చరిత్ర—సాహిత్యం –3

చరిత్ర—సాహిత్యం –3

          అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పోరు శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పోతున్న నైతిక విలువలు .జరిగిన ,జరుగుతున్నా ,జరుగ బోయే విషయాలను గ్రంధస్తం చేయాల్సిన అవసరం కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా వాటిని అందించాల్సిన అవసరం వచ్చింది .మానసిక స్తితి ని ప్రేరేపించాల్సిన అవసరం .కర్తవ్య పరాయనులను చేయాల్సిన సమయం ..అందుకే వ్యాస మహర్షి మహా భారత రచన చేసి దానికి ‘’పంచమ వేదం ‘’అనే స్తాయి కల్పించాడు .అందులో లేని విషయం లేదు ..వేద విభజన చేశాడు .బ్రహ్మ సూత్రాలు రాశాడు .అయినా భక్తీ మార్గాన్ని అందించ లేక పోయానని బాధ పడ్డాడు సామాన్యుడికి అందు బాటు లో ఉండేది భక్తీ మాత్రమే అని భావించి భాగవతం రాశాడు .భగవంతుని విభూతి ని అనేక రూపాల్లో వివ రించాడు ..అందులో భగవంతుని కధలే కాదు భక్తుల కధలూ ఉన్నాయి .భక్తితో ధ్యానం టో చివరికి ద్వేషం తో  కూడా భగ వంతుని చేర వచ్చు నని చూపాడు .సాటి మనిషికి సాయం చేస్తేనే దేవుడు ఆడరిస్తాడనే విషయమూ తెలిపాడు .ఈ విషయాలను ప్రహ్లాద ,రంతి దేవుల చరిత్ర లలో స్పష్టం చేశాడు ..తర్వాతా చారిత్రాత్మక విషయాలన్నీ వివ రించ టానికి సృష్టి ఎలా ప్రారంభమైందో ,చెప్పటానికి పద్దెనిమిది పురాణాలు రాశాడు .పురాణం అంటే పురా నవం .అంటే పూర్వం జరిగింది అయినా వినటానికి కొత్త గా ఉంటుందని .భారత యుద్ధం తరువాత ,పాండవుల పాలన తర్వాతా భవిష్యత్తు లో ఏయే రాజ వంశాలు పరి పాలించ  బోతున్నాయో యే రాజు ఎంత కాలం పాలన చేస్తాడో అన్ని వివరాలు వ్యాసుడు భవిష్యత్తు పురాణం లో అందించాడు .అందుకే కవి ని క్రాంత దర్శి అన్నారు .కవి ద్రష్ట ,స్రష్టా కూడా .కనుక ఇక్కడ సాహిత్యం ముందు పుట్టి చరిత్ర తరువాత జరిగింది అని తెలుసు కోవాలి .కనుక చరిత్ర ,సాహిత్యం పరస్పర ఆశ్రయాలు .రెండూ ,మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయి .అలాంటి సందర్భం భారత దేశం లోదేశ స్వాతంత్ర్య సంగ్రామ కాలం లో కన్పిస్తుంది .ధర్మానికి హాని కల్గినపుడే నన్నయ ,తిక్కనలు భారత రచనలు చేశారు .

               ఆంగ్ల కవి టెన్నిసన్ THERE IS NOT THE REASON ,THERE IS BUT TO DO OR DIE ‘’అన్నాడు ఒక కవిత లో .దాన్ని గాంధీ గారు ‘’విజయమో –వీర స్వర్గమో ‘’తేల్చు కొండి అని ఆగస్ట్ ఎనిమిది నదేశ ప్రజల్ని ఉత్తేజ పరిచాడు .అదే ఆగస్ట్ విప్లవానికి నాంది అయింది .విజయ సాధనకు మార్గమేర్పడింది .దేశ విముక్తికి కారణం అయింది .బంకిం చంద్ర చటర్జీ ‘’వందే మాతరం ‘’గీతం దేశ ప్రజల పై గొప్ప ప్ర భావం కల్గించింది .ప్రేమ్చంద్ ,టాగూర్ రచనలు దేశ భక్తిని చాటి చెప్పాయి .చేస్తున్న ఉద్యోగాలు వదిలేయమని అరవింద ఘోష్ లాంటి వాళ్ళు బోధించారు .’’లాల్ బాల్  పాల్  త్రయం ‘’దేశమంతా తిరిగి చైతన్యం కల్గించారు .ఆ సమయం లో ఆంద్ర దేశం లో పర్య తించాడు బిపిన్ చంద్ర పాల్  ..రాజమాండ్రిడ్రిసభలో చిలక మార్తి లక్ష్మీ నర సింహం గారు ‘’భారత దేశంబు చక్కని పాడియావు –హిందువులను లేగా దూడ లేద్చు చుండ –తెల్ల వారను గడసరి గొల్ల వారు –పితుకు చున్నారు మూతులు బిగియ గట్టి ‘’అనీ పాడారు ఆ తర్వాతా ఆ పద్యం తారక మంత్రమే అయింది .గరిమేళ్ళ సత్య నారాయణ గారు ‘’మాకొద్దీ తెల్ల దొరతం ‘’అనే పాట టో ప్రజలంతా ఉర్రూత లూగి పోయారు .భారతీయ సమైక్యతకు ఎందరో నాయకులు ,రచయితలు ,కళా కారులు తమ వంతు పాత్ర నిర్వ హించారు .దీనితో ఉప్పు సత్యాగ్రహం ,విదేశీ వస్త్ర బహిష్కరణ ,,హరిజనోద్ధరణ ,రాష్ట్రభావన ,హిందీ ఉద్యమం పెన వేసుకొని నడి  చాయి .స్వంత భాష పై భక్తీ పెరిగింది .’’యే దేశ మేగినా ఎందు  కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ‘’అని ఎలుగెత్తి చాటాడు రాయ ప్రోలు  సుబ్బారావు .ఫ్రెంచి విప్ల వానికి రూసో ,రష్యా విప్లవానికి మార్క్స్ ,తాల్స్తాయి రచనలు తోడ్పడ్డాయి .రాజా రామ మోహన రాయ్ ,దయానంద సరస్వతి స్వాతంత్ర యుద్ధానికి కొత్త భాష్యం చెప్పారు కే.ఆంద్ర దేశం లో గురజాడ ,చిలక మార్తి ,రాయ ప్రోలు ,,విశ్వనాధ ,తుమ్మల ,కృష్ణ శాస్త్రి వగైరాలుకధాలు ,కావ్యాలు రాసి ప్రజల్ని కత్రవ్యం వైపు కు మరల్చారు .అల్లూరి దేశభక్తి ,కన్నె గంటి హనుమంతు శౌర్యం గానం చేసి దేశ భక్తీ రగిల్చారు .అహింసా వ్రతం గొప్ప తనాన్ని సౌందర నందం కావ్యం లో పింగళి ,కాటూరి గొప్ప గా చెప్పారు .గాంధే తన సేవాదళాన్ని ‘’శాంతి దళం ‘’అన్నాడు .గాంధి జీవిత చరిత్రను తుమ్మల తెలుగు పద్య కావ్యం గా రాశాడు .రాణా ప్రతాపుని దేశ భక్తీ ,జ్ఞాపకం చేయటానికి దుర్భాక రాజ శేఖర శతావధాని ‘’రాణా ప్రతాప చరిత్ర;;కావ్యం రాశారు .తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన వాడు రాణా  .ఆ స్పూర్తి కలగాలని ఆయన సందేశం ‘’.నా స్వాతంత్రం నా ఊపిరి ‘’అన్న శివాజీ చరిత్ర ప్రభావితం చేసింది .పరమత సహనం ఆ కాలం లో వ్యాప్తి కావాల్సిన అవసరాన్ని తీర్చిందీ కావ్యం   .అందుకే అది శివ భారతం గా గడియారం వారు గంట కొట్టి నట్లు కాలానికి తగ్గ ఉద్బోధ చేశారు .

                 ‘’దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘’అన్నాడు గురజాడ .జాషువా జాతీయ నాయకులందరి పైనా కమ్మని పద్యాలను చెప్పి వారిని చిరస్మరనీయుల్ని చేశాడు .ఖద్దరు గొప్పతనం చాటాడు .’’అంట రాని తనంబు నంటి భారత జాతి భువన సభ్యత గోలు పోయే ‘’అని బాధ పడ్డాడు .మహాత్ముని సత్యాగ్రహ యజ్ఞం లో ‘’స్వరాజ్య బాల ‘’జన్మిస్తుందని కరుణశ్రీ కల గన్నాడు .’’లాఠీ పోతులు పూల చెండ్లు –చేరసాలల్ పెండ్లి వారిల్లు –యే కాఠిన్యం బైనన్ ,సుఖానుభావమే –గాంధీ కళా శాలలో ‘’అన్నాడు పాపయ్య శాస్త్రి .గాంధీని కృష్ణునిగా ,జహ్వారు ని అర్జుని గా ఊహించారాయన .ఆయన రాసిన ‘’విజయ శ్రీ ‘’భారత స్వాతంత్ర ఉద్యమ స్పూర్తి దాయకం గా ఉంటుంది .అహింస గొప్ప తనాన్ని ఆయన ‘’కరుణశ్రీ ‘’లో చిందించారు .

       అటు తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్ర మైంది .దాశరధి ‘’అగ్ని వీణ ‘’మీటా డు .’’నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘’అన్నాడు .ఆ నాటి నవాబు ను ‘’తర తరల బూజు ‘’అన్నాడు .తానూ ఉద్యమలో చేరి ముందున్నాడు జైలుకెళ్లాడు కవి దాశరధి

‘’వీర గంధంగంధము తెచ్చి నారము వీరు లేవ్వరో తెల్పుడీ ‘’అని తెలుగు వాళ్ళను హెచ్చరిక చేశాడు రామ స్వామి చౌదరి .’’కొల్లాయి గట్టి తె నేమి ,మా గాంధి కోమటి పుట్టి తె నేమి “’అని బసవ రాజు అప్పారావు ,గేయం జనాన్ని ఉర్రూత లూగించింది .కృష్ణ శాస్త్రి ‘’కమ్మగా బతికితే గాన్దీయుగం –మనిషి కడుపు నిండా తింటే గాంధీ జపం ‘’,’’నారాయణ నారాయణ అల్లా అల్లా –మా పాలిటి తండ్రీ నీ పిల్లల మేమేల్లా ‘’అని సర్వ మానవ సౌభ్రాతృత్వం బోధించాడు .కవితలు ,పాటలు కావ్యాలే కాదు దేశ భక్తీ బోధించే నాటకాలూ వచ్చాయి తిలక్ మహారాజు నాటకం ,కాంగ్రెస్వా లా ,పాలేరు నాటకాల్లో గ్రామ పునర్నిర్మాణం ,అస్పృశ్యతా నివారణ ,మద్య పాన నిషేధం ,గురించి చర్చించారు .ఆత్రేయ ‘’ఈనాడు ‘’నాటకం లో ఐకమత్యమే బలం అని చాటాడు .పౌరాణికాలలో ‘’ఉద్యోగ విజయాలు ‘’లో ధర్మ రాజు పై కృష్ణుడు చేపిన పద్యం ‘’అలుగుట యే ఎరుంగని మహా మహితాత్ముదజాత శత్రువే అలిగిన నాడు ‘’గాంధీ మహాత్మునికి అన్వయిన్చేట్లే చెప్పార.బ్రిటీష వారికి హెచ్చరిక గా ..

      ఉద్యమ వ్యాప్తి కి జన సామాన్యం కావాలి .వారికి అర్ధమయ్యే భాష కావాలి .ఆహ్లాద పరుస్తూ సందేశం ఇవ్వాలి .అన్డుకేం ‘’నవల ‘’అవసర మైంది .ఉన్నావ వారి ‘’మాల పల్లి ‘’నవలలో సంస్కారం ,సహజీవనం ,నవ జీవన నిర్మాణం ,,హరిజనాభ్యుదయం కన్పిస్తాయి .విశ్వనాధ ‘’వేయి పడగలు ‘’నవలలో ఆ నాడు సాంఘిక స్తితి ఎలా దిగజారి పోయిందో ,ధర్మం ఎలా పతనం చెందిందో తెల్పింది .బుచ్చి బాబు ‘’చివరకు మిగిలేది ‘’లో స్వాతంత్రా వసరాన్ని , ,నిత్య జీవిత సంఘర్షణ కన్పిస్తాయి .కొడవటి గంటి ‘’’చదువు ‘’లో ఉప్పు సత్యాగ్రహం ,వ్యక్తీ వికాసం చోటు చేసుకొన్నాయి .’’కొల్లాయి గట్టితే నేమి ‘’అన్న మహీధర రామ్మోహన రావు నవల అస్పృశ్యత ఎలా రూపు మాసిందో చూపించారు .ముప్పాళ్ళ రంగ నాయకమ్మ ‘’బలి పీఠం ‘’లో వర్ణాంతర వివాహ సమస్యను పరిష్కరించారు .పోలా ప్రగడ సత్య నారాయణ ‘’కౌసల్య’’నవలలో సత్యాగ్రహాలు భార్యా పిల్లల్ని కూడా  వదిలి స్వతంత్రం  కోసం పాటు పడిన వారి విషయం వివ రించారు .

      ఆత్మ కధలు గొప్ప ప్రభావమే కల్గించాయి గాంధి ఆత్మకధ ,తిలక్ ది ప్రకాశం గారిది వీరేశ లింగం గారిది ఉత్తేజితుల్ని చేశాయి .పట్టాభి రాసిన కాంగ్రెస్ చరిత్ర భారతీయ ఆత్మ ను మేల్కొల్పింది .రాష్ట్ర పతి  కలాం గారి ఆత్మ కధ యువతకు గొప్ప ప్రేరణ గా నిలిచింది .

సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-5-12—కాంప్–

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.