గొల్ల పూడి కధా మారుతం –19
ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )
ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ తీసి చూడంగానే నువ్వు కని పించావు ‘’అన్నాడు .’’చాల్లెండి .ప్రతి రోజు అక్కడే నిలబడి చూస్తుఉంటారటగా ఆవిడ అంతా చెప్పింది ‘’అన్నది .నోట మాట రాలలేదు .ఇలాంటి వి ఆడ వాళ్ళు మాట్లాడు కుంటారని ,తన భార్యకే ఆమె చెప్పిందని విని దిమ్మ తిరిగింది .ఇక అతనికి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు .వేరే ఇంట్లోకి మారాడు .భార్య మాత్రం ఏమీ మాట్లాడదు .నవ్వుతుంది అంతే .ఇది మరీ బాధించింది . .ఇతని సైకో అనలిస్ట్ మిత్రుడికి ఆ వూరు బదిలీ అయింది ఇల్లు కావాలంటే తాను ఇదివరకున్న ఇల్లే చూపించాడు .ఒక నెల రోజులు బ్రహ్మ చర్యం వెలిగించమని సలహా చెప్పాడు .ఓ పది హేను రోజుల తర్వాత మిత్రుడిని చూడ టానికి వెళ్లాడు .తన అనుభవమే అతనికీ అయిందని తెలిసి ఆశ్చర్య పోయి ,’’ఆమె కధ‘’లోనీ ఆంతర్యం అడిగాడు ఎనలైజ్ చేసి చెప్తాడనే ఆదుర్దాతో .అతని మాటల్లో ‘’ఆ అమ్మాయి ఎవర్నీ ప్రేమించదు .తనను తానే ప్రేమించు కొంటుంది .ఆమె లో విచిత్ర మైన ‘’వానిటీ ‘’ఉంది.మన మీద ఆసక్తి కంటే తనమీద తనకు ఆసక్తి ఎక్కువ .
తను ఇతరుల్ని ఆకర్షిస్తోందా లేదా అన్నదే ఆమె ఆలోచన .ఆమె అందానికి ముగ్దులమవుతున్నాం అనే ఆలోచన ఆమెకి కావాలి .ప్రతి స్త్రీ లోను ఈ కోరిక ఉంటుంది .కొందర్లో అంతర్గతం గా ఉంటె మరి కొందర్లో కళ్ళల్లో, చేతల్లో బయట పడుతుంది .కానీ ఈ అమ్మాయి మరీ విచిత్ర మైంది .మనం చూస్తున్నట్లు తృప్తి పడటమే కాదు నలుగురు తనకు లభించిన ఈ అవకాశానికి ఈర్ష్య పడాలని ఆమె ఆరాటం .నలుగురికి మనల్ని చూపి తన గర్వాన్ని చాటు కోవాలి ..తన కోసం ఎదుటి వాడు పడి చస్తాడని తనకు మాత్రం అది విసుగు అనీ ,ఇందులో ఆశ్చర్యమేదీ లేదని ,అందుకే మనల్ని అక్కడ కట్టి పడేసి ,నలుగుర్నీ తీసుకొచ్చి తానే చూపిస్తుంది ‘’అని ఆమె సైకాలజీ ని వివ రించి చెప్పాడు .ఆశ్చర్య పోతున్న రచయిత తొ ‘’చివరికి మీ ఆవిడనీ ఆవిడే పిలిపించి చూపించింది ‘’ చిత్రం అని పించింది .అతనే మళ్ళీ ‘’కొందరి అందం బుజ్జ గించి జో కొడితే ,మరి కొందరి అందం రెచ్చ గొట్టి భయ పెడుతుంది ‘’.అణు శక్తి ‘’అంతటిది అందం .కొందరు శాంతికి వాడితే ,మరి కొందరు వినాశనానికి వాడుతారు .’’అని అందం అనేది రెండంచుల కత్తిఅన్నట్లు చెప్పాడు .విచిత్ర మైన మనస్తత్వం .ఈ విషయం తెలిశాక రచయితకు ‘’ఊర్వశీ పురూరవ ‘’కాలెండర్ గాలికి కదుల్తూ వెక్కి రించి నట్లుంది ‘’ అని ముక్తా ఇంపు ఇస్తాడు .అదీ గొల్ల పూడి కధానాయికల వైవిధ్యం
మరో కధ తొ ఈ సారి
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-12- ఉయ్యూరు .
