మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9
ఆదిమ జాతులలో దైవీ భావం
ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,ఉత్తర అమెరికా ,యూరప్ ఆసియా దేశాలలో ఆదిమ వాసులందరికీ దైవం మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి .వాటిని క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మనకు తెలియ వస్తాయి ఈ ప్రపంచాన్ని ,కనీ పించే వాటి నన్నిటిని నిర్మించటానికి ఒక పరమ సత్త ఉన్నాడు .మానవు లంతా శీలం, ఆత్మత్యాగం ,కల మంచి వారు గా ఉండాలని ఆయన కోరాడు ..ఇదే పర దేవతా భావం అనే పేరుతొ పిలవ బడుతోంది .ఎన్నో రకాలుగా ఈ విశ్వాసం కనీ పిస్తుంది .
స్పస్టమో అస్పస్టమో అయిన ఈశ్వరుడు లేక దేవుడు అనే భావం అన్ని కాలాల్లో దేశాల్లో ఉంది .ఆఫ్రికా లోని కాంగో అడవులలో ఉన్న పిగ్మీలు ప్రాచీన మానవ జాతి గా భావింప బడుతున్నారు .వీరిని పూర్తీ ఆదిమ వాసులు అని అంటారు .వారి దృష్టిలో ఈ ప్రపంచానికి ఒక సృష్టి కర్త ఉన్నాడు అని ఆయన నిత్యుడని స్వర్గం లో ఉంటాడని నమ్మారు .ఆయనకు భూమి మీద గుడులు గోపురాలు లేవు .అపార శక్తి సంపన్నుడైన ఆ పరమ సత్త మానవులకు వరాలిస్తాడు మంచి చేస్తాడు .నీతి నియమాలను బోధించి రక్షిస్తాడు .నైతిక శక్తితో ఆత్మార్పణ భావం తో ఆయన్ను ఆరాధించాలి .వ్యక్తులు తమ ప్రార్ధనల ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకో వచ్చు కోరికలు తీర్చుకో వచ్చు .పిగ్మీలు రుతు ధర్మాన్ని బట్టి పండిన పంటలను ఆయనకు నైవేద్యం గా సమర్పించి తాము అనుభవిస్తారు .ఫలాలను ,మాంసాన్ని ఆయనకు నైవేద్యం పెట్టె వారు .వీళ్ళకు పితృ పూజ ఉండదు .వశీకరణ మొదలైనవి వీరికి తెలియదు .
బంటూ అనే జాతి వాళ్ళు దేవుడు స్వర్గం నుంచి చెయ్యి చాస్తే ఈ ప్రపంచం ఏర్పడిందని విశ్వ సిస్తారు .ఆయన ‘’ఉమ్మి ‘’వేస్తె ప్రపంచం లో అన్ని వస్తువులు ఏర్పడ్డాయి .ఆయనే అన్నిటికి కర్త .స్వర్గం లో ఉంటాడు .ఈ సృష్టి పూర్తీ అయిన తర్వాత మనుష్యులు ఆయన్ను చూడ లేరు .అందరు దేవతలకు అన్ని కాలాలకు అన్ని వస్తువులకు ఆయనే అధిపతి అందరు అయన కు లోబడే ఉంటారు .అంటే సర్వ ప్రభువు అన్న మాట నీతి వర్త నానికి అధిస్టాత.
ఆగ్నేయ ఆస్ట్రియా లోని ఆదిమ జాతులలో దేవుడు సృష్టి చేసినపుడు భూమి మీదనే ఉన్నాడని తరువాత త్రివిక్రముడై ఆకాశాన్ని దాటి పోయాడని భావిస్తారు .ఈ లోకం లో చావు అనేది రాక ముందు నుంచి దేవుడున్నాడు .జాతికి ధర్మం బోధించేది ఆయనే .ఈయనే ‘’పరమ పిత ‘’,’’పర దేవత ‘’కూడా .
కైతిష్ జాతి వారు పర దేవతను ‘’అట్ నాట్ ‘’అని అంటారు .కమిల రాయి జాతి వారు ‘’బైయమే ‘’అంటారు .యూయిన్ జాతి వారు ‘దరాములాన్ ‘’అని పర దేవతను పిలుస్తారు .కొన్ని జాతుల వారికి మేఘ గర్జనమే దేవుని ధ్వని గా అనుకొంటారు .కొన్ని జాతుల వాళ్ళు ఉరుముల ధ్వనిని అనుకరిస్తారు .ఒక పెద్ద బూర ను పర దేవత కు ప్రతీక గా,పవిత్రం గా .భావిస్తారు
భారతీయ జాతులలో భేరీ ,శంఖ ధ్వనులు పవిత్రాలు మాత్రమె కాక భూత ప్రేతాదు లను పార ద్రోలేవి గా భావించటం మనకు తెలిసిన విషయమే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-13-ఉయ్యూరు

