించినా ప్రక్షాళన కాలేదు సరికదా కాలుష్యస్థాయి మితిమీరిపోయింది. గంగానదిని శుద్ధి చేయడానికి గత మూడు దశాబ్దాల్లో గంగా యాక్షన్ ప్లాన్ -1 పేరిట గంగా యాక్షన్ ప్లాన్-2 పేరిట 20వేల కోట్లకు పైగా వెచ్చించారు. అయినా నీరు మారలేదు. మనుషుల తీరు అసలే మారలేదు. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ మరుగునీరు ఈ కాలుష్యంలో ప్రధానభాగంగానే చెప్పవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం హరిద్వార్ వద్ద గంగలో కొలిఫాం బ్యాక్టీరియా స్థాయి 5500 కు చేరింది. ఇది అనుమతించదగిన స్థాయి కంటే 500 రెట్లు ఎక్కువ. గంగ మొదలయ్యే గౌముఖి మొదలుకుని హరిద్వార్, రిషికేశ్ వరకూ చేరే మానవ వ్యర్ధాలు ఇందుకు కారణం. మరోపక్క మానవ నిర్మిత కట్టడాలు కూడా ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక నీటి వినియోగం, డ్యాంల నిర్మాణం కారణంగా గంగ ఎండిపోతోంది. ఇసుక మేట ఫలితంగా ప్రవాహశీలత తగ్గిపోతోంది. ఇక మరోవైపు మతాచారాలు కూడా తమ వంతు కారణమవుతున్నాయి. గంగానది నీరు మనుషుల పాపాలను ప్రక్షాళన చేసి స్వర్గప్రాప్తికి సాయపడుతుందనే హిందూ విశ్వాసం కూడా ప్రస్తుత కాలుష్య స్థాయిని పెంచుతోంది. పలు సందర్భాల్లో నిర్వహించే కర్మకాండలు, విగ్రహనిమజ్జనాలు, మృతదేహాల జలార్పణం వంటివి కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా విషపూరిత రసాయనాలు, లోహాలు, క్రిమిసంహారిణులు, రేడియోధార్మిక పదార్ధాలతో నిండిన కలుషిత నదీ జలాలు సమస్త జీవావరణ వ్యవస్థకూ తీరని హాని చేస్తున్నాయి. వ్యర్ధాలు చేరి నీటి నాణ్యతను దెబ్బతీయకుండా నిరోధించేందుకు కావల్సిన సాంకేతిక, వైజ్ఞానిక పరిజ్ఞానాలు రైతులకు అందుబాటులో లేకపోవడం అందుకు ప్రధానకారణం. భారీ ఎత్తున నిర్వహించే కుంభమేళా వంటి క్రతువులు కూడా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రమాదం బారి నుండి మానవాళితో పాటు జలచరాలు, జంతుజాతిని కాపాడే ఉద్ధేశ్యంతో భారత కాలుష్య నియంత్రణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచబ్యాంకు, భారత ప్రమాణాల సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి లాంటివి అనేక మార్గదర్శక ప్రణాళికలు రచించి, నియమ నిబంధనలు ఏర్పరచినా ఆచరణలో అవన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వ స్థాయిలో చొరవ కొరవడి ప్రజల్లో అవగాహన లోపించి నెత్తిమీద కత్తిలా కాలుష్యం వేలాడే దుస్థితి ఏర్పడింది. దామోదర్ నది, సాఫీ, గంగా నదుల్లో సీసం ఆర్సెనిక్ అవశేషాలు ప్రమాదకరస్థాయిని మించి ఉన్నట్టు తేలింది. ఈ కలుషిత నీరు తాగే ప్రజలకు టైఫాయిడ్, కలరా, అతిసార, అమీబియాసిస్ వంటి రుగ్మతలకు గురవుతున్నారు.మలేరియా,నిద్రలేమి పుణ్యం కూడా ఈ కలుషిత జలాలదే. భారతీయ సంస్కృతికి జీవధారగా, వ్యవసాయరంగానికి ఆలంబనగా, ఆర్ధికవ్యవస్థలకు వెన్నుదన్నుగా చెప్పుకునే ఈ జీవనదులు మాత్రం ప్రాణాలనే హరిస్తున్నాయి. వారణాసి అయినా, హరిద్వార్ అయినా అదే పరిస్థితి కాన్పూరులో కూడా పారిశ్రామిక వ్యర్ధాలు గంగానదిని కలుషితం చేస్తున్నాయి. కోల్‌కటా చుట్టూ హుగ్లీ నదిపై ఉన్న 150 బడా పారిశ్రామిక వాడలు ఈ జలాలను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. గంగాజలాల్లో 90 శాతం సాగునీటి అవసరాలకు వాడుతున్నారు. దీంతో గంగానది ప్రవాహ వేగం కూడా తగ్గిపోయింది. కార్యాచరణ ప్రణాళికలు అంటూ వేల కోట్ల రూపాయిలు గంగపాలు అవుతోంది. 2012 జాతీయ జలవిధాన ముసాయిదాలో నదులకు బేసిన్లకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినా తగిన చట్టపరమైన సంస్థాగతమైన యంత్రాంగాలు లేకపోతే ప్రయోజనం శూన్యం. కాలుష్యం కారణంగా జాతి జీవనాడులే కుంగిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం సత్వరం గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. మానవతప్పిదాలు కొనసాగిస్తూ మరో పక్క ప్రభుత్వం ఏమీ చేయలేదనే వాదనలకు దిగడం సబబు కాదు, గంగాప్రక్షాళనకు, గత వైభవ పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి.గంగా నది శుద్ధి కార్యక్రమం 1985 జూన్‌లోనే మొదలైంది. తొలి దశ 2000 సంవత్సరం వరకూ జరిగింది. తొలి అంచనాలు 256.26 కోట్లు కాగా తర్వాత సవరించిన వ్యయం 462.04 కోట్లు. దీనివల్ల యుపిలో 6, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 15 పట్టణాలకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇక రెండో దశలో బీహార్, జార్ఖాండ్, బెంగాల్, యుపి, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు మేలు జరిగేలా 705 కోట్ల రూపాయలతో గంగానది శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీని, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ను ప్రారంభించింది. 1986లో భారత ప్రభుత్వం గంగా యమున ప్లాన్ చేపట్టి భారీ స్థాయిలో ఖర్చు చేసినా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. 2010లో నవంబర్ 1న గోముఖ్ -ఉత్తర కాశీల మధ్య 135 కిలోమీటర్లు ప్రాంతాన్ని పర్యావరణ రక్షిత స్థలంగా ప్రకటించారు. నదిపై ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టులను విరమించుకున్నారు. 2010 జూన్ 28న ప్రపంచ బ్యాంకుతో వందకోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. 1986 నాటి గంగానది ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా 2009లో చేపట్టిన ప్రాజెక్టులో ఈ లోను ఒక భాగం. 2019 నాటికి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరపుకునే వేళ దేశాన్ని ప్రక్షాళన చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు కావాలంటే వాస్తవ జీవితంలో పాతికేళ్లుగా లేడీ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న రజనీ పండిట్ గురించి చదవాలి. ఆ వివరాలే ఇవి…

“నేను ముంబయిలో పుట్టి పెరిగాను. మా నాన్న పోలీసు శాఖలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. నాన్న మహాత్మాగాంధీ హత్యోదంతం కేసు విషయంలో పనిచేశారు కూడా. నా చిన్నప్పుడు ఎంతోమంది తమ కుటుంబ సమస్యల విషయంలో నాన్న వద్దకు వచ్చేవారు. అయితే వాటి ని ఆయన చేపట్టే వాళ్లు కాదు. అది చూసిన నేను ‘వాళ్లకెందుకు నువ్వు సాయం చేయవు నాన్నా?’ అని ప్రశ్నించాను. దానికాయన ‘నువ్వెందుకు ఈ సమస్యల గురించి పట్టించుకుంటున్నావు’ అన్నారు. ఆ తరువాత కాలేజిలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి… పొగతాగడం, మద్యపానం చేయడం వంటి దురలవాట్లు ఉన్న అబ్బాయిలతో కలిసి రోజూ బయటికి వెళ్తుండేది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పాలనుకున్నాను. కాలేజి క్లర్క్ వద్దకు వెళ్లి నేనా అమ్మాయి స్నేహితురాలినని, తనకి బహుమతి ఇచ్చేందుకు ఆమె ఇంటి చిరునామా కావాలని అడిగాను. అలా చిరునామా తీసుకుని ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాను. తరువాత ఒక ట్యాక్సీ మాట్లాడి ఆ అమ్మాయి వాళ్ల నాన్నని ఎక్కించుకుని ఆమె ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి కూతురు ఏం చేస్తుందో చూపించాను. అప్పుడాయన నన్ను ‘నువ్వు డిటెక్టివ్ పనిచేస్తున్నావా’ అని అడిగారు. అప్పుడు నా బుర్రలో దాని గురించిన ఆలోచన మొదలైంది.ఆ ట్యాక్సీకి నా పాకెట్ మనీనే ఇచ్చాను.
‘సాయం’తో డిటెక్టివ్
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మూడునెలలు టెంపరరీగా ఉద్యోగం చేశాను. అలాచేసే రోజుల్లో మా ఆఫీసులో ఒకావిడ ఏడుస్తూ కనిపించింది. విషయం ఏంటని అడిగితే “నాకు ముగ్గురు కొడుకులు. వాళ్లలో ఒకడికి పెళ్లి చేశాను. ఇంట్లో నగలు కనిపించడంలేదు. కొత్త కోడలు తీసిందేమోనని అనుమానం” అని చెప్పింది. కాని ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోయింది. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి మీద నింద వేయడం సరికాదనుకుందామె. నేనామెకు సాయం చేస్తానని చెప్పినప్పట్నించీ వాళ్ల ఇంటిని గమనించడం మొదలుపెట్టాను. ఒకరోజు ఆమె కొడుకు చేతిలో ఏదో పట్టుకుని బయటకు వెళ్లడం గమనించి అతడ్ని అనుసరించాను. అతడు నగలు అమ్ముతుంటే పట్టుకున్నాను. నగలకి సంబంధించిన ఫోటోలు ఆమెకి చూపించి కొడుకుని అడగమని చెప్పాను. అడగ్గానే నంగి నంగి మాటలేవో చెప్పాడు. కాని ఆ తరువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. సమస్య పరిష్కారం అయ్యింది. అప్పుడే నేను పూర్తిస్థాయి డిటెక్టివ్ కావాలని నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించి మరాఠీ దినపత్రికలో ప్రకటన ఇవ్వాలనుకున్నాను. కాని వాళ్లు ప్రకటన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. కాని కొన్నాళ్ల తర్వాత ఆ పత్రికా సంపాదకుడి స్నేహితుడికి నా సాయం అవసరం పడింది. ఆ సంఘటన తరువాత నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ పత్రికలోనే ప్రచురించారు. అదే నా మొదటి ఇంటర్వ్యూ. అప్పట్నించీ నాకు ఎటువంటి ప్రచారం అక్కర్లేకుండానే మంచిప్రచారం లభించింది.
మా దగ్గరకొచ్చే 80 శాతం కేసుల్లో అక్రమసంబంధాలకి సంబంధించినవే. వాటిలో 75 శాతం వివాహేతర సంబంధాలకు సంబంధించినవి. ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే 80 శాతం కేసుల్లో వాళ్ల అనుమానాలే నిజం అవుతాయి. నా క్లయింట్లే నాకు మంచి స్నేహితులు. ధనిక వర్గాల నుంచి సాధారణ కుటుంబాల వరకు అన్ని వర్గాల వాళ్లు నా దగ్గరకు వస్తారు. ఈ జాబ్‌లో కావాల్సిందల్లా ధైర్యం, బుర్ర చురుకుగా పనిచేయడం, ఎదుటి వాళ్ల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడం.
రోజుకి పద్నాలుగంటలు పనిచేస్తాను. సంవత్సరానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు సంపాదిస్తాను. బాల్యంలోనే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కేసుని పరిష్కరిస్తే కలిగే ఆత్మతృప్తి ముందు మిగతావన్నీ నాకు దిగదుడుపే. పేరు కోసమో, గొప్ప కోసమో, డబ్బు కోసమో ఈ వృత్తిని చేపట్టలేదు. నా చుట్టూ ఉన్న నలుగురికీ నాకు చేతనైనంత సాయం చేయగలిగితే నాకంతే చాలు. ఈ పని చేస్తున్నాను కాబట్టి ప్రాణభయం లేదా అని మీరడగొచ్చు. ‘డర్ మేరీ డిక్షనరీ మే నహీ హై’. దేనికి భయపడాలి. మహా అంటే చావుకే కదా. చావనేది దగ్గరికొస్తే మనమేం చేయగలిగిందేమీ లేదు. అలాంటప్పుడు ఏదో అయిపోతుందని భయపడడం ఎందుకు?

కన్న కొడుకునే కిడ్నాప్ చేసి…

భర్త స్నేహితుడితో తనకున్న అక్రమసంబంధం గురించి ఏడేళ్ల కొడుక్కి తెలిసిపోయిందని ఒక తల్లి కొడుకునే కిడ్నాప్ చేయించింది. ఆమె భర్త విదేశాల్లో ఉంటాడు. రెండు నెలలు సెలవులు తీసుకుని ఇండియాకు వస్తున్నాడు. భర్త, కొడుకు కలిస్తే విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆమె కొడుకుని కిడ్నాప్ చేయించింది. భర్తకేమో పుట్టినరోజు పార్టీకి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగిరాలేదని. పోలీసు కేసు పెట్టానని చెప్పింది. కొడుకు వివరాలు కనుక్కోమంటూ ఆ జంట నా దగ్గరకు వచ్చారు. నిఘా మొదలుపెట్టిన నాకు ఒకరోజున ఆమె స్నేహితురాలు ఇంటినుంచి బయటకు ఆహారం తీసుకెళ్లడం గమనించాను. ఫాలో అయితే మొదట ఆమె తన సొంత ఇంటికి వెళ్లింది. అక్కడ్నిండి తన స్నేహితురాలి కొడుకును దాచిన లోనావాలాలోని ఇంటికి వెళ్లింది. అదే విషయం ఆమె భర్తకి చెప్పి మీ భార్యకి విషయం చెప్పకుండా తీసుకురండి. అలాగే ఆమె వద్ద మొబైల్ లేకుండా జాగ్రత్తపడండి అని చెప్పాను. లోనావాలా వెళ్లి ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టాం. చివరకు ఆమె నేరాన్ని ఒప్పుకుంది. కొడుకుని తీసుకుని శాశ్వతంగా విదేశానికి వెళ్లిపోయాడు ఆ భర్త.

సినీ నటులు, నటీమణులు అనుమానాలు…

నా క్లయింట్లలో సినీ నటులు, నటీమణులు కూడా ఉన్నారు. జీవిత భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారన్న అనుమానంతో వస్తుంటారు వాళ్లు. నటీమణులు బుర్ఖా ధరించి నన్ను ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లలో కలిసి వాళ్ల సమస్యల గురించి చెప్తారు. ఇలాంటి అన్ని కేసుల్లో వాళ్లనుకున్నదే నిజమవుతుంటుంది. భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారనే విషయం నిజమేనని తెలిసినప్పటికీ వాళ్లు మాత్రం భర్తల నుంచి విడిపోయేందుకు ఇష్టపడరు. జీవితభాగస్వామి లేదా కుటుంబసభ్యులు డబ్బు దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానం వచ్చినప్పుడు… వాళ్లు సంతకాలు చేసిన చెక్కుల్ని ఎలా వాడుతున్నారో తెలుసుకునేందుకు వస్తారు. జీవితభాగస్వామి తమని మోసం చేస్తున్నారని చాలామంది టీవీ నటులు వస్తుంటారు. నాకు తెలిసి ఎంతో మంది మోడల్స్ గృహహింసను సాధారణ విషయంగా పరిగణిస్తారే తప్ప దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అలా మాట్లాడితే వాళ్ల రెప్యుటేషన్ పోతుందని నోరు విప్పరు వాళ్లు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి హత్య కేసు

మాజీ ముఖ్య మంత్రి సోదరుడు హత్య చే యబడ్డాడు. అందులో వాళ్ల అమ్మ పాత్ర ఉందనేది మంత్రి గారి సందేహం. ఆమె వద్ద ఇద్దరు మసాజ్ చేసే ఆడవాళ్లు ఉండేవారు. ఆ ఇద్దరి ద్వారా వాళ్లింట్లో పనిమనిషిగా చేరాను. అప్పట్లో ఇన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేవు. నా దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉండేది. నేనోసారి ఆమె సంభాషణను టేపులో రికార్డు చేస్తుంటే ఆమెకి అనుమానం కలిగింది. వెంటనే రికార్డింగ్ ఆపేశాను. ఆ తరువాత ఒకరోజు ఆమె గదిలో ఒక మగ మనిషి హత్య గురించి మాట్లాడడం వినిపించింది. ఏ విషయంలోనో గాని ఆమెకి, అతడికి మధ్య గొడవ జరిగింది. అతను ఇక మీదట ఇక్కడికి రానని ఆమెతో చెప్పాడు. అన్నట్టుగానే రెండు నెలల పాటు ఆ ఇంటి దరిదాపులకి రాలేదు కూడా. రెండు నెలల తరువాత వచ్చిన అతడితో ‘మనని పోలీసులు గమనిస్తున్నారు. ఇక మీదట నువ్విక్కడికి రావొద్దు’ అని ఆమె చెప్పింది. ఎలాగైనా వాళ్లని పట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్న నేను నా చేతిలో ఉన్న కత్తిని కాలు మీదకి జార్చుకున్నాను. రక్తం రావడం మొదలైంది. రక్తం కారుతున్న కాలితో ఆమె దగ్గరకు వె ళ్లాను. మేడ కిందకి వెళ్లి బ్యాండేజి వేసుకోమని చెప్పిందామె. కిందకి వెళ్లి వెంటనే నా క్లయింట్‌కు ఫోన్ చేసి చెప్పాను. ఆయన పోలీసులను వెంటపెట్టుకుని వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా వాళ్లని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేశారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు  (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు  )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే?

టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో .

డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు అధికారం కట్ట బెట్టారు ?

టిం –అధికారం తో బాటు అదృస్టమూ కలిసి రావాలి నాయనా .చంద్ర బాబు పేరులో చంద్రుడనే చల్లదనం ఉన్నా చంద్రుడికి బాబు సూర్యుడు అంటే సూర్య కాంతి వల్లనే చంద్ర ప్రకాశం కనుక సూర్యుడు పేట్రేగి పోతున్నాడు .’’బాబు బాబు’’ ప్రభావం అన్నమాట .

డిం –వరుణ యాగాలు చేస్తే వర్షాలు పడతాయికదా గురూజీ

టిం –వాతావరణ కాలుష్యం పెంచుకొని ,అరణ్యాలను నరుక్కుంటూ ,ఫ్రిజ్ ,టి వి.మొదలైన ఆధునియా సామగ్రిని పెంచుకొంటూ పోతున్న ఫలితానికి ఎన్ని వరుణ యాగాలు జపాలు చేస్తే మాత్రం సమతుల్యతః సాధించ గలం ?వివేకం కోల్పోయిన దాని ఫలితమే ఇది .వాతావరణం లో వేడి పెరిగి ,కొంప కొల్లేరు అవుతోంది .

డిం –తెలంగాణా లో కాంగ్రెస్ దళం గులాబీ కండువాలు కప్పుకొందే ?

టిం –తెలంగాణా ఇచ్చిన’’ సోనీ ‘’కి తగిన ప్రతి ఫలం ఇది .కాంగ్రెస్ గూడు ఖాళీ .నెత్తిన చేతులే భస్మాసుర హస్తమే .పొన్నాలలు జానాలు, బెత్తేడ్లు ఎవరూ ఆపలేరు .

డిం –మరి సెంటర్ లో?

టిం –యదా రాజ తదా ప్రజా .అక్కడ ‘’కూడా ‘’చెయ్యి ‘’జారి పోయి మిగిలేది ‘’హాండ్ ఫుల్ ‘’మందే  .మోడీ పాలన కాలం పెరిగిన కొద్దీ వచ్చే ప్రమాదం ఇదే కాంగీ కి .

డిం –జగన్ అసెంబ్లీలో రెచ్చి పోతున్నాడే ?

టిం –గురివింద తన కింది నలుపును మర్చి పై మెరుపు ,ఎరుపు కు మురిసి పోతుంది .నిజం తెలిసే సరికి మునిగిపోయే ప్రమాదం ఉంది .

డిం  –‘’దాడి’’ దాడి గురించి ?

టిం –జగన్ లొసుగులు తెలిసి ఇప్పుడిప్పుడే బయట పెట్టి దాడి చేస్తున్నాడు దాడి .కొందరికి జ్ఞాన దంతాలు లేట్ గా వస్తాయి శిష్యా .బ్రాహ్మణి గుట్టు రట్టు చేశాడు కదా .ఇక నెమ్మదిగా ఒక్కో చిట్టా విప్పి చిత్తూ చిత్తూ  చేస్తాడు .దానితో ఖజానా ఖాళీ .సభ్యులు మోళీ చేసినట్లు జంప్ జిలానీ .

డిం –వలసలను ప్రోత్సహించద్దని పొన్నాల ఉవాచ ?

టిం –నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష .కొంప ఖాళీ అవుతూంటే ఉక్రోషం ఉడుకు మోటు తనం .ఎవరికైనా తానదాకా వస్తే కాని తెలీదు డింగరీ .

డిం –తెలంగాణా లో తెలుగు దేశం స్థితి ?

టిం –ఎవరూ దేనికీ అతీతులుకారు .ప్రలోభాలు ఎంతవారినైనా లొంగ దీస్తాయి .కాలమే చెప్పాలి దేశం భవిష్యత్తు గురించి .తెలుగు దేశమూ గులాబీలను ఆకర్షించే ప్రయత్నం చేయచ్చు .

డిం –పి వి .ఉత్సవాలు జరిపిస్తాడట గులాబీ నేత .

టిం –అధికారం లోకి వచ్చాక ‘’రావు’’ చెప్పిన మంచిమాట ఇది ఒక్కటే .కాన్గీలు మర్చి పోయిన మన జాతి రత్నాన్ని ,ఆంధ్రుల గర్వాన్ని నెత్తి కేత్తుకొన్నందుకు కే సి ఆర్ అభినందనీయుడు .పివి కి అవమానం జరుగుతున్నా కౌరవ సభలో పెద్దల్లా ఇన్ని వందల మంది ఖద్దరు బాబులు ఒక్కమాట కూడా అధినేత్రికి ఎదురు చెప్పలేక నోరు మూసుకున్న ఫలితాన్ని ఇప్పుడు అనుభ విస్తున్నారు .ఒక రకం గా పి వి భూతం వారిని నిలువ నీడ లేకుండా చేసినట్లు గా ఉంది .కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టాడు జ్ఞాని మాజీ ప్రధాని నరసింహా రావ్ జీ .ఇక ఆపి మళ్ళీ కలుద్దాం డింగరీ

టిం -సరే గురు టింగరి-వస్తా వెళ్ళొస్తా .

      కేవలం లాఫింగ్ కే  నని మరువద్దని మనవి 

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ – 25-6-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫాదర్స్ డే-నాన్న !!!

  శ్రీ రవీంద్రనాధ్ గారు ఎంతో శ్రమించి రచించిన – ప్రవచించిన ఫాదర్స్ డే అంశానికి అభినందనలు —– పితృ దినోత్సవం

 నా భావమైన మరో కోణాన్ని వీక్షించి వ్యాఖ్యానించండి —

                                             నాన్న !!!
  పైపైకి ఎగరేసి – వున్నతముగా వుండమని – పడకుండా పట్టుకున్న నాన్న!
  నా అనే అనుబంధానికి – అసలు రూపం నీవే నాన్న ! 
  వేలు పట్టి నడిపించి – వెన్ను తట్టి ప్రోత్సహించి – లోకమంతా  చూపించి 
  జ్ఞానమెంతో కలిగించి – అన్నీ నీవై నడిపించిన నాన్నా! 
  నీకు వందనం – పాదాభివందనం !
  మీ ఆలన మాకు రక్ష – మీ పాలన మాకు భిక్ష !
  బాధ్యతలను మోస్తూనే – బంధాలను బలపరుస్తు  !
  భాధలను భరిస్తూనే – భుజాలపై మమ్ము మోస్తూ !
  మీ యొదనే – మాకు శయనించే పాన్పు చేస్తూ !  
  మీ అరచేతినే మా పాదాలకు రక్ష చేస్తు ! 
 మా నవ్వులో  మీ అలసట మరచారు  !
 మా మాటల్లో మీ వేదన తుడిచారు ! నాన్నా ! ఓ నాన్న!!
 విద్యలో మాస్థాయికై  – మీ ఆస్థులు తెగనమ్మారు  !
 మాకు వుద్యోగం వచ్చేందుకు – మీ స్వేదం చిందించారు ! 
 మాకు జన్న నిచ్చి-  బ్రతుక నేర్పిన నాన్నా !
 మిమ్ము మరచిన క్షణమున్నదా ? – నాన్నా !
 మిమ్ము వత్సరాని కొక్క రోజు తలవాలా ???
 మాతృ దేవో భవా ! పితృ దేవో భవా ! అన్న భూమి మనది !
 నా పిల్లలు – నీ పిల్లలు కలసి మన పిల్లలపై చేస్తున్న పోరాటంలో!
 ఆరాటం – సంవత్సరానికొక్కమారు కలసి గడిపే ఫాదర్స్ డే కోసం !
 ఆ ఫారినర్స్ జరుపుకునే  “ఫాదర్స డే”  మనకు కావాలా ?
 నా పెళ్ళాం – నా పిల్లలు  అనుకుంటూ – కన్నవారిని శరణాలయాలకు పంపితే  ?
 తాత గతే మీకు _ అని మా బిడ్డలు మాకు చెప్పరా !!
 పుత్రుడైనా – పుత్రికైనా  – నా – అన్నదే నాన్న భావం!
 కలసి వుంటే కలదు సుఖమని మరువకు – కన్నవారిని కష్టాలలో విడువకు !
 ఇది ! ఈ కర్మ భూమి పంచిన ధర్మం !!
 ఇది ! మరో త్రికాల వేదం – ఈ బందా నాదం !!
                    —- బందా వేంకట రామా రావు, 9393483147.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -5

ఉపాఖ్యానాలలో కధలు

వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన కర్మ ప్రాధాన్యతను తెలియ జేయటానికి లేక దోషాన్ని వివరించటానికి అనేక ఉపాఖ్యానాలను వేదం చెప్పింది .ఈ ఉపాఖ్యానాలు బ్రాహ్మనాలలో ఎక్కువగా కనిపిస్తాయి .వాటి వివరాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

ఐతరేయ బ్రాహ్మణం

ఋగ్వేదానికి చెందినా ఐతరేయ బ్రాహ్మణం లో చాలా ఉపాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది ‘’శునస్షేఫోపాఖ్యానం ‘’.ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుడు పుత్ర సంతానం లేక చాలా కాలం పరి తపించి తనకు పుత్రుడే కనక పుడితే వరుణ దేవుడికే సమర్పించి క్రతువు చేస్తానని మొక్కుకొన్నాడు .వరుణానుగ్రహం తో ‘’రోహితుడు ‘’అనే పుత్రుడు కలిగాడు .పుత్రజననం జరగ్గానే వరుణుడు ప్రత్యక్షమై వాగ్దానం ప్రకారం  ఆ కొడుకును తనకు ఇచ్చేయమని అడిగాడు .బారసాల ముచ్చట తీరాక ఇస్తానని రాజు వాయిదా వేశాడు .పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే దంతాలోచ్చినతర్వాత అన్నాడు .ఇలా చాలా సార్లు వరుణుడు రావటం రాజు వాయిదా వేయటం జరిగింది .

రోహితుడికి యుక్త వయస్సు వచ్చి గురుకులం లో చేరి శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చి ఇంటికి తిరిగి వచ్చాడు .తండ్రి కొడుకుకు తాను వరుణుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేశాడు .తాను బలి పశువు కావటానికి ఒప్పుకోక ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్లి పోయాడు .మొక్కు తీర్చ లేదనే కోపం తో వరుణుడు హరిశ్చంద్రునికి జలోదర వ్యాధి వచ్చేట్లు చేశాడు .వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి తగ్గక మంచం పట్టాడు .కొడుకు రోహితుడికి విషయం తెలిసి తండ్రి దగ్గరకు వచ్చాడు .ఇంద్రుడు అడ్డ గించి వనవాసమే మంచిదని చెప్పి అరణ్యాలకు పంపించేశాడు .

ఇలా మూడు సార్లు జరిగింది .తండ్రి రోగాన్ని పోగొట్టటానికి వేరెవరైనా పురుషుడిని ఉంచి యాగం జరిపించాలని రోహితుడు తలచాడు .తిరిగి తిరిగి అజీ గర్తుడు అనే ఆయన దగ్గరకు వచ్చాడు రోహితుడు .అతనికిఉన్న ముగ్గురు కొడుకులలో ఒకరిని తనకిమ్మని వేడుకొన్నాడు .పెద్దకొడుకును ఇవ్వటానికి తండ్రి, చిన్న కొడుకునివ్వటానికి తల్లి ఒప్పుకోలేదు .ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకొన్న రెండవ కొడుకు శున స్షేఫుడు తను ఎవరికీ చెందడు కనుక  రోహితుని వెంట వెళ్ళాడు .అజీ గర్తునికి ప్రతి ఫలం ముట్ట జెప్పి రోహితుడు శునశ్శేఫుడి ని తీసుకొని వెళ్ళాడు .యాగానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి .నరుడైన పునస్షేఫుడిని యూప స్తంభానికి కట్టెయ్యటానికి ఎవరూ ముందుకు రాలేదు .చివరికి తండ్రి అజీ గర్తుడే కొడుకును యూపానికి కట్టేసి వంద ఆవులను తోలుకు పోయాడు .ఇంకో వంద గోవులను ఇస్తే కొడుకును చంపటానికి కూడా తండ్రి సిద్ధ పడ్డాడు .శునశ్శేఫుడు ఆర్తి తో వరుణుడిని ప్రార్ధిస్తే ప్రత్యక్షమై యూప స్తంభంనుంచి తప్పించి హరిశ్చంద్రుని వ్యాధిని పోగొట్టాడు .శునశ్శేఫుడు తండ్రి వెంట ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు .విశ్వామిత్ర మహర్షి దగ్గరకు చేరాడు .ఆ మహర్షి శునశ్శేఫుడిని కుమారుడి గా స్వీక రించాడు .ఈ ఉపాఖ్యానం లో వివిధ వ్యక్తుల మనస్తత్వాల ఆవిష్కరణ జరిగింది .దేవతా స్తుతి రూపాలైన అనేక రుక్కులు ఈ ఉపాఖ్యానం లో ప్రాధాన్యత పొందాయి .

నేనెవరిని ?

సంస్కృతం లో ‘’కః ‘’శబ్దానికి ఎవడు అని బ్రహ్మ అని రెండు అర్ధాలున్నాయి .ఐతరేయ బ్రాహ్మణం లో ఉన్న ఒక ఉపాఖ్యానం లో దీనికి సంబంధించిన కద ఉంది .ఇంద్రుడు వృత్రాసురుడిని చంపి ,లోకాలన్నీ జయించి ,ప్రజా పతి  వద్దకు వచ్చి’’ నేను అన్ని ప్రాణుల కంటే గొప్ప వాడిని ‘’అని గర్వం గా చెప్పాడు .అప్పుడు ప్రజాపతి ‘’నా గొప్పతనాన్ని నువ్వు లాగేసుకొంటే మరి నేను ఎవర్ని ?’’అని ప్రశ్నించాడు .దానికి ఇంద్రుడు ‘’ప్రజా పతీ !స్వాత్మ ను నువ్వు కః ‘’అని అన్నావు కనుక ఇక నుంచి నువ్వు ఆ శబ్దం తోనే పిలువ బడుతావు ‘’అన్నాడు .అప్పటి నుంచి కః అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్ధం కూడా వచ్చి చేరింది .ప్రజా పతి గొప్ప తనాన్ని కూడా హరించటం చేత ఇంద్రుడు మహేన్ద్రుడయ్యాడు .దేవతలు ఇంద్రుని కోసం ‘’మాధ్యందిన సవనం ‘’’’నిష్కేవల్య శస్త్రం  ‘’లను ప్రత్యేకం గా కేటాయించారు .కనుక ఉపాఖ్యానం లో మాధ్యందిన సవనానికి నిషేవల్య శాస్త్రానికి మహాత్మ్యాన్ని కలిగించే శక్తి ఉన్నట్లు సూచిస్తోంది .

కౌశీతకీ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు

ఇందులో ప్రజా పతి తపస్సు అనే ఉపాఖ్యానం ఉంది. సృష్టి చేయాలని ప్రజాపతి తపస్సు చేశాడు .ఆ తపస్సులో నుంచి అగ్ని వాయువు ,ఆదిత్యుడు చంద్రుడు ,ఉషస్సు జన్మించారు .మొదటి నలుగురు తపస్సు చేశారు ఉషస్సు ద్వారా వెయ్యి కళ్ళు ,వేయి పాదాలు గల మహా పురుషుడు ఉద్భ వించాడు .ఈ ఉపాఖ్యానం  సృష్టి ప్రారంభం లో ఉన్న తత్వాలను గురించి తెలియ జేస్తుంది .

అగ్నికి ఆజ్యం కధ –రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కంటికి కనిపించకుండా పరారయ్యే అగ్ని ఋతువులలో ప్రవేశించి దాక్కున్నాడు .దేవతలు అసురులను జయించి అగ్ని కోసం వెతుకు తున్నారు .యమ ,వరుణులు అగ్నిని పట్టుకొన్నారు .అగ్ని  కోరికను మన్నించి అతనికి వరం గా ‘’ప్రయాజాను యాజలు ‘’,ఆజ్యం ‘’(నెయ్యి )ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చారు .అందుకే లోకం లో ‘’అగ్నికి ఆజ్యం ‘’సామెత పుట్టింది .అగ్ని ప్రయాజాను యాజ లతో బాటు నెయ్యినీ కోరుకోన్నాడని దీన్ని బట్టి తెలుస్తోంది .ఈ ఉపాఖ్యానం లో వృత్రాసుర వధ ,సూర్యోత్పత్తికూడా ఉన్నాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-14-ఉయ్యూరు

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహైతీ బంధువులకు శుభ వార్త

సాహైతీ  బంధువులకు శుభ కామనలు అంతర్జాలం లో  వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో సుప్రసిద్ధులైన ,ప్రభావ శీలురైన123మంది కవుల పై ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘శీర్షిక తో నేను రాసిన ’55 ఎపిసోడ్ లను పుస్తక రూపం లో సరసభారతి  13వ ప్రచురణ గా తీసుకు రావటానికి సరస భారతికి అత్యంత ఆప్తులు ,అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ముందుకు వచ్చి ముద్రణ ఖర్చు కు పూర్తీ బాధ్యతను వహించారని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది . ఈ పుస్తకాన్ని  మైనేని వారి అభ్యర్ధన మేరకు వారి బావ గారు ప్రముఖ ఆంధ్రాంగ్ల సాహితీ వేత్త,విశాఖ వాసి  డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి (రావి శాస్త్రి గారి తమ్ముడు ) గారికి , శర్మ గారి90వ జన్మదినోత్సవం రోజున అంకిత మిచ్చి ఆవిష్కరణ  చేస్తున్నాం .ఈ పుస్తకానికి ముందు మాట , సమీక్ష .రాయటానికి తమ విలువైన సమయాన్ని శర్మ గారిపై ఉన్న అభిమానం తో వెచ్చించటానికి ప్రముఖ వరంగల్ వైద్యులు ,ప్రసిద్ధ రచయిత డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ గారు అంగీకరించారని తెలియజేయటానికి ఇంకా సంతోషం గా ఉంది .పుస్తకమ్ తయారవుతోంది .వివరాలు తరువాత తెలియ జేస్తాను  . మీ -దుర్గా ప్రసాద్

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

యువకుడి గా ఉండి విద్యార్ధుల కోసం ఒక మాస పత్రిక పెట్టాలనే ఆలోచన రావటమే అరుదు .వచ్చిన ఆలోచనను ‘’తెలుగు విద్యార్ధి ‘’గా రూపొందించి అవిచ్చిన్నం గా అరవై ఒక్క ఏళ్ళుగా నడపటం అనితర సాధ్యం .అందులో విద్యార్ధులకు ఉపాధ్యాయ అధ్యాపకులకు బాల బాలికలకు అవసరమైన అన్ని విషయాలు ఉండేట్లు చేయటం, ప్రభుత్వం జారీ చేసే అన్ని జి వొ లనుప్రచురించటమే కాదు,  ప్రశ్నలు జవాబులు శీర్షిక పెట్టి చదువరుల ప్రశ్నలకు ఆర్ధిక రంగ నిపుణులైన స్వర్గీయ మామిడి పూడి వెంకట రంగయ్య గారు ,ప్రముఖ న్యాయ మూర్తి స్వర్గీయ ఆవుల సాంబశివ రావు గారి లాంటి వారితో సమాదానాలిప్పించటం తో కొత్త వరవడి సృష్టించారు .’’పద బంధం ‘’ను ఏర్పరచి స్వర్గీయ వేమూరి జగపతి రావు గారితో దాదాపు ముప్ఫై ఏళ్ళు నిర్వహింప చేయటం ఒక సవాలు .విద్యారంగం లో వచ్చే ప్రతి మార్పుకూ ప్రాముఖ్యమిచ్చి వ్యాసాలూ రాయించి అవగాహన కల్పించారు .సైన్సులో సాంకేతిక విషయాలలో శ్రీ సి వి సర్వేశ్వర రావు వంటి ఉద్దండులచేత ప్రత్యెక వ్యాసాలూ రాయించటం మరో ఆకర్షణ .శ్రీ సోమంచి రామం శ్రీ గీతా సుబ్బారావు వంటి వారితో పిల్లలకధలు గేయాలూరాయించి  కార్టూన్లు వేయించి వారికీ అభిరుచి కలిగించటం ముఖ్యవిషయమే .సాహిత్య వ్యాసాలూ ప్రముఖుల పై ప్రత్యెక వ్యాసాలూ పత్రికకు అదనపు ఆకర్షణ .సంపాదకీయం లో  సమకాలీనతకు అద్దం పట్టారు .స్వర్గీయ చలసాని సుబ్బారావు గారు  ఎన్నో సంవత్సరాలు తెలుగు విద్యార్ధితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నవారు .అలాగే శ్రీ మాది రాజు రామ లింగేశ్వర రావు గారి ఆర్టికల్స్ విలువైనవి గా ఉండేవి .యై ఎస్ హయాం లో తెలుగు విద్యార్ధికి స్వర్ణోత్సవం ,కిరణ్ కుమార్ పాలనలో రజతోత్సవం అత్యుత్సాహం గా జరిపించటం ఆయనకే సాధ్యమైంది .ఎన్నో విలువైన గ్రంధాలయాలను తక్కువ ధరకే ముద్రించి అందు బాటులోకి తెచ్చారు .దాతలను,శాశ్వత చందా దారులను ప్రోత్సహించి  ప్రోత్సహించి గ్రంధాలయాలకు విద్యా సంస్థలకు తెలుగు విద్యార్ధి అందేట్లు చేయటం ఆయనకే సాధ్యమైంది .చందాలు కట్టినా కట్టక పోయినా ,ప్రతి హైస్కూల్ కు పత్రికను ప్రతి నెలా పంపేవారు .ఆయనే తెలుగు విద్యార్ధి సంపాదకులు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు . ఎనభై ఒక్క ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి ఈనెల పందొమ్మిదవ తేదీ మరణించి విద్యా సాంస్కృతిక రంగాలకు తీరని లోటు కల్పించారు .

బందరు జాతీయ కళా శాలలో బి ఇ డి చేసి జై హింద్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడు గా  చేరి శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులైనప్పుడు ,మహా వైభవం గా కోన సాగుతున్న కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ నుండి శ్రీ కొల్లూరి ని శాసన మండలికి1968 లో  అభ్యర్ధిగా ప్రకటిస్తే, పిన్నమనేని ఆ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని కొల్లూరి గెలుపుకు అవిశ్రాంత కృషి చేసి గెలిపించారు .జిల్లా అంతటా కొల్లూరి పిన్నమ నేని పర్యటించి ఉపాద్యాయ అధ్యాపకులనందరిని కలిసి ,వారివోటు ను అభ్యర్ధించి గెల్పు సాధించారు .గిల్డు కూడా ఎక్కడా వోటు జారిపోకుండా జాగ్రత్త పడి  గెలుపుకు విశేషం గా తన వంతు కృషి చేసింది .ఆ నాటి ప్రత్యర్ధి శ్రీ పి శ్రీరామ మూర్తి గారు .ఏంతో అనుభవం ,అండ దండలున్న వారు .ముఖ్యం గా కమ్యూనిస్టు సానుభూతిపరుల మద్దతున్న వారు .వారిపై కొల్లూరి పోటీ అంటే అదొక పెను సవాలు .ఆ సవాలును అధిగమించి కొల్లూరి అందరి ఆదరాన్ని అభిమానాన్ని పొంది నిద్రాహారాలు లేకుండా తిరిగి గెలిచారు .అంతే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేకుండా పోయింది .రెండవ సారి కూడా గిల్డు కొల్లూరినే అభ్యర్ధిగా ప్రకటించి పిన్నమనేని సహకారం తో గెలిపించుకోన్నది .అలాగే మూడవ సారి ఎన్నికకూ కొల్లూరి  అభ్యర్ధి అని టీచర్స్ గిల్డ్ ప్రకటించి ఎన్నో అడ్డంకుల్ని అదిగ మించి ,ఆ నాటి విద్యా మంత్రి శ్రీ మండలి కృష్ణా రావు గారు శ్రీ రారామ మూర్తి గారికి ఫుల్ సపోర్ట్ చేసి ప్రతి స్కూలూ తిరిగి ప్రచారం చేశారు. అయినా పిన్నమనేని అండ దండల తో ఉపాధ్యాయ అధ్యాపకుల అభిమానం తో కొల్లూరి మూడో సారి గెలిచి రికార్డ్ సృష్టించారు . టీచర్స్ కు ఇళ్ళ స్తలాలు ఇప్పించటం లో గిల్డు ,కొల్లూరి చేసిన కృషి మర్చిపోలేనిది .

పిన్నమనేని కొల్లూరి లను క్రిష్ణార్జులనే వారు .విద్యా రంగం పై వారిద్దరికీ ఉన్న మక్కువ ప్రతి విషయం లోను కని  పించింది .గిల్డ్ తరఫున లెక్క లేనన్ని సెమినార్లు నిర్వహించారు .ఎందరో ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించారు .టెక్స్ట్ పుస్తకాలు మారినప్పుడూ ,ప్రశ్నా పత్రాలను మార్చినప్పుడు నిర్వహించిన ఓరిఎంటేషన్  క్లాసులు ణ భూతో ణ భవిష్యతి .గిల్డు కొల్లూరి ,సూచించిన సూచనలు అన్నీ ప్రభుత్వం ఆమోదించి అమలు చేసింది .కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ వీరిద్దరి నాయకత్వం లో రాష్ట్రానికే దిశా నిర్దేశం చేసింది .ఇక్కడ జరిగిన మార్పులనే ఇతర జిల్లాల వారూ  ఆచరించారు. ప్రభుత్వమూ గిల్డ్ సూచనలకు అధిక ప్రాధాన్యమిచ్చింది . వేతనాలస్థిరీకరణ, కొత్త వేతనాల స్కేల్స్ విషయం లో,పి ఆర్ సి .సంఘం తో చర్చించి న్యాయ బద్ధ మైన స్కేల్స్ సాధించటం లో వీరి చొరవ మరువ లేనిది . గిల్డ్ సూచనలకు విలువ ఉండేది .గిల్డ్ వార్షికోత్సవాలకు వీరిద్దరూ సర్వశ్రీ పి వి నరసింహా రావు ,భవనం వెంకట్రాం చనుమోలు వెంకట్రావు కోమటి భాస్కరరావు ,వంటి వారిని ఆహ్వానించి  సమస్యలను తెలియ జేసి వారి నుండి స్పష్టమైన హామీలను రాబట్టిన సందర్భాలెన్నో .రాయల సీమ ఏం ఎల్ సి .శ్రీ భుజంగ రావు ,లెఫ్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సింగరాజు రామకృష్ణయ్య ,అలాగే తూర్పు గోదావరి నుంచి ఎన్నికైన ఏం ఎల్ సి ,గుంటూరు నుండి ఎన్నికైన శ్రీ మన్నవ గిరిధర రావు ,గ్రాద్యుఎత్ల్ నుండి ఎన్నికైన శ్రీ జూపూడి యజ్న నారాయణ మొదలైన వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడి మండలిలో సమస్యలపై సంయుక్తం గా స్పందించటం లో కొల్లూరి పాత్ర అభినందనీయం .కొల్లూరి ,పిన్నమనేని కలిసి ఆలోచించి గిల్డ్ సహకారం తో బెజవాడలో శ్రీ కాకాని టీచర్స్ గిల్డ్ హోమ ను ,బందరులో కొల్లూరి ,గిల్డ్ కలిసి పిన్నమ నేని ఉపాధ్యాయ సేవకు గుర్తింపుగా ‘’పిన్నమ నేని టీచర్స్ గిల్డ్ హోమ్ ‘’నిర్మించి వారిద్దరికీ గౌరవాన్నికల్గించి ఉపాధ్యాయులకు ఉపయోగ పడేట్లు చేశారు .ఇది గిల్డ్ సాధించిన అద్భుత విజయం దీనికి వీరిద్దరి సేవలూ చిరస్మరణీయాలే .ఉపాధ్యాయ  అధ్యాపకులు చందాలు వేసుకోవటమే కాకుండా ఫాన్లు లైట్లు కుర్చీలు వగైరా సామగ్రిని అందించి గిల్డ్ హోమ్ లకు సౌకర్యాలు కలిగించి తమ బాధ్యత, కర్తవ్యాలను నేర వేర్చారు .పిన్నమనేని కొల్లూరి ల జంట సాధించిన విజయాలు అనితర సాధ్యం .అందుకే’పదవిలో ఉన్నా లేకున్నా ’ చైర్మన్ పిన్నమనేని’’ అని ఆయన్ను’’ ఏం ఎల్ సి కొల్లూరి ‘’అని  ఈయన్ను ఆప్యాయం గా పిలుచుకొని సంబర పడే వారు. కృష్ణా జిల్లాకు అదొక స్వర్ణ యుగం ..కృష్ణా జిల్లాలో విద్యా వైద్య ఆరోగ్య ,ఉపాధ్యాయ అధ్యాపక సంక్షేమానికి వీరిద్దరి కృషి చిరస్మరణీయం .ఆంద్ర విశ్వ విద్యాలయం  సిండి కేట్  సభ్యులుగా శ్రీ కొల్లూరి  ఎంపికై విద్యా రంగానికి సేవలందించారు .అమెరికాలో విద్యా బోధనను అధ్యయనం చేయటానికి పర్యటన చేసి సమావేశం పెట్టి అక్కడి విద్యారంగం తీరు తెన్నులను వివరించారు .జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడు అధ్యాపకుడు కొల్లూరికి పరిచయమే .ఖద్దరు పంచ లాల్చీ పైన ఉత్తరీయం భారీ పర్సనాలిటి ,నవ్వు ముఖం యెర్రని దేహ చ్చాయ చుక్కల్లో చంద్రుడుగా కొల్లూరి కని  పిస్తారు ఆ డ్రెస్ కోడ్ మార్చనే లేదు .సెకండరీ గ్రేడ్ టీచర్ల ప్రమోషన్ ఆగి పోతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు సీనియర్ బియి డి టీచర్ల చేత సెలవు పెట్టించి ,ఆ ఖాళీలలో ప్రోమోశాన్లు ఇచ్చి ఆడుకున్న పెద్దమనసు ఇద్దరిదీ .ఏంటి రామారావు వచ్చి శాసన మండలి రద్దు చేయగానే కొల్లూరి మళ్ళీ జైహింద్ హైస్కూల్ లో తెలుగు పండితుడిగా చేరి టీచింగ్ నోట్స్ రాస్తూ పాఠాలు చెబుతూ పేర్లు దిద్ది తన బాధ్యతను సక్రమంగా నేర వేర్చి ఆదర్శం గా నిలిచారు ఇది చరిత్రలో లిఖింప దగిన అంశం .

కొల్లూరి తో నా పరిచయం నేను సైన్స్ టీచర్ గా 1963లో చేరినప్పటి నుంచీ ఉన్నా ,1968ఏం ఎల్ సి ఎన్నిక నుంచీ బాగా సన్నిహితులమయ్యాం .రెండు మూడు ఎన్నికలకు ఆయన తో కలిసి కారులో జిల్లా అంతా పర్య టించి ప్రచారం చేశాం .బందరు హిందూ హైస్కూల్ లెక్కల మేష్టారు ప్రముఖ కదా రచయిత స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారి తో నన్ను ,కాటూరు లోని హరి గౌతమేశ్వర రావు గారిని కారులో పంపి ప్రచారం చేయించారు కొల్లూరి .మూడో సారి ఉయ్యూరు మండలం లో అత్యధిక వోట్లు పడేట్లు నేనూ కాంతారావు ,ఆంజనేయ శాస్త్రి పిచ్చిబాబు జ్ఞాన సుందరం రామ కృష్ణా రావు హిందీ రామా రావు గారు కలిసి కృషి చేసి గెలిపించాం .ఒక సారి  కారు వేసుకొని మా  ఇంటికి వచ్చికూర్చుని టిఫిన్ చేసి మాతో కలిసి ప్రచారమూ చేశారు .1970లో తెలుగు విద్యార్ధి లో నేను ‘’భావ కవితకు మేస్త్రి కృష్ణ శాస్త్రి ‘’అనే మొదటివ్యాసం రాశాను .అ తర్వాత చాలా రాశాను .గత పదేళ్లుగా కోటేశ్వరరావు గారు నాకు తరచూ ఫోన్ చేసి సైన్స్కు సంబంధించిన  ఇంగ్లీష్ ఆర్టికల్స్ పంపి అనువాదం చేయమని కోరేవారు .అలానే చేసి పంపేవాడిని .పత్రికలో వచ్చేవి .’’ప్రసాదు గారూ !తెలుగు విద్యార్ధిని మీరందరి ప్రోత్సాహం తోనే నడప గలుగుతున్నాను .మీరు తప్పకుండా రాస్తూ ఉండండి ‘’అని చెప్పే వారు .

కొల్లూరి ఒక రకంగా నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’.ఉయ్యూరు లో ఉద్యోగించటమంటే దిన దిన గండమే ఏ అర్ధ రాత్రి ఎవరొచ్చి లేపి ఇంకో చోటికి తోసేస్తారో ననే భయం .నాకు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే ఏవ గింపు .స్థానిక నాయకులెవారి దగ్గరికి వెళ్ళే వాడిని కాను .నా బలం గిల్డు ,కొల్లూరి .ప్రతిసారీ నన్ను బదిలీ చేయటం చేసిన నాలుగైదు నెలల్లో తిరిగి రావటం జరిగేది .నన్ను మళ్ళీ ఉయ్యూరు తెచ్చె  బాధ్యత కొల్లూరి తీసుకొనే వారు .కృపా రావు గారనే కాటూరు సెకండరి గ్రేడ్ మాస్టారి అబ్బాయికి బియి డి సీట్ రాకపోతే నాకు ఆయన చెబితే మేమంతా వెళ్లి కొల్లూరి ని కలిసిసీటు ఇప్పించాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని వెంట బెట్టుకొని కరేస్పాం డెంట్  ఇంటికి తీసికెళ్ళి సీటు ఇప్పించారు కొల్లూరి .మేము ఆయన్ను అలా నమ్మాం. ఆయన మాకు అలా అభిమానం తో పనులు చేసేవారు .బందరు వెడితే టిఫిన్ భోజనం వాళ్ళింట్లోనే చేసేవాళ్ళం నేనూ కాంతారావు ,శాస్త్రి .ఆయనకు రెండు సార్లు హార్ట్ ప్రాబ్లెం వచ్చి ఆస్పత్రిలో ఉంటె రెక్కలు కట్టుకొని వాలి రాత్రి పదింటి దాకా ఉండి అప్పుడు ఇళ్ళకు చేరుకొనే వాళ్ళం .అప్పుడు ఫోన్ సౌకర్యం మాకు లేదు .ఎప్పుడైనా ఆయన్ను కలవాల్సి వస్తే తెలిసిన వాళ్ళింటికి వెళ్లి ఫోన్ చేసి ఫలానా అప్పుడు వస్తున్నాం అని చెప్పే వాళ్ళం .స్పాట్ వాల్యుయేషన్ సమయం లో సాయంత్రాలలో ఒకటి రెండు సార్లు ఫోర్ట్ రోడ్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి పలకరించేవారం .పదవిలో ఉండి అవినీతికి లంచాలకు అతీతం గా వ్యవహరించిన ఏకైక వ్యక్తీ కొల్లూరి .శీల  ప్రాధాన్యత ఉన్న విశిష్ట వ్యక్తీ .ఏ వ్యసనమూ లేని అపూర్వ వ్యక్తీ .అందుకే మాకు ఆయనంటే అమితమైన ఇష్టం .మా కాంతారావు కు బి యిడి క్లాస్ మేట్ .అందుకని కాంతారావు కొల్లూరిని ‘’మా గురువు ‘’అనేవాడు .అంత చనువుండేది వారిద్దరికీ .తెలుగు విద్యార్ధి పని కూడా చేసి పెట్టేవాడు .

మచ్చలేని నాయకులుగా కృష్ణా జిల్లాలో ఆదర్శ జంటగా పిన్నమనేని ,కొల్లూరి నిలిచారు. రెండేళ్ళ క్రితం చైర్మన్ పిన్నమనేని మరణిస్తే ఇప్పుడు ఏం ఎల్ సి కొల్లూరి చని పోయి విద్యా రంగానికి లోటు కలిపించారు .శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారి ఆత్మకు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని ప్రకటిస్తున్నాను .కొల్లూరి కుమారులు పత్రిక బాధ్యతను సక్రమంగా నిర్వహించి తెలుగు విద్యార్ధిని వెలుగు విద్యార్ధిగా తీర్చిదిద్దాలనిఆశిస్తున్నాను’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-14-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం

నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు నోరు మూసుకు కూర్చుంటాడు పాపం వాడే పలకరించి మొదలు పెట్టాడు ‘’ప్రజలు ఇంత దారుణం చేస్తారని ఊహించ లేదు బావో ‘’అన్నాడు ఎత్తుకొంటూనే .’’ఏమైందిరా ఏదో కొంపలు మునిగి పోయినట్లు ఆ వెధవ యేడుపేమిటి?’’అన్నాను చిరాగ్గా .’’అదేమిటి? /వందేళ్ళ కాంగ్రెస్ ను ఒక’’ టీ అమ్మే’’ వాడు కూకటి వ్రేళ్ళతో పెకలించి పారేస్తే నీకీమీ చీమ కుట్టినట్లుకూడా  లేదా బావా?’’అన్నాడు .’’ఎవరు తీసుకొన్న గోతిలో వారే పడుతారు అనే సామెత తెలుసా?’’అన్నా .తెలుసు దానికి దీనికీ లంకేంటి ?అన్నాడు .’’అవున్రా రెండేళ్ళ నుంచీ పేపర్లూ చానెళ్ళు నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయికదా కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుందని ,వాళ్ళు చేసిన అక్రమాలూ అవినీతి లంచ గొండితనం కుంభకోణాల బరువు పాపాల పుట్టా అక్రమాల చిట్టాతో నిలువు లోతు గోతిలో పడిపోతారనీ ఎవ్వరూ కాపాడలేరనీ ?’’అన్నాను మండి .’’పాపం బుద్ధి మంతుడిలా తలా తోకా ఆడిస్తూ మౌన పరబ్రహ్మ లా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని నిర్వికార నిరాకార బ్రహ్మలా’’ సోనీ జపం చేస్తూ’’ ఉండే ఆర్ధిక శాస్త్ర వేత్త నాయకత్వానికి ఇంతపరభావమా నేను భరించలేను బావా “?అని ఏడ్చి నంత పని చేశాడు .’’ఒరే బ్రాహ్మీ !పిల్లి కళ్ళు  మూసుకొని పాలు తాగుతుంటే జనం చూడ టం లేదనుకొంటే ఎలా నాయనా “”?అన్నాను .’’ఈ సామేతేమిటో విడమర్చు’’ అన్నాడు .’’అన్ని అక్రమాలు జరుగుతున్నా ద్రుత రాస్త్రుడి లాగా గుడ్డిగా కిమిన్నాస్తి గా ఉండిపోతే ప్రజలు ఎంతకాలం సహిస్తారు?’’అన్నాను .’’అర్ధం కాలా ‘’’’అన్నాడు నోరెళ్ళ బెట్టి  దూర దర్శాన్ యాడ్ లో రైతు భార్యలాగా .’’’’దేశానికి నాయకత్వం వహించే నాయకులే కరువైనారు .సోనియా కరుణా కటాక్షాలు ఇక పని చేయవని అందరికి తెలిసి పోయింది .కనుక ప్రత్యామ్నాయం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు .అవకాశం వచ్చింది .గుద్ది పారేశారు. చెత్తను ఊడ్చేసి అవతలకు తోసేశారు .ప్రజల ఓపికా సహనం కొంతకాలమే .దాటితే కోట్లు ఖర్చు చేసినా ఓట్లు రాలవు .ఇదీ భారత ప్రజాస్వామ్యం లో ఓటరు మహాశయుడు సరైన సమయం లో కొట్టిన చెంప దెబ్బ .’’అన్నాను .’’చెత్తా –ఊడుపు ‘’అన్నావు మరి ఆ చీపురు ఆయనా ఊడ్చుకు పోయాడుగా ?అన్నాడు అవున్రా కేర్జీవాల్ పై ఏదో క్రేజీ ఉందనుకొని భ్రమ పది దిగాడు .దిల్లీలో కాంగ్రెస్ ను అంతకాగి నిప్పులు తొక్కినా కోతిలా రోజుకో మాట మాట్లాడి నమ్మకం పోగొట్టుకొన్నాడు తనకు ఆలిండియా శీను లేదని తెలుసుకో లేక పోయాడా చీపురు కట్టాయన అందుకే దాన్నీ ఆయననూ ఊడ్చిపారేశారు ‘’అన్నాను

‘’సరేకానీ !రాహుల్ ఉన్నాడు ,ప్రియాంకా ఉంది వీళ్ళు కూడా ఏమీ ఊప లేక పోయారేమిటి?’’అన్నాడు ‘’.అవతల వాడు సరైన వ్యూహం తో ,వాగ్దాటితో దేశ ప్రయోజనమే లక్ష్యం గా ,సార్వభౌమాదికారమే ధ్యేయం గా ,పార్టీని ప్రజల్ని ఒప్పించి ప్రేరణ కలిగించి యువతలో ఆశలు కల్గించి ఈ అవినీతి భ్రస్టు కుళ్ళు పట్టిన వ్యవస్థను పునాదులతో సహా కూల్చి పారేస్తేకాని భవిష్యత్తు లేదనే నమ్మకం కలిగించాడు .దాన్ని నమ్మారు అతని సమర్ధతను నమ్మారు అతని వాగ్ధాటికి ముగ్ధులయ్యారు అంతే ఇంక వాళ్ళకేమీ కానీ పించలా .కొండలు దూది పిందేలైపోయాయి. గడ్డిపరకల్లా ఖాదీ షరాబులు ,శాల్తీలు యెగిరి పోయారు .తిరుగు లేని మేజార్టీనిస్తే కాని ఇక లాభం లేదని బి జే పి కే పార్టి మేజార్టీనిచ్చి చరిత్ర సృష్టించారు .ఇది ప్రజా విజయం .నాయక గణ అధికార గర్వ ఖర్వం ‘’అన్నాను .’’బావా !మోడీ పూనిన వాడిలాగా ఆ ప్రవాహ ఝారి ఏమిటి ?నాకే ఆశ్చర్యమేస్తోంది నిన్ను చూస్తుంటే “”అన్నాడు .’’చరిత్ర పునరావ్రుత్తమౌతతుంది అంటారు తెలుసా .ఇందిర ఎమర్జెన్సి పెట్టినప్పుడు ఎందరు పెద్దలు చెప్పినా పేడ చెవిని పెడితే జయ ప్రకాష్ నారాయణ నేతృత్వం లో జనతా పార్టీ ఏర్పడి ఇందిరా గర్వాన్ని నాశనం చేసి ఆసేతు హిమాచలం ఓట్లతో జనతాకు జనతా జనార్దానుడైన జయ ప్రకాష్ కు అధినాయకుడైన మొరార్జీ భాయ్ కి పట్టం కట్టారు .ఇప్పుడూ అదే జరిగింది .మోడీ నే దేశ సంరక్షకుడు అనే నమ్మకమే గెలిపించింది .పార్టీకూడా అతాని అడుగు జాడల్లో నడిచింది.ఆద్వానీ అలిగినా జస్వంత్ బీరాలు పోయినా నితీష్ ‘’ఇష్ ఇష్ ‘’అన్నా లాలూ చేతుల దగ్గరికి కాళ్ళ బేరానికి వెళ్ళినా ఎవరి పప్పులూ ఉడక లేదు . ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ భేదమే కనీ పించలేదు .హిందూత్వం ఆక్రమిస్తుందని గుండెలు బాడుకొన్న కమ్యూనిస్టులకు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ ను రాహుల్ పుట్టిన రోజు కానుకగా ననభై నాలుగు సీట్లకే పరిమితం చేశారు .’’అన్నా.  ‘’బావా ! నీ ఉద్రేకం చూస్తుంటే భయమేస్తోంది .’’అన్నాడు బ్రాహ్మి .

‘’మనరాస్త్రం లో తెలంగాణా ఇచ్చినా కొంప  కోల్లేరయ్యిన్దెం?’’అని వాడి ప్రశ్న .’’పార్టీని కలిపెస్తాడని గులాబీ రంగు ఆయన తో ,పార్టీకి అండగా ఉంటాడని లక్ష కోట్ల అవినీతి ఆయన్ను జైల్లోంచి తప్పించి బెయిలిప్పించి కేసులు మాఫీ ప్రయత్నం చేస్తే జనం గుడ్డిగా నమ్ముతారా ?విభజన ప్రక్రియ సవ్యం గా జరిపించార? తెలుగు రాని’’ చేవటాయల ‘’పెత్తనం తో క్రూరం గా హీనం గా హేయం గా చీల్చి పబ్బం గడుపుకొన్నారు .గులాబీ ఆయన దిల్లీలో గులాబి పూలిచ్చి ఇక్కడికొచ్చి ముళ్ళు గుచ్చాడుకంటిలో .అసలాయన్ను ఆయన భార్యే నమ్మదంటారు మరి కాంగీ అధినాయక గణం యెట్లా నమ్మిందో ?/జగనూ శీను అర్ధం చేసుకొని దూరం గా జరిగి స్వంత బాణీ వాణీ మొగిన్చేసరికి బిత్తర పోయారు .రెండు పక్కలా వాచి పోయింది. ఆంధ్రాలో అడ్రస్ గల్లంతు తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్టా .బీరాలు పలికే రఘు వీరా ,జలయజ్ఞం లో ‘’తెల్ల  పంచ కట్టాయన ‘’కు తోడ్పడి కోట్లు నోక్కేశాడని చెప్పుకొనే పొన్నాల నాయకత్వం పై ప్రజలకు విశ్వాసమే లేదు .పార్టీ గుర్తు తో పోటీచేసి భస్మాసుర హస్తం పెట్టుకొన్నారు .ఆంధ్రాను పునర్నిర్మించే ధైర్యం ఓపికా సాహసం వ్యూహం ఉన్న వాడు చంద్ర బాబే అని నమ్మి ఎక్కించారు అనుమానం  లేకుండా. దీనికి మోడీ ‘’పవనమూ’’తోడైనాయి అని నా జవాబు .. ‘’బావోయ్ !నువ్వు చాలా ఆవేశం గా ఉన్నావ్ అక్కనడిగి .కాస్త మజ్జిగ తెచ్చిస్తా కూల్ బావా కూల్ ‘’అని లోపలి కెళ్ళి వాడూ పుచ్చుకొని నాకూ తెచ్చిచ్చాడు .

‘’ కొత్త ప్రభుత్వాలు ఎలా పని చేస్తున్నాయి బావా ?’’ ‘’ప్రారంభం అదిరింది .మోడీ చాలా హుందాగా ఉన్నాడు సమర్దుల్నే పెట్టుకొన్నాడు .కాని ‘’ముండే ‘’మరణం పార్టీ కి ఇబ్బందే .కెసిఆర్ లో ఉద్రేకం తగ్గలేదు ‘’పందెం కోడి’’ గా వ్యవహరిస్తున్నాడు .ప్రతిదానికీ ‘’లొల్లి ‘’చేయటం ముఖ్య మంత్రికి తగదని పిస్తోంది .బాబు లక్షలాది జనం మధ్యలో ప్రమాణం చేయటం నాకు అంత నచ్చ లేదు .అత్యుత్సాహం అని పించింది .కోడెల సమర్దుడే కాని స్పీకర్ హోదాకు తగిన హుందాతనం ఉన్నవాడని నేననుకోను .నోటి తొందర మనిషి .కాని బుద్ధప్రసాద్  ఆశ్చర్యం గా డిప్యూటీ స్పీకర్ అవటం అందరికీ ఆనందం కలిగించే విషయమే .అజాత శత్రువు గా పేరున్నవాడు .కాని ఆయనకు సాంస్కృతిక రంగం పై అధికారం ఇచ్చి ఉంటె ఇంకా బాగుండేది .ఆయన తెలుగు దేశం లో చేరిన రాత్రి నేను ఫోన్ చేసి అభినందించి త్వరలో మంత్రి కావాలని కోరుకొంటున్నానని చెప్పాను. మళ్ళీ డిప్యూటీ అయిన రోజు ఫోన్ చేసి అభినందించి నేను అనుకొన్నది జరిగింది అన్నాను నవ్వుతూ నిజమే నన్నారు .’’

‘’డబ్బా ఆపి భవిషత్ గురించి చెప్పు బా ‘’అన్నాడు .’’ఏముందిరా .మోడీ అయినా బాబైనా గులాబీ ఆయన అయినా ప్రతి అడుగు జాగ్రత్త గా వేయాలి .అఫెన్స్ లో ఉండాలేకాని డిఫెన్స్ లో పడరాదు ‘’అనగానే ‘’అంటే’’అన్నాడు .’’బడ్జెట్ ముందే రైలు చార్జీలు భారీగా పెంచటం మంచిదికాదు .దీని వల్ల మోడీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది .అది సత్ సాంప్రదాయం కాదు .కొంత సమయం తీసుకొని ఉండటమో కొద్దిగా పెంచట మో  చేసి ఉండాల్సింది .’’అనగానే ‘’నల్ల ధనం మాట ఏమిటి బా ?’’అన్నాడు .’’అది ‘’అంత వీజీ ‘’కాదు .వాగ్దానాలకు ఆచరణకూ ఎప్పుడూ అంతరం ఉంటుందని గుర్తించాలి .’’అన్నాను .’’రుణ మాఫీ’’? మళ్ళీ ప్రశ్న ‘’తప్పక చేయాల్సిన అంశమే దీనికి బ్యాంకులు కేంద్రమూ పూర్తిగా సహకరించాలి .అప్పుడే సాధ్యం .’’అన్నాను .’’జగన్ భవిష్యత్తు ‘’?అడిగాడు .’’మంత్రి వర్గ ఉప సంఘం వేశారు కేసులు మళ్ళీ తెరుస్తారు .పాపం హైదరాబాద్ రావాలన్నా బెజవాడ రావాలన్నా కోర్టు పర్మిషన్ తప్పదేమో .అదీగాక ‘’అదిగో వచ్చేస్తున్నాడు ‘’అని చర్లపల్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారని చానెళ్ళలో పత్రికలలో కార్టూన్లు కూడా చూశాం కదా ‘’అన్నాను .’’చెప్పులాయన సంగతి ?’’అని అనుబంధ ప్రశ్న .’’పాపం మునిగాడు ముంచారు కూడా పార్టీ వాళ్ళు .ప్పుడు ఏ పార్టీ చెప్పులూ లేకుండా తిరుగుతున్నాడు  ‘’సుప్రీం కోర్టులో  విభజన పై కేసు ?’’ఇంకో లకోటా .’’కేసు అయితే వేశారు కాని డబ్బులు పెట్టి ఎవరు కేసును ముందుకు నడిపిస్తారో తెలియటం లేదు .జరగాల్సిన విభజన అయ్యే పోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు .దీన్ని మళ్ళీ చుట్ట చుట్టేయటం సాధ్యమా ‘అని పిస్తుంది చూద్దాం కాలమే తేల్చాలి దీన్ని ‘’అన్నాను.

‘’ ఇటలీయమ్మ’’ సంగతి ?మరో ప్రశ్న .బి జెపి ,టిడిపి జాగ్రత్తగా పని చేస్తే కాంగీని,సోనియాను అటు దేశం లోను ఇటు రాష్ట్రం లోను మార్చే పోతారు .కాంగ్రెస్ కు తులసి తీర్దానికి స్టేజి దాటి పోయింది .  తమిళనాడు ,బెంగాల్ లాగా ఆంధ్రా లోను అడ్రస్ ఉండదు .కాని అంత జాగ్రత్తగా ఉంటారా అని అనుమానం .ఆద్వానిజీ కి రాష్ట్రపతి యోగం ఉంది .దానికింకా టైం ఉంది .అది దక్కితే సమస్యలుండవు .ఇక్కడ కాన్గీకి జగనే గతి .వదిలి పోయిన వారు పోగా మిగిలిన వారిని సోనియా ఇవాళ కాక పొతే రేపు లాగేసు కొంటుంది .అప్పుడే దానికిక్కడ గతి .కమ్మీలు ఇక ప్రజా జీవితం లో చెల్లు బడి కారు .’’.చిరు విషయం ‘’అన్నాడు .’’తనను బల వంతం గా కాన్గీలో కలిపేసుకొన్నందుకు ‘’టిట్ ఫర్ టాట్’’గా దగ్గరుండి ప్రచారం చేసి మరీ ఓడించానని స్వగతం చెప్పుకొంటున్నాడని విన్నాను. అదీ నిజమేనేమో నని పించింది ‘’.  అనగానే బ్రాహ్మి బుర్ర వేడెక్కి లోపలి కెళ్ళి చెంబేడు ఐసు నీళ్ళు తాగి నాకు కనపడకుండా అదే పోత పోయి జంప్ జిలానీ అయ్యాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ 

తెలుగు విద్యార్ధి సంపాదకులు ,మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ DSCN0012 DSCN0013 DSCN0014 DSCN0015 DSCN0016 DSCN0017 DSCN0018 DSCN0019 DSCN0020 DSCN0021 DSCN0022 DSCN0023

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు సుభాష్ చంద్రారెడ్డి. హైదరాబాద్, దాని పరిసరాల్లో రోజు రోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంచడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను కట్టే పనికి పూనుకున్నారు. ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్, నిఫ్ట్ వంటి చోట్ల వీటిని నిర్మించి అక్కడి నీటి కొరతను గణనీయంగా తగ్గించారు. సిటీలో పలుచోట్ల తవ్వేసిన బోర్‌వెల్స్ నిరుపయోగంగా ఉండడం చూసి వాటిని ఎలాగైనా వినియోగంలోకి తెచ్చి భూగర్భజలాల మట్టాన్ని పెంచాలనే తపనతో ఈ పనికి పూనుకున్నారాయన. ప్రధానంగా హైదరాబాదు, దాని పరిసరాలలో ‘ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్’ పద్ధతి ద్వారా భూగర్భజలాలను పెంచడంలో ఆయన కృషి ఆదర్శనీయం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా.

‘మాది హైదరాబాదే. నేను బి.ఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సు చేశాను. ప్రభుత్వోద్యోగిని. మట్టి అన్నా, నీరు అన్నా నాకున్న ఆసక్తే వాటి పరిరక్షణపై పనిచేయాలనే ఆలోచనను నాలో రేపింది. నీటిని, మట్టిని సరిగా సంరక్షించుకున్నప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని,అప్పుడే మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలడని నేను నమ్ముతాను. కానీ దురదృష్టమేమిటంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండిట్లోనూ ఈ రెండు సహజవనరులూ అత్యధికంగా దుర్వినియోగానికి, దోపిడీకి గురవుతున్నాయి.
కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా. అందుకే పూర్వంలా భూమిలో నీళ్లు పుష్కలంగా ఉన్నట్టు జలవనరులను సమృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ దోహదంచేస్తుందని భావించాను. సిటీలో నిరుపయోగంగా పడి ఉన్న ఎన్నో బోర్‌వెల్స్‌ని సైతం దీని ద్వారా ఉపయోగించుకోగలిగితే భూగర్భ నీటి మట్టాన్నిపెంచగలగడమే కాదు నీటి లోటును సులభంగా అధిగమించవచ్చు అన్నది నా గాఢాభిప్రాయం.
ఇందుకోసం ‘స్మరణ్ ‘అనే స్వచ్ఛందసంస్థను ఏర్పాటుచేశాను. మేం చేపట్టిన పని ఎంతో బృహత్తరమైంది. ప్రభుత్వ సహాయసహకారాలు లేకుండా ఈ పని చేయడం అంత సులువేం కాదు. ముఖ్యంగా హైదరాబాదులో ఈ పనికి జిహెచ్ఎంసి, వాటర్‌వర్క్స్ వంటి విభాగాల తోడ్పాటు కావాలి. అప్పుడు సిటీలో భూగర్భ జలవనరులను వృద్ధిచేయడంలో వండర్స్ సృష్టించవచ్చు. ప్రస్తుతం మా స్వచ్ఛందసంస్థ ద్వారా నగరంలోని వివిధ అపార్ట్‌మెంట్లలో, పెద్ద పెద్ద కార్పొరేట్, విద్యాసంస్థల్లో, హాస్పిటల్స్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను చేపట్టాము. ఇప్పటి దాకా సిటీలో దాదాపు 40 చోట్ల ఈ పని చేశాం.ఈ స్ట్రక్చర్లు వేసిన చోట మాత్రమే కాకుండా దాని పరిసరాల్లో కూడా భూగర్భజలాల స్థాయి పెరిగింది.

హైదరాబాదులో అయితే ప్రస్తుతం 1000 అడుగుల నుంచి 1500-2000 అడుగుల దాకా బోర్ తవ్వితే గానీ నీళ్లు పడని పరిస్థితి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలామందికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి అవగాహన లేదు. నిజానికి ఇళ్లు, ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్‌సంస్థలు ఏవైనా సరే కట్టేటప్పుడే ఇన్‌వర్స్ బోర్‌వెల్ (ఐnఠ్ఛిటట్ఛ ఆౌట్ఛఠ్ఛీజూజూ) రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మించుకోగలిగితే నీటి కొరత సమస్య ఎదురవదు. పర్యావరణం దెబ్బతినదు. ఖర్చు తక్కువ అవుతుంది. ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాదులో 90 శాతం వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లో కలిసిపోతోంది లేదా రోడ్డు మీదకొచ్చేసి నిలిచిపోయి వృథా అయిపోతున్నాయి.
మేం విజయవంతంగా చేసిన ప్రాజెక్టుల్లో మాదాపూర్‌లోని నిఫ్ట్్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఒకటి. అక్కడ ఇన్వర్స్ బోర్‌వెల్ మెథడ్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిలో నాలుగు బోర్లు ఏర్పరిచాం. అక్కడ ఒకప్పుడు రోజుకు 15 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు నీటి ట్యాంకర్ల అవసరమే లేని క్యాంపస్‌గా అది నిలిచింది. మరొకటి నేచర్ క్యూర్ హాస్పిటల్. అక్కడ నిత్యం జరిగే రకరకాల చికిత్సలకు బోలెడు నీరు అవసరం. వాళ్లు కూడా ఈ పద్ధతిని చేపట్టక ముందు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు నీటి ట్యాంకర్లతో పనిలేకుండా తమ చికిత్సలను వాళ్లు నిరాటంకంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే సెయింట్ థెరిస్సా స్కూల్‌లో ఇన్వర్స్ బోర్‌వెల్ పద్ధతిలో రెండు బోర్‌వెల్స్ , 13 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించాం. ఈ పద్ధతి ద్వారా సిటీలో ఎండిపోయిన బోర్లన్నింటినీ ఎంతో ఉపయోగకరంగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా గచ్చిబౌలి, నిజాంపేట, మణికొండ, మియాపూర్‌లలో కూడా మేం కొన్ని వర్క్సు చేశాం. ఈ పద్ధతి ద్వారా నూరు శాతం భూగర్భ జలాల పెరుగుదల సాధించవచ్చు. హైదరాబాద్‌లో ఉన్నది ప్రధానంగా రాతినేల. ఇలాంటి చోట సాధారణ రీఛార్జ్ పిట్స్ వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువగా ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఈ పద్ధతిలో పిట్ ఒక్కటే కాకుండా బోర్‌వెల్ కూడా ఉంటుంది. ఇక్కడది రాతి నేల కావడంతో ఈ పద్ధతి సరైంది. అంతేకాదు పిట్స్ ద్వారా అయితే పరిమిత ప్రయోజనం ఉంటుంది. కానీ ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ విధానంలో బోర్‌వెల్ కూడా కలగలిసి ఉండడంతో ప్రయోజనాలు కూడా ఎక్కువే.

ఈ విధానం ద్వారా రూఫ్‌టాప్ ఏరియాలోని వర్షపు నీరుని రెయిన్ వాటర్ అవుట్‌లెట్స్ ద్వారా హార్వెస్టింగ్ పిట్‌లోకి వదలాలి. వర్షపు నీటిలో ఎలాంటి దుమ్ము ధూళి రాకుండా ఫిల్టర్ చేసే సిల్ట్ ట్రాప్స్ కూడా ఉంటాయి. అలా శుభ్రమైన వర్షపు నీరు బోర్ ద్వారా భూగర్భ జలాలలో ఇంకుతాయి. ఈ విధానం మొత్తం ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో చేస్తారు. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉన్నచోటే కాకుండా చుట్టుపక్కల భూగర్భజల నీటిమట్టం కూడా దీనివల్ల పెరుగుతుంది. వర్షపు నీరు వృధా అవడమంటే మానవజీవనానికే ప్రమాదం. నీటిమట్టం నిలకడమీదే మన ఉనికి కూడా నిలబడి ఉంటుంది…’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెనె సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.

స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.

తెలుగు కథా సంవిధానంలో సాధారణీకరింపబడిన యితివృత్తాల చిత్రణ చాలా ప్రధానభాగం ఆక్రమించినప్పటికీ, ప్రాంతీయ కథ కూడ, తెలుగు భౌగోళిక ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జీవన చిత్రాల వైవిధ్యాన్ని చిత్రించడం ద్వారా తనదైన ముద్ర వేయగల్గింది. ప్రాంతాల యాసలు, పలుకుబడులు, ఆచార వ్యవహారాలు పరిచయం చేయడం ద్వారా ప్రాంతీయ సంస్కృతి ఆవిష్కరింపబడింది. ప్రాంతీయ జీవితాలు, సమస్యలు, సంక్లిష్టతలు పాఠకులకు అందించడం ద్వారా ప్రాంతీయ అస్తిత్వ చింతనకు ఆలంబనగా మారింది. ప్రాంతీయ జీవితంలో ఖాళీలను చూపి, వాటి భర్తీకి వుద్యమాల్ని పురిగొల్పింది.

ఇది నాణానికి ఒకవైపు చిత్రం -వైవిధ్యత. రెండోవైపు చిత్రం – వైరుధ్యం. ఒక ప్రాంత సాహిత్యం తన ప్రాంత విశిష్టతను చిత్రించే క్రమంలో అది సమగ్రంగా చిత్రింపబడుతుం దా? కనిపించే దృశ్యానికి కనిపించని కారణాల్ని ఎత్తిపడుతుందా? వైవిధ్యతలోని గాఢతను అంతే స్పష్టంగా పట్టుకుంటుందా? చాలాసందర్భాల్లో వీటికిఆశావహ సమాధానాలు లభిం చవు – అదే వైరుధ్యం. ఈ విషయాన్ని రాయలసీమ వైపు నుంచీ చూసే ప్రయత్నమిది.

రాయలసీమ గురించి మొదటి కథ రాయలసీమకు బయటి రచయిత నుంచీ రావడమే పెద్ద వైరుధ్యం. చింతాదీక్షితులు ‘సుగాలీ కుటుంబం’ (1921) కథలో కరువు పీడిత జీవితాన్ని చిత్రించడం, ఆ తర్వాత ఆయనే ‘చెంచురాణీ’, ‘దాసరి పాట’ లాంటి కథలు రాయడం ద్వారా రాయలసీమ యితివృత్తాలను కథలుగా మలచడం ప్రారంభమైంది. ఆ తర్వాత యిరవైయేండ్లకు జి.రామకృష్ణ ‘చిరంజీవి’, ‘గంజి కోసరం’, కె.సభా ‘కడగండ్లు’ కథలు రాయలసీమలోని కరువునూ, ఫ్యూడలిజాన్ని చిత్రించాయి. ఆధునిక తెలుగు తొలి కథ సంస్కరణను (దిద్దుబాటు, స్త్రీ విద్య) చిత్రిస్తే, ఆధునిక రాయలసీమ కథ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ప్రాంతీయ దుఃఖాన్ని ఆలపించింది. జి.రామకృష్ణ/సభా ల నుండి యిటీవలి దేవేంద్రాచారి/వేంపల్లి షరీఫ్‌ల దాకా మంచి కథలు రాసారనిపించుకున్న సీమ కథా రచయితలందరూ, సాధారణాంశాలపై కథలు రాస్తూనే, ప్రధానంగా ప్రాంతీయ జీవిత దుఃఖ దృశ్యాల్ని పట్టి పట్టి చూపిస్తున్నారు, రాయలసీమ వైవిధ్యత, కరువూ (నీళ్ళు లేనితనమూ, వానలు రానితనమూ) ఫ్యాక్షన్ ఆవేశకావేశాల (ఫ్యూడల్ అవశేషం)ను చిత్రించడంగా చరిత్రలో మిగిలింది.

ఆర్థిక కారణాల వల్లనే రాయలసీమలో ఆధునిక తెలుగు కథ ఆలస్యంగా వచ్చిందని కొందరంటారు గానీ, అదే నిజమైతే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమైనా, దిద్దుబాటు అక్కడే ప్రారంభమైంది. వెనుకబాటుతనాన్ని గుర్తించే పౌరసమాజం వుద్భవిస్తేనే అది సాహిత్యంలోకి వస్తుంది. అది తెలంగాణ లాగా విముక్తికి బాటలు వేస్తుంది. ఇది రాయలసీమలో పాడిన పాట పాడిన దగ్గరే పాడుకుంటోంది. ‘గంజికోసరం’ ప్రత్యక్షంగా కరువును చిత్రించిన కథ. చిరంజీవులు, కడగండ్లు ఫ్యూడలిజాన్ని చిత్రించిన కథలు. అయితే, 1960ల కాలానికి సింగమనేని, ఒక అడుగు ముందుకు వేసి, ‘జూదం’ -రైతుకు గిట్టుబాటు లభించకపోవడం, ‘ఊబి’ -బావుల సేద్యం పోయి బోర్ల సేద్యం రావడం, ‘అడుసు’ -రైతుదళారుల చేతుల్లో మోసపోవడం దాకా పరిణమించడం కనిపిస్తుంది. నీళ్లు, వానరాలే, సావునీళ్లు, వ్యసనం, ఒక్క వాన చాలు, ఇలాంటి కథలన్ని రాయలసీమ మీద ప్రకృతి పగబూనడం యితివృత్తంగా వచ్చినవే. సింగమనేని ‘అగాధం’ కథ వుద్యమిస్తున్న రైతును చిత్రించిన కథ. ఆ తర్వాత మన్ను తిన్న మనిషి ప్రయాణం ‘అగాధం’ మీదుగా ‘తెల్లదయ్యం’, ‘రంకె’ కథా మార్గంలో సాగాల్సింది. అయితే అలా జరగలేదు. ఇది రాయలసీమ కరువు కథా సంవిధానంలోని వైరుధ్యం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి సంవత్సరం అత్యధిక ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించబడుతూవుంది. యిటీవలి కాలంలో యీ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో లేటెస్ట్ మోడల్ కార్లు కూడ విపరీతంగా సంచరిస్తున్నాయి. ఎండమావుల్లో తిమింగలాలవేట (సభా) కథ కరువులో మత్స్యకారులకు వలలకోసం, చేపల చెరువుల కోసం ఆర్థిక సహాయం మంజూరీలో మంత్రిగారి అవినీతిని చెప్పిన కథ. ఇటీవలి కాలంలో కరువెవరికి కథలో మూడు వర్గాల- అగ్రవర్ణ, వెనుకబడిన, దళిత స్త్రీల జీవితాలు కరువులో ఎలా వున్నాయో చిత్రింపబడింది. ఇలాంటి కథలు యింకా ఎన్నో వచ్చి వుండాల్సింది. భౌతిక దృష్టికి కరువు గురించి అద్భుత వైరుధ్యాన్ని పట్టిచ్చే యిట్లాంటి కథలు రాయలసీమ నుంచీ ఎక్కువగా రాకపోవడం ఒక పెద్ద వైరుధ్యం.

నీళ్లు లేకపోవడమంటే నాగరికత లేకపోవడం, భాషా సంస్కృతులూ ఆహారపు అలవాట్లూ చాలా తేడాగా వుండటం. సభా ‘పాతాళగంగ’లో నీళ్లు సాధనకు బేటప్ప పడే కష్టాల నుండి రైతుల వీపుల మీద పుట్టిన కరువు రాచపుండ్లను మాన్పేందుకు నీళ్లను తోలుకొచ్చే అపర భగీరథులను కలగనే విశ్వనాధరెడ్డి ‘పొడినిజం’ దాకా పొలాలకు నీళ్లు అందని తనాల్ని చిత్రించినంతగా మనిషిగొంతులోకి నీళ్లు దిగనితనాల్ని చిత్రించలేదనిపిస్తుంది. రాయలసీమలో కారం ఎందుకు ఎక్కువగా తింటారూ, కారానికీ కరువుకీ సంబంధమేమిటి? రాయలసీమ ఆహారపు అలవాట్లను చిత్రించిన కథల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇటీవలి ‘గాయాలు’ కథలో జొన్న రొట్టె చేయడాన్నీ, తినడాన్నీ ఒక ఆత్మగౌరవ విషయంగా చిత్రించడాన్ని చూస్తాము.
స్రీ రచయితలు అంతగా లేని రాయలసీమలో పురుష రచయితలే, స్త్రీల మీద కరువు చూపే ప్రభావాన్ని చిత్రించారు. నామిని కథల్లో కరువు అనే మాటే లేకుండా, కరువు చేసే విధ్వంసం కరుణ రస్రార్దంగా చిత్రితమైంది. చక్రవేణు ‘కసాయి కరువూ’, ‘కువైట్ సావిత్రమ్మా’, స్వామి ‘బతుకు వూబి’ కథల్లో జీవిత విధ్వంసం అన్ని రూపాల్లోనూ కన్పిస్తుంది. రాయలసీమ స్త్రీ రచయితలు, నిర్మలరాణి ‘గాజుకళ్ళు’ సుభాషిణి ‘కరువెవరికీ’ కథల్లో స్త్రీ వేదన ప్రతిభావంతంగా చిత్రితమైంది. తక్కువగా వచ్చినా రాయలసీమ కథల్లో స్త్రీ కోణం వైవిధ్యంగా కనబడుతుంది.

రాయలసీమలో ఫ్యాక్షన్, గ్రామాల్లో ఆవేశకావేషాలతో ఉద్రిక్త పరిస్థితిగా (కూలిన బురుజు) మొదలై, ఆ ఉద్రిక్తతలో నలిగిపోయేది చిన్నా బన్నా కులాలేనని (ఎలిగే పెద్దోల్లు-నలిగే చిన్నోల్లు) గ్రామాల్లో వుపాధి లేని కూలీలు ఆ ఫ్యాక్షన్‌లోకి అనివార్యంగా నడిచిపోతున్నారనీ (నడక), ఫ్యాక్షనిస్టుల అధికార సోపానాలకు నిచ్చెనలుగా (నిచ్చెన) వుపయోగపడుతూ, కుటుంబాలలోని స్త్రీలను పిల్లలనూ అభద్రతకు (కన్నీటి కత్తి) గురిచేస్తున్నారనీ, ఇది ఫ్యాక్షనిస్టుల కుటుంబాలలోని, స్త్రీలకైనా తప్పడం లేదనీ(చుక్క పొడిచింది, ఒక వేకువలోకి) కథలు చిత్రించాయి. ప్రభుత్వాలు ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు బదులు, వాళ్ల చేతుల్లోని ఆయుధాల్లాంటి అనుచరులను ఎన్‌కౌంటర్ల (పడగనీడ) రూపంలో నిర్మూలిస్తే, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులుగా మారి రాజధాని నగరాల్లో, దందాలూ/పంచాయితీలూ/భూ ఆక్రమణలూ కొనసాగించేందుకు రూపం మార్చుకోవడం, గ్రామాల్లోని కూలీలు కరువు వల్లనో, ఫ్యాక్షన్‌కు దూరంగా వుందామనో, గిట్టుబాటైన కూలీ దొరకుతుందనో, నగరాలకు వలస వస్తే, రూపం మారిన ఫ్యాక్షనిస్టుల చేతుల్లోకి మళ్లీ చేరి ‘లుంగీలోల్లు’గా ముద్ర వేసుకోవడం చూసాం. ఫ్యాక్షన్ ఎన్‌కౌంటర్ల దాకా కథగా మారిన చరిత్ర చివరి అంకంలో ‘లుంగీలోల్లు’గా ముద్ర పడడాన్ని మాత్రం ‘కథ’గా మార్చలేకపోయింది.

రాయలసీమ కథ వ్యవసాయాన్ని పట్టించుకుంది. వ్యవసాయం చుట్టు వున్న జీవితాన్నీ ఘర్షణనీ పట్టించుకుంది. అయితే ఆ పట్టించుకోవడం కూడ ఫిర్యాదు స్థాయి మించి ఎదగలేదనే, కారణాల విశ్లేషణ చేయలేదనే విమర్శకులు వున్నారు. అందులో నిజం కొంత వుండచ్చు. కరువూ ఫ్యాక్షన్ విరూపాల విశ్లేషణ విశ్వనాధరెడ్డి నుండి సన్నపురెడ్డి దాకా కథకులు కొంతైనా చేసి వుండొచ్చు. అయితే అదే పండని నేల కింద, తవ్వుకునే వాళ్ల, పంటలు పండిస్తున్న ముడిఖనిజాల మైనింగ్ గురించి కథలు అసలు రాలేదంటే, అందరూ అంగీకరించాల్సిందే. రాయలసీమ అంతటా గ్రానైట్, బాక్సైట్, బైరటీస్ ఐరన్, లైమ్‌స్టోన్ లాంటి విలువైన ముడిఖనిజాల అక్రమ/సక్రమ మైనింగ్ చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మైనింగ్‌లో జీవితమేమిటి ఘర్షణ ఏమిటి? అనేది యే మాత్రమూ చిత్రింపబడలేదు. లక్షల కోట్ల ముడిఖనిజం సీమ దాటిపోతుంటే ఒక్క కథా రాకపోవడం పౌరసమాజపు విస్మృతిని సూచిస్తుంది. కరువు నేలలో సంపద పోగుపడుతోంటే ఆ విరోధాబాసను పట్టుకోలేకపోవడం గొప్ప వైరుధ్యం.
అలాగే పర్యావరణ స్పృహ గురించిన కథలు కూడా అంతగా కన్పించవు. ‘కొమ్మిపూలు’ ‘సావునీళ్ళు’ కథల్లో పర్యావరణమ్మీద స్పృహ రేఖామాత్రంగా కన్పించినా, కరువుతో అంతస్సంబంధమున్న, చెట్లు లేమిని, అటవీ విధ్వంసాన్నీ చిత్రించడం, రాయలసీమ కథలో కన్పించదు. ఇటీవలి కాలంలో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుంటే…. యీ కథల ఆవశ్యకత స్పష్టంగా కన్పిస్తుంది.

నమ్ముకున్న నేలమీద కరువు నృత్యం చేస్తుంటే, అదే నేలమీద సిమెంట్ ఫ్యాక్టరీలు పుట్టుకొస్తుంటే, నేలను నమ్ముకున్న మనుషులే ఆ ఫ్యాక్టరీల్లోకి కూలీలుగా పోవడాన్ని, సిమెంట్ ఫ్యాక్టరీలవల్ల నేలతో తెగుతున్న వ్యవసాయ బంధాల గురించి, కడప కథా, బాగా నడుస్తున్న పేపర్ మిల్లు ఒక వ్యక్తి అత్యాశ వల్లా, కుట్ర వల్లా మూతబడే కాలానికి అందులోని కార్మికుడు కిరాయి హంతకుడిగా పరిణమించడాన్ని గురించి (పడగనీడ) కర్నూలు కథా, పట్టణీకరణ చెందుతున్న చిన్నగరంలోని చిన్న జీవితాల గురించి (రెండేళ్ల పద్నాలుగు) తిరుపతి కథా, యివీ రాయలసీమలో వేళ్లూనుకుంటున్న ఫాక్టరీల గురించీ, కార్మికుల స్థితిగతుల గురించీ, పట్టణీకరణ గురించీ, రేఖామాత్రంగానైన చిత్రించిన కథలు. వీటినిదాటి రాయలసీమ వర్తమానం రోడ్ల విస్తరణగా, రియల్ ఎస్టేట్ విస్తరణగా, పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్‌గా, అక్రమ మైనింగ్ స్మగ్లింగ్‌గా యింకా యిలాంటి ఎన్నో కొత్త విషయాల మీదుగా దూసుకుపోతున్నది. యీ విషయాల మీద రచయితలు దృష్టి పెట్టాల్సివుంది.

స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.

నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.

-జి.వెంకటకృష్ణ
(మే 31-జూన్ 1లలో కర్నూలు కథాసమయం నిర్వహించిన కథకుల సమావేశంలో చేసిన ప్రసంగానికి వ్యాసరూపం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4

బ్రాహ్మణాలలో రాజులు

మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన సమాధానం చెప్పారు కాని రాజు సంతృప్తి చెందలేదు .కానిముగ్గురిలో యాజ్న్య వల్క్యుడు చర్చను బాగా నిర్వహించినందుకు వెయ్యి గోవులను బహుమానం గా ఇచ్చాడు .కాని ‘’అగ్ని హోత్ర తత్త్వం యాజ్న్య వల్కుడికీ సరిగ్గా బోధ పడలేదు ‘’అని చెప్పి సభ చాలించేశాడు జనకుడు .మిగిలిన ఇద్దరు ఋషులు జనకుడు పరి పూర్ణ జ్ఞానం తో తమను నిరుత్తరుల్ని చేశాడనుకొన్నారు .దీనికి ప్రతీకారం చేయాలని ఆలోచించి జనకు డిని బ్రహ్మ తత్వ విచారం లోకి   దించాలను కొంటే యాజ్న్య వల్క్యుడు ఒప్పుకో లేదు  .జనకునితో వాదానికి దిగి గెలిచినా ఓడినా తమకే అవమానం అన్నాడు .అగ్ని హోత్రం  నిజ విజ్ఞానాన్ని జిజ్ఞాస తో ఒంటరిగా తెలుసుకొని జనకునికి వివరించి విజయం సాధించాడు .మహా రాజైన జనకుడు ఎంత తత్వ వివేక సంపంన్నుడో మనకు తెలుస్తుంది ..జనకుడు సత్యకామ జాబాలి కి ముఖ్య శిష్యుడు .

వ్రతర్దనుడు అనే రాజు యజ్న విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రాహ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్దరు క్షత్రియులతో వాదం చేసినట్లు ఛాందోగ్యం చెబుతోంది .దాల్భ్యుని సోదరులు బక దాల్భ్యుడు జైమినీయ బ్రాహ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రాహ్మణం లోను  కనిపిస్తారు.ఈ ముగ్గురి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే  కౌరవ రాజు సోదరి .తండ్రి శాతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రాహ్మణం లో ఉన్నది .

ద్రుపద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు ‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తోంది .ద్రౌపదికి యాజ్ఞా సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్నులే ,కేశి దాల్భ్యుని సమకాలికులే .జీవల చైతకి ,ప్రాచీన శాల ,ఔపమన్యువు ,సత్య యజ్న పౌలుషి ,బుడిలఅశ్వత రాశ్వి మొదలైన క్షత్రియులు ఉద్దాలక ఆరుణి తో చర్చ చేసినట్లు చాన్దోగ్యమే చెప్పింది .జీవాల కారి ,ఆశాఢ సావయసుడు ,అనే ఇద్దరు క్షత్రియులగురించి కూడా జైమిని బ్రాహ్మణం లో ఉంది .జనక మహా రాజు సమకాలికులైన బార్కు వార్షుడు ,ప్రియ జాన శ్రుతేయుడు ,ల విషయం కూడా ఇందులోనే కనిపిస్తోంది .సుదక్షిణ క్డైమిఅన్న క్షత్రియుడు జనకుని తో ‘’స్తోమ ‘’శబ్దార్ధాన్ని చర్చిన్చాడని తెలుస్తోంది .

కౌశీతకీ ,జైమిని బ్రాహ్మణాలలో కోసల రాజు బ్రహ్మ దత్త ప్రాసేన జితుడి సమకాలికులైన హిరణ్మయ కుషణుడు ,ఇటన్  కావ్యుడు బ్రహ్మ దత్త చైకితానుల గురించి ఉన్నది .పర ఆహ్నర అనే కోసల రాజు ను గురించి,సమీస్వాహుడు అనే మరొక రాజు గురించి  తాండ్య బ్రాహ్మణం  ,శత పదాలలో ఉన్నది .’’సులభా ‘’అనే క్షత్రియ స్త్రీ జనక మహా రాజు తో ఆధ్యాత్మిక విషయ చర్చ చేసి నట్లు కనిపిస్తోంది ఈమె మైత్రేయి కావచ్చు .ఈమె పేర ‘’సౌలభ బ్రాహ్మణం ‘’ఉండేది అని కాశికా వ్రుత్తి లో చెప్ప బడింది కాని కాలం లో కలిసి పోయి కని పించ లేదు .వీరందరి గురించి తెలియ జెప్పిన బ్రాహ్మణాలు వీరిని  ‘’బ్రాహ్మణులు ‘’అని శ్రేష్ట వాచకం తో పేర్కొనటం వారికి ఉన్న ఆధ్యాత్మిక ప్రావీణ్యానికి ,సంఘం లో వారి పలుకు బడికి ,ప్రతిస్థ కు నిదర్శనం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ గబ్బిట వెంకట రావు (పౌరాణిక నాటక సినీ రచయిత-చెన్నై ))గారి మనవడి వివాహము

మాకు ఉన్న ఒకే ఒక్క జ్ఞాతి స్వర్గీయ గబ్బిట వెంకట రావు( పౌరాణిక నాటక ,సినీ రచయిత-చెన్నై ),కుమారుడు గబ్బిట మధుమోహన్ (చెన్నై)రెండవ కుమారుడుఛి సాయిరాం వివాహం విజయవాడ లో 22-6-14 ఆదివారం జరిగిన సందర్భం గా ఫోటో గాలెరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

 
తెలంగాణ కవులు, రచయితలకి మనవి : 

మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అయితే అశేషంగా ఉన్న మన కవుల/రచయితల పుస్తకాలని సేకరించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడం వలన మీ తోడ్పాటు ని కూడా అర్థిస్తున్నాను. దయచేసి సహకరించండి. 
                           నాకు పంపిన వారందరి బయో డేటాలని మీ ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు బ్లాగ్ లో అప్ డేట్ చేయడం జరుగుతుంది. అలా ఆన్ లైన్ లో మన తెలంగాణా కవుల/రచయితల సమగ్ర సమాచారం శాశ్వతం చేయబడుతుంది. కావున తెలంగాణాలోని  అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని పంపవలసిందిగా కోరుతున్నాను. 

గమనిక : ఈ మహాకార్యానికి కేవలం రచయితలే కాకుండా ఔత్సాహికులైన తెలంగాణా సాహితీ అభిమానులు కూడా స్పందించవచ్చు.మీ దగ్గరున్న ఏ తెలంగాణా కవి/రచయిత  రచించిన పుస్తకమున్నా వెంటనే నాకు పంపండి. ఒక పుస్తకం మొదలు మీకు వీలైనన్నీ పుస్తకాలు పాతవైనా , కొత్తవైనా మంచి కండిషన్ లో ఉంటే వెంటనే నాకు బుక్ పోస్ట్ చేయండి.(బుక్ పోస్ట్ కి పోస్టల్ చార్జీ చాలా తక్కువగా ఉంటుంది.)తెలంగాణా సాహితీ పరిరక్షణలో పాలుపంచుకోండి. నాకు పంపించిన వారందరి వివరాలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా  http://telanganaliterature.blogspot.in/ బ్లాగ్ లో పొందుపరచడం జరుగుతుంది. 

పుస్తకాలు పంపవలసిన నా చిరునామా : 
బొడ్డు మహేందర్, 
ఇంటి నంబర్ 2-26,
ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం , 
ఆదిలాబాద్ జిల్లా – 504201 
ఫోన్ : 9963427242

 
 
 
 
 
Boddu Mahender

chennur, Adilabad dist
Telugu Rakshana Vedika Secretary
ph: 9963427242
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కొల్లూరి కి శ్రద్ధాంజలి

       స్వర్గీయ కొల్లూరికి శ్రద్ధాంజలి గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమం
  విద్యారంగ అభి వృద్ధికి అవిరళ కృషి చేసి ,ఉపాధ్యాయ ,అధ్యాపక సమస్యా పరిష్కారాలకు  నాయకత్వం వహించి ,విద్యార్ధి దశలోనే ”తెలుగు విద్యార్ధి ”మాసపత్రికను స్థాపించి 61సంవత్సరాలుగా నిర్వహిస్తూ ,ఆంద్ర విశ్వ విద్యాలయం కు సెనేట్ సభ్యునిగా ,ఉపాధ్యాక నియోజక వర్గానికి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యునిగా 16ఏళ్ళు కృషి చేసి ,అందరికి మిత్రుడుగా మెలగుతూ ఉన్న శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు  19-6-14న మరణించిన సందర్భం గా సరస భారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ   కొల్లూరికి కి శ్రద్ధాంజలి  ఘటించ టానికి ఈ రోజు 23-6-14 సోమవారం ప్రత్యెక కార్యక్రమాన్ని స్థానిక ఎ .సి లైబ్రరి లో సాయంత్రం 6గం లకు నిర్వ హిస్తోంది .ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు సాహిత్యాభిమానులు పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి
   జోశ్యుల శ్యామలా దేవి -మాదిరాజు శివ లక్ష్మి -జి వి రమణ -గబ్బిట  దుర్గా ప్రసాద్
   గౌరవాధ్యక్షులు               కార్య దర్శి           కోశాధికారి      అధ్యక్క్షులు -సరసభారతి
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు

c కధా కమా మీషు- 3

బ్రాహ్మణాల లోని మహర్షులు

బ్రాహ్మణాలలో వేద ద్రస్టలైన మహర్షుల పేర్లే కాకుండా మరి కొందరు మహర్షుల పేర్లు కని  పిస్తాయి .ఇందులో  సప్తర్షులే కాక కుత్స ,అత్రి ,రేభ ,అగస్త్య ,కుశిక గణ ,వసిష్ట,వ్యస్వ మహర్షుల పేర్లున్నాయి .బృహదారన్యకోపనిషత్ లో గౌతమ ,భరద్వాజ ,విశ్వా మిత్ర ,జమదగ్ని ,విశిష్ట కశ్యప ,అత్రి మహర్షుల ను పేర్కొన్నది .అధర్వ వేదం లో అదనం గా ఆంగీరస ,గనిస్తికర ,కక్షీ వంత , కణ్వ మేదాటిది ,త్రిషాక ,ఉశనా ,కావ్య ముద్గల ఋషుల పేర్లు కని  పిస్తాయి .ఋగ్వేదం  తర్వాతి వాగ్మయం  సప్తర్షి నక్షత్ర మండలానికి సప్తర్షులకు ఉన్న సంబంధాన్ని చర్చించింది .సాయనుడు నక్షత్రానికి ఉన్న ‘’రుక్ష ‘’శబ్దానికి సప్తర్షులు అనే అర్ధం చెప్పింది .ఇప్పుడు ఆయా ఋషుల గురించి వివరాలు తెలుసు కొందాం .

అగస్త్యడు –ఈయన్నే ఆగస్తి అనీ అంటారు .ఈయన మరుద్దేవతలను వృషభాలను ప్రోక్షించి పూజ చేశాడు .అక్కడి పశువుల్ని ఇంద్రుడు అపహరించుకు పోగా మరుద్దేవతలు వజ్ర ధారులై ఇంద్రుని చంపటానికి వచ్చారు .అప్పుడు ఇంద్రుడు ,అగస్త్యుడు ‘’  కయా శుభీయ ‘’అనే సామ వేదం మంత్రాన్ని చదివి వారిని శాంతింప జేశారు .ఇంద్రుని బుద్ధి విశేషాన్ని గుర్తించి అగస్త్యుడు బ్రహ్మ జ్ఞానాన్ని మొట్టమొదటి సారిగా ఉపదేశించాడు .

కణ్వుడు—ఈయన వంశీకులే కణ్వులు లేక కాన్వులు.ఈయన్నే ‘’సౌశ్ర వసువులు ‘’అనీ బహువచనం లో పిలుస్తారు .అత్రి ,కన్వవంశాలకు సంబంధం ఉంది .

గౌతముడు –ఇది రుషి గోత్రం పేరు .ఈ గోత్రీకులకు ఆంగిరసులకు సన్నిహిత సంబంధాలున్నాయి .జనక ,యాజ్న్య వల్క్యులకు సమకాలికుడు .ఒక ఋగ్వేద స్తుతి ‘’స్తోమానికి ‘’ప్రణేత ‘’.విదేహ రాజు మాధవుడు వైశ్వానరాగ్ని ని తన నోటిలో ధరించాడు .రాజుకు పురోహితుడైన గౌతముడు అగ్నిని  పిలిచాడు .  బదులు పలికితే బయట పడతానేమో నని భయం తో పలక లేదు .ఎలాగైనా అగ్నిని బయటికి రప్పించాలని గౌతముడు ఋగ్వేద మంత్రాలతో అగ్నిని స్తోత్రం చేశాడు .అయినా రాజు కాని అగ్ని కాని పలక నే లేదు .రుషి మళ్ళీ దీర్ఘం గా తీవ్రం గా క్రోధం గా అగ్నిని పిలిచాడు .ఊహూ అగ్ని జాడే లేదు .అప్పుడు గౌతముడు ‘’తన్వ్యాఘ్రుత స్రవీ మహె ‘’అనే ఋగ్వేద మంత్రాన్ని పలికాడు. మంత్రం లో ఉన్న ‘’ఘ్రుత ‘’(నెయ్యి)శబ్దం వినపడగానే అగ్ని ఊర్ధ్వ ముఖం గా ప్రజ్వరిల్లాడు .రాజు అగ్నిని భరించలేక పోయాడు .అప్పుడా అగ్ని భూమి మీదకు చేరింది .అగ్నిని నోటిలో భరించటం వలన ఏర్పడిన తాపాన్ని పోగొట్టుకోవటానికి రాజు సరస్వతీ నదిలో మునిగాడు .అప్పుడు అగ్ని తూర్పు దిక్కు గా ప్రజ్వ రిల్లుతూ భూమి అంతటా వ్యాపించింది .గౌతమర్షి మండుతున్న అగ్నిని వెంబ డించాడు .అగ్ని భూమి పై ఉన్న నదులన్నిటిని ఎండింప జేసింది .అందువలననే ‘’మిత్ర విందా యష్టి ‘’విదేహ రాజైన జనకుని ఉద్దేశించి ఏర్పాటైంది .దాన్ని ఇతను చూశాడు .

కశ్యపుడు –విశ్వ కర్మ ‘’సర్వ మేధా యాగం ‘’చేశాడు .కశ్యపునికి భూదానం చేయాలను కున్నాడు విశ్వ కర్మ .భూమి అంగీకరించలేదు .కష్యపునికి దితి ,అదితి అనే ఇద్దరు భార్యలున్నారు .కశ్యపుడు బ్రహ్మ పుత్రుడైన మరీచి కొడుకు .కనుక దేవతలకు అసురులకు ,సర్వ ప్రాణి కోటికి కశ్యపుడు తండ్రి అన్నమాట .అదితి తో పాటు పన్నెండు మంది దక్ష పుత్రికలను పెళ్లి చేసుకొన్నాడు .వారి వలన ఎంతో ప్రాణి కోటిని సృష్టించాడు కశ్యపుడు .కశ్యపుడు ప్రజాపతి గోత్ర ఋషీకూడా .సామ వేదం లో నిక్షిప్తమైన జ్ఞానం మొదటి సారిగా ఇంద్రుని నుంచి అగ్నికి తర్వాత కశ్యపుడికి సంక్రమించింది .

అత్రి –రుషి గోత్రం .పరి వార రూపం గా ప్రియ మేధులు ,కణ్వులు ,గౌతమ ,కక్షీ వంత గుణాలతో అత్రి గణం ఏర్పడింది .అత్రి జమదగ్ని ,గౌతములు క్రిమి సంహారకులు అని  ఛాందోగ్య  బ్రాహ్మణం తెలియ జేస్తోంది .

యాజ్న్య వల్క్యుడు –శత పద బ్రాహ్మణాన్ని రచించింది యాజ్న్య వల్క్యుడే .మైత్రేయి కాత్యాయిని ఇతని భార్యలు .మైత్రేయి పైన అధిక ప్రేమ ఉండటం తో కాత్యాయినిని ‘’ఇతర ‘’అన్నాడు .ఇతర పుత్రుడే ‘’మహీదాస ఐత రేయుడు ‘’ఐత రేయ బ్రాహ్మణ రచయిత .వైశంపాయన శిష్యులలో యాజ్న్య వల్క్యుడొకడు .ఒక సారి జనక రాజు యజ్ఞం లో ‘’అందరి కంటే గొప్ప బ్రహ్మ జ్ఞానికి పది వేల గోవుల్ని ‘’ఇస్తానని ప్రకటించాడు .అక్కడే ఉన్న అశ్వల ,యార్త భాగ ,ఉషాస్తి ,ఆహోల ,ఉద్దాలక ,గార్గి మొదలైన రుషులతోను ,రుశషికల తోను వాదం చేసి గేలు పొంది ,రాజు ప్రకటించిన పది వేల ఆవులను తోలుకు పోయిన ధీశాలి .

ఒక సారి ఉపనిషత్ పురుషుని స్పష్టం గా ఆవిష్కరించమని ,లేక పొతే శిరస్సు తెగి పడుతుందని దేవ మిత్ర శాకల్యుని ప్రశ్నించాడు .శాకల్యుడు చెప్ప లేక పోయాడు .అంతే శిరస్సు తెగి పడి పోయింది .జనకుడు యాజ్న్య వల్క్యుని వలన బ్రహ్మ జ్ఞాన ఫలాన్ని పొంది రాజ్య సర్వస్వాన్ని గురు దక్షిణ గా సమర్పించాడు .యాజ్న్య వల్క్యుడు ఒద్దని చెప్పి జనకుడినే రాజ్యం ఏలుకోమ ని ఇచ్చేశాడు  .సన్యాసం తీసుకుంటూ  తన సంపదను భార్య లిద్దరికీ పంచేశాడు .మైత్రేయి  ఆత్మ సంపదను అడిగి పొందితే ,కాత్యాయని భౌతిక సంపదను  వాంచించి పొందింది .

భ్రుగువు –వరుణ పుత్రుడు భ్రుగువు అని శత పద బ్రాహ్మణం చెప్పింది .తైత్తిరీయం లో దీనికో కద ఉంది .భ్రుగు గణం ద్రుహ్యులకు పురోహితులుగా ఉండేవారు .వీరికి అన్గిరసులతో సంబంధం ఉంది .చ్యవనుడికి భార్గవుడని అన్గిరసుడని పేర్లున్నాయి .వీరిపై ఆక్రమణ ఫాలితం గా సృంజయ ,వైతహవ్యులు సర్వ నాశన మైపోయారు .

భరద్వాజుడు –గోత్ర రుషి .దివోదాసుని పురోహితుడు .మంత్ర ప్రణేత ,ద్రష్ట .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?

బ్రాహ్మణాల కదా కమా మీషు -2

బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?

‘’బ్రాహ్మణం చ వేదః ‘’అని జైమిని సూత్రాలకు భాష్యం రాసిన శబర స్వామి అన్నాడు అంటే మంత్రాలే కాదు బ్రాహ్మణాలు కూడా వేదమే నన్న మాట .బృహదారణ్యక ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ శ్రీ శంకర భగవత్పాదులు ‘’వేదాను వచనేన మంత్రం బ్రాహ్మణాధ్యయనే ‘’అన్నారు అనగా మంత్ర భాగాన్నీ ,బ్రాహ్మణ భాగాన్ని అధ్యయనం చేయటమే వేదాను వచనం అని చెప్పారు అంటే బ్రాహ్మణాలు వేదాలేనని అంగీకరించారు .తంత్ర వార్తికం లో కుమారిలుడు  బ్రాహ్మణాలకు వేదం అనే పేరుందని ఒక ధర్మ శాస్త్రాన్ని పేర్కొన్నాడు .మనుస్మృతి వ్యాఖ్యానం లో మేధా తిది,మస్కరి మున్నగు వారు  కూడా బ్రాహ్మనాలను వేదాలుగా  గుర్తించారు .’’మంత్రం బ్రాహ్మనయోర్వేద నామ దేయం ‘’శ్రోత స్మార్తం లో  మంత్రాలు బ్రాహ్మణాలు వేదాలే అని ఆపస్తంభుడు పేర్కొన్నాడు .సాయణుడు’’మంత్రం బ్రాహ్మణాత్మక శబ్ద రాశిర్వేదః ‘’అంటే మంత్రం భాగ ,బ్రాహ్మణ బాగ రూప మైన శబ్ద రాసి అంతా వేదమే నని చెప్పాడు .

బ్రాహ్మణాల  వల్ల ఏం ప్రయోజనం ?

సంహితలలో ఉన్న మంత్రాలను అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలు ఉపయోగ పడుతాయి .యజ్ఞాన్ని ఎలా చేస్తే ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో నిర్వ చిస్తాయి .సంహితలలో నిక్షిప్తమైన నిగూఢ భావ రాశిని అర్ధం చేసుకోవటానికి నిఘంటువులు కావాలి .వాటిని ఆధారాం గా యాస్కుడు మొదలైన మహర్షులు ‘’నిరుక్తాలు ‘’రాశారు .ఒకప్పుడు ప్రతి వేదానికి విడి విడిగా  నిఘంటువు , నిరుక్తం ఉండేవి .ఇప్పుడన్నీ నశించి పోయి యాస్కుడు రాసిన నిఘంటువు నిరుక్తం మాత్రమే లభిస్తున్నాయి .నిఘంటువులు సంహితలోని పదాలకు అర్ధ నిర్వచనం చేసేటప్పుడు బ్రాహ్మణాల పై ఆధార పడతాయి .బ్రాహ్మణాలలో ఆయా సందర్భాలలో ఇవ్వ బడిన అర్ధాలే నిఘంటువుల లో కూడా కన పడతాయి .దీన్ని  బట్టి  తేలేది ఏమిటి  అంటే వేదం మంత్ర పదాలకు, నిఘంటు అర్ధాలకు మూలాలు బ్రాహ్మణాలే. .మంత్రం భాగాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలే సరైనవి .

మంత్రం ద్రస్టలైన మహర్షులు  బ్రాహ్మణాలలో సత్య స్వరూప మంత్రార్ధాలను తెలియ జేశారు .వీటిని ఆధారం గానే నిఘంటువులు ,ఇతర భాష్యాలు ఏర్పడ్డాయని భారతీయ పండితులు భావించారు .మానవులకు వైదిక కర్మలను ఆచరించటానికి బ్రాహ్మణాలు ప్రేరణ నిస్తాయి అని ఆపస్తంభుడు తన యజ్న పరి భాషలో వివ రించాడు .విధి ,అర్ధ వాదరూప మైన  బ్రాహ్మణాలు  వైదిక కర్మలను విధిస్తూ ,వాటిలో మానవుడు ప్రవర్తిం చేట్లు  సందర్భాన్ని బట్టి స్తుతిని ,నిందను చేస్తూ ప్రేరణనిస్తాయి .బ్రాహ్మణాల ద్వారా ప్రేరణ పొందిన వాడు ,మంత్రార్ధాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ,యజ్న యాగాదులను చేస్తాడు .యాగాలు బాగా ఆచరించే కాలం లో బ్రాహ్మణాలే దారి చూపాయి .

బ్రాహ్మణాలను సరిగ్గా అధ్యయనం చేస్తే ప్రాచీన భారతీయ చరిత్రను ,సంస్కృతిని ,ఆచార వ్యవహారాలను ,జీవిత లక్ష్యాన్ని తెలుసుకో వచ్చు .బ్రాహ్మణాలలో సాంకేతికం గా ఉన్న ఉపాఖ్యానాలు ,తరువాత వాగ్మయం లో ఏ విధం గా నిరూపించ బడ్డాయో పోల్చుకొని తెలుసుకో వచ్చు .అంటే ప్రాచీన భారతీయులకు సంబంధిన అనేక అంశాలను బ్రాహ్మణాలను అధ్యయనం చేసి తెలుసుకో వచ్చు .ఒక్కమాటలో చెప్పా లంటే ప్రాచీన భారతీయ జీవన సంస్కృతులను ,ఆలోచనా ధోరణులను ,తత్వ చింతనకు బ్రాహ్మనాలే అద్దంపట్టాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-14-.ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -1

బ్రాహ్మణాల కదా కమామీషు -1

 

జూన్ తొమ్మిది సోమవారం మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,మా మనవడు ఛి సంకల్ప్ –అంటే మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు కలిసి ఆర్ టి సి వారి పాకేజ్ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్ నుండి తిరుమల వెళ్ళారు .మంగళ వారం ఉదయం చేరి దర్శనం పూర్తీ చేసుకొన్నారు అన్నీ వాళ్ళే దగ్గరుండి తీసుకుని వెళ్లారట. ప్రసాదం లాడ్ద్దూలు కూడా వాళ్ళే కలెక్ట్ చేసి ఇచ్చారట .పద్మావతీ అమ్మవారి దర్శనం శ్రీ కాళ హస్తి చూపించి మళ్ళీ రాత్రికే బయల్దేరి బుధవారం ఉదయం హైదరాబాద్ చేరారు .తిరుమలలో దేవస్థానం బుక్ స్టాల్ కు వెళ్ళిన మా అమ్మాయికి అక్కడ కొత్తగా ప్రచురించిన ‘’బ్రాహ్మణాలు ‘’కానీ పించాయి ‘’నాన్న న్నిటి మీదా రాశారు కాని బ్రాహ్మణాల పై రాయలేదే ‘’అనుకోని ఒక పుస్తకం కొని  తీసుకొని వచ్చింది  నాకోసం .దీని ప్రధాన సంపాదకులుఆచార్య ఎస్ బి.రఘునాదా చార్య గారు . దాన్ని ఆ పూట నుంచే చదవటం మొదలు పెట్టి నాలుగు వందల యాభై పేజీలను అయిదు రోజుల్లో పూర్తిచేశాను .బాగా ఉంది .అంతకు ముందెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అరణ్యకాలు చదివాను .ఇందులో కొన్ని కధలు బాగున్నాయి వాటినీ అందులోని విశేషాలను బ్రాహ్మణాల వైశిస్త్యాన్ని తెలియ జేయటానికి ‘’ఆరణ్యకాల కదా కమా మీషు ‘’శీర్షికతో రాయటం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాను .నాకు తెలిసిన, నచ్చిన విషయాలను అందరికి అందివ్వటమే నా ఉద్దేశ్యం .ఇదొక దారి చూపే పనే కాని లోతులను తరచి చూపే పనికాదని సవినయం గా మనవి చేస్తూ ప్రారంభిస్తున్నాను .

బ్రాహ్మణాలు అంటే  ఏమిటి ?

వేదాలు భగవంతుని నిశ్వాసాలు .అవి రుక్ ,యజు ,సామ అధర్వాలని నాలుగు .వీటి మూల గ్రంధాలను ‘’సంహితలు ‘’అంటారు .ఇవన్నీ దాదాపు ఛందో బద్ధమంత్రాలే .కనుక మంత్రభాగమనీ పేరు .దేవాతా స్తుతులు ,యజ్న యాగాది వైదిక కర్మలు ,ధార్మిక ప్రక్రియలు ,తాత్విక చింతనలు వేదాలలో  ప్రతి పాదించ బడ్డాయి .మంత్రం ద్రస్టలైన మహర్షులు భావన లో వీటిని దర్శించారు .అందుకే వారు మంత్ర ద్రష్టలు  అయ్యారు . వారు దర్శించిన మంత్రాలనుపయోగించి వివిధ దేవతారూపం లో ఉన్న భగవంతుని ఆరాధించటమే యజ్ఞం .యజ్ఞం చరా చర సృష్టికి సుఖ సంతోషాలను తుష్టిని పుస్టిని ఇస్తుంది .యజ్న యాగాలకు కొన్ని పద్ధతులున్నాయి .వాటిల్లో సామాజిక ద్రుష్టి ,తాత్విక చింతన ,ధర్మాసక్తి ఉంటాయి .సంహితను సరిగ్గా అర్ధం చేసుకుని అనేక కర్మలలో ఉపయోగించుకుంటూ ,అందు లోని సాంకేతిక  పరిజ్ఞాన అర్ధాన్ని వివరిస్తూ ఏర్పడిన వాటినే  ‘’బ్రాహ్మణాలు’’ అన్నారు .ఇవి గద్యం లో ఉంటాయి .వేద సంహితలకు ,ఆ తర్వాత వచ్చిన వాజ్మయానికి బ్రాహ్మణాలు వంతెనలాంటివి.యాగస్వరూపాన్ని వివరించటమే బ్రాహ్మాణాల ముఖ్య కర్తవ్యం.

బ్రహ్మ అనే శబ్దానికి అర్ధం అంటున్నది శాత పద బ్రాహ్మణం .నాలుగు వేదాలలోను ఉన్న మంత్రం భాగానికి వినియోగాన్ని విధిస్తూ ,వ్యాఖ్యానం గా ఏర్పడిన గ్రంధమే బ్రాహ్మణం .మంత్రాలు  కాకుండా మిగిలిన వన్నీ బ బ్రాహ్మణాలే.ఇవి గొప్ప ప్రామాణిక గ్రంధాలు .

సంహితలు –బ్రాహ్మణాలు

సంహితలలో ప్రతి ముఖ్య శాఖ కు ఒక  బ్రాహ్మణం ఉండేది .రుక్సంహితకు 21శాఖలున్నా ఆరు  మాత్రమె కని  పిస్తున్నాయి అవే ఐతరేయ బ్రాహ్మణం ,కౌశీతకి బ్రాహ్మణం ,పైంగి బ్రాహ్మణం ,బహ్వాచ బ్రాహ్మణం ,ఆశ్వలాయన బ్రాహ్మణం ,గాలవ బ్రాహ్మణం .

యజుస్సంహితకు రెండు ప్రధాన శాఖలున్నాయి .అందులో కృష్ణ యుజుర్వేదానికి తైత్తిరీయ శాఖలకు సంబంధించింది తైత్తిరీయ బ్రాహ్మణం .మాధ్యందిన –కాన్వ భేదం తో శుక్ల యజుర్వేదానికి రెండు శాఖలున్నాయి వీటికి విడి విడిగా మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండున్నాయి ఇవికాక కాల గర్భం లో పన్నెండు కలిసి పోయాయి .

సామ సంహితకు మూడు  ప్రధాన బ్రాహ్మణాలు తలవకార బ్రాహ్మణం ,తాండ్య బ్రాహ్మణం ,ఛాందోగ్య బ్రాహ్మణం ఉన్నాయి ఇవి కాక ఉప బ్రాహ్మణాలు –సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం ,సంహితోపనిష బ్రాహ్మణం ఉన్నాయి

అధర్వ సంహితకు ఒకే ఒక బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ఉంది .

బ్రాహ్మణాలు వివిధ కాలాలో ఏర్పడ్డాయి. పంచ వింశ బ్రాహ్మణం ,తైత్తిరీయ బ్రాహ్మణం మిగిలిన వాటికంటే ప్రాచీన మైనవి .వీటి తర్వాత తలవకార లేక జైమినీయ బ్రాహ్మణం ఆ తర్వాత కౌశీతకి బ్రాహ్మణం ఏర్పడ్డాయి .దీనితర్వాత ఐతరేయం ఆ తర్వాత శత పధం ఏర్పడ్డాయని భావిస్తున్నారు .కృష్ణ ద్వైపాయన వ్యాసుని చేత కల్ప సూత్రాలతో బాటు నిర్మింప బడిన బ్రాహ్మణాలు ఆధునికమైనవి .అంతకు ముందున్న బ్రాహ్మణాలు ప్రాచీనమైనవి అని అనుకుంటారు .మొత్తం మీద ఐతరేయ ,పంచ వింశ ,తైత్తిరీయ బ్రాహ్మణాలు మిగిలిన వాటికంటే ప్రాచేనమైనవి శతపద బ్రాహ్మణం నవీనమైనది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం )

టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్

 

అమెరికా సాహిత్యం లో ‘’బాడ్ బాయ్’’ అని పించుకున్నవాడు ఇ .ఇ. కమింగ్స్ .1894అక్టోబర్ పద్నాలుగున మాసాచూసేట్స్ లోని కేంబ్రిడ్జి లో జన్మించాడు .తండ్రి మినిస్టర్ కాకముందు హార్వర్డ్ టీచర్ .కమింగ్స్ కూడా హార్వర్డ్ లో చదివి ఏం ఏ.పాసైనాడు .మొదటి ప్రపంచ యుద్ధం లో అంబులెన్స్ సర్వీస్ లో చేసి ,సెన్సార్ పొరపాటు వల్లమూడు నెలలు డిటేన్షన్ కాంప్ లో ఉండాల్సి వచ్చింది . దీన్నే ‘’ఎనార్మస్ రూమ్ ‘’లో వివరించాడు ఇదికాక కొన్ని వ్యాస సంపుటుల్ని తెచ్చాడు .’’టులిప్స్ అండ్ చిమ్నీస్ ‘’అనేది మొదటికవితా సంకలనం .దీని చివర వరుసగా చాలా సానేట్లు రాశాడు .ఇందులో చాలా విరుద్ధాలు కనిపిస్తాయి .మాటల శక్తికే ప్రాధాన్యం ఇచ్చాడు .పేజీ అంతా ఖాళీగా కొద్ది లైన్లు మాత్రమె ఉండేట్లు రాశాడు .ఉదాహరణకు –a tall

Wind

Is dragging

The

Sea

With

Dream

S

ఇది చూస్తె ఒక అడ్వర్టైజ్ మెంట్ పధ్ధతి అని పిస్తుంది .అరవై వయసులో ఆరు వందల కవితలను కూర్చి పోయెమ్స్ పేరిట విడుదల చేశాడు .పాత వాటినే కొత్త తరహాలో చెప్పాడు .స్ప్రింగ్ ,డెత్ ,రొసెస్ లపై కవితలు అల్లి నిర్లక్ష్యం గా సంభాషణ రూపం లో రాసి ప్రత్యేకత చూపాడు .అరవైఏడు లో 1962లోసెప్టెంబర్ మూడున  మరణించాడు .స్వీయ చరిత్ర నవలలు నాటకాలు రాసి పెయింటర్ గా కూడా ప్రఖ్యాతుడైనాడు .రాడికల్ బెహోమియన్ వాడైనా రిపబ్లికన్ గానే గుర్తింప బడ్డాడు .కవిత్వం లో బ్లూస్ ఫారం ను , ఎక్రాష్టిక్స్ రూపం లోను రాశాడుకొన్ని .ప్రేమ ,ప్రక్రుతి లపైనే ఎక్కువ గా రాశాడు .ఇమేజిస్ట్ ప్రభావం తో ముందు రాసినా తర్వాత ఫ్రెంచ్ కవుల ప్రత్యేకమైన  ‘డాడాయిజం ‘’ను అభిమానించి రాశాడు .అంత్యప్రాస ఛందస్సులకు అంతగా విలువ ఇవ్వలేదు .అతనిది’’టైపోగ్రాఫికల్లి ఎక్సూబరెంట్  స్టైల్ ‘’అంటారు .2,900కవితలు పండించాడు .ఆరో ఏట నే తండ్రిపై కవితరాశాడు –‘’father dear –be your father good and good –it is good –it is not good to see it rain’’.

‘’ ఎనార్మస్ రూమ్’’ అనే ఆటో బయాగ్రఫిక్ నవల రాశాడు .

E. E. Cummings NYWTS.jpg

 

 

కంప్రేస్సేడ్ మెటఫర్ కవి – హార్ట్ క్రేన్

ఇమేజ్ లను కేంద్రీకరించి ,అలంకారాలతో అలంకరించి కావ్య గౌరవాన్ని కల్పించి కవిత్వం రాసిన వాడు హార్ట్ క్రేన్ .’’కంప్రేస్సేడ్ మెటఫర్ ‘’ను పరిపూర్ణం చేశాడు .ఇందులో ‘’comparisons were stripped to their skeletal ideas ,he spoke of as an instinctive ‘’logic of metaphor ‘’ which he claimed antedated ‘’our so called pure logic and which is the genetic basis of all speech ‘’ అని దాని వివరణ ఇచ్చారు విశ్లేషకులు .

అమెరికా లో ఒహాయో లోని గారేట్స్ విల్  లో 21-7-1899న పుట్టి బాల్యం నుండి అశాంతితో నే గడిపాడు .అప్పుడే తండ్రి క్లీవ్ లాండ్ కు కుటుంబాన్ని మార్చి తలిదంద్రులిద్దరూ విడి పోయారు .తల్లినే  సమర్ధించాడు క్రేన్ .ఇతర్రులపై ఆధార పడటం ఇష్టం లేని క్రేన్ జీవితం నాశనమై పోయిన్దనుకున్నాడు .అనేక చిన్న ఉద్యోగాలు చేసి చివరికీ షిప్ లాండ్ రిపోర్టర్ గా ఉన్నాడు.తండ్రికి ఇష్టం లేక పోయినా కవిత్వానికి అంకితమై పోయాడు .ఉద్యోగాల్లో చేరటం ఊడి పోవటం తో నిర్లక్ష్యం గా బే ఫర్వాగా తిరిగాడు .విపరీతం గా తాగుడుకు అలవాటు పడి ,కుదురు లేకుండా యూరప్ అంతాచెడ తిరిగి ,అవమాన భారం తో కుంగిపోతూ ,ప్రతివాళ్ళతో పోట్లాడుతూ తగాదా పడుతూ గడిపాడు .

ఇరవై ఏడు లో మొదటి పుస్తకం ‘’వైట్ బిల్డింగ్స్ ‘’ముద్రించాడు .అతని అమోఘ కవితా శక్తిని గుర్తించారు. కవిత్వం లో మెరుపులు  మెరి పించాడు ..ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల ప్రభావం బాగా ఉన్న వాడు .స్వంత పదాలను’’ కార్పోసంట్ ,కంక్లా మెంట్ ,సిబిలేన్స్ సినేర్జి ఇంక్యునాబులా ,లేబి రింతిస్ ,క్ల స్ట్రస్ , గాల్వో దేర్మిక్ ,ట్రాన్స్మెంబెర్ మెంట్ ,కోరిమ్బులస్ ‘’మొదలైన మాట లను  సృష్టించుకుని ‘’వర్డ్  ఫైండర్’’అయ్యాడు .ఇరవైలలో దాత ఒట్టో హెచ్ కాహ్న్ క్రేన్ ప్రణాళికకు కావలసినంత ఆర్ధిక సాయం చేశాడు .దీనితో ‘’ది బ్రిడ్జి ‘’అనే పెద్ద పుస్తక ముద్రణ జరిగింది .తర్వాత ‘’మిత్ ఆఫ్ అమెరికా ‘’రాశాడు జాతీయ సింబల్స్ .లెజెండ్స్ ,పూర్వ చరిత్ర ,జానపద గీతాలు ,ఆధునిక సాంకేతికత అన్నీ కలిపి కావ్య రీతిలో రాశాడు .ఇందులో బ్లేక్ ,డికిన్సన్ ,మేల్విలీ ,విట్మన్ మొదలైన వారందరినీ కలిపి కేలేడోస్కోప్ రీతిలో లో హిస్టేరికల్ గా రాశాడు .’’సబ్ కాన్షస్ ‘’తో రాసినట్లని పిస్తుంది

రాతలో డిసిప్లిన్ లేక పోవటమే క్రేన్ కవిత్వానికి  కు కలర్ ఇచ్చింది .భావాత్మకం గా ,చిత్రాత్మకం గా రాసే వీలు కలిగింది .ఒక కవితా చిత్రాన్ని చూద్దాం –

‘’stick your patent name on a sign board –brother –all over going west –young man tintex –japalac –Certain-teed Overallas ads –and lands sakes under the new pay bill ripped ‘’అంటూ ఆర్డర్ లో కేయాస్ కలిపి రాస్తాడు .తన తరాన్ని ప్రభావితం చేసిన క్రేన్ ముప్ఫై రెండవ ఏట ఫ్లారిడా కోస్ట్ లో ఆత్మా హత్య చేసుకొని27-4-1932న చనిపోయాడు

Finding both inspiration and provocation in the poetry of T. S. Eliot, Crane wrote modernist poetry that was difficult, highly stylized, and ambitious in its scope. The logic of metaphor is so organically entrenched in pure sensibility that it can’t be thoroughly traced or explain outside of historical sciences, like philology and anthropology.”[.నాటక రచయితా యూజీన్ ఒ నీల్ ,కమింగ్స్ తోటే మొదలైన వారు క్రేన్ కవిత్వాన్ని మెచ్చుకున్నారు .

 

Hart Crane.jpg

 

 

                     ఎలిప్టికల్  కవి – రాబర్ట్ లోవెల్

       రాబర్ట్ ట్రైల్ స్పెంస్ లోవెల్ అమెరికా లో మాసాచూసేట్స్ లోని బోస్టన్ లో 1-3-1917 న జన్మించాడు .మే ఫ్లవర్ మూలాలున్న  ‘’బోస్టన్ బ్రాహ్మిన్ ‘’కుటుంబానికి చెందిన వాడు .జేమ్స్ రస్సెల్ లోవెల్ తాతగారు .ప్యూరిటన్ ఇన్ రివోల్ట్ గా ప్రసిద్ధుడు .కెన్యా కాలేజి లో చదివి జాన్ క్రూ రాన్సం దగ్గర క్లాసిక్స్ చదువుకున్నాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొని పౌరులపై బాంబులు వేసి చంపటం నేరమని,,దేశానికి ప్రమాదం లేదు కనుక యుద్ధం వద్దని వాదించి యుద్ద్ధం చేయటానికి నిరాకరిస్తే జైలు లో పెట్టి అయిదు నెలల తర్వాత విడిచి పెట్టారు .

దేనికీ చెందని మనస్త్వత్వం ఉన్న వాడు .దీనినే ‘’లాండ్ ఆఫ్ అన్ లైక్లి నెస్ ‘’పుస్తకం లో రాశాడు .ఇదులోని కవితలు తరువాత ‘’లార్డ్ వీరీ కాజిల్’’లోను చేర్చాడు .రెండేళ్ళ తర్వాత దీనికి పులిట్జర్ బహుమతిని పొందాడు .న్యు ఇంగ్లాండ్ హేయం గా తయారయిందని బాధ పడేవాడు .ఇరవైలలో రోమన్ కేధలిక్ అయి కవిత్వం లో నీతికి ప్రాధాన్యమిచ్చి రాశాడు .ముప్ఫై లో లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు కవిత్వానికి కన్సల్టంట్ అయ్యాడు .ఎలిజ బెత్ ఆర్విక్స్ అనే రచయిత్రిని పెళ్లి చేసుకున్నాడు ‘’ది మిల్స్ ఆఫ్ ది కావన్నాస్ ‘’రాశాడు .కవిత్వం బాగానే ఉన్నా ,ఇమేజెస్ దట్టమై పోయి ,స్వీయ ఉదాహరణలతో వెర్రి ఎత్తిస్తుంది అతనిలోని ‘’కావిలియనిజం ‘’కూ, కేధలిజం ‘’కు మధ్య ఉన్న ఘర్షణకు ప్రతిరూపం గా కొన్ని కవితలుంటాయి

ది క్వేకర్ గ్రేవ్ యార్డ్ కవిత’’ వారెన్  విన్ లో’’  పై స్మృతి కవిత .’’when ever winds are moving and their breath –heaves at the roped –in bulwarks of the pier the terns and the sea gulls tremble at your death –in these home  waters .Sailor can you hear? అని మొదలు పేటి హృదయ విదారకం గా రాస్తాడు .లోవెల్ పద్ధతిని ‘ఎలిప్టికల్ మెథడ్’’అన్నారు .సమాజం లో నైతిక దివాలా కోరు తనాన్ని ఏవగించుకున్నాడు .దేనికీ స్పందించని జాతిని తిట్టాడు .’’వేర్ ది రైన్ బోస్ ఎండ్స్ ‘’కవితలో

‘’Boston serpents whistle at the cold –the victim climbs the altarsteps and sings –Hosannah to the lion ,lamb and beast –who fans the furnace –face of I.S .with wings –I breathe the ether of my marriage feast ‘’ అని ఊగిపోతూ మనల్నీ ఊగిస్తూ కన్నీరు కార్పిస్తాడు .

లోవెల్ కున్న డిసిప్లిండ్ టెక్నిక్ ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వం లో అమెరికాలో  మరో ధోరణికి దారి తీసింది .అందుకే ట్రెండ్ సెట్టర్ అయ్యాడు .ఫ్రీ వేర్స్ ను త్యజించి  మళ్ళీ పాత ధోరణికి మారింది .కానీ యువ కవులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు . హుందాతనం పోగొట్టుకున్నారు .కారల్ షాపిరో రాసిన ‘’వి లెటర్ అండ్ ఆదర పోయెమ్స్ ‘’,పీటర్ వీర్క్ ‘’టెర్రర్ అండ్ డేకోరాం ‘’,థియోడార్ రోత్కే’’దివేకింగ్ ‘’,ఎలిజబెత్ బిషప్ ‘’నార్త్ అండ్ సౌత్ ‘’,రిచర్డ్ విల్ బర్ ‘’థింగ్స్ ఆఫ్ దిస్  వరల్డ్ల్ద్ ‘’కవితలకు పులిట్జర్ బహుమతులు వచ్చాయి .1960లలో అమెరికాలో ప్రఖ్యాత కవి అనే గుర్తింపు పొందాడులోవెల్  . The poems drift from one focus to another; they avoid the histrionic; they sigh more often than they expostulate. They acknowledge exhaustion; they expect death.” She praises some of Lowell’s descriptions, particularly his descriptions of impotencedepression, and old age.

 

 

 

 

 

Robert-lowell-by-elsa-dorfman.jpg

 

 

నియో రొమాంటిక్ కవి -డిలాన్ థామస్

ఆధునిక కవులలో ప్రత్యెక స్థానాన్ని పొందిన డిలాన్ థామస్ తన బాల్యాన్ని గురించి ‘’వన్స్  బి   ఏ టైం ‘’కవితలో ‘’up through the lubber crust of Wales –I rocketed to astonish –the flashing needle rock of squatters –the criers of Shabby and Shorten –the famous stitch droppers ‘’అని చెప్పాడు .తనలాగా ఉన్నతం గా  ఎదిగిన కవి లేడని చెప్పుకున్నాడు. ఇరవై ఒక్క ఏటనే ప్రపంచాన్ని అధ్యయనం చేసి అదొక హింసా సామ్రాజ్యం అన్నాడు .

1914 అక్టోబర్ 27 స్వన్సియా కు చెందిన వెల్ష్ సీ పోర్ట్ లో ఇంగ్లీష్ టీచర్ కు రెండవ కొడుకు గా  పుట్టిన థామస్ పెద్దగా స్కూల్ కు వెళ్లి చదవ లేదు .గ్రామర్ స్కూల్ లో చదవగానే సౌత్ వేల్స్ కు చెందిన  ‘’ఈవెనింగ్ పోస్ట్ ‘’పేపర్ కు రిపోర్టర్ అయ్యాడు .ఇరవై లో ;;’’యైటీన్ పోయెమ్స్ ‘’రాసి ముద్రించాడు .చదివిన ప్రతివాడూ అతని ‘’ఆటవికానికి ‘’ముగ్దులైతే విమర్శకులు ‘’సర్రియలిజం ‘అన్నారు రెండేళ్ళ తర్వాత మరికొన్ని కవితల్ని ‘’ట్వెంటి ఫైవ్ పోయెమ్స్ ‘’గా ప్రచురించి మళ్ళీ దిమ్మ తిరిగేట్లు చేశాడు .చిన్నప్పుడే అల్లరి చిల్లరగా  ‘’డర్తి కర్లీ ‘’గా ఉండేవాడినని రాశాడు .

పేదరికం లోనే జీవితమంతా గడిపాడు ధామస్ .డబ్బు సంపాదించటం అసలు తెలియనే తెలియదు .జర్నలిస్ట్ గా ,నటుడిగా ,స్క్రిప్ట్ రైటర్ గా,చివరికి పబ్లిక్ పెర్మార్మర్ గా కూడా ఏది దొరికితే అది చేసి పొట్ట పోసు కున్నాడు .రెండేళ్ళ తర్వాత కేట్లిన్ మాక్నమారా ను పెళ్ళాడి ముగ్గ్గురు పిల్లల్ని పొందాడు కర్మార్దేన్ షైర్ అనే చేపలు పట్టే ఊరిలో స్తిరపడ్డాడు ..బి బి .సి లో కవితలను చదివాడు .1950లో అమెరికా వెళ్లి ,రెండేళ్లకే తిరిగొచ్చి మళ్ళీ వెళ్ళాడు .కవితలు పాటలూ సందర్భోచితం గా లయాన్వితం గా భావ గర్భితం గా నటిస్తూ పాడి విని పిస్తూ డబ్బు సంపాదించాడు .అర్ధం కాకపోయినా చెవులప్పగించి విని ఆనందించేవారు .అమెరికానే స్వంత గడ్డను చేసుకొన్నాడు .న్యూయార్క్ పై నమ్మకంలేకపోయినా థర్డ్ ఎవేన్యు ను ఇస్టపడతానన్నాడు .జనాన్ని పోగేసి కవితాలు వినిపిస్తూ చప్పట్లూ కేరింతలు కొట్టించుకుంటూ గడిపాడు .’’ఏ టిప్కల్ డే ఇన్ మై వెల్ష్ బొగ్ ‘’,ఏ బార్డ్స్ ఐ వ్యూ ‘’మొదలైన వాటిపై ఊహాత్మకమైన వ్యూహాత్మకమైన ఉపన్యాసాలిచ్చి రంజింప చేసే  వాడు .I want to write only poems of God;s world –by aman who does not believe in God ‘’అని చెప్పాడు .

ముప్ఫై అయిదు దాటగానే తాను ‘’ముసలి చిన్న నల్ల డేరింగ్ డాటింగ్ దాటింగ్ – ఐడ్ బాల్దింగ్ అండ్ టూత్ లెస్సింగ్ ‘’’అని చెప్పుకున్నాడు .మూడవ సారి అమెరికా వచ్చి’’ ఐగార్ ట్రా విన్ స్కి’’ తోకలిసి  ఒపేరా కు పని చేయాలని  ప్లాన్ వేసుకున్నాడు .కాలి ఫోర్నియా నేపధ్యం గా చెయ్యాలని నిర్ణయం.ఇంతలోనే అతని ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’విడుదలై సెన్సేషన్ సృష్టించి బ్లాక్ బస్టర్ అయింది .న్యూయార్క్ లో ఆ విజయాన్ని ముప్ఫై తొమ్మిదవ బర్త్ డే గా జరుపుకున్నాడు .కాని అకస్మాత్తుగా జబ్బు చేసి కొలాప్స్ అయ్యాడు .సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినా  మెదడు లో భాగాలు దెబ్బతిని వేల్స్ నుంచి భార్య వచ్చిన కొన్ని గంటలలోనే 1953 నవంబర్ తొమ్మిది న థామస్ మరణించాడు .

చని పోయిన తర్వాత థామస్ ప్రాభవం మరీపెరిగింది .అతని పేర అనేక సంస్థలు వెలిసి గౌరావాన్ని చాటుకున్నాయి .వేర్నార్ వాట్కిన్స్ కు జాబు రాస్తూ వాళ్ళు అంద జేసిన పారి తోషికానికి క్రుతజ్నత తెలియ జేస్తూ ‘’మీరిచ్చిన గుండ్రని సిల్వర్ ట్రాష్ దిక్రౌన్ ను అమ్ముకుంటే నాకు వారం రోజులు గ్రాసం లభించి జీవితం  గడుస్తుంది .నా లాంటి వాడు చేతిలో పెన్నీ కూడా ప్రతి  రోజు జీవించటం దారుణం ‘’అని జీవితాంతం తన్ను వెంబడించిన దరిద్రాన్ని గురించి బాధ తో చెప్పుకున్నాడు .కవిత్వం తో పాటు ఆరు చిన్న కదా పుస్తకాలు రాశాడు .అందులో ‘’పోర్ట్రైట్ ఆఫ్ ది ఆర్టిస్ట్  యాజ్  ఏ యంగ్ డాగ్ ‘’,క్విట్ఎర్లి వన్ మార్నిగ్ ‘’మొదలైన కధలు బాగా పేరొందాయి .అతని రచనల్లో బాల్యం ,సెక్స్ సామర్ధ్యం ,కల్లోల మతం ,చావు లే విషయాలు .’’my world was chistened in a stream of milk –and earth and sky were asone airy hill –I dreamed my genesis in swear of sleep ‘’అని రాశాడు

థామస్ చివరి రచన ‘’అండర్ మిల్క్ వుడ్’’బి బి సి .లో ప్రసారం కావాల్సింది అమెరికా లో 1953లో ప్రసారమైంది .ఇందులో రెండు భాగాలు థామస్ స్వంత గొంతుక తో చదివాడు .తనకవితలలో ప్రతిదాంట్లోను మనిషిప్రేమ  దేవుని ప్రసంశ,ఉంటుందని అవి లేక పోతే తాను ఒక నిరర్ధక జీవినే అవుతానని చెప్పాడు .చదువుతూంటే విశ్లేషణకు అందనంత వేగం గా దూసుకు  పోతుంది కవిత్వం అదీ అతని ప్రత్యేకత . ‘’there was a cultural time lag –gradually our ears grew accustomed to the logical dissonances of modern music and the disordinances of modern poetry once this has been achieved ,we will be able to evaluate the intrinsic importance of the work of the period  At this  time ,we will know how much of modern poetry has permanence ,the wonder ,excitement ,and sustained power of enduring art ‘’అని ఆలోచనలను రేకెత్తిస్తుంది డిలాన్ థామస్ కవిత్వం .

‘’ డు నాట్ గో జెంటిల్ ఇన్ దట్గుడ్ నైట్ ‘’’’ఏ డెత్ షల్ హావ్ నొ డొమినియన్ ‘’కవితలు ‘’ప్లె ఫర్వాయిసెస్’’,’’అండర్ మిల్క్ వుడ్ ‘’నాటకాలు చాలు థామస్ ను చిరంజీవి ని చేయటానికి .ఏ సాహిత్య ముఠాకు చెందని వాడు థామస్ .’’నియో రోమాం టిక్ ‘’అన్నారు .ఫ్రాయిడ్ ప్రభావం వెల్ష్ జాతీయ ప్రభావం ఉన్న వాడు .అమెరికా వెళ్ళినప్పుడు థామస్ హార్డీ కవితల్ని చదివి ఆయనకే వినిపించాడు .వెల్ష్ జాతీయుడైనా వెల్ష్ జాతీయత అంటే అయిష్టం ‘’వెల్ష్ జాతీయత ‘’హిల్ ఫారం మొరాలిటి ‘’లాంటిది అన్నాడు .థామస్ లో ఉన్నది శబ్దాడంబరమే అంటారు  కొందరు .ఏంటో మంది కవులను ప్రభావితం చేసిన వాడు డిలాన్ థామస్ .అతని సమాధి పై అతనే రాసుకున్న కవితను చెక్కించి ఉంచారు –‘’oh! as I was young and easy in  the mercy of means –time held me green and dying –though I sang in my  chains like  the sea’’

థామస్ రచనలు సినిమాలుగా వచ్చాయి .

Not for the proud man apart
From the raging moon I write
On these spindrift pages
Nor for the towering dead
With their nightingales and psalms
But for the lovers, their arms
Round the griefs of the ages,
Who pay no praise or wages
Nor heed my craft or art.

అని గొప్ప కవిత్వం రాశాడు

Dylan Thomas photo.jpg

 

.

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ఇంతటితో సమాప్తం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-14-ఉ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54

ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్

వాలెస్ స్టేవెంస్ కు స్నేహితుడు ,అభిమాని అయినా అతని భావాలు నచ్చని వాడు విలియం కార్లోస్ విలియమ్స్ ‘జీఎవితం లోని  అప సవ్యాన్ని  ప్రేమించి ,ఏ  కోరికను వదలక అనుభవించాడు .’’no ideas but in things ‘’అన్నదే సిద్ధాంతం .విలియమ్స్ న్యు జేర్సిలోని రూత్ ఫర్డ్ లో 17-9-1883న జన్మించాడు .పేరెంట్స్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ కుటుంబాలకు చెందిన వాళ్ళు .జ్యూయిష్ రక్తం ప్రవహిస్తున్న వాడు .తల్లి కేథలిక్ గా తండ్రి ఎపిక్యూరియాన్ గా విలియంస్ ను పెంచారు .న్యు యార్క్ లో హోరేస్ మాన్ హైస్కూల్ లో చదివి ,స్విట్జెర్లాండ్ లో మెడిసిన్ లో చేరి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో పూర్తీ చేసి ఎం డి.డిగ్రీ పొందాడు .ఇరవై మూడులో మొదటి కవితా సంకలం తెచ్చాడు .ఫ్లారెన్స్ హీర్మాన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులను   కని  ,ఒక కొడుకును డాక్టర్ ను చేశాడు .

ఇమేజిస్ట్ పౌండ్ ను అనుకరించాడు .క్రమం గా అమెరికన్ జాతీయాలకే ప్రాముఖ్యమిచ్చి రాశాడు .’’ఫ స్ట్  సెలెక్షన్  ఆఫ్ పోయెమ్స్ ‘’విడుదల చేశాడు దీనికి ముందు మాట రాసిన స్టీవెన్ ‘’the passion of anti poetic is a blood passion and not a passion of ink-pot’’అన్నాడు .వాస్తవ అవాస్తవాలను కలిపి రాసిన తీరు బాగుందని మెచ్చాడు .సెంటిమెంట్ ను  యాంటి పోఎటిక్ ను కలిపి రెండు విరుద్ధాలకు ఒకే చోట స్థానం కల్పించాడు .డెబ్భై అయిదేళ్లకు ముప్ఫై అయిదుకు పైగా పుస్తకాలు రాసి ప్రచురించాడు .అనేక పురస్కారాలు గౌరవాలు పొందాడు అందులో  గొప్పది బెల్లిన్జేన్ అవార్డ్ .దీనికి అయిదు వేల డాలర్ల పారితోషికం పొందాడు .ఎకాడేమి ఆఫ్ అమెరికన్ పోఎట్స్ లో ఫెలోషిప్ పొందాడు ‘’బుక్ టు ఆఫ్ పీటర్సన్ ‘’కు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .

‘’ఫ్లవర్స్ బై ది సి ‘’,ట్రాక్ట్ ‘’,ఏ గుడ్ నైట్ ‘’మొదలైనవి వ్యక్తిగతమైన ఆ నాటి ఫ్రీ వేర్స్ కవితలు .అన్నిటిని ప్రేమించే గొప్ప లక్షణం విలియమ్స్ కుండేది .వ్యత్యాసం తెలియని కవి .పనికిరానిది ఉందా అని ఆశ్చర్య పోయే వాడు .ప్రస్తుతాన్ని ,ప్రశ్నించరాని సాను భూతి తో రాయటం అతని ప్రత్యేకత .పేపర్ వార్త బజారు వార్తా అన్నీ కవిత్వం లో దిగాల్సిందే .దీన్ని’’If Williams errs on the side of objectivity ,he uses those objects ,fragments and disjointed documents to attain fresh and startling immediacy ‘’ గా అభి వర్ణించారు .4-3-1963న డెబ్భై తొమ్మిదేళ్ళ వయసులో చని పోయాడు .డాక్టర్ గా కంటే రచయితగానే ఎక్కువ సేవ చేశాడు .నిత్య జీవిత సంఘటనలే విలియమ్స్ కవితా వస్తువులు .’’poetry is equipment for living a necessary guide amid the bewilderments of life’’అని భావించాడు .మోడర్నిజాన్ని ఇమేజిజం తో కలగలిపి రాసిన వాడు కార్లోస్ విలియమ్స్ .

 

William Carlos Williams passport photograph 1921.jpg

 

ఐరనీ విట్ ల కవయిత్రి  — మరియాన్నే మూర్

మరియాన్నే క్రైగ్ మూర్ అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయీస్ లో 15-11-1887లో జన్మించింది బ్రయాన్ మార్ లో చదివి బి ఏ పాసై స్టేనోగ్రఫీ, టైపింగ్; బుక్ కీపింగ్ ,ఇంగ్లీష్  కమ్మర్షియల్  లా  లను పెన్సిల్వేనియా లో  బోధించింది .న్యూ యార్క్ హడ్సన్ పార్క్ బ్రాంచ్ కి అసిస్టంట్ గా  మూడేళ్ళు పని చేసింది ..సంప్రదాయం పధ్ధతి ఉన్న వనిత .మొదటి కవితా సంకలనం ‘’పోయెమ్స్ ‘’లండన్ లో ను ,’’అబ్సర్వేషన్స్ ‘’ను తర్వాతా ప్రచురించి రెండవ దానికి ‘’డయల్ అవార్డ్ ‘’ను కవిత్వం లో విశిష్ట సేవకు పొందింది .1944లో ‘’కాంటెంపరి పోయిట్రీ పేట్రన్స్ ప్రైజ్ ‘’ను పొందింది .చికాగో వర్సిటి నుండి ప్రతిష్టాత్మక హారియట్ మన్రో పోయెట్రి పురస్కారం అందుకొన్నది .గగ్గెన్ హీం ఫెలోషిప్ గౌరవం పొందింది .

1951లో ప్రచురించిన ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘కు బోలింజేన్ ,నేషనల్ బుక్ ,పులిట్జర్ ప్రైజ్ లను గెలుచు కొంది .నేషనల్ ఇంష్టి ట్యూట్ ఆఫ్ పోయెట్రి  అండ్  లెటర్స్ ’నుండి స్వర్ణ పతకం అందుకొన్నది .’’ఇందరు ఉండగా నా కవిత్వానికే ఇన్ని అవార్డులు యందు కిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు బహుశా న్యాయ నిర్ణేతలు నా కవితలలో కవిత్వం ఉంది అని గుర్తించినందుకు కృతజ్ఞతలు ‘’అని చెప్పింది .

మూర్ కవిత్వం లో ‘’పారడాక్స్ ‘’ఎక్కువ .అంతకంటే ఆ కాలం లో బాగా రాసిన వారు లేరు .ఆమె రాసిన వాటిని ఎందరో ఉదాహరించేవారు అందుకే ఆమెది  ‘’సిజర్ లైక్ మెథడ్‘’అన్నారు . ఇన్ వర్తేడ్ కామాలలో ఉండే ఫ్రేజులు ఆమె ప్రత్యేకం .’’వుడ్ వీసెల్ ‘’లో ఆమె సాంకేతిక ఆధిపత్యం పతాక స్తాయిని చేరింది .కవిత్వం లోసంగీతమే ఉండదు రెండు మూడు సార్లు చదివి అర్ధం చేసుకోవాలి .తాను  రాసిన ప్రతిదీ ‘’the chief interest is borrowed and since I have not been able to overgrow this hybrid method of composition ,acknowledgements seem only honest ‘’అని నిజాయితీని ప్రకటించింది .ఆమె కవిత్వం తెలివి తేటలు ,రుచికర స్తాయి నుండి నైతిక నిజాయితీ స్తాయికి చేరింది .’’this is a poetry made of personal notations ,verbal niceties ,and preserved curiosities ,but it is also playful ,surprising and as penetrating as it is exquisite  ‘’అని ఆమె కవిత్వాన్ని విశ్లేషించారు .5-2-1972 న  84ఏళ్ళ వయసులో మరణించింది .ఎజ్రా పౌండ్ ను అభిమానిన్చినా ఆయన ఫాసిస్ట్ సమర్ధతను వ్యతిరేకించింది .అమెరికా మోడర్నిస్ట్ కవయిత్రి రచయిత్రి గా మంచి గుర్తింపు పొందింది .ఐరనీ విట్ లలో అనితర సాధ్యకవితలల్లింది .

Marianne Moore 1948 hires.jpg

 

వ్యవసాయాధారిత పారిశ్రామిక విప్లవం కోరిన కవి -జాన్ క్రూ రాన్సం –ఫుజిటివ్ ఉద్యమం

జాన్ క్రూ రాన్సం అమెరికా లోని టెన్నిసీ లో పులస్కి లో 30-4-1888 లో పుట్టాడు స్కాటిష్ ఐరిష్ వంశం వాడు .తండ్రి మినిస్టర్ .పోర్ర్వీకులు ‘’కు క్లాక్స్ క్లాన్’’సంస్థకు చెందినా వారు .డిగ్రీ పొంది టెన్నిసీ నాష్ విల్ లోని వాండర్ బిల్ట్ యూని వర్సిటి లో ఆక్స్ ఫర్డ్ లోని క్రైస్ట్స్ట్ కాలేజి లో పూర్తీ చేసి  అమెరికా వచ్చి వాన్దర్ బిల్ట్ లో లెక్చర్ అయ్యాడు ఇక్కడే ‘’ఫుజిటివ్ గ్రూప్ ‘’ను ఏర్పాటు చేశాడు  .సభ్యులందరూ పెన్ నేమ్స్ తో సంతకాలు పెట్టారు ఏడాదిలో సభ్యుఅల సమాఖ్య పదహారైంది .వ్యవసాయవాణిజ్య  ఆధారిత పారిశ్రామిక ప్రగతి రావాలని కోరారు .’’ఐ విల్ టెక్ మై స్టాండ్ ‘’అనే సింపోజియం నిర్వహించారు .వీళ్ళు దక్షిణ రాష్ట్రాల వాళ్ళు అందుకని స్తానికులు భయ పడ్డారు .దేనికీ నిబద్దులని ప్రకటించుకోక పోవతామూ ఇబ్బంది కలిగించింది .ఇందులోని ‘’అలెన్ టాటే’’ప్రముఖ కవి రచయితా అయ్యాడు .డోనాల్డ్ డేవిడ్ సన్ స్థానికత ,చరిత్ర పై రెండు గ్రంధాలు ‘’ది తెన్నేస్సి ‘’పేరా రాశాడు .యాభై వేల ఫ్రీ వేర్స్ పంక్తుల్ని ,’’అమెరికన్ సానేట్స్ ‘’ను రాశాడు రాబర్ట్ పెన్ పులిట్జర్ బహుమతి ‘’ప్రామిసెస్ ‘’కవితా సంకలనానికి -పొందాడు .ఫుజితివ్ లు అంటే పలాయనం చిత్త గించే వారని ,అస్తిర మనస్కులని అర్ధం .

ఫుజితివ్ ఉద్యమం మఖ లో పుట్టి పుబ్బ లో మాడినట్లు కనుమరుగైంది .రాన్సం ఒహాయో లోని గాంబియర్ చేరి కెన్యా కాలేజి లో పోయెట్రి ప్రొఫెసర్ అయి ,కెన్యా రివ్యు పేపర్ కు ఎడిటర్ కూడా అయ్యాడు .కెన్యా స్కూల్ ఆఫ్  క్రిటిక్స్ సంస్థను స్తాపింఛి నూతన విమర్శను వ్యతిరేకించాడు . ‘’they insisted an order control ,and attentionto craftsmanship ,objectives which could only have a salutary influence ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించారు .ఈ న్యు క్రిటిక్స్ విశ్లేషణలో ఉన్నారు సృజించిన వాడికంటే విమర్శా విశ్లేషణ చేసేవాడిదే గొప్పఅన్నారు . రచన తోపాటు దాన్ని బహిర్గతం చేసే పరిశీలనాత్మకమైనా ,పరిశోధనాత్మక మైన విశ్లేషణ కే ప్రాధాన్యత నిచ్చారు ..’’poetry to be written not to delight but to dissect ‘’అని స్పష్టం చేశారు .దీనిపై స్పందిస్తూ ఇలియట్ ‘’thirty  three years ago it seems to have been the latter type  of criticism,the impressionistic –that ha caused the annoyance I felt when I were on ‘’the functions of criticism ‘’.to day it seems to me that we need to be more on guard against the purely explanatory ‘’అని స్పష్టం గా చెప్పాడు .

ఇంప్రె శష నిజం మీద విరక్తి చెందినా రామ్సన్ మాత్రం ప్యూర్లి ఎక్స ప్ల నేటరి కి వ్యతిరేకియే .అతని ‘’ఫస్ట్ ట్రావెల్స్ ‘’,జెంట్ వాకింగ్ ,బ్లూ గర్ల్స్మొదలైన కవితలు బాగా ప్రాచుర్యం చెందాయి .చావును కూడా ‘’కౌంటర్ ఫీట్ గ్రావిటి ‘’గా భావించాడు ‘’’here lies a lady of beauty and high degree –of chills and fever she died ,of fever and chills –to delight of her husband ,her aunts ,an infant of three –and of medicos marveling sweetly on her ills ‘’అని అధిక్షేపించాడు .మనసుకు ఊరట కల్గిస్తూ గుచ్చుకుంటా ఉండేట్లు రాస్తాడు  ‘’.his  inflection is both nervous and drawling ,a patrician softness of speech that mingles cavilier grace with diablerie ‘’  అని అతని కవిత్వాన్నిబేరీజు వేశారు .3-7-1974లో ఎనభై అరవ ఏట ఒహాయ్ లోని గంబియార్ లో మరణించాడు .

 

John Crowe Ransom 1941.jpg

 

సవన్నా కవి – కాన్రాడ్  ఐకెన్

అమెరికా లో జార్జియా లోని సవన్నా లో   కాన్రాడ్ ఐకెన్  5-8-1889 లో పుట్టాడు సమకాలీన కవులు సంగీతాన్ని వదిలేస్తే దాన్నే పట్టుకొని పట్టు సాధించాడు .పదేళ్ళప్పుడే తండ్రి తల్లిని చంపేసి ఆత్మా హత్య చేసుకున్నాడు .దీనితో జీవితమంతా విచారమే మిగిలింది .ఒక దూరపు బంధువు మాసా చూసేట్స్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే  జీవితాంతం ఉన్నాడు. హార్వర్డ్ లో చేరాడు ఇలియట్ ఇతనిక్లాస్ మేట్.గ్రాడ్యుయేట్ అవగానే  కే  కెనడియన్  అమ్మాయి జెస్సీ మాక్దోనాల్ద్ ను పెళ్ళాడాడు .ముగ్గురు పిల్లలు .కొద్దిపాటి ఆదాయం తో కుటుంబ పోషణ చేశాడు కవిత్వం పై దృష్టిపెట్టి స్వంత ప్రయోగాలు చేసి ‘’ఎర్త్ ట్రయంఫంట్ ‘’   పుస్తకం తెచ్చాడు .తర్వాత ‘’టర్న్స్ అండ్ మూవీస్ ‘’ను రెండవదిగా తీసుకొచ్చాడు .

ముప్ఫై లో ఇంగ్లాండ్ వెస్ట్ కోస్ట్ లో గడిపి ,హార్వర్డ్ కు వెళ్లి రెండో పెళ్లి చేసుకుని ,వదిలేసి మూడో పెళ్ళాడి ఐ-ఇంగ్లాండ్ చేరాడు .యాభై లో మాసాచూసేట్స్ లోనే ఉండిపోవాలనుకున్నాడు .’’ది న్యు యార్కర్ ‘’పత్రికకు లండన్ విలేకరిగా ఉన్నాడు .ఎనిమిదేక రాల పొలం కొన్నాడు .గౌరవాలు పురస్కారాలు వెంట పడ్డాయి .సేలేక్టే పోయెమ్స్ కు పులిట్జర్ వచ్చింది  నేషనల్ బుక్ అవార్డ్ ,తో బాటు కవిత్వానికి బంగారు పతకం కూడా వచ్చ్చింది .వచనం రాసినా కవిత్వానికి తీసి కట్టు .’’మిస్టర్ ఆర్క్యులరిస్ ‘’ను బాగా ఆదరించారు .’’  he relies too much on the hypnotic power of his smooth phrases’’   .ఒక డజన్ మాటలతోనే విపరీతాన్ని సృష్టించే నేర్పున్నకవి .ఇంగ్లిష్ రొమాంటిక్ కవిత్వం లోని మాజిక్ ను బాగా వాడాడు .ప్రతిధ్వని తో కూడిన సంగీత శబ్దాలను వాడి చెవులకు ఇంపు మనసుకుహాయి కలిగించాడు .’’ఎన్ని హిలేషన్ ‘’కవితలో లైన్లు బాగుంటాయి ,-‘’these are the secret and I could hate you –when as I lean for another kiss –I see in your eyes that I don’t meet you –and that love is this ‘’ అని ప్రేమకు భాష్యం చెప్పాడు . 1973  ఆగస్ట్ పదిహేడు న ఎనభై నాలుగో ఏట చనిపోయాడు . ఉషాంట్ అనే స్వీయ జీవిత చరిత్ర రాసుకున్నాడు నవలా కారుడిగా మంచి పేరుంది .అందులో పెళ్ళిళ్ళు శృంగారం అంగారం అన్నీ రంగ రించాడు . మతిస్తిమితం కోల్పోయి ఆత్మా హత్యా ప్రయత్నానికీ పాల్పడ్డాడు .   ‘’పోయెట్రి సొసైటీ ఆఫ్ అమెరికా ‘’ఐకెన్ ” కు మొదటి ‘’షెల్లీ మెమోరియల్ అవార్డ్ ‘’నిచ్చింది .

మొదటి లైబ్రేరియన్ కాంగ్రెస్ కవి, రచయిత- ఆర్చిబాల్డ్ మాక్లీష్

ఇలినాయిస్ లో గ్లేనోయి లో 1892 మే ఏడున పుట్టాడు మాక్లిష్ .పౌండ్ మనసంతా నిండిపోయాడు .విట్మన్ ఊరించాడు .సాంద్ బర్గ్ భావ జాలానికి ఊగి పోయాడు ..స్కాటిష్ మర్చంట్ కొడుకు మాక్లీష్ హార్వర్డ్ ఎల్ యూని వర్సిటి లా స్కూల్ లో చదివి మొదటి ప్రపంచ యుద్ధం లో ఆర్టిలరి గా చేరి తర్వాత బోస్టన్ లో అటార్నీ అయ్యాడు .మూడేళ్ళ తరువాత ‘’గౌను’’ విప్పేసి  సంగీతం పాడే ‘’అడా  హిచ్ కాక్ ‘’ను పెళ్లి చేసుకుని ,విదేశాలకు వెళ్లి అమెరికా తిరిగి వచ్చి పొలం కొని కనెక్టికట్ లో సెటిల్ అయ్యాడు .పబ్లిక్ ఫిగర్ అనిపించుకున్నాడు .ఫార్ట్యూన్ మేగజైన్ లో చేరి పని చేసి ,కాంగ్రెస్ లో లైబ్రేరియన్ అయి ,రెండవ ప్రపంచ యుద్ధం లో నిజ నిర్ధారణ కమిటి కి డైరెక్టర్ అయ్యాడు .ప్రెసిడెంట్ రూజ్  వెల్ట్   కు ఆంతరంగిక బృందం లో ఒకడై ,తర్వాత అసిస్టంట్ సెక్రటరి ఆఫ్ స్టేట్ పదవి సాధించాడు .రెండవ యుద్ధం లో చురుకైన పాత్ర పోషించాడు మాక్లీష్ .హార్వర్డ్ లో బోయిస్తాన్ ప్రొఫెసర్ ఆఫ్  ఆరేటరి  అండ్ రేటరిక్ ‘’కి ప్రొఫెసర్ అయ్యాడు .      ఇన్ని పదవులు పొంది ప్రాముఖ్యం లో ఉన్నా రచన ఆపలేదు .పద్దెనిమిది కవితా పుస్తకాలు ,అనేక నాటకాలు ,వ్యాసాలూ రాసి ఎన్నో రాజకీయ ప్రసంగాలు చేశాడు .మూడు సార్లు పులిట్జర్ బహుమతి ని ,నేషనల్ బుక్ అవార్డ్ ను పొందాడు .ప్రజలకు ఇష్టమైనది ,తగినదీ రుచికరం గా రాసి వండి వడ్డించాడు .ప్రతిభ తో పాటు అదృష్టం ఉన్న రచయిత .’’. and there there over heard there thee hung over –  those thousands of white faces those dozed eyes –there in the starless dark ,the poise ,the hover –there with vast wings across the canceled skies –there in the sudden blackness ,the black pall –of nothing nothing nothing at all ‘’అని ‘’ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ‘’కవితలో గొప్పగా వర్ణించాడు .  The library, almost alone of the great monuments of civilization, stands taller now than it ever did before. The city… decays. The nation loses its grandeur… The university is not always certain what it is. But the library remains: a silent and enduring affirmation that the great Reports still speak, and not alone but somehow all together…అని గ్రంధాలయ విశిష్టతను చాటి చెప్పాడు .పుస్తకం అంటే ‘’రిపోర్ట్ అపాన్ మిస్టరి ఆఫ్ థింగ్స్ ‘’అని గొప్ప నిర్వచనం చెప్పాడు .

 

Conrad Aiken poet.jpg

 

                 సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్ 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే…”హిట్టే ” అన్నడైలాగ్ రచయిత దివాకర్ బాబు

నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే…

Published at: 16-06-2014 01:08 AM

మాటలతో మాయ చేసే గారడివిద్య ఆయనకు తెలుసు కాబట్టే ‘మాయలోడు’లో ప్రేక్షకులందర్నీ మాయ చేశారు. ఎక్కడ ఏ అక్షరం పడితే బావుంటుందో తక్కెడలో తూకం వేసినట్లు రాయగలరు కాబట్టే ‘శుభలగ్నం’లో సెంటిమెంటును పండించారు. పొట్టి మాటలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి యముణ్ని సైతం భూలోకంలోకి రప్పించిన ఆయన అక్షర విన్యాసం.. ఎలాంటిదో ‘యమలీల’ చూస్తే తెలుస్తుంది. ఒక ముక్క మాట్లాడలేని మూగజీవానికి సైతం గుండెకు హత్తుకునే మాటలు రాయొచ్చని ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో నిరూపించుకున్నారు. ఫ్యామిలీ, హ్యూమర్, సెంటిమెంట్ డైలాగుల్లో ఆరితేరిన ఆయనే దివాకర్‌బాబు. బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకొచ్చి.. వంద సినిమాలకు మాటలు రాసిన ఆయనే ఈ వారం డైలాగ్‌గురు..
“నువ్వు నీ మొగుణ్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగుణ్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!”

“కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు”

“ఇంకేం యముండ.
అదుగో గోల్కొండ”

“అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు”

“గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ”

‘పుష్పక విమానం’లో ఒక్క డైలాగు లేదు. కాని ప్రేక్షకులకు అద్భుతంగా అర్థమైంది. చార్లీచాప్లిన్ సినిమాల్లోను మాటలు ఉండవు. ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే- సినిమాకు డైలాగులు అవసరం లేదని. తెర మీద ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా చెప్పలేనప్పుడు మాత్రమే డైలాగులు రాయాలన్నది నా అభిప్రాయం. ఊరికే సినిమా నిండా వాగుడు వాగుడు వాగుడు ఉండకూడదు. అయితే ఆ ప్రయత్నం.. నా పూర్వీకులు చేయలేదు. నేను చేయలేదు. నా తర్వాత వారు కూడా చేయలేదు.

‘శుభలగ్నం’ క్లయిమాక్స్ సీను రాయను అని మొండి కేశాను. ఎందుకంటే రాస్తే.. ఈ పాత్రలన్నీ నాకు దూరమైపోయినట్లే లెక్క. అంటే ఆ పాత్రలతో నాకు తెలియకుండానే అంత అనుబంధం ఏర్పడిందన్నమాట.

‘ఘటోత్కచుడు’లో ఏవీఎస్‌కు రాసిన.. ‘రంగు పడుద్ది’ బాగా పాపులర్ అయ్యింది. గుంటూరులో రౌడీబ్యాచు ఈ మాటను అంటుండే వాళ్లు. దాన్ని నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. రంగు అంటే రక్తం. అందుకే ‘రంగు పడుద్ది’ అంటుంటారు.

సినిమాల్లోకి వస్తానని ఏ నాడు అనుకోలేదు. కరూర్ వైశ్యాబ్యాంకులో ఉద్యోగం చేసేవాణ్ణి. చదువుకునే రోజుల నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం నాకు. నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం ఇదే పని. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేసేవాణ్ణి. అయితే బదిలీ మీద విజయవాడకొచ్చాను. ఏదో పని మీద మద్రాసు నుంచి రేలంగి నరసింహారావుగారు ఆ ఊరొచ్చారు. పూసల వెంకటేశ్వరరావు అనే రచయిత నా గురించి ఆయనకు చెబితే ఒకసారి వచ్చి కలవమన్నారు. రేలంగి బస చేసిన హోటల్ గదికి వెళ్లి ఆయన్ని కలిశాను.
ఒక సినిమాకు కథ చెప్పడం అదే ఫస్ట్‌టైమ్. చిన్న లైన్ చెప్పగానే ఆయనకు తెగ నచ్చింది. ‘లైన్ బాగుంది. ట్రీట్‌మెంట్ రాసి మద్రాసుకు పంపండి’ అన్నారాయన. వెంటనే రాసి పంపించేశాను.
అదే కథతో సినిమా తీస్తున్నట్లు నాకు కబురు పెట్టారు. “డైలాగులు కూడా నేనే రాస్తానండీ” అని రేలంగిని అడిగితే సరే అన్నారు. అలా ‘కొంటెకాపురం’తో డైలాగ్ రైటర్‌గా నా ప్రస్థానం మొదలైంది. అప్పట్లో అది పెద్ద హిట్. చంద్రమోహన్ హీరోగా ఫేడవుట్ అవుతున్న సమయంలో వచ్చిందది. సినిమా రచనలో అనుభవం లేకపోయినా.. నాటకాలకు, దృశ్యమాద్యమానికీ వ్యత్యాసం తెలుసు. ఆ తర్వాత ‘డబ్బు ఎవరికి చేదు’, ‘మన్మధలీల కామరాజు గోల’లకు మాటలు రాశాను. మెల్లగా అవకాశాలు పెరగడంతో.. బ్యాంకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పటికి పన్నెండేళ్లు బ్యాంకులో పనిచేశాను. ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’, ‘మావిచిగురు’, ‘చూడాలనివుంది’, ‘ఆహ్వానం’, ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించే అవకాశం వచ్చింది. మొత్తం కలిపితే వంద సినిమాలకు డైలాగుల్ని అందించాను నేను. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశాను. నాకు గుర్తున్న కొన్ని సినిమాల్లోని కొన్ని డైలాగులు ఇవి.
రాజేంద్రుడు గజేంద్రుడు
కథ సిద్ధమయ్యాక – దర్శకుడు ఎవరైతే బావుంటుంది? అని ఆలోచిస్తున్నాం. “మీరే చేయండి” అని ఎస్వీ కృష్ణారెడ్డిని ప్రోత్సహించాం. కథ ఆయన రాసిందే కావడంతో తీయడం సులువైంది. అప్పట్లో నేను కేవలం డైలాగులు రాయడం వరకే పరిమితం కాలేదు. స్క్రీన్‌ప్లేను మలచడం, పాత్రలకు ఒక స్వభావాన్ని ఇవ్వడం, కథా చర్చల్లో పాల్గొనడం చేసేవాణ్ణి. ఈ సినిమాకు పనిచేయడం మాత్రం కొత్త అనుభవం. సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక్కరే హీరో కాదు. ఏనుగు కూడా హీరోనే! అది జంతువు కాబట్టి మాట్లాడలేదు. దాని పక్కనున్న క్యారెక్టర్ మాట్లాడే మాటలను బట్టి.. ఏనుగు భావాలను ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఏనుగు తల ఊపితే.. “ఓహో! నువ్వు అలా అనుకుంటున్నావా” అని పక్క పాత్రలు చెబుతుండాలి. అలా రాయడం చాలా డిఫికల్ట్ ఫీట్. ఇంతకుమునుపు జంతువుల సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ చూశాను. అయితే ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’కు మాటలు రాయడం కష్టం అనిపించింది. ఏనుగు బాధ పడుతోంది. ఆ బాధను ఎలా చెప్పాలి? ఏనుగు పక్కనే అత్యంత ప్రీతిపాత్రమైన రాజేంద్రుడు అనే పాత్ర దాని హృదయాన్ని అర్థం చేసుగోలడు అనేది చెప్పగలగాలి. అయితే ఆ విషయం ప్రేక్షకులకు నేరుగా తెలియకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ.. సంభాషణలను రాశాను.
ఇందులో – అలీకి ఒక సన్నివేశముంది ‘జంబలకిడిపంబ’ తీస్తున్న సమయంలో.. నేను, అలీ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు.. ‘జిబ్రిష్ లాంగ్వేజ్’లో ఒక కామెడీ ట్రాక్ చేసి చూపించాడతను. అదే భాష కాదు. ఒట్టి సంజ్ఞలతో చేసే భావవ్యక్తీకరణ.అంతే!
అలీ చేసిన ఆ సీను బాగా గుర్తుండిపోయింది. దాన్నే క్యారెక్టర్‌గా మలిచి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో బ్రహ్మానందానికి పక్కనుండే ఒక పాత్రను పెట్టాను. ఆ పాత్రను అలీనే చేశాడు. అతను మాటి మాటికీ ‘ఇంద చాట’ అంటుంటాడు. అందులో ఒక్క ముక్క అర్థం కావు. దాని వల్ల బ్రహ్మానందం పడే అవస్థల్ని చూస్తే నవ్వొస్తుంది. వీళ్లిద్దరి మధ్య నడిచే సీన్ల కోసం పెద్ద పెద్ద డైలాగులేమీ రాయలేదు. అందుకే ప్రేక్షకులకు నచ్చింది.
మాయలోడు
ఆ రోజు నాకు జ్వరం వస్తే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ క్యాసెట్టును పంపిస్తే.. డీవీడీ ప్లేయర్‌లో వేసుకుని చూస్తున్నానప్పుడు. నా పక్కనే మసాజ్ చేసే వ్యక్తి కూర్చున్నాడు. సినిమాను చూస్తూ.. కొన నాలుకను బయటికి చాపి.. కనుబొమలు పైకి ఎగరేసి.. ఒక విచిత్రమైన ఫేసు పెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్నంత సేపు.. “ఇతను మెచ్చుకుంటున్నాడా? లేదంటే వెక్కిరిస్తున్నాడా?” అనేది అర్థం కాలేదు. ఇదే భావనను తీసుకుని క్యారెక్టరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా పుట్టిందే ‘మాయలోడు’లో బ్రహ్మానందం పక్కనుండే అలీ క్యారెక్టర్. బ్రహ్మానందం ఏం మాట్లాడినా నాలుక బయటపెట్టి కనుబొమలు పైకెగరేసి.. మౌనంగానే తలను అటూఇటూ ఆడిస్తుంటాడు అలీ. అతని వింత ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు నవ్వి నవ్వి ఊగిపోయారు. ఒకసీనులో అమ్మాయిలతో హోటల్‌లో కలిసి భోంచేసిన బ్రహ్మానందం బిల్లు కట్టలేక పిండి రుబ్బాల్సి వస్తుంది. అప్పుడు అలీ నాలుక బయటపెట్టి తల ఆడించే విన్యాసం అద్భుతంగా నవ్వించింది. ఆ సీనుకు డైలాగులు అవసరం లేదనే రాయలేదు. ఒక వేళ అలీకి మాటలుండి ఉంటే అంత నవ్వించగలిగేది కాదు ఆ సన్నివేశం. ఆ కిటుకు రచయితకు తెలిసుండాలి. డైలాగు రైటర్ ప్రతి పాత్రను వాగుడుకాయ చేయకూడదు.
‘నేను గానీ ఒక ఈలగానీ వేశానంటే’ అంటూ రాజేంద్రప్రసాద్ రోడ్డు మీద గారడివిద్య చేసి మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయే సీను అది. జనం వెళ్లిపోయినా.. అక్కడొకచిన్న పిల్ల దిగులు ముఖం పెట్టుకుని కూర్చునుంటుంది. ‘ఏంటమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు?’ అనడిగితే.. “మా మమ్మీడాడీని మా మావయ్య చంపేశాడు..” అని ఏడ్చినంత పని చేస్తుంది. అంతవరకు రాజేంద్రప్రసాద్ చేసిన గారడి విద్యలు నిజమని నమ్మిన ఆ పిల్ల ‘నువ్వుగానీ ఒక ఈలగానీ వేస్తే మా అమ్మానాన్నా వస్తారుగా’ అని ఆశగా అడుగుతుంది. ఆ చిన్న సన్నివేశం ప్రేక్షకుల గుండెల్ని తాకింది.
మరొక సీను – రాజేంద్రప్రసాద్ నిరక్షరాస్యుడు. అంధురాలైన అమ్మాయిని చేరదీసుంటాడు. ఒకసారి తన పేరు రాయమని కోరతాడు. అప్పుడు ఆ అమ్మాయి పలకలో రాస్తుంది. పక్కనున్న వ్యక్తితో రాజేంద్రప్రసాద్ “ఏంట్రా కరెక్టుగా రాసిందా” అని అడుగుతాడు. “గాడు అని రాసిందిరా” అంటాడతను. వీరబాబు ‘గాడు’ (సినిమాలో తన క్యారెక్టర్‌పేరు) అని రాసిందా” అని అంటాడు రాజేంద్రప్రసాద్. అప్పుడు ఆ వ్యక్తే మళ్లీ ‘జిఒడి గాడ్ అని రాసింది” అని చెప్పగానే హీరో కళ్లలో నీళ్లు మెదులుతాయి. అంటే ఆ పిల్ల తనను దేవునిగా భావిస్తోంది అని చెప్పడం ఆ చిన్న డైలాగు ఉద్దేశం. అంతకంటే మరొక్క మాట అక్కడ అక్కర్లేదు.
సినిమా అన్నది ‘మేక్ బిలీఫ్’. ప్రేక్షకులు చూస్తున్నంతసేపు వాళ్లను నమ్మిస్తే చాలు. ‘మాయలోడు’లో పెద్ద ఫ్లా యేంటో మేకర్స్‌గా మాకు తెలుసు. కాని అంతవరకు ఆలోచించకుండా ప్రేక్షకులను మాయ చేయగలిగాము. గారడీ తెలిసిన రాజేంద్రప్రసాద్ అవసరం అనుకుంటే టక్కున మాయమైపోగలడు. మనుషుల్ని కప్పల్ని, కుక్కల్ని, పిల్లుల్ని చేయగలడు. కాని ఇంట్లో వున్న గుడ్డి పిల్లకు మాత్రం కళ్లు తెప్పించలేడు. మరేమిటి నాన్సెన్సు. తనకున్న విద్యతో ఆ పిల్లకు కళ్లు తెప్పించొచ్చుగా! అని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే? అన్న తర్కం రాకుండా సీన్లు రాయాల్సొచ్చింది. ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్. స్క్రీన్ మీద చూపించిందే ప్రేక్షకుడు నమ్ముతాడు. దాని వెనకున్నది నమ్మడు.
శుభలగ్నం
దీనికి కథ భూపతిరాజా. ‘ఇన్‌డీసెంట్ ప్రపోజల్’ అనే ఆంగ్ల చిత్రం నుంచి కథను తీసుకున్నారాయన. ఆ కథలో కోటి రూపాయలకు భార్యను అమ్మేస్తాడు ఓ భర్త. అదే కథను తెలుగులో తిప్పి రాశాడు రాజా. కాబట్టే ‘శుభలగ్నం’లో భర్తను అమ్ముకుంటుంది భార్య. నాకు కథ వినిపించాక.. మీరు నమ్ముతారో లేదో కాని.. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే చకచకా మాటలన్నీ రాసేశాను. ఇందులో ఆమని పాత్రకు చిన్న అమాయకత్వం కనక జోడించకపోయుంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యుండేది. ఆమనిది సాధారణ గృహిణులు ఆశపడే స్వభావం. ప్రతిదాన్నీ పక్కవాళ్లతో పోల్చుకోవడం ఆమె నైజం. మాట మాటకు ఆఖర్న ‘ఏమిటో..’ అంటూ దీర్ఘం తీసి చెప్పే ఆమె మానరిజం అప్పట్లో అందరి మెప్పు పొందింది.
భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన ఆమని.. ఒక ఖరీదైన బంగళా కొంటుంది. ధగధగలాడే నగలు ధరించి, పట్టుచీర కట్టుకుని.. దర్జా ఒలకబోస్తుంటుంది. ఆ సమయంలో బంగళాను అమ్మేసిన సుహాసిని అక్కడికొస్తుంది. ఆవిడను చూసిన ఆమని “నా వైభోగం చూసిపోదామని వచ్చావా ఏమిటి?” అంటుంది. “లేదు పనివాళ్లు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. నా భర్త ఫోటో మాత్రం ఉంది. అది స్వయంగా తీసుకెళదామని వచ్చాను” అని చెబుతుంది సుహాసిని. మళ్లీ ఆమని కలుగజేసుకుని “ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకు అని చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. నీకంటే గొప్పదాన్నని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?” అని ఆమని కాస్త పొగరు స్వరంతో చెబుతుంది. “నువ్వు నీ మొగున్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగున్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!” అని సుహాసిని చెప్పే డైలాగ్ ఆమనిని ఆలోచనలో పడేస్తుంది.
ఆ రోజు పెళ్లి రోజు. పేకాటలో మునిగిపోయిన ఆమని ఆ సంగతిని మరిచిపోతుంది. ఆటలో గుర్తుకొచ్చి వెంటనే ఇంటికి పరిగెత్తుకొస్తుంది. అప్పటికే రెండో భార్య రోజాను తీసుకుని బయటికి వెళ్లుంటాడు జగపతిబాబు. ఇంటికొచ్చిన ఆమని గబగబ మేడ మీదికి ఎక్కి మొగుడి కోసం వెతుకుతుంది. లేడని తెలుసుకుని విసుగుతో మెట్లు దిగుతూ కిందికొస్తుంటే.. అక్కడే ఉన్న వాళ్లమ్మ అన్నపూర్ణ “ఇంతకన్నా దిగిపోవడానికి నీకు మెట్లు లేవమ్మా” అంటుంది. ఆ ఒక్క చిన్న డైలాగు ఆ సన్నివేశానికి ఎంత బలాన్ని అందించిందో చెప్పలేను. డబ్బు కోసం మొగున్ని అమ్ముకుని.. అతను లేని లోటును మెల్లగా తెలుసుకుంటున్న ఆమె.. రియలైజేషన్‌లోకి వెళ్లిందీ అని చెప్పటానికి ఆ మాట తోడ్పడింది.
అది క్లయిమాక్స్ సీను – డబ్బు మీద ఆశ చచ్చిపోయి ఉన్నదంతా అనాధాశ్రమానికి రాసిచ్చేసి.. విదేశాలకు వెళుతున్న మొగుడి కోసం ఎయిర్‌పోర్టుకు వస్తుంది ఆమని. అక్కడ రోజా, జగపతిబాబు మధ్య ఒక సీనుంటుంది. పరాయి మొగుడి మీద ఆశ పడటం ఎంత తప్పో తెలుసుకున్న రోజా.. “కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు” అని చెబుతుంది. ఈ డైలాగే కాదు. ఇందులోనివన్నీ చాలా క్లుప్తంగా ఉంటూనే, శక్తివంతగా అనిపిస్తాయి. కాబట్టే సామాన్యప్రేక్షకుల హృదయాలను పట్టుకున్నాయవి. నేనెక్కడా ఇందులో పంచ్‌లు పడాలని మాటలు రాయలేదు. ఆ సందర్భానికి ఆ పాత్ర మనసులో ఏముంది? ఏం మాట్లాడితే బాగుంటుంది? అన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను.
చూడాలని ఉంది
చిరంజీవి ఒక పెద్ద మాస్ హీరో. అయినాసరే చాంతాడంత మాటలు రాయలేదు. సౌందర్య తన ట్రంకుపెట్టెలో దాచుకున్న ప్రేమలేఖను చదివి వినిపించే సీనొకటి అద్భుతంగా పండింది.(మొదటిపేజీ తరువాయి)
ఆమెకు ఇదివరకు ఎవరో లవ్‌లెటర్ రాస్తే దాన్ని పెట్టెలో నుంచి అపురూపంగా బయటికి తీస్తుంది. లేఖను చదవమంటాడు చిరంజీవి. అప్పుడు సౌందర్య సిగ్గుతో కూడిన అమాయకపు ముఖంతో.. గొంతు సవరించుకుని.. లేఖ తీసుకుని.. “పద్మావతీ పద్మావతీ.. నీ ఎర్రని మూతి.. చూడగానేపోయింది నా మతి” అని చదువుతూ మెలికలు పోతుంది. చదవడం అయిపోగానే “చూశావా నా కోసం రక్తంతో రాశాడు” అంటుందామె. “అబ్బో అంత కలర్ ఇచ్చాడా?” అంటాడు చిరు.
డైలాగుల కోసమని డైలాగులను నేనెప్పుడూ రాయను. పొదుపుగా రాయడం అలవాటు. ఒక సీనులో విలన్ అనే ఒకే ఒక్క మాటతో హీరో గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన సీను అది. ఒక పాత సినిమాలో ఎస్వీ రంగారావు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో “నీకు మరణమే శరణ్యం. నీకు.. మరణమే.. శరణ్యం. నీకు.. మరణమే… శరణ్యం” అనే డైలాగును అద్భుతంగా చెబుతాడు. ఏకవాక్యాన్నే మొదట మెల్లగా, రెండోసారి ఇంకాస్త గట్టిగా, మూడోసారి మరికాస్త గట్టిగా హైపిచ్‌లో చెప్పాలి దీన్ని. అదే భావోద్వేగంతో ‘చూడాలనివుంది’లో విలన్ ప్రకాష్‌రాజ్‌కు డైలాగును రాశాను. “మీరొకసారి ఎస్వీరంగారావు గారి సినిమా చూస్తారా? అందులో ఆయన ఎలా చెప్పారో తెలుస్తుంది” అన్నాను ప్రకాష్‌రాజ్‌తో. అయితే ఆయన “వద్దండీ నేను చూడను. చూస్తే ఆయన ఇమేజ్ నా మీద పడుతుంది. నేను నా సొంత స్టయిల్‌లోనే చెబుతాను” అన్నారు. అప్పుడు ఆయనకు రాసిన డైలాగ్.. “వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు”. ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ డైలాగ్ హీరో రేంజ్‌ను పెంచింది.
యమలీల
ఒక్కోసారి రచనకు లొకేషన్లు కూడా పనికొస్తాయి అనేందుకు ఇందులోని ఒక సీను నిదర్శనం. ఈ స్క్రిప్టు నేను మద్రాసులోనో ఇంకోచోటో కూర్చుని రాసుంటే ఎలా రాసుండేవాన్నో తెలీదు. భవిష్యవాణి పుస్తకాన్ని పొరపాటున భూలోకంలోకి జారవిడచడంతో.. ఇంద్రుడు శపిస్తాడు. దాంతో యముడి వేషం వేసిన సత్యనారాయణ, చిత్రగుప్తుడైన బ్రహ్మానందం భవిష్యవాణి కోసం.. భూలోకంలోకి వస్తున్న సన్నివేశం అది. “శాపం పడితే పడింది కాని మనకు సెలవు దొరికింది” అని చమత్కరిస్తాడు చిత్రగుప్తుడు. అందుకు కోపమొచ్చిన యముడు “యముండా…..!!!!” అని ఘీంకరిస్తాడు. “ఇంకేం యముండ. అదుగో గోల్కొండ” అని బ్రహ్మానందం చెప్పిన డైలాగుకు థియేటర్లన్నీ విజిళ్లతో మోగిపోయాయి. వాళ్లిద్దరు భూలోకంలోకి వచ్చారు అని చెప్పడానికి గోల్కొండను చూపించడం నా ఉద్దేశం. యముండకు, గోల్కొండకు ధ్వని కూడా బాగా కుదిరింది. ఈ డైలాగును హైదరాబాద్‌లో కూర్చుని రాశాను కాబట్టే ఈ ఐడియా వచ్చింది. ఇంకోచోట అయ్యుంటే వచ్చేది కాదేమో!
ఇంకో సీనులో అమ్మ గొప్పతనాన్ని చెప్పాల్సొచ్చింది. భూలోకంలో యముడు భోజనం చేస్తుంటాడు. అప్పుడతను “అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు” అంటాడు. ఆ డైలాగు ప్రేక్షకుల మన్నన పొందింది. ఇంకో సీనులో యముడు ఒక తాగుబోతును తన సహజసిద్ధ ధోరణిలో ‘మానవా’ అని పిలుస్తాడు. అప్పుడు ‘మానను’ అంటాడు ఆ తాగుబోతు.
‘యమలీల’లో అందరికీ గుర్తున్న కవిత ఒకటుంది. తనికెళ్ల భరణి “గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ” అనేదే ఆ కవిత. ఆ సినిమా తర్వాత ఈ కవితకు వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు. అందర్నీ బాగా నవ్వించింది. ఇప్పటికీ నవ్విస్తోంది..” అని ముగించారు దివాకర్‌బాబు.

ప్రస్తుతం మణికొండలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ‘మీరు ఇప్పుడేమీ రాయడం లేదా’ అంటే ‘ప్రతి మనిషీ ఒక చోట ఆగాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. ఇప్పుడొస్తున్న సినిమాలకు మాలాంటి వాళ్లం రాయలేము. బూతులు అసలే రాయలేను..” అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారీ సక్సెస్‌ఫుల్ డైలాగ్ రైటర్.
ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని

— నిజం గానీ శ్రీ ఆలూరి భుజంగ రావు గారు మరణించి ఏడాది అయిందా?అని పిస్తోంది .నిజాయితీ  నిబద్ధతలకు మారు పేరు ,మా ఉయ్యూరు లో దశాబ్దం పైగా ఉన్నవారు నిత్యం కలిసి మాట్లాడిన వారు ,గుంటూరు నుండి ఉత్తర ప్రయ్తుత్తరాలు జరిపిన వార అతి నిరాడంబరులు ఆలూరి వారు .వారిని గురించి జ్ఞాపకం చేసిన ”కాలం కవి ”కి ”నాన్న గారు ”అని గుండె లోతుల్లోంచి పలికిన వారి సంస్కారానికి ధన్య వాదాలు చెబుతూ అందరికోసం దీన్ని మీకు అందిస్తున్నాను -దుర్గా ప్రసాద్

గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని

Published at: 16-06-2014 01:07 AM

నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు.

దేన్నీ మిగల్చదు. ముందూ వెనకగా సమ స్త ప్రాణికోటి కాలగర్భంలో కలసిపోవాల్సిందే! వ్యక్తు లు మిగలరు. వీళ్ల జ్ఞాపకాలే మిగుల్తాయి. నాకు గురుసమానులైన మా నాన్న – ఆలూరి భుజంగరావు గారు మరణించి అప్పుడే సంవత్సరం కావస్తోంది! ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. 2013 జూన్ 20న ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోయారు. సాహిత్యా న్ని చదువుతుంటే ఆయన జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి…

రచయితల రచనల్లోనే వాళ్ల వ్యక్తిత్వం ద్యోతకమవుతుందంటారు. అద్భుతమైన అనువాదాలనూ, రచనలనూ దాదాపుగా విపరీతమైన శారీరక, మానసిక బాధల్లోనే, దరిద్రంలోనే రాశారు. కానీ తనను మానవుడిగా, రచయితగా తీర్చిదిద్దింది ఈ దేశంలోని కూటికి, గుడ్డకు నోచుకోని కోట్లాది దరిద్ర మానవులే- అని సగర్వంగా చెప్పుకున్నారు. సమస్త విజ్ఞానాలూ, ఐశ్వర్యాలూ, సుఖాలూ- సంపదలూ అన్నీ మురికి ఓడుతూన్న మడి మనుషుల చెమట చుక్కల్లోంచేనని త్రికరణ శుద్ధిగా నమ్మారు. ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్న- ఆయన జీవితం అస్తిత్వాన్ని దాల్చిన క్షణం నుండి ఆయనను వేధించిన ప్రశ్న. ఆయన జీవితంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రశ్న. ‘జీవితాన్ని పొగల్లో, సెగల్లో, పంచాగ్నుల మధ్యా భస్మీపటలం చేస్తున్న ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్నకే ప్రాధాన్యతనిస్తే, నా జీవిత చరిత్రగా పేరు పెడితే? అది నా దేశంలోని అసంఖ్యాకులైన మానవుల చరిత్ర అవుతుందని రాసుకున్నారు. సరైన వైద్యం చేయించలేక ఇద్దరు మొగపిల్లల్ని పోగొట్టుకున్నారు. ‘ఈ సమాజ కరాళ దౌష్ట్యాలకు ఎరగా ఇప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఇచ్చానని’ 1974లో రాసుకున్నారు. హాలాహలం లాంటి జీవితంలోంచి అమృతమనే సాహిత్యాన్ని రచించారు.

ఆకలిగొన్నవారు, అన్నార్తులు, అభాగ్యులు కనపడితే వాళ్లు అడిగినా, అడగకపోయినా ఎంతో కొంత తన జేబులోంచి తీసి వాళ్ల చేతుల్లో పెడుతుండేవారు. వాళ్ల కళ్లల్లో దైన్యం, ఆకలి కనపడుతోందనేవారు. నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. జీవితంలో ఇంకా నేర్చుకోవలసింది ఎంతో వున్నదని భావించేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు. ఎంత బాధలో వున్నా హాస్యోక్తుల్ని విసురుతుండేవారు. ఆయన భాషలో సున్నితమైన హాస్యం మేళవించి వుండేది.

2000 నుండి 2013 దాకా అంటే దాదాపుగా 13 ఏళ్లు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కాకుండా, రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చివరి దశ లో ఏ రకమైన మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడ్డారో.. ఆ రకమైన బాధల్నే భుజంగరావు కూడా అనుభవించారు. ఒక్కొక్కప్పుడు సమయ, సం దర్భాలనుఆయన మెదడు స్వీకరించలేకపోయేది. తన కు వచ్చిన భావనను వెంటనే వ్యక్తపరచాలనుకునేవారు. తన మరుపు, మాటలు, ఆప్తులనూ, మిత్రులనూ బాధపెడుతున్నాయేమోనని కలవరపడిపోయేవారు. తనస్థితికి అమితంగా బాధపడేవారు. ఒక రకం గా మెదడుకు సంబంధించిన అనారోగ్యం ఆయన మెదడును కబళించివేసింది. ఐతే, సహృదయులైన సాహితీమిత్రులు ఆయన స్థితిని అర్థంచేసుకుని, ఆయ నను ఆదరించేవారు- తాను నమ్మిన ఆదర్శం, సిద్ధాం తం, ఆశయాల పట్ల చివరిదాకా పూర్తి జ్ఞాపకశక్తితో, చాలా ఖచ్చితంగా చెప్పగలిగి వుండడం గమనార్హం.

ఎంతో నిమగ్నత వుంటే తప్ప రాహుల్జీని అనువదించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలు (జిరాక్స్ మిషన్ లాంటివి) అప్పుడు లేవు. ఆర్థిక సమస్యలూ, అనారోగ్యం సరేసరి. పెద్ద కుటుంబం చిన్న ఇల్లు. ఇల్లంతా బంధువులతోటి, మిత్రులతోటి నిండి వుండేది. కమ్యూనిస్టు భావాలు కలిగి వుండటాన పనిచేసే చోట మేనేజ్‌మెంట్ నుండి మానసిక వత్తిడి, హింస ఎక్కువగా వుండేవి. ఇటువంటి పరిస్థితులలో నిరంతర అధ్యయనం. రాహుల్జీ, యశ్‌పాల్, ప్రేమ్‌చంద్ లాంటి ప్రముఖుల అనువాదాల్ని ఎలా చేయగలిగారో అని అనిపిస్తుంది. పేపరు కింద కార్బన్ పెట్టుకుని వేసవి వడగాలులతో, చెమటను తుండుగుడ్డతో తుడుచుకుంటూ రాసేవారనీ, రాహుల్జీని అనువదించేటపుడు అన్నం తింటూ మధ్యలో లేచివెళ్లిపోయి చెయ్యి కడుక్కునేవారని అమ్మ చెప్పేది. తన సొంత రచనలను, ఎంతో శ్రమకోర్చి అనువాదం చేసిన అనువాదాలను అనేకం పోగొట్టుకున్నారు. అవి వెలుగు చూడాలనీ, ఆ ఆణిముత్యాలను తెలుగు పాఠకులకు అందించాలనీ తపనపడేవారు. ప్రస్తుత సమాజంలో సాహితీపరుల బాధ్యతను గుర్తుచేస్తూ.. కవి ధరించవల్సింది కలమా? ఖడ్గమా? అన్న మీమాంస వచ్చినపుడు- సుబ్బారావు పాణిగ్రాహి కలంతో పాటు ఖడ్గాన్ని కూడా ధరించవల్సిందేనని అనేవారు. భవిష్యత్ తరాలు తప్పనిసరిగా ‘నాదీ-నీదీ’ అనేది లేని సమాజాన్ని నిర్మించుకుంటారని, అలాంటి సమాజాన్ని నిర్మిద్దామని కలలు కనేవారు. ఐతే అప్పటిదాకా ఎంతమంది మానవులు రక్తతర్పణం కావించారు? అంటూనే తప్పకుండా ఆ రోజులు వస్తాయని విశ్వసించేవారు.

‘జీవితంలో తాను అనుకున్నవి ఏవీ అనుకున్నట్టుగా జరగలేదని కనీసం చావైనా ప్రశాంతంగా రావాలని’ కోరుకున్నారు. ఆయన చనిపోయేదాకా గుంటూరులోని ఎ.టి.అగ్రహారం, 7వ లైనులో దాదాపుగా 10 ఏళ్ల పాటు వున్నారు. చనిపోయేనాటికి ఆ ఇంటి అద్దె 2,200 రూపాయలు. ఇంటి నేల గచ్చునేల కాదు. మట్టినేలకు ఎర్రకళాయి పూశారు. అందుకే కొంచెం తక్కువ అద్దె తీసుకునేవారు. ఆయన చనిపోయాక ‘ఇంత గొప్ప వ్యక్తి! గొప్ప సాహితీవేత్త! అనుకున్నది ఆచరించి చూపే నిజాయితీపరుడు! దహన కార్యక్రామాలు అయ్యేదాకా ఇంటి ఆవరణలోనే వుంచండి.. బయట వుంచవద్దని’ ఇంటి ఓనరు చెప్పారు. ప్రశాంతంగా చనిపోవాలన్నది ఒక్కటి మాత్రమే ఆయన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో తనకు కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మావోయిస్టు భావజాలం తోడ్పడ్డాయనీ, తనను మనిషిగా తీర్చిదిద్దాయనీ అటువంటి ఆ భావజాలానికీ, ఆలోచనా విధానానికీ, ఆచరణకీ అత్యంతగా కృతజ్ఞుణ్ణయి, వినమ్రుణ్ణయి తలవంచుకు అభినందనలు తెలియపరుచుకుంటున్నానని -సగౌరవంగా చెప్పుకున్నారు.

ఆయన ఆశయాలనూ, ఆదర్శాలనూ, నమ్మిన సిద్ధాంతాలనూ గౌరవించి, కొనసాగించడమే కా.ఆలూరి భుజంగరావు గారికి మనమిచ్చే నివాళి. శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరిస్తూ.. జోహార్లు చెప్తూ.. కన్నీటి పర్యంతమవుతూ..

– కవిని

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని ఆధిపత్యాలను ధిక్కరించడమే కవిత్వం – వివిధ

 అన్ని ఆధిపత్యాలను ధిక్కరించడమే కవిత్వం – వివిధ

మూడు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం సమగ్ర కవితా సంకలనం వచ్చిన సందర్భంగా పాత్రికేయుడు నగునూరి శేఖర్, రీడర్ బూర్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కవి అన్నవరం దేవేందర్, కథకుడు కె.వి.నరేందర్, మరొక తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు గాజోజు నాగభూషణం కలిసి చేసిన ఇంటర్వ్యూ ఇది. తెలంగాణ సమాజమే కాదు తెలుగు నేలంతా అతలాకుతలమై ఎదుర్కొన్న సంక్షోభాల, సంఘర్షణల, విధ్వంసాల సారాంశమే ఈ సంభాషణ…

కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు.. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.. కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.

శేఖర్: తెలంగాణ సాహిత్యంలో కవులు, కళాకారుల భాగస్వామ్యం ఎంత?

– ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ప్రముఖమైంది. భావజాల విస్తరణలో వీరి రచనలు అత్యంత ప్రభావవంతమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కవులు, కళాకారుల పాత్ర తెలంగాణ సాధనలో ప్రథమశ్రేణికి చెందినది.

శేఖర్: తెలంగాణ ఆవిర్భావానంతరం కవులు, రచయితల పాత్ర ఎలా ఉండాలి?

– ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కవులు, రచయితలు తమ తమ కార్యాకారణమైన రచనల ద్వారా ప్రజలను ఆధిపత్య నయా దోపిడీకి వ్యతిరేకంగా అప్రమత్తం చేసి ఉద్యమ దిశగా నడిపించాల్సివుంది.

శే: చరిత్ర, సంస్కృతి, భాష పునర్నిర్మాణానికే కవులు, రచయితలు పరిమితం కావాల్నా? లేక రాజకీయ మార్గదర్శనంలో వాళ్ల అవసరముందా?

– అస్తిత్వ ఉద్యమాలకు కారణభూతం ఆధిపత్య అణిచివేత. అందు లో భాగమే చరిత్ర, సంస్కృతి, భాషలను తిరిగి నిర్మించుకోవడం ఇందు లో భాగంగా గత దశాబ్దంన్నరగా తెలంగాణ కవిత్వ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏర్పడిన ఆధిపత్య రాజ్యానికి వ్యతిరేకంగా తిరిగి కవులు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో తప్పనిసరి సృజనాత్మకంగా ఆచరణాత్మకంగా వ్యవహరించాలి.

శే: తెలంగాణ భాషకు ప్రాధాన్యత విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు?

– తెలంగాణ రాష్ట్ర ఉద్యమం భాష న్యూనత నుండి ప్రారంభమైంది. రాష్ట్రంలో భాషకు, సంస్కృతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేయాలి. అందులో భాగంగా ముందు పాఠశాల వాచకాల్లో భాష, చరిత్ర, సంస్కృతిని ప్రవేశపెట్టాలి. గ్రామీణ కార్యాలయాల స్థాయి నుండి సచివాలయం వరకు అన్ని శాఖల్లో మన తెలుగును తప్పనిసరి చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడుకాని తెలంగాణ భాషకు అర్థం పరామర్థం కలుగదు.

వెంకటేశ్వర్లు: మీ కవిత్వం సమాజ సంఘర్షణను ఆవిష్కరించే భావజాల వ్యాప్తికే పరిమితం అవుతుందా? ఏదేనీ కార్యాచరణను సూచిస్తుందా?

– నా కవిత్వమే కాదు, ఏ ప్రవహించే కవి కవిత్వమైనా సామాజిక సంక్షోభ, సంఘర్షణ నుంచే పుడుతుంది. ఆ కవిత్వ కార్యాచరణే ఉద్యమాల చిరునామాగా ఉంటుంది.

వెం: మొదటి నుండి మీరు తెలంగాణ నుడికారంతో కవిత్వం రాశారు కదా! తెలంగాణ భావజాల వ్యాప్తిలో మీ కవిత్వం పాత్ర ఏమిటి?

– తెలంగాణలో పుట్టిన కవికే గాక ఏ వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన కవికైనా ప్రజల నుడికారంతోనే అతని కవిత్వం విద్యుత్ తేజాన్ని పొందుతుంది. దీనికి ప్రజల భాషకు కొనసాగింపు నేను. తెలంగాణ భావజాల వ్యాప్తిలో నా కవిత్వానిది పాయగొట్టలేని బంధం. అందులో భాగమే భాషా, సామెతలు, నుడికార తల్లి మమకారం.

వెం: తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలోనూ, పూర్వ అధ్యక్షునిగానూ మీ అనుభవాలేమిటీ?

– తెలంగాణ రచయితల వేదికకు నేను అధ్యక్షున్ని అయిన తర్వాత వేదికకు అదివరకు లేని ఒక బలమైన తాత్విక పునాదిని నిర్మించాను. అది పునాదికి, ఉపరితలానికి మధ్యనున్న వైరుధ్యాలను, ఐక్యతలను బాహాటంగా ముందుకు తీసుకువచ్చింది. అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించే దిశగా తెరవే ను ఉద్యమంలో నిటారుగా నిలిపింది. ఈ నిర్మాణంలో ఎందరో వ్యక్తులు అంతర్గత శత్రువులుగా మారితే, ఇరుప్రాంతాలలోని అనేక సమూహాలు బుద్ధితీరా ఆలింగనం చేసుకున్నాయి.

సుజాత: తెలంగాణ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందా?

– సీమాంధ్ర ఆధిపత్య ధిక్కారం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అనేక షరతులతో కూడిన భౌగోళిక తెలంగాణ సాధన పాక్షికంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరో దళారి ఆధిపత్య వర్గం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.
సుజాత: ఇప్పటివరకు విభజన జరిగిన చిన్నరాష్ట్రాలు తమ సహజ వనరులను బహుళ జాతి కంపెనీల చేతికి అప్పజెప్పాయి. అక్కడి ప్రజల కనీస అవసరాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ

క్రమంలో అక్కడ విప్లవోద్యమాల అవసరం కలిగింది. రేపటి తెలంగాణలో మళ్లీ విప్లవోద్యమాల పరిస్థితి రానుందా?

– ఏర్పడిన చిన్నరాష్ట్రాల్లో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు ఈ సంపదపై కన్నేసి కాజేస్తున్నాయి. వీటికి దన్నుగా కేంద్ర ప్రభుత్వం తన బలగాల ద్వారా గ్రీన్ హంట్ పేరున నిలిచి, ప్రజలపై అమానుష దాడులకు పాల్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లోని పేద ప్రజలకు విప్లవోద్యమం తోడుగా నిలిచింది. తెలంగాణలో గల సహజ వనరులపై, ఏర్పడిన నూతన ప్రభుత్వం అదే వైఖరిని అవలంబిస్తే విప్లవోద్యమాలు అనివార్యంగా తిరిగి మరో రూపంలో తప్పక రావడానికి ఆస్కారం ఉంది. అం తేగాక ఆ విప్లవశక్తులు క్రియాశీలకంగా రూపాంతరం చెందనున్నాయి.

సుజాత: గడీల చరిత్ర పునరావృతమవుతుందా? అట్టి చరిత్రను తిప్పికొట్టే పరిస్థితులు ఇప్పుడున్నాయా?

– మొదటి తెంలగాణ సాయుధ పోరాటం తర్వాత భూస్వామ్య వర్గాలు రూమీ టోపీ స్థానంలో గాంధీటోపీలు ధరించినట్టే, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మలిసాయుధ పోరాటంలో పట్టణాలకు, నగరాలకు పారిపోయిన వర్గాలే తిరిగి తెలంగాణ సాధన ఉద్యమంతో కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. అవి కూలిన గడీల పొగరు వగరులతో సరికొత్త అధికార వేషంలో ప్రజలపై ఆధిపత్యాన్ని సాగించనున్నాయి. ఈ వర్తమాన రాజ్యాశ్రిత పెట్టుబడి రూపం రాజ్యాన్ని తిప్పికొట్టే పరిస్థితులను అదే చేతులారా కొనితెచ్చుకుంటుంది.

సుజాత: కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ప్రాతిపదిక ఏమి ఉండాలి?

– తెలంగాణ ఉద్యమంలో ప్రతిపాదించిన కొత్త జిల్లాలన్నీ సహజ వనరుల దోపిడీకి, వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజా అవసరాలకు, పాలనకు, వనరుల రక్షణకు అనుకూలంగా జరగాల్సివుంది.

అన్నవరం: మూడు దశాబ్దాలుగా నిరంతర కవిత్వ వ్యవసాయం చేస్తున్నారు. మీ కవిత్వంలో ఇంతగా తాజాదనం కనపడడానికి మూల సూత్రం ఏమిటి?

– ప్రజాఉద్యమాలతో మమేకం కావడమే కాక, సమాజ చలనాలతో సమాంతరంగా కవిత్వమై ఉరుకడమే నా తాజాతనానికి కారణాలు.

అన్నవరం: తెలంగాణ అస్తిత్వ సాహిత్యంలో తెలంగాణ భాష సొర్రకముందే మీ కవిత్వం నిండా తెలంగాణ భాష పదాలు విరివిగా ఉన్నవి ఎట్లెట్ల?

– నేను కవిత్వం రాస్తున్నప్పటి నుంచే తెలంగాణ జీవద్భాష నన్ను అనవరతం వెంటాడేది. అప్పుడు విజయవాడ నుంచి వచ్చే పత్రికలకు కవిత్వం మధ్యలో ఇమిడిన తెలంగాణ పదాల్ని రాసి పంపితే ఆనాటి సంపాదకులు పచ్చింకుతో అండర్‌లైన్ చేసి తిప్పి పంపేవారు. కానీ నేను నెలా రెండు నెలల పిదప అదే కవితను అదే పత్రికకు అలాగే పంపితే అచ్చయ్యేది. అలా అలా నేడు పత్రికలో తెలంగాణ భాషకు కవిత్వం, కథల ద్వారా అనివార్యత కలిగింది. ఆ విధంగా భాషకు అనుకూల వాతావరణం కల్పించినట్లయ్యింది.

అన్నవరం: 1996లో వెలువరించిన ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’లోనే ప్రపంచీకరణ దుష్ప్రభావాలు దుర్బిణి వేసి దూరదృష్టితో ఎలా పట్టారు? తెలుగు కవిత్వంలో గ్లోబలైజేషన్ పట్టుకున్నది మీరు కదా!

– 1990 తర్వాత దేశం సామ్రాజ్యవాదానికి, బహుళజాతి కంపెనీలకు బహిరంగంగా తలుపులు బార్లా తెరిచింది. అందులో నాటి సీ.ఎం/సీఈవో అయిన చంద్రబాబునాయుడు ప్రపంచీకరణకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలను చేసాడు. అందులో తెలంగాణ విధ్వంసానికి పరాకాష్ట అయ్యింది. గ్రామీణ ప్రాంతాలు చిన్నాభిన్నమైపోయి పొట్టచేతపట్టుకొని వలసలకు పయనమయ్యాయి. అవసరమున్నా లేకున్నా వినిమయ సంస్కృతి మనిషిని పరాయీకరించి, మానవ సంబంధాల్ని అల్లకల్లోలం చేసింది. అందులో కవిగా నేను మినహాయింపు కాదు, కాబట్టి 1993 నుంచి 1996 వరకు రాసిన కవిత్వంతో మొట్టమొదటి సారిగా ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కవితా సంపుటిని తీసుకువచ్చాను. ఈ సంపుటి ద్వారా ప్రపంచీకరణ గురించి మున్ముందుగా విప్పిచెప్పాను.

అన్నవరం: దళిత బహుజన సాహిత్య ఉద్యమాలను తెలంగాణ ఉద్యమం కప్పేసింది కదా! తర్వాత తర్వాత దళిత బహుజన ఆదివాసి అస్తిత్వ సాహిత్యాలు ఎలా ఉంటాయి?

– తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమంలో అన్ని అస్తిత్వాలు మిళితమై ఉన్నాయి. అయితే పాయలు పాయలుగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో దళిత, బహుజన, స్త్రీ, గిరిజన, మైనార్టీ అస్తిత్వాలు ఉద్యమాల రూపంలో ముందెన్నడూ లేనంతగా ప్రముఖంగా ముందుకు వస్తాయి. నిలదీస్తాయి.

అన్నవరం: కొత్తగా సాహిత్యంలోకి వచ్చిన కవులకు మీరిచ్చే సూచనలు?

– నూతనంగా సాహిత్యంలోకి వచ్చేవారికి, 2000 నుంచి సాహిత్యంలో కొనసాగే వారికి చేతులు జోడించి ఒకటే నా సవినయ విన్నపం. సాహిత్యంతోపాటుగా తప్పక సామాజిక శాస్త్రాల అధ్యయనం చేయాలి. ప్రజా దృక్పథంతో రచనలను నిర్మాణాత్మకంగా కొనసాగించాలి. అప్పుడుగానీ ఆయా రచనలు రక్తమాంసాలు చెమటతో వెలుగొందుతాయి.

నరేందర్: మీ కవిత్వం ప్రపంచీకరణని సిసికెమెరాల్లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది? ఇంత గాఢంగా రాయడం మీకు ఎలా సాధ్యమైంది?

– నా కవిత్వానికి ప్రాణం 1975 ప్రాంతంలో తెలంగాణలో జరిగిన పోరాటాలు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన విధ్వంసాలే ఊపిరి. నా కవిత్వంలో అంతరిస్తున్న మానవ సంబంధాలు, ప్రపంచీకరణ, రక్తమంటకుండానే హత్యలు, రాజ్యం, వికృతరూపమైన ఆత్మహత్యలు, వలసలు అన్నీ దృశ్యమానమవుతాయి. ప్రత్యక్ష బాధితున్ని నేను కాబట్టి నా కవిత్వంలో అవి ప్రధాన శక్తిగా ఉంటాయి.

నరేందర్: వైపని లాంటి గొప్ప కతలు రాసిన మీరు కథలు రాయడం ఎందుకు ఆపేశారు?

– అత్యంత వేగంగా మార్పు చెందుతున్న సమాజాన్ని కథలుగా రాయడానికి తగిన సమయం, అధ్యయనం ఉండాలి. ఇవాళ ఉన్న స్థితి తెల్లారేసరికి మరోరూపంలోకి మార్పు చెందడాన్ని నాలోని కథకునికి సరిగ్గా సరైన తెలివిడిలోకి రాకపోవడం వలస జనం ఆశించినంతగా కథలు రాయలేకపోయాను తప్ప మరొకటి కాదు.

నరేందర్: మీ జీవితం వేరు, మీ కవిత్వం వేరు కాదనిపిస్తుంది. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యమా?

-నేనే నా మొదటి కవితా సంపుటికి ఆవిష్కరణగా ముందుమాట రాసుకున్నాను. అందులో పేర్కొన్నట్లు నాకు జీవితం, కవిత్వం వేరు వేరు కాదు. సమాజానికి నాకు నా కవిత్వం ఒక యానకం. ఇది గత మూడు దశాబ్దాలకు పైగా నా నిరంతర చలన కవిత్వం ద్వారా నిరూపించాను.

గాజోజు: తెరవే తర్వాత రచయితల సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి?

– తెరవే తర్వాత వచ్చిన రచయితల సంఘాలన్ని ఆయా వ్యక్తుల, శక్తుల, ఉనికి సంక్షోభాల నుంచి జన్మించాయి. ఈ సంఘాలు ప్రజల వైపా లేక అధికారం, ఆధిపత్యం దిక్కా అనేది వారి కార్యాచరణతో కాలపరీక్షలో తేలిపోనుంది.

గాజోజు: వామపక్ష ఉద్యమాలు కవిగా మీకొక వర్గదృక్పథాన్ని కలిగించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపాయి?

– 1972 నుంచి నేను ఏదో కవిత్వం రాస్తున్నాను కానీ 1975 అత్యవసర పరిస్థితి తర్వాత నా చుట్టూ జరుగుతున్న ప్రజా ఉద్యమాలు నన్ను ఒక స్పష్టమైన ప్రజాదృక్పథం కలిగిన కవిగా తీర్చిదిద్దాయి. అందులో జక్కని వెంకట్రాజం, నిజాం వెంకటేశం గారల చేయూతతో సాహిత్యంలో ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాను.

గాజోజు: కవి, రచయితలు ప్రజల పక్షం వహించి పాలకులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని మీరు పదే పదే చెపుతారు. ఈ బాటలో సాగిన మీ సాహితీ ప్రస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

– కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు. నా కవిత్వ యాత్రలో అణిచివేత, రాజ్యహింస జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. వాటిని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవలేదు.

గాజోజు: దోచుకొనేవాళ్లు, దోపిడీకి గురయ్యేవాళ్లుగా సమాజం విభజితమవుతున్న వేళ, రాజ్యహింసకు వ్యతిరేకంగా సమాంతర ఉద్యమ సమాజాన్ని నిర్మించడంలో సాహితీవేత్తల పాత్ర ఎలా ఉండాలి?

– తెలంగాణ సాధన ఉద్యమంలో దోపిడీదారుడు, దోపిడీకి లోనైనవాడు ప్రజావ్యతిరేకులు, ప్రజా అనుకూలురు కలిసి పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53

ఆందోళన కాలం

అమెరికా ,బ్రిటన్ దేశాలలో గడచిన రెండు శతాబ్దాలలో రెండు వందలకు పైగా కవులున్నట్లు తెలుస్తోంది .ఇందులో ఎవర్ని గుర్తుంచుకుంటారో ఎవర్ని మర్చి పోతారో కాలమే నిర్ణయించాలి .అందులో ఒక పదహారుగురు మాత్రం తమకాలం లోని సమస్యల్ని ,ఒత్తిడులను తట్టుకొని నిలిచారు .ఇరవై వ శతాబ్ది మొదటి భాగం అంతా రెండు ప్రపంచ యుద్దాలతో మరికొన్ని చిన్న యుద్దాలతో గడిచింది .వీటివలన శాంతి చేకూర లేదు కాని నిరంతర ఘర్షణ వాతావరణమేర్పడింది .మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చు అనే భయం తో కొంత మంచితనం దేశాల మధ్య వికసిస్తోంది ..సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ తోరో  నమ్మినట్లు   ‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలకు  ,లోపలి  టెన్షన్ లకు గురైన వాళ్ళే .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు ,అలవి కాక విసిరి వేయబడ్డారు .మరి కొందరు పలాయనానికి సిద్ధ పడ్డారు .వారిని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

వామ భావ కవి – డబ్ల్యు .హెచ్ .ఆడెన్

విస్టాన్  హగ్ ఆడెన్ ‘’ది ఏజ్ ఆఫ్ యాన్క్సైటీ ‘’రాసిన పుస్తకం లో ఈ కవిత ముఖ్యమైనదే కాదుఆధునిక మానవుని లోని  భయాలు ,ఆందోళన ,కలవరం ,అసూయ ,నిరాశ లకు ప్రతిధ్వని ‘’factories bred them –corporate companies ,college towns –mothered his mind ,and many journals –backed his beliefs .He was born here ,The –bravura of revolvers in vogue now –and the cult of death are at home –inside the city ‘’ .తనకాలాన్ని అత్యధిక ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .రిటైర్డ్ డాక్టర్ పుత్ర రత్నం .ఆక్స్ ఫర్డ్ గ్రేశం స్కూల్ ,హాల్ట్ ,క్రిస్ట్ చర్చ్ లలో చదివాడు .మొదటి కవిత సంకలనం ‘’పోయెమ్స్ ‘’ఇరవై మూడు లో తెచ్చాడు .ఇరవై ఎనిమిది వరకు సక్లాలో లో పని చేసి వామపక్ష భావ కవుల్లో చేరాడు .తర్వాత ఫిలిం యూనిట్ కు పని చేశాడు స్పానిష్ సివిల్ వార్ లో స్త్రేచేర్ లాగే పని చేశాడు .’’స్పెయిన్ ‘’కవిత రాసి కింగ్స్ మెడల్ పొందాడు .’’ది పోయెట్స్ టంగ్ ‘’పత్రికకు సహాయ సంపాదకుడు .’’ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ లైట్ వేర్స్’’కు పూర్తీ బాధ్యతలతో ఎడిటర్ అయ్యాడు .థామస్ మాన్ కూతురు ఎరికా మాన్ ను పెళ్ళాడాడు .అమెరికా వచ్చి1846లో  సిటిజన్ అయ్యాడు .

ఇప్పటికే కవిత్వం లో నాలుగు పుస్తకాలు మూడు డ్రామాలు ,వ్యాస సంపుటి ,యాత్రపై రెండు ,మూడు ఆన్తాలజీలు వెలువరించాడు .రాజకీయాల్లో ,కవితా టెక్నిక్ లలో వివాదాలకు కేంద్రమయ్యాడు .ఆడెన్ పేర’’;ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’ అనే  ఒక ఇంగ్లీష్ మేగజైన్ తెచ్చారు .దీనికే ఉప శీర్షిక గా ‘’ది లిబరేషన్ ఆఫ్ పోయేట్రి’’అని పేరు పెట్టారు .ఇలియట్ తర్వాత సాహిత్యం లో పెద్ద దిక్కు ఆడెన్ అయ్యాడు .బాల్యం నుండి కవిత్వం రాస్తున్న తనకు హార్డీ ఆదర్శం అన్నాడు .వెయ్యేళ్ళ కిందటి ఆంగ్లో సాక్సన్ కవిత్వం పై ఆడెన్ కు మోజేక్కువ .వ్యక్తిగా ,కవిగా తనకొక స్థానాన్ని తన దేశం లో పొందాడు .అమెరికా తనను రాయటానికి ఆకర్షించింది అని చెప్పాడు ‘’.అమెరికా లో ఏది జరుగుతుందో ప్రాపంచమంతటా అదే జరుగుతుంది ‘’అని నమ్మకం గా చెప్పాడు .’’అమెరికన్ అకాడెమీఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’ అవార్డ్ ,పొందట మే కాదు అందులో సభ్యత్వాన్ని కూడా పొంది గౌరవం పెంచుకున్నాడు .పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .అనేక కాలేజీలలో యూని వర్సిటీలలో బోధించాడు .’’లండన్ టైమ్స్ ‘’ఆడెన్ పై సాహిత్య ప్రత్యెక సంచిక వెలువరించింది .

1956మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లేక్చర్లిచ్చాడు .మాధ్యూ ఆర్నాల్డ్ తర్వాతా ఆక్స్ ఫర్డ్ లో ‘’చైర్ ఆఫ్ పోయెట్రి ‘’స్థానం పొందాడు .కవితలు నాటకాలు రాస్తూనే ఉండి అయిదు సంపుటాలు తెచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్ ‘’ను ‘’ఏ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’పుస్తకాలు తెచ్చాడు .’’ది ఎంచేఫేడ్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు కాల్రిడ్జ్ ,లూయీస్ ,మాన్లి హాప్కిన్ మెల్విల్లే ,బాదేర్లిర్ ,జూల్స్ వెర్న్ వగైరాలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,పాస్కల్,వోల్టైర్ ,మాంటేగ్ , ఐన్స్టీన్ ,కీర్క్ గార్డ్ ,మొదలైన వారిపై కవితలు అల్లాడు .’’కవిత కు ఏదీ అనర్హం కాదు ‘’అని చాలా సార్లు రుజువు చేశాడు .ఆంగ్లో కేధలిజం ప్రవర్తనను ఎండగట్టాడు ‘’ఆన్ ది ఐలాండ్ ‘’లో సాంఘిక భావాలు స్పష్టం గా ఉన్నాయి .కొన్ని చోట్ల ఏంతో ఉదాత్తం గా రాస్తే మరి కొన్ని సార్లు వీధి రౌడీగా వెంబడించాడు .’’లా సే ది గార్దేనర్స్ ఈజ్ ది సన్ ‘’లో

‘’law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law as you know suppose –law is let me explain it once more –law is the law ‘’లో సహజ ప్రాకృతిక కవిలా కనిపిస్తాడు .’’but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty  but to me –the entirely beautiful ‘’ లో లిరికల్ అని పిస్తాడు .కొత్త జాడలను  పాత విధానాలలో రాశాడు .నాశనమై పోతున్న నాగరకత నుండి కొద్దిగా మత దృష్టిలోకి మళ్లాడు .న్యు యార్క్ లో ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపించాడు .కుంగిన ప్రపంచాన్ని చూసి –intellectual disgrace –stars from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’అని కలత చెందాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .’’ఒకరిపై ఒకరం ప్రేమ చూపించాలి లేక చచ్చి పోవాలి’’అని బాధగా రాస్తాడు .’’in the deserts of the heart –let the healing fountain start –in the prison of his days –teach the freeman how to praise ‘’అని రావాల్సిన మార్పు ను ఆశించాడు ఆడెన్ ‘’ఆమెన్ ‘’.

ప్రేమ ,రాజకీయం మతం నీతి పౌరసత్వం సైకాలజీ  లపై గొప్ప శైలితో టెక్నిక్ తో రాశాడు ఆడెన్ . అతని భావాలపై ఎన్నో డాక్యుమెంటరి ఫిలిం లను తయారు చేశారు .’’ఫనేరల్ బ్లూస్ ‘’,అ నోన్  సిటిజెన్ ,సెప్టెంబర్ ఫస్ట్ ,రెఫ్యూజీ బ్లూస్ ‘’కవితలు ఇప్పటికీ చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లో దూసుకు వెళ్ళిన కవిగా ఆధునిక కవులలో గొప్పవాడిగా భావించారు .నోబెల్ ప్రైజ్ కు ఎంపికయ్యాడు కాని రాలేదు .29-9-1973న అరవై ఆరేళ్ళ వయసులో   ఆస్ట్రియా  లోని వియన్నాలో చనిపోయాడు . లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక చిహ్నం ఉంచారు .ఇరవై వ  శాతాబ్దపు గొప్ప రచయితలలో ఒకడు ఆడెన్ .ఒపేరా లిబర్టోస్ రాసి భావాలను బలంగా సూటిగా చెప్పాడు .

AudenVanVechten1939.jpg

 

 

సాంఘిక న్యాయం కోసం పోరాడిన రచయిత – స్టీఫెన్ స్పెండర్

ఆడెన్ తో లింక్ ఉన్న వాడు స్టీఫెన్ స్పెండర్ .28-2-1909లో లండన్ లో జర్మన్ జ్యూయిష్ గా ఆంగ్ల ఆరిజిన్ తోజన్మించాడు . తండ్రి హెరాల్డ్ స్పెండర్ గొప్ప జర్నలిస్ట్ .తల్లి ‘’వయొలెట్ శస్టర్’’పదిహేడు లూ కేమిస్త్స్ లేబిల్స్ ను చైనా ప్రెస్ లో ముద్రించి జీవించాడు .ఆక్స్ ఫర్డ్  యూని వర్సిటి కాలేజిలో చదివి ఆడెన్ కు అసోసియేట్ అయ్యాడు .కమ్యూనిస్ట్ పార్టి లో చేరి వారి  నిర్బంధ విధానాన్ని ఎదిరించి బయటపడి ‘’ది గాడ్ దట్ ఫైల్ద్  ‘’లో తెలియ జేశాడు .

పందొమ్మిది లో దారుణం గా’’ నైన్ ఎక్స్ పెరి మెంట్స్ ‘’ను  పేపర్ బౌండ్  పాం ఫ్లేట్ గా ముద్రించి,రెండేళ్ళ తర్వాత ‘’ట్వెంటి పోయెమ్స్ ‘’అచ్చు వేశాడు .వీసా ను తిరస్కరించినా విదేశాలకు వెళ్ళిస్పెయిన్ లో ’’ఇంటర్ నేషనల్ రైటర్స్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొన్నాడు . కొన్ని నెలలు ఉండి స్పానిష్ లాయలిస్ట్ కవుల రచనలను అనువాదం చేశాడు .మొదటి భార్యకు విడాకు లిచ్చి పియానిస్ట్ నటాషా లిత్విన్ ‘’ను రెండో పెళ్లి చేసుకున్నాడు .’’ది హోరైజన్ ‘’పత్రికను మిత్రుడి తోకలిపి నడిపి రెండవ ప్రపంచ యుద్ధం లో ,తరచుగా అమెరికా వెళ్లి ఉపన్యాసా లిచ్చాడు .1953లో ఇర్వింగ్ క్రిస్టల్ తో కలిసి ‘’ఎన్కౌంటర్ ‘’ అనే అంతర్జాతీయ మాస పత్రికను ‘’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం’’ ఆర్ధిక సాయం తో  నడిపాడు .సమకాలీన సమస్యలపైనే స్పందించి ఎక్కువ గా రాశాడు .’’ది లాండ్ స్కేప్ నియర్ ఏరో డ్రోం’’కవితలో ‘’more beautiful and soft than any moth –with burning furred antennae feeling its huge path –through dusk ,the air-liner with shut off engines ‘’ అని సహజ వర్ణన చేశాడు .

‘’ఆధునిక కవిత్వం యంత్రాన్ని జీర్ణించుకోవాలి’’ అన్న హార్ట్ క్రేన్ అభిప్రాయం తో ఏకీభ వించాడు .యంత్రం కూడా చెట్టు పుట్ట ,పిట్ట ,పశువు లాంటిదే అన్నాడు .సాంకేతిక సింబల్స్ ను కవిత్వం లో ప్రవేశ పెట్టాడు .యంత్రం వెనక ఉన్న భావాన్ని అర్ధం చేసుకోవాలన్నాడు ‘’నాట్ పాలసేస్ ‘’లో మానవుని పై యంత్రం యొక్క ప్రభావాన్ని తెలిపాడు ‘’drink from here energy and only energy –as from the electric charge of a battery ‘’ ప్రక్రుతి లోని సర్వాన్గాలు శాఖలు సహక రించుకోవాలని కోరాడు .’’డెత్ టు ది కిల్లర్స్  బ్రింగింగ్ లైట్ టు లైఫ్ ‘అనేది అతని సిద్ధాంతం .’’యాన్ ఎలిమెంటరి క్లాస్ రూమ్ ఇన్ ఏ స్లం’’లో మానవ పీడనను చిత్రించాడు –‘’how that works, money, interest  building ,could ever hide –the palable and obvious love of man for man ‘’అంటాడు.నీతి భావనలు చూస్తున్న ఈ దారుణాలలోంచే పుట్టాయి .అప్పుడు ఉపన్యాసాం అయింది కవిత .  Poet Laureate Consultant in Poetry to the United States Library of Congress in 1965. అయ్యాడు 16-7-1995న ఎనభై ఆరవ ఏట లండన్ లో చనిపోయాడు ..ఇరవయ్యవ శాతాబ్ద విజ్ఞానాన్ని అందించటానికి స్టీఫెన్ స్పెండర్ క్లబ్ ఏర్పడి సేవ చేస్తోంది .జీన్ పాల్ సాత్రే వర్జీనియా ఉల్ఫ్ ల ప్రభావం స్పెండర్ పై అధికం .సాంఘిక న్యాయం కోసం పోరాడిన కవి రచయితా స్పెండర్ .

 

 

Stephen Spender.jpg

 

కొత్త విమర్శ కు మార్గం వేసిన – విలియం ఎంప్సన్

‘’ రొమాంటిక్ ఇర్రేషనాలిటి’’ పై పోరాడిన వాడు విలియం ఎంప్ సన్ .కవిగా కంటే రచయితగా ప్రసిద్ధుడు .27-9-1906లో యార్క్ షైర్  లో పుట్టి ,విన్చేస్టర్ ,కేంబ్రిడ్జి లోని మాగ్డలీన్ కాలేజి లలో చదివి గణితం  ప్రధాన విషయం గా డిగ్రీ పొందాడు .’’సెవెన్ టైప్స్ఆఫ్ ఆమ్బిగ్యుటి’’అనే మొదటి పుస్తకాన్ని ఇరవై నాలుగు లో ముద్రించాడు .’’న్యూ క్రిటిసిజం ‘’కు పునాది రాయి వేశాడు .పాతికేళ్ళ వయసు నుండే టీచర్ .టోక్యో చైనా ,ఇంగ్లాండ్ అమెరికాలలో లేక్చార్లిచ్చాడు .ముప్ఫై లో బి బి సి .లో ఉద్యోగి అయి ,ఏడాది తర్వాతా చైనీస్ భాషఉపన్యాసాలకు సూపర్వైజర్  అయ్యాడు .’’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’పేరిట రెండు కవితా సంకలనాలు పబ్లిష్ చేశాడు ఆ తర్వాత వచనానికే పరిమితమైనాడు .’’Johnson could see no bicycle would go –you bear yourself ,and the machine as well ‘’gannets for germans not from othello –and ixion rides upon a single wheel ‘’అని  జరగా వను కొన్నవి జరుగుతున్నాయని తెలియ జేశాడు .మంచి వక్త గా గొప్ప టీచర్ గా ఎమ్ ప్సన్ ప్రసిద్ధుడు .15-4-1984 న  77వయసులో మరణించాడు .సోషియో పొలిటికల్ భావ వ్యాప్తి చేశాడు . Empson’s Milton’s God is often described as a sustained attack on Christianity and defence of Milton‘s attempt to ‘justify God’s ways to man’ in Paradise Lost. .బౌద్ధ ఫిలాసఫీ ని రచనలలో కలిపి రాశాడు .

 

Formal portrait of William Empson, wearing eyeglasses and dressed in a coat and tie

 

 

జాజ్ సంగీతానికి దారి వేసిన – ఎడిత్ సిట్వేల్

7-9-1887లో స్కార్ బరో లో పుట్టింది .ఆకర్షణ కల యువతి ‘’క్లౌన్స్ హౌసెస్ ‘’,ది వుడేన్.పీగాస్ ‘’,ఫెకేడ్ ‘’సంపుటాలు రాసి ప్రచురించింది .భూలోక స్వర్గాన్ని స్వయం గా నిర్మించుకోన్నది .ఆబెద్ అనే కవితలో ‘’jane ,jane –tall as crane –the morning light creaks down again ‘’అంటూ నరస్రి రైం గా రాసింది .అరా మూత కన్నులతో ప్రాభాత సూర్యోదయాన్ని ,ఊహాత్మకం గా రాసింది .’’సర్ బెల్జేబబ్ ‘’లో ‘’when –sir –Beelzebub  called for his syllabub in the hotel in hell –where Proserpine fell –blue as the grandarmerie were the waves of the sea ‘’ అంటూ కలలలోకం లో విహరిస్తూ చెప్పింది

నలభై ఆరవ ఏట ఎదిత్ కు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ పతకం ఇచ్చి గౌరవించింది .రెండవ ఎలిజ బెత్ రాణి ‘’డేమ్  కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ‘’ను చేసింది .రోమన్ కేధలిక్ అయింది .కవిత్వం తో పాటు విమర్శ గ్రంధాలు ఎక్కువే రాసింది .పోప్ జీవిత చరిత్ర రాసి రికార్డ్ సృష్టించింది .అనేక ఆన్తాలజీలు రాసింది .9-12-1964న డెబ్భై ఏడు వయసులో మరణించింది . hythms of the tom-tom and of jazz, and shows considerable technical skill. .సృజన తో అందరికి దగ్గరైంది .

Roger Fry - Edith Sitwell.jpg

 

 

ప్రయోగ శీలి – విల్ఫ్రెడ్ ఓవెన్

మొదటి ప్రపంచ యుద్ధం కొత్త తరహా కవులను పరిచయం చేసింది .న్యాయ మైన యుద్ధం లేదని యువ గ్రూప్ వాదించింది .అందులో విల్ఫ్రెడ్ ఓవెన్ గొప్ప ప్రభావం చూపించాడు .శ్రోఫైర్ లో 18-3-1893లో పుట్టిన ఓవెన్ లండన్ యూని వర్సిటి లోని బర్కెన్ హెడ్  ఇంష్టి ట్యూట్ లో చేరి చదివి ట్యూటర్ అయి ,యుద్ధం లో సైనికుడిగా చేరి గాయ పడితే   వార్ హాస్పిటల్ లో చేర్చారు . తోటి బాధితుడుసీగ్ ఫ్రీడ్ ససూన్  ప్రేరణ తో కవిత్వం రాయటం ప్రారంభించాడు .ఏడాది తర్వాత వేస్త్రెన్ ఫ్రంట్ కు పంపేశారు .సాహస క్రుత్యానికి మిలిటరీ క్రాస్ అవార్డ్ పొందాడు .సామ్బెర్ కెనాల్ లో తన బృందాన్ని రక్షించే పనిలో చనిపోయాడు .ససూన్ బయట పెట్టిన వ్రాత ప్రతుల ద్వారానే కవిగా లోకానికి పరిచయమైనాడు .ముందు మాటగా ‘’this book is not about heroes >English poetry is not yet fit to speak of them .not is about deeds or lands  not any thing about glory ,honour or dominion –except war –above all this book is not concerned with poetry .the subject of it is war ,and the pity of war .the poetry is in the pity ‘’అని నిజాన్ని ‘’గన్  షాట్’’ గా చెప్పాడు .

ఓవెన్ ఇంగ్లిష్ వెర్స్ర్స్ లో ప్రయోగాలు చేశాడు .ఆడెన్  స్పెండర్ స మొదలైన కవుల మార్గాన్ని అనుసరించాడు .అతనిలో కవిత్వం చివరి రోజుల్లో జ్వాలగా వెలిగింది .కీట్స్ సమాధిని దర్శించి రాసిన కవిత కదలిన్చేస్తుంది .’’move him into the sun –gently in touch awoke him once –at home whispering of fields unsown –always it woke him even in France –until this morning and this snow –if anything might rouse him now –to kind old sun will know ‘’

4-11-1918న ఓవెన్ ఫ్రాన్స్ లో చనిపోయాడు .ఫ్రాయిడ్ ప్రభావం ఉన్న కవి ‘’యాంతం ఫర్ డూమ్డ్.యూత్ ‘’కవిత అద్భుతమైనది .’’యుద్ధ సాను భూతికి ;;అద్దంపట్టిన కవిత్వం రాశాడు .

 

Wilfred Owen plate from Poems (1920).jpg

 

ఇండివిడ్యువలిస్టు కవి – రాబర్ట్ గ్రేవ్స్

‘’ఇండివిడ్యువలిస్ట్’’అయిన రాబర్ట్ గ్రేవ్స్ ఐరిష్ కవి కుమారుడు .26-7-1895 లో లండన్ లో పుట్టి ఆక్స్ ఫర్డ్ కాలేజి లో  స్కాలర్షిప్ తో చదివి  యూని వర్సిటి లో చేరకుండా రాయల్ వేశ్ ఫుసిలర్స్ లో పేరు నమోదు చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసి మూడు కవితా సంకలానాలు తెచ్చాడు .సెయింట్ జోసెఫ్ లో డిగ్రీ పొంది ఈజిప్ట్ వెళ్లి కేయిరో యూని వర్సిటి లో ఇంగ్లీష్  ప్రొఫెసర్ అయి,ఏడాదికే బయటికొచ్చి పెళ్ళాన్ని  ఇంగ్లాండ్ నీ వదిలేశాడు .ఒక ప్రెస్ కొని అమెరికా కవి లార రైడింగ్ తో కలిసి అనేక విమర్శనాత్మక వ్యసాలు రాశాసి ప్రింట్ చేశాడు ‘’గుడ్ బై టు ఆల్ దట్’’అనే స్వీయ చరిత్ర రాసుకున్నాడు .అనేక చారిత్రిక నవలలు సీరియాల్ గా రాశాడు .గ్రీక్ మైధాలాజేఎ మీద మోజు ఏర్పడి ‘’క్రౌనింగ్ ప్రివిలేజ్ ‘’వగైరా రాశాడు .పౌండ్ వై-ఇలియట్ ,ఆడెన్ మొదలైన వారి పై విరుచుకు పడ్డాడు .వీళ్ళను ‘’ఫాల్స్ గాడ్స్ ఆఫ్ మోడరన్ పోయట్రి’’ అని నిందించాడు .’’ట్రాడ్డ్జి,’’కవిత లో ‘’Trudge body and climb ,trudge and climb –but not to stand again on any peak of time –trudge body –I will cool you ,body,with hot sun that draws the sweat –I will warm you body with ice –water that stings the blood –I will enrage you ,body with idleness ,to do –and having done tosleep the long night through –trudge body ‘’
ఇది చదువుతుంటే త్వమేవాహం లో ఆరుద్ర కవిత ‘’తోయ్యోయ్ మోయ్యూయ్ తోయ్’’జ్ఞాపకం వస్తుంది .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక ఫలకాన్ని ఉంచి గౌరవించారు

Robert Graves.jpg

మోడర్నిస్ట్ కవి –  వాలెస్ స్టేవెన్స్

సమకాలీన సమస్యలతో ,ఆందోళనల తో విసిగి పోయిన వాలెస్ స్టే వెన్స్ ఆధునిక కవిత్వానికి కొంచెం దూరమైనాడు .రాక్షస యుద్దాన్నించి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు .ఎక్సి క్యూటివ్ గా ఉండాలనుకొన్నాడు .అక్టోబర్ రెండు1879 లో డచ్ ,జర్మన్ కుటుంబం లో పెన్సిల్వేనియా లోని రీడింగ్ లో పుట్టాడు .హార్వర్డ్ యూని వర్సిటి లో చేరి సంప్రదాయ సానేత్స్ రాశాడు .రైంకు ప్రాధాన్యత నిచ్చాడు హార్వర్డ్ అడ్వొకేట్ ‘’లో బాలడ్స్  సెంటిమెంటల్ పాటలు రాశాడు .న్యు యార్క్ లో లా చదివి బార్ సభ్యుడై కనెక్టి కట్ వెళ్లి హార్డ్ ఫోర్డ్ యాక్సి డెంట్ అండ్ ఇండెమ్నిటి ఇన్స్యూరెన్స్ కంపెని లో లీగల్ అడ్వైసర్ అయ్యాడు .యాభై అయిదులో దానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు .డెబ్భై అయిదేళ్ళ వయసులో 2-8-1955వరకు అందులోనే ఉద్యోగించాడు .

ద్వంద్వ మనస్తత్వానికి ఇష్టపడ లేదు .’’I prefer to think just a man ,not a poet part time  businessman the rest ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .నలభై నాలుగో ఏడు వచ్చేదాకా రచనలను ప్రచురించ లేదు .నాలుగు కవితలు మాత్రం  ఏ మేగజైన్ ఆఫ్ వేర్స్ ‘’లో వచ్చాయి తొమ్మిదేళ్ళ తర్వాత మొదటి పుస్తకం ‘’హార్మోనియం ‘’,తర్వాత ఐడియాస్ ఆఫ్ ఆర్డర్ ‘’,ది మాన్ విత్ ది బ్లూగిటార్ ,,పార్ట్ ఆఫ్ ఏ వరల్డ్ ,ట్రాన్స్ పోర్ట్ టు సమ్మర్ వగైరా లను ప్రచురించాడు  నేషనల్ బుక్ అవార్డ్ తో బాటు పులిట్జర్ బహుమతి పొందాడు .’’ఓపస్ పాస్తుమాస్ ‘’1957 లో విడుదల చేశాడు .’’తర్తీన్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఏ బ్లాక్ బర్డ్ ‘’కవిత లో’’I donot know which to prefer –the beauty of inflections –or the beauty of innuendos ‘అని సందేహ పడుతూ రాశాడు .’’ది ఎమ్పరార్ ఆఫ్ ఐస్ క్రీం’’ ‘’ది వర్మ్స్ ఎట్ హేవెంస్ గేట్ ‘’ది కిచెన్ కప్స్ ‘’మొదలైన కవితలు సందర్భ శుద్ధికి ఉదాహరణలు .’’the poem must resist the intelligence almost successfully ‘’అని అభిప్రాయ పడ్డాడు . ‘’the body;s death and beauty;s deathlessness ‘’,పై చక్కని కవిత రాసి మెప్పించాడు  స్టే వెన్స్ .

Beauty is momentary in the mind-the fitful tracing of portal –but in the flesh it is immortal –the body dies ,the body;s beauty lives ‘-so evenings die in the green going –a wave interminably flowing ‘’అంటూ సాగుతుంది ఆ కవిత .విలియం కవితలు ‘’not of the second part of life –they don’t make the visible a little hard to see ‘’అని అంచనా వేశారు .’’he employed every nuance of rhetoric dissolving imagery and paradoxical epigrams to achieve a mystical reality –a supreme fiction to move his readers in the direction of fact as we want it to be ‘’

అమెరికన్ మోడర్నిస్ట్ పోయేట్ గా గుర్తింపు పొందాడు .2-8-1955న  కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించాడు .మనస్సాక్షికి వాస్తవానికి ఉన్న సంబంధం పై ఎక్కువ గా రాశాడు .అతని ఇమాజినేషన్  అంత స్సాక్షీ కాదు  వాస్తవమూ కాదన్నారు .ఇది పొడిగా ఉన్న విషయం కాదు కానిజీవితం లో  నిజాన్ని దాని అంతరార్ధాన్ని కనిపెట్టే సరైన  అన్వేషణా విధానం .

 

Wallace Stevens.jpg

 

సశేషం –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-15-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గంగా తవ ”శుభ్ర ”భాతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శకుడు బి యెన్ రెడ్డి లేఖ మరియు వెండితెర బంగారమైన ”ఎస్వర” లక్ష్మి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్తూరి మురళీకృష్ణ కాలమ్: మ్యూజికల్ మ్యూజింగ్స్-7

నసున మల్లెల మాలలూగెనే
 

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ
ఎంత తొందరలే హరి పూజకు, ప్రొద్దు పొడవకముందె పూలిమ్మనీ 

‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ అన్న సినిమాలోని దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట పల్లవి వినగానే ఎద ఝల్లుమంటుంది. అసలింత సున్నితమైన అత్యంత సుందరమైన ఆలోచనలు ఈ కవులకు ఎలా వస్తాయన్న ఆలోచన కలుగుతుంది. పొద్దున్నే పూచే పూలు దేవుడి పూజలో పాలుపంచుకోవాలని ఆత్రపడుతూ సిద్ధంగా ఉన్నాయన్న సుందరమైన భావనను కలిగిస్తూ, ఇలా దైవపూజ కోసం పూలిమ్మని కొమ్మకొమ్మకూ ఎవరో (దైవం) నేర్పారన్న భావనను కలిగిస్తూ, దైవం పేరెత్తకుండా దైవ భావనను స్ఫురింపజేసి ఒక పవిత్రపుటాలోచనను కలిగిస్తుందీ పల్లవి. ఇలాంటి పల్లవులు రచించటం తెలుగులో కృష్ణశాస్త్రి ప్రత్యేకత. ఈపాట అచ్చమైన సినీ గేయ రచనకు అసలైన ఉదాహరణ లాంటిది. 

సినిమాలకు మాటలొచ్చినప్పటినుంచీ పాటలొచ్చాయి. ఆరంభ సినిమాల్లో మాటలకన్నా పాటలే ఎక్కువ ఉండేవి. నాటక రంగం నుంచి సినిమా ప్రత్యేక కళగా ఎదుగుతున్న సమయంలో నాటకం నుంచి పాటలు సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డాయని కొందరంటారు. ముఖ్యంగా పార్సీ నాటకాల ప్రభావమిది అని అంటారు. కానీ, పాటలు అన్నది భారతీయ జీవన విధానంలో ఒక విడదీయరాని భాగం. 

‘లయ’ అన్నది సృష్టిలో నిబిడీకృతమైన ఒక అంశమని వేదం ప్రకటించింది. వేదమంత్రాలన్నీ లయబద్ధంగా ఉంటాయి. లయబద్ధంగా ఉండేందుకు ఛందస్సు ఏర్పడింది. భారతీయ సంగీతానికి వేదం ప్రాతిపదిక. అందుకే మన దగ్గర లాలిపాటలు, జోలపాటలతో ఆరంభమై జీవితంలో ప్రతి క్షణానికీ, ప్రతి సందర్భానికీ, ప్రతి సన్నివేశానికీ పాట ఉంటుంది. కాబట్టి పాటలు మనకు పార్సీ థియేటర్ నుంచో ఇంకెవరినుంచో రావాల్సిన అవసరం లేదు. నాటకాలలో ఛందోబద్ధమైన పద్యాలు రాయటం, మాటలను కవిత్వపు పాదాల్లో రాయటం మనకు ప్రాచీన కాలం నుంచీ ఉంది. వేదాల్లో సైతం మంత్రాల నడుమ సంభాషణలు, చర్చలు, నాటకాలను పోలిన కథనాలు ఉన్నాయి. అందుకే మన సినిమాలలో పాటలు స్థిరపడటమే కాదు. సినిమాలను దాటి ఎదిగాయి. ఆధునిక సమాజంలో సాహిత్యం స్థానాన్ని ఆక్రమించాయి. 

కృష్ణశాస్త్రి రచించిన పాటను చూస్తే, పల్లవిలో మనకు కవిత్వం ఎక్కడా కనబడదు. కవి కనబడడు. ఒక అందమైన ఊహ కనిపిస్తుంది. ఒక చక్కని ఆలోచన కనిపిస్తుంది. ఇది గేయాన్ని కవిత్వంకన్నా భిన్నమైన సృజనాత్మక ప్రక్రియగా నిలబెడుతుంది. కవిత్వానికి సినిమా పాటల్లో స్థానం లేదు. కానీ కవులు అనేకులు సినిమాల వైపు ఆకర్షితులు అవటంతో సినీ గేయాలలో కవిత్వం జొరబడింది. అంతే తప్ప పాట వేరు, కవిత్వం వేరు. సినిమా గేయం ఇంకా భిన్నమైనది. కానీ సినీ గీతానికి సాహిత్య ప్రపంచంలో సముచితమైన స్థానం కల్పించి, గౌరవం పొందాలన్న సినీ కవుల తపన వల్ల సినిమా పాటలు కవితమయం అయ్యాయి. కానీ, ప్రతి కవిత పాట అవవచ్చేమోగానీ ప్రతి గేయం కవిత కాదు. 

ఈ విషయం తొలి నాటి సినిమాల గేయ రచయితలకు స్పష్టంగా తెలుసు. అందుకే వారు తమ గేయాలలోంచి కవిత్వాన్ని పరిహరించారు. వీలైనంత సరళంగా, సూటిగా పాటలను రచించారు. 

‘దోనైనా మత్వారే, తిహారే హమ్ పర్ జుల్మ్ కరే’ అని పాడతాడు సైగల్. నాయిక అందమైన రెండు కళ్లు అతడిపై అధికారం చలాయిస్తున్నాయట. ఇది కవిత్వం అనటం కష్టం. చమత్కారభరితమైన భావం కలిగించే గేయం అవుతుంది. ‘బాలమ్ ఆయో బసోమోరె మన్‌మే’ అంటాడు పాత సినిమా హీరో. అంటే ప్రేయసి వచ్చి అతడి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుందట. ఇది ఒక నిజాన్ని చెప్పటం. ఓ స్టేట్‌మెంట్. 

కృష్ణశాస్త్రి రచించిన అధిక శాతం పాటలు ఇలాంటి స్టేట్‌మెంట్లే. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ’ పాట కూడా ఇలాంటి స్టేట్‌మెంట్లు, ప్రశ్నలతో కూడుకున్నదే తప్ప కవిత్వం ఏ మాత్రం లేనిది. 

కొలువయితివా దేవి నా కోసము తులసి.. తులసి.. దయాపూర్ణ కలిసిమల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేలు నా స్వామికి 

ఇందులో కవిత్వం ఏది? అన్నీ స్టేట్‌మెంట్లే. పదాల కూర్పులోని లాలిత్యం,

 

యే లీల సేవింతు? యేమనుచు కీర్తింతు?

సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల, ఒక దివ్వె నీ మోల
ఒదిగి ఇదే వందనం…. ఇదే వందనం…
ఇదీ పాట. నిజానికి గేయ రచన అనేది దృశ్యాన్ని ఇనుమడింపజేయాలి. అవాంటి సినీ గేయ రచనకు ఇది చక్కని ఉదాహరణ. తెలుగులో ద్విత్వాక్షరాలు ఎక్కువ. కానీ కృష్ణశాస్త్రి ఈ పాటలో అరుదుగా వస్తున్నాయి ద్విత్వాక్షరాలు. సుందరమైన భావానికి లలితమైన పదాలు వాడటంతో పాటకొక అందమైన సౌకుమార్యం వచ్చింది. భావాల మృదుత్వం అధికమయింది. పాటలోని భావాన్ని, పదాల సౌకుమార్యాన్ని అర్థం చేసుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను ‘బిళహరి’ రాగంలో రూపొందించాడు. బిళహరి రాగం ఉదయరాగం. పాట, సినిమాలో, ఉదయం పూట నాయిక పూలు భగవదార్చన కోసం కోస్తూ పవిత్ర భావనతో పాడుతుంది. దాంతో బంగారానికి తావి అబ్బినట్టు.. రాగం, భావం, పదం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఫలితంగా అత్యుత్తమమైన కళాసృష్టి సంభవించింది. తరతరాలకు తరగని ఆనందగని లభించింది. 

కృష్ణశాస్త్రి గేయరచన పద్ధతి సిసలైనది అని ‘మల్లీశ్వరి’లోని ‘పరుగులు తీయాలి’ తిరుగులేని విధంగా నేర్పుతుంది.

 

పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి

బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
ఇదీ పల్లవి. ఇందులో చక్కని పదాలున్నాయి. సొంపుగా ధ్వనిస్తూ వేగాన్ని సూచించే పదాలున్నాయి. అద్భుతమైన లయ ఉంది. సినిమా దృశ్యాన్ని వివరించే స్క్రప్టులాంటిది ఈ పాట.

 

హోరు గాలి, కారుమబ్బులు ముసిరేలోగా, మూగేలోగా

ఊరు చేరాలి, మన ఊరు చేరాలి
ఇది కవిత్వమా? కాదు. అతి చక్కని చిక్కని గేయం. 

గలగల గలగల కొమ్మల గజ్జెలు

గణగణ గణగణ మెళ్లో గంటలు
వాగులు దాటి, వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. 
ఒక తొందర, ప్రయాణంలోని వేగం, ఉద్వేగం, అందం పదాల పరుగును సూచిస్తుంది. అంతే తప్ప పాటంతా ఒక స్టేట్‌మెంట్ లాంటిది.

 

అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు

తెల్లని కొంగలు బారులు బారులు  అదిగో అదిగో అదిగో
పచ్చని తోటలు, మెచ్చిన పువ్వులు, ఊగే గాలుల తూగే తీగలు
అవిగో అవిగో అవిగో
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
అయిపోయింది పాట. పాట మొత్తం పదాలు వేగాన్ని సృష్టిస్తాయి. దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. మనసును తాకుతాయి. ఆనంద పరుస్తాయి. ఈ పాటను బాణీని రాజేశ్వర రావు కూర్చిన విధానం పాటకు ఊపునిస్తుంది. భావాన్ని ఇనుమడింప జేస్తుంది. పశువుల మెడలో గంటలు, నల్లని మబ్బుల గుంపులు, బారులుగా ఉన్న తెల్లని కొంగలు, పచ్చని తోటలలో పూవులు, వీచే గాలి అన్నీ పాట వింటున్న శ్రోత కళ్లు మూసుకుని అనుభవించగలడు. వేగంగా సాగే బండిలో తానూ ప్రయాణిస్తున్న అనుభూతిని పొందగలడు. గమనిస్తే ఈ పాటలో కూడా కృష్ణ శాస్త్రి కవిత్వం రాయలేదు. సినీ గేయాన్ని గేయంలా రచించాడు. ఇదే మనకు ‘మనసున మల్లెల మాలలూగెనే’ లోనూ కనిపిస్తుంది.

 

మనసున మల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే
పల్లవిలోని రెండు పాదాలు వినగానే ‘ఆహా’ అనిపిస్తుంది. ‘మనసులో మల్లెల మాలలూగటం’ అనగానే ఒక ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. మల్లెపూల వాసన శృంగార భావానికి ప్రతీక. సంతోషకరమైన భావాన్ని తలపిస్తుంది. అందుకే మనసులో మల్లెల మాలలూగటమనగానే సంతోషము, ఆనందాన్ని కలిగించే శృంగార భావన తాలూకు మధురమైన గాలి తరగలు శ్రోతల మనస్సులను స్పందింపజేస్తాయి. కన్నుల వెన్నెల డోలలు ఈ భావనను స్థిర పరుస్తాయి. ఇలా ఈ విషయంలో ఎవరికయినా అనుమానం ఉంటే పల్లవిలోని మిగిలిన పాదాలు ఆ సందేహాన్ని చేరుస్తాయి. నిజానికి మనసున మల్లెల మాలలూగటం కూడా ఒక భావాత్మకమైన ప్రకటన. మనసులో మల్లెల మాలలూగటం ఏమిటి? అని కొట్టేసే వారు కూడా ఉన్నారు. సున్నిత హృదయులకు మాత్రం అలాంటి సందేహం రాదు. ఈ వాక్యం వినగానే వారి మనస్సుల్లో మల్లెల మాలలూగుతాయి. ఇది భావగీతం. భావ కవిత్వం కాదు.

 

ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో!
పాటలోని భావాన్ని ప్రకటించే పదాల మార్పు గేయాల్ని మరింత చేరువ చేస్తుంది. ‘ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో’ నిజానికి ఈ పాదాలు వచ్చేసరికి శ్రోత మనస్సు హాయితో నిండుతుంది. మల్లెల మాలలు, వెన్నెల డోలలు ఆ పని చేస్తాయి. బతుకు పండటం అనేది అత్యద్భుతమైన భావం. 

అత్యుత్తమ గేయ రచన పద్ధతి ఇది. ప్రియుడి దర్శనం కోసం తపిస్తున్న ప్రేయసికి, ఇంకాస్సేపటికి ప్రియుడిని కలవబోతున్నానన్న భావన ఎంత ఆనందాన్ని కలుగచేస్తుందో, ఆ ఆనందం తాలూకూ హర్షాతిరేక భావనను అత్యంత మృదువుగా, సాత్వికంగా ఈ పాటలో సందర్శించాడు గేయ రచయిత కృష్ణ శాస్త్రి. అందుకే ఈ పాట ఈనాటికీ కాదు.. మానవ మనస్సుల్లో మృదుత్వం, శంగార భావనలలో సున్నితత్వాలు సజీవంగా ఉన్నంత కాలం మల్లెల మాలలను, వెన్నెల డోలల ద్వారా అలౌకికానందం కలిగిస్తుంటుంది. ఈ పాటను భానుమతి మరింత ప్రత్యేకంగా తన ఆత్మతో పాడిందనిపిస్తుంది. ఆమె స్వరంలోని మృదుత్వం, శృంగార భావన, ప్రియుడిని కలవబోతున్నానన్న ఆనందాన్ని అదుపులో ఉంచుకుంటూ, తన భావనలను పాటలో వ్యక్తీకరించిన విధానం ఈ పాటను తెలుగు సినిమాలలోనే కాదు, ఇతర భాషల సినిమాల పాటలన్నింటిలోనూ విశిష్టంగా నిలుపుతుంది. ఇక్కడే సంగీత దర్శకుడి చమత్కారం గమనించాలి. 

పాటను నాయిక రాత్రిపూట ప్రశాంతమైన పరిస్థితిలో ఒంటరిగా ఆనందకరమైన ఘడియలను ఊహిస్తూ పాడుతుంది. గేయం భావమూ అలాంటిదే. ఈ పాటను స్వరపరచిన రాజేశ్వరరావు సందర్భాన్ని సంపూర్ణంగా ఉద్దీపితం చేసే రాగాన్ని ఎంచుకుని పాట బాణీని స్వర పరిచాడు. ‘కళ్యాణి’ రాగం అత్యంత శుభప్రదమైన రాగం. ‘కళ్యాణం’ అంటేనే అత్యంత శుభకరం అని అర్థం. అంటే ఆనందకరమైన, పవిత్రమైన సమయాల్లో గానం చేసే రాగం అన్నమాట ఇది. కళ్యాణి రాగాన్ని అర్ధరాత్రి దాటిన తరువాత తొలిజాములో గానం చేస్తారు. నాయిక పాటను అర్ధరాత్రి తొలి జాముననే గానం చేస్తుంది. అందుకే ఈ పాట అంత ప్రభావం చూపగల శక్తిని సంతరించుకుంది. 

16వ శతాబ్దానికి చెందిన మేష కర్ణుడు రాగాలలోకెల్లా కళ్యాణి రాగాన్ని అతిగొప్ప రాగంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా, ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తున్న ప్రేయసీ ప్రియుల భావనలను ఈ రాగం ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందని భావించాడు. ఆ కాలంనాటి ఓ పాట, ఈ రాగంలోనిదీ ‘నా ప్రియుడు నన్ను విడిచి వెళ్లాడు, అతడి రాక కోసం ఎదురుచూస్తూ తారలు లెక్కిస్తూ’ రాత్రులు గడుపుతున్నానన్న అర్థంలో ఉంటుంది. సాంప్రదాయం పద్ధతి తెలిసి భాషపై పట్టు, ఉన్నవారు సందర్భం తెలుసుకుని ఉత్తమ కళను ప్రజలకు అందించాలన్న తపనతో సృజించే అత్యుత్తమ కళకు అతి చక్కని నిదర్శనంగా ఈ పాట నిలుస్తుంది.

 

కొమ్మల గువ్వలు గుసగుస మనినా

రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయచూచితిని
ఘడియయేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో.
పాట వింటుంటే మనసు తెలియని మధురమైన బాధకు గురవుతుంది. సామాన్యులకు సామాన్యంగా అనుభవానికి రాని తీయని ప్రేమ వేదన అనుభవానికి వస్తుంది. పాట పూర్తయ్యేసరికి గుండె గొంతుకలో కొట్టు మిట్టాడుతుంటుంది. ఆరంభంలో మనసులో పూచిన మల్లెల మాలలు, చివరికి వచ్చేసరికి ఎక్కడ హృదయము పగులుతుందోనన్న సున్నితమైన భయానికి గురవుతాయి. అంత ఆనందంలోనూ భరించరాని వేదనను అనుభవిస్తాయి. ఇలాంటి పాటకు అంతే సున్నితమైన, సహృదయమైన చిత్రీకరణ తోడయితే ఇక ఆ దృశ్యం మరపురాని మధురమైన దృశ్యంలా మిగులుతుంది. ఇలాంటి పాటలను విని, చూసిన తరువాత సినిమాలలో పాటలనవసరం అని వాదించే వారిని చూసి జాలి కలుగుతుంది. మొదటి ఎన్నాళ్లకీ బతుకు పండెనోకీ ఇప్పటి ఎన్నాళ్లకీ బతుకు పండెనోకీ  పదాలలో సామ్యమున్నా, భావంలో ఎంతో తేడా ఉంది. ఈ తేడాను మనసులో మల్లెలూగిన సున్నితమైన భావుకులు మాత్రమే అనుభవించగలరు. 

ఇంత గొప్ప కళాత్మకతను తమ హృదయం లోతుల్లోంచి నిజాయితీగా ఆనాటి కళాకారులు ప్రదర్శించారు. కాబట్టి సినిమా పాటలు ఇతర ప్రక్రియలను దాటి సమాజంలో ప్రజల నిత్య జీవితంలో విడదీయరాని భాగమయ్యాయి. ఈనాడు సినిమాలు కానీ, పాటలు కానీ ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణమయ్యాయి. అయితే, ఇదే పాట, ఇదే సాహిత్యం, ఇదే బాణీతో దృశ్యాన్ని మార్చితే పాట నచ్చక పోవటమే కాదు సినిమా కూడా నచ్చదు. ఊహించండి.. నాయిక నాయకుడి కోసం ఎదురుచూస్తూ నృత్యం చేస్తుంటే, వెనకే ఓ వందమంది చెలికత్తెలు లయబద్ధంగా ఊపుతూ, ఊగుతూంటే… అందుకే ఈనాటి పాటలు మనకు నచ్చవు. గుర్తుండవు. పాత పాటలు మరపుకు రావు. మనసుకు అమిత ఆనందం కలిగిస్తాయి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని అడుగుతూ మనసులో మల్లెల మాలలు పూయిస్తాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 -(ఊసర క్షేత్రాలు-)ఎజ్రా పౌండ్ ,టి ఎస్ ఇలియట్ కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52

ఊసర క్షేత్రాలు

మనో భావం బుద్ధి కన్నా గొప్పది అన్న లారెన్స్ ను సవాలు చేసి ,అతన్ని ఒంటరి వాడని ,అసంబద్ధ రచయిత అని తీసి పారేసి ఆడెన్ ,స్పెండర్ ,లేవిస్ ,ఎంప్సన్ లు కొత్త పధ్ధతి కి తెర దీశారు . దీనినే ఆధునిక కవిత్వమని ,కొత్త పదాల ,పలుకు బడుల కవిత్వమని  ,బౌద్ధికం గా చురుకైన వాడికలదని అన్నారు .వీరికి కూడా ఒక ప్రణాళిక లేదు ,ఒక ఆలోచనా శాఖ లేదు .కాని వారికి ప్రత్యెక శైలి మాత్రం ఉంది .అందుకే వీరిని ‘’’శైలిస్ట్ కవులు ‘’అన్నారు .అందులో అగ్రభాగాన నిలిచిన వారు ఇద్దరు –ఎజ్రా పౌండ్ మరియు టి ఎస్ ఇలియట్ .

ఇమేజిస్ట్ కవి -ఎజ్రా పౌండ్

ఎజ్రా లూమిస్ పౌండ్ అమెరికాలో  న్యు ఇంగ్లాండ్ లోని ఇడాహో లో హైలీ లో 30-10-1885 న పుట్టాడు తల్లికి  లాంగ్ ఫెలోకవి బంధువు .తండ్రి ప్రభుత్వోద్యోగి .స్వశక్తి బుద్ధి తో హైలీ లో మొదటి ప్లాస్టర్ ఇంటిని నిర్మించాడు .పౌండ్ తూర్పున ఉన్న పెన్సిల్వేనియా యూని వర్సిటి లో విద్య నేర్చాడు . తర్వాత న్యు యార్క్ లోని హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైలో పెన్సిల్వేనియా యూని వర్సిటి డిగ్రీ పొందాడు .అందులోనే బోధించాడు .ఒక ఏడాది రిసెర్చ్ చేయటానికి స్పెయిన్ ,ఫ్రాన్స్ ,ఇటలీ లు తిరిగాడు .తిరిగొచ్చి ఇండియానాలోని కాఫోర్డ్స్ విల్ లోని వా బాష్ కాలేజి ఫాకల్టి లో చేరాడు .ఆ పట్నం మంచి  విద్యకు విద్యా వేత్తలకు కేంద్రం .పౌండ్ మాత్రం అక్కడే’’ బెన్ హర్’’ రాసిన ‘’ల్యూ వాలెస్ ‘’చని పోయాడని అన్నాడు .పౌండ్ కున్న బోహిమియన్ భావాలు నచ్చక ఉద్యోగం పీకేశారు .

అసహనం తో యూరప్ వెళ్ళాడు . గ్రామాలలోని ఆర్టిస్ట్ లను నమ్మని ,వారికి వ్యతిరేకం గా మాట్లాడే అమెరికన్లకు బుద్ధి చెప్పాలని నిర్ణ యించుకొన్నాడు .తన మనో భావాలను ‘’ఏ ల్యూం స్పెంటో’’లో పొందు పరచి ఇటాలి లోని వెనిస్ లో  పబ్లిష్ చేశాడు .లండన్లో నివాసముండి యువకులతో ఒక  గ్రూప్ ను తయారు చేసి లీడర్ అయి ,చైనా ,జపాన్ కవిత్వ సేకరణకై ఏర్పడిన ‘’ఫెనో ల్లోసా ‘’కు సాహిత్య కార్య నిర్వహణాధి కారిగా నియమింప బడ్డాడు .చైనా కవిత్వం లోని క్లుప్తత స్పష్టత ,జపాన్ కవిత్వం లోని ‘’టాంకా ,’’హోక్కా ‘’,.లలోని లోతైన భావాలు ఆకర్షించాయి .అవే పౌండ్ తోలి కవితల్లో చోటు చేసుకున్నాయి .అరవైలో రాసిన ‘’కాంటో’’లలోను వదలక నిలిచే ఉన్నాయి .ఇరవై ఆరులో ఓరియంటల్ పోయెట్రి లోని సౌందర్యం నచ్చి ఆ ధోరణిలో రాశాడు .అందులో ఒక లైన్ –the apparition of these faces in a crowd –petals on a wet –black bough ‘’

ఇరవై తొమ్మిదిలో డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకుని కొడుకును కన్నాడు .అప్పటికే అయిదు చిన్న కవితా పుస్తకాలు రాసిన రచయితఅయినాడు .చివరి నాలుగు  ‘’పెర్సానే ,ఎక్సుల్టే షన్స్ ,’’కాన్జోని ‘’,రిపోస్టెస్’’అని భావ గర్భితం గా పేర్లు పెట్ట్టుకున్నాడు .ఇవన్నీ ప్రాంతీయ ,పురాతన ఫ్రెంచి ,విక్టోరియన్ చివరి కాల ప్రభావం కలవే .బ్రౌనింగ్ ,మారిస్ ,ప్రీ రాఫెలడైట్స్ ఆవహించగా రాసిన కలగూర గంప కవితలే .దీని తర్వాతే స్పష్టమైన ఆలోచనా భావ ప్రకటన ఏర్పడ్డాయి .బాలడ్స్ ,సేష్టినాలు రాస్తూ ఫ్రెంచ్ ఫారంస్ ను వదిలేసి రిలీఫ్ పొందాడు .మనస్పూర్తి పరవళ్ళు తొక్కి ‘’ .come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather dislike –the gilded phaloi of the crouses –are thrusting at spring air ‘’అంటూ ఆవేశ పడ్డాడు బహుసా మన శ్రీ శ్రీ ‘’కవితా ఓ కవితా ‘’కూడా ఇలాంటిదే .

వాల్ట్ విట్మన్ భావాలను వ్యతిరేకించినా కవికి దగ్గరయ్యాడు పౌండ్ .’’it was you that broke the new wood ‘’అని మెచ్చాడు .తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నాడు .కాని ఆంగ్ల కవులు ఆదరించలేదు .పైగా  విన్దర్ హాం  లేవిస్ ‘’ఈ రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్- గ్లాసు నీళ్ళలో ఆయిల్ చుక్క  .తమాషా ఏమిటంటే అందులో కలవాలని కోరుకోడు.ఊరికే ఊరిస్తాడు ‘’అన్నాడు .కానీ పౌండ్ అహంకారం గర్వమే అతన్ని లెజెండ్ ను చేశాయి .సాహిత్యం కళ లపై స్పందన కలిగించే ఉపన్యాస సునామీ సృష్టించాడు .ఇంగ్లీష్ వాయిద్యం బ్లాస్ట్ ను బ్లాస్ట్ చేసే ధోరణిలో తీవ్రం గా భావోద్రేకం గా గుండెల్ని చీల్చి దూరేలా మాట్లాడాడు ,చరిత్రే సృష్టించాడు .చికాగో లో యెర్ర గడ్డం తో ,ఊగి పోతూ విప్లవ కారుడై విజ్రుమ్భించాడు .పౌండ్ సలహా పై తను రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కవితలను సగంమాత్రమె   ముద్రించి ఇలియట్ ఎజ్రా పౌండ్ కే అంకితమిచ్చాడు స్వామి భక్తిగా .

1914లో పౌండ్  ఒక కవి బృందాన్ని తయారు చేసి సమకాలీన కవిత్వం లోని అతిని నిరసిస్తూ ఒక మేని ఫెస్టో తయారు చేసి ,తన గ్రూపుకు ‘’ఇమేజిస్ట్స్ ‘’ అని కొత్త పేరు పెట్టాడు .రోమాన్టిసిజానికి వ్యతిరేకం గా ,ప్రతీకలకు ప్రాదాన్యామిచ్చారు .వారి సిద్ధాంతాలు ముఖ్యం గా మూడు .1-సామాన్య భాషలోసరి అయిన మాటను ప్రయోగించి దానికి తళుకు బెళుకులు అద్ద కుండా రాయాలి , .2-రిధం ను పాత పద్ధతిలో ఛందో బద్ధం గా కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వేర్స్ లో రాయాలి .3-కవిత్వ ఉత్పత్తి  అస్పష్టం గా  ఉండిపోవాలి .(ఇండేఫినిట్).అంతర్జాతీయ భావన పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు .కమ్యూని కేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యం . ఈ సెటిల్ మెంట్ కల్లోలం సృష్టించింది .దీన్ని ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్ ‘’అన్నారు .

అమెరికా లో ఇమేజిస్ట్ ఉద్యమానికి’’ ఆమి లోవెల్’’ పురుడు పోసింది .స్వయం గా ప్రచారం చేసింది .పౌండ్ కు తెలిసి ద్రోహం అన్నాడు .ముగ్గురు ఇంగ్లీష్ ఇమేజిస్టే లు రిచార్డ్ ఎడింగ్టన్ ,ఎఫ్ ఎస్ ఫ్లింట్ ,ది హెచ్ లారెన్స్  లను కిడ్నాప్ చేసి ,మరో ఇద్దరు అమెరికన్ కవులు జాన్ గోల్డ్ ఫ్ల్చేర్ ,హిల్డా డూ లిటిల్ (హెచ్ .డి)ల తో కలిసి ‘’సమ్ ఇమేజిస్ట్ పోఎట్స్ ‘’ను 1915 -16-17లను ఏర్పరచింది .ఈ బంది పోటు ‘’తనానికి నివ్వెర పోయి పౌండ్ అందులోంచి తప్పుకున్నాడు .’’ది లిటిల్ రివ్యు ‘’కు ఎడిటర్ అయ్యాడు .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే పారిస్ వెళ్లి పోయాడు పౌండ్ .

పారిస్ లో తన సృజనతో అగ్నిపర్వత ప్రేలుడు భావాలతో చెలరేగి పోయాడు .కొత్త శైలిని వ్యంగ్యాత్మకం గా ,సంభాషణా పద్ధతిలో ఏర్పరచుకున్నాడు .’’హగ్ సెల్వి మాబెర్లి ‘’ని ముప్ఫై అయిదులో పబ్లిష్ చేశాడు .ఆధునిక ప్రపంచాన్ని సెటైర్ తో కొరడా ఝాలిపించాడు .’’a positive document of sensibility –is compact of the experience of a certain man in a certain place at a certain time and is also the document of an epoch ,a genuine tragedy and comedy ‘’అని పించి ఆర్నోల్డ్ మాటల్లో ‘’జీవిత విమర్శ ‘’(క్రిటిసిజం ఆఫ్ లైఫ్ )అయింది . కాంటోస్ కు  విశేష ఆదరణ వచ్చింది .దాదాపు పాతికేళ్ళు రాశాడు దీనిని .వంద అధ్యాయాలున్న అతి పెద్ద గ్రంధం .చివరి పది అధ్యాయాలను పీసా లో అరెస్ట్ చేసి1945 లో జెయిల్ లో పెట్టినప్పుడు రాశాడు .’’రాక్ డ్రిల్ ‘’ను చదవాలని ప్రయత్నించిన వారికి  నిరాశ ఎదురైంది అది కోడ్ భాషలో రాశాడు కొరుకుడు పడలేదు .పొరపాటు పడ్డారుకాని అది తప్పు కాదు .స్పష్టం గానే రాశాడు .అవన్నీ స్వీయానుభవాలు ,వ్యక్తీ గతాలు .’కాంటోస్’’కు రాసిన సూచికే మూడు వందల ఇరవై పేజీలుంది .ఇదంతా ;’’ స్ట్రీమ్ఆఫ్ కాన్షస్ ‘’(చైతన్య స్రవంతి )రచన అప్పటికి కొత్త .యేట్స్ కవి ‘’విషయం కంటే శైలి గొప్పగా ఉంది .ఇంత బాగా భావాన్ని స్పష్టం గా తెలియ జెప్పిన సమకాలీన కవి లేనే లేడు .కాని మధ్యమధ్యలో తెగిపోతూ అతుకులు పడుతూ ,మెలికలు తిరుగుతూ ,నరాల ఉద్రేకం కలిగిస్తూ ,దివా స్వప్నమై ,గందర గోళం గా ఉన్నది మాత్రం నిజం ‘’అన్నాడు .

కాని పౌండ్ మాత్రం తానూ ‘’హ్యూమన్ కామెడీ ని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలతో ,కోణాలలో చిత్రించాను ‘’అని స్పష్టం గా చెప్పాడు .ఒక నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకొనే రాశాడు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావ్రుత్తాలు,సమకాలీన స్తితి గతులు  కలిసి అలా అనిపిస్తాయి .మొదటి ప్రపంచ యుద్ద్ధాన్ని ‘’ఇంఫెర్నో ‘’లో డబ్బు బాంకింగ్ పాపాలను ‘’పర్జ్ టోరియో ‘’లో క్లైమాక్స్ ను ‘’పరాడిసో ‘’చిత్ర్రించాడు .కొన్ని కవితా పంక్తుల్ని చూద్దాం –

‘’hang it all Robert Browing –there can be but the one ‘’Sordello ‘’-but Sordello ,and my Sordello ?-lo sordels sifo di –Mantovana-so shu-churned in the sea ‘’

1924లో ఫ్రాన్స్ వదిలి రాపల్లో లో స్తిర పడ్డాడు .స్నేహితులు తగ్గి శత్రువులు పెరిగారు .అమెరికా ప్రెసిడెంట్ జెఫర్సన్ కంటే ఇటలీ నియంత ముస్సోలినీ ప్రజాస్వామ్యాన్ని మెచ్చి ఫాసిజం ను సమర్ధించాడు .రోమ్ నగరం రేడియో లో మాట్లాడుతూ అమెరికాను చెడ తిట్టాడు ‘’.తన అమెరికా’’ పై దాడి చేయమని ఫాసిస్టూలకు ఉపదేశించాడు .ఉద్రేకి చివరకు దేశ ద్రోహి అయ్యాడు .1945 మే లో అరెస్ట్ చేసి వాషింగ్ట న్ కు తీసుకొచ్చారు .మరణ శిక్ష పదేదే కాని డాక్టర్లు పౌండ్ మానసిక పరిస్తితి బాగా లేదని తేల్చారు .తొమ్మిది నెలల తర్వాత సెయింట్ ఎలిజ బెత్ మానసిక హాస్పిటల్ కు మార్చారు .పన్నెండేళ్ళు కేసు నడిచింది చివరికి పౌండ్ ఇక ఏ మాత్రమూ విచారణకు నిలబడ లేడని,ఇటలీ లో చేసిన రేడియో ప్రసంగం మానసిక పరిస్తితి సరిగ్గా లేనందున చేసిన దే నని  తేల్చారు .ప్రజలు ,ప్రజా సంఘాలు రచయితలూ వాల్ట్ విట్మన్ నాయకత్వాన పెద్ద  నిరసన తెలియ జేశారు .1958మే లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీ వెళ్లి పోయాడు .ఇటలీని తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సాల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచ్చి వాళ్ళ శరణాలయం ‘’అన్నాడు .

రాజ కీయం గా తప్పుడు దోవలో నడిచినా కవిత్వ పరం గా ప్రయోగాలు చేసి కొత్త వరవడి పద బంధం ,సామెతలు  సృష్టించి నూతన శైలికి మార్గ దర్శి అయి ,ఎందరినో ప్రభావితం చేశాడు ఎజ్రా పౌండ్ .అనుయాయులు పౌండ్ మార్గాన్ని ఇంకా నిగ్గు తేల్చారు .’’ Pound could not teach his followers what to say ,but he had a great talent for showing them how to say it ‘’కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు . possessed of a sense of sound, an “ear” for words, imbuing his poetry with melopoeia. .’’కౌంటర్ పాయింట్ కు ప్రాధాన్యం ఇచ్చాడు .’’సాంద్ర’’ కవిత్వాన్నే రాశాడు .ఎన్నో అనువాదాలు చేసి పేరు పొందాడు . as a translator, Pound was a pioneer with a great gift of language and an incisive intelligenc.e The leitmotifs in Pound’s literary criticism are recurrent patterns found in historical events, which, he believed, through the use of judicious juxtapositions illuminate truth; and in them he reveals forgotten writers and cultures.. he sought to emphasize the value of art and to “aestheticize the political . He rejected traditional rhetoric and created his own. 1967 conversation with Allen Ginsberg, Pound told the young poet, “my poems don’t make sense.” He went on to call himself a moron, to characterize his writing as stupid and ignorant, “a mess”. Ginsberg reassured Pound that he “had shown us the way”, but Pound refused to be mollified. Any good I’ve done has been spoiled by bad intentions – the preoccupation with irrelevant and stupid things,’ [he] replied. Then very slowly, with emphasis, surely conscious of Ginsberg’s being Jewish: ‘But the worst mistake I made was that stupid, suburban prejudice of anti-semitism.’

మన చలం లాగా చివరికి లెంప లేసుకున్నాడు పౌండ్ .

photograph of Ezra H. Pound  book coverphotograph

ఆధునిక కవిత్వ మార్గ దర్శి – టి.ఎస్ ఇలియట్

ఎజ్రా పౌండ్, ఇలియట్ లను జంట గానే సాహిత్య చరిత్ర కారులు భావిస్తారు .గురు శిష్యులే .థామస్ స్ష్టియార్న్ ఇలియట్ ఆంగ్ల రచయితలపై విశేష ప్రభావం ఉన్న వాడు .తనకవిత్వం లో బ్రిటిష్ కంటే  అమెరిక కరెంట్ ఉందన్నాడు .ఇంగ్లాండ్ లోనే ఎక్కువ కాలం ఉన్నాడు .  అమెరికా లోని మిస్సోరిలో  సెయింట్ లూయీస్ లో 26-9-1888 న జన్మించాడు .పూర్ర్వీకులు న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్యూరిటన్ లు .తాత బోస్టన్ యూని వర్సిటి ని,సెయింట్ లూయిస్ లో మొదటి యూని టేరియన్ చర్చ్ ని  స్థాపించాడు .మిల్టన్ అకాడెమి లో చదివాడు. ఇరవై ఒకటిలో బి ఏ తర్వాత ఎం ఏ పాసై ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స ఫర్డ్ లో మేర్తాన్ కాలేజి లో స్కూల్ మేస్టర్  అయి బాంక్ క్లెర్క్ గా పని చేశాడు  .ఎనిమిదేళ్ళ తర్వాత లండన్ పబ్లిషింగ్ హౌస్ లో చేరి పూర్తీ భాగస్వామి అయ్యాడు  నలభై లో బ్రిటిష్ పౌరసత్వం పొందాడు .’’ఆంగ్లో కేధలిక్ ‘’నని ప్రక టించు కొన్నాడు .రాజకీయాలలో రాయలిస్ట్ ను అన్నాడు .సాహిత్యం లో క్లాసిస్ట్ నన్నాడు .ఇరవై ఏడులో వివేన్నా హేగ్ ను పెళ్లి  చేసుకున్నాడు .ఏడేళ్ళ కాపురం తర్వాత ఆమె చనిపోతే పదేళ్ళ తర్వాత తన సెక్రెటరి వాలెరీ ఫ్లెచర్ ను వివాహమాడాడు .

పందొమ్మిదేళ్ళ వయసులో సంప్రాదాయ పద్ధతిలో కవిత్వం రాశాడు .గ్రాడ్యుయేట్ కాకపూర్వమే ఫ్రెంచ్ సింబాలిజం అర్ధం చేసుకొన్నాడు .లా ఫోర్జ్ ను ఆదర్శం గా తీసుకున్నాడు .అప్పుడున్న కాల మాన పరిస్తితులకు అసహనం చూపాడు .కొత్త శైలిలో దాన్ని కవిత్వీకరించాడు స్నేహితులు దీన్ని ‘’ ఎలిప్టి కల్ స్కూల్ ‘’అన్నారు .ఇడియం ను ఇంకా పదును బెడుతూనే ఉన్నాడు .ఇరవై మూడులో ‘’ది లవ్ సాంగ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్  ఫ్రూ ఫోర్క్’’అనే మొదటి ముఖ్యమైన కవిత రాశాడు .కంటికి కని  పించిన ప్రతి దాన్ని ఇమేజరిగా వివరించాడు .దీనితో ఇంగ్లీష్ ప్రజల్లో దడ పుట్టించాడు .డాంటే రాసిన కొటేషన్ తో దీన్ని ప్రారంభించి రాశాడు అది చదివిన వారికే ఇది అర్ధమవుతుంది అదీ ఫిటింగ్.అసందిగ్ధం గా ,నిర్ణయాత్మక రహితం గా సాగిన కవిత అది .ఘనీభవించిన సమాజానికి ,వంధ్యత్వం పొందిన సంఘానికి అది ప్రతీక .’’let us go then if you and I –when the evening is spread out against the sky ‘’అంటూ సాగే కవిత అది . ‘’my life is measured by coffee spoons ‘’అంటాడు .’’do I dare –disturb the universe ?-and should I then presume ?-and how should I begin?అని ప్రశ్నించాడు .

ముప్ఫై నాలుగు లో రాసిన ‘’వేస్ట్ ల్యాండ్ ‘’కవితలలో బోర్ డం ,హారర్ ,కీర్తి లను ప్రతిస్టించాడు .ఇందులో జ్ఞాపకాలు ,కోరికలు ఉన్నాయి .క్రిష్టియానిటి చాలెంజి కి సమాధానం అన్నారు .లండన్ నగర జనజీవితం లో ఉన్న ‘’ఊసర క్షేత్ర’’ దర్శనమే ఇది .ప్రతి చోటా ఉన్న చావు ను కనిపెట్టాడు .కవితను ముక్కలు ముక్కలుగా చేసి రాశాడు అందులోని క్రియా సౌభాగ్యానికి మురిసిన వారున్నారు .ఇందులో శిధిల చిహ్నాలున్నాయి .’’బోలు మనుషుల ‘’నిజ రూపం చూడ గలం.అన్నీ కోల్పోయిన ప్రపంచాన్ని చూస్తాం .’’paralysed force ,gesture without motion ,men figures stuffed with straw ,gather on stony soil in a valley of dying stars ‘’అని కదలలేని కుళ్ళిన కంపు కొడుతున్న ,ధ్యేయం లేని సమాజాన్ని చూపించాడు .’’this is the way the world ends –this is the way the world ends –this is the way the world ends –not with a bang but a whimper ‘’అని మూడు మాటలు గంట కొట్టి ప్రపంచ పరిసమాప్తిని చెప్పాడు .

క్రమంగా అనుకోని మార్పులు ఇలిఎట్ లో కలిగాయి .నాటక రచయిత అయ్యాడు . ‘’ది రాక్ ‘’డ్రామా రాశాడు .మర్డర్ ఇన్ ది కేధడ్రిల్ ‘’  ను సెయింట్ థామస్ త్యాగాన్ని గుర్తు చేస్తూ రాశాడు .ఫామిలీ రి యూనియన్ ,కాక్  టైల్ పార్టీ ,ది కాన్ఫిడెం షియ ల్ క్లెర్క్ ,ది ఎల్డర్ స్టేట్స్ మన్ లు  మనసులోకి దూసుకు పోయేట్లు ,బాధ వ్యధ కలిగిస్తూ ,హాస్యం చిప్పిలుతూ రాశాడు .అరవైలో ‘’కన్సేర్వేటివ్ ఎల్డర్ స్టేట్స్ మన్ ‘’అని పించుకొన్నాడు .కమ్మని స్పష్టమైన స్వరం తో తన కవితలను రికార్డ్ చేసుకున్నాడు .వి ఎస్ ప్రిచేట్ ఇలియట్ ను’’a trim anti Bohemian with black bowler  and umbrella ,the well-known symbol of male respectability ,ushering us to our seats in hell ‘’వర్ణించాడు

యాభై సమీపిస్తుండగా ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’విడుదల చేశాడు .గొప్ప ఫిలసాఫికల్ పోయెం అన్నాడు .కాని అంతగా పేల లేదు .ఒక డిజైన్ లో ఇంకో డిజైన్ కలిసి పోయి గజి బిజీ అయింది .’’ట్రాడీదిషన్  అండ్ ఇండి విడ్యువల్ టేలెంట్ ‘’లో సాహిత్య విమర్శ చేశాడు .అరవై లో ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసినందుకు నోబెల్ ప్రైజ్ నిచ్చారు .నాలుగవ జార్జి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశాడు .’’the process of advancement is interesting .one seems to become a myth ,a fabulous creature that does not exist .one does not feel any different though .it is not you get bigger to fit the world ,the world gets smaller to fit you ‘’ అని ఫిలసాఫికల్ గా స్పందించాడు .డేబ్భైలో ఆయన పై ఒక సింపోజియం నిర్వహించారు .అతని ప్రభావం పై డజనుకు పైగా పుస్తకాలు తెచ్చారు .కొత్త క్రిటిక్స్ ను ‘’లెమన్ స్క్వీజేడ్ క్రిటిక్స్ ‘’అన్నారు .వీటిపై ‘’ good poetry must exhibit several qualities in proportion of which one is good sense ‘’అని కవిత్వ పరామావధి చెప్పాడు .మేధ  తో పాటు మత భావాన్నీ జోడించాడు .’’సేలేక్టేడ్ ఎస్సేస్ ‘’లో కవిత్వాన్ని గురించి చాలా రాశాడు .’’కవిత్వం ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూపిస్తుంది .అందులో కొత్త భాగాలనూ తెలియ జేస్తుంది .ఎప్పటికప్పుడు లోతుల ఆవిష్కరణ చేస్తుంది .నిజం గానే దూసుకు పోయేట్లు చేయగల సమర్ధతా ఉంది’’ .ఇలియట్ సాహిత్య సర్వస్వం కొత్త శబ్ద సృష్టి తో ముడి పడింది .కొత్త ,చూడని లోక దర్శనం చేయిస్తుంది .ఆనదాన్ని మాత్రమె కాక ఎక్కువ జాగ్రుతికలిగి స్తుంది .

చివరికాలం లో ఆల్కహాలిక్ అయి’’రిం జిమ్ రిం జిమ్ ‘’అంటూ జిమ్ ను జాం మంటూతెగ తాగే వాడు.  ఆయన ద్విశాతాబ్దికి లండన్ పోఎట్స్ కార్నర్ లో వెస్ట్ మినిస్టర్ ఆబే లో ఒక పెద్ద శిలను ఉంచి గౌరవించారు .వర్జీనియా ఉల్ఫ్ జేమ్స్ జాయిస్ మొదలైన వారిని ప్రభావితం చేశాడు .ఆధునిక కవిత్వ మార్గ దర్శి టి ఎస్ ఇలియట్ .భారతీయ వేదవిషయాలు ‘’దం ,దాంతం ధమద్వం’’మొదలైన పదాలను వేస్ట్ లాండ్ లో వాడాడు .

 

Thomas Stearns Eliot by Lady Ottoline Morrell (1934).jpg Inline image 1

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51

ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పోరాడే వారి యుద్ధ క్షేత్రం లారెన్స్ .ఆలోచనా పరుడైన ఫిలాసఫర్ .మానసిక అన్వేషణ ఉన్న రుషి తుల్యుడు .భవిష్యత్ దార్శనికుడు .కొరడా దెబ్బలు కొట్టగల మానవుడు .ఎక్కడా ఇమడలేని వాడు .వీటినన్నిటిని తన ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవల లో ఆవిష్కరించుకొన్నాడు .11-9-1885 న నాటింగ్ హాం షైర్లో ఈస్ట్ వుడ్ లో జన్మించాడు .ముగ్గురబ్బాయిలు ఇద్దరంమాయిలున్న కుటుంబం .అసలు పేరు డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ .కొండ దిగువన చిన్న ఇంట్లో ఉండేవారు .చదువు రాని తండ్రి బొగ్గుగని కార్మికుడు .తల్లి టీచర్ గా కొంతకాలం పని చేసింది .మంచిదే కాని దామినేటింగ్ పెర్సానాలిటి .తండ్రి తాగుబోతు అని తల్లి చెప్పగా తెలుసుకొన్నాడు .

నాటింగ్ హాం హైస్కూల్ లో చేరి చదువులో పెద్ద గా ప్రావీణ్యం చూపకుండా స్కాలర్షిప్ పొందకుండా చదివాడు .ఇంటిపక్క పిల్ల పై పదహారేళ్ళ వయసు లో ప్రేమ లో పడ్డాడు .అది రొమాంటిక్ వ్యవహారమే నని ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’లో రాశాడు ..తల్లి ప్రేమ లో పెరిగి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేశాడు .ప్రేమ శారీరకమైనది కాదని గ్రహించాడు .పదిహేడు కు చదువుకొంటూ చదువు చెబుతూ గడిపాడు .గని కూలీ పిల్లలకు చదువు నేర్పాడు .సాహిత్యాధ్యయనం చేస్తూ  బాతని ఫ్రెంచ్ లను నేర్చాడు .ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ కొంత చదువు చెప్పాడు .తర్వాతా స్వయం గానే చదివి సాధించాడు .దక్షిణ లండన్ లో క్రయోడాన్లోని డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పై తరగతులకు బోధించాడు .చదువు చెప్పటం చదువుకోవటం కంటే ‘’ఫ్లవర్ డ్రాయింగ్ ‘’లో నైపుణ్యం పొందాడు .అందం గా చక్కని శారీరక దారుధ్యం తో ఉండేవాడు .

టీన్ ఏజ్ లోనే అంతర్గత భావాలను రాయాలనే కోరిక కలిగింది .కవిత్వం రాస్తూ పూల బొమ్మలు వేస్తూ తనలాగే ఏ అమ్మాయి అయినా చదివి చూసి ఆనందిన్చాలను కొన్నాడు .ఇరవై లో మొదటి నవల ప్రారంభించాడు .జీవిత సాధనా వైఫల్యమే ముఖ్య విషయం గా రాశాడు .’’ది వైట్ పీకాక్ ‘’లారెన్స్ తోలి ఆవిష్కరణ .ఇరవై అయిదులో రాత –బోధనా మధ్య నలిగాడు .అప్పుడే తల్లి చని పోయింది .మాత్రు ప్రేమ కోసం అలమటించాడు తట్టుకోలేక ఏడ్చేవాడు .అంతా అయి పోయిన్దనుకొనే వాడు .చావు మర్మం ,నిత్య జీవితం లో వెంబడించే చావు పై ద్రుష్టి పడింది .ఎందరో అమ్మాయిలూ వలచారు .వలపించారు .మరణం తర్వాతా కూడా తల్లి ఇంకా బలీయం గా కనిపించింది అనిపించింది .అందుకనే ఏ అమ్మాయినీ ప్రేమించలేక పోయాడు .కొంత భయంతో  కొంత విశ్రాంతి కోసం టీచింగ్ మానేశాడు .కాని బోధిస్తున్నట్లు కలలోచ్చేవి వీటిని వదిలించు కొందామన్నా వదిలేవి కావు .

ఇరవై ఒకటి లో ఫ్రీడ వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ అనే ముప్ఫై ఒక్క ఏళ్ళ స్త్రీ పరిచయమైంది .ఆమె ఒకప్పుడు తనకు ప్రొఫెసర్ అయిన జర్మన్ తండ్రి కూతురే .అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు .ఆమె లో మాత్రు హృదయం ఉందని తెలుసుకొని ప్రేమించి ఆమె తో ఒక ఏడాది జెర్మని ఆస్ట్రేలియా ,ఇతలీలు తిరిగి ఆమె భర్త నుండి విడాకులు పొందిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .ఇదంతా మూడవ కవితా సంపుటిలో నిక్షిప్తం చేశాడు .దీనికి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోర్స్ ;;అని పేరు పెట్టాడు .అలాగే ‘’లుక్ వి హావ్ కం త్రు’’అనే స్వీయ చరిత్రలోనూ రాశాడు .

లారెన్స్ కు ప్రేమ అంటే పెనగులాట .దాని అన్ని ప్రభావాలకు తట్టుకోవాలి .’’I prefer my strife ,infinitely ,to other people;s peace ,havens and heavens ‘’అన్న గొప్ప ఆదర్శ సిద్ధాంతం లారెన్స్ ది .’’god deliver me from the peace of this world .As for the peace beyond understanding ,I find it in conflict ‘’అని సమాధానం చెప్పాడు .

‘’something in me remembers –and will not forget –the stream of my life in the darkness –deathward set ‘’—‘’grief grief ,I suppose and sufficient –grief makes us free –to be faithful and faithful together –as we have to be ‘’ వంటి కవితల్లో జీవిత తత్వాన్ని సత్యాన్ని తెలియ జేశాడు .

ఇరవై ఎనిమిది లో మూడవ నవల ‘’సన్స్ అండ్ లవర్స్’’రాశాడు మొదటి కదా సంపుటి ‘’ది ప్రస్ష్యన్ ఆఫీసర్’’తెచ్చాడు .ముప్ఫై లో ‘’ది రైన్ బో ‘’బాధా తప్త హృదయం తో రాశాడు .చట్టవ్యతిరేకం గా ,సెక్స్ ప్రేరకం గా ఉందని నిషేధించింది ప్రభుత్వం .లేబియన్ భావలున్నయనీ ఆరోపణ .తానూ రాత ప్రతి చదవ కుండా ముద్రించానని పబ్లిషర్ నెత్తీ నోరూ కొట్టుకున్నాడు .ఈ సమయం లో లారెన్స్ ‘’సూపర్ రేషనల్ వే ఆఫ్ లైఫ్ ‘’పై ఆలోచన చేశాడు .బుద్ధి కంటే సహజ జ్ఞానం గొప్ప అన్నాడు . ‘’my great religion is a belief in the blood ,the flesh ,as being wiser than the intellect .we can go wrong in our minds .but what our blood feels aand believes and says is always true ‘’.అని సిద్దాన్తీక రించాడు .

మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ దంపతులను ఇంగ్లాండ్ కు దక్క్షినం లో ఉన్న జేన్నార్ కు తరిమేసింది .అక్కడే కాల్ రిడ్జ్ సూతీ ఆలోచించిన  వదిలేసిన‘’ పాంటిసో క్రసి’’ని అక్కడి ప్రజల మనస్సుల్లో నింపాలని కల గన్నాడు .అందరితో కలిసి ఉంటున్నా లారెన్స్ వంట చేయటం ఇల్లు ఊదవటం లాంటి పనులు చూసి నగర ప్రజలు అనుమాన పడ్డారు .ఇదంతా విద్దూరం అనుకొన్నారు అసలే యుద్ధ భీతి . పైగా జర్మనీ తో యుద్ధం  .లారెన్స్ భార్య జర్మన్ .ఆమె సోదరుడు జర్మన్ వైమానికుడు .కనుక లారెన్స్ ఒక గూద చారి అని అనుమానించారు .లైట్లు ఆర్పేశారు ,ఇల్లంతా సోడా చేసి చివరికి గెంటేశారు .రెండేళ్ళు లండన్ బెర్కశైర్,ద్ర్బి షైర్,మిడ్ల్యాండ్ హిల్స్ లు తిరిగారు యుద్ధం అయి పోయిన తర్వాత1919 లో లారెన్స్ దంపతులు ఇంగ్లాండ్ వదిలి కాంటి నెంట్ కు చేరుకున్నారు .పుస్తకాలను పుంఖాను పుమ్ఖం గా రాస్తున్నా బీదరికం లోనే ఉంది పోవాల్సి వచ్చింది .అతని పుస్తకాలు ముద్రించటం సాహసాం ఇబ్బంది అనుకున్నారు పబ్లిషర్లు.ముప్ఫై అయిదు లో ‘’విమెన్ ఇన్ లవ్ ‘’ రైన్ బో కు సీక్వెల్ గా ప్రచురించాడు .ఇందులో ‘’సూపర్ సెక్సువల్ లవ్ ‘’ను ప్రతిపాదించాడు .ఆరేళ్ళు దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు .అప్పుడప్పుడు లండన్ వచ్చి కొద్ద్దికాలం ఉంది వెళ్లి పోతున్నాడు .’’నా నుంచి నేను దూరమై పారి పోతున్నాను ‘’అని రాసుకొన్నాడు .ఎక్కడ ఉన్నా కొద్దికాలం లో అది బాగా లేదని పించటం ఇంకో చోటికి వెళ్ళటం అక్కడా నచ్చక పోవటం అదీ అతని పరిస్తితి .సార్దినియా ఆస్ట్రేలియా అమెరికా ఎక్కడికెళ్ళినా ఇంతే .మెక్సికో చేరాడు .అక్కడ ఒక ప్రఫెత్గా ,నాయకుడిగా మారాడు అక్కడి సృజనాత్మక రచయితాలను ఆర్టిస్ట్ లను కలిసి తన మనో భావాలను చెప్పాడు .’’ది ప్లూమేడ్ సేర్పెంట్ ‘’,మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’రాసి అందులో ప్రక్రుతి లో ఉన్న ప్రతి వస్తువుపై తనకున్న ప్రేమ ఆరాధనకు పట్టం కట్టాడు .

సూర్యారాధన ,రక్త విజ్ఞానం మొదలైనవాటిని అమలు చేశాడు .ఇవన్నీ చూసిన వారు ‘’ప్రో ఫాసిస్ట్ ‘’అన్నారు .1925లో మళ్ళీ తిరిగి వచ్చ్చే ఉద్దేశ్యం తో అమెరికా వదిలి పెట్టాడు .మళ్ళీ సంచార చేస్తూ జేనోవా ఫ్లారెన్స్ ,ఆస్ట్రియ జెర్మని మొదలైనవి తిరిగి చివరికి ఫ్రాన్స్ చేరాడు .నిరంతర అన్వేషణే ధ్యేయం.ఇదే జీవితం లో చివరి మజిలీ అయింది .ఇక్కడే మరపు రాణి వచన గ్రంధాలు చిరస్మరణీయ కవితా సంకలనాలు రాశాడు .కోపం ఉద్రేకం తో రాసిన కవితలూ ఇక్కడివే .’’లేడీ చాట ర్లీన్ ‘’ఇక్కడ పుట్టిన నవలే.సెక్స్ కు పవిత్ర ప్రేమకు సంఘర్షణ ను ఈ నవలలో గొప్పగా చిత్రించాడు  .సమకాలీన సాహిత్యం లో ఇంట అలజడి సృష్టించిన నవల ఇంకోటి లేదు .అందులో కొన్ని ‘’పాశవిక శృంగార కధనాలు ‘’ఉన్నాయి .అందులోనే లోతైన సాను భూటినీ వ్యక్తీకరించాడు .మొదట దీని కి ‘’టెండర్ నేస్ ‘’అని పేరుపెట్టాడు .దీన్ని వ్యతిరేకించారు బహిష్కరించారు నిషేధించారు .ఆధునిక ప్రపంచం లో విపరీత అనాగారకతకు ,,మానసిక ,ఆధ్యాత్మిక కు మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నమే ఈ నవల .’’the source of all beauty and and all real gentleness ‘’అని విమర్శాకాభిప్రాయమే కాదు లారెన్స్ మహర్షి భావన కూడా .

ఇంకా రెండేళ్ళు జీవించాలి .మెటా ఫిజికల్ రెలిజియస్ ఎంక్వైరీ తో సూర్య స్తుతి ,చాతర్లీన్ పై ప్రతివిమర్శ ,డజను చిన్న కధలు ,వంద కవితలతో ఒక పుస్తకం వెలువ రిమ్చాడు .ప్రపంచ ప్రసిద్ధ హారర్ కధల్లో ఒకటి గా ఒక సూపర్ నేచురల్ చైల్డ్ కద  కూడా ఇందులో ఉంది .క్రమంగా లారెన్స్ ఆరోగ్యం తగ్గి పోతోంది విపరీతమైన ఒత్తిడి శ్రమ .భరించలేక పోతున్నాడు .’’పాన్సీస్ ‘’అనే కవితల రాత ప్రతిని హోమ్ సెక్రెటరి ఆర్డర్ పై సీజ్ చేసి ప్రింటింగ్ ను ఆపెయించారు పోలీస్ సహాయం తో .వెరవని లారెన్స్ ‘’trying to fulfill his living wholeness and his living union ‘’కోసం రాస్తూనే ఉన్నాడు . ‘’for one man ,as  for flower and beast and bird ,the supreme triumph is to be most vividly alive ‘’అని మనస్పూర్తిగా నమ్మిన లారెన్స్ మనీషి 1-3-1930న  ఇతలేఎ లోని వెనిస్ లో ఆద్ ఆస్ట్రఅని పిల్చుకొన్న ఫ్రెంచ్ రివేరా పైన నలభై అయిదేళ్ళ వయసులో  మరణించి అమరుడైనాడు .

జీవిత కాలం లో నలభై పుస్తకాలు రాశాడు లారెన్స్ ‘’a body of creative fiction ,poetry and plays and controversial works as studies in classic American literature ,psycho analysis of the un conscious ,pornography and obscenity and aseries of autobiographical travel books ,a long record of suffering ,agony ,and ecstasy. Almost Lawrence touched was translated into a struggle ,a death and resurrection of the flesh- he wrote as though his throat were choked in its own crimson ‘’.

ఒక తరాన్ని ప్రభావితం చేసిన లారెన్స్ ‘’తాత్కాలిక సంఘటనే చివరిది ‘’అనే భావం తో ఉడుకు రక్తం తోమూసుకున్న కళ్ళ కళ తో రాశాడు .అతనిది చైతన్య శీల ఆత్మాన్వేషణ .అతని కవితాత్మకా వచనం ,మనోహర కవిత్వం మానసిక సంఘర్షణ ,బాహ్య ప్రపంచ హింస కు ప్రతీకలే .లారెన్స్ ‘’one realm we have never conquered –the present .one great mystery of time is terra incognita tous –the instant .The most superb mystery we have hardly recognized –the immediate instant itself ‘’అని తన ఫిలాసఫీ ని స్పష్టం చేశాడు .ఆధునికత పేరుతో మానవతను దూరం చేసుకొంటూ పారిశ్రామిక ప్రగతిలో ఆదర్శాలను బాలి పెట్టుకుంటున్న సమాజాన్ని జాగృతం చేశాడు లారెన్స్ .’’ఆర్టిస్టిక్ ఇంటేగ్రిటి  ,మోరల్ సీరియస్ నేస్ ఉన్న బ్రిటిష్ రచయితఇంగ్లీష్ నవలకు మహా వారసుడు . విట్మన్ మేల్విల్లీ  ,ప్రభావాం తో రాశాడు పో . లారెన్స్ మరణం తరువాత అతని ఆరాధకురాలు కేధరీన్ కార్స్ వెల్ లారెన్స్ పై ఫారేస్తర్ లాంటి వారి క్రూర విమర్శలకు దీటుగా సమాధానం చెప్పింది .ఆల్డస్ హక్స్లీ కూడా1932లో విడుదలైన లారెన్స్ ఉత్తరాల సంచికలో లారెన్స్ ప్రభావాన్ని కీర్తించాడు . తన మనో భావాలను చిత్రాలలో చక్కగా పెయింట్ చేసి వ్యక్తపరచిన చతురుడైన చిత్రకారుడు లారెన్స్ .’’pictures of real beauty and great vitality ‘’అని మెచ్చుకున్నారు .జీవితం లో మూడు వంతులు దరిద్రం తో ,ఆహిష్కార సంచారం తో గడిపిన దురదృష్ట వంతుడు లారెన్స్ .సాంప్రదాయ ఆంగ్ల కల్పనా సాహిత్యానికి గొప్ప దోహదం చేసిన వాడు లారెన్స్ .అప్పుడప్పుడు స్త్రీలకూ వ్యతిరేకం గా రాసినా ,ఆబాల సబల కావాలని ,శక్తి సంపన్నమైన స్వయం  వ్యక్తిత్వం తో  సంపూర్ణ మహిళగా  ఎదగాలని కోరుకున్నాడు ఫెమినిజం అనే పేరు పెట్టక పోయినా వారికి అండగానే రాశాడు .స్వయం పద్ధతిలో సమాజం లో నిలబడిన స్త్రీలనే పాత్రలు చేసి రాశాడు .’’ప్రిసనర్ ఆఫ్ సెక్స్ ‘’నవలలో లారెన్స్ భావాలను నార్మన్ మైలెర్ సమర్ధించాడు .ఆ తరం లోఅన్ని ప్రక్రియలను చే పట్టి  నిరుపమాన రచయిత అని పించుకొన్నాడు లారెన్స్ .

 

D H Lawrence passport photograph.jpg  Lady Chatterley's Lover (1928)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లా పూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50

ఇంగ్లాండ్ ధోరణులు

జార్జియన్ కవిత్వం

ఇప్పటి వరకు అమెరికా ధోరణుల లో వచ్చిన మార్పులు తెలుసుకోన్న్నాం .ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తోందో చూద్దాం .ఇరవై వ శతాబ్ది మొదటి పదేళ్ళలో దాదాపు పాతిక మంది ఇంగ్లీష్ కవులు ఒక తేలిక పాటి బృందం గా ఏర్పడి వరుసగా అనేక రచనలు చేసి ‘’జార్జియన్ పోయిట్రీ ‘’అని పేరు పెట్టు కొన్నారు . ఎడ్వర్డ్ మార్ష్ ఎడిటర్ గా వచ్చిన ఈ కవిత్వం పై కొత్త బలం అందాన్ని తెచ్చామని చెప్పాడు .ఒకే విధానానికి కట్టు బడి వారు రాయక పోయినా శక్తి,అందం కలిగించామని చెప్పుకొన్నారు .తమ చుట్టూ ఉన్న ప్రపంచ పరిస్తితులపై స్పందించి రాశారు .వాస్తవ పలుకు బడులను ప్రవేశ పెట్టారు .విరుద్ధ భావాల కవులయిన వీరే లాసిలాస్ ఆబెర్ క్రోమ్బీ ,గార్డన్ బాటం లి ,రూపర్ట్ బ్రూక్ ,జి కే చేస్టర్ టన్ , డబ్ల్యు హెచ్ డేవిస్ ,వాల్టర్ డీ లామేర్ ,జాన్ డ్రింక్ వాటర్ ,జేమ్స్ ఎల్లే ఫ్లేకేర్ ,విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ ,రాబర్ట్ గ్రేవ్స్ ,రాల్ఫ్ హాద్గాన్ ,ది హెచ్ లారెన్స్ ప్రభ్రుతులు .

ఇందులో కొద్ది మంది సమకాలీన ద్రుశ్యాలనే ఎంచుకొని కవిత్వం రాశారు .మేస్ ఫీల్డ్ నావికుల, ,,దిన కూలీల వేటగాళ్ళ హత్య చేసే వాళ్ళ గురించి రాశాడు .గిబ్సన్ రాళ్ళు  పగల కొట్టేవారిని ,వడ్రంగులను , ,రైతులను  ,ఫెర్రె నడిపే వారిని కవిత్వం లో ద్రమతైజ్ చేస్తూ రాశాడు .ది హెచ్ లారెన్స్ మాత్రం తన పుట్టిన గడ్డ నార్త్ అంప్ షైర్ కూలీల గురించి అధిక శ్రమ చేస్తున్న వారి జీవితాల గురించి కవిత్వం రాశాడు .పట్నం లో చీకటి లో మగ్గే వారి గురించి ,పల్లె ప్రజల అమాయకత్వాన్ని గురించి కూడా రాశాడు .’’జార్జియన్ గ్రూప్ ఎక్కువ కాలం బతక లేదు .అయిదు కవితా సంపుటాలు రెండేళ్ళ కోసారి తెచ్చారు ఇందులో వారిలో వారికి ఉన్న భేదాలు ప్రస్పుతమైనాయి .ఒకళ్ళని ఒకళ్ళు తిట్టి పోసుకున్నారు .రొమాంటిక్ యువతకు చిహ్నమైన రాబర్ట్ బ్రూక్ ఇరవై ఎదేల్లకే చని పోయాడు .ఫ్లేకర్ ముప్ఫై ఒకటికి ,చనిపోయారు మేస్ ఫీల్డ్ మళ్ళీ సాధారణ విషయాలపై రాశాడు .గిబ్సన్ సెమి రూరల్ స్టీరియో టైప్ కవితలల్లాడు .లారెన్స్ జార్జియన్ తత్త్వం ఉన్నవాడు కాకపోయినా అన్  కాన్షస్ తో  కవిత్వం రాశాడు ఆబార్ క్రోమ్బీ రాయటమే తగ్గించేశాడు .ఉద్యమం గా పిలువా బడిన జార్జియనిజం పలాయన వాదామే అయింది .జార్జియన్ తత్త్వం కొద్దిగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రక్రుతి పై రాస్తూ అది ఏంటో దయ ప్రేమ తమపై చూపిస్తోందని తృప్తి పడ్డారు .ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని కోరారు .ఇక్కడే మాధ్యూ ఆర్నోల్డ్ కవి ప్రక్రుతి ఆరాధకులకు చేసిన  సూచన గమనిద్దాం –

‘’man must begin ,know this ,where nature ends –nature and man can never be fast friends ‘’

వీధి కవి-  డబ్ల్యు హెచ్ డేవీస్

జార్జి బెర్నార్డ్ షా డేవీస్ ని గుర్తించి ఉండక పోయి నట్లయితే సంచారిగా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ బతికే వాడు .మాంట్ మౌత్ షైర్లో న్యు పోర్ట్ లో ఉన్న చర్చ్ హౌస్ లో 20-4- 1871లో పుట్టాడు .వెల్ష్ జాతి వాడు .తండ్రి తక్కువ ఆదాయం వచ్చే ఇన్ కీపర్ .చదివించటానికి డబ్బులు లేవు కనుక కొడుకును వ్యవసాయం పనులకు పంపాడు .దాని మీద శ్రద్ధ లేక పోవటం వలన వదిలేసి జులాయి గా తిరిగాడు .ఇర్వి కి న్యూయార్క్ చేరాడు .అక్కడ అడుక్కు తినటం లో ఒక ఘనుడు ట్రిక్కులు నేర్పించాడు  .లివర్ పూల్ బాల్టిమోర్ ల మధ్య పశువులబోటు పై చాలా సార్లు తిరిగాడు .ట్రైన్ లోంచి దూకటం నేర్చి దూకుతూ కుడి కాలు పోగొట్టు కొన్నాడు .

లండన్ తిరిగొచ్చి కూడా బెట్టుకోన్న్న డబ్బు దాదాపు ఖర్చు చేసి ఇక కవిత్వం శరణం గచ్చామి అనుకొన్నాడు .ఒక రాత్రికి ఆరు పెన్నీలిచ్చి గదుల్లో బతికాడు .చిల్లర వస్తువులమ్మి పొట్ట పోసుకొనే వాడు .’’ది సోల్స్ దిస్ట్రాయర్ ‘’అనే చిన్న కవితా సంకలనం తెచ్చాడు .ఇది బెర్నార్డ్ షా కంట పడింది .షా డేవీస్ ఆత్మా కధకు ఉపోద్ఘాతం రాస్తూ ఈ విషయం చెప్పాడు .వెంటనే చిల్లర అమ్మకాలు మానేసి గౌరవం గా బతకాలని భావించి మెట్రో పాలిటన్ రచయితల తో కలవ కుండా వేరుగా ఉన్నాడు .ఇరవై ఆరు కవితా సంకలనాలు పది వచన సంపుటాలు  మొత్తం ముప్ఫై ఆరు రాశాడు .డెబ్భై వ ఏట 26-9-1940న ఈ ‘’వీధి కవి ‘’ వినువీదికి చేరాడు .

ఒక రకం గా డేవీస్ చాలా రాసి నట్లే .విపరీతమైన ధోరణి వేగం తో రాసేవాడు రాసిన రాశిలో వాసి ఏంతో కని  పెట్టటం కష్టం .జీవితం పై చక్కని కవితలు అల్లాడు .

‘’what is this life ,full of care –we have no time to stand and stare –no time to stand beneath the boughs –and stare as long as sheep or cows –no time to wait till her mouth can –enrich that smile her eyes began ‘’ఇలా కవితా ప్రవాహం  జాలు వారుస్తూనే ఉండేవాడు .

William Henry Davies.jpg

 

రాల్ఫ్ హాద్గ్ సన్

సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పద్దెనిమిదో శతాబ్దపు విలువలతో కవిత్వం రాసిన వాడు రాల్ఫ్ హాద్గ్ సన్ .యార్క్ షైర్ లో 1871లో పుట్టాడు .ఒంటరిగా రహస్యం గా రెండు ప్రపంచాలలో జీవించాడు .నాణ్యమైన ఎద్దు లను తయారు చేయటం డాగ్ శో లకు జడ్జి గా ఉండటం చేసి డబ్బు సంపాదించాడు తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు .లండన్ ఈవెనింగ్ పేపర్ కు డ్రాఫ్ట్స్ మాన్ అయ్యాడు ‘’ఫ్రైస్ ‘’మేగజైన్ ను ఎడిట్ చేశాడు .ముప్ఫై ఆరులో చిన్న కవితా సంకలనం ‘’ది లాస్ట్ బ్లాక్ బర్డ్ ‘’తెచ్చి సాహిత్య లోకం లో కవిగా ప్రత్యక్ష మయ్యాడు .ఫ్రాస్టర్ ,జాక్సన్ ల తో కలిసి ఒక ప్రెస్ కొని పాత పుస్తకాలు ముద్రించి అమ్మాడు .రాయల్ సొసైటీ చేత పోలిజాక్ అవార్డ్ పొందాడు .’’పోయెమ్స్ ‘’1917లో ‘’ది బుల్ ‘’,ది సాంగ్ ఆఫ్ ఆనర్ ‘’ఉన్నాయి .

యాభై లో జపాన్ లో స్సేన్దాల్ యూని వర్సిటి లో ఇంగ్లీష్ లిటరేచర్ పై ఉపన్యాసాలిమ్మని ఆహ్వానం వస్తే అంగీకరించాడు .వెళ్ళలేక పొతే రెండో సారీ పిలిచారు .అమెరికాఅమ్మాయిని పెళ్ళాడి  కు భార్య తో వెళ్ళాడు .ఒహాయో బయట మినర్వా లో  ఒక ఫారం హౌస్ కొని అందులో పక్షుల ఆవాసానికి సగం కేటాయించాడు .’’పాకింగ్ ట న్స్ పౌండ్ ‘’అనే చిన్న ప్రెస్ కొని అందులో చిన్న పుస్తకాలు ముద్రించి అందజేసేవాడు అందులో ‘’సిల్వర్ వెడ్డింగ్ ‘’,మ్యూజ్ అండ్ మాస్తిఫ్ ‘’పుస్తకాలున్నాయి .ఇంగ్లీష్ పల్లె బాలిక గురించి బాగా రాశాడు .3-11-1962న మరణించాడు

‘’eve ,with her basket ,was –deep in the bells and grass –wading in bells and grass –up to her knees –picking a dish of sweet –berries and plums to eat –down in the bells and grass –under the trees ‘’లో వర్ణ చిత్రం గీసి నట్లు ఆమె ను వర్ణించాడు .వాల్ట్ డీ లా మెర్ కు మంచి స్నేహితుడు .నిరంతరం మాట్లాడే వస పిట్ట అన్నాడు లా మెర్

Walter de la Mare by Lady Ottoline Morrell.jpgbv

 

.

సూపర్ నేచురల్ కవి –  వాల్టర్ డీ లామేర్

తన కాలం భాష లో ఆ నాటి ప్రపంచం లో ఒక ఊహా సామ్రాజ్యమే సృష్టించుకొని దెయ్యాలు భూతాలతో ,ఫైరీ టేల్స్ రాస్తూ ఈవిల్ షాడోస్ మధ్య గడుపుతూ ఉన్మాదానికి సరి హద్దు లో ఉంటూ రాసిన వాడు వాల్టర్ డీ లా మెర్ .అతని భావాలకు ప్రతీకగా ఒక కవిత –

‘’two worlds have we ,without within –but all that sense can mete and span –until it conformation win –from heart and soul ,is death to man ‘’

వాల్టర్ జాన్ డీ లా మెర్ కెంట్ లోని చార్లటాన్ లో 25-4-1873లో పుట్టాడు .తల్లి బ్రౌనిగ్ బంధువు తండ్రిపూర్వీకులు  హ్యూగో నాట్స్కు చెందినా వారు .సెయింట్ పాల కేధద్రిల్ స్కూల్ లో చదివి కాలేజి మానేశాడు .స్టాండర్డ్ ఆయిల్ కంపెని లో గుమాస్తా గా పని చేశాడు .ఇరవై ఏళ్ళు ఇందులోనే పని చేసి తర్వాత ఇంగ్లిష్ గ్రామీణ వాతావరణం లో ఉన్నాడు

‘’సాంగ్ ఆఫ్ చైల్డ్ హుడ్’’మొదటి పుస్తకం గా తెచ్చాడు .ముప్ఫై ఆరులో సివిల్ లిస్టు పెన్షన్ పొందాడు .కంపెనీ విధుల నుంచి విడుదల చేసి రచనకు అంకితమవ మని చెప్పింది .యాభై సంపుటాల కవిత్వం ,చిన్న కధలు ,వ్యాసాలూ నవలలు  వెలువ రించాడు .డెబ్భై అయిదులో ‘’కంపానియన్ ఆఫ్ ఆనర్ ‘’అయ్యాడు .ఎనభై లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ పొందాడు .స్వంత ఇంట్లో ట్వికెన్ హాం లో ఎనభై మూడవ ఏట 22-6-1956న లా మెర్ ‘’నో మోర్ ‘’అయిపోయాడు . వర్తమానాన్ని వదిలి భూతకాలం లో జీవిస్తూ రచనలు చేశాడు .కవిత్వం ‘’మూడ్ ఆఫ్ మెమరి ‘’గా రాశాడు .అందులో అంతా మార్మికత ఎక్కువ . ‘’nature itself resembles a veil over some further reality of which the imagination in its visionary moments seems to acjeve a mere direct evidence ‘’అని తన గమ్యం గురించి చెప్పాడు .కవిత్వం లో గొప్ప శక్తి ఉండి ఆకర్షిస్తుంది .’’isled in the midnight air –musked with the dark;s faint bloom –out into glooming and secret haunts –the flame cries ‘’come ‘’.కధలు ఆన్తాలజీలు కళల శక్తికి నిదర్శానం గా ఉంటాయి  బయటి సంఘటనకు ,లోపలి చూపుకు సంఘర్షణ కని పించి మిస్టరి ని మిస్టరీ గా తెలియ జేస్తాయి .సైకలాజికల్ హారర్ కధలు రాసి గుమ్మరించాడు .కార్నెజీ మెడల్ ను బాల సాహిత్యానికి పొందాడు .సూపర్ నేచురలిజం లో అద్వితీయ ప్రతిభ కనపరచాడు .రామ్సే కాంప్ బెల్ వంటి వారికేందరికో ఆదర్శం .

 

Inline image 2

 

బ్రాంటే కు ప్రతిరూపమే –  షార్లెట్ మ్యు

ఎవరికీ అంతగా పరిచయం లేని రచయిత్రి షార్లెట్ మ్యు.సృజన శక్తి అమోఘం గా ఉన్న కొద్ది మంది స్త్రీ కవులలలో ఒకతే .బ్లూమ్స్ బరి లో 15-11-1869 న జన్మించింది .తండ్రి ఆర్కిటెక్ట్ ,బాల్యం లోనే తండ్రి చనిపోతే నలుగురు సంతానమ్ నానా అగచాట్లు పడుతూ దరిద్రం అనుభ వీస్తూ దుఖాన్ని  దిగ మింగు కుంటా బతికింది .అందులో ఒకమ్మాయి, అబ్బాయి పిచ్చి పట్టి శరణాలయం లోనే ఉండిపోయారు .ఉన్న ఇంటిలో సగం అద్దె కిచ్చి చీకటి గదిలో బతుకుతూ అద్దె డబ్బే ఆధారం గా జీవించారు తల్లి మిగిలిన ఇద్దరు పిల్లలు .వారాంతం లో వేసేక్స్ వెళ్లి థామస్ హార్డీ కి అతిధులుగా ఉండేవారు .మ్యు లోని కవితా శక్తిని హార్డీ గుర్తించి మెచ్చుకున్నాడు సివిల్ లిస్టు పెన్షన్ ఇప్పించాడు .వచ్చిన డెబ్భై పౌండ్లను జాగ్రత్త చేసి కాపాడుకోన్నది. చెల్లెలు అన్నే తరచూ అనారోగ్యం పాలై చని పోయింది .నర్సింగ్ హోమ్  కు వెడితే ఆదరణ లభించలేదు .దారిద్ర బాధ పడలేక విషం తీసుకొని ,డాక్టర్లు రక్షిద్దామని ప్రయత్నిస్తే ‘’don’t keep me –let me go ‘’అంటూ వారించి ప్రాణాలు వదిలేసింది .

బ్రాంటే సిస్టర్స్ మ్యూ సిస్టర్స్ గా పునర్జన్మ ఎత్త్తారని అనుకొంటారు .మ్యు తన రచనల్ని ఎన్నిటిని ధ్వంసం చేసిందో తెలియదుకాని అరవైకి పైగా కవితా సంకలనం వచ్చింది .’’బిసైద్ద్ ది బెడ్ ‘’కవితలో –‘’some one has shut the shining eyes ,straitened and folded –the wandering hands quietly covering the unquiet breast ‘’

‘’all night you have not turned to us or spoken –it is time for you to wake ,your dreams were never very deep –I for one have seen the  thin bright twisted threads of them dimmed suddenly and broken –this is only a most pretense of sleep ‘’అంతరంగాన్ని ఆవిష్కరించింది .విక్టోరియన్ కవిత్వానికి ఆధునిక కవిత్వానికి వారధి .’’బెస్ట్ వుమెన్ పోయేట్ ఆఫ్ ది డే ‘’అని హార్డీ మెచ్చాడు . she was ‘very good and quite unlike any one else ‘’ అని శ్లాఘించింది వర్జీనియా ఉల్ఫ్ ..

John Edward Masefield in 1916.jpg

 

ఆస్థాన కవి -జాన్ మాస్ ఫీల్డ్

డెబ్భై ఐదో ఏట  జాన్ మాస్ ఫీల్డ్ ఆత్మా కద’’సో లాంగ్ టు లేరన్ ‘’పేర రాసుకొన్నాడు .హియర్ ఫోర్డ్ షైర్లో 1-6-1878లో సొలిసిటర్ కొడుకుగా పుట్టాడు .వార్విక్ స్కూల్ లో చదివి మర్చంట్ సర్విస్ లో యువకులకు శిక్షణ నిచ్చే ‘’కాన్ వే ‘’లో చదివాడు .కేప్ హార్న్ కు వెళ్ళే షిప్ కు అసిస్టంట్  విండ్ జామర్ గా పని చేశాడు .ఇరవైయేళ్ళు కష్టపడ్డాడు .తాను  సహజ సముద్ర మనిషి కాదు .అమెరికా చేరి ఈ ఉద్యోగం మానేశాడు .బేకరి ,గుర్రపు శాల ,కార్పెట్ ఫాక్టరీ లలో పని చేశాడు న్యూయార్క్ యాంకర్స్ లలో .ఇంగ్లాండ్ కు 1897 చేరటానికి ముందు చాసర్ రాసిన కాంటర్ బారీ కధలు చదివాడు .లండన్ కు తిరిగి వచ్చి మాంచెస్టర్ గార్డియన్ పత్రికలో కాలమ్స్ రాశాడు .’’సాల్ట్ వాటర్ బాలడ్స్ ‘’పుస్తకాన్ని సెంటిమెంట్  హాస్యం తో నింపి రాశాడు .’’ది విడో ఇన్ ది బై స్ట్రీట్ ‘’,డాబర్ ,ది డాఫోడిల్ ఫీల్డ్స్ ‘’లను ముప్ఫై లలో రాశాడు .

మొదటి ప్రపంచ యుద్ధం అతని సృజనకు అవకాశం కల్పించింది .రెడ్ క్రాస్ లో సేవలందించాడు .’’లోల్లిగ్దన్ దౌన్స్ ‘’,రైట్ రాయల్ ‘’’’రేనార్డ్ ది ఫాక్స్ ‘’మొదలైన కవితా పుస్తకాలు ప రాసి ప్రచురించాడు .చివరిదానిలో కవిత్వం పక్వమైంది .రూరల్ స్పిరిట్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అద్దం పట్టే రచనలే చేశాడు 1930లో రాబర్ట్ బ్రిడ్జెస్ మరణం తర్వాత ఆస్థానకవి అయ్యాడు .ఇంగ్లాండ్ సిల్వర్ జూబిలీ ఉత్సవాలలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ పొందాడు .అయిదవ జార్జి మరణం పై ఫనేరల్ ట్రిబ్యూట్ రాశాడు .ఆస్తానపదవి అడ్డు పడిందో కవితా ప్రవాహం ఆగి పోయిందో కాని తర్వాత రాసింది తక్కువే .డెబ్భై ఏళ్ళకు తొంభై రచనలు పూర్తీ నిశ్చయం తో తగ్గిన కవితా ప్రతిభ తో రాసి ప్రచురించాడు . ఇప్పుడు విస్మృత కవే అయ్యాడుఫీల్డ్ .ఫీల్డ్ లో లేని కవి అనిపించాడు ఫీల్డ్ .

క్లాసిక్ చిల్ద్రెన్ నవలలు రాశాడు .’’ఎవర్  లాస్టింగ్  మెర్సి  ;;సి ఫీవర్ ‘’;కవితలు గొప్పవి .గౌరవ  డాక్త రేట్లు చాలా పొందాడు .అతని పేర పోయిట్రీ అసోసియేషన్స్ చాలా ఏర్పడ్డాయి .రాజాస్థాన సంగీత విద్వాంసులకు కవితలు రాశాడు .ప్రసిద్ధమైన సానేట్స్  రాశాడు .

 

 

 

‘’   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49

నేషనల్ బార్డ్ – కారల్  శాండ్ బర్గ్

‘’poetry is the synthesis of hyacinths and biscuits .poetry is the opening and closing of a door – a search for syllables to shoot at the barriers of the unknown and the unknowable ‘’ అని కవిత్వ లక్షణాలను నిర్వచించి దానికోసమే బతికిన వాడు కారల్ శాండ్  బర్గ్ .స్వీడిష్ జాతికి చెందిన ఈ కవి ఇలినాయిస్ రాష్ట్రం గేల్స్ బర్గ్ లో6-1-1878 లో పుట్టాడు .డబ్బు లేని కుటుంబం .మిల్క్ వాగన్ మీద  పని చేయటానికి  కు వెళ్ళే వాడు . పదిహేనవ ఏట బార్బర్ షాప్ లో ,దియేటర్ లో తెరలు లాగటం  ,ట్రాక్ డ్రైవర్ కు సహాయకుడిగా చిన్న చిన్న పనులు చేశాడు .పొలం పనులు ,హోటల్ సర్వర్ గా కూడా చేశాడు .స్పానిష్ అమెరికన్ యుద్ధం లో సైన్యం చేరి పోర్తారికా లో పని చేశాడు అమెరికా తిరిగి వచ్చి లాంబార్డ్ కాలేజి లో చేరాడు .కాలేజి పేపర్ కు ఎడిటర్ అయ్యాడు .బాస్కెట్ బాల్ టీం కెప్టెన్ అయ్యాడు .కాలేజి వదిలాక సేల్స్ మాన్ ,గ అడ్వేర్ టైజింగ్   మేనేజెర్ గా ,జర్నలిస్ట్ గా పని చేశాడు .

చిన్నప్పటి నుండే కవిత్వం చదవటం ఎలా రాయాలో కూడా తెలుసుకొన్నాడు .కొన్ని కవితలను పాతికేళ్ళ వయసులో ‘’ఇన్ రెక్ లెస్ ఎక్స్టసి ‘’పేర ముద్రించాడు .విట్మన్ రాసినట్లున్నాయవి .కవితా రీతిలో శాండ్ బర్గ్ ముద్ర ఉండేది .

‘’డౌన్ ఇన్ సథరన్ న్యూ జెర్సీ దే  మేక్ గ్లాస్ –బై డే అండ్ బై నైట్ ది ఫైర్ బర్న్స్ అం ది మిల్విల్లీ అండ్ బీడ్ ది శాండ్ లేట్ ఇన్ ది నైట్’’కవిత అచ్చయింది .ఇలా పత్రికలకు రాస్తూ బతుకుతున్నాడు .ఒక కవితా సంకలానికి ప్రైజ్ వచ్చింది .అమెరిక సాధారణ భాషనే కవిత్వానికి వాడాడు .’’చికాగో పోయెమ్స్ ‘’విడుదల చేస్తే దానిపై రగడ రేగింది .’’కూల్ టూమ్బ్’’ కవిత ఒక మచ్చు తునక .

‘’when Abraham Lincoln was shoveled into the tombs ,he forgot the copper heads and the assassin –in the dust in the cool tombs –and Ulysses Grant lost all thoughts of con men and wall street ,cash and collateral turned ashes —in the dust ,in the cool tombs ‘’

డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి శాండ్ బర్గ్ ఎనిమిది సంపుటాల కవిత్వం జానపద గీతాలు  ది అమెరికన్ సాంగ్ బాగ్ ,రిమేమ్బ్రెంస్ రాక్ అనే ఆటోబయాగ్రఫీ  వగైరా రాసి ముద్రించాడు .యువకుల కోసం ఎన్నో కదా పుస్తకాలు రాశాడు .అబ్రహాం లింకన్ పై ఆరు భాగాల జీవిత చరిత్ర రాశాడు .చారిత్రిక రచన చేసినందుకు పులిట్జర్ బహుమతి లభించింది .ఇలినాయిస్ గవర్నర్ అడ్లాయిడ్ స్టీవెన్సన్ శాండ్ బర్గ్ డెబ్భై అయిదవ జన్మ దినాన్ని’’కారల్ శాండ్ బర్గ్ డే ‘’గా ప్రకటించి నిర్వహించి గౌరవించాడు .అభిమానులు స్నేహితులు వచ్చి కోలాహలం చేశారు .స్వీడెన్ రాజు ‘’ఆర్డర్ ఆఫ్ ది నార్దార్న్ నార్దర్న్ స్టార్   ‘’ను అందజేసి గౌర్వవించాడు .అమెరిక అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ సంస్థ బంగారు పతాకాన్ని ప్రదానం చేసింది .

వాల్ట్ విట్మన్ తరువాత ఇంత గౌరవం పొందిన వాడు శాండ్ బర్గ్ ఒక్కడే .పంటపొలాలు  ప ,ఆకాశ హర్మ్యాలు ,స్టీలు మిల్లులు అతని కవితా వస్తువులై వాటిల్లో ఆత్మాన్వేషణ చేశాడు .’’ది పీపుల్ ‘’లో సామాన్య మానవుడిని అద్భుతం గా ఫోకస్ చేశాడు .ఇల్లినాయి స్ లో  చిన్న   గ్రామీణ వాతావరణం నుండి  నార్త్ కరోలినా లోని ఫ్లాట్ రాక్ కు చేరాడు ఉన్నతమైన దానిని మంచి దానిని సమాదరించాడు ,స్పూన్ లివర్ ఆన్తాలజి ని వ్యతిరేకించాడు .పొడుగ్గా నవ్వుతూ తెల్ల జుట్టు కళ్ళ మీదకు దూకుతూ కని  పించేవాడు .’’నేషనల్ బార్డ్ ‘’అని పించుకొన్నాడు శాండ్ బర్గ్ .  “indubitably an American in every pulse-beat”.అన్నారు .శతాబ్ది ఉత్సవానికి ప్రత్యెక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .అతని ‘’రూటా బాగా’’కధలు చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకొన్నాయి .

 

Carl Sandburg NYWTS.jpg

 

 

ప్రయరి ట్రూబడోర్ —  వాచల్  లిండ్ సే

జాజ్ పద్ధతిలో కవిత్వాన్ని,గాస్పెల్ ఆఫ్ బ్యూటీ ని  మెగా ఫోన్ ద్వారా వినిపించిన  ఇవాన్జేలిస్ట్  వాచల్ ల్ లిండ్ సే .10-11-1879లో ఇలినాయిస్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జన్మించాడు .లింకన్ పుట్టిన స్ప్రింగ్ ఫీల్డ్ అంటే వీరాభిమానం .అది అమెరికాకు భవిష్యత్  రాజ దాని కావాలని మనసారా కోరుకొన్నాడు .దీనినే ‘’గోల్డెన్ బుక్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్ ‘’పుస్తకం లో తెలియ జేశాడు .ఇక్కడే అమరుడైన గవర్నర్ ఆల్తెల్జ్ స్మరిస్తూ ‘’ది ఈగిల్ దట్ ఈజ్ ఫర్గాట్టేన్ ‘’కవిత రాశాడు .రచయితా గా కంటే ఆర్టిస్ట్ గా దీనికి వైభవం తేవాలని ఆశించాడు .ఒహాయోలోని హిరం కాలేజి లో చదివి చికాగో ఆర్ట్ కాలేజిలో చేరి  న్యు యార్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో కళ లో నిష్ణాతుడైనాడు .బ్లేక్ లాగా క్రూసేడ్ ల తయారీలో మునిగిపోయాడు .మద్య నిషేదాన్ని సమర్ధించి ప్రచారం చేశాడు ‘’యాంటి సేలూల్ లీగ్ ‘’పై అనేక ఉపన్యాసాలిచ్చాడు .’’విలేజ్ మేగ జైన్ ‘’నిర్వహించి ఎక్కడికి వెళ్ళినా ప్రతులను ప్రజలకు అంద జేసే వాడు .’’రైమ్స్ టు బి ట్రేడేడ్ ఫర్ బ్రెడ్ ‘’పై కరపటం తయారు చేసి ఇంటింటికీ తిరిగి ఇచ్చేవాడు .రైతులతో మాట్లాడుతూ తన కవితలు వినిపిస్తూ ఉత్సాహ పరచే వాడు .పిల్లలకు కధలు చెప్పి దగ్గరాకు తీసుకొనే వాడు .రాత్రి  ఏదో ఇంటిలో ఆతిధ్యం పొంది అక్కడే నిద్ర పోయేవాడు .

ముప్ఫై నాలుగవ ఏట మొదటి పుస్తకం ముద్రించాడు .’’జెనరల్ విలియం బూత్ ఎంటర్స్ ఇంటు హెవెన్ ‘’పుస్తకాన్ని మతం ,అభిమాన విషయాలు సమాజానికి అవసరమైనవి అన్నీ కలిపి రాశాడు ..తరువాత ‘’కాంగో అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’,ది చైనీస్ నైటింగేల్ ‘’ది గోల్డెన్ వేల్స్ ఆఫ్ కాలి ఫోర్నియా ‘’మొదలైన కవిత్వపు పుస్తకాలు వెలువరించాడు .ప్రజలకు తన కవిత్వాన్ని చదివి విని పించి కొత్త దారి తొక్కాడు .భావానికి తగ్గ పిచ్ ని ఉపయోగించి చక్కగా భావ గర్భితం గా పాడి మనసుల్ని గెలిచేవాడు .తలకాయను వివిధ భంగిమలలో తిప్పుతూ భలేగా గానం చేసేవాడు .కళ్ళు సగం మూసి అరగన్నులతో అభినయించి పాడుతుంటే జనం పరవశించి వినే వాళ్ళు .సమ్మోహనం లో ముంచి తేల్చే వాడు .చేతులాడిస్తూ వివిధ భంగిమలు పెడుతూ కవిత్వ గానం చేస్తుంటే మరో లోకం లో విహరించి నట్లుండేది .గ్రామీణ స్తాయి వాడే అయినా జాతీయ స్తాయి వాడయ్యాడు .’’హార్లీ బర్లీ’’ అమెరికా జీవిత విధానాలను కవితలో చూపాడు .

లిండ్ సే లెక్కలేనన్ని ప్రేమ పాటలు రాసిన సారా టీద్  సెల్ అనే అమ్మాయిని ప్రేమించి పదేడ్డామనుకొంటే ఆమె జారుకుంది . తర్వాత ఇరవై ఏళ్ళ స్కూల్ పిల్లను పెళ్లి చేసుకొన్నాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .కొన్ని తమాషా భావాలను బయట పెట్టాడు .’’క్రిష్టియానిటి కంటే బుద్ధిజం లో ఆకర్షణ ఎక్కువ అన్నాడు .బుద్ధుడు క్రీస్తుకన్నా అణకువ ,ప్రయోజనం ఉన్న వాడు కాదన్నాడు .తన హృదయం లో ఉత్తర నక్షత్ర గది ఉందని చెప్పాడు .అదీ మూసుకు పోయింది .ఇదివరకు ఎగబడి మూగి వినే జనం క్రమం గా దూరమైపోతున్నారు .అతనిలో కావలసినదేదో లోపించింది అనుకొన్నారు ..దరిద్రం తో మొదలైన జీవితం మళ్ళీ యాభైల్లో అదే పరిస్తితి ని తెచ్చింది. బీదరికం నిరాశా ఆవరించాయి భ్రమ భ్రాన్తులకు లోనయ్యాడు .యదార్ధానికి వ్యతిరేకి అయ్యాడు .భార్యతో నిత్యం తగాదా .మళ్ళీ యువకుడి నవుతాననే వాడు .చివరికి ఈ సంక్షోభం లో తట్టుకో లేక లైసాల్ తాగి 5-12-1931అర్ధ రాత్రి చనిపోయాడు .

అమెరికా లిండ్ సే ను సీరియస్ గా తీసుకో లేదు .సామాన్యులకు అసాధారణ హీరో అయిన లిండ్ సే అందరికి దూరమై పోయాడు .’’I am but the pioneer –voice of democracy –I am the gutter dream –I am the golden dream –listen to my g-o-l-d-e-n d-r-e-a-m’’అని కలకంటూ కల్లోల మనసుతో కాన రాని లోకాలకు చేరాడు .పెర్ఫార్మన్స్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినకవి .

 

Nicholas Vachel Lindsay 1913.jpg

 

పర్యావరణ ఉద్యమ సారధి –  రాబిన్సన్ జెఫర్సన్

వెస్ట్ లో పుట్టి ఈస్ట్ లో రాబర్ట్ ఫ్రాస్ట్ పెరిగితే ఈస్ట్ లో పుట్టి వెస్ట్ లో పెరిగాడు రాబిన్సన్ జెఫర్సన్ . పెన్సిల్వేనియా లోని పిట్స్ బర్గ్ లో 10-1-1887న పుట్టి తండ్రితో యూరప్ పర్యటన చేసి జెర్మని ,స్విట్జెర్లాండ్ లలో చదివి ,అమెరికా లోని కాలిఫోర్నియా ,వాషింగ్టన్   లలో చదువు పూర్తీ చేశాడు .ఒక కజిన్ పేరణ తో జీవితాన్ని రచన కు అంకితం చేశాడు .’’ఫ్లాగాన్ అండ్ యాపిల్స్ ‘’పుస్తకాన్ని స్వంత ఖర్చులతో ముద్రించాడు.ఇరవై ఆరులో ఊనా కాల్ కస్టర్ ను పెళ్ళాడి ఇంగ్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .మొదటి ప్రపంచ యుద్ధం మొదలై కాలి ఫోర్నియా లోనే ఉండి పోయారు .తమకు తెలియ కుండానే తాము ఉండాల్సిన ప్రదేశం నిర్ణయ మైంది అనుకొన్నారు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు ,కొత్త భార్య ,కవల కొడుకులతో కలిసి ఒక దుర్గం లాంటి ఇల్లు కట్టుకొని ఉండిపోయి అక్కడే 1962లో చనిపోయాడు .ఇరవై అయిదు ఇరవై ఆరు లో పద్దెనిమిది గ్రంధాలు రాసి ‘’ఆత్మ వినాశన ప్రేమ ‘’కుస్థానమిచ్చి రాశాడు .జీవిత పోరాటం వ్యర్ధమని ,విలువలకు అర్ధం లేదని సిద్ధాంతీకరించాడు. కవిగా ఫిలాసఫర్ గా ద్వంద్వ ప్రవ్రుత్తులతో జీవించాడు. సృజన ఉన్నా తీవ్రం గా కవిత్వం రాశాడు .భయంకరత్వ ఉద్యమం గా కవితలుంటాయి .క్రియా బాహుళ్యం భీభచ్చ ప్రధానం .కవితల్ని ప్రేమించలేము .చదివితే మర్చీ పోలేము . అదీ జెఫర్సన్ విధానం .ఎన్విరాన్ మెంటల్ పోయేట్ అని పిలిచారు .మహాకావ్య విధానం లో పకడ బందీగా కవిత్వం రాసేవాడు .’’ఇన్ హ్యూమనిజం ‘’అంటే అమానుషత్వం అనే మాటను కాయినేజ్ చేసింది జేఫర్సనే .ప్రపంచం లోని వస్తువలావు అందాన్ని చూడకుండా ఏదీ పట్టనట్టు స్వఫలా పేక్ష తో ఉండేదాన్ని ఇన్ హ్యూమనిజం అన్నాడు .టైంమేగజైన ప్రత్యెక సంచిక తెచ్చి గౌరవిస్తే ప్రత్యెక స్టాంపు తెచ్చి ప్రభుత్వం గౌరవించింది .అమెరికా పశ్చిమ ఫోటోగ్రాఫర్లకు ఐకాన్ గా ఉండేవాడు .ఎన్విరాన్ మెంటలిజం నే సోషలిజం అన్నాడు

Robinsonjeffers.jpg

 

అమెరికన్ మహిళా బైరన్ -ఎడ్నాసెయింట్  విన్సెంట్ మిల్లె

పందొమ్మిది ఇరవై శతాబ్దాలలో మెల్లె కవిత్వం బాగా ప్రచారమైంది. వందలాది లిరిక్కులు సానేట్లూ రాసింది .అమెరికా లోని మెయిన్ రాష్ట్రం రాక్  లాండ్ లో22-2-1892 లో పుట్టి , .పందొమ్మిదో ఏట వంద లైన్ల కవితను అన్తాలజీ డిపార్ట్ మెంట్ పోటీ  నిర్వ హించిన ‘’ది లిరిక్ యియర్ ‘’కు పంపింది .బహుమతి రాక పోయినా ఆమె ‘’రేనేసేన్స్ ‘’కవిత అద్భుతం అనిపించి గుర్తుండి పోయింది .’’ all I could see from where I stood –was there long mountains and a wood –I turned and looked another way –and saw there islands in a bay ‘’అందులో ఒక పాదం ఇది .

మిల్లె అందం చందం కవిత్వం తిరుగు బాటు ధోరణి తో ఒక ‘’లెజెండ్ ‘’అయింది .వాసర్ కాలేజిలో చేరిన తర్వాతఈ లెజెండ్ గ్రీన్ విచ్ గ్రామం లో  ఒక చిహ్నమే అయింది .చిన్న కధలు రాసి జీవించింది .పాటలను అనువాదం చేసింది .ప్రావిన్స్ టౌన్ నటుల తో నటించి నాటక రచన చేస్తూ కవితలు రాసింది .మగాడికి సాటి అని నిరూపించింది అన్నిట్లో .చిలిపి ఈ చిన్నారి పెద్దలనే వణికించింది .ఆమె తెగువ ధైర్యం తెలివితేటలను చూసి ‘’అమెరిక మహిళా బైరన్ ‘’అన్నారు .అంతకు ముందు ఏ స్త్రీ ఇలా ప్రజా రంగం లో కాలు పెట్ట లేదు .

పదహారు గ్రంధాలు రాసినా మొదటి, రెండవది అయిన ‘’రేనాసేన్స్ ‘’సెకండ్ ఏప్రిల్ ‘’పుస్తకాలు మాత్రమె బాగా గుర్తింపు తెచ్చాయి .ఒక వ్యాపారిని వివాహ మాడింది .న్యు యార్క్ నుండి కాపురం బెర్క్ షైర్కు మార్చారు .ప్రజలు సంస్థల కోరిక పై బయటికి వెళ్లి తన కవితలను చదివి విని పించేది .ఉపన్యాసాలిచ్చేది .ఆమె ఉపన్యాసాలకు పిచ్చ క్రేజు ఉండేది .కాని ఆనారోగ్యం అడ్డు పడేది .చివరికి న్యూయార్క్ లోని పర్వత శిఖరం ఆస్తర్ లిజ్ లో ఉండేది .

రెడ్  హెడేడ్ రెబెల్ అయిన మిల్లె క్రమంగా ప్రజా కవిగా ,రాజకీయ ప్రచారకురాలిగా మారింది .చివరగా రాసిన ‘’వైన్ ఫ్రం దీస్ గ్రేప్స్ ‘’, హాంట్స్ మన్ న ,వాట్ కారీ ‘’రచనలు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయి .భర్త చనిపోయిన ఏడాదికి 19-10-1950న ఆ ఒంటరి బంగళాలో ఒంటరిగా జీవిస్తూ చనిపోయింది .ఆమె లిరిక్కులు సానేట్లు ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి .’’ a figure of passionate feeling,she was a symbol of her age not only in her life but in the paradoxes of her poetry ‘’అని ఆమె కవిత్వాన్ని జీవితాన్ని అంచనా వేశారు . ఆ శతాబ్దం లో గొప్ప సానేట్లు రాసిన కవిగా గుర్తింపు పొందింది .ఫ్రాస్ట్ మెడల్ సాధించిన ఆరవ మహిళా .థామస్ హార్డీ ‘’అమెరికా లో రెండే రెండు ఆకర్షణలు  ఒకటి ఆకాశ హర్మ్యాలు రెండు ఎడ్నా మిల్లె కవిత్వం ‘’అన్నాడు .అప్పటికి రెండు సార్లు పులిట్జర్ బహుమతి పొందిన మహిళా గా చరిత్ర కెక్కింది .

Edna St. Vincent Millay.jpg

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48

అమెరికా లో కొత్త ధోరణులు

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లో అమెరికా చివరి సరిహద్దును నిర్ణయించి సాహసోపేత అన్వేషణ కు దారి తీసింది 1920లో ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ‘’.THE BUSINESS OF AAAMERICAN DEMOCRACY IS BUSINESS’’ అని స్పష్టం గా చెప్పాడు .జాతీయ వాణిజ్యం అత్యంత నిర్మాణాత్మక ఆదర్శం అనీ చెప్పాడు .రాజకీయ నాయకులు ప్రభుత్వ ఆస్తుల పై  బాంకుల నిండా డబ్బు దాచుకొంటే ,గుమాస్తాలు మిలియనీర్లు అయి పోయారు ఒకే ఒక్క రాత్రిలో .ఇది ఆదర్శానికి  విరుద్ధం అని వాపోయారు కొందరు .అలాంటి వారిలో ఎడ్విన్ ఆర్లింగ్ టన్  రాబిన్సన్ ఒకడు.

సానేట్లకు  సాన బెట్టిన – ఎడ్విన్  ఆర్లింగ్ టన్  రాబిన్ సన్

అమెరికా లోని మెయిన్ రాష్ట్రం లో హెడ్ టైడ్ లో 22-12-1869న రాబిన్సన్ జన్మించాడు .తండ్రి దాన్యవ్యాపారి , బాంక్ డైరెక్టర్ ..పుట్టిన ఏడాదికే గార్దినర్ కు వెళ్ళిపోయారు .వేలాది జనాభా ,ఉత్పత్తులకు కేంద్రం అయిన ఇక్కడే తన భవిష్యత్తు తేల్చుకోవాలను కొన్నాడు .అందరిని తోసుకొని ముందుకు వెళ్ళ  లేన ని పించింది .  ఒంటరితనం బాధించినా వ్యక్తిత్వం పెంచుకోవ టానికి అవకాశం కలిగింది .రచయిత కావాలనే ఉద్దేశ్యం తో హార్వర్డ్ లో చేరి దాని మేగజైన్ కు  డజను కవితలు రాస్తే తిరస్కరించారు .రెండేళ్ళ తర్వాత మిల్లులు మూతపడ్డాయి  బాంకులు దివాలా తీశాయి .నలభై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడి ఉద్యమించారు .

బాల్యం లోనే ‘’మాస్టాయిడ్  ఇన్ఫెక్షన్ ‘’సోకి చెవి ఎముకలు బలహీనమై చెవులు వినిపించవేమో నని బాధ పడ్డాడు కళ్ళు కూడా సరిగ్గా కని  పించేవికావు .ఎవరి మీఎదో ఆధార పడుతున్నాననే భావమూ దెబ్బ తీస్తోంది .ప్రపంచం అంటే భయ పడుతున్నాడు .’’లిప్పిన్ కోట్ ‘’మేగజైన్ లో కవిత అచ్చు అయి డబ్బు లిస్తే యెగిరి గంతేశాడు .పో పై కవిత రాశాడు .’’ది టారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’అనే పేరుపెట్టి వంద పేజీలు  రాసి రెండు సార్లు పంపితే తిరస్కారానికి గురైంది .చివరికి ‘’రివర్ సైడ్ ప్రెస్ ‘’కు సంబంధించిన బంధువు రహస్యం గా మూడొందల కాపీలు యాభై రెండు డాలర్లకు ముద్రించి అమ్మాడు .బాగానే అమ్ముడుపోయి కొంత పేరొచ్చింది .’’వానిటి పబ్లిషర్ కొత్త ఎడిషన్ బాగా వేస్తానని ముందుకొచ్చి కొన్ని కవితలు చేర్చి కొన్ని తీసేసి పబ్లిష్ చేశాడు .’’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’అనే పోర్ట్రైట్ పుస్తకం1897లో తెచ్చాడు .

ఎక్కువ కాలం బతకను అని తెలుసుకొని రాయటానికి తొందర పడ్డాడు .వంద డాలర్ల తో న్యూ యార్క్ చేరాడు .అక్కడి పబ్లిషర్ల చుట్టూ తిరిగినా ఎవరూ కన్నెత్తి చూడ లేదు .ఒక పుస్తకాల షాపు వాడో ,టీచరో  అనుకొన్నారు .కాని రచయితగా గుర్తించలేదు .డబ్బులేదు పర్సనాలిటి లేదు .స్నేహితులు మృగ్యం .కనుక కవిత్వం తోనే జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .ఒక దీర్ఘ కవిత రాస్తే ఒకపబ్లిషర్ తీసుకొని రాత ప్రతి పోగొట్టాడు .దీన్ని ఒక వేశ్యా వాటికలో ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ వదిలేస్తే దాన్ని తీసుకొని మూడవ పుస్తకం గా ‘’కెప్టెన్ క్రైగ్ ‘’గ ప్రచురించాడు .దీనికి ఏడు డాలర్లు పొందాడు. ఇదే తోలి సంపాదన కవిత్వం మీద .హోటల్ లలో  ఫ్రీ లంచ్ మీద, మిగిలిన వారి దయా దాక్షిణ్యాల మీద బతికాడు .అద్దె చెల్లించటానికి న్యూ యార్క్ సబ్ వే లో పని చేసి గంటకు ఇరవై సెంట్లు సంపాదించాడు .అదొక నరక కూపం .

వింటర్ లో చలికి తట్టుకోలేక పోయాడు .ప్రెసిడెంట్ రూజ్ వెళ్త కొడుకులు తండ్రికి రాబిన్సన్ రాసిన పుస్తకాన్ని ఇస్తే దయ తలిచి న్యూయార్క్ కష్టం హౌస్ లో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఏడాదికి రెండు వేల డాలర్ల జీతం .స్నేహితుడికి జాబు రాస్తూ తానూ కవిత్వం రాయటానికీ కొత్త బూట్లు కొనుక్కోవ టానికి సరిపడా డబ్బు వస్తోందని చెప్పాడు .నలభై వ ఏట రూజ్ వెల్త్ పదవి అయి పోయినప్పుడు ఉద్యోగం ఊడింది .’’ది టౌన్ డౌన్ ది రివర్ ;;అనే కవితా సంకలం వెలువడి ప్రోత్సాహం లభించింది .బోహీమియన్ స్నేహితుల నుండి డబ్బు అప్పుగా తీసుకొన్నాడు .మరో సారి అదృష్టం తలుపు తట్టింది .కవి ,విమర్శకుడు రాబిన్సన్ జీవిత చరిత్ర కారుడు  అయిన హీర్మాన్ హేగ్ డార్న్ అతని జీవిత చరిత్ర రాసి ,మాక్దోవేల్ కాలనీ లో ఉంచాడు .సృజన శీలుర పాటి కామ ధేనువు అతను .న్యూయార్క్ బోస్టన్ ల మధ్య వింటర్ కాలాలు గడుపుతూ కవిత్వాన్ని ప్రసరిస్తూ ప్రవహింప జేస్తూ పుస్తకాలలో నిక్షిప్తం చేశాడు .

పన్నెండు ఏళ్ళ లో  పన్నెండు పుస్తకాలు రాశాడు .’’కలేక్తేడ్ పోయెమ్స్ ‘’కు పులిట్జర్ బహుమతి రెండు సార్లు వచ్చింది .బ్లాంక్ వేర్స్ లో నిష్ణాతుడయ్యాడు .చాలా కాలానికి బ్లాంక్ వేర్స్ మళ్ళీ అందర్నీ ఆకర్షించింది .మొదట్లో ఇష్టం లేక పోయినా చివర్లో రాసిన మెర్లిన్ ,లాన్సిలాట్ ,త్రిస్త్రాం నాటకాలలో దాన్నే వాడాడు .ఇందులో కదా కధనం అంతా పాత ధోరణి గా సాగింది .అందుకే ఎవరూ మెచ్చుకో లేదు .అరవైకి శారీరకం గా క్షీణించి కవితా పరం గా ఎండి పోయాడు .ఏడాదికి ఒకటి వంతున రాస్తూనే ఉన్నాడు .ఇసడోరా డంకన్ అనే డాన్సర్ ఇతన్ని లొంగ దీసుకొనే ప్రయత్నం చేస్తే తప్పించుకొన్నాడు .అరవై అయిదులో ‘’పాంక్రియాస్ ‘’వచ్చి బలహీనుడై ఆపరేషన్ జరిగినా బతకనని తెలిసి6-4-1935 న చనిపోయాడు .

రాబిన్సన్ చిన్న కవితలనే అందరూ ఇష్టపడి చదివారు .వ్యాపార ధోరణిని నిరసించాడు .’’He created an entire gallery of untypical  of American figures’’అంటారు .పాత విధానాల్లో కొత్త అర్ధాలు చూపాడు .సానెట్ లకు సాన పెట్టి ఎపిగ్రమాటిక్  ఎడ్జెస్ తో మిరుమిట్లు గోలిపించాడు తన ఓటమిని ప్రతి కవితలో ప్రతిబింబింప జేశాడు ..’’miniver cheevy ,born too late –scratched his head and kept on thinking –miniver coughed ,called it fate –and kept on drinking ‘’అని రాసుకొన్న నిర్భాగ్యకవి రాబిన్సన్ .

 

 

Edwin Arlington Robinson.jpg

అమెరికా వ్యావహారిక భాషా కవి – రాబర్ట్ ఫ్రాస్ట్

ప్రక్రుతి కవి అని అపవాదు పడిన రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రదేశాల కంటే  ప్రజలపై మమకారం తో రాశాడు .కాలిఫోర్నియా లోని శ సాన్ ఫ్రాన్సిస్కో లో పుట్టినా  తూర్పు వాడని పించుకొన్న రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1875 న పుట్టాడు .తలిదండ్రులు న్యూ ఇంగ్లాండ్  స్కూల్ టీచర్స్ .ఎనిమిది తరాలనుండీ కుటుంబం ఇక్కడే ఉంది .తల్లి స్కాటిష్ .తండ్రి ఇంగ్లాండ్ నుండి వలస వచ్చిన కుటుంబం వాడు .నాన్ కాన్ఫర్మమిస్ట్ .ఉద్యోగం, రిపబ్లికన్   మాసా చూసేట్స్  వదిలి  కాలిఫోర్నియా వెళ్ళాడు .డెమోక్రాటిక్ పేపర్ ఎడిటరయ్యాడు . ఫ్రాస్ట్ పుట్టటానికి పదేళ్ళ ముందే సివిల్ వార్ సమాప్తమయింది .సౌత్ అంటే ఇష్టం తో కొడుకుకు రాబర్ట్ లీ అని పేరుపెట్టాడు .తండ్రి టి బి తో చనిపోయాడు .తల్లి ఫ్రాస్ట్ ను తీసుకొని మాసాచూసేట్స్ లోని లారెన్స్ చేరింది .

చదువు ఇష్టం లేదు .నాలుగేళ్ళు హైస్కూల్ లో చదివి పదిహేడు లో డార్ట్ మౌత్ లో చేరి మూన్నేల్లకే వదిలేశాడు .ఇరవై ఒకటిలో హార్వర్డ్ లో చేరి రెండేళ్లకే బయటికొచ్చాడు తల్లికి,చెల్లి సాయం చేసేవాడు . టీ దుకాణం లో చెప్పుల షాపులో ,బట్టల మిల్లులో పని చేశాడు  .కార్బన్ పెన్సిల్ లామ్ప్స్ ను శుభ్రం చేసేవాడు .లోకల్ న్యూస్ పేపర్లో రాయటానికి కుదిరాడు .ఇరవైకి న్యూ అంప్ షైర్ వ్యవసాయ దారుడైనాడు .రాళ్ళ భూమి ని చదును చేసి సాగు చేయాలి .వల్ల కాక టీచర్ అయ్యాడు ..అప్పటికే కవితలు రాసి పంపే వాడు .అవి అచ్చు అయి వచ్చేవి .మళ్ళీ కాడి బుజాన వేసుకొన్నాడు .స్నేహితులు కవులుగా చేలా మణి లో ఉన్నారు .మొదటి కవితా సంకలనం నలభయ్యవ ఏట ‘’ఏ బాయ్స్ విల్ ‘’పేర ఇంగ్లాండ్ లో అచ్చు అయిందంటే ఆశ్చర్య పోతాం ..అక్కడే రెండవది ‘’నార్త్ ఆఫ్ బోస్టన్ ‘’కూడా ప్రింట్ అయింది .

ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరేసరికి గొప్ప కవి అని పించుకున్నాడు .నాటకీయతను కవిత్వం లో జోడించాడు ‘’’’I am going out to clean the pasture spring –I will only stop to rake the leaves away –I shall not be gone long –you come too’’లాంటి వెన్నో ఉన్నాయి .నార్త్ బోస్టన్ కే మరో పేరు ‘’య బుక్ ఆఫ్ పీపుల్ ‘’దీనితో బాటు ఎనిమిది వాల్యూముల కవితలు రాశాడు .కవిత్వం రాయటం అందం గా చదవటం పాడటం ఫ్రాస్ట్ ప్రత్యేకత .ఎపిగ్రమాటిక్ గా రాసిన ‘’some say the world will  end in fire –some say in ice –from what I have tasted of desire –I hold with those who favour fire-but if it had to perish twice –I think I know enough of hate –to say that for destruction ice –is also great –and would suffice ‘’మంచి పేరు తెచ్చుకోంది

ఫ్రాస్ట్ ఆలోచనలు భావాలు ప్రక్రుతి దృశ్యాల ప్రేరేపణ లే .అమెరికా రాగానే మళ్ళీ వ్యవసాయం చేశాడు.న్యు అంప్ షైర్ లోని  ఫ్రాన్కోనియా దగ్గర ఎత్తైన కొండ పై ఫారం హౌస్ కొన్నాడు .ఈయన్ని చూసి మిగిలిన వారూ కొన్నారు .’’ఏ పోయేట్ ఇన్ రెసిడెన్స్ ‘’అని పించాడు . అం హీర్స్ట్  లో  మిచిగాన్  లో ఎక్కువ కాలం ఉండి ఏంతో నేర్చుకొన్నాడు నలభై వరకు ఎవరికీ తెలియని ఫ్రాస్ట్ అరవై డెబ్భై లలో అనేక గౌరవాలు పురస్కారాలు అందుకొన్నాడు .నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’నుండి బంగారు పతకం ,నాలుగు సార్లు పులిట్జర్ ప్రైజ్ సాధించి రికార్డ్ సృష్టించాడు ఇరవై ఎనిమిది యూని వర్సిటీల నుండిఅందులో రెండు ఇంగ్లాండ్ యూని వర్సిటీల నుండి  గౌరవ డిగ్రీలు పొందాడు .వెర్మాంట్ రాష్ట్రం ఫ్రాస్ట్ పేరు ను ఒక పర్వతానికి పెట్టి గౌరవించింది .ఎనభై లో ‘ఎఫోర్ సేడ్’’అనే ఆయనే ఎంపిక చేసిన ఆయన కిస్టమైన కవితల సంకలం గా తెచ్చారు .

రాసిన కవితలను బట్టి ఫ్రాస్ట్ ను వర్డ్స్ వర్త్ కవి తో పోలుస్తారు .ఫ్రాస్ట్ రుషియా లేక కవియా అని అనుమానిస్తారు .పబ్లిక్ లోకి బాగా వచ్చేవాడు ‘’గ్రీన్ ఆపిల్ జీనియస్ ‘’అనేవారు .’’క్రాకర్ బాక్స్ ఫిలాసఫర్ ‘’అనీ అంటించారు .ఫ్రాస్ట్ ‘’a poem should begin in delight and end in wisdom –I ;d as soon write free verse as play tennis with the net down ‘’అని కవిత్వ పరమావధి చెప్పాడు.’’ నీకు అదృష్టం దురదృష్టం ఏదైనా పట్ట వచ్చు కాని నీకు చివరికి కావాల్సింది కృప మాత్రమె ‘’అనే వాడు .దీనిపైనే ‘’ఏ మాస్క్ ఆఫ్ రీజన్ ‘’ ఏ మాస్క్ ఆఫ్ మెర్సి’’దీర్ఘ కవితలు రాశాడు .మనిషే కాదు అతని శైలీ ముఖ్యమేనంటాడు .ఎనభైతోమ్మిదేళ్ళు నాన్ కన్ఫర్మార్ గా జీవించి చివరి పుస్తకం గా ‘’ఇన్ ది క్లియరింగ్ ‘’తెచ్చి29-1-1963లో రాబర్ట్ ఫ్రాస్ట్ కవి చనిపోయాడు . అమెరికా వ్యావహారిక భాషలో కవిత్వం రాసిన రియలిస్టిక్ కవి .అరుదైన సాహితీ సంపన్నుడు అందరికి ప్రేమాస్పడుడు ఫ్రాస్ట్ .’’greatest of  the American poets of the century ‘’అని పించుకొన్నాడు .అస్తిత్వ  మూల కారణాలను ప్రశ్నించాడు .perhaps no other poet in our history has put the best of the Yankee spirit into a book so completely.”  his frequent use of rural settings and farm life, a  liked in these poems, Frost is most interested in “showing the human reaction to nature’s processes.” సానుభూతితో ఉన్న హాస్యాన్ని ప్రవేశ పెట్టాడు .న్యూ ఇంగ్లాండ్ జానపదుడు అని పించుకొన్న వాడు జాతీయ అంతర్జాతీయ కవిగా మన్ననలు అందుకొన్నాడు .జాన్ కేనేడి ప్రెసిడెంట్ అయినప్పుడు ఫ్రాస్ట్ కవిని పిలిపించి గౌరవించి ‘’ది గిఫ్ట్ అవుట్ రైట్ ‘’కవితను చదివించాడు .’ఇంతకూ ముందు ఏ అమెరికన్ కవికీ ఇలాంటి గౌరవం దక్కిన దాఖలా లేదు .

 

Robert Frost NYWTS.jpg

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు అని అభిప్రాయ పడిన అల్లూరి సీతా రామ రాజు

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు

Published at: 12-06-2014 00:35 AM

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ధాటికి ధీటుగా మన్నెం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. స్వరాజ్యం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అయితే ఆయనతో నేరుగా మాట్లాడి, వాటిని ప్రచురించిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి సందర్భం ఒకటి 1923లో చరిత్రలో నమోదయింది. 1923, ఏప్రిల్ 17వ తేదీన సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి వచ్చినప్పుడు-చెరుకూరి నరసింహమూర్తి అనే స్థానికుడు ఆయనను కలిసి మాట్లాడారు. సీతారామరాజుతో నరసింహమూర్తి సంభాషణను, నరసింహమూర్తితో ఆంధ్రపత్రిక విలేకరి సంభాషణను ఆంధ్రపత్రిక ఏప్రిల్ 21వ తేదీన ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలను, సీతారామరాజుకు సంబంధించిన అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను, సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విశేషాలను సేకరించి సీనియర్ పాత్రికేయుడు యు. వినాయకరావు ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ అనే పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. ఆ పుస్తకంలో నుంచి ఒక ఆసక్తికర భాగం..

అల్లూరి సీతారామరాజు అన్నవరం వెళ్లినపుడు ఆయనతో చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ.
మూర్తి: మీరిక్కడ ఎంతసేపు ఉంటారు?
రాజు: రెండు గంటలసేపు ఉంటాను. పది గంటల సమయంలో బయలుదేరుతాను. నర్సీపట్నం, కాకినాడలకు ఎస్ఐ తంతి వార్తలు పంపేందుకు కనీసం అరగంట ఆలస్యం కాక మానదు. ఆపై మాత్రమే పోలీసులు మోటారుబళ్లలో బయలుదేరుతారు. పది గంటల ప్రాంతంలోనే వారంతా ఆ గ్రామానికి చేరగలుగుతారు.
మూ: మీరెక్కడకు వెళ్లదలిచారు?
రా: నేను ముందుగా మకాములను నిర్ణయించుకోలేదు.
మూ: ఇక్కడికి ఎందుకు వచ్చారు?
రా: నా ఉత్తర్వులను అనుచరులు సరిగా గ్రహించలేదు. దారిలో తుపాకులను కాల్చారు. దాంతో నా జాడ తెలుస్తుందేమోనని నా ప్రయాణాన్ని మార్చి వెంటనే ఇక్కడికి వచ్చాను.
మూ: మీరేమి సంకల్పంతో పితూరిని నడుపుతున్నారు?
రా: ప్రజలకు స్వాతంత్య్రం లభించాలనే ఉద్దేశంతో.
మూ: ఏ సాధనంతో?
రా: దౌర్జన్యంతోనే. యుద్ధం చేస్తే గానీ మనకు స్వరాజ్యం రాదు.
మూ: స్వాతంత్య్రం పొందగలమన్న నమ్మకం మీకు ఉందా?
రా: రెండేళ్లలో స్వరాజ్యం తప్పక లభిస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
మూ: రెండేళ్లలో స్వరాజ్యమెలా లభిస్తుంది? మీరవలంబిస్తున్న పద్ధతిలోనే స్వరాజ్యం వస్తుందా?
రా: తప్పక వస్తుంది. నాకు అనుచరుల సంఖ్య చాలా ఎక్కువ. అందులో లోటు లేదు. అయితే తుపాకులు, మందుగుండు సామాగ్రి కావాలి. వాటి కోసమే ఈ సంచారం చేస్తున్నాను.
మూ: దౌర్జన్యంతో కూడిన యుద్ధాలతో ప్రపంచం విసుగు చెందింది. దౌర్జన్యరహిత సిద్ధాంతాన్నే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆదరిస్తున్నారు. జర్మనీవారు కూడా సాత్విక విరోధాన్నే ఆరంభించారు. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య సాధనాల్లో మాత్రమే మాకు నమ్మకం ఉంది. సకల ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించేందుకు దేవదూత గాంధీరూపంలో వచ్చిందని ప్రపంచ ప్రజలంతా నమ్ముతున్నారు.
రా: దౌర్జన్యరాహిత్యంపై నాకు నమ్మకం లేదు. దౌర్జన్యంతోనే స్వాతంత్య్రం సాధించగలమని గట్టిగా నమ్ముతున్నాను.
మూ: దౌర్జన్యంతో ప్రాణనష్టం, వినాశనం కలుగుతుంది. శాంతి సాధనతోనే స్వరాజ్యం లభిస్తుంది. ఇంతకుపూర్వం మీకు, పోలీసులకు జరిగిన యుద్ధాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది?
రా: మొదటి అయిదు యుద్ధాల్లో నేను సులభంగా గెలుపొందాను. ఆరోది, చివరి యుద్ధంలో మాత్రం అలసి మేము నిద్రపోతుండగా పోలీసువారు హఠాత్తుగా మాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. వారు దూరంగా ఉండి మందుపాతరలను, తుపాకులను కాల్చారు. అరగంటసేపు విడవకుండా కాల్చిన శబ్దాలకు మా జట్టులోని వారికి మెలకువ వచ్చింది. మరి రెండు నిమిషాలకు నాకు కూడా మెలకువ వచ్చింది. నేను లేచి చూసేసరికి పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతా చిల్లులు పడింది. అయితే, నాకు ఒక్కటీ తగలలేదు. మా వారితో కలిసి అక్కడి నుంచి తప్పించుకొన్నాం.
మూ: ఈ నాలుగు నెలలుగా మీరేమి చేస్తున్నారు?
రా: నేను జపం చేస్తున్నాను.
మూ: గయలో జరిగిన కాంగ్రెసు మహాసభలకు మీరు వెళ్లారని ప్రజలు బాగా చెప్పుకొన్నారు. నిజమేనా?
రా: నా స్థూల శరీరం గయకు పోలేదు. నా ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్లింది.
మూ: అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలియవన్న మాటేనా?
రా: నేనంతా స్వయంగా చూడగలిగాను. అక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కొందరు శాసనసభలను బహిష్కరించాలని, మరికొందరు వెళ్లాలని అన్నారు. వెళ్లాలనే వారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పం. ఉప్పు పన్నుని హెచ్చించినందుకు, ధర్మాదాయాల చట్టాన్ని ఆమోదించినందుకు భారత శాసనసభ్యుల్లోనూ, చెన్నపురి రాష్ట్రీయ శాసన సంఘ సభ్యుల్లోనూ ఎవరైనా రాజీనామాలు ఇచ్చారా?
మూ: ఎవరూ రాజీనామాలు ఈయలేదు. అసలు మీకీ రాజకీయ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి?
రా: నేను అందుకు తగు ఏర్పాట్లు చేసుకొన్నాను.

విప్లవజ్యోతి
అల్లూరి సీతారామరాజు
రచయిత: యు. వినాయకరావు
పేజీలు: 80, ధర: 100 రూపాయలు
ప్రతులకు: 98851 79428

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47

ఫ్రాన్సిస్ థామ్సన్

రోమన్ కేధలిక్ గా 18-12-1859న జన్మించి మాంచెస్టర్ లోని ఓవెన్స్ కాలేజి లో చేరి ఇష్టం లేక ,సరిగ్గా చదవక తప్పి ,లండన్ వెళ్ళాడు .అక్కడా  జ్యేస్టా దేవే ఎదురైంది .అగ్గిపెట్టెలు దగ్గర నుంచీ అన్నీ అమ్మాడు .బీదరికం తో కుంగిపోయాడు .కవిత్వమే భిక్ష పెట్టాలి అనుకోని దిగాడు .రాసుకోవటానికి పేపర్లూ కూడా కొనుక్కో లేని దరిద్రం .తండ్రి బ్రిటిష్ మ్యూజియం లోని రీడింగ్ రూమ్ కు అప్పుడప్పుడు డబ్బులు పంపుతున్నా  అతని మురికి బట్టలు ,వాలకం చూసి లోపలి అనుమతించే వారు కాదు .అక్కడే బయట అరుగుల మీద పడుకొంటుంటే ఒక వేశ్య దయ తలచి ఇంటికి తీసుకొని వెళ్ళి అన్ని సమకూర్చి సహాయం చేసింది .ఆమె దయతో బతుకుతూ కూడా నిర్లక్ష్యం గా డబ్బు తగలేస్తూ నల్లమందు కు అలవాటు పడ్డాడు .

మెర్రీ ఇంగ్లాండ్ పేపర్ కు కవిత రాసి పంపాడు .వేసుకోవటానికి ఎడిటర్ ఇష్టపడి లెటర్ పంపిస్తే అప్పటికే ఇల్లు మార్చ టం వలన అందుకోలేక పోయాడు .చివరికి పేపర్ వాళ్ళే అడ్రస్ కనుక్కొని ఎడిటోరియల్ ఆఫీసుకు వచ్చి మాట్లాడమన్నారు .చినిగిన బూట్లు ,షర్ట్ లేకుండా పైన వేసుకొన్న మురికి కోటు తో వెళ్ళాడు .మత్తు మందు మానెయ్యమని చెప్పి ఉద్యోగం ఇచ్చారు పందొమ్మిదేళ్ళు అందులోనే పని చేసి బతికాడు .ఎడిటర్ విల్ఫ్రిడ్ మే నెల్ అతని భార్య రచయిత్రి అయిన ఆలిస్ మే నెల్ లు థామ్సన్ రాసిన కవితల మొదటి సంపుటిని ముద్రించారు .బాగా ప్రోత్సాహం లభించింది .షెల్లీ రాసిన హౌన్డ్ ఆఫ్ హెవెన్ పై గొప్ప వ్యాసం రాశాడు .’’సిస్టర్ సాంగ్స్ ‘’రెండవ పుస్తకం గా వచ్చింది .దీనిని మే నెల్ పిల్లలకు అంకితమిచ్చాడు .చాలా జర్నల్స్ కు వ్యాసాలు రాశాడు .’’హెల్త్ అండ్ హోలినేస్ ‘’పై రాయటానికి ఎక్కువ కష్టపడ్డాడు .’’I  would be the the poet of the return to god ‘’అని చెప్పుకొన్నాడు అమాయకత్వం పసి  మనస్తత్వం తో రాసేవాడు .’’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు ‘’కవితకు మంచి పేరు .

‘’o world invisible ,we view thee –o world intangible ,we touch thee –o world unknowable ,we know thee –inapprehensible ,we clutch thee ‘’—‘’yea ,in the night ,my soul ,my daughter –cry –clinging heaven by the hems –and lo Christ walking on the water –not of Gennesareth ,but Thames ‘’

Francis Thompson at 19.jpg

 

ఏ యి .హౌస్మన్

హూస్మన్ రాసిన ‘’ఏ స్ట్రోఫైర్ లాడ్’’అనే నిరాశా జనక కవిత రాసి ఫిట్జెరాల్డ్ తో సమాన ప్రాముఖ్యం సంపాదించిన అల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌస్మన్ 26-3-1859లో వార్సేస్తర్ షైర్లోని బ్రూమస్ గ్రోవ్ లో పుట్టాడు .వయసుకంటే చిన్నగా కానీ పించేవాడు .అందుకే స్నేహితులు ‘’చిట్టెలుక ‘’(మౌసీ )అని పిలిచేవారు .తలిదండ్రులు బాగా పలుకుబడి ఉన్నవారు .ఆక్స్ ఫర్డ్ సెయింట్ జాన్ కాలేజి లో చేరటానికి స్కాలర్ షిప్ వచ్చింది .అప్పటికే గ్రీకు  లాటిన్ లో ప్రజ్న ఉండేది .హిస్టరీ ,ఫిలాసఫీ లపై మోజు లేదు .చదువు చెప్పాలనే కోరిక ఉండేది .డిగ్రీ పూర్తీ చేయలేదు కనుక యూని వర్సిటి ప్రవేశం జరగ లేదు ..

లండన్ వెళ్లి పేటెంట్ ఆఫీస్ లో చిన్న గుమాస్తా అయ్యాడు .జీతం తక్కువ క్లాసిక్స్ చదివాడు .పదకొండేళ్ళు నిరంతర శ్రమ చేసి అనుకొన్నది సాధించి లండన్ యూని వర్సిటి కాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ అయ్యాడు .పందొమ్మిదేళ్ళు పని చేసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ లాటిన్ ‘’పొందాడు .లండన్ లో ఉన్న కాలాన్ని దారుణ కాలం అన్నాడు .జాక్సన్ భావాలకు పూర్తీ విరుద్ధం గా ఉండేవాడు .తన కవిత్వానికి క్లాసికల్ ఆరిజన్  ఉంది  అంటే ఒప్పుకోలేదు ,లాడ్ రాసిన చాలా కాలానికి కాని ఏదీ రాయకపోవటానికి తానూ కవిని కాదని లాటిన్ ప్రొఫెసర్ నని    చెప్పాడు .ముప్ఫై ఆరేళ్ళ తర్వాత పోయెమ్స్ పేరిట రెండో పుస్తకం తెచ్చాడు   .చనిపోయిన తర్వాత ‘’మోర్ పోయెమ్స్ ‘’ఎడిషనల్ పోయెమ్స్ ‘’ముద్రించారు .చివరి పాతికేళ్ళు కవిత్వం రాయలేదు .ఎనభై  ఆరేళ్ళ  వయసులో 3-4-1936 న మరణించాడు .

 

200px

 

జంగిల్ బుక్ రచయిత –   రుడ్యార్డ్ కిప్లింగ్

వచనమే రాసి కవిత్వం తక్కువ రాసిన వాడు రుడ్యార్డ్ కిప్లింగ్ 30-12-1865 ఇండియాలోని బొంబాయ్ లో పుట్టాడు .మేతడిస్ట్ కుటుంబం .ఆరో ఏట ఇంగ్లాండ్ వెళ్ళాడు .నార్త్ డేవాన్ లో వెస్ట్ వార్డ్లో చదివాడు .స్కూల్ మేగజైన్ కు రచనలు చేసేవాడు .యూని వర్సిటి లో చేరకుండా ఇండియా తిరిగి వచ్చేశాడు .లాహోర్ సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ కు సహాయ సంపాదకుడు గ పదిహేడవ ఏట అయ్యాడు .’’ డిపార్ట మెంటల్  డిట్టీస్ ‘’  అనే మొదటి పుస్తకం రాశాడు .ఇరవై రెండు లో ‘’ప్లైన్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ,ఆరు భాగాలుగా చిన్న కధలు ప్రచురించి ప్రపంచానికి భారత దేశాన్ని పరిచయం చేశాడు .’’అండర్ ది దేవదార్స్ ‘’,’’సోల్జేర్స్ ట్రీ ‘’లతో డికెన్స్ తో సమానం గా విభిన్న పాత్రలను సృష్టించాడు .ప్రతి విషయాన్ని క్షుణ్ణం గా పరిశీలించటం కిప్లింగ్ గొప్ప తనం .’’జంగిల్ బుక్ ‘’కిం ‘’కధలు సంచలనం సృష్టించాయి .’’బారక్ రూమ్ బాలడ్స్ ‘’’’,’’ది ఫైవ్ నేషన్స్ ‘’కవితలు రాసి ప్రచురించాడు .

ఇరవై ఒకటి లో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లండన్ చేరి కవితలు కధలతో లండన్ ను జయించే శాడు .ఇరవై ఎడుకే ప్రసిద్ధ రచయిత అయ్యాడు .ప్రపంచ పర్యటన చేసి ‘’ది నాలహ్కా ‘’రాసి అమెరికాలోని వెర్మాంట్ లో ఉన్నాడు .ఇంకా ఉండి పోయే వాడేకాని బామ్మర్ది తో తగాదా వల్ల ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది .సాంఘిక వ్యతిరేకి అయ్యాడు .కూతురు, మొదటి ప్రపంచ యుద్ధం లో కొడుకు చనిపోయారు .ససెక్స్ విలేజ్ లో ఒంటరి జీవితం గడిపాడు దుఖం లో .అయిదవ జార్జి రాజుకు ఉపన్యాసాలు రాసేవాడు .తరువాత రాసిన వన్నీ ఇమ్పీరియలిజాం భావాలతో రాశాడు .విధి క్రమశిక్షణ ,అధికారం ,విధేయత లను శాసించాడు .లార్డ్ లు, పై తరగతి వాళ్ళతోనే ఉండేవాడు .సామాన్యుల గోడు పట్టేదికాడు .ఇండియా లో మధ్యతరగతి వారు చదువుకొని పైకి ఎదగటం సహించ లేక పోయే వాడు .తెల్ల జాతి ఉత్క్రుస్టత నే ఎప్పుడూ పొగిడే వాడు .ఫాసిజం భావాలు నర నరానా జీర్ణించుకు పోయిన రచయిత కిప్లింగ్ .అందుకే బెర్నార్డ్ షా ‘’he never grew up .-he began by being behind the times’’అని దెబ్బ కొట్టాడు .విక్టోరియా రాణి డయమండ్ జూబిలీ ఉత్సవాలలో ఆంగ్ల సామ్రాజ్యం జాగ్రత్తగా ఉండాల్సిఉంటుందని హెచ్చరించాడు

క్రమం గా కిప్లింగ్ ప్రాభవం తగ్గి పోయింది .’పాస్తమస్  ఆధర్ ‘’(చనిపోయిన రచయిత ) అని పించుకొన్నాడు .ది లైట్ దట్ ఫైల్డ్ ‘’అనే శీర్షిక తో ‘’the forgotten man in English literature ‘’అని ఆయన అరవయ్యవ ఏట పత్రికలూ ఎడిటోరియల్స్  రాశాయి .స్వీయ జీవిత చరిత్ర గా ‘’సమ్ థింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’రాసి,ప్రచురించిన కొద్ది  కాలానికే డెబ్భై వ పుట్టిన రోజు తర్వాత కిప్లింగ్ కాల గర్భం లో కలిసి పోయాడు .ఆయన్ను జాతీయ పొగరు బోతు అన్నారు  ఆయన కాలం అంతా బ్రిడ్జి ల నిర్మాణం స్టీం ఇంజిన్ ప్రాభవం ,వైర్లెస్ సృష్టి తో ఆధునికత తాండ వించింది .కిప్లింగ్ సైనిక పద ఘట్టనల పైనా ,నావికుల పాటలా మీదా ,ఇంజినీర్ ల పనులపైనా కవిత లల్లాడు .కాని అతని సమకాలికులు మాత్రం ‘’his triumph was the triumph of the Philistine ,that he could never appreciate the romantic spirit ‘’అని తేల్చి పారేశారు .’ ఎక్స్ ప్రెస్   ట్రైన్ ‘’ను ‘’confound Romance —-and all unseen –Romance  brought up the nine fifteen ‘’అని కిప్లింగ్ రాశాడు .

ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ రచయితలలో కిప్లింగ్ మొదటి తరం వాడు .గొప్ప బాలడ్ మేకర్ .’’full bodied and active verse that kipling excels ‘’అని ఇలియట్ కవి భావించాడు .’’దుర్గా దిన్ ‘’,డాన్నీ డీవార్’’కవితలను  ఫుల్ జోష్ తో రాశాడు .కిప్లింగ్ కవితల కిప్లింగులు సాధారణం గా  జానపద పాటలుగా ఉంటాయి . స్కౌట్ ఉద్యమానికి సాయం చేశాడు దాని నిర్మాత బెదేన్ పావెల్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ లోని అనేక వాక్యాలను ఉదాహరించాడు .నెహ్రు ‘’కిం ‘’తన ఫేవరైట్ రచన అన్నాడు

Rudyard Kipling.jpg

 

 

మొదటి నోబెల్ బహుమతి పొందిన ఐర్లాండ్ కవి – విలియం బట్లర్ ఏట్స్

కవి నాటక రచయితా అయిన విలియం బట్లర్ ఏట్స్ ఐర్లాండ్ లో  డబ్లిన్ లో ని శాండీ మౌంట్ లో ప్రోటేస్తంట్ గా 13-6-1865న పుట్టాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లు .తండ్రి జాన్ బట్లర్ యేట్స్ట్స్ కళా కారుడేకాక రాయల్ హేబెర్నియాన్ అకాడెమి సభ్యుడు కూడా .ఐరిష్ రివైవల్ సాహిత్యంను ముద్రించిన కువాలా ప్రెస్ వీరి బంధువులదే .సోదరుడు జాక్  ల్యాండ్ స్కేప్ పెయింటర్ .చిన్నప్పుడే కుటుంబం లండన్ చేరింది .తల్లి పుట్టిల్లు  కౌంటే స్లిగో లో వేసవిలో క్లాసులకు వెళ్ళేవాడు .అది అడవీ ప్రాంతం. గాలిక్  ఫాంటసి  కి నిలయం .డబ్లిన్ మెట్రోపాలిటన్ స్కూల్  ఆఫ్ ఆర్ట్ లోచేరి టర్నర్ శైలిలో బొమ్మలు తయారు చేశాడు .

ఇరవై ఒకటిలో మొదటి పుస్తకం ‘’మోసడా ‘’రాసి అచ్చ్చేశాడు .లండన్ వచ్చి ఎర్నెస్ట్ రాయి తో కలిసి ‘’రైమేర్స్ క్లబ్ ‘’ఏర్పరచాడు .ఇది ఫ్రెంచ్ సిమ్లిజం మొదలైన ఆధునిక టెక్నిక్ ల గురించి ఆలోచించేది .డబ్బులు లేక గుర్రం మీద వెళ్ళలేక నడిచి డబ్లిన్ నుండి లండన్ చేరేవాడి నని  రాసుకొన్నాడు .తన జీవిత చరిత్రలో తానొక కొత్తమతాన్ని కవిత్వం ఆధారం గా నిర్మించానని చెప్పాడు .ఇది సగం  ఊహ సగం గారడీ .చివరకు థియాస ఫిస్ట్ అయ్యాడు .మేడం బ్లా వత్స్కి  అనుచరుడు గా పేరు పొందాడు .దెయ్యాలను పిలవటం మాట్లాడించటం లో సిద్ధ హస్తుడని పించాడు  కాని అసలైన ఫిలాసఫీ ఏమిటో తెలిసేదికాదు .అంతఃకరణ విలువ అర్ధం కాలేదు .

సిగ్గు పడే మనస్త్వం .’’హేర్మటిక్ స్టూడెంట్స్ ఆఫ్ ది గోల్డెన్  డాన్’’బృందం లో చేరాడు .ఇందులో మాయలు మంత్రాలు మాజిక్ ఎక్కువ .కవిత్వమే మార్గమని తెలుసుకొన్నాడు .సెల్టిక్ రివైవల్ లో చేరే నాటికి ఏట్స్ స్పిరిటిస్ట్, ,నేషనలిస్ట్ అని పించాడు .అప్పుడే ఐర్ లాండ్ లో   రెండు ఉద్యమాలు మొదలైనాయి .మొదటిది ‘’’గేలిక్ లీగ్ ;;’’ ప్రాచీన ఐరిష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం గేలిక్ ను జాతి భాష గా చేయటం వీరి ధ్యేయం .సహకార వ్యవ సాయం చేసి అధిక దిగు బడి సాధింఛి  జీవన  స్తితి గతులను మెరుగు పరచటం రెండోది  .వీటితో జాతీయ సాంస్కృతి పునర్ వైభవం పొందింది కమ్య్యూనిస్తులు ,జానపదులు ,విద్యా వేత్తలు కవులు రచయితలూ  అంతా కలిసి వచ్చి ఉద్యమాలను నడిపి అనుకొన్నవి సాధించారు .జార్జి రసెల్ ‘’ఏ .యి ‘’ అనే మారు పేరుతో కవితలు రాశాడు .ఉద్యమం ఊపు అందుకోగానే నిర్వాహకులు రాడికల్స్ గా మారి పోయారు .ద్వేషాలు పెరిగాయి .ఐరిక్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది . కవుల రక్తం తో నూతన ఫ్రీ ఐర్లాండ్ జన్మించింది . .గేలిక్ లీగ్ వ్యవస్తాపకుడు డగ్లాస్ హైడ్ అనే కవి ఐర్లాండ్ మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు  .

ఈ ఉద్యమకార్యక్రమాలకు   ఐరిష్ లిటరరీ దియేటర్  వేదిక అయింది .దీనితో మనకవి యేట్స్ట్స్ కూ పాత్ర ఉంది .మాడే గొన్నె అనే అందమైన అమ్మాయి ప్రేమలో పడిపోయాడు .ఉద్యమం లో ఆమె ‘’ఫైర్ బాండ్ ‘’పాత్ర వహించింది .ఈ విజయం తో ‘’కేతలీన్ ని హౌలిహాన్ ‘’నాటకాన్ని దేశ భక్తీ ప్రధానం గా రాసి ,అందులో కేతలీన్ అనే యువతి త్యాగాన్ని ధైర్యాన్ని సాహసాన్ని ఉద్యమం నడిపిన తీరును గొప్ప గా ప్రదర్శించి అందరి మెప్పూ పొందాడు .ముప్ఫై కే  ఆరు పుస్తకాలు రాసి ప్రచురించాడు .కొద్ది ప్రతీకలు మాత్రమె వాడాడు .క్రమంగా సంపూర్ణ కవి గా రూపొందాడు .యాభై వచ్చేసరికి సెంటి మెంట్ ను ,అలంకారాలను వదిలిన్చుకొన్నాడు .ఐర్లాండ్ రాజకీయ సంక్షోభామూ దానికి కారణ మైంది .1913లో ‘’romantic Ireland is dead and gone –it is with o Leary in the grave ‘’ అని ప్రకటించాడు .’’రేస్పాన్సి బిలిటీస్ ‘’పుస్తకం పేరు లోనుంచే ఈ మార్పు ను తెలియ జేసి ప్రజా కవిత్వం రాశాడు .’’ఏ కోట్ ‘’అనే కవిత లో

‘’I made my song a coat –covered with embroideries –out of old mythologies ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించాడు .అయన రాసిన ‘’the fools caught it –wore it in the world;s eyes –as though they ;d wrought it’’ అన్న పంక్తుల్ని పదే పదే చదివారు జనం .తర్వాత దీన్నీ కాదనుకొన్నాడు .’’ఎస్సేస్ ‘’రాసి ప్రజల్లో ఉన్న నమ్మకాలు ,పాత విధానాలు ఐర్లాండ్ లో రొమాంటిక్ కవితలు ప్రభవిల్లిన నేపధ్యం పై రాశాడు .’’ది వైల్డ్ స్వాన్స్ ఎట్ కూలే ‘’లో మానసిక వాస్తవాలను చెప్పాడు .తర్వాత అయిదేళ్లకు ‘’లేటర్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .

క్రమంగా మంత్రాలు మాజిక్ తంత్రాల వైపు  మళ్లాడు .సూపర్ నేచురలిజం వైపు కదిలాడు .’’సియాన్స్ ‘’కు వెళ్ళాడు .ఈ అన్వేషణలో జార్జీ హైడ్ లీ ని చూసి ఆరేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆమెతో కలిసి ‘’ఆటో మేటిక్ రైటింగ్ కమ్మ్యూనికేటర్లు డిక్టేట్ చేస్తుండగా  ‘’ప్రాక్తీస్స్ చేశాడు . దీని ఫలితం గా ‘’ఏ విజన్ ‘’రాసి అరవైలో ముద్రించాడు .డెబ్భై రెండులో కొంతమార్చి మళ్ళీ ప్రింట్ చేశాడు .’’’’to me it means a last act of  defence against the chaos of the world ‘’అని అదే పరిష్కారం గా నమ్మి నట్లు చెప్పాడు .రెండవ ఎడిషన్ వచ్చే సరికే ఏట్స్ గొప్ప గౌరవం పొందాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా ఉన్నాడు .1923లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు .ప్రపంచ ప్రసిద్ధకవి అయ్యాడు .యాభై వ ఏట నుంచి రాసిన కవిత్వం అంతా సుప్రసిద్ధమైంది .కవిత్వం లో స్పష్టత ,మేలిమి ,సాధికారత సాధించాడు .ఊహా ప్రపంచం ఫైరీ లాండ్ ను వదిలేసి వాస్తవ ప్రజలకోసం ,వారి  అభిప్రాయాలకోసం  అనుభవాన్ని రంగ రించి రాశాడు .’’in the whole man –blood imagination ,intellect running together .i am content to follow to its source every event in action or in thought ‘’అని నిజాయితీగా చెప్పుకొన్నాడు .

‘’ ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో ‘’when  such as I cast out remorse –so great a sweetness flows into the breast –we must laugh and we must sing –we are blest by every thing –every thing we look upon is blest ‘’అని  కమ్మని భావ ధార పొంగించాడు ..రాసిన ప్రతి కవితనూ తిరిగి రాస్తూ సాన బెడుతూ తీర్చి దిద్దాడు .ఏట్స్ కు కవిత్వం ఆసు దారగా వచ్చేస్తుంది అదీ ఆయన ప్రత్యేకత .ఫాసిస్ట్ కాదు కాని ఫ్యూడల్ భావాలున్న వాడు ఐర్లాండ్ కు దూరం గా ఇటాలియన్ రెవెరి లోని రాపెల్లో లో చివరి రోజులు గడిపాడు .చివరి దాకా రాస్తున్నా చివరి ముఖ్య గ్రంధం ‘’బైజాంటియం ‘’.ఇందులో యేట్స్ కవిత పర వళ్ళు తొక్కింది .సృజనలో ,ప్రతీకలు ఎంచుకోవటం లో అంతా నవ్యత కని  పించి ఉత్కృష్ట రచన అని పిస్తుంది .

డెబ్భై దాటిన తర్వాత బలహీన పడ్డాడు .బతకటం కంటే చావే మేలనిపించేది .1938శీతాకాలాన్ని భరించ లేక పోయాడు .న్యాయం గా అదేమంత చలికాదు కాని శరీరం తట్టుకోలేక బ్రేక్ డౌన్ వచ్చి కోమా లోకి వెళ్లి గుండె ఆగి 28-1-1939న నైస్ లోని రాక్ బర్న్ లో యేట్స్ చనిపోయాడు .రాసిన నాటకాల పై జనం ద్రుష్టి ఇప్పుడు లేక పోయినా కవిత్వాన్ని ఇంకా ఆరాధిస్తున్నారు .చనిపోయిన పన్నెండేళ్ళ కు ‘’ది పెర్మనేన్స్ ఆఫ్ యేట్స్ ‘’అనే పుస్తకాన్ని ఇరవై నలుగురు విమర్శకుల వ్యాసాలతో ప్రచురించి ఘన నివాళి సమర్పించారు .’’we no longer listen to the half conscious music of a trance but to the deliberate and un compromising note of truth ‘’అంటూ శ్రద్ధాంజలి ఘటించారు . Nobel Committee described as “inspired poetry, which in a highly artistic form gives expression to the spirit of a whole nation.” అని మెచ్చింది .రవీంద్రుని గీతాంజలి ఆంగ్ల అనువాదానిక్ యేట్స్ ముందు మాట రాశాడు .సంప్రదాయ కవిత్వం లో మేటి .చరిత్ర పునరా వృత్తం అవుతుందని నమ్మే వాడు అందుకే  that his age represented the end of the cycle that began with the rise of Christianity.’’ అని చెప్పుకున్నాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరా బాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46

సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

‘’గడ్డి పరకలు ‘’కు కావ్య గౌరవాన్ని సాధించి సమాజం లోని అన్ని వర్గాల వృత్తుల మనుషులకు గౌరవం కలిపించి ఇంగ్లాండ్ భావ దాస్యానికి భరతం పట్టి తేర దించి అసలు సిసలు అమెరికన్ కవిత్వాన్ని రాసిన వాడు జాతీయ కవిగా గుర్తింపు పొందిన వాడు వాల్ట్ విట్మన్ . 31-5-1819న అమెటాంరికా లోని లాంగ్ ఐలాండ్ లో హంటింగ్టన్లో వెస్ట్ హిల్స్ లో జన్మించాడు .తొమ్మిదిమంది సంతానం లో రెండవ వాడు .తండ్రి కార్పెంటర్ .కుటుంబాన్ని బ్రూక్లిన్ కు మార్చాడు .తండ్రికి ‘’టాం పైన్’’  అంటే వీరాభిమానం .ముగ్గురు కొడుకులకు అదే పేరు పెట్టుకొన్నాడు .మిగిలిన వారికి జార్జీ వాషింగ్ టన్ ,థామస్ జెఫర్సన్ ,ఆండ్రూ జాక్సన్ అని ప్రేసిడెంట్ల పేరు పెట్టుకొని మురిశాడు . పెద్దన్న సిఫిలిస్ వ్యాధి కి గురైనాడు .ఒక చెల్లెలు నరాల బలహీనత తో ఇబ్బంది పడింది .ఒక అన్న వాటర్ వర్క్స్ లో పని చేసేవాడు ఈ నేపధ్యం లో విట్మన్ పెరిగాడు .

పదకొండవ ఏట స్కూల్ చదువు పూర్తీ చేశాడు .ప్రింటర్ దగ్గర సహాయకుడైనాడు .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రిక ప్రెస్ లో పని చేశాడు .యువకుడిగా చాలా  రెస్ట్ లెస్  గా ఉండేవాడు .బతకటానికి అనేక పనులు చేశాడు. ఏదీ సంతృప్తినివ్వలేదు .న్యూ యార్క్ లో కంపోజిటర్ గా పని చేశాడు .స్కూల్ టీచర్ అయ్యాడు .చాలా కౌంటీ స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు .ఇరవై లో లాంగ్ ఐలాండర్ ప్రెస్ కొన్నాడు .ఒక ఏడాది స్వంత పత్రిక తేవాలని ప్రయత్నించి విఫలుడై మళ్ళీ ఉద్యోగాన్వేషణ లో పడ్డాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక పోయాడు .ఆరేళ్ళు అరడజన్ పత్రికలలో పని చేశాడు.చివరికి ఇరవై ఎనిమిదో ఏట ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే కొన్ని వచన రచనలు కొన్ని కవితలు రాశాడు .చిన్న కధలూ రాశాడు .’’ది ఇంకాస్ డాటర్ ‘’అనే బాలాద్ద్ స్తాన్జాలను రాసినట్లు  అందరూ మర్చి పోయారు . .ఈగిల్ సంపాదకుడిగా ముప్ఫై వ ఏడు వరకు పని చేశాడు .’’సోగ్గాడు ‘’వేషం తో ఉండేవాడు ఎప్పుడూ .అదే తరువాతతరానికి ఫాషన్ అయింది .న్యు ఆర్లియాన్ దిన పత్రిక ‘’డైలీ క్రిసేంట్ ‘’లో పని కుదిరింది .తమ్ముడు జెఫ్ తో కలిసి న్యూ ఆర్లియాన్స్ అంతా తిరిగి చూశాడు .మూడు నెలల తర్వాతా బ్రూక్లిన్ చేరాడు .ఫ్రీమన్ వార పత్రిక  కు ఎడిటర్ అయ్యాడు . హోమో సెక్సువల్ అయ్యాడు అమ్మాయిలతో తిరిగాడు .ముప్ఫై వ ఏట కవితాశైలి  పై ప్రయోగాలు చేశాడు .ఇది అతనికీ కొత్తా సాహితీ లోకానికి ఇతనూ కొత్త .స్వేచ్చగా ,నిబంధనలేని రైమ్స్ తో రాయటం మొదలు పెట్టాడు . కొంత మిస్టిజం ఉండేది .తన గురించి తన కవిత్వం గురించి చెప్పుకొన్నాడు –

‘’I am the poet of the body –and I am the poet of the soul –I go with the slaves of the earth equally with masters –and I will stand between the masters and the slaves –I will buoy you up –every room of your house do I fill with armed men –lovers of me ,baffles of hell-sleep for ,I and they stand guard this night .god and I are now here –speak !what would you have of us’’ఇదొక కొత్త గొంతు కొత్త భావం కొత్త ఆలోచన అందర్నీ తనతో తీసుకు వెళ్ళే ఆలోచన .అందర్నీ సమానం గా చూసే తత్త్వం .నోట్ పుస్తకం లో గిలికిన కవితలు పన్నెండిటిని  బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో అచ్చు వేశాడు .వీటికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’అని పేరు పెట్టాడు .అమెరికా స్పిరిట్ తో రాసిన కవితలివి .1855లో ఇవి లాంగ్ ఫెలో కవి రాసిన ‘’హైవాత ‘’తో బాటే ప్రింట్ అయ్యాయి .విట్మన్ తో అమెరికా జాతీయ కవిత్వం ఆవిర్భ వించింది .అమెరికా గొంతు విని పించింది .అమెరికా ఆశయం ప్రతిధ్వనించింది .దీనితో పేరు ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొన్నాడు .ముఖ చిత్రం మీద ఈ మార్పు ను స్పష్టం గా చూపించాడు .ఎవరికీ భయపడని మనిషిగా ,కోటు లేకుండా ,చొక్కా పైభాగం ఓపెన్ గా రంగుల లోపలి చొక్కా తో పోకిరీ పోజుతో  దర్శన మిచ్చాడు ముఖ చిత్రం పై .అప్పటినుండే విట్మన్ లిజేండరి ప్రారంభమైంది .

విట్మన్ లెజెండ్ అయిపోయాడు.దానికోసం అహరహం శ్రమించాడు. రాసినది చిత్రిక పడుతున్నాడు .రాయాల్సిన దానికి ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .తనను కూలీల సహచరిడిగా ,చదువు రాని వారి స్నేహితుడి గా చెప్పుకొన్నాడు .మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు .వారిలో మమేకమయ్యాడు .ప్రజాస్వామ్యకవి గా దాని విలువల రక్షకుడయ్యాడు .అప్పటిదాకా అమెరికన్లు సామాన్యులతో కలిసి పని చేయటానికి ఇబ్బంది పడ్డారు .లేబర్ ని దూరం చేశారు .వారి గురించిన కవిత్వమే రాలేదు .వీరందరినీ భాగ స్వాములను చేసి కవిత్వం రాశాడు కొత్త చరిత్ర సృష్టించాడు అదో జగత్ సహోదరులకు అండా దండా గా నిలిచాడు .ఇవేమీ పట్టించుకోని విమర్శక గణం  అతని తాగుడు వ్యభిచారం పొగరు బోతుతనం పోకిరీ వేషాల గురించేరాశారు కాని కవిత్వం గురించి పట్టించుకోలేదు .తన డబ్బా తానె కొట్టుకొంటున్నాడన్నారుకూడా .అతనికవితలు నిజం గానే గడ్డిపరకలని తొక్కి పారేయ దగ్గవని అతను సగం మనిషి సగం  జంతువూ అని ఈసడించారు .అమెరికాలోనే కాదు యూరప్ లో కూడా .విట్టియర్ కవి లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని నిప్పుల్లో వేసి కాలిస్తే ,లోవెల్ ‘’హంబగ్ ‘’కవిత్వమని కొట్టి పారేశాడు .

అయితే మేధావి కవి ఫిలాసఫర్ ఎమర్సన్ మాత్రం ఏంతో మెచ్చుకొన్నాడు ‘’dear sir –I am not blind to the worth of the wonderful gift of leaves of grass .I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy .i give you the joy of your free and brave thought I find the courage of treatment which so delights us .i greet you at the beginning of a great career ‘’అని మనస్పూర్తిగా ఆశీర్వ దించాడు ఆ యోగి  మహర్షి కవి వేదాంతి ,ఉత్తమ దేశికుడు అదే ఆశీర్వాదం అయింది .ఇక విట్మన్ కవితా ప్రవాహానికి అడ్డులేకుండా పోయింది .విమర్శకుల జడి వానలు కురుస్తున్నా అప్రతిహతం గా సాగిపోయాడు .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో –‘’I celebrate my self and sing my self –and what I assume you shall assume –for every atom belonging to me good belongs to you ‘’ఇలా వ్యక్తులతో కలిసి పోయాడు .దీనితో కవితలూ పెరిగాయి .బృహత్ గ్రంధం గా 384 పేజీలతో నూట ఇరవై నాలుగు కవితలతో లీవ్స్ ఆఫ్ గ్రాస్ రూపు దాల్చింది .తొమ్మిదో ఎడిషన్ లో మరిన్ని కవితలు చేరాయి .ఇంకా విమర్శకులు ఉస్త్ర పక్షి ద్రుక్పధాన్నే పాటించి కళ్ళు మూసుకొంటూనే ఉన్నారు .అయినా ఏదీ ఆగ లేదు .ప్రజలు ఏంతో ఇష్టం గా చదివారు ఆదరించారు తమకొక అన్నయ్యా తమ్ముడు మామయ్యా బాబాయి లభించాడని ఊరట చెందారు .బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు .కాని ఆదాయం రాలేదు. మళ్ళీ జర్నలిజం లో ప్రవేశించాడు .

రాజకీయం గా కలత చెందాడు ,స్లేవరిని సమర్ధించే వారేక్కువైనారు .బానిసల పై దయా సానుభూతి చూపే వారే కరువైనారు .దీనితో మనసు వికలమైంది విట్మన్ కు .అమెరికా పై పెట్టుకొన్న ఆశలు అడియాసలయ్యాయి .రాజ్యమే కాదు ,మనుషులూ దగా చేశారనుకొన్నాడు .కోపం ఉద్రేకం పెరిగి ఐరనీ తో ఒక కవిత రాశాడు దాన్ని గ్రాస్ లో చేర్చలేదు –‘’I pronounce openly for a new distribution of roles —–let the sun and moon go –let scenery take the applause of the audience –let there be apathy under the stars –అని ఆవేశం గా ఆలోచనాత్మకం గా కదిలించేలా రాశాడు .డైలీ టైమ్స్ లో పని చేశాడు .యుద్ధం లో చేరి పోరాడాలని భావించాడు ముసలితనం అడ్డమొచ్చినది .క్వేకర్ భావాల వాడుకనుకతుపాకి పట్టలేదు .  .సోదరుడు యుద్ధం లో తీవ్రం గా గాయ పడ్డాడు అతని సేవ చేశాడు .వాషింగ్ టన్అంతా ఒక హాస్పిటల్ గా మారి క్షత గాత్రుల ఆర్తనాదాలతో మారు మొగి పోతోంది .’’హాస్పిటల్ విజిట్స్ ‘’పేర ఆర్టికల్స్ రాశాడు .అంగ వికలురైన సైనికులకు  కట్లు కట్టి విట్మన్ సేవ లందించాడు .ప్రతి క్షణం దయా సాను భూతితో అలుపు లేకుండా   సేవ చేశాడు .అందరూ తన వాళ్ళే అనుకొన్నాడు . తన జీతం లో కొంత భాగం తో పొగాకు ,స్టాంపులు తిను బండారాలు ,పండ్లు ,పాలు బిస్కెట్లు చాకో లెట్లు పుస్తకాలు  కొని గాయ  పడిన సైనికులకు ఇచ్చి వారిలో ధైర్యం ,ఉత్సాహం జీవితేచ్చ కలిగించేవాడు .ఉత్తరాలు రాసి పెట్టేవాడు .’’డ్రం –టాప్స్ ‘’లో వీటిని వివరించాడు .కవిత్వం లో మానవత్వాన్ని ఎలిగెత్తి చాటటమే కాదు ,దాన్ని ఆచరించి చూపి సాటి వారి యెడ ఆత్మీయతానురాగాలను ప్రదర్శించి ,సాను భూతితో సేవలందించిన మానవీయ మాననీయ కవి విట్మన్ .ఈ సంఘటన తర్వాత అతన్ని బాగా అర్ధం చేసుకొన్నారు .గౌరవ ఆదరాలిచ్చి మెచ్చుకొన్నారు

అమెరికా ప్రజలు అత్యంత కృతజ్ఞతా భావాన్ని విట్మన్ పై ప్రదర్శించి అభిమానాన్ని చాటుకొన్నారు .అబ్రహాం లింకన్ కాబినెట్ లో’’ఇండియన్ బ్యూరో ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లో  గుమాస్తా ఉద్యోగం దీని ప్రభావం వలననే దొరికింది . ఇంటీరియర్ కు సెక్రెటరి అయిన జేమ్స్ హార్లాండ్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని ఒక డ్రాయర్ సొరుగు లో చూసి చదివి భయపడి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాడామో నని తొందరపడి ఉద్యోగం తీసేశాడు .దీనికి విట్మన్ స్నేహితులు తీవ్రం గా స్పందించి ‘’గుడ్ గ్రే పోయెట్ ‘’పేర కరపత్రం విడుదల చేశారు .ఖంగు తిన్న ప్రభుత్వం తప్పు తెలుసుకొని ‘’అటార్నీ జెనరల్ ‘’శాఖ కు బదిలీ చేసింది .యాభై మూడవ  ఏడు వచ్చేవరకు అందులోనే హాయిగా సెక్యూర్ గా పని చేశాడు …తరువాత మళ్ళీ కవి రోడ్డున పడాల్సి వచ్చింది .తను రాసిన పాసేజ్ టు ఇండియా ,డెమోక్రాటిక్ విస్టా పుస్తకాలను డాలర్ కు డెబ్భై అయిదు సెంట్లకు అమ్ముకొని జీవించాడు .మెదడులో ఏదో అలజడి అనుభవించాడు .బహుశా రోగ గ్రస్తుల  పుండ్లుపు కడిగి డ్రెస్సింగ్ చేయటం వలన బాక్టీరియా తలలోకి ప్రవేశించి ఉండవచ్చునని భావించారు .తల్లి హృదయం తో మగ వాడిగా సేవ లందించాడు .వాషింగ్ టన్ అంటే ఇష్టం. అక్కడికి వెళ్లి సైనికులకు సేవలు చేస్తూనే ఉన్నాడు .అందరిని ప్రేమ దయ తో పలకరించికష్ట సుఖాలు తెలుసుకొని సహాయం అందించేవాడు .మాత్రు హృదయం తో సేవ చేస్తున్న ఈ ‘’గడ్డం కవి ‘’ని చూసి అమితాశ్చర్య పోయారు .చదివి కృతజ్ఞతలు చెప్పారు .విట్మన్ ‘’మగాడుగా మహిళ’’ గా అందిస్తున్న సేవలకు పులకించి పోయారు .తన ఆరోగ్యాన్ని గూర్చి గొప్పగా చెప్పుకొని తల్లికి జాబులు రాసేవాడు .తనను ‘’వైల్డ్ బఫెలో ‘’అనుకోనేవాడు .యాభై ఏళ్ళకు ఈ ముదురు బెండకాయ బ్రహ్మ చారికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది తనకూ ఒక కుటుంబం కావాలని తపించాడు .

తల్లిని సందర్శించైనా కొన్ని నెలలకే న్యు జెర్సీ లోని కామ్దేన్ లో  తల్లి చనిపోయింది .హతాశుడయ్య్యాడు .జార్జి ఇంటిపైభాగాన ఒక గది ఉండటానికి ఇచ్చాడు .కామ్దేన్ లో ‘’కామ్ ‘’గా ఉంటున్నాడు .ఒక్కసారిగా ముసలి వాడైనట్లు కని  పించాడు .డిప్రెషన్ ,ఫిట్స్ తో బాధ పడ్డాడు .పుస్తకాలను ఎవరూ ప్రింట్ చేయటానికి ముందుకు రానందుకు కున్గిపోయాడు .అదే  ఆధారం అనుకొంటే ఇలా అయింది .కొద్ది గా ఆరోగ్యం బాగు అవగానే కొలరాడో వెళ్లి లింకన్ పై ఉపన్యాసాలిచ్చాడు .’’లిలాక్స్ లాస్ట్ ఇన్ ది డోర్ యార్డ్ బ్లూమేడ్ ‘’కవిత ను ‘’నేటివ్ క్లాసిక్ ‘’అని అందరూ కితాబిచ్చారు .అరవై అయిదు లో చిన్న దీపం ,చుట్టూ న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు .చని పోయిన సైలర్ భార్య ఇంటిని కని  పెట్టుకొని ఉండేది .అభిమానులు చందాలు పోగు చేసి పంపితే దానితో జీవించాడు .ముప్ఫై మంది శ్రేయోభిలాషులు ఒక గుర్రబ్బండీని సమకూర్చారు .

అరవై తొమ్మిది లో పక్ష వాత లాక్షణాలు కని పించాయి .కిడ్నీ బాధ ఎక్కువైంది .డెబ్భై వ పుట్టిన రోజున ఫిలడెల్ఫియా వెళ్లి లింకన్ పై ప్రసంగించాడు .చని పోతున్నా ఓడిపోకుండా ఉంటున్నాడు.ఒంటరిగా మేడ గదిలో .చనిపోతానని తెలిసి సమాధి నిర్మాణం గురించి ఆలోచించాడు .అప్పగింతలన్నీ పూర్తీ చేస్తున్నాడు .డెబ్భై రెండు లో చివరి ఎడిషన్ గా1891 లో లీవ్స్ ఆఫ్ గ్రాస్ ప్రచురించాడు .దీన్నే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అన్నారు .మొదట పన్నెండు తో మొదలైన పుస్తకం ఇప్పుడు మూడు వందలకు పైగా కవితలతో బృహత్ రూపం గా విట్మన్  కవితా విశ్వ రూపం గా అవతరించింది .న్యుమోనియా సోకి 26-3-1892న మానవేయ మహా కవి విట్మన్ మరణించాడు .పెళ్ళికాని బ్రహ్మ చరిగానే మిగిలి పోయాడు .విట్మన్ ఫిలాసఫీ లో అన్ని కలగా పులగం గా కలిసి పోయాయి .అమెరికాపై రాసిన ‘’సాంగ్ ఆఫ్ ఎక్స్పో జిషన్ ‘’ఒక జాటీయ గీతం లాంటిదే .అన్ని రాష్ట్రాలను అన్ని దేశాలను కలిపాడు విశ్వ పౌరుడనిపించాడు .

‘’Whitman became the voice of  a rapidly developing civilization .half idealistic half materialistc some times corrupt  but ever expanding America ‘’

అమెరికాను అమెరికా గా గుర్తించటానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేశాడు. ఇంగ్లీష్ భావ దాస్యానికి దూరం చేశాడు .జాతీయ రక్తం ప్రవహింప జేశాడు .ప్రజా స్వామ్య మానవుడి భవితను నిర్దేశించాడు .తను చేస్తున్న పనేమిటో పూర్తీ అవగాహన ఉన్న వాడు .’’I have allowed the stress of my poems from beginning to end to bear upon American individuality and assist it –not only because that it is a great lesson in nature ,amid all her generalizing laws ,but as counterpoise to the leveling tendencies of democracy ‘’అని ఆరాట పడిన దేశ భక్త కవి .లీవ్స్ లో అతనికల సాకారమైంది .అదొక మాన్యుమెంటల్ బుక్ అయింది .’’it is a national phenomenon in which a poet identifies himself not only with a continent but with the cosmos .uttering the word democratic the word en-masse ‘’he sings seemingly of himself but actually ‘’

.’’of life immence in passion pulse and power –cheerful ,for forest action ,formed under the laws divine –the modern man I sing ‘’అని ఆధునిక మానవుడికోసం గీతాలు రాశాడు గానం చేశాడు .దేశం కోసం తన వీర విధేయతను ప్రదర్శించాడు .తన ‘’గడ్డిపరకలు ‘’గురించి విట్మన్ ఏం చెప్పాడో తెలుసుకొంటేనే మజా –

‘’this is no book .who touches this ,touches a man ‘’అని పొంగిపోయి చెప్పాడు సాహిత్య చరిత్రలో పుస్తకాన్ని మనిషిని ఒకటిగా చేసిన కవి రచయితా లేనే లేదు .’’in it Whitman emerges a titanic and controversial figure –messianic ,intuitive ,and often mistaken ,roughhewn ,and lopsided ,but un questionably the most challenging writer of his time and of ours ‘’అని కీర్తి కిరీటం పెట్టారు .త్రాన్సలిండేజం ,రియలిజం ల మధ్య నిలిచాడు .’’the proof of a poet is that his country absorbs him as affectionately as he has absorbed it ‘’ అని చెప్పాడు .గడ్డిపరకలు అమెరికన్ మహా కావ్యం అయింది .Whitman is American poet .he is America ‘’అని మనస్పూర్తిగా మెచ్చాడు ఎజ్రా పౌండ్.బీట్ ఉద్యమానికి ప్రతినిధిగా వాగా బాండ్ గా నిలిచాదన్నారు .అతని అనుచరుల్ని ‘’ విట్మనైట్స్’’ అని పిలువ బడ్డారు .ఎందరో సంగీతకారులు అతని కవితలకు సంగీతం సమకూర్చి అజరామరం చేశారు .

 

Walt Whitman - George Collins Cox.jpg

 

కవిత్వం లో ఆత్మాన్వేషణ చేసిన –ఎమిలీ డికిన్సన్

10-12-1830 లో మాసాచూసేట్స్ లోని ఆంహెర్స్ట్ లో ఎమిలీ డికెన్ సన్  పుట్టింది .తండ్రి గ్రామీణ లాయర్ ,లెజిస్లేటర్ ,ప్రభుత్వ కౌన్సిల్ మెంబర్ .బాల్యం నుండే తిరుగు బాటు ధోరణి ఉండేది .మౌంట్ హోలీ యెక్ ఫిమేల్ సేమిటరి లో చేరింది .అక్కడి బోధనా మత పద్ధతిలో ఉండేది .మత గ్రంధాలను అందరూ బట్టి పట్టి చెబితే వాటి అంతరార్ధాన్ని గూర్చి ఆలోచించేది .క్రిస్టియన్ కావటానికి వ్యతిరేకత లేదని ఒక సారి క్లాసులో చెప్పింది .నల్ల కళ్ళు తెల్ల శరీరం ఒత్తైన జుట్టు తో అందం గా ఉండేది .

యుక్త వయసు రాగానే కవిత్వమే శ్వాస  అయింది .ఆమే కు సెక్రెట్ లవర్స్ ఉన్నారని చరిత్రకారులు రాశారు .ముప్ఫై రెండేళ్ళ వయసులో థామస్ హిగ్గింసన్ కు ఉత్తరం రాసి తన మనసులోని ఇద్దరి మగాళ్ళ గురించి తెలిపింది .న్యూటన్ తనకు ‘’అమరత్వం ‘’బోధించాడని అన్నది .

‘’my life closed twice before its close –it yet remains to see –if immortality unveil –a third event to me –‘’అని మనో భావాన్ని ఎరుక పరచింది .’’angels twice descending –reimbursed my store-burglar banker  father –I am poor once more’’అని ఎదురు చూసింది .న్యూటన్ చని పోయిన తర్వాత తండ్రితో వాషింగ్ టన్ ,ఫిలడెల్ఫియా లు చూసింది .ఇరవై మూడు లో ప్రెస్బిటేరియన్ చర్చి లోని చార్లెస్ వాడ్స్ వర్త్ ను ప్రేమించింది .ఆయనకు దేవుడి ధ్యాసేకాని’’ ఈ దేవీ ‘’ధ్యాసే లేదు .ఆంహీర్త్స్ కు తిరిగొచ్చి అపస్మారకం గా ఏదేదో రాసి పారేసేది .’’I can’t live with you –it would be life –and life is over there-‘’మొదలైన కవితలు రాసింది .విరహం భరించలేక ‘’so we must keep apart –you there I here –with just door ajar –that oceans are –and prayer –that pale sustenance –despairఅని నిరాశగా రాసు కొంది .తనను తానూ అంకితం చేసుకొంటానని ‘’a wife at day break I shall be –sunrise ,hast thou a flag for me ?at midnight I am but a maid –how short it takes to make it bride ! అంటూ మన ‘’మీరా బాయి ‘’లా వలపు వల విసిరింది .

తండ్రి చనిపోయాడు .అప్పటి నుండి అంటే ఇరవై అయిదు నుండి డికిన్సన్ ఒంటరిగా ఉండిద పోయింది .నలభై లో తండ్రి చిరకాల మిత్రుడు ,మాసా చూసేట్స్త్ సుప్రీం కోర్ట్ లో అసోసియేట్ జస్టిస్అయిన ఓటిస్ పి లార్డ్ కు సుదీర్ఘ ఉత్తరం రాసింది .1883 ఆరోగ్యం దెబ్బతిని ,శోక దేవతగా సుదీర్ఘ కాలం ఉండటం తో నరాలు బాల హీనమై ‘’బ్రైట్స్ డిసీస్ ‘’వచ్చి 15-5-1886న యాభై ఆరో ఏట చని పోయింది .ఆమె చని పోయిన చాలా కాలానికి కాని రచనలు ప్రచురణ కాలేదు .ఆమె సోదరి లావీనియా అన్ని రాత ప్రతులను స్వాధీన పరచుకొంది .పక్కింటి ఆయన మేబల్ టాడ్ స హాయం తో నూట పది హీను కవితలను లిస్టు రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ ఎమిలి  డికేంసన్ ‘’పేర1890లో పబ్లిష్ చేసింది .ఏడాది తర్వాత మరో నూట డెబ్భై ఆరు చేర్చి రెండవఎదిషన్  గా తెచ్చింది .ఎమిలీ ఉత్తరాలను రెండు వాల్యూములుగా తర్వాత తెచ్చారు .ఇవన్నీ సరైన పద్ధతిలో లేవు .ఆమె రాత అర్ధం కాక పోవటం గజి బిజీ గా ఉండటం తో సందిగ్ధత వచ్చింది .

లావియానా పక్కింటి టాడ్ తో స్థలం విషయమై తగాదా పడింది .కోర్ట్ కేసులు వచ్చాయి .ఆమె మరణం తో ఎమిలీ ఆస్తి పాస్తులన్ని మార్తా డికిన్సన్ కు దక్కాయి ‘’ది సింగిల్ హౌన్డ్ ‘’పేర ఇదివరకు ప్రచురిమ్పని 143 కవితలు అచ్చేశారు .ఎమిలీ చనిపోయిన యాభై ఏళ్ళకు ఇంకో నూట ముప్ఫై కవితలు దొరికి 1945లప్ ప్రచురింప బడ్డాయి1958 డికిన్సన్ ఆరాధకులు మూడు గ్రంధాలుగా ఆమె వచన సాహిత్యాన్ని  వెయ్యి ఉత్తరాలతో సహా ముద్రించారు .వీటితో ఆమె కవితా స్వరూపం తెలుసుకొనే వీలు కలిగింది .ఆమె కవితలు క్రమ విధానం లో ఉండవు. ఆలోచనలూ కొద్ది పాటివే .ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలుతుంది .ఒకదానితో ఒకటి కలిపేస్తుంది .కొన్ని పలుకు బడులు అర్ధమవటం కష్టమే .

‘’the brain is wider than the sky –for ,put them side by side –the one the other will contain –with ease ,and you beside .’’

 

 

స్ప్రుంగ్ రిథం ను ప్రవేశ పెట్టిన –   జేరాల్డ్  మాన్లి హాప్కిన్స్

హాప్కిన్ కూడా ఎమిలీ  డికేంసన్  లాగే చనిపోయిన తర్వాతే వెలుగు లోకి వచ్చాడు .ఆధునికకాలపు పాత ధోరణి కవి .మధ్యతరగతి వాడు .శతాబ్దాలుగా రైతులు .గ్రేట్ బ్రిటన్ లో హవాన్ కౌన్సెల్ జెనరల్ గా తండ్రి పని చేశాడు .అనారోగ్యం తో తండ్రి నలభై ఏళ్ళకే చనిపోయాడు .ఎనిమిదో ఏట కుటుంబం హాంప్ స్త్రేడ్ కు మారింది . 28-7-1844 లో హాప్కిన్స్ స్ట్రా ఫర్డ్ ఎస్సెక్స్ లో పుట్టాడు .గ్రామర్ స్కూల్ లో చదివి పదిహేనవ ఏట రాసిన ‘’ది ఎస్కోరియాల్ ‘’కవితకు బహుమతి పొందాడు .ఆక్స్ ఫర్డ్ బిల్లియోల్ కాలేజి లో చేరి ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జెస్ వద్ద చదివాడు .సునాయాసం గా కవితలల్లే వాడు బొమ్మలేసేవాడు .’’trees by their yield –are known  but I –my sap is sealed –my root is dry –if life within –I none can show (except for sin )-nor fruit above –it must be so –I do not love ‘’మొదలైన అందమైన కవితలు రాశాడు .’’I have desires to go-where spring not fail –to fields where flies no sharp and sided hail –and a few lilies blow ‘’వంటివి అద్భుతంగా రాశాడు చర్చ్  ఆఫ్ ఇంగ్లాండ్ లో ఇమడలేక కేధలిక్ అయ్యాడు .చివరి పరీక్ష తర్వాత రోహామ్ప్ టన్లో ‘’సాహిత్య శాస్త్రం ‘’(రేటారిక్ )లో ప్రొఫెసర్ అయ్యాడు .మూడేళ్ళు పని చేసి ప్రీస్ట్ హుడ్ కు సన్నాహం లో ఉన్నాడు .పదేళ్ళు కవిత్వం జోలికే పోలేదు .

పై అధికారి తేమ్స్ నదిలో  జర్మన్ స్టీమర్ ‘’ద్యూచ్ లాండ్ ‘’ మునిగి ఎందరి ప్రాణాలో నీటిలో కలిసి పోయి న విషాద దృశ్యాన్ని గురించి రాయమంటే మళ్ళీ కలం పట్టి  రాశాడు .ఇది వరకు ఎవరూ ఉపయోగించని కొత్త భాషలో ,తన జీవిత చరిత్రను జోడించి అత్యంత విషాదాత్మక కధనం గా రాశాడు .1877లో హాప్కిన్స్ కు ఆర్డినేషన్ జరిగింది .నలభై కే అధిక శ్రమ తో ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది .డబ్లిన్ యూని వర్సిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ క్లాసిక్స్ ‘’అది రోహించాడు కవిత్వం రాయటమే కష్టమైంది .జీవిత చరమాంకం లోనే గొప్ప కవిత్వం రాశాడు .నలభై అయిదవ ఏట ‘’ఐ యాం సో హాపీ ‘’అనుకుంటూ అనాయాసం గా మరణించాడు .

హాప్కిన్స్ చని పోయిన ముప్ఫై ఏళ్ళకు 1918లో ‘’పోయెమ్స్ ఆఫ్ జేరాల్ద్ మాన్లీ హాప్కిన్స్ ‘’పేరిట కొన్ని కవితలను బ్రిడ్జెస్ అనే ఆయన సేకరించి ముద్రించాడు .హాప్కిన్స్ కవిత్వం అంత తేలికగా  అర్ధం కాదు. కఠిన పదాలు అన్వయ క్లిష్టత ఇబ్బంది పెడతాయి .’’or to-fro tender trambeams truckle at the eye ‘’ఇదీ ధోరణి .అలంకారాలను మధ్యలోనే వదిలేసి గందర గోళం సృష్టిస్తాడు .భరించటం కష్టమే నని పిస్తుంది .సాంప్రదాయ కవితను ఇమేజరీ తోకలిపి రాశాడు .’’స్ప్రుంగ్ రిధం ‘’ను ప్రవేశ పెట్టాడు .రొమాంటిక్ –మోడరన్ కవులకు వారధిగా నిలిచాడు .

GerardManleyHopkins.jpg

 

 

ఇరవైయవ శతాబ్ది ఉదయం

పందొమ్మిదో శతాబ్దం తమాషా గా అంతమైంది .మర్యాద పద్ధతుల్ని అడ్డుకొన్నారు .అనేక భూమికలేర్పడ్డాయి .యువతులు పెద్దలపై తిరుగు బాటు చేశారు .మహిళా వోటు హక్కు ఒక ధ్యేయమైంది .యువకులు నిత్య ప్రార్ధనలకు వెళ్ళే వారు కాదు ‘’.ది సావాయ్ ‘’,ది ఎల్లో బుక్ ‘’అనే రెండు మేగజైన్లు ఈ హక్కులకు వేదికగా నిలిచాయి .ఎర్నెస్ట్ డౌసన్ అనే కవి తెగ తాగి ముప్ఫై మూడుకే చచ్చాడు .లిఒనేల్ జాన్సన్ అనారోగ్యం తో ముప్ఫై అయిదేళ్ళకే పోయాడు .జాన్ డేవిడ్ సన్ తిరస్కరణకు గురై యాభై అయిదులో ఆత్మ హత్య చేసుకొన్నాడు .ఆర్టిస్ట్ ఆబ్రే బియర్డ్స్ఇరవై ఆరుకే క్షయ తో చనిపోయాడు .కవి, రచయితా ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ఎనభై దాకా జీవింఛి నాటకాలు కవితలు రాసి సెన్సేషన్ సృష్టించాడు .ఆస్కార్ వైల్డ్ యాభై ఆరులో జైలు పాలై రెండేళ్ళ తర్వాత రచనా లోకం నుండి నిష్క్రమించాడు .

వీరికి  ఒక ధ్యేయం లేదు జీవిత సూత్రం లేదు .అయితే ‘’కళకళకోసమే’’ అని మాత్రం నిన దించారు .గిల్బర్ట్ మాత్రం ఒక కన్ను బ్రిటిష్ ప్రజల మీద రెండో కన్ను ఫ్రెంచ్ వాళ్ళపై ముద్ర వేయటం పైనా ఉంచాడు .లండన్ ఇనుప కచ్చడాల మధ్య నలిగింది .దీన్నే ‘’ఫాల్లెన్ మాగ్డ లేన్సేస్’’అన్నారు .విక్టోరియన్ శకం ముగింపు కొచ్చింది .ఏ బ బాల్ రూమ్ కు వెళ్ళినా అరడజను మంది  చెట్టా పట్టా లేసుకొని సానేట్స్త్స్ పాడుకొంటూ కనిపించారు .ఇంగ్లీష్ యువకులు ఫ్రెంచ్ పార్నాసియాన్ లను అనుకరించారు .పతనమై పోతున్న సంస్కృతికి అద్దం పట్టింది .’’fin de siecle’’అని దీనికి పేరు పెట్టారు .క్షీణ సంస్కృతీ అనవచ్చు .’’a swan song and a death bed repentence ‘’అని వాపోయారు .దింపుడు కళ్ళం ఆశ అన్నమాట .పదేళ్ళు ప్రభావం చూపిన ఆస్కార్ వైల్డ్ ఒక అభియోగం లో ఇరుక్కొని అతని ‘’ఈస్థటిక్ ఉద్యమం ‘’పతనమైపోవటానికి సిద్ధమైంది .గిల్బర్ట్ రాసిన ‘’పెషేన్స్ ‘’లోని సెటైర్లు ,రాబర్ట్ హిచిన్సన్ రాసిన ‘’గ్రీన్ కార్నేషన్ ‘’చావు దెబ్బలే కొట్టాయి .జీవితం అస్తవ్యస్తమై విపరీత ధోరణులకు నిలయమై పోయింది .

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లోనూసంస్కృతీ లో  ద్వంద్వ ధోరణలు వచ్చాయి .కొత్త ఆలోచనలు భావాలు ,చెప్పటం లో నూతనత్వం ఒక ప్రక్కన ,పాత పద్ధతులే శరణ్యం అని మరో ప్రక్కన ద్రుక్పదాలేర్పడ్డాయి .ఒకే వ్యక్తీ ఈ రెండిటిలోనూ నిష్ణాతుడై రాసిన వారున్నారు .కొందరు ఒకే దాన్ని పట్టుకు పాకులాడారు .విధాన భేదాలేర్పడ్డాయి .’’the proper school to learn art in is not life but art ‘’అన్నాడు ఆస్కార్ వైల్డ్ .కాని ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ‘’life and nature were merely the crude materials which were to be woven cunningly into beautiful patterns ‘’అని చెప్పాడు ఈ భిన్న పాయలలో సాహిత్యం ప్రయాణించింది .ఫ్రాన్సిస్ థామ్సన్ మాత్రం సనాతన  భగవదన్వేషణ లోమునిగి పోయి కవిత్వం రాశాడు .ఆయన్ను గురించే మనం తర్వాత  తెలుసుకో బోతున్నాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45

అమెరికా కవులు –

మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని  కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా చదివి నా ప్రాక్టీస్ చేయలేదు .ఆఫీసు పెట్టినా క్లైంట్ ల కంటే పబ్లిషర్లు ఎడిటర్లను ఆకర్షించాడు .’’పెన్సిల్వేనియా ఫ్రీమన్ ‘’పేపర్ లో బానిసత్వ నిర్మూలనపై వ్యాసాలూ రాశాడు .మెక్సికో తో యుద్ధం వలన బానిస రాష్ట్రాలు  పెరుగుతాయని భావించాడు ‘’బిగ్లో పేపర్స్ ‘’లో సెటైర్లు దంచి రాశాడు .మొదటి కవితా సంపుటి ముద్రించాడు .ఇరవైలో ‘’ది విజన్ ఆఫ్ సర్ లాంఫాల్ ‘’రాసి రొమాంటిక్ అభిరుచి ఉన్నవారిని ఆకర్షించాడు .బిగ్లో పేపర్స్ లో ‘’బోస్టన్ కొరియర్ ‘’ ప్రారంభించి భిన్నత్వ ధోరణిలో నడిపాడు .యుద్ధ వ్యతిరేకం గా ఎన్నో కవితలు రాసి మెప్పించాడు .

‘’ez for war I call it murder –there you have it plain an flat –I donot want to go no further ‘’అన్నాడు ‘’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’రాసి తేలిక విషయాలపై దృష్టినీ పెట్టాడు .ఎమర్సన్ పో ,బ్రయంట్ మొదలైన వారి నందరిని ఉతికి ఆరేశాడు .

ఒక ఏడాది యూరప్ లో గడిపాడు .భార్య చనిపోయింది రచనలో మునిగాడు .లాంగ్ ఫెలో చైర్ కు ఎంపికైఆధునిక భాషలపై అనేక ఉపన్యాసాలిచ్చాడు .జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ భాషల్లో పండితుడైనాడు .స్పెయిన్ దేశానికి మంత్రి అయ్యాడు .రెండవ భార్య ఇంగ్లాండ్ లో ఉండగా చనిపోయింది .అమెరికా తిరిగి వచ్చి అనేక విమర్శనాత్మక వ్యాసాలూ రాశాడు .పది వాల్యూముల గ్రంధ రచన చేసిన ఉద్దండ పండితుడు .వందేళ్ళ వరకు రాయాల్సిన వన్నీ సిద్ధం చేసుకొన్నాడు .కాని పుట్టిన ఇంటిలోనే 12-8-1891న డెబ్భై రెండేళ్లకే చనిపోయాడు ..మధురమైన భాషలో కవిత్వం రాశాడు .రైమింగ్ బాగా తెలిసిన వాడు .మాండలికానికి హోదా ,గౌరవం కల్పించాడు .నిజాయితీ గా అసలైన యాంకీ గా ‘’హ్యూమర్ ను హ్యూమన్ ‘’ను మేళవించాడు .అమెరికం రొమాంటిక్ కవిగా ,’’ఫైర్ సైడ్ ‘’కవుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు .’’who ever is most universal is most national ‘’అని అంటాడు .బోస్టన్ ,హార్వర్డ్ బ్రాహ్మిన్ కల్చర్ కు ప్రతినిధి .ఆధునిక సివ్ల్ రైట్స్ ఉద్యమానికి ప్లాట్ ఫారం నిర్మించాడు .’’ది ప్రెసెంట్ క్రిసిస్ ‘’కవిత సివి ల్  వార్  కల్లోలాన్ని దృష్టికి తెచ్చింది .

James Russell Lowell circa 1855.jpg

 

 

అన్ని ప్రక్రియలకు ఆద్యుడు – ఎడ్గార్ అల్లాన్ పో

పేరులోనే ‘’ఎలోన్ ‘’ఉంది కనుక ఒంటరివాడుగానే జీవించాడు  .జీవితం లోని కస్టాలు దుఖాలకు కుంగి విచారమే పరమావధిగా ప్రవర్తించాడు ,రాశాడు  .తల్లీ తండ్రీ ఇద్దరూ స్టేజి నటులే .మాసా చూసేట్స్ లోని  బోస్టన్ లో19-1-1809 న జన్మించాడు .రిచ్మాండ్ లో న్యుమోనియా వచ్చింది .తండ్రి తరఫు తాత పెంపకం లో పెరిగాడు .రిచ్మాండ్ వ్యాపారి జాన్ అలన్ సంరక్షణ లో ఉన్నాడు .అలాన్ కు పిల్లల్లేరు .ఇంగ్లాండ్ లో మంచి స్కూల్ లో చేర్పించాడు అక్కడ ఒంటరితనం బాధించి ‘’ది లేక్ ‘’కవిత రాశాడు ‘’death was in that poisonous wave –and in its gulf a fitting grave –for him who thence would solace bring –to this lone imagining ‘’అని భావ గర్భిత కవిత రాశాడు .అమెరికా తిరిగి వచ్చిఒక స్నేహితుని తల్లి  మిసెస్ స్తానర్డ్ పై తల్లి భావం తో ప్రవర్తించాడు .వర్జీనియా వర్సిటిలో చేరి శ్రద్ధ చూపకుండా తాగుడులో పడి గెంటి వేయ బడ్డాడు .పెంపుడు తండ్రి అలాన్ తో పోట్లాడి బయటికొచ్చేశాడు .’’టామర్లేన్ ‘’ ‘’బై ఏ బోస్తోనియన్ ‘’అని తన పేరు లేకుండా రాసి ప్రచురించాడు .ఎవరికీ పట్టలేదు .రెండేళ్ళు సైన్యం లో పని చేసి ,అలాన్ వలన బయటికొచ్చాడు .మళ్ళీ అలాన్ తో పోట్లాడి తాగుడుతో చనిపోతున్న తమ్మిడికి సేవ చేశాడు .మళ్ళీ వెస్ట్ పాయింట్ లో ఉద్యోగం పొందాడు .అధికారుల ఆజ్ఞలను ఉల్లంఘించి నందుకు ఉద్యోగం లోంచి తప్పించేశారు .

పెంపుడు తండ్రి అలాన్ తో మళ్ళీ పోట్లాడి ,అతనేమీ ఇవ్వక పోయేసరికి’’ పెన్నీ లెస్ ఫెలో’’ గా రోడ్డున పడ్డాడు పో .అనారోగ్యం తాగుడు ,దరిద్రం నిరాశ దుఖం ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .సృజనాత్మక రచనలు చేశాడు .ఒక కదా రాస్తే యాభై డాలర్ల ప్రైజ్ వచ్చింది .కజిన్ వర్జీనియాను పెళ్లి చేసుకొన్నాడు .అనేక పత్ర్తికలకు ఎడిటర్ గా పని చేసి వదిలేశాడు .తాగనిదే ఉండ లేక పోయేవాడు కిక్కు కోసం తాగి జీవితాన్నికిక్ చేసుకొని  నాశనం చేసుకొన్నాడు .కుటుంబాన్ని ఫోర్డ్ హాం కు మార్చాడు.కుటుంబ  బాధ్యతలనుంచి ఎప్పుడూ వెనక్కు పోలేదు .భార్య చనిపోయింది .మరీ విషాదం లో మునిగాడు .తల్లి లేని లోటును జీవితాంతం అనుభవించి వేదన చెందాడు .అందుకే రచనలలో మాత్రుభావానికి పెద్ద పీట వేస్తాడు .

ముప్ఫై ఎనిమిది లో న్యూరోటిక్ ,గా మతి స్తిమితం లేని వాడుగా మారి పోయాడు .విధవ రాలైన సారా విలియం విట్మన్ తో కలిసి ఉన్నాడు .అస్తిమితత్వం తో ఆత్మా హత్యా ప్రయత్నాలు చేశాడు .భ్రమ, భ్రాంతులతో చివరి రోజులు గడిపాడు .ఎవరూ పట్టించుకో లేదు .రోడ్ల వెంబడి పది తిరిగే వాడు .అంత గొప్ప కవి అనాధగా రోడ్డు పక్క మురికి కాలవ దగ్గర పడి7-10-1849 లో నలభై రాకుండానే చనిపోయాడు .

‘’almost without the first sign of moral principle or the simpler affections of the heart ,poe;s verses illustrate an intense faculty of technical and abstract beauty with the rhyming art to excess ,an incorrigible propensity toward nocturnal themes and demoniac under tone behind every page ‘’ అని వాల్ట్ విట్మన్ ప్రశంసించాడు .అన్ని విషయాలలో అందమైన అమ్మాయి చావు ను వర్ణించాడు .క్రియ కు అత్యంత ప్రాధాన్యత నిచ్చి కవిత్వం రాశాడు .కవిత్వం అంటే ‘’is opposed to a work of science by having ,for its immediate object ,an idefinite instead of a definite pleasure being a poem only so far as the objects attained .అని అభిప్రాయ పడ్డాడు పోప్.గోల్డ్ బాగ్ రెవిన ,మర్డర్ ఇన్ ర్యు మాంటేగ్ ‘’కవితలు అతని ప్రతిభకు నిదర్శనాలు .దెయ్యాలు భూతాల కధలు రాశాడు .డిటెక్టివ్  కధలల్లాడు. కవిత్వం పై గొప్ప వ్యాస పరంపర రాశాడు .చివరగా ‘’poe;s poems are full of the music of another sphere ,a shadowy half world ,out of space ,out of time ,where Poe;s spirit was un happy at home ‘’అని అంచనా వేయ వచ్చు .మిస్టరి కధలకు ఆద్యుడు .కవిత్వం రాసి జీవితం గడప వచ్చునని రుజువు చేసిన కవి .గోదిక్ రచనలలో సుప్రసిద్ధుడు .హారర్ కదల సృష్టికర్త .పజిల్ నిర్మాత సాహిత్య విమర్శన లో శిఖరాగ్రాన నిలిచాడు ..నిర్దాక్షిణ్య సంపాదకీయాలు సాహితీ విమర్శలు చేశాడు .యూరప్ అంతటా ఆరాధనీయుడైన కవి .ఫిజిక్స్ లోను కాస్మాలజి  లోను ప్రవీణుడు .’’యురేకా’’ నుపూర్తీ  అంతరజ్ఞానం తో (ఇంట్యూషన్ )రాసి మెప్పు పొందాడు .’’క్రిప్టోగ్రఫీ ‘’అంతు చూసిన వాడు .చిన్నకధలు నాటికలు రాసి సుసంపన్నం చేశాడు .

Inline image 1

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44

అమెరికా కవులు

బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత  1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం  ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు వందేళ్ళ తర్వాత క్లాయోన్ బిషప్ వేదాంతి  జార్జి బెర్క్లీ  కొన్ని కవితలను ‘’ఆన్ ది  ప్రాస్పెక్టస్ ఆఫ్  ప్లాంటింగ్ ఆర్ట్స్ అండ్ లెర్నింగ్   ఇన్ అమెరికా ‘’రాస్తూ ,అమెరికా లో కవిత్వం రాయటానికి కొత్త విషయాలున్నాయన్నాడు .బెర్కిలీ ఆశాభావం తో కవిత్వం అల్లాడు .కాలనీ కాలం అంతా పాత ధోరణి సామేతలతోనే కవిత్వం సాగింది .అమెరికాలో మొదటి కవయిత్రి ,న్యూ ఇంగ్లాండ్ గవర్నర్ కూతురు ,ఇంకో గవర్నర్ భార్య అయిన ‘’అన్నే బ్రాడ్ స్ట్రీట్ ‘’1612-1672)గుర్తింపు పొందింది .తన కవితా సంకలనానికి ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లీ స్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’అని అర్ధవంతమైన పేరు పెట్టింది .పాత రొడ్డు కవిత్వ ధోరణిలో కాకుండా స్పెన్సర్ ,,రాలీ ,ఫ్రెంచ్ కవి ద్యు బర్తాస్ వంటి ప్రముఖుల ప్రభావం తో రాసింది . 1624-1729కాలం వాడైన ఎడ్వర్డ్ టైలర్ రాత ప్రతులు ఆయన చని పోయిన రెండు వందల ఏళ్ళ తర్వాత కాని బయట పడ లేదు ,టేలర్ మెటాఫిజికల్ గా  మత భావ స్పూర్తి గా హెర్బర్ట్,డోన్నెల మార్గం లో  రాశాడు .న్యూ ఇంగ్లాండ్ నుంచి న్యూ జేర్సికి కవిత్వపు సీనుమార్చిన వాడు 1752-1832కాలం వాడైనఫిలిప్  ఫ్రే న్యూ ‘’.అతను రాసిన ‘’ది ఇండియన్ బరియల్ గ్రౌండ్ ‘’మొదలైన కవితలలో స్థానిక విషయాల ప్రస్తావన ఉన్నా ,పద్దెనిమిదో శతాబ్ది ఇంగ్లీష్ పధ్ధతి లోనే రాశాడు .స్వంత సీమ భావం తో రాసిన మొదటికవి ,’’అమెరికా కవిత్వ పిత ‘’విలియం కల్లెన్ బ్రయాంట్ .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

అమెరికా కవిత్వ జనకుడు –విలియం  కల్లెన్ బ్రయాంట్

ఇంగ్లీష్ కవులు పోప్,నుండి కూపర్ దాకా మరీ ముఖ్యం గా ‘’రాబర్ట్ బ్లైర్ ఇంకా చెప్పా లంటే ‘’గ్రేవ్ యార్డ్ స్కూల్ ‘’ప్రభావం తో విలియం కల్లెన్ బ్రియాంట్ తన స్వంత బాణీ వాణి తో కవిత్వం చెప్పాడు .దీనితో అమెరికా కవిత్వానికి ఒక ‘’డిగ్నిటి’’అంటే గౌరవం ,పరువు లభించాయి .మే ఫ్లవర్ సంతతికి చెందిన వాడై  మాసా చూసేత్స్ లోని కమ్మింగ్ టన్ లో   3-11-1794న జన్మించాడు  .అర్భక జీవిగా  బతుకు తాడో లేడో అన్న  భావం తోపుట్టాడు .తల కాయ మామూలు కంటే పెద్ద సైజ్ లో ఉండేది .అక్కడి గ్రామీణ డాక్టర్ రోజూ మంచు నీటిధారలో ముంచి మామూలు సైజు కు తెచ్చాడు .ఆరోగ్య సూత్రం గా తండ్రి కొడుకును రోజూ తనతో అరణ్యాలకు నడకకు తీసుకొని వెళ్ళేవాడు .

రెండేళ్లకే చదవటం వచ్చేసింది .పదికి కవిత్వమే రాస్తే ‘’హాంప్ షిర్ గెజిట్ ‘’లో ప్రింట్ అయింది .పదమూడుకు జఫర్సన్ కు వ్యతిరేకం గా సెటైర్’’ది ఎంబార్గో ‘’ రాశాడు . పదిహేడు లో  పరిపూర్ణ  కవి అయ్యాడు .’’టానా టోప్సిస్ ‘’రాసి డెస్క్ లో ఉంచేశాడు  .ఎప్పుడో తండ్రి కంట బడితే ఆయన నార్త్ అమెరికన్ రివ్యూ ఎడిటర్ కు ఇస్తే చదివి ముచ్చట పడి నిరంతరం రాసి పంపించమని చెప్పాడు .అలాగే రాస్తే వేసేవారు పత్రికలో .ఈ కవితలు చదివిన రిచార్డ్ హెన్రి డొన్నా’’అట్లాంటిక్ సముద్ర ఈతీరం లో ఇలా అద్భుతం గా కవిత్వం రాసిన వాడేవరూ ఇంతవరకు లేరు ‘’అని శ్లాఘించాడు .రాసినవన్నీ పేపర్లు అచ్చువేశాయి మంచి రివ్యూలే వచ్చి ప్రోత్సహించారు .అప్పటికే లా చదివినా ప్రాక్టీస్ పై మనసు పోలేదు .విమర్శకులు ‘’అమెరికా నాయక కవి ‘’అని ప్రశంసిస్తున్నారు .ముప్ఫై అయిదులో ప్రసిద్ధ ‘’న్యూ యార్క్ ఈవెనింగ్ పోస్ట్ ‘’పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్ అయ్యాడు .జీవితాంతం ఇదే పోస్ట్ లో పనిచేశాడు .నలభై లో అయిదు కవిత సంకలనాలు ముద్రించాడు .ఫ్రాన్సెస్ ఫెయిర్ చైల్డ్ ను వివాహమాడా డు .

ప్రెసిడెంట్ లింకన్ బానిస విమోచనకు ఏంతో మనస్పూర్తిగా సహకరించి ప్రచారం చేశాడు ..ఇంగ్లాండ్ నవలా చక్ర వర్తి చార్లెస్ డికెన్స్ అమెరికా పర్యటనకు రాగానే ‘’బ్రియాంట్ ఎక్కడ?’’అని అడిగాడంటే అతని కీర్తి చంద్రికల వ్యాప్తి ఏమిటో తెలుస్తోంది .దేబ్భైలో కూడా మంచి ఆరోగ్యం గా ఉన్నాడు .నడక వ్యాయామం తో బాటు నిత్యం కవిత్వం రాసే వాడు .’’లైబ్రరి ఆఫ్ పోఎట్స్ అండ్ సాంగ్స్’’అనే బృహత్ గ్రంధాన్ని రివిజన్ చేశాడు .ఎనభై నాలుగవ ఏట న్యూ యార్క్ సెంట్రల్ పార్క్ లో ఇటలి దేశ భక్తుడు ‘’మజ్జిని ‘’ శిలా విగ్రహాన్ని మే నెలలో  ఆవిష్కరిస్తూ ,ఎక్కువ సేపు తల మీద టోపీ లేకుండా నిలబడి ఉండటం తో  ఎండ వేడికి తట్టుకోలేక కూలి పోయాడు మెదడుడలో రక్తనాళం గడ్డకట్టటం తో కోమా లోకి వెళ్లి పోయాడు .కొన్ని వారాల తర్వాత12-6-1878న ఎనభై నాలుగవ ఏట చనిపోయాడు .

యవ్వనం లో ముసలి వారికోసం ముసలి తనం లో పిల్లలకోసం రాశాడు బ్రియాంట్ .’’అమెరికా వర్డ్స్ వర్త్ ‘’అని అందరూ గౌరవం గా పిలిచే వారు .అతిసాదారణం గా ,స్వచ్చం గా ,పవిత్రం గా ఉండేవాడు .సరదా మనిషికూడా .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో లోవెల్ బ్రియాంట్ లోని లోపాలను తెలియ జేశాడు .అయితే వీరందరి కంటే ఎడ్గార్ అస్లేన్ పో ‘’ in character no man stands more loftily than Bryant .the peculiarity melancholy expression of his countenance has caused him to be accused of harshness or coldness of heart .Never was there a greater mistake .His soul is charity itself ,in all respects generous and noble ‘’అని ఖచ్చితమైన యదార్ధవివరణ చేశాడు .అమెరికన్ రొమాంటిక్ కవి గా పేరు .మార్టిన్ లూధర్ కింగ్ ఏంటో మెచ్చుకొని ఆయన చెప్పిన మాట ‘’truth crushed to earth will rise again ‘’అని పడే పడే గుర్తు చేసేవాడు .వాల్ట్ విట్మన్ కు ‘’మెంటార్ ‘’.

 

 

 

William Cullen Bryant Cabinet Card by Mora-crop.jpg

వ్యక్తిత్వ వికాస కవి   –రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

న్యు ఇంగ్లాండ్ కవిత్రయం గా ఎమర్సన్ విట్ట్టియర్ ,లాంగ్ ఫెలో లు గుర్తింపు పొందారు .సంస్కృతికి ఆనవాలుగా నిలిచారు .వీరి వలననే అమెరికా స్వంత గడ్డ పై   కవిత్వ బీజం  నాటబడి ,సాగు చేయబడి ,పోషింపబడి వికసిత పుష్పమై , అందంగా ఆకర్షణీయం గా  సువాసనలీనుతోంది .

‘’గాడ్ ఇంటాక్సికేటేడ్ యాంకీ ‘’గా పిలువాడే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 25-5-1803లో మాసా చూసేత్స్ లోని బోస్టన్ లో జన్మించాడు .తండ్రి వారసత్వం గా వచ్చిన యూనిటేరియన్ క్లేర్జిమన్ అయ్యాడు .మూఢాచారాలకు వ్యతిరేకి ..ఎనిమిదో ఏట తండ్రి చనిపోతే ఎనిమిది మంది సంతానాన్ని పోషించే బాధ్యతా ఎమర్సన్ పై పడింది. అందరి సానుభూతి సహకారం తో బాధ్యతను నేర వేర్చి పెంచి పెద్ద వాళ్ళను చేశాడు .అంత తెలివైన వాడు కాక పోయినా పందోమ్మిదేళ్ళకే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .కొంతకాలం స్కూల్ లో బోధించి తర్వాతా చర్చి మినిస్టర్ అయ్యాడు .ఎలెన్ లూసా టకర్ ను వివాహమాడి ,మినిస్టర్ పదవి వదిలేశాడు .ఇతరులకు బోధించటా న్ని సమర్ధించాడు .యూరప్ సందర్శించాడు .అదే జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .కార్ లైల్ వర్డ్స్ వర్త్ కవులతో సమావేశమై జీవితపు విలువలను అధ్యయనం చేశాడు .ఇంగ్లాడ్ తిరిగి లేక్ పోఎట్స్ ను చూశాడు .కార్ లైల్ కు సన్నిహితుడయ్యాడు .

తిరిగి వచ్చి కంకార్డ్ లో కాపురం పెట్టిలిడియా జాక్సన్ ను  రీండవ పెళ్లి చేసుకొన్నాడు .ప్రదేశాలు తిరుగుతూచాలా ఉపన్యాసాలిచ్చాడు .అసాధారణ మేధావిగా పండిన వేదాంతిగా గుర్తింపు వచ్చింది .’’మనిషి అంటే బంధుత్వాల కలయిక ,అస్తిత్వ వ్రేళ్ళ మూలం ‘’అనే వాడు .ఎవరు బాగా అర్ధం చేసుకొంటారో వారే గొప్ప .ఉత్సాహం లేకుండా దేన్నీ పొందాలెం హీరోయిజం కు రీజన్ అనవసరం అందుకే గొప్ప .వ్యక్తిలో ప్రపంచ భావన ఉంటేనే అది ఆకర్షిస్తుంది .మతం లో కొత్త ఆలోచనలు భావాలు వ్యాప్తి చెందించాడు ఎమర్సన్ .నలభై నాలుగులో ‘’పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఒక ఏడాది తర్వాతా ‘’మే డే అండ్ అదర్ పోయెమ్స్ ‘’తెచ్చాడు .వ్యాస సంకలనాలు రెండు ముద్రించాడు . డెబ్భై లో జ్ఞాపక శక్తి క్షీణించింది .లాంగ్ ఫెలో చని పొతే సమాధి దగ్గర ‘’అతను మంచి వాడు .కాని పేరు మాత్రం గుర్తుకు రావటం లేదు ‘’అన్న జ్ఞాని .సమాజానికి దూరమైపోయి కంకార్డ్ లో 27-4-1882లో డెబ్భై తొమ్మిదో ఏట మహా జ్ఞాని ,స్కాలర్ కవి వేదాంతి తత్వ వివేచనా పరుడు ఎమర్సన్ మరణించాడు .ఆయన వేదాంతం మానసిక మైంది .’’Emerson ;s poetry is both rich and casual –homespun cloth of gold –‘’అని లోవెల్ మెచ్చాడు .ఎన్నో భాషలలోని అనువాదం పొందిన రచనలు చేశాడు ముఖ్యం గా భారతీయ ఫిలాసఫర్లు ఎమర్సన్ ను ఆదర్శం గా భావించారు .

 

 

 

బానిసత్వ వ్యతిరేక కవి –  జాన్ గ్రీన్ లీఫ్ విట్టర్

ఎమర్సన్ లాగానే అనుదిన కర్మ కండను విట్టర్ వ్యతిరేకించాడు .తండ్రి వ్యవసాయ దారుడు 17-12-1807లో మాసా చూసేత్స్ లోని హావేర్ హిల్ లో పుట్టాడు చిన్నప్పుడే తండ్రితో పొలం వెళ్లి సాయం చేశాడు శీతాకాలం లో ఎనిమిది సెంట్లకు స్లిప్పర్ జత తాయారు చేసి అమ్మి ట్యూషన్ ఫీజు సంపాదించాడు మొదటి తరం అఎసత్రికి చేతిలో కేవలం ఇరవై అయిదు సెంట్లు మాత్రమె ఉన్నాయి ..దేనికైనా మైళ్ళకొద్దీ దూరం నడిచి తెచ్చుకోవాల్సి వచ్చేది స్కూల్ టీచర్ బుర్న్స్ కవిత్వ పుస్తకం ఇస్తే ఇష్టపడి చదివాడు .దాన్ని జీవితాంతం దగ్గర పెట్టుకొన్నాడు .పద్దేనిమిదేల్లకే ‘’ఫ్రీ ప్రెస్ ‘’మాసపత్రిక లో కవిత మొదటికవిత ప్రచురించారు .వరుసగా నూట యాభై కవితలు రాశాడు .బానిస వ్యతిరేకం గా ‘’జస్టిస్ అండ్ ఎక్స్పిదిఎంసి ‘’కరపత్రిక ముద్రించాడు ..బానిసత్వ వ్యతిరేకతపై స్పందించిన కవి రాజకీయ నాయకుడు అయ్యాడు .ఎమర్సన్ లాంటి ఫ్రీ థింకర్స్ బానిసత్వాన్ని సమర్ధించటం జీర్ణం చేసుకో లేక పోయాడు .

ఫిలడెల్ఫియా వెళ్లి ‘’పెన్సిల్వేనియా ఫ్రీమన్’’పత్రికకు సంపాదకుదయ్యాడు .బానిసత్వ నిర్మూలన సంఘానికి పెన్సిల్వేనియా హాల్ ను వేదిక చేశాడు .’’the crank of an opinion mill –making his rustic reed of song –a weapon in the war of wrong ‘’అని బాధపడ్డాడు .తర్వాత ‘’స్నో బౌండ్ ‘’లో తన కవితా శక్తియుక్తులన్నీ ప్రదర్శించాడు .ఎనిమిది సెంట్ లకు స్లిప్పర్ జత తయారు చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు అక్కడ ప్రముఖ సిటిజన్ అయ్యాడు .లిజేందరి ఫిగర్ అనిపించాడు .అతని ఎనభయ్యవ పుట్టిన రోజు జాతీయ పండుగ గా నిర్వహించారు .ఎనభై అయిదవ పుట్టిన రోజుకు కొన్ని నెలల ముందు 7-9-1892న విట్టర్ కవి మరణించాడు .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో రస్సెల్ లో వెల్ ‘’there is Whitttier ,whose swelling and vehement heart –strains the strait breasted darb of the Quaker apart –a fervor of mind which knows no separation –twixt simple excitement and pure inspiration ‘’అని మెచ్చుకొన్నాడు .’’సాంగ్ ఆఫ్ ది నీగ్రో బాట్ మాన్ ‘’అనేక ముద్రణలు పొందింది .క్వేకర్ ఉద్యమకవి గా కూడా ప్రసిద్ధుడు .

 

 

Inline image 1

హెన్రి వాడ్స్ వర్త్  లాంగ్ ఫెలో

లాంగ్ ఫెలో కవికి పాఠ్యపుస్తకాలు  తీవ్రఅన్యాయాన్ని  చేశాయి .చేత్తకవితలే ఎంచి ,వేసి ఆయన గౌరవ భంగం కల్గించాయి .అయన కవితలు నీతి బోదకాలు అంటూ అపచారమూ చేశారు .కనుక ఆయన అంటే వాల్ పోస్టర్ కవి అనుకొన్నారు .ఆకారమూ విలేజ్ మినిస్టర్ లా ఉండేది .’’వంటింటి కవి ‘’అని ముద్రపడింది .కాని అమెరికా కవుల్లో బాగా ప్రాభవ మున్న కవి లాంగ్ ఫెలో .ఇరవై నలుగురు పబ్లిషర్లు ఆయన రచనలను ప్రచురించాటమంటే అసామాన్య విషయమే .’’ది కోర్ట్ షిప్ ఆఫ్ మెయిల్స్ స్తాన్దిష్ ‘’పదివేల కాపీలుఒక్క రోజులోనే ఇంగ్లాండ్ లో  అమ్ముడయింది .’’ది సాంగ్ ఆఫ్ హైవత ‘’ప్రపంచ భాషలన్నిటిలోనూ అనువాదం పొందింది .కాని సమకాలీన కవులు లాంగ్ ఫెలోను’’ షార్ట్ ఫెలో ‘’గా భావించి అన్యాయం చేశారు .’’అమెరికా లోని భిన్న సామాజిక స్తితులపై విభిన్న మానవులపై ,సామాజిక వర్గాలపై ,వృత్తుల వారిపై విలువైన కవిత్వం రాసి మాబోటి వారికి మార్గ దర్శనం చేశాడు లాంగ్ ఫెలో ‘’అన్నాడు అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .సంవత్సర ఆదాయం యాభై వేల డాలర్లకు పైనే ఉండేది .’’ది హంగింగ్ ఆఫ్ ది క్రేన్ ‘’కవిత మూడు వేల డాలర్లు సంపాదించింది .

27-2-1807లో మెయిన్ లోని పోర్ట్ లాండ్ లో జన్మించాడు .తన బాల్యాన్ని ‘’a boy;s will is the wind;s will –and the thoughts of youth are long long thoughts ‘’అని రాసుకొన్నాడు .తండ్రికమ్మరి పని చేసేవాడు .చిన్నప్పుడే తను కవిని అవుతాననే నమ్మకముండేది లాంగ్ ఫెలోకి .ఇర్వింగ్ రాసిన దానికి అనుకరణగా ‘’స్కెచ్ బుక్ ‘’రాశాడు .పన్నెండో ఏట ‘’ది బాటిల్ ఆఫ్ లోవేల్స్ పాండ్ ‘’కవిత పోర్ట్ లాండ్ గెజెట్ లో అచ్చయింది .బోదేన్ కాలేజి లో చేరి అన్నిటా ప్రధముడు గా వచ్చాడు .’’చాతర్తాన్ అండ్ హిస్ పోయెమ్స్ ‘’పై రాయమంటే ‘’అవర్ నేటివ్ రైటర్స్ ‘’గా పేరు మార్చి రాసిన సాహసి .లాయర్ కావాలని లేదు .సాహిత్యం మీదే మనసు .ఆధునిక సాహిత్యం పై ఒక చైర్ ను ఏర్పరచి వచ్చి చేరమని బౌడెన్ ఆహ్వానిస్తే వెళ్లి చేరి పందొమ్మిదో ఏట దాన్ని నిర్వహించిన లేత కుర్రాడు అని పించాడు దీని వలన విదేశీ యాత్ర సాధ్యమైంది ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ జెర్మని వంటి దేశాలు తిరిగి సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ వారసత్వాన్ని తన దేశీయ అమెరికన్ కవిత్వం లో జోడించాడు ..ఇరవై నాలుగులో పదవి స్తిరపడింది మేరీ స్తోరేర్ పోటర్ ను వలచి పెళ్ళాడాడు బోధనపై పెద్దగా ఇష్టం లేక పోయినా పాతికేళ్ళు బోధనా చేసి హార్వర్డ్ ప్రొఫెసర్ అయ్యాడు .మళ్ళీ విదేశీయానం స్కాండినేవియన్ జర్మన్ సాహిత్యాన్ని అర్ధం చేసుకొని కార్లైల్ ను కలిసి విద్యా వేత్తతలతో మెదిలాడు .స్వీడిష్ భాష నేర్చాడు ఫిన్ని భాష లోని మహాకావ్యం ‘’కలేవేల ‘’ను జేర్ణం చేసుకొని తన ‘’హైవత ‘’లో ప్రతిబింబింప చేశాడు .

అమెరికా తిరిగి వచ్చి కరిగీ హౌస్ అనే చారిత్రాత్మక ప్రదేశం లో నివశించాడు .పదిహేనేళ్ళు చిన్నదైన ఫాని ఎలిజా ను వలచి వలపించి రెండో పెళ్లి చేసుకొన్నాడు .వీరి వివాహం బోస్టన్ లో పెద్ద పండగే అయింది .అయిదుగురు పిల్లల్ని కన్నారు .ఒక రోజు ప్రమాద వశాత్తు కొవ్వోత్తికి భార్య సమ్మర్ డ్రెస్ కు అంటుకొని కాలుతుంటే లాంగ్ ఫెలో పక్క రూమ్ లో నుంచి పరిగెత్తుకొని వచ్చినా ఆర్పలేక ఆమె పూర్తిగా కాలి చనిపోయింది .విచారం అలముకొన్నా కవిత్వం ఆగలేదు .’’పోయెమ్స్ ఆఫ్ స్లేవరి ‘’రాసి ఎవరూ చేయని సాహసం చేశాడు .ఇవాన్జిలీన్ మొదలైన లిరిక్స్ రాశాడు .ఇంకా గొప్ప రచనలు రావాల్సి ఉంది .

‘’టేల్స్ ఆఫ్ ఏ వె సైడ్ ఇన్ ‘’ప్రచురించి పేరు తెచ్చుకొన్నాడు .వయసు పబడిన కొద్దీ రచనా క వ్యాసంగం పెరిగింది .అరడజను పుస్తకాలు రాశాడు .నరాల జబ్బు బాధించింది హార్ట్ ఎటాక్ వచ్చింది .24-3-1882న చనిపోయాడు వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .కధలను మహాద్భుతం గా చెప్పాడు .కవిత్వం పర్వత ఝరి లాగా వేగం గా ప్రవహిస్తుంది .మార్గ దర్శిగా గుర్తింపు పొందాడు .అమెరికా గడ్డపై స్వంత కవితా సేద్యం చేసి అమూల్య ఫలాల నందించిన తోలి తరం కవులలో ముఖ్యుడు .అమెరికా కు సంపూర్ణ వికాసాన్ని ఇచ్చిన కవులలో ఒకడు .

డాంటే రాసిన డివైన్ కామెడీ ని అనువాదం చేసిన మొదటి అమెరికాన్ కవి లాంగ్ ఫెలో .లిరిక్ పోయెమ్స్ రాసి మాస్ కు చేరువైన కవి .హెక్సా మీటర్ లో ,ఫ్రీ వేర్స్ లో కూడా రాశాడు .హీరోయిక్ కప్లేట్స్ బాలడ్స్ నూ రాశాడు .నైతిక ,సాంస్కృతిక విలువలకుప్రాధాన్యత నిచ్చాడు  ,భౌతికానికి అతీతం గా ఆలోచన చేశాడు .ఆయన కాలం లో అందరికంటే ప్రసిద్ధుడు .విట్మన్ ఫ్రాస్ట్ మొదలైన కవులకు ప్రేరణ .

 

Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్ –మల్లాపూర్ –అమెరికా

 

 

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment