ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ —
”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ -రైట్ గురించి .కెవిన్ హార్ట్ అనే గొప్ప విమర్శకుడు ”ఆమె కు తెలుసో లేదో కాని ,ఆమె కవితల్లో మనం జీవిస్తున్నాం ”.అని ప్రశంసించాడు .అంతటి మహా రచయిత ,ఆస్ట్రేలియా దేశ ఆదిమ సంతతి కి వాణి గా ,ప్రతి నిదిగా కీర్తి ప్రతిష్టలు పొందినది జూడిత్ .
అసలు పేరు జూడిత్ అరండేల్ రైట్ ..1915 మే 31 న న్యు సౌత్ వేల్స్ లోని ఆర్మిడేల్ దగ్గర ”తల గారా” లో జన్మించింది .పశువుల పెంపకం దారుల కుమార్తె .చిన్నప్పటి నుంచే పొలం ,పుట్రా పశువులు ,పాడి పంట ,పూలు పళ్ళు ,గుర్రాలు ,పోనీలు అంటే అభిమానం .ఇంటి వద్దే చదువు కొంది .తల్లి చిన్నప్పుడే చని పోయింది .మేనత్త దగ్గర పెరిగింది .ఆర్మిడేల్ లోని న్యూ ఇంగ్లాండ్ గర్ల్స్ స్కూల్ లో చేరింది .ఆ వాతావరణం చూసి ”తాను తప్పక కవిని అవుతాను ”అని అనుకొన్నది .తర్వాత ఇంగ్లీష్ ,ఫిలాసఫీ లను సిడ్ని యూని వేర్సిటి లో చది వింది .25 ఏళ్ళకే మొదటి కవిత ప్రచురితమైంది .
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తండ్రికి సాయం చేయ టానికి స్వగ్రామం చేరింది .తరువాత క్వీన్స్ లాండ్ వర్సిటి లో రిసెర్చ్ ఆఫీసర్ అయింది .అప్పుడే మేంజిన్ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకు రాలైంది . 1946 లో ”the moving image ”అనే మొదటి కవితా సంకలనాన్ని తెచ్చింది .ఆ తర్వాత ఆపు లేకుండా దాదాపు యాభై పుస్తకాలను రాసి ప్రచురించింది ..అందు లో 15 కవితా సంకలనాలున్నాయి . మిగిలినవి సాహిత్య విమర్శలు ,జీవిత చరిత్రలు ,.చరిత్రలు ,వ్యాసాలు ,పర్యావరణ విషయాలు ఉన్నాయి .సాంప్రదాయ ఆస్ట్రేలియా మహిళ గా ఉండటానికి ఇష్టపడేది కాదు .1950 లో నవలా రచయిత ,ఫిలాసఫర్ అయిన జాక్ మేకన్నీ తో బ్రిస్ బెన్ నుంచి దేశం అంతా పర్యావరణ పరిశీలన కోసం తిరిగింది . కూతురు పుట్టింది .వారిద్దరికీ 1962 వరకు పెళ్లి కాలేదు .భర్త 1966 లో మరణించాడు .
యాభై దశకం లో యూడిత్ సాహితీ ,సాంఘిక యాత్ర ఆపు లేకుండా సాగింది .ఆమె ప్రజా కవిగా మారింది .the morning image తో ప్రారంభించి ఆస్ట్రేలియా అంద చందాలను ,ప్రకృతిని పర్వతాలను లోయలను పంటలను పుష్ప జాతులను కవిత్వం లో దిమ్పెసింది .ఆమె కు ప్రకృతి ని చూస్తె పరవశమే . తన” మదర్ ఇంగ్లాండ్ ”ను అందులోని నిగూడ్హత ,తవ్వి తీసింది .అక్కడి విభిన్న జాతుల స్వరూప స్వభావాలను ,వారి సంస్కృతులను ,కవిత్వీకరించింది ..వాటి ప్రభావాన్ని చాటి చెప్పింది ”south of my days ,”metho drinker ,country town కవితల్లో వీటిని పొందు పరచింది
1949 లో వచ్చిన woman to man ”అనే రెండవ కవితా సంపుటి లో స్త్రీల సెక్స్ విషయాలు ,కోరికలు గురించి రాసింది వారిలో అవగాహన కల్పించింది .సెక్స్ లోని పరమార్ధాన్ని ,ఆధ్యాత్మిక అనుభూతినీ వివ రించింది వీటి ని ప్రభుత్వం పాఠ్య గ్రంధాలలో చేర్చిందంటే ఆమె రచనా ప్రభావం ఏమిటో తెలుస్తోంది .ఆ తర్వాతి కవితలన్నీ లాండ్ స్కేప్ ల పై రాసింది .” .the true fires
”” సంకలనం లో ఇంగ్లీష్ వారు ఆదిమ జాతులను anagaa ర్చిన విధానం ,వారి సంస్కృతికి జరిగిన అన్యాయం ,,ఆంగ్లేయుల మానసిక స్తితి గతులను లను గొప్పగా చూపించింది ”.బోరా రింగ్ ”సంకలనం లో ఆదిమ వాసుల సంస్కృతికి అద్దం పట్టింది .
అసలు పేరు జూడిత్ అరండేల్ రైట్ ..1915 మే 31 న న్యు సౌత్ వేల్స్ లోని ఆర్మిడేల్ దగ్గర ”తల గారా” లో జన్మించింది .పశువుల పెంపకం దారుల కుమార్తె .చిన్నప్పటి నుంచే పొలం ,పుట్రా పశువులు ,పాడి పంట ,పూలు పళ్ళు ,గుర్రాలు ,పోనీలు అంటే అభిమానం .ఇంటి వద్దే చదువు కొంది .తల్లి చిన్నప్పుడే చని పోయింది .మేనత్త దగ్గర పెరిగింది .ఆర్మిడేల్ లోని న్యూ ఇంగ్లాండ్ గర్ల్స్ స్కూల్ లో చేరింది .ఆ వాతావరణం చూసి ”తాను తప్పక కవిని అవుతాను ”అని అనుకొన్నది .తర్వాత ఇంగ్లీష్ ,ఫిలాసఫీ లను సిడ్ని యూని వేర్సిటి లో చది వింది .25 ఏళ్ళకే మొదటి కవిత ప్రచురితమైంది .
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తండ్రికి సాయం చేయ టానికి స్వగ్రామం చేరింది .తరువాత క్వీన్స్ లాండ్ వర్సిటి లో రిసెర్చ్ ఆఫీసర్ అయింది .అప్పుడే మేంజిన్ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకు రాలైంది . 1946 లో ”the moving image ”అనే మొదటి కవితా సంకలనాన్ని తెచ్చింది .ఆ తర్వాత ఆపు లేకుండా దాదాపు యాభై పుస్తకాలను రాసి ప్రచురించింది ..అందు లో 15 కవితా సంకలనాలున్నాయి . మిగిలినవి సాహిత్య విమర్శలు ,జీవిత చరిత్రలు ,.చరిత్రలు ,వ్యాసాలు ,పర్యావరణ విషయాలు ఉన్నాయి .సాంప్రదాయ ఆస్ట్రేలియా మహిళ గా ఉండటానికి ఇష్టపడేది కాదు .1950 లో నవలా రచయిత ,ఫిలాసఫర్ అయిన జాక్ మేకన్నీ తో బ్రిస్ బెన్ నుంచి దేశం అంతా పర్యావరణ పరిశీలన కోసం తిరిగింది . కూతురు పుట్టింది .వారిద్దరికీ 1962 వరకు పెళ్లి కాలేదు .భర్త 1966 లో మరణించాడు .
యాభై దశకం లో యూడిత్ సాహితీ ,సాంఘిక యాత్ర ఆపు లేకుండా సాగింది .ఆమె ప్రజా కవిగా మారింది .the morning image తో ప్రారంభించి ఆస్ట్రేలియా అంద చందాలను ,ప్రకృతిని పర్వతాలను లోయలను పంటలను పుష్ప జాతులను కవిత్వం లో దిమ్పెసింది .ఆమె కు ప్రకృతి ని చూస్తె పరవశమే . తన” మదర్ ఇంగ్లాండ్ ”ను అందులోని నిగూడ్హత ,తవ్వి తీసింది .అక్కడి విభిన్న జాతుల స్వరూప స్వభావాలను ,వారి సంస్కృతులను ,కవిత్వీకరించింది ..వాటి ప్రభావాన్ని చాటి చెప్పింది ”south of my days ,”metho drinker ,country town కవితల్లో వీటిని పొందు పరచింది
1949 లో వచ్చిన woman to man ”అనే రెండవ కవితా సంపుటి లో స్త్రీల సెక్స్ విషయాలు ,కోరికలు గురించి రాసింది వారిలో అవగాహన కల్పించింది .సెక్స్ లోని పరమార్ధాన్ని ,ఆధ్యాత్మిక అనుభూతినీ వివ రించింది వీటి ని ప్రభుత్వం పాఠ్య గ్రంధాలలో చేర్చిందంటే ఆమె రచనా ప్రభావం ఏమిటో తెలుస్తోంది .ఆ తర్వాతి కవితలన్నీ లాండ్ స్కేప్ ల పై రాసింది .” .the true fires
”” సంకలనం లో ఇంగ్లీష్ వారు ఆదిమ జాతులను anagaa ర్చిన విధానం ,వారి సంస్కృతికి జరిగిన అన్యాయం ,,ఆంగ్లేయుల మానసిక స్తితి గతులను లను గొప్పగా చూపించింది ”.బోరా రింగ్ ”సంకలనం లో ఆదిమ వాసుల సంస్కృతికి అద్దం పట్టింది .
వన్య ప్రాణు లపై ఉన్న అభిమానాన్ని ”astreliyan birds” లో నిక్షిప్తం చేసింది .వీటి ప్రభావం ఆస్ట్రేలియా వాసుల పై బాగా పడింది .భూమిని ,పర్యా వర ణాన్ని అరుదైన జాతుల్ని సంరక్షించు కోవాలన్న ధృఢ మైన అభి ప్రాయం వారిలో కల్గించింది .న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను ,వాటి వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజా దృష్టికి తీసుకొని వెళ్ళింది .ప్రభుత్వం ,బడా పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై పర్యావరణాన్ని కబలిస్తున్నారని యేలు గెత్తి చాటింది .
క్కై నారని ఎలుగెత్తి చాటింది .ఆస్ట్రేలియా వాసుల గుండె చప్పుడు గా ,వారి భావి భాగ్య విధాత గా ఆమెను అందరు భావించారు .సాహిత్యం ,పర్యావరణం ,సాంఘిక రంగాలల్తో ఆమె త్రివేణీ సంగమం గా సాగింది .జాతీయ రాజ కీయాలను ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో ఆమె ఒక్కరుగా నిలిచింది .కవిత్వం ,ఇతర రచనల ద్వారా ఆస్ట్రేలియా దేశ సరి హద్దుల్ని ,అక్కడి వన్య ప్రాణులను ,ఆదిమ మానవ జాతి ని ,వారి చరిత్రను సరి దిద్దింది ”.గ్రేట్ బారియర్ రీఫ్’ ను ఆయిల్ డ్రిల్లింగ్ నుండి రక్షించ గలిగింది ”.ఫ్రీజర్ ఐలాండ్” ను కాపాడింది .వాటి అస్తిత్వాలను శాశ్వతం చేయ గలిగింది ..అప్పటి వరకు మగ వారి గురించి ,గుర్రాలు ,భూ పోరాటాల కే పరిమిత మైన ఆస్ట్రేలియా సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి కొత్త పుంతల్ని తోక్కించింది జూడిత్ .స్తీ పురుష సంబంధాలను కొత్త కోణం లో తెలియ జెప్పింది .ఆడవారికి సెక్స్ విషయాలపై మంచి ఆవ గాహన కల్పించింది .ఒక రకం గా జాతిని జాగృతం చేసినదని చెప్ప వచ్చు . వయసు మీద పడుతున్నా కవితా వ్యాసంగం తగ్గ లేదు .1963 లో five senses
అనే కవితా సంపుటి తెచింది .వర్షాధార అడవులు వినాశనం అవటాన్ని చూస్తూ ఊరు కో లేక ప్రతిఘటించా టానికి wild life society for queens land ఏర్పరచి అద్యక్షు రాలైంది .
ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల సాధనకు నడుం బిగించి ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళింది .ఇంత చేస్తున్నా కవిత్వ ధార ఇంకి పోలేదు .శ్రోతస్విని లా ప్రవహిస్తూనే ఉంది .
”the other half ,”-”Alive poems ,”human pattern ;;మొదలైన పుస్తకాలను ముద్రించింది వీటికి తోడూ ఏడు పుస్తకాలుగా సాహిత్య చరిత్ర ,విమర్శ గ్రంధాలను కూడా వెలువరించింది .
” వన్య ప్రాణి సంరక్షణ కాకుండా national park association of New south vels ,”south coast coservation council ”amnesty internation ,Aastreliyan society of authors .
వంటి అనేక సంస్థలలో సభ్యురాలుగా ఎన్ని కైంది .1975 లో ఆస్త్రేలియన్ నేషనల్ వర్సిటి కౌన్సిల్ కు ఎన్నికైన మొదటి మహిళ గా రికార్డు సృష్టించింది .ఆదివాసుల కు జరిగిన అన్యాయాలను సరి దిద్ద టానికి
aborginal treaty council కు మెంబర్ అయింది .1981 లో నేటివ్ ప్రజల హక్కుల్ని క్వీన్ లాండ్ సెటిలర్స్ కాల రాస్తుంటే ఆ విషయాలన్నీ the cry of the dead లో ,వివరించి 1985 లో
we call for a treaty లో అన్నీ ఏకరువు పెట్టింది .ఎంతో కాలమ్ ఉపన్యాసాలు ,కవిత్వాన్ని చదివి విని పించటం తో గడిపింది .లెక్క లేనన్ని బహుమతులు ,పురస్కారాలు పొందింది .ఆమెను సన్మానించని సంస్థ లేదంటే ఆశ్చర్యం లేదు ..1992 లో ఆమె కవిత్వానికి అత్యుత్తమ మైన” క్వీన్స్ గోల్డ్ మెడల్” లభించింది .చని పోవ టానికి ఒక నెల ముందు కాన్ బెర్రా నగరం లో” రి కన్సిలిఎషణ్ మార్చ్” లో పాల్గొని దాదాపు తుది శ్వాస దాకా ప్రజా వాణిని విని పిస్తూనే ఉన్న మహా రచయిత .2000 జూన్ 25 న జూడిత్ రైట్ మరణించింది .ఆమె జీవిత చరిత్ర ను వేరోనికా బ్రాడీ రాశాడు .అందులో ఆమె స్వీయ చరిత్ర ను కూడా చేర్చారు ..కారణ జన్ము రాలు ,మార్గ దర్శి ,ఉద్యమ సారధి ,ఆదివాసుల వాణి జూడిత్ రైట్ ..
క్కై నారని ఎలుగెత్తి చాటింది .ఆస్ట్రేలియా వాసుల గుండె చప్పుడు గా ,వారి భావి భాగ్య విధాత గా ఆమెను అందరు భావించారు .సాహిత్యం ,పర్యావరణం ,సాంఘిక రంగాలల్తో ఆమె త్రివేణీ సంగమం గా సాగింది .జాతీయ రాజ కీయాలను ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో ఆమె ఒక్కరుగా నిలిచింది .కవిత్వం ,ఇతర రచనల ద్వారా ఆస్ట్రేలియా దేశ సరి హద్దుల్ని ,అక్కడి వన్య ప్రాణులను ,ఆదిమ మానవ జాతి ని ,వారి చరిత్రను సరి దిద్దింది ”.గ్రేట్ బారియర్ రీఫ్’ ను ఆయిల్ డ్రిల్లింగ్ నుండి రక్షించ గలిగింది ”.ఫ్రీజర్ ఐలాండ్” ను కాపాడింది .వాటి అస్తిత్వాలను శాశ్వతం చేయ గలిగింది ..అప్పటి వరకు మగ వారి గురించి ,గుర్రాలు ,భూ పోరాటాల కే పరిమిత మైన ఆస్ట్రేలియా సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి కొత్త పుంతల్ని తోక్కించింది జూడిత్ .స్తీ పురుష సంబంధాలను కొత్త కోణం లో తెలియ జెప్పింది .ఆడవారికి సెక్స్ విషయాలపై మంచి ఆవ గాహన కల్పించింది .ఒక రకం గా జాతిని జాగృతం చేసినదని చెప్ప వచ్చు . వయసు మీద పడుతున్నా కవితా వ్యాసంగం తగ్గ లేదు .1963 లో five senses
అనే కవితా సంపుటి తెచింది .వర్షాధార అడవులు వినాశనం అవటాన్ని చూస్తూ ఊరు కో లేక ప్రతిఘటించా టానికి wild life society for queens land ఏర్పరచి అద్యక్షు రాలైంది .
ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల సాధనకు నడుం బిగించి ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళింది .ఇంత చేస్తున్నా కవిత్వ ధార ఇంకి పోలేదు .శ్రోతస్విని లా ప్రవహిస్తూనే ఉంది .
”the other half ,”-”Alive poems ,”human pattern ;;మొదలైన పుస్తకాలను ముద్రించింది వీటికి తోడూ ఏడు పుస్తకాలుగా సాహిత్య చరిత్ర ,విమర్శ గ్రంధాలను కూడా వెలువరించింది .
” వన్య ప్రాణి సంరక్షణ కాకుండా national park association of New south vels ,”south coast coservation council ”amnesty internation ,Aastreliyan society of authors .
వంటి అనేక సంస్థలలో సభ్యురాలుగా ఎన్ని కైంది .1975 లో ఆస్త్రేలియన్ నేషనల్ వర్సిటి కౌన్సిల్ కు ఎన్నికైన మొదటి మహిళ గా రికార్డు సృష్టించింది .ఆదివాసుల కు జరిగిన అన్యాయాలను సరి దిద్ద టానికి
aborginal treaty council కు మెంబర్ అయింది .1981 లో నేటివ్ ప్రజల హక్కుల్ని క్వీన్ లాండ్ సెటిలర్స్ కాల రాస్తుంటే ఆ విషయాలన్నీ the cry of the dead లో ,వివరించి 1985 లో
we call for a treaty లో అన్నీ ఏకరువు పెట్టింది .ఎంతో కాలమ్ ఉపన్యాసాలు ,కవిత్వాన్ని చదివి విని పించటం తో గడిపింది .లెక్క లేనన్ని బహుమతులు ,పురస్కారాలు పొందింది .ఆమెను సన్మానించని సంస్థ లేదంటే ఆశ్చర్యం లేదు ..1992 లో ఆమె కవిత్వానికి అత్యుత్తమ మైన” క్వీన్స్ గోల్డ్ మెడల్” లభించింది .చని పోవ టానికి ఒక నెల ముందు కాన్ బెర్రా నగరం లో” రి కన్సిలిఎషణ్ మార్చ్” లో పాల్గొని దాదాపు తుది శ్వాస దాకా ప్రజా వాణిని విని పిస్తూనే ఉన్న మహా రచయిత .2000 జూన్ 25 న జూడిత్ రైట్ మరణించింది .ఆమె జీవిత చరిత్ర ను వేరోనికా బ్రాడీ రాశాడు .అందులో ఆమె స్వీయ చరిత్ర ను కూడా చేర్చారు ..కారణ జన్ము రాలు ,మార్గ దర్శి ,ఉద్యమ సారధి ,ఆదివాసుల వాణి జూడిత్ రైట్ ..
గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -05 -12
క్యాంపు–షార్లెట్ –నార్త్ కరోలిన -యు.ఎస్ .ఏ.
ఫోన్ –001 –248 -212 -03 -66 .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

