ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్
మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు నేపధ్యం లో అందం గా గొప్ప గా మాటల గారడీ తో తయారు చేశారు .నౌకర్లు అయిన చవలాయ్ లాంటి వారికి ప్రాణ ప్రతిష్ట చేశారు .లోభిత్వం, రెండో పెళ్లి పై మోజు న్న వారిపై మాటల బాణాలు సంధించారు .నౌకర్ల పాత్రలు లేక పోతీ మేస్టారి నాటికలలో పసేలేదు అంత గొప్ప గా వారిని తీర్చి దిద్దారు .వాళ్ళ కాంట్రిబ్యూషన్ మహా గొప్పగా ఉంది కదా మలుపులు తిరిగి ,జ్ఞాన బోధ చేసి సుఖాంతం అవటానికి వారికి ప్రాణ ప్రతిష్ట చేశారుమేష్టారు .
మోలియర్ అసలు పేరు Jean Baptiste ‘Poquelin’’’ అయితే Molie RE’’పేరు మీద నాటకాలు రాశాడు ఆయన సాంఘిక విమర్శ ,వాస్తవం ,కవితాత్మక వచనాలు ,వేగా వంతమైన కదా గమనం ,ప్రేమ ,సంఘం ,మతం ,అధికారం మొదలైన సమస్త విషయాలపై వ్యంగ్యం తో విరుచుకు పడ్డాడు .1622లో మోలియర్ ఫ్రాన్స్ దేశం లోని పారిస్ నగరం లో జన్మించాడు .1641లో పందొమ్మిదేళ్ళ కే ‘’లా’’పాస్ అయ్యాడు 1645.లోపలే 13సంవత్సరాలు అనేక ప్రదేశాలలో పర్యటన చేశాడు .1650-51-లో ప్రభుత్వోద్యోగం చేశాడు .1659లో ‘’less preciessus of ridicules ‘’ అనే కొత్త తరహా హాస్యపు రచన చేశాడు మోలియర్ రాసిన నాటక ప్రదర్శనలు చూడటానికి రాజు నాలుగవ హెన్రీ వచ్చేవాడు .1673 ఫిబ్రవరి 17న 53ఏళ్ళకే మోలియర్ మరణించాడు .

Moliere is the first rank writer of comedy .social criticism ,,suggestion of reality ,farcial style ‘’ఉన్న చిన్న చిన్న మాస్టర్ పీసెస్ రాశాడని విమర్శకులు మెచ్చుకొన్న నాటక రచయిత మోలియర్ .అతని దృష్టిలో ‘’laughter may be inner or boisterously on the out side .it is a recognition the human follies that we are –an on going process of creation share .The plays are everprepared.to go on stage .An on going process of creation was set in motion by Moliere .He is a great man alive on stage .he is more than a genius .he is a great soul who exhibits himself and sacrifices himself for the theater ‘’అని గొప్ప ప్రశంసలను అందుకొన్నాడు .
మోలియర్ అకున్తిత దీక్ష తపన అంకిత భావం ,ఆచరణ ఆలోచన ,ఉదాహరణ గా నిలవటం వలననే దియేటర్ కళలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకొన్నాయి .దాని తీరు మారింది .నాటక రంగం పై( దియేటర్) జనాలకు ఆశ ,ఉత్సాహం పెరిగాయి .జీవితం అనే గొప్ప సత్యానికి నాటకం లో ఆవిష్కరణ జరిగింది .వాస్తవాన్ని నాటకం ప్రతి బిమ్బించాలన్న దృక్పధం ఏర్పడింది .నాటక కళా సిద్ధాంతాల తో సృజనాత్మతను జోడించి గొప్ప ఫలితాలను మోలియర్ సాధించాడు .
జనం లో ఇంత క్రేజు మోజు ఉన్నా మోలియర్ ను అతని రచనలను మోరలిస్టూలు ,రోమన్ కేధలిక్ చర్చి వారు ఆక్షే పిన్చారు, తీవ్రం గా విమర్శించారు .’’డాన్ జూన్ ‘’అనే నాటిక ను చర్చి నిషేధించింది కూడా .దానితో అతను తీవ్ర మనో వ్యధకు గురి అయ్యాడు .1667లో ఆరోగ్యమూ దీని వల్ల దెబ్బ తింది.కొంతకాలం నాటక రచనకు దూరం గా ఉండిపోవాల్సోచ్చింది .1673లో మళ్ళీ రాయటం ప్రారంభించాడు .చివరి నాటిక ‘’దిఇమేజనరి ఇన్ వాలిద్’’ప్రొడక్షన్ చేస్తుండగా ‘’పల్మనరిట్యూబర్ క్యులోసిస్’’విజ్రుమ్భించి ,విపరీతమైన దగ్గుతో బాధ పడి,మెదడులో రక్త నాళాలు చిట్లి పోయాయి. ప్రదర్శన ఎట్లాగో పూర్తీ చేశాడు .పూర్తీ అయిన కొన్ని గంటలకేఇంటి వద్ద తుది శ్వాస వదిలాడు మోలియర్ .అంతటి హాస్య రచయితా ఇంతటి తీవ్ర అనారోగ్యం పాలై విషాదాంతం గా జీవిత నాటకాన్ని ముగించాడు .
మోలియర్ శవానికి అంతిమ క్రియలు చేయటానికి ఇద్దరు ప్రీస్టులు అంగీకరించ లేదు .మూడవ ప్రీస్ట్ ఆలస్యం గా వచ్చాడు కాని మోలియర్ చని పోయినప్పుడు ధరించిన దుస్తుల వల్ల పీడ కలుగుతుందనే సెంటి మెంట్ తో ఉడాయించాడు . . ఆ నాడు ఫ్రాన్స్ దేశం లో ఉన్న ఆచారం ప్రకారం నటులు మరణిస్తే వారిని పవిత్ర మైన చర్చి లో పాతి పెట్టె వారు కాదు .మోలియర్ భార్య ఆర్ముడ తన భర్తకు రాత్రి పూట మామూలు గా అంతిమ సంస్కారాలు జరిపించటానికి అనుజ్న ఇమ్మని రాజును ప్రార్ధించింది .రాజు అనుజ్న పై శ్మశానం లో బాప్టిస్టులు కాని చిన్న పిల్లలను సమాధి చేసే చోట అంత గొప్ప హాస్య రచయితను సమాధి చేయాల్సి వచ్చింది పాపం .1717లో మోలియర్ అస్తికలను మ్యూజియం ఆఫ్ ఫ్రెంచ్ మాన్యుమెంట్స్ కు ,అక్కడి నుండి పారిస్ లో ప్రసిద్ధ మైన లా ఫాన్టేన్ సేమిటరి దగ్గరలో ఉన్న ‘’పీరీ లాకేస్ సేమిటరి’’కి తీసుకొని వెళ్లి భద్రపరచారు
మోలియర్ రచనలను ఆంగ్లం లోకి ఒజేల్ అనువదించాడు . పారిస్ నాటక శాలలో 14ఏళ్ళలో 85నాటక ప్రదర్శనలు జరిగితే అందులో మోలియర్ ఒంటి చేత్తో రాసిన నాటకాలు 31ఉండటం అతని రచనలకు ఎంత పాపులారిటి ఉందొ తెలియ జేస్తుంది
1.1-10-2002 మంగళ వారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-14-ఉయ్యూరు

