సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ -విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -మే లో ప్రచురితం

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్

గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా శిరోమణి శ్రీమతి మేరీ క్లబ్ వాలా జాదవ్ .సంపన్న కుటుంబం లో జన్మించినా అదో జగత్ సహోదరులకు సేవలందించి పునీతురాలై భారత ప్రభుత్వం చేత సంక్షేమ సేవకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన ఉత్తమ సేవకురాలు మేరీ జాదవ్ .

మిసెస్ వాలేర్ అనే ఆమె 1923లో చర్చికి అనుబంధం గా ‘’గిల్డ్ ఆఫ్ సర్వీసెస్ ‘’ను మద్రాస్ లో స్థాపించింది .తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న మహిళలకు సాయపడాలనే ఉద్దేశ్యం తో ఈ గిల్డ్ ఏర్పడింది .కాని మేరీ క్లబ్ వాలా భర్త’’నోగి ‘’ అకాల మరణం తర్వాత 1935లోఈ సంస్థలో చేరింది .సంస్థకు జవం జీవం తానే అయి నడిపించింది అప్పటికి వారికి నాలుగేళ్ల కొడుకు ఖుశ్రూ ఉన్నాడు .మేరీ ని ‘’ఆనరరీ ప్రెసిడెన్సీ మాజిస్త్రేట్ ‘’గా ప్రభుత్వం నియమించి గుర్తింపు నిచ్చింది .కోర్టులో ఇతర జడ్జీలతో పాటు కూర్చునే గొప్ప అవకాశం పొందింది .ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మహిళా మేజిస్ట్రేట్ లను నియమించే ఏర్పాటు చేసింది .’’జువనైల్ గైడెన్స్ బ్యూరో ‘’ను ఏర్పరచింది .

.1942లో మొదటి ప్రపంచ యుద్ధసమయం లో మద్రాస్ నగరానికి దేశం నలుమూలలనుండీ, ప్రపంచ వ్యాప్తం గా సేనలు వచ్చిన సందర్భం గా గిల్డ్ ఆఫ్ సర్వీసెస్ ఆధ్వర్యం లో ‘’ ఇండియన్ హాస్పిటాలిటి కమిటీ ‘’ని ఏర్పాటు చేసింది .దీని ద్వారా కాంటీన్లు మందుల సరఫరా , వినోద కార్యక్రమాలను నిర్వహించింది . ఈ సేవలకు తగినంత మంది స్వచ్చంద సేవకులు ఆమె వద్ద లేరు .తోటి మహిళలకు ప్రేరణ కలిగించి వారిని ఇందులో భాగ స్వాములను చేసి కమిటీ ద్వారా భారత సైన్యానికి అన్ని రకాల సేవలను అందించి చరిత్ర సృష్టించింది .యుద్ధ నిధిని పోగు చేసి గాయపడిన వారికి సేవలకు ఖర్చు చేసింది.అందరి దృష్టినీ ఆకర్షించింది .ఆమె మనో బలం,ఉత్సాహం, సేవా భావం ,అంకిత దీక్షా ,ఇతరులను ఒప్పించి కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడేట్లు చేసే నేర్పూ చూసి అందరూ ఆశ్చర్య పోయారు .యుద్ధం లో విజయం సాధించిన 14వ బెటాలియన్ ఆర్మీ క్లబ్ వాలా సేవలకు ‘’జపాన్ ఖడ్గం ‘’ను బహుమతిగా అందించి కృతజ్ఞతలను తెలిపింది .యుద్ధం పూర్తి అయిన తర్వాత భారత సైన్యాధ్యక్షుడు జెనరల్ కరియప్ప ‘’సైన్యానికి ముద్దు బిడ్డ మేరీ జాదవ్ ‘’అని ప్రశంసించాడు .

యుద్ధం ముగిసిన తర్వాత క్లబ్ వాలా తన సేవాకార్యక్రమాలను అనేక రంగాలకు విస్తరింప జేసింది .యువకులకు సేవాకార్యక్రమాలు చేబట్టింది .శారీరక మానసిక ,ఆర్ధిక వెనుక బాటు దానం తో తో క్షోభించి పోతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని ఊరట కలిగిస్తూ వారి అభి వృద్ధికి అంతులేని శ్రమచేసింది . .150 సేవా సంస్థలను ఈ సంక్షేమ కార్య క్రమంలో పాల్గోనేట్లు చేసి వారందరికీ మార్గ దర్శనం చేస్తూ పర్య వేక్షిస్త్తో సూచనలిస్తూ సమాజ సేవ చేసిన ధన్యురాలు మేరీ జాదవ్ .

జాదవ్ బహుముఖీన సేవలను గుర్తించి ప్రభుత్వం మద్రాస్ నగర ‘’షరీఫ్ ‘’గా1956 లో నియమించి గౌరవించింది .ఈ గౌరవాన్ని పొందిన మొదటి మహిళా గా రికార్డు సృష్టించింది .ఈ సమయం లోనే డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ మద్రాస్ లో1961లో పర్య టించగా అతనికి సన్మానం చేసే అవకాశం క్లబ్ వాలాకు దక్కింది .మంచి, మర్యాద సత్యభాషణం ,ఆమెకు ఇష్టం . స్తుతి పొగడ్తలకు ఆమె ఆమడ దూరం .ఎందరో రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నా రాజకీయాల జోలికి పోలేదు .అనర్గళం గా మాట్లాడే నేర్పు జాదవ్ ది .అందులో ఎన్నో చమత్కారాలు ,ఉదాహరణలు కధలూ గాధలూ దొర్లుతాయి .వినే వాళ్ళు రెప్పలార్ప కుండా విని సంతోషిస్తారు .అజాత శత్రువుగా ఉండేది .ఆమె నిరంతర సేవా దీక్షకు వరుసగా భారత ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలందించి సత్కరించింది .

మేరీ క్లబ్ వాలా తమిళనాడు లో ఉడక మండలం లో రుస్తుం పటేల్ అల్లామాయి దంపతులకు 1909లో జన్మించింది ..ఈమె తలిదండ్రులు మద్రాస్ నగరం లోని మూడు వందలకు పైగా ఉన్న పార్సీ కుటుంబ సభ్యులు .హైస్కూల్ విద్య మద్రాస్ లోనే పూర్తీ చేసింది .18వ ఏట ‘’నోగి క్లబ్ వాలా ‘’తో వివాహం జరిగింది .వీరికి ఖుశ్రూ అనే కుమారుడు1930లో జన్మించాడు .దక్షిణ భారత దేశం లోనే మొట్టమొదటిది అయిన ‘’మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ ‘’ను 1952లోనే ప్రారంభించింది .1953లో భారత సైన్యానికి చెందినా’’మేజర్ చంద్ర కాంత్ జాదవ్ ‘’ను వివాహమాడింది .చంద్రకాంత్ ఈమెకు అన్ని రకాల సేవా కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచాడు . వీరికి ‘’ఫిల్ ‘’అనే కుమారుడు పుట్టాడు .మద్రాస్ లో మేరీ క్లబ్ వాలా బాలికోన్నత పాథశాల ,రెండు హయ్యర్ సెకండరీ స్కూళ్ళు క్లబ్ వాలా పేరిట వెలి శాయి .ఆమె మరణించటానికి కొద్దికాలం క్రితం కొడుకు ఫిల్ చని పోయి గర్భ శోకం మిగిల్చాడు .సుమారు ఎనిమిది దశాబ్దాలు సాంఘిక సంక్షేమ సేవలో అలసి పోయిన మేరీ క్లబ్ వాలా జాదవ్ 1975లో మరణించింది .దాత గా ,వితరణ శీలిగా ,ఆదుకొనే అమ్మగా అభాగ్యుల పాలిటి ఇల వేలుపుగా ,సేవా కార్యక్రమ దీక్షాదక్షురాలిగా మేరీ క్లబ్ వాలా చిరస్మరణీయ సేవలందించిన ధన్య జీవి .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.