శతాధిక వృద్ధులకు సన్మానం
విజయ వాడలోని ప్రముఖ సామాజిక కార్య కర్త డాక్టర్ చల్లా హరి కుమార్ గారి ఆధ్వర్యం లో ఈ నెల 29 వ తేది ఆదివారం (29-9-13 )సాయంత్రం 5 గంటలకు సత్యనారాయణ పురం లోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు సంగీత కళా శాలలో ‘’శతాధిక వృద్ధులకు ‘’అంటే నూరేళ్ళు దాటిన ముసలి వారికి గొప్ప సన్మానం చేయాలని సంకల్పించారు .దీనిని కృష్ణా ,గుంటూరు జిల్లాలలో ఉన్న వృద్ధులకు మాత్రమె నిర్వహిస్తారు క్రితం ఏడాది 20 మంది శతాధిక వృద్ధులను ఇదే వేదికపై సత్కరించామని చల్లా వారు ఈ ఉదయం ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం నుండి ప్రకటించారు .కనుక వందేళ్ళు దాటిన వృద్ధుల పేర్లను ,వివరాలను సెప్టెంబర్ 22 లోపు వారిచ్చిన టెలిఫోన్ నంబర్ 0866-2444448 కు తెలియ జేయమని కోరారు .దానిని బట్టి వారి సంఘం ఆ వృద్ధులను స్వయం గా కలిసి వివరాలను ద్రువీకరించుకొని ,వారిని సగౌరవం గా తమ స్వంత ఖర్చులతో విజయ వాడకు తీసుకొని వచ్చి ,సన్మా నించి మరల వారి స్వగృహాలకు అంతే మర్యాదగా పంపిస్తామని చెప్పారు .’’పది మంది శతాధిక వృద్ధులకు చేసే సన్మానం సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు కు చేసే అర్చనమే అవుతుంది ‘’అని తమకు ఒక గొప్ప వ్యక్తీ చెప్పిన మాటయే ఈ కార్య క్రమానికి స్పూర్తి అని హరికుమార్ తెలియ జేశారు .ఇలాంటి మంచికార్య క్రమానికి మన వంతు సహాయం గా ఆ వృద్ధుల వివరాలు వారిచ్చిన ఫోన్ నంబర్ కు ఇరవై రెండో తేదీ లోపు తెలియ జేయటమే .కార్య క్రమం దిగ్విజయం గా జరగాలని ఆ వృద్ధుల దీవెనలు ఈ సంక్షోభ ఆంద్ర ప్రదేశ్ కు అవసరమని భావించి మీకు అందరికి తెలియ జేస్తూ చల్లా వారిని మనసారా అభి నందిస్తున్నాను .ఇరవై తొమ్మిదో తేదీ జరిగే సన్మాన కార్య క్రమాన్ని”అంటే సాక్షాత్తు శ్రీ మన్నారాయనణార్చన ” ను వీక్షించటానికి అందరూ ఆహ్వానితులే నని చల్లా హరికుమార్ తెలియ జేశారు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-13- ఉయ్యూరు

