మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15
అరిష్టి పస్
క్రీ .పూ. 435-356 ప్రాంతానికి చెందిన గ్రీకు మతా చార్యుడుఅరిష్టి పస్..’’సేరేనేయిక్ ‘’అనే మత స్తాపకుడు .చిన్న తనం లోనే సేరెన్ నుంచి ఎథెన్స్ కు చేరాడు .సోక్రటీస్ శిష్యుడై ఎన్నో విషయాలు అభ్యసించాడు గ్రీకు దేశం లోని ప్రసిద్ధ పట్టణాలన్ని పర్య టించాడు .సేరెన్ లో ఒక విద్యాలయాన్ని స్తాపించాడు .ఈయన తండ్రి అరిటాదేస్ గ్రీస్ కు వచ్చి ఒలిం పిక్స్ ఆటలలో పాల్గొన్నాడు సోక్రటీస్ మరణం వరకు ఆయన వద్దే ఉన్నాడు సోక్రటీస్ గారి శిష్యుడే కాని గురువు చెప్పిన దానికి పంగనామాలు పెట్టి సుఖ భోగాలకు మరిగాడు పరిస్తితులను మనకు అనుగుణం గా మలచుకోవాలే కాని ,పరిస్తితులకు అనుగుణం గా మనం మారరాదు అనేది ఈయన సిద్ధాంతం .సొక్రటీస్ శిష్యులు అరిస్తిపాస్ గురువు చెప్పిన దానికి విరుద్ధం గా సంచరిస్తున్నాడని గగ్గోలు పెట్టినా చిద్విలాసం గా నవ్వే వాడు కూతురుఅరేతి ద్వారా మనవడికి (అరిస్తిపస్ యంగర్) )ఈ సిధాంతాన్ని అందించాడు అతను దీన్ని ఒక ఛట్రం లో నిబంధించాడు అరిస్తపాస్ అనేక గ్రంధాలు రాసినట్లు చెబుతారు కాని అది నిజం కాదంటారు ఆయన రాసి నట్లుగా చెప్ప బడేది ఒక పుస్తకం ఉంది అదే ”ఆన్ అన్శేంట్ లక్సరీ ”
![]()
![]()
ఈ నాటి లిబియా లో అరిస్తి పస పుట్టిన సేరెన్ పట్టణం
సోక్రటీస్ చెప్పిన ధర్మం ,సుఖం అనే తత్వాలను అర్ధం చేసుకొని ధర్మం కంటే సుఖానికే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చాడు .జీవితం లో సుఖమే ప్రమాణం అని సిద్ధాంతీకరించాడు .ఏది ఎక్కువ సుఖాన్నిస్తుందో అదే మంచిది అని తీర్పు చెప్పాడు .తను చెప్పినదాన్ని జీవితం లో పూర్తిగా ఆచరించి ఇంద్రియభో గాలలో తెలియాడాడు .అప్పుడెప్పుడో ఆయన చెప్పిన దర్శనం ఇప్పుడు అనుభవ ప్రధాన వాదానికి అందులో ముఖ్యం గా సుఖ ప్రధానవాద మతానికి దగ్గిరైంది.సెరెనిక్ ఫిలాసఫీ అంతా తాత మనవడి ద్వారానే వృద్ధి పొందింది

సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –14-9-13-ఉయ్యూరు

