జీన్ జాక్వెస్ రూసో
రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు . భావాలను అంత కరణను ఉపయోగించి ,వీటి తో బాహ్య సంబంధాలను సెల్ఫ్ ను నిర్వచించ టానికి కృషి చేశాడు .దానినే ఆయన ‘’నేచురల్ మాన్ ‘’అన్నాడు .తానూ రాసిన కాన్ఫరెంసేస్ ,కాంటాక్ట్స్ ,దిస్కోర్సేస్ లో వీటిని క్షున్నం గాచర్చించి వివ రించాడు .’’Rousseu criticized the civilized man of reason whose behavior has become so constrained y organized society that his individuality is obliterated ‘’
ప్రక్రుతి గురిం చి ఆరోపణలు చేసేవారు ,వారికి వచ్చే దురదృస్టం అంతా వారి ప్రవర్తన వలననే కలుగుతుందని తెలియని పిచ్చి వాళ్ళు అన్నాడు .అవినీతి సమాజం లోకి ఇప్పుడే రాలేదని అది సాంప్రదాయం గా వచ్చిన్దేనన్నాడు .హేతువు లేక రీజన్ యొక్క మూలాలను కదిలించి పారేశాడు రూసో .’’men live not in order to live but to make others believe that they have lived ‘’అన్న గొప్ప సిద్ధాంతాన్ని చెప్పిన మేధావి రూసో .’’desire involves the other becoming self and the self becoming other ‘’అన్నాడు .సెల్ఫ్ ను అంటే ఆత్మ ను సెక్స్ కు ముడి వేసిన మహాను భావుడు రూసో కన్నీళ్లను గురించి చెబుతూ ‘’tears are a body language and naturally express physical discomfort and are peals for help . అంటే కన్నీళ్లు శారీరక భాష శారీరక అసౌకర్యాన్ని సాహజ సిద్ధం గా చెప్పి సహాయం కోసం ఆర్భాటం చేయటం అన్నాడు .
![]()
birth place porttrait
![]()
జెనీవా ఫిలాసఫర్ గా పెద్ద పేరు తెచ్చుకొన్నాడు .ఆయన రచనలు ఫ్రెంచ్ విప్లవానికి మార్గ దర్శకం చేశాయి .పౌరుడుగా ఉండటానికి అర్హతలను వివ రించాడు .ఆయన ఆత్మ కద కాన్ఫరెన్స్ లలో కని పిస్తుంది .పద్దెనిమిదవ శతాబ్దపు ‘’ఏజ్ ఆఫ్ సేన్సిబిలిటి ‘’భావాలకురూసో రాసిన ‘’రివరీస్ ఆఫ్ సాలిటరి వాకర్ ‘’పుస్తకం అద్దం పడుతుంది .ఆధునిక రాజకీయ సాంఘిక ఆలోచనలకు రూసో రాసిన ‘’డిస్కోర్స్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఇన్ ఈక్వాలిటి’’,’’ఆన్ దిసోషల్ కాంట్రాక్ట్ ‘’గ్రంధాలు రిఫరెన్స్ పుస్తకాలే .ఫ్రెంచ్ విప్లవ కాలం లో జాకోబిన్ క్లబ్ సభ్యులలో ప్రభావ వంత మైన ఫిలాసఫర్ గా గుర్తింపు పొందాడు .రూసో మరణించిన పదహారు ఏళ్ళకు 1794లో పారిస్ హీరో గా పాంథర్స్ గుర్తించి ఆరాధించారు .
జాన్ డ్రై డెన్
డ్రై డెన్ ఒక కవి నాటక రచయితా ,వ్యంగ్య రచయిత ,.పుంఖాను పుంఖాలుగా కర పత్రాలను రాసిన వాడిగా గొప్ప గుర్తింపు ఉంది .రాజకీయ ,తత్వ సంక్షోభ కాలం లో జీవించాడు .వీటిని తన రచనలలో చక్కగా పొందు పరచాడు. 1649లో లార్డ్ హేస్టింగ్స్ పై మొదటి కవిత రాశాడు ..1659లో ఆలివర్ క్రాం వెల్ మీద కవిత చెప్పాడు .1663 లో’’ ది వైల్డ్ గాలంట్’’నాటకం రాశాడు . 1675లో ‘’ఔరంగ జేబ్ ‘’నాటకం రచించాడు .1631లో ఇంగ్లాండ్ లోని నార్త్ యాంప్ టన్ షైర్లో పుట్టి 1700మే నెల ఒకటిన అరవై తొమ్మిదేళ్ళకు చనిపోయాడు .ప్రముఖుల ను ఖననం చేసే వెస్ట్ మినిస్టర్ ఆబే లో సమాధి చేశారు .సర్వ స్వతంత్రుడు గా జీవిం చాడు .రాజులకు తల వంఛ లేదు .తన కాలపు మేధావులలో పెద్ద డ్రా డెన్ . ‘’మాస్టర్ ఆఫ్ ది.మిడిల్ స్టైల్ ‘’ అని ఆడెన్ ప్రశంసించాడు . కవి అలేక్సాండర్ పోప్ పై డ్రై డెన్ ప్రభావం విపరీతం గా ఉంది .ఆంగ్ల సాహిత్యాన్ని మలుపు తిప్పి నాన్యతః పెంచి,శుద్ధి చేసి కవిత్వానికి వైభవం కల్పించిన మహాను భావుడు డ్రా డెన్ అని సామ్యుల్ జాన్సన్ కీర్తించాడు .వర్జిల్ సాహిత్యానికిఆంగ్ల అనువాదం తో ప్రాణ ప్రతిష్ట చేశాడని కొందరు భావిస్తే చాలా పేలవం గా డ్రై డెన్ అనువదించాడని వర్డ్స్ వర్త్ అన్నాడు .ఆంగ్ల వాక్యాలను విభక్తుల తో అంతం చేయరాదని, లాటిన్ భాష లో కూడా అలా చెయ్యరని చెప్పిన వాడు డ్రై డెన్ . .థామస్ షాద్వెల్ అనే నాటక రచయిత పై వ్యంగ్యం గా ‘’మాక్ ఫ్లేక్నో ‘’రాసి నవ్వుల పువ్వులు పూయించాడు .మతానికి సంబంధించిన కవిత్వమూ రాశాడు .
![]()
11-10-2002శుక్రవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-14-ఉయ్యూరు
