ప్రసీద్ధి గాంచిన ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు మాఘమాసం భీష్మ ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం ప్రారంభం అవుతాయి . సోమవారం రాత్రి వేలాది భక్తుల గండ దీపాలతో అమ్మవారు మెట్టినిల్లు నుండి బయిలు దేరి పుట్టినిల్లు కు వెళ్ళుతుంది. మెట్టినిల్లు నుండి బయిలుదేరిన వీరమ్మ పుట్టినిల్లు చేరడానికి సుమారు 24 గంటలపాటు గ్రామంలో గడపకు గడపకు వెళ్లి హారతులు అందుకుంటుంది.
వీరమ్మతిరునాళ్ళు మాఘమాసం భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు జరిగే ఈ క్రమంలో మెట్టినిల్లు నుండి బయిలుదేరే ముందు పోలీసులు పసుపు కుంకమలు సమర్పించిన అనంతరం గ్రామంలో గడప గడపకు వెళ్లి పసుపు కుంకమలు అందుకుంటుంది.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఉయ్యూరు పట్టణ పోలీసులు విర్మతల్లికి పసుపు కుంకమలు, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత ఆదిరాజు వంశస్తుల వద్ద అందుకొని వీధి వీధికి అమ్మవారిని తోడ్కొని వెళ్ళతారు భక్తులు.
జి వి రమణ
ఉయ్యూరు టైమ్స్ బ్లాగ్
