నా దారి తీరు -42
కలెక్టర్ సంతానం గారి చొరవ
విజయ వాడ దగ్గరలో ఆంద్ర ప్రదేశ్ హెవి మేషీన్ ఫాక్టరీ( aphmel )ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది దీనికి ప్రభుత్వమే కాక ప్రజా సహకారం కూడా కావాలి అనుకొన్నారు ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ సంతానం గారు .అందుకని ఒక సారిఉయ్యూరు కే.సి.పి. లో చెరుకు రైతుల సమా వేశం ఏర్పాటు చేశారు .నేనూచెరుకు రైతునే కనుక వెళ్లాను నా చెరుకు రైతు నంబర్ 625.అని జ్ఞాపకం .ఆయన చాలా అందం గా ఆంగ్లం లో మాట్లాడి ఆ ఫాక్టరీ అవసరాన్ని దాని వల్ల వచ్చే ఉద్యోగావ కాశాలు అన్ని అతి సరళం గా తేట తెల్లం గా వివా రించారు. చెరుకు రైతులందరూ దీనిలో భాగ స్వాములు కావాలి అని కోరారు .రైతు పెద్దల్లో కొద్ది మంది మాత్రం ఆయన మాటలను సమర్ధించారు .మిగిలిన వారికి అర్ధం కాక కొందరు, మన డబ్బు ఏమై పోతుందో ననే భయం తో ఎక్కువ మంది మాట్లాడకుండా కూర్చున్నారు .ఏకాభి ప్రాయ సాధన కోసం చాలా ప్రయత్నం చేశారు కలెక్టర్ గారు .అది రాలేదు .
చివరికి ‘’మీరు ఏకాభిప్రాయానికి వస్తారని ఇంత సేపు ఆగాను .కాని మీరు రాలేక పోయారు కాని ఇది ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయం .ఇప్పుడు మీకు అర్ధం కాదు .అక్కడ ఆ ఫాక్టరీ ఏర్పడి అభి వృద్ధి చెందితే మీ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది .. .మీరు స్వచ్చందం గా విరాళాలు ఇచ్చే స్తితి లో లేరు .కనుక నేను ఒక సూచన చేస్తాను అది మీరు అందరు తప్పక ఆచారించాల్సిందే. దీనికి తిరుగు లేదు ఇది కలెక్టర్ ఆర్డరు అనుకొంటారో మీ ప్రాంత అభివృద్ధికి సూచనే అనుకొంటారో కాని చెరుకు రైతుల భాగ స్వామ్యం తప్పదు .అందుకని మీరు ఫాక్టరికి తోలిన ప్రతి టన్ను చెరకుకు టన్నుకు పది రూపాయల చొప్పున ఫాక్టరీ మినహా యించి ప్రభుత్వానికి అంద జేస్తుంది .మిగిలిన డబ్బు మీకు అందిస్తుంది కనుక జేబు లోంచి ఎవరూ రూపాయి కూడా తియ్యాల్సిన అవసరం ఉండదు . ఎంత డబ్బుమీ నుండి వసూలు అవుతుందో పది రూపాయలకు ఒక షేరు వంతున మీకు లభించి ఆ ఫాక్టరీ లో మీరు భాగ స్వాములవుతారు ‘’అని చెప్పారు ఇది ఉభయ తారకం గా ఉందని రైతులందరూ ఏంతో సంతోషించి సంతానం గారిని అభి నందించారు .ఆయనా -ఇంత గొప్ప స్పందన రైతుల నుండి వచ్చి నందుకు ఎంతో సంతృప్తి చెందారు
అంతే –అప్పటి కప్పుడు ఫాక్టరీ వారు లెక్కలు చూసి తోలిన ప్రతి ట న్నుకు పది రూపాయలు చొప్పున వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేశారు .హెవి మేషి నరి ఫాక్టరీకలెక్టర్ అధ్యక్షతన కొండపల్లి దగ్గర ఏర్పడింది వాళ్ళుషేర్ సర్టిఫికెట్లు పంపారు .అప్పుడు మేము వీర వల్లి పొలం లో మాత్రమె చెరుకు వేశాం .అది కొంత చచ్చి కొద్దిగా మాత్రమె పండింది ఫాక్టరికి నా పేర తోలింది 7 టన్నులుమాత్రమె కనుక నా వద్ద మినహాయించింది 70 రూపాయలే .కనుక నా షేర్లు ఏడు మాత్రమె .ఇలా చెరుకు రైతులందరూ అందులో భాగస్వామ్యులైనారు అందరికి షేర్ సర్తిఫెకెట్లు వచ్చాయి దాదాపు ఇరవై ఏళ్ళు గా ఆ ఫాక్టరీ నిర్మాణం నిర్వహణ ఖర్చుల వల్ల డివిడెండ్ ఏమీ రాలేదు .ఏడాది కోసారి బోర్డ్ మీటింగ్ జరుగుతూ వివరాలు పుస్తక రూపం లో వస్తూనే ఉన్నాయి .ఇంతవరకు నాకు నా షేర్ల మీద రూపాయి అదనం గా వచ్చిన జ్ఞాపకం లేదు .ఏమైనా ఒక కొత్త ఫాక్టరీ నిర్మాణానికి నా దీ ఒక రాయి పడిందని సంతోషమే మిగి లింది .
స్కూల్ లో నా ప్రయోగాలు
నేను ఫిజికల్ సైన్సు,ఇంగ్లీష్ పదవ తరగతికి చెప్పే వాడిని .పాఠం చెప్పటం సెక్షన్ లో ఉన్న తెలివి గల వారి సంఖ్య ను బట్టి నోట్సు చెప్పటం దాన్ని మర్నాడు క్లాస్ కు వచ్చినప్పుడు పాతది చదివి పిల్లలు క్లాస్ కు రావటం జరిగేది నిన్నటి పాఠం మీద ప్రశ్నలు అడిగి సమాధానాలు రా బట్టే వాడిని .వాటినే పుస్తకం లో రాయించేహోమ్ వర్క్ ఇచ్చే వాడిని .పిల్లలు ఏంతో ఉత్సాహం గా ఇవన్నీ చేసే వారు .ఇంగ్లీష్ లో ప్రశ్నలకు ఆన్సర్లు రాయించే వాడిని .స్పెల్లింగు లు చెప్పించేవాడిని .సైన్సు బొమ్మలు బోర్డ్ మీద పిల్లలతో వేయించే వాడిని భాగాలను గుర్తింప జేసే వాడిని .ప్రాక్టికల్ రికార్డ్ తయారు చేయించే వాడిని .లాబ్ లో ప్రాక్టికల్స్ చేసి, చేయించే వాడిని .అందుకే పిల్లలకు ఏంతో హుషారు కలిగి ప్రిపేర్ అయి వచ్చే వాళ్ళు .
ఇంగ్లీష్ నాన్ డిటైల్డ్ లోని ముఖ్య పాత్రల మీద విద్యార్ధులను మాట్లాడించే వాడిని ‘’నాకు నచ్చిన పాత్ర ‘’అని వారితో మాట్లాడించే వాడిని .దీనికి ఒక సారి హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారిని ఆంజనేయ శాస్త్రి గారిని న్యాయ నిర్నేత గా పిలిపించి బాగా మాట్లాడిన వారిని సెలెక్ట్ చేయించి ,వారికి బహుమతులు హెడ్ మాస్టారి ద్వారా ఇప్పించాను .ఇలా చేసి నందుకు ఆయన ఏంతో సంతోషించారు .బహుశా ఇలా ఏ స్కూల్ లోను ఏ మాస్టారు చేసి ఉండరు .ఇదొక అనుభూతి గా మిగి లింది .ఇది వరకే చెప్పి నట్లు నేను పని చేసిన ప్రతి స్కూల్ లాబరేటరి లోను బయట ‘’మధన పడే మేధావుల చివురాశలు చివురించే రస రాజ్యం- లాబరేటరి’’అని దాశరధి కవి తా వాక్యాన్ని రాయించే వాడిని ఇది అందరికి స్పూర్తి దాయకం గా ఉండేది .ఉయ్యూరు లో కూడా ఇలానే రాయించాను .లాబ్ అసిస్టంట్ రోజూ పునాది పాడు నుంచి వచ్చే భాస్కర రావు మంచి వాడు .ఆఫీస్ పని కూడా బాగా చేసే వాడు .
స్కూల్ కు మౌలిక సదుపాయాలు
సుమారు 1970 లో ఉయ్యూరు హైస్కూల్ కు మెయిన్ బిల్డింగ్ ఏర్పడింది .అప్పటికి పిల్లర్ల మీద బిల్డింగ్ కట్టటం లేదు .గోడలు కట్టి స్లాబ్ పోయట మే .అలానే కట్టారు .దీనిలోనే ‘’ప్రయాగ కృష్ణ వేణి బ్లాక్ ‘’ ను వంగల కృష్ణ దత్త శర్మ గారు -చని పోయిన తమ సోదరి ప్రయాగ కృష్ణ వేణి పేర 32వేల రూపాయలతో కట్టించారు .అది తప్ప వేరే బిల్డింగ్ లేదు .ఈ బిల్డింగ్ ఎదురుగాను , ఉత్తరం వైపున రేకుల షెడ్లు మాత్రం ఉన్నాయి .అందుకని హెడ్ మాస్టారు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ద్విజేంద్ర బాబు గారు కెసీపి.వారి ని ఒప్పించి దక్షిణం వైపు రెండస్తుల భవన నిర్మాణానికి ఒప్పించి బాగా కట్టించారు .ఆ నాటి కెసీపి ప్లాంట్ మేనేజెర్ శ్రీ ఇంజేటి జగన్నాధ రావు స్తానిక శాసన సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వర రావు ఏంతో ఉదారం గా బాధ్యత గా మందుకు వచ్చి తోడ్పడ్డారు .అలాగే బాగా నీళ్ళు నిలిచే గ్రౌండ్ ను కెసీపి రద్దు తో నింపి మెరక చేసి నీరు బయటికి పోయే ఏర్పాటూ చేశారు .విద్యార్ధులకు రక్షిత మంచి నీటి సౌకర్యం లేదు అందుకని పడమర వైపు ఒక రేకు షెడ్ ఏర్పాటు చేసి దాని బయట ఒక బోర్ త్రవ్వించి విద్యుత్ మోటారు తో నీటి సరఫరా బయ ట పంపులు ఏర్పాటు చేశారు .షెడ్ లో విద్యార్ధులు కూర్చుని భోజనం చేసే ఏర్పాటు చేశారు .ఇవన్నీ హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారి చొరవతో జరిగినవే .లాబ్ లో ఇనుప రాడ్ల మీద చేక్కలుందే బెంచీలు తయారు చేయించి లాబ్ లో విద్యార్ధులు కూర్చోవటానికి చక్కని వసతి కల్పించారు అందుకని మా స్టాఫ్ మీటింగులలో నేను ఆయన్ను ‘’ఈ నాటి అక్బర్ ‘’అనే వాడిని ఆయన ముసి మసి నవ్వులు నవ్వే వారు .ఇవన్నీ నేను ఇక్కడ పని చేసిన కాలం లో ఏర్పడి నందుకు ఆనందం గా ఉంది .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-13-ఉయ్యూరు

