మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14
అనేకేశ్వర వాదం
అనేకేశ్వర వాదాన్ని ఆంగ్లం లో ‘’polytheism ‘’అంటారు .అనేక దేవా, దేవతల మీద నమ్మకం ,లేక పొతే నానా దేవతాలను పూజించటం అనే ఒకానొక దశను అనేకేశ్వర వాదం అంటారు .ఇది ఏకేశ్వర వాదానికి ,నాస్తిక వాదానికి ,అనేకాసుర (poly demonism )లకు భిన్నమైనది .అనేకేశ్వర వాదం లో భక్తీ ,పూజలు వేరు వేరుగా ఉండ వచ్చు పరిణామ వాదం దృష్టిలో మతాభి వ్రుద్ధిని గమనిస్తే అనేకాసుర వాదం తర్వాతా,ఏకేశ్వర వాదానికి ముందు, వచ్చిన దశయే అనేకేశ్వర వాద దశ . అని తెలుస్తుంది .ఇనుప ,కంచు యుగాలలో ఈ ఆరాధన ఉంది . స్త్రీ దేవతా రాదన ఉంది
![]()
కార్నెజీ మ్యూజియం లో ఈజిప్ట్ దేవతలు అందరూ దేవుళ్ళే
అనేకేశ్వర వాదం లో నాలుగు భిన్న దశలు కన్పిస్తాయి 1-ఆదిమ మానవుడికి ప్రాణం ఉన్న ప్రతిది దైవం గానే కన్పించింది .అలాంటి ప్రతి వస్తువుకు సంకల్పం, ప్రయోజనం ఉన్నాయి .ప్రతి క్లిష్టమైంది ,బుద్ధికి అందరానిది అయిన వస్తువు సంఘటన దేవతయే .2-రెండో దశలో మానవులు జంతువులను పూజిస్తారు దీనికి ‘’తిర్యక్ ఈశ్వర వాదం ‘’(zootheism ) అంటారు .అన్ని నిర్జ్రీవ వస్తువులకు దైవత్వం ఆరోపింక పోవటం మనం గమ నిస్తాం .3- ఈ దశలో మానవుడికి మిగిలిన జీవులకు భేదాన్ని చూస్తాం .తిర్యగీశ్వరులైన వీటిని అధికారం నుంచి తొలగించటం లేక నీచ స్తానం లో ఉంచటం జరిగిన పెద్ద మార్పు .ప్రక్రుతి శక్తులన్నిటికి దివ్యత్వాన్ని ఆరోపించటం జరిగింది .ఇప్పుడే సూర్యుడు చంద్రుడు ,వాయువు ఉషస్సు మొదలైన వాటి పూజ జరిగింది 4-నాలుగవది అయిన చివరి దశ అతి ఉన్నత మైనది
![]()
![]()
.ఇందులో మానసిక ,నైతిక ,సాంఘిక గుణాలను దేవతలకు ఆపాదించటం జరిగింది .ప్రతి కార్యానికి ఒక దేవత ఏర్పడ్డారు యుద్ధానికి ప్రేమకు ,భాగ్యానికి వేరు వేరు దేవతా రాదన జరిగింది ఈదశలో ఈ దేవతలకు స్పష్టమైన మానసిక గుణాలు ఉన్నాయి వీరిలో నైతిక దెవతలదిఅగ్రస్తానం .మానవుడు తన బుద్ధి ,విచక్షణ జ్ఞానం ఉపయోగించిన అనేకేశ్వర వాదదశ నుంచి .’’ఎకేశ్వరో పాసన దశ ‘’ఏర్పడిందని భావిస్తారు .
![]()
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-13- ఉయ్యూరు

